మెల్కీసెదేకు క్రమం చొప్పున....


*మెల్కీసెదెకు క్రమము చొప్పున...*

*మొదటి భాగం-ఉపోధ్ఘాతం*

 హెబ్రీయులకు 6: 20

నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

కీర్తనలు 110: 4

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

 

    ప్రియ దైవజనమా! పై రెండు రిఫరెన్సులు ప్రకారం మెల్కీసెదెకు అనే వ్యక్తి క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రభులవారు యాజకుడిగా ఉన్నారు అంటున్నారు. బైబిల్ చెబుతుంది ఆదికాండం 14:18 లో మెల్కీసెదెకు షాలేము రాజు, చివర్లో యితడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు! ఒకసారి ఆగుదాం! బైబిల్ ప్రకారం యాజకులు అనగా ఆహారోను సంతతి, లేవీ గోత్రపు వారు! వారు మాత్రమే యాజకత్వము చేయాలి అనేది దేవుని నిత్యకట్టడ! మరి యితడు ఎవరు? గోత్రానికి చెందినవాడు? సర్వోన్నతుడగు దేవునికి ఎలా యాజకుడు అయ్యాడు? జాగ్రత్తగా పరిశీలన చేద్దాం!

 

  ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో భాగంగా ఏడవ భాగంలో మరో శీర్షికతో మీముందుకు రాడానికి కృప చూపిన దేవునికి వేలాదివందనాలు! రకంగా మరోసారి మరో శీర్షికతో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఈసారి మెల్కీసెదెకు అనేవ్యక్తి కోసం ధ్యానం చేసుకుంటూ పరిశుద్దాత్ముడు మనతో ఏమి చెబుతున్నారో ధ్యానం చేసుకుందాం!

 

     ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు? ఈయనకోసం మనకు ఆదికాండం 14 అధ్యాయంలో కనబడుతుంది. పాత నిబంధన మొత్తంలో ఆదికాండం 14 అధ్యాయంలో ఒకసారే కనిపిస్తారు. తర్వాత దాదాపు అందరూ మరచిపోయారు. ఉన్నట్లుండి దావీదుగారు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభులవారికోసమైన ప్రవచనం చెబుతూ మరలా నిరంతరమూ నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవు అంటున్నారు. తర్వాత ఇక ఎక్కడా మెల్కీసెదెకు కోసం చెప్పబడలేదు. గాని హెబ్రీ గ్రంధకర్త హెబ్రీ పత్రిక మొత్తం దీనికోసం విస్తారంగా మెల్కీసెదెకును జ్ఞాపకం చేస్తున్నారు.

 

 ఇంతకీ ఈయన ఎవరు అంటే మీదన చెబుతున్నట్లు షాలేము రాజు. షాలేము కనాను దేశంలో ఉంది. దీనికి మరో అర్ధం షాలోం- దేవుడే శాంతి! అయితే చరిత్రకారుల ప్రకారం షాలేము క్రమేనా పేర్లు మార్చుకుంటూ యెరూషలేముగా మారింది దావీదుగారి సమయానికి! మరి ఆదికాండం 14:8 లో ఈయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని వ్రాయబడింది. మరి ఈయన అహారోను సంతానం కాదు! లేవీయుడు కాదు! చివరికి ఇశ్రాయేలీయుడు కూడా కాదు. మరి ఎలా యాజకుడు అయ్యాడు???

 

బైబిల్ పండితులలో కొందరు (అందరూ కాదు) ఈయన కనానీయుల జాతిలో వారి మతంలో కొన్ని దేవతలను పూజించేవారు- వారిలో సృష్టికర్తను వారు సర్వోన్నతుడగు దేవుడు అనేవారు. దేవుడికి ఈయన యాజకుడు అంటారు. నేనైతే దానిని తప్పు అంటాను. కారణం బైబిల్ అబద్దమాడదు! దీనిని వ్రాయించిన వాడు స్వయానా పరిశుద్దాత్ముడు! పరిశుద్దాత్ముడు చాలా స్పష్టంగా సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని చెప్పాడు. ఆయన అబద్దమాడని వాడు,. తప్పునుతప్పుగా ఖండిస్తూ ఒప్పును ఘనపరుస్తున్న బైబిల్ సర్వోన్నతుడగు దేవునికి(ఏల్ ఎల్యోన్) సేవకుడు అని చెబుతుంటే తెలివైన వారు కాదంటారేం? నాకు చెందవలసిన ఘనతను మరొకరికి రానీయను అని ఖండితముగా చెప్పిన దేవుడు తనతోపాటుగా మరో సర్వోన్నతుడగు దేవుడు ఉన్నాడు అని చెబుతాడా? యెషయా 42: 8

యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

 నేనే దేవుడను నేను తప్ప మరో దేవుడు లేడు అని కుండబద్దలుగొట్టినట్లు చెబుతుంటే అతి తెలివైన వారికి ఏమయ్యిందో నాకు తెలియదు. యెషయా 45:21;22; 46:9; ద్వితీ 32:39;

 

      వారి అభిప్రాయం తప్పు అనడానికి లేఖనాలను పరిశీలన చేద్దాం! ఏలీయా గారు దేవునితో ఒకసారి కంపైంట్ చేస్తారు- ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీటాలను పడగొట్టి నీ ప్రవక్తలను భక్తులను చంపేశారు. యెహోవాకోసం నేను ఒక్కడినే రోషము గలవాడనై బ్రతికి ఉన్నాను. వారు నన్నుకూడా చంపాలని చూస్తున్నారు- అంటే దేవుడు చెప్పారు- కొడుకా నీవే కాదు నాకోసం భక్తిగా ఉన్నవారు ఇంకా 7000 మంది నాకున్నారు.!! 1రాజులు 19;

అనగా అన్ని కాలాలలోనూ దేవునికి భయపడే వారు దేవునికోసం జీవించేవారు- దేవుడు ఏర్పరచుకున్నవారు ఉన్నారు అన్నమాట! ఇక్కడ కూడా మరికొంతమంది ఉన్నారు అని తెలుస్తుంది.

మొదటగా మెల్కీసెదెకు గారు ఇశ్రాయేలు జాతివాడు, లేవీయుడు కాకపోయినా దేవునికి యాజకునిగా ఉన్నారు.

 

రెండవదిగా ఒకసారి మనం ఆదికాండం 20:4 లో గెరారు రాజైన అబీమెలెకు (26:1 ప్రకారం గెరారు ఫిలిష్తీయుల దేశంలో ఉంది) అంటున్నాడు దేవునితో- ఇంతనీతిగల జనమును హతం చేస్తావా? చూడండి- ఒక ఫిలిష్తీయుల రాజు- దేవాదిదేవునితో డైరెక్టుగా మాట్లాడుతున్నాడు- మాట్లాడటమే కాకుండా ఇంత నీతిగల జనమును అంటున్నాడు. అనగా ఈయన దేవునికి విధేయత కలిగి ఉండటమే కాదు, తన ప్రజలనందరినీ విశ్వాసంలో నడిపిస్తూ నీతిగా బ్రతికేలా చేస్తున్నాడు- అందుకే ధైర్యంగా ఇంత నీతిగల జనమును హతం చేస్తావా దేవుడా అని అడుగగలుగు తున్నాడు!!  మరి ఈయన కూడా ఇశ్రాయేలు జాతివాడు కాదు! అన్యుడు! గాని దేవునియందు భక్తిశ్రద్దలు కలవాడు, దేవునితో మాట్లాడే అనుభవం కలవాడు! దేవుడు కేవలం అబ్రాహాము సంతానమునే కాదు ఇతరులను కూడా ఇతరజనాలలో ఉన్నవారిని మంచి మనస్సాక్షి గలవారిని ఎన్నుకొని మనస్సాక్షి యుగంలో తనకొరకు ఏర్పాటు చేసుకున్నారన్నమాట! వీరేనా? ఇంకెవరైనా ఉన్నారా?

 

మరొక ప్రవక్త ఉన్నారు- బిలాము గారు. సంఖ్యాకాండము 22 అధ్యాయం నుండి కనబడతారు ఆయన! 22:8 లో చాలా స్పష్టముగా ఈయన యెహోవా నాకు చెప్పిందే మీకు చెబుతాను అని, 22:10 లో దేవునితో సంభాషించినట్లు చూడగలం! యితడు ప్రవక్త! ఎవరిని దీవిస్తే దేవుడు వారిని దీవించేవారు! ఎవరిని శపిస్తే దేవుడు వారిని శపించేవారు! అంత గొప్ప భక్తుడు ధనాశకు లోబడి పడిపోయి చెడిపోయారు- అది వేరే విషయం! ఇప్పుడు మన సబ్జెక్టు దేవుడు- అన్యుడు- మోయాబీయుడు అయిన బిలామును కూడా ఏర్పాటు చేసుకున్నారు దీని ప్రకారం! దీనిని బట్టి అర్ధమయ్యింది ఏమిటంటే ఇక్కడ అబీమెలెకును ఫిలిష్తీయుల నుండి ఏర్పరచుకున్న దేవుడు, మోయాబు నుండి బిలామును ఏర్పాటుచేసుకున్న దేవుడు కనాను దేశం నుండి మెల్కీసెదెకు గారిని కూడా దేవుడు ఏర్పాటుచేసుకున్నట్లు గ్రహించాలి తప్ప అతడు అన్యదేవత యొక్క యాజకుడు కాదు కాదు కాదు! అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు!

 

మరి ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు. వీరికి దేవుడు ఎలా పరిచయం అయ్యారు? వీరు అన్యులు కదా! వీరికి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అయ్యారు?

రెండు అవకాశాలు మనకు కనిపిస్తాయి. మొదటగా మీద చెప్పిన విధంగా మనస్సాక్షి యుగంలో దేవుడు మంచి మనస్సాక్షి గలవారు ఎవరైనా సరే, వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యక్షమై వారికి తన నీతినియమాలు బోధించి ఉండవచ్చు. అలాగే వీరందరూ రక్షించబడి ఉండవచ్చు. అందుకే ముగ్గురు అన్యులైనా గాని దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారు. (లేదా)

 

రెండవదిగా  హనోకు గ్రంథం ప్రకారం- హనోకు గారు టీచింగ్ స్కూల్ నడిపేవారు. అనేకమందికి సృష్టికర్తయైన దేవుని విధివిధానాలు నేర్పించే వారు. కారణం ప్రతీ రోజూ ఆయనకు దేవునితో నడుస్తూ ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారు. అంతేకాక ఆయన పడద్రోయబడిన దేవదూత లకు దేవునికి మద్య మధ్యవర్తిగా కూడా పనిచేసినట్లు చూడగలం. ఈరకంగా అనేకమంది ఆయన బోధలు విని రక్షించబడ్డారు. కాబట్టి వీరి పితరులు బోధ విని రక్షించబడిన జీవితం కలిగి ఉండవచ్చు.

 

   ప్రియ దైవజనమా! దేవునికి పక్షపాతం ఏమీలేదు! తనకు నిజంగా భయపడే వారిని విధేయత చూపించేవారిని వారు ఎవరైనా సరే ఎన్నుకొనే దేవుడు, పిలుచుకునే దేవుడు! వారి మతం, జాతి, లింగం, వారి గత చరిత్ర దేవునికి అనవసరం! కేవలం ఆయనకు విధేయత చూపించి ఆయనను వెంబడించేవారు కావాలి!

 

  ప్రియ దేవునిబిడ్డా! నీవు ఎవరివైనా సరే, దేవునికి నీవు కావాలి! ఆయనకు నిన్ను నీవు అప్పగించుకుంటే ఆయనకు మనస్పూర్తిగా లోబడితే ఆయన నిన్నుకూడా వాడుకోగలరు! నిన్ను వాడుకుని అసాధారణ క్రియలు చేయగలరు! మరి నీవు ఆయనకు అప్పగించుకుంటావా? ఆయనకులోబడతావా? అలాచేస్తే ఆయన నిన్నుకూడా వాడుకోడానికి ఇష్టపడుతున్నారు! సిద్దంగా ఉన్నారు!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*రెండవ భాగం- ఉపోద్ఘాతం-2*

 

ఆదికాండం 14:17-20

17. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.

18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

19. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,

20. నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.

 

హెబ్రీ 7:12

1. రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును

2. ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమం కోసం ధ్యానం చేస్తున్నాం! గతభాగంలో ఈయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని, ఏర్పాటు చేసుకున్న వాడు అనియు ధ్యానం చేసుకున్నాము. అయితే ఈరోజు అసలు ఈయన బైబిల్ మనకు కనబడిన నేపధ్యం ఏమిటి- ఈయన కోసం వివరంగా చూసుకుందాం! ఇంతకీ ఈయనకోసం చూసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే హెబ్రీ 7:,16 వచనాలు ప్రకారం ఈయన యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా / పోలికగా ఉన్నారు కాబట్టి. గమనించాలిఈయన యేసుక్రీస్తు ప్రభులవారు కాదు! యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా ఉన్నారు!!!

 

  ఆదికాండం 14 అధ్యాయంలో ఒక సంఘటన కోసం వ్రాయబడింది. అబ్రాహాముగారి యొక్క అన్న కొడుకు నీతిమంతుడైన లోతుగారు సోదొమ ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు కదొర్లాయోమేరు అనేరాజు ఇంకా ముగ్గురు రాజులు కలిసి సోదొమ గొమోర్రా అద్మా సెబాయిము సోయేరు బెల అనే రాజుల మీద దండెత్తి వారిని జయిస్తాడు. వారిని కొల్లబెట్టడమే కాకుండా ప్రజలను చెరపట్టుకుని పోతారు. ఈవిషయం తప్పించుకున్న ఒక వ్యక్తి అబ్రాహాము గారికి చెబితే ఆయన తనతోపాటు తన సొంత సైన్యాన్ని 18 మందిని వెంటబెట్టుకుని వెళ్లి రాజులను జయించి, కొల్ల సొమ్మును విడిపించి ప్రజలను విడిపిస్తారు. అప్పుడు సోదొమ రాజు, షాలేము రాజైన మెల్కీసెదెకు గారు అబ్రాహాము గారి దగ్గరకు వచ్చి వందనాలు చేస్తారు.

 

   ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే షాలేము రాజుమీదకు ఎవరూ యుద్దము చేయలేదు, చేసి గెలవలేరు ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు! ఈయన కోసం సోదొమ రాజుకి మిగతా రాజులకే కాదు అబ్రాహాము గారికి కూడా తెలుసు! అయితే మరి ఎందుకు అబ్రాహాముగారిని కలుసుకోడానికి షాలేము రాజైన మెల్కీసెదెకు గారు ఎందుకు వచ్చారు? రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే అది దైవనిర్ణయం కాబట్టి! తను ఎవరినైతే సేవిస్తున్నారో సర్వోన్నతుడైన దేవునికి ఇష్టుడైన ఒక వ్యక్తి తమ ప్రాంతం వచ్చారు కాబట్టి ఆయనను ఎదుర్కోడానికి రాజు బయలుదేరి వెళ్ళినట్లు చూడవచ్చు! ఇక్కడ సోదొమ రాజు-అబ్రాహాము గారి మధ్య సంభాషణ కోసం మనం ధ్యానం చేసుకోవడం లేదు గాని మెల్కీసేదేకు అబ్రాహాము గారి మధ్య జరిగిన సంఘటనలను ధ్యానం చేసుకుందాం!

 

    ఈయన మొదటగా షాలేము రాజు- షాలేము అనగా గతభాగంలో చెప్పినట్లు శాంతి , క్షేమము అనే అర్ధం వస్తుంది. పదం షాలోం- దేవుని శాంతి అనే పదానికి నానార్ధం! ఇదే క్రమేపి యెరూషలేముగా మారింది. ఒకసారి కీర్తన 76:2 లో ఇలా ఉంది చూడండి .. షాలేములో ఆయన గుడారము ఉంది, సీయోనులో ఆయన ఆలయం ఉంది. కాబట్టి ఇది యేరూషలేము అని గ్రహించవచ్చు!

 

ఇక నగరానికి రాజు మెల్కీసెదెకు- దీని అర్ధం  బైబిల్ ఏమి చెబుతుంది అంటే హెబ్రీ 7:2 లో మొదటి అర్ధం నీతికి రాజు. రెండవ అర్ధం సమాధాన రాజు లేదా శాంతి రాజు!! గతభాగంలో వివరించినట్లు ఈయనకోసం ఇంకెక్కడా వ్రాయబడలేదు. పాత నిబంధన గ్రంధంలో మరలా దావీదు గారు ఆత్మావేశుడై యేసుక్రీస్తు ప్రభులవారు ఆగమనం కోసం ప్రకటిస్తూ కీర్తన 11:4 లో నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున సదాకాలం యాజకుడుగా ఉంటావు అంటున్నారు. ఇక పాత నిబంధన గ్రంధంలో ఈయనకోసం చెప్పబడలేదు గాని హెబ్రీ పత్రికలో విస్తారంగా వ్రాయబడింది ఈయన ఎలా సర్వోన్నతుడగు దేవునికి యాజకుడో అలాగే యేసుక్రీస్తు ప్రభులవారు ఎల్లప్పుడూ జీవించే ప్రధాన యాజకుడు అని!

 

  సరే ఈయన వచ్చి- అబ్రాహాము గారికి రొట్టె మరియు ద్రాక్షారసము ఇచ్చినట్లు చూసున్నాము. రొట్టె ద్రాక్షారసము మాత్రమే ఎందుకు తీసుకుని రావాలి అని ఆలోచిస్తే మీదన చెప్పినట్లు ఈయన యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా ఉన్నారు కాబట్టి- దేవుడు నీతో చేయబోయే నిబంధన కాకుండా మరో నిత్య నిబంధన చేయబోతున్నారు- అది క్రొత్త నిబంధన- దానిలో - అనగా యేసుక్రీస్తు ప్రభులవారి శరీరము నలుగగొట్టబడి అనేకులకోసం చిందించబడబోయే నిబంధన రక్తముకు గుర్తుగా రొట్టె ద్రాక్షారసమునకు సాదృశ్యముగా రొట్టె ద్రాక్షారసమును తెచ్చారు ఆయన!

 

   ఇక తర్వాత మాటలో ఈయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని వ్రాయబడింది. దీనికోసం గతభాగంలో వివరించడం జరిగింది. అయితే సర్వోన్నతుడు అనేమాట ఏల్ ఎలియోన్ అనే అర్ధమిస్తుంది. ఇది హెబ్రీ బైబిల్ లో 35సార్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆమాట కనిపిస్తుంది ఇంకా కీర్తనల గ్రంధంలో ఎక్కువగా 21సార్లు వాడబడింది. ఇది కేవలం యెహోవా దేవునికోసం వాడబడిన మాటఅట్టి సర్వోన్నతుడగు దేవునికి యాజకుడుగా ఉండాలంటే సామాన్యమైన విషయం కాదు కారణం ఆయనే సృష్టికర్త, లయకర్త. ఆయన సన్నిధిలో వణకాలి. ఎంతో జాగ్రత్తగా యాజకత్వము చేయాలి. అయితే ఇది కేవలం వట్టి చేతులతో జరిగే పని కాదు దానికోసం అర్పణ అనేది అదికూడా బలియర్పణ తోనే మాత్రమే ఆయనను సమీపించి యాజకత్వము చేయాలి. ఇట్టి గొప్ప దేవునికి మన మెల్కీసెదెకు గారు యాజకుడు! అప్పటికి ఇంకా నిజంగా యాజకత్వమునకు దేవుడు ఏర్పాటుచేసుకున్న లేవీ గాని, ఆహారోను గాని పుట్టలేదు. దానికి ముందుగానే ఒక అన్యదేశము నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటుచేసుకున్నారు. ఆయనలో ఎన్నో మంచి లక్షణాలున్నాయి. అందుకే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అయ్యారు ఈయన!

 

  ఇక తర్వాత విషయం- ఈయన అబ్రాహాము గారిని దీవిస్తున్నారు. గమనించాలి- పెద్దవాడు చిన్నవాడిని దీవిస్తాడు. ఇక్కడ అబ్రాహాము గారు దేవునిచేత ఎన్నుకోబడిన వ్యక్తి- ఆశీర్వదింప బడిన వ్యక్తి ఇక్కడ మరొకరితో దీవించబడుతున్నారు అనగా వ్యక్తి అబ్రాహము గారికంటే గొప్పవాడు అన్నమాట! దీనికోసం హెబ్రీ 7 అధ్యాయంలో వివరంగా వ్రాయబడింది. దానిని ద్యానించేటప్పుడు దీనికోసం ధ్యానం చేద్దాం! కాబట్టి ఇక్కడ ఈయన అబ్రాహము గారికంటే గొప్పవాడు అని అర్ధమయ్యింది.

 

ఇక తర్వాత విషయం- ఎప్పుడైతే దీవించారో ఈయనను- అబ్రాహాము గారు తను కొల్లబెట్టిన సమస్తంలో పదియవ వంతు లేదా దశమ భాగం చెల్లించారు. దశమ భాగం ఇవ్వడం అనేది అప్పటికి లేదు గాని ఆత్మావేశుడై రాబోయే సంఘటనలు ఎరిగినవాడై అబ్రాహాము గారు మెల్కీసెదెకుకు దశమభాగం ఇచ్చారుఇలా చూసుకున్నా ఇక్కడ అబ్రాహాము గారి కంటే మెల్కీసేదేకు గొప్పవాడు అని అర్ధమవుతుంది.

 

ఈయన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా ఉన్నారు. అట్టి గొప్ప దేవుణ్ణి ప్రధాన యాజకుడిగా పొందిన నీవు నేను ధన్యులము!

కాబట్టి యోగ్యతను నిలబెట్టుకుని జీవిద్దాం!

దానిని నిర్లక్ష పెట్టవద్దు!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

 

 

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*మూడవ భాగం*

 

హెబ్రీ 7:12

1. రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును

2. ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగంలో పాత నిబంధన గ్రంధం నుండి అసలు మెల్కీసెదెకు ఎవరో చూసుకున్నాం! ఇక రోజునుండి చివరి వరకు ఈయన విధంగా యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యంగా ఉన్నారో హెబ్రీ గ్రంధకర్త ఇచ్చిన వివరాలను జాగ్రతగా పరిశీలన చేద్దాం!

 

ముందుగా మనం 7 అధ్యాయాన్ని ధ్యానం చేసుకుని మిగతా భాగాలు చూసుకుందాం! ఏడవ అధ్యాయం ఆయన యొక్క ప్రాముఖ్యత అనగా మెల్కీసెదెకు రకంగా రాజు మరియు యాజకుడు అయ్యారో అలాగే  యేసుక్రీస్తు ప్రభులవారు ఎలా రాజుగా యాజకునిగా తన కర్తవ్యం నెరవేర్చారో కళ్ళకు కట్టినట్లు చూపించారు భక్తుడు!

 

మొదటి వచనంలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవరు కలుసుకున్నారో, ఎవరు అబ్రాహామును ఆశీర్వదించెనో ఎవనికి అబ్రాహాము అన్నింటిలో పదియవ భాగమిచ్చెనో షాలేము రాజు అంటున్నారు. చరిత్ర గతభాగంలో చూసుకున్నాము గనుక ముందుకు పోదాము.

 

రెండవ వచనంలో షాలేము రాజు మొదటగా సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని చూసుకున్నాం. దీనికోసం కూడా గతభాగాలలో చూసుకున్నాం! మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు- అలాగే క్రీస్తుకూడా రాజు మరియు యాజకుడు అని పత్రికలో ఎక్కువ సార్లు వ్రాయబడి ఉంది. ఇక యేసుక్రీస్తు ప్రభులవారు మెల్కీసేదేకు క్రమము చొప్పున వచ్చారు అని 5:6,10; 6:20 లో కూడా నొక్కి వక్కానిస్తున్నారు.

 హెబ్రీయులకు 5: 6

ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

 

హెబ్రీయులకు 6: 20

నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

 

దానిని ఆయన సొంతమాటలుగా చెప్పడం లేదు- దావీదు గారి ప్రవచనాన్ని ఉటంకిస్తున్నారు కీర్తన 11:4...

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

 

ఇక ఇక్కడ ఆయన పేరుకు అర్ధం చెబుతున్నారు పౌలుగారు: (గమనించాలి అనేకులు నమ్మేది పత్రిక పౌలుగారు రాశారు అని. అందుకే నేనుకూడా పౌలుగారు అని సంభోదిస్తున్నానుమొదటగా నీతికి రాజు. రెండవది సమాధాన రాజు లేక శాంతికి రాజు! నిజంగా రెండు పేర్లు యేసుక్రీస్తు ప్రభులవారి జీవితంలో నెరవేరాయి! ఆయన రాకముందే ఆయన నీతిరాజు అని ప్రకటింపబడింది. దావీదుకు నీతి చిగురు యిర్మియా 23:5; ౩౩:15;

నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు అని జెకర్యా 9:9 లో చెప్పబడింది.

ఇక ఆయన పేరే సమాధాన కర్త! యెషయా 9:6; శాంతి రాజు. శాంతికి యువరాజు! అందుకే నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకము ఇచ్చినట్లు కాదు అన్నారు. యోహాను 14: 27

శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే (లేక, సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.

 

ఇదే పేర్లు మెల్కీసెదెకుకు కూడా పెట్టబడి ఉన్నాయి. అనగా మెల్కీసెదెకు యేసుక్రీసు ప్రభులవారికి సాదృశ్యంగా ఉన్నట్లు చూడగలము!

 

ఇక మూడవ వచనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు రాశారు. ఏమిటంటే తల్లిలేని వాడు తండ్రిలేనివాడు వంశావళి లేనివాడు జీవితానికి ఆదియైన అంతమైన లేనివాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటున్నారు. మరి తల్లి తండ్రి లేకుండా ఎలా పుట్టారు ఈయన?? ఇక దీని అర్ధం ఏమిటంటే బైబిల్ లో దీనికోసం ఏమీ వ్రాయబడలేదు అని అర్ధం! అంతేకాకుండా చరిత్రగాని బైబిల్ గాని ఈయన తల్లిదండ్రులు ఎవరో వంశవృక్షం ఏదో, వంశావళి ఏదో చెప్పడం లేదు. అందుకే బహుశా తల్లిదండ్రులు లేని వాడు వంశావళి లేనివాడు అంటున్నారు పౌలుగారు!

అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభులవారు వివాహం చేసుకోలేదు. అనగా ఆయనకు భార్య, సంతానము కూడా లేదు. ఒకసారి ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎవరు నా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అంటే దేవునిమాట వినేవారే! కాబట్టి లోకంలో ఆయనకు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరూ లేకుండా, వివాహం లేకుండా, సంతానం లేకుండా దేవుని సేవ చేసి, దేవుని కోసం మానవుల కోసం బలైపోయారు. అలాగే మెల్కీసెదెకు కూడా వీరెవరు లేరు. ఇదే మెల్కీసెదెకు క్రమం!

అందుకే ఎప్పటికీ మార్పులేని రాజుగా యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా మిగిలిపోయారు!

 

 గమనించాలి ౩వ వచనంలో దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటున్నారు గాని పౌలుగారు యితడు దేవుని కుమారుడు అని ఎంతమాత్రము చెప్పడం లేదు. ఈయన యేసుక్రీస్తు ప్రభులవారు కాదు గాని ఆయనకు సాదృశ్యంగా ఉన్నారు.

ఇంకా పౌలుగారు ఇలా చెబుతున్నారు ఆయనకు ఆది అంతము లేదు అని చెబుతూ.-

హెబ్రీ 1:2, 8, 1013

2. దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో-యుగములను) నిర్మించెను.

3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక.......

8. గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. .....

10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి

11. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

12. ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.

13.అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?

 

ఇంకా శాశ్వతంగా యాజకుడుగా ఉన్నారు హెబీ 5:6

ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

అట్టి శాశ్వతుడు అయిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా?

అట్టి యాజకధర్మంలో యాజకధర్మం క్రింద నీవున్నావా!!?

 కలిగియుంటే దానికి తగిన జీవితం నీవు జీవిస్తున్నావా?

 

దైవాశీస్సులు!

 

 

    

 

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*నాల్గవ భాగం*

 

హెబ్రీ 7:4--10

4. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.

5. మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని

6. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.

7. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.

8. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

9. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.

10. ఏలాగనగా మెల్కీ సెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగంలో యితడు దేవుని కుమారుడు లేదా యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యంగా ఉన్నాడు అని ధ్యానం చేసుకున్నాము. ఇక 410 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈయన అబ్రాహాముగారి కంటే గొప్పవాడు అని పౌలుగారు నిరూపిస్తున్నారు. అందుకు గాను కొన్ని సాదృశ్యాలు చూపిస్తున్నారు.

 

    4 వచనంలో మూలపురుషుడైన అబ్రాహాము అతడు కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో మెల్కీసెదెకు గారికి పదియవ వంతు లేదా దశమభాగం ఇచ్చినట్లు చెబుతున్నారు. విషయం మనకు ఆదికాండం 14:20 లో కనబడుతుంది.

నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. *అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను*.

 

  48 వచనాలలో మెల్కీసెదెకు అబ్రాహాము గారికంటే ఎలాగొప్పవాడో చెబుతున్నారు మనకు! మొదటగా అబ్రాహముగారు తన అన్న కొడుకు లోతుగారిని ఇంకా మిగిలిన ప్రజలను రక్షించి, రాజులను సంహారం చేసి కొల్లసొమ్ము తీసుకుని వచ్చినప్పుడు వాటిలో శ్రేష్టమైనవి మెల్కీసేదేకు గారికి కానుకగా ఇస్తున్నారు. అదికూడా దశమభాగం! గమనించాలి చిన్నవారు గొప్పవారికి కానుకలు ఇస్తారు, మరి అబ్రాహముగారే మెల్కీసెదెకు గారికి కానుకలు ఇచ్చారు  కాబట్టి రకంగా అబ్రాహము గారికంటే మెల్కీసెదెకు గారు గొప్పవారు!

 

క్రమంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుచేస్తున్నారు పౌలుగారు! మొదటిది:45 వచనాలు. లేవీగోత్రం యాజకత్వం పొందినవారు తమ సహోదరులు అబ్రాహాము గర్భాన పుట్టినా గాని ధర్మశాస్త్రము ప్రకారం ప్రజల దగ్గరనుండి పదోవంతు పుచ్చుకుంటారు. అయితే అసలు లేవీ గోత్రానికి గాని ఆహారోను సంతతికి గాని చెందని వాడు ఎన్నెన్నో వాగ్దానాలు పొందుకున్న అబ్రాహాము గారినుండి పదోవంతు పుచ్చుకున్నారుఇప్పుడు ఒక్కోవిషయం మాట్లాడుకుందాం! లేవీగోత్రం వారు పదోభాగం పుచ్చుకోవాలని దేవుడు సంఖ్యాకాండములో చెబుతున్నారు. అంతేకాకుండా లేవీయులు మాత్రమే దేవుని సేవ చెయ్యాలని కూడా రాశారు. వారు దేవునిసేవ చేస్తున్నారు కాబట్టి దేవుడే వారి స్వాస్త్యము అనియు, దశమభాగాలు వారికి చెందాలని రాశారు దేవుడు. సంఖ్యా 1:4853; 18:2428;  

ఇక లేవీగోత్రములోనుండి కేవలం ఆహారోను సంతతివారే యాజకులుగా ఉండాలని సంఖ్యా :510 లో చెప్పబడింది.

 

లేవీ 27:౩౦ లో తప్పకుండా దశమ భాగం ఇవ్వాలి అని వ్రాయబడింది...

భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.

 

కాబట్టి దశమభాగం ఇవ్వాలి- ఎవరికి ఇవ్వాలి? అది దేవునిది కాబట్టి దేవునికి! అయితే లేవీయులు దేవుని పని చేస్తున్నారు కాబట్టి- దేవుడే వారి స్వాస్త్యము కాబట్టి లేవీయులకు ఇవ్వాలి. నేటి నూతన నిబంధన సంఘంలో కూడా దశమభాగం ఇవ్వాలి! ఎవరికి ఇవ్వాలి అంటే దేవుని సేవ చేస్తున్న మీ సంఘకాపరికి లేదా సంఘానికి ఇవ్వాలి! సంఘానికి వెళ్తే సంఘానికే ఇవ్వాలి గాని ఇక్కడ అక్కడ ఇవ్వకూడదు! కారణం ఇశ్రాయేలు వారు ప్రాంతంలో ఉన్నారో అదే ప్రాంతంలో ఉన్న లేవీయులకు ఇవ్వమని వ్రాయబడింది గాని యూదయలో ఉన్న ఇశ్రాయేలు వారు గలలియలో ఉన్న తనకు నచ్చిన లేవీయులకు ఇవ్వమని చెప్పలేదు! తమతో ఉంటూ తమ ఆచారవ్యవహారాలలో తమకు సహాయపడి తమను ఆత్మీయంగా దేవునిలో బలపరుస్తున్న వారికి ఇవ్వాలి! అలాగే నీ సొంత సంఘానికి సొంత దైవజనునికి/ కాపరికి ఇవ్వాలి, ఇంకా ఎక్కడైతే నీవు ఆత్మీయ ఆహారం భుజిస్తున్నావో, ఎక్కడైతే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావో అక్కడే నీ దశమభాగం ఇవ్వాలి గాని టీవీలో చాలా బాగా ప్రసంగాలు చేస్తున్నారని వారికి నీ దశమభాగం ఇవ్వకూడదు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నీ స్వేచ్చార్పణలు ప్రత్యేకకానుకలు పంపించవచ్చు గాని నీ దశమభాగం మాత్రం నీ సంఘానికే ఇవ్వాలి!

అందుకే చాలా సంఘాలలో నేడు దశమ భాగం ఇవ్వకపోతే ప్రభు సంస్కారం ఇవ్వరు! దశమభాగం చెల్లించాక అప్పుడు సంస్కారం తీసుకోవాలి అనే నియమం ఉంది వాళ్లకు. అంతేకాకుండా నీవు దశమభాగం చెల్లించకపోతే తీసుకోకూడదు. అలాగే సేవకులు కూడా ఇది గమనించాలి.

 

సరే, ఇక్కడ అబ్రాహాముగారు లేవీ గోత్రానికి గాని ఆహారోను సంతానానికి గాని చెందని వానికి దశమభాగం ఇస్తున్నారు. అంతేకాదు అప్పటికి దశమభాగం ఇవ్వాలి అనే ఆజ్ఞ కూడా రాలేదు దేవుని నుండి! గాని ఆత్మపూర్ణుడై దేవుని ఆత్మచేత నడిపింపబడి నడిపింపుతో ముందు జరుగబోయే కార్యాలకు ముంగుర్తుగా అబ్రాహాముగారు మెల్కీసెదెకు గారికి దశమభాగం ఇస్తున్నారు. వాగ్దానాలు పొందుకున్నవాడు- వాగ్ధాన పుత్రునికి కానుకలు ఇస్తున్నారు.

 

ఇక రెండవదిగా ఎప్పుడైతే కానుకలు పుచ్చుకున్నారో మెల్కీసెదెకు గారు నిండుహృదయంతో అబ్రాహాముగారిని దీవిస్తున్నారు. ఇది ఆదికాండం 14:19 లో ఉంది.

ఆదికాండము 14: 19

అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు,

నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.

 

7 వచనం.....తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నదిగమనించారా తక్కువవాడు ఎక్కువ వానిని దీవిస్తారు. మరి ఇప్పుడు దీవించింది ఎవరు? మెల్కీసెదెకు! కాబట్టి ఇక్కడ గొప్పవాడు ఎవరు అంటే మెల్కీసెదెకు అని అర్ధం!

 

ఒక విషయం చెప్పనీయండి: పౌలుగారు అబ్రాహాము గారి కంటే మెల్కీసెదెకు గొప్పవాడు అని చెప్పడం- అబ్రాహము గారిని చిన్నచూపు చూడటం ఎంతమాత్రం కాదు. రకంగా రాయడానికి కారణం అబ్రాహాము గారు ఏరకంగాను గొప్పవాడు కాదు అని ఆయన ఉద్దేశం కానేకాదు! 7 అధ్యాయం వ్రాయడానికి ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆహారోను యాజకత్వానికంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము పరిపూర్ణమైనది. శ్రేష్టమైనది. గొప్పది అని చెప్పడమే ఆయన ఉద్దేశం!

 

ఇక 8 వచనంలో మరో లాజిక్ చెబుతున్నారు ఎలా మెల్కీసెదెకు గొప్పవారో! 8....మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు

 

 ఇక్కడ చావుకు లోనయ్యేవాడు అంటున్నారు ఏమిటి? అనగా యాజకులు నిరంతరము బ్రతకడం లేదు కదా! ప్రధానయాజకులు కూడా మానవులే! ఏదో ఒకరోజు చనిపోతారు. బ్రతికి ఉన్నంతవరకు వారి వంతు వచ్చినప్పుడు యాజకత్వము చేసి పోతుంటారు అంతే! అందుకే చావుకు లోనయ్యేవారు అంటున్నారు. మరి జీవించు చున్నాడు అని మెల్కీసేదేకు గారిని ఎందుకు అంటున్నారు అంటే ౩వ వచనంలో చెప్పబడింది .....

3. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు (మూలభాషలో- దినములకు) ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు

కాబట్టి జీవించుచున్నవాడు- దేవుని కుమారునికి పోలిక కాబట్టి జీవించుచున్నవాడు అంటున్నారు పౌలుగారు! కాబట్టి చావునకు లోనయ్యే వారు ఆహారోను సంతతి-లేవీ గోత్రపు వారు అయితే నిరంతరమూ నిలిచేది యేసుక్రీస్తు ప్రభులవారు- మెల్కీసెదెకు యాజక ధర్మం!

 

అలాగే నేటి నూతన నిబంధన సంఘకాలంలో యాజకధర్మం చేస్తున్న సేవకులు పరిచారకులు కూడా పౌలుగారి వలే  సమస్తమును పెంటగా భావించి సేవ చెయ్యాల్సిన అవసరం ఉంది. అందుకే పౌలుగారు 1కొరింథీ 7:29లో భార్య గలవాడు లేనట్లు ప్రవర్తించాలి అంటున్నారు. అనగా భార్యను వదిలెయ్యమని కాదు. ఈలోకపు నటనలలో జీవనపోరాటంలో  చిక్కుకోకుండా దేవుని కోసమే ఎక్కువగా కష్టపడాలి. తండ్రి లేనివాడు వంశావళి లేనివాడి రీతిలో దేవుని సేవ చెయ్యాలి.

 

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*5 భాగం*

 

హెబ్రీ 7:810

8. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

9. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.

10. ఏలాగనగా మెల్కీ సెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

 

           (గతభాగం తరువాయి)

 

      ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం మెల్కీసెదెకు గారు అబ్రాహము గారికంటే ఎలా గొప్ప వారో ధ్యానం చేసుకున్నాం!

ఇక 810 వచనాలు మెల్కీసెదెకు గారు లేవీ కంటే ఎలా గొప్పవారో వివరిస్తున్నారు. ముందు చెప్పిన విధంగా చావుకు లోనైన లేవీ గోత్రపు వారు పదవ వంతు ప్రజలనుండి పుచ్చుకుంటున్నారు. అయితే జీవించేవాడు అని చెప్పబడిన వాడు చావుకు లోనైన వారినుండి కూడా దశమభాగం పుచ్చుకున్నారు అంటున్నారు పౌలుగారు 9 వచనంలో! ఎలా పుచ్చుకున్నారు అంటే అప్పటికి అనగా అబ్రాహాము గారు పదవ వంతు ఇచ్చినప్పటికి లేవీ గాని ఆహారోను గాని పుట్టలేదు. గాని అబ్రాహాము గారి గర్భములో ఉన్నారు అంటున్నారు. కారణం అబ్రాహము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. యాకోబు గారి కుమారుడు లేవీ. పదియవ బాగం ఇవ్వడం జరిగాక సుమారు 150 సంవత్సరాలకు లేవీ గారు పుట్టారు. కాబట్టి లేవీ కంటే ఇంకా అబ్రాహముగారి సంతానం అందరికంటే ఇంకా యాజకుల కంటే కూడా మెల్కీసెదెకు గారు ఎంతో శ్రేష్టుడు అని అర్ధం అవుతుంది.

 

     ఇక 11 వచనంలో చాలా విచిత్రమైన విషయం రాస్తున్నారు......

హెబ్రీయులకు 7:11

11. లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీ సెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?

ధర్మశాస్త్రం వలన- ఇంకా ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన యాజకధర్మం వలన, యాజకుల వలన మానవులకు సంపూర్ణసిద్ది కలిగితే మరొక యాజక ధర్మం అవసరం లేదు అంటున్నారు. కాబట్టి ఆహారోను యాజకధర్మం వలన సంపూర్ణ సిద్ది కలగలేదు కనుకనే మెల్కీసెదెకు క్రమం చొప్పున మరొక ప్రధాన యాజకుడు రావలసి వచ్చింది అంటున్నారు పౌలుగారు! ఇక వచనం నుండి 19 వచనం వరకే కాదు 10:8 వరకు ఇదే విషయాన్ని విభిన్న కోణాలలో చెబుతున్నారు పౌలుగారు! అన్ని వచనాలలో పౌలుగారు ఆహారోను /లేవీ యాజకధర్మం కంటే మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారి యాజకధర్మమే గొప్పదని నిరూపిస్తున్నారు. అంతేకాదు పాత నిభందన లేక ధర్మశాస్త్ర యాజకధర్మం పరిపూర్ణమైనది కాదు అని, అది మానవులకు పరిపూర్ణత సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అందుకే నూతన నిబంధన/ నూతన యాజకధర్మం వచ్చింది అని నొక్కివక్కానిస్తున్నారు. ఇంకా అంటున్నారు- దేవుడు ఆశించిన ఫలితాలు ఆహారోను యాజకధర్మం వలన కలిగితే మెల్కీసెదెకు క్రమం చొప్పున మరొక యాజకధర్మం కోసం వాగ్దానం చేసి ఉండేవారు కాదు దేవుడు!

 

11 వచనం ప్రకారం లేవీ యాజకధర్మమును ఆధారం చేసుకునే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం వచ్చింది. అయితే యాజకధర్మం ప్రజలకు సంపూర్ణసిద్ధిని కలిగించలేకపోయింది. గమనించాలి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వకముందు లేవీగోత్రంయొక్క యాజకధర్మం లేనేలేదు! యాజకధర్మం అనేది పాతనిబందనలో ఇంకా ధర్మశాస్త్రంలో ఒక భాగము! నిర్గమ 19:5 ప్రకారం మీరు నామాట విని నా ధర్మశాస్త్రం ప్రకారం చేస్తే మీరు నాకు సొత్తుగా ఉంటారు అంటున్నారు దేవుడు! అయితే యాజకధర్మం సంపూర్ణత/ సంపూర్ణసిద్ధిని కలుగజేయలేకపోయింది. హెబ్రీ 10:14 లో అయితే యేసుక్రీస్తు ప్రభులవారి ఒకే ఒక అర్పణచేత ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు పరిశుద్ధ పరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు అంటున్నారు. అనగా ధర్మశాస్త్రం/ ఆహారోను యాజకధర్మం  దేనిని సంపూర్ణులుగా చేయలేకపోయిందో యేసుక్రీస్తు ప్రభులవారి బలియాగ అర్పణం తనను అంగీకరించేవారిని సంపూర్ణులుగా చేయగలిగింది. గమనించాలి మెల్కీసెదెకు క్రమం గాని, హెబ్రీ పత్రిక ముఖ్యాంశం గాని మానవుడు పరిపూర్ణత సాధించడమే! కేవలం పరిపూర్ణత గలవారు మాత్రమే పరలోకం చేరగలరు! అందుకే ధర్మశాష్ట్రం చేయలేని పని యేసుక్రీస్తుప్రభులవారు చేసి చూపించి మానవులను మెల్కీసేదేకు క్రమం చొప్పున పరిపూర్ణులుగా చేసారు. అందుకే పరిపూర్ణులుగా చేయడానికి సర్వసత్యములోనికి నడిపించటానికే దేవుడు పరిశుద్ధాత్మను ఆదరణ కర్తగా పంపించారు. కాబట్టి నీకు సంపూర్ణత, పరిపూర్ణత కావాలంటే మెల్కీసెదెకు క్రమంలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే అతడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించి పరిపూర్ణుడుగా నిన్ను మార్చగలరు! యోహాను 16: 13

అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. గమనించాలి పరిపూర్ణతకు పరిశుద్ధతకు ఎంతో సంబంధం ఉంది. పరిశుద్ధంగా జీవించాలి అంటే ఆత్మను పొందుకుని ఆత్మ నడిపింపులో కొనసాగాలి. నీకు నీవుగా పరిశుద్ధుడుగా జీవించలేవు!

కాబట్టి ప్రియ స్నేహితుడా నీవు ఆత్మాభిషేకం పొందుకున్నావా!!!

 

ఇక 12 వచనంలో.....

12. ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహామార్చబడును.   చూడండి 11 వచనం ప్రకారం యాజకధర్మం ధర్మశాస్త్రం వలననే కలిగింది అంటున్నారు. ఇంకా యాజకధర్మంవలననే ధర్మశాస్త్రం కూడా ఉంది. రెండు అవినాభావ సంభందం కలిగిఉన్నాయి. అయితే ఇప్పుడు యాజకధర్మం మారితే ధర్మశాస్త్రం కూడా మారిపోవాలి కదా! అంతేకాదు యాజకులు మారితే యాజకధర్మం కూడా మార్చబడుతుంది కదా అంటున్నారు. ధర్మశాస్త్రము-యాజకధర్మం ముడిపడి ఉన్నప్పుడు ఒకటి నిరర్ధకమైతే రెండవది కూడా నిరర్ధమకమై పోయినట్టేకదా! అనగా మొత్తం పాత నిబందనే నిరర్ధకం లేదా రద్దయినట్లు చూడగలం! కారణం అది మానవులకు సంపూర్ణసిద్ధి/ పరిపూర్ణత కలుగజేయలేదు! అందుకే దేవుడు పాతనిబంధన ను ప్రక్కన పెట్టి క్రొత్త నిబంధన/ క్రొత్త వాగ్దానం ఇస్తున్నారు. ఇది పాత నిబంధన కంటే ఎంతో శ్రేష్టమైనది. గమనించాలి యేసుక్రీస్తు ప్రభులవారు మొదటగా ధర్మశాస్తాన్ని నెరవేర్చి, ఇక దాని అవసరం లేదు కాబట్టి తర్వాత దానిని రద్దు చేశారు ఆయన దేహం రొట్టె వలె చీల్చబడి ద్రాక్షారసంలా కారి, కల్వరి సిలువలో జీవమార్గం ఏర్పాటు చేయబడింది. మీద చెప్పినట్లు పాత నిబంధన నిరర్ధకం అయ్యింది అనగా మొత్తం పాత నిబంధన రద్దు అయ్యింది దానిని మనం చదువనక్కరలేదు పాటించనక్కర లేదు అని ఎంతమాత్రమూ కాదు. పాత నిబంధన అనగా ధర్మశాస్త్రం అనగా యజ్ఞయాగాదులు కోసం, బలులు రద్దు అయ్యాయి అని గ్రహించాలి. బల్యర్పణ క్రమాలు, సున్నతి స్నానాదులు, శుద్ధీకరణ ఆచారాలు లాంటివి ఇవన్నీ భూసంబంధమైన శారీరక శుద్ధికి సంబంధించిన విషయాలు రద్దుచేయబడ్డాయి అని అర్థం! నూతన నిబంధన సంగతులు అన్నీ ఆత్మీయ సంగతులు ఆధ్యాత్మిక సంగతులు అని గ్రహించాలి.

 

ఇక 13 వచనంలో సంగతులు ఎవరికోసం చెప్పబడ్డాయో ఆయన అనగా మెల్కీసెదెకుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారు ఆహారోను /లేవీ గోత్రానికి చెందిన వాడు కాదు! ఆయన యూదా గోత్రానికి చెందిన వారు. మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారం! మత్తయి 11:-6. ఇక యూదా గోత్రపు వారు ఎవరూ కూడా ఎప్పుడు యాజకులుగా ఉండలేదు! అయితే యేసుక్రీస్తు ప్రభులవారు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా లోకానికి వచ్చారు!

వచ్చిన పని సంపూర్తి చేశారు. అటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు!

ఎన్నికలేని వారిని ఎన్నుకొన్నవాడు యేసుక్రీస్తు! నజరేతునుండి  మంచిది ఏదైనా వస్తుందా (యోహాను 1:46) అనేటంత విలువ లేని స్తితిలోనుండి నీతిసూర్యుడు ఉదహరించారు. అలాగే యోగ్యత ఎన్నికలేని నిన్ను నన్ను ఆయన పిలుచుకుని ఏర్పాటు చేసుకుని పవిత్ర పరచి రాజులైన యాజక సమూహంలో చేర్చారు కాబట్టి నీవు పరిశుద్ధత కాపాడుకొంటున్నావా ప్రియ స్నేహితుడా! పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడా??!!

పరిశుద్ధత కాపాడుకోవడం ఎంతో ముఖ్యం యాజకధర్మంలో! పరిశుద్ధత లేకుండా ప్రభువును చేరలేవు!

 

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*6 భాగం*

హెబ్రీ 7:15-17

15. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,

16. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.

17. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగంలో యేసుక్రీస్తు ప్రభులవారు అబ్రాహాము గారికంటే, లేవీ కంటే విధంగా గొప్పవారో చూసుకున్నాం! భాగంలో దేవుడు యాజకధర్మం దాని నియమాలను మార్చిన విధానం కోసం ధ్యానం చేసుకుందాం!

 

1517 వచనాలలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు పౌలుగారు. శరీరానుసారంగా నెరవేర్చబడే ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాకుండా నాశనమే లేని జీవమునకు గల శక్తిని బట్టి నియమింపబడిన మెల్కీసెదెకును పోలిన వాడైన మరొక వ్యక్తి అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రధాన యాజకుడుగా వచ్చియున్నాడు. అందుకే దీనిని విశిదముగా చెబుతున్నాం అంటున్నారు. ఎందుకంటే నీవు నిరంతరమూ మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవై యున్నావు అని యేసుక్రీస్తు ప్రభులవారి విషయం దేవుడే సాక్ష్యం చెబుతున్నారు అంటున్నారు.

 

  దీనిని బట్టి యాజకధర్మం, దాని నియమాలు మారాయని ఇక్కడ పౌలుగారు ఆత్మావేశుడై చెబుతున్నారు. ఇదే విషయాన్ని 12 వచనంలో కూడా చెప్పారు పౌలుగారు. ఇది తేటతెల్లమయ్యింది ఎలాగంటే మామూలుగా లేవీగోత్రమునకు చెందిన ఆహారోను సంతతివారినే యాజకులుగా నియమించాలి అని ధర్మశాస్త్రము చెప్పియుండగా యూదా గోత్రమునకు చెందిన యేసుక్రీస్తు ప్రభులవారిని దేవుడు ప్రధాన యాజకుడుగా నియమించారు. అనగా పాత నిబంధనా క్రమములో గల ధర్మశాస్త్రమును రద్దుచేసి దేవుడు నూతన నిబంధనను ఇచ్చి నూతనమైన పునాదిపై క్రొత్త యాజకధర్మమును స్థాపించారు. అదే మెల్కీసెదెకు క్రమముపాత నిబంధనలో యాజకులు వారి వంశాన్ని బట్టి నియమించబడితే క్రొత్త నియమం/ యాజక ధర్మం మరణమే లేని జీవము గల దేవుని నియమాన్ని బట్టి కలిగింది. 16 వచనంలో శరీరానుసారమైన ఆజ్ఞగల ధర్మం అంటే గోత్రాన్ని బట్టి శరీరానుసారంగా కలిగిన ఆహారోను యాజకక్రమము! జీవముగల నియమము అనగా మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారి యాజక ధర్మం!

 

      అందుకే 17 వచనంలో దేవుడు చేసిన ప్రమాణము/ వాగ్ధానము ను గుర్తుకు చేస్తున్నారు పౌలుగారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరమూ నీవు యాజకుడుగా ఉంటావు అని దేవుడే సాక్ష్యం చెబుతున్నారు కదా అంటున్నారు. ఇది కీర్తన 11:4 లో చూడవచ్చు మనం! ఇక్కడ విషయం చెప్పడం ద్వారా మరోసారి పౌలుగారు చెబుతున్నారు- ప్రవచనం ద్వారా యాజకధర్మంతో పాటు ధర్మశాస్త్రం పాత నిబంధన మొత్తాన్ని ప్రక్కన పెట్టి నూతన నిబంధన- నూతన యాజకధర్మమును దేవుడు ప్రవేశపెట్టబోతున్నారు అని ముందుగానే దేవుడు ప్రమాణం చేశారు అంటున్నారు!

 

  ఇక 1819 లో సూటిగా పాయింట్ కి వచ్చేశారు- తను చెప్పబోయేది స్పష్టమైన మాటలలో చెబుతున్నారు.....

18. ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది;

19. అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము. .

 

 చూడండి ధర్మశాస్త్రము దేనికిని... అనగా విషయంలో కూడా సంపూర్ణసిద్ధి లేక పరిపూర్ణత కలుగజేయలేదు కాబట్టే ముందు ఇవ్వబడిన ఆజ్ఞ అనగా ధర్మశాస్త్రము- లేవీగోత్రం వారే యాజకత్వం చేయాలి అనే ఆజ్ఞ కూడా బలహీనమైపోయింది కాబట్టి అది నివారణ చేయబడియున్నది అనగా రద్దుచేయబడినది అంటున్నారు పౌలుగారు నిక్కచ్చిగా! చూశారా! మొదటి ఆజ్ఞ అనగా ఆహారోను యాజకత్వము బలహీనమైనది, నిరుపయోగమైనది, నిష్ప్రయోజనమైనది, పనికిరానిది అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అంటే అది సంపూర్ణసిద్ధి కలుగజేయడం లేదు లేదా పరిపూర్ణత కలుగజేయడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుల యొక్క పాపాన్ని కూడా పర్మినెంట్ గా తీసివేయడం లేదు! అసంపూర్ణమైనది ఎందుకు అని క్రొత్త నిబంధన కోసం దావీదు గారి సమయంలోనే దేవుడు ప్రమాణం చేస్తున్నారు మెల్కీసెదెకు క్రమం చొప్పున మరో యాజకధర్మము రాబోతుంది అని!

 

సందర్భంగా మూడు విషయాలు చెప్పనీయండి: మొదటిది: దేవుడే స్వయముగా నియమించిన పాత నిబంధన యాజకధర్మం బలహీనమైనది పనికిరానిది అయితే ఇక మతాలలో ఉన్న యాజకధర్మం అయినా బలహీనమైనదే నిష్ప్రయోజమైనదే!

 

ఇక రెండవది: మరి ఇలాంటి బలహీనమైన పనికిరాని నియమాన్ని దేవుడు ఎందుకు స్థాపించారు మరి??!!! అది అలాంటిదే అని నిరూపించడానికి, మానవులు కాదు ప్రధాన యాజకులుగా ఉండగలిగేది దేవదేవుడే ప్రధాన యాజకధర్మం నెరవేర్చగలరని, ప్రధాన యాజకుడైన క్రీస్తుయేసు మనకు ఎంత అవసరమో తెలియజేయడానికి మాత్రం మొదటి నియమాన్ని దేవుడు కలుగజేశారు!

 

మూడవది: నూతన నిబంధన ధర్మంలో లేక మెల్కీసెదెకు క్రమంలో వంశాన్ని బట్టి కాక అందరూ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అధికారం దయచేశారు దేవుడు. పాత నియమంలో కేవలం లేవీ గోత్రానికి చెందిన అహరోను వంశపువారు మాత్రమే పరిశుద్ధ స్థలం లోను అతి పరిశుద్ధ స్థలంలోను ప్రవేశించేవారు. అయితే నూతన నిబంధన సంఘంలో మెల్కీసెదెకు క్రమంలో అలాంటి భేధము లేదు. ఆయనకు కుల మత ప్రాంత వర్ణ లింగ భేదం లేనేలేదు. అందరూ సమానమే! ఆయన దృష్టిలో SC ST BC OC లాంటివి లేవు. అందరూ ఆయన దగ్గరకు రావచ్చు. మారుమనస్సు అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుని పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వారెవరైనా సరే, ఆయన సన్నిధికి చేరవచ్చు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించ వచ్చు. పరమ సీయోను లాంటి లోతైన ఆత్మీయ జీవితం పొందుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవచ్చు! ఇది పాత నిబంధన క్రమానికి నూతన నిబంధన మెల్కీసెదెకు క్రమానికి గల ముఖ్యమైన తేడాలు!

 

   సరే, అయితే పౌలుగారు కేవలం సమస్య చెప్పడమే కాదు దానికి పరిష్కారం కూడా చెబుతున్నారు. 19 వచనం- దానికంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని తర్వాత ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు దీనిద్వారా దేవునియొద్దకు మనము చేరుచున్నాము. శ్రేష్టమైన నిరీక్షణ కోసం ఇంకా చాలాచోట్ల చెబుతున్నారు పౌలుగారు

హెబ్రీ 6:1820..

18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.

19. నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.

20. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

 

ఇక నిరీక్షణ- యేసుక్రీస్తు ప్రభులవారి యాజకధర్మంనకు చెందినది. ఆయనచేసిన యాజకధర్మం వలనను- ఆయన చేసిన మధ్యవర్తిత్వం వలనను మన పక్షంగా ఆయన చేసిన ప్రధాన యాజకత్వము వలనను మనం దేవుని దగ్గరకి ధైర్యంగా చేరగలుగుచున్నాము.

హెబ్రీ 10:1922

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచ బడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాస విషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

వీటికోసం మనం చివర్లో ధ్యానం చేసుకుందాము.

 

   కాబట్టి దీనివలన మనకు ఏమని అర్ధమవుతుంది అంటే కేవలం క్రీస్తుయేసు చేసిన బల్యర్పణ వలనైన యాజకత్వము వలన మాత్రమే మనం దేవుని సమీపించగలుగు తున్నాము కాని మరే రకంగాను మనం దేవునిని సమీపించలేము! అట్టి మహోన్నతుడైన దేవుణ్ణి కలిగియున్న నీవు నేను పేరుకు తగినట్లు జీవిస్తున్నామా లేదా? ఒకసారి పరిశీలించుకోమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*7 భాగం*

 

హెబ్రీ 7:2022

20. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.

21. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;

22. ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగంలో లేవీ/అహరోను యాజకత్వము  కంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము విధంగా గొప్పదో చూసుకున్నాం! భాగంలో కూడా దానినే మరో కోణంలో చెబుతున్నారు.

 

20 వచనంలో ప్రమాణం లేకుండా యేసుక్రీస్తు ప్రభులవారు యాజకుడు కాలేదు గనుక ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను అంటున్నారు. ఇంకా 21లో వారికి అలాంటి ప్రమాణం లేదు గాని ఈయనకు కీర్తన 11:4 లో చెప్పిన నిరంతరమూ మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు యాజకుడవై యుందువు అనే ప్రమాణం లేక వాగ్దానం ఉంది అంటున్నారు. ఆహారోను యాజకత్వానికి ఇలాంటి స్థిరమైన వాగ్దానం లేదు అంటున్నారు. వచనాల భావం కూడా ఆహారోను యాజకత్వము కంటే యేసుక్రీస్తుప్రభులవారి యాజకత్వము రకంగా శ్రేష్టమైందో మరో కారణాన్ని పౌలుగారు చెబుతున్నారు ఇక్కడ! క్రీస్తును ప్రధాన యాజకునిగా చేసేటప్పుడు ఆయనకు స్థిరమైన వాగ్దానం ఉంది. లేవీయులకు లేదు అంటున్నారు. అయితే దేవుడు నిరంతరమూ మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా ఉంటావని మార్పులేని స్తిరమైన వాగ్దానం చేస్తున్నారు అక్కడ! ఇదే విషయాన్ని హెబ్రీ 6:17,18 లో కూడా వివరిస్తున్నారు. ......

17. విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,

18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.

 

   కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారి యాజకత్వము గూర్చి యూదులు గాని, నూతన నిబంధన సంఘమైన మనము గాని విషయం రూఢిగా తెలుసుకోవాలని పౌలుగారి ఉద్దేశం! మానవుల పాపవిముక్తికి రక్షణకూ ఆయన యాజకత్వము పునాది వంటిది. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు కాకపోయి ఉంటే రక్షణ భాగ్యము, రక్షణ కార్యము దేవుని రక్షణ ప్రణాళిక ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు! ఆయనే ముక్తికి మార్గము! ఆయన లేకపోతే రక్షణ అనేదే లేదు! పాపములకు విముక్తి అనేదే లేదు!

 

     21 వచనంలో ఈవిధంగా క్రీస్తుయేసు పాతదానికంటే మరీ శ్రేష్టమైన నిబంధనకు పూచీదారుడు అయ్యారు అంటున్నారు. 22లో ఆయన పశ్చాత్తాపపడడు అంటున్నారు. కారణం ఒకసారి అలా చేసి దానిని మార్చినట్లు మరోసారి మార్చరు దేవుడు! ఇది స్థిరమైన నిశ్చయం కాబట్టి- ఆయన ఇక దీనిని మార్చరు! అలాంటి స్థిరమైన దృఢమైన నిబంధన ఆధారంగా యేసుక్రీస్తుప్రభులవారు యాజకుడు అయ్యారు అంటున్నారు. హెబ్రీ 8:613 లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు పౌలుగారు. దయచేసి ఒకసారి దానిని చదవండి.

 

   ఇక 2325 వచనాలలో అదే విషయాన్ని అనగా లేవీగోత్రపు వారి/ఆహారోను యాజకత్వము కంటే యేసుక్రీస్తుప్రభులవారి యాజకత్వము రకంగా శ్రేష్టమైనదో మరో కోణంలో చెబుతున్నారు. ......

23. మరియు యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని

24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.

25. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

 

భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి.

1. ఆహరోను యాజకత్వము మారిపోయే యాజకత్వము కారణం వారు మానవులు కాబట్టి చనిపోతూ ఉంటారు. అందువలన అనేకులు.

2. క్రీస్తుయేసు యాజకత్వం మార్పులేనిది. కారణం ఆయన మార్పులేని వాడు. మరణమును జయించి లేచి జీవించుచున్నవాడు కాబట్టి మార్పులేని స్థిరమైన ఎల్లప్పుడూ ఉండే యాజకత్వము!

 

     యాజకులు అనగా ఆహారోను గోత్రపు వారైన యాజకులు చనిపోతూ ఉంటారు కాబట్టి వారు అనేకులు అంటున్నారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ధర్మశాస్త్రము వచ్చిన దగ్గరనుండి దేవాలయం పడగొట్టబడే వరకు అనగా క్రీ.. 70 వరకు ఇంతవరకు 80మంది కంటే ఎక్కువమంది ప్రధాన యాజకులుగా ఉన్నారుకాని యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయి లేచిన వారు కాబట్టి క్రీ.. ౩౦ లో ప్రారంభమైన ప్రధాన యాజకత్వము సుమారు 2000 సంవత్సారాలు గడుస్తున్నా మారలేదు. మారదు! శాశ్వతమైనది. స్థిరమైనది! కాబట్టి ఈయన శాశ్వతంగా ప్రజలను విముక్తి చేయగలరు!

యాజకధర్మం క్రింద మార్పులేని దేవుడు అబద్దమాడజాలని దేవుడు నిన్ను నన్ను యాజకధర్మంలో యాజకులుగా ఉండటానికి పిలుస్తున్నారు. వచ్చి నా కాడిని మోయండి. సమస్తజనులను శిష్యులుగా చేయండి అంటున్నారు. ప్రియ చదువరీ! నీవు సిద్దమా??!!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*8 భాగం*

 

హెబ్రీ 7:2325

23. మరియు యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని

24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.

25. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

 

           (గతభాగం తరువాయి)

 

ఇక 25 వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నారు- హెబ్రీ పత్రిక ముఖ్యవిషయం కూడా దీనినే తెలియజేస్తుంది కారణం చేత ఆయన తనద్వారా దేవుని దగ్గరకి వచ్చేవారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరమూ జీవించుచున్నాడు గనుక వారిని *సంపూర్ణముగా* రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు.

చూడండి మొదటిది విజ్ఞాపనము మరియు మధ్యవర్తిత్వము;

రెండు: సంపూర్ణముగా రక్షించువాడు. పరిపూర్ణత కలుగజేయువారు. ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయిందో ఈయన ద్వారా సంపూర్ణ రక్షణ సాధ్యమయ్యింది. మరియు రక్షణ పొందిన వారికోసం మధ్యవర్తిత్వము చేయడమే కాకుండా వారికోసం విజ్ఞాపనం చేస్తున్నారు. యాజకుల పని అదే! వారి పాపముల కోసం బలి అర్పించి రక్తాన్ని బలిపీటం మీద చిందించి వారికోసం వారి పాపవిముక్తి కోసం ప్రార్ధించడం! ఈయనైతే తనసొంత రక్తాన్ని చిందించడమే కాకుండా తండ్రి కుడి పార్శమున ఆశీనుడై మనకోసం తన దగ్గరకు వచ్చిన వారందరి కోసం విజ్ఞాపనం చేస్తున్నారు.

 

శాశ్వతంగా లేక సంపూర్ణంగా విడుదల చేయగలరు అనగా కేవలం కాలంలోనే కాదు నేడు కూడా ఆయన చిందించిన రక్తపుధార కారుతుంది. ఊట మునిగి ఆయనే నిజమైన దేవుడని అంగీకరించి పశ్చాత్తాప పడి వచ్చి అడిగితే ఊటలో మునిగితే రక్షణ పొందుతారు. ఊట అనంత యుగాలకు కూడా సరిపోతుంది. అయితే గమనించాలి *తనద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారిని మాత్రమే రక్షిస్తారు*. విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బలియాగం అందరికోసం చేయబడినా రక్తం అందరి కోసం కార్చబడినా ఎవరైతే తనద్వారా దేవుని యొద్దకు వస్తారో వారినే దేవుడు రక్షిస్తారు!!! అదంతే!

 

దీనిద్వారా 1) దేవుని దగ్గరకు చేరటానికి యేసే ఏకైక మార్గమని తెలుస్తుంది యోహాను 14:6 

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

 

2) మానవునికి దేవునికి ఏకైక మధ్యవర్తి ఏసే అని తెలుస్తుంది.

1తిమోతి 2:51

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

) సమస్త మానవాళి పాపానికి ఒక్కటే బల్యర్పణ అని తెలుస్తుంది

హెబ్రీయులకు 7: 28

ఈయన ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

హెబ్రీయులకు 9: 28

ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

హెబ్రీయులకు 10: 10

యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.

 

1పేతురు :18

18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

19. ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను

 

ఇక కేవలం తనను అంగీకరించిన వారిని మాత్రమే రక్షిస్తారు అని తెలుస్తుంది.

 

  ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనం చేయడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నారు అంటున్నారు. ఆయన ఎప్పటికీ జీవిస్తున్నారు కాబట్టి అంతేకాకుండా తండ్రి ప్రక్కనే కూర్చుని విజ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి శాశ్వత పరిష్కారం దొరికిపోయింది.

హెబ్రీ 9:24

అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.

 

1యోహాను 2:1

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది(ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు.

 

రోమా 8:34

శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

 

కాబట్టి ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో నిజమైన మార్పు కలిగి, ఆత్మానుసారమైన జీవితం, పవిత్రమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం కలిగి జీవిస్తారో వారు క్రీస్తుమూలంగా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. లోకంలో చనిపోయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రభువుతోనే రక్షణ కలిగిన ఆత్మీయస్థితిలో జీవిస్తూ ఆయనతోనే ఉంటారు. రోమా 5:910

9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

 

భూమిపై ఉనప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు తన ప్రజలకోసం ఎలా నిరంతరమూ ప్రార్ధన చేస్తుండేవారో పరలోకలో కూడా అలాగే ఆయన ప్రార్ధనలు చేస్తున్నారు.

చూడండి యోహాను 17 అధ్యాయం మొత్తం;

లూకా 22:32

నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.

 

లూకా 6: 12

దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

 

కాబట్టి ఆయన పరలోకంలో ఉంటూ విజ్ఞాపనలు చేస్తుండే ప్రధాన యాజకుడు కాబట్టి విశ్వాసులందరినీ అనగా ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో నిజమైన మార్పు కలిగి ఆత్మానుసారమైన జీవితం పవిత్రమైన జీవితం సాక్షార్ధమైన జీవితం కలిగి జీవిస్తారో వారినందరినీ మహిమలోనికి పరిపూర్ణత లోనికి తీసుకునిపోగలరు!

హెబ్రీ 2:10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 

వారియొక్క విషమపరిస్థితిలలో సహాయం చేయగలరు. హెబ్రీ 2:18

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

వారిని అంతము వరకు కాపాడగలరు, నమ్మకం/ విశ్వాసం కోల్పోకుండా చేయగలరు. 1కోరింథీయులకు 1: 8

మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

 

మరి ఇలాంటి ప్రధాన యాజకున్ని కలిగిన నీవు నేను ధన్యులము!

ఆయన నీకోసం నాకోసం విజ్ఞాపన చేస్తున్నారు. ఒకవేళ నీలో ఆయనకు ఆయాసం కలిగించేవి ఆయనకు నచ్చనివి ఉంటే ఒప్పుకుని విడిచిపెట్టి క్షమాపణ వేడుకో!

ఈయన మనకు సరిపోయిన వారు. హెబ్రీయులకు 7: 26

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)

 

మరి ధన్యత నీవు కాపాడుకో గలుగుతున్నావా ప్రియ చదువరీ!

దైవాశీస్సులు!

 

 

 

 

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*9 భాగం*

హెబ్రీ 7:2628

26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)

27. ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,

28. ఈయన ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగాలలో లేవీ/ఆహారోను యాజకత్వము  కంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము విధంగా గొప్పదో చూసుకున్నాం! భాగంలో కూడా దానినే మరో కోణంలో చెబుతున్నారు.

 

ప్రియులారా! 26 వచనం చూసుకుంటే యేసుక్రీస్తుప్రభులవారి ప్రత్యేకతలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఒకసారి ఇదేవచనాన్ని స్టడీబైబిల్ నుండి చూసుకుందాం! .....

ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు, ఆకాశాలకంటే ఉన్నతుడైనవాడు.

 

చూశారా ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు లేక సరిపోయినవాడు! ఎలా తగినవాడు సరిపోయినవాడు అంటే దానికి కొన్ని కారణాలు ఇంకా ఆయన గుణగణాలు (characteristics) చెబుతున్నారు.

మొదట ఆయన పవిత్రుడు లేక పరిశుద్ధుడు.

రెండు ఆయన నిర్దోషి.

మూడు కళంకం లేనివాడు లేక నిష్కల్మషుడు!

నాలుగు పాపులలో చేరక ప్రత్యేకమైనవాడు!

ఐదు ఆకాశమండలము కంటే హెచ్చైనవాడు అనగా ఆకాశమండలం కంటే ఎత్తైన మహోన్నతమైన గుణగణాలు, వ్యక్తిత్వం కలవాడు అని అర్ధము!

 

ఇప్పుడు చెప్పండి వారికి అనగా పాత నిబంధన నియమించిన యాజకులకు క్రొత్త ప్రమాణము వలన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుప్రభులవారికి ఎంత తేడా కనిపిస్తుందో!!! చూడండి ఎందుకు ఇట్టి ప్రదానయాజకుడు మనకు సరిపోయినవాడు లేక తగినవాడు అన్నారో!!

 

యేసుక్రీస్తుప్రభులవారు వ్యక్తిగతంగా యాజకుల కంటే గొప్పవాడు. మనకు తగినవాడు. పాతనిబంధన యాజకులలో ఇలాంటివారు ఎవరూ కనబడటం లేదు. ఆయన లోపం లేని వాడు. పాపం లేనివాడు. పవిత్రుడు! ఇతర యాజకులు చేసినట్లు తన స్వంత పాపాలు కోసం మొదటగా బలి అర్పించి తర్వాత మిగిలిన వారికోసం బలి అర్పించలేదు కారణం ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేసిన దమ్మున వాడు! యోహాను 8:46; పాపము చేయలేదు నిర్దోషమైన వాడు కాబట్టి ధైర్యంగా సవాలు విసిరారు ఆయన! సవాలుకరమైన జీవితం జీవించిన వాడు ఆయన! ఇక మిగిలిన యాజకులు మొదటగా తమ పాపములకోసం బలి అర్పించుకోవాలి తర్వాత మిగిలిన ప్రజలకోసం బలి అర్పించి బలి రక్తము తీసుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. ఈయనైతే తన తనను తానే అర్పించుకుని తన సొంత పవిత్రమైన రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఒక్కసారే అర్పణ అర్పించి మానవుల అందరి పాపములను తీసివేశారు. ఇంకా మిగిలిన యాజకులు బలహీనులు అయితే ఈయన పరమ బలవంతుడు! వారు మానవులు! ఈయన దైవ కుమారుడు! దేవుడు! అందుకే ఈయన మనకు సరిపోయిన వాడు! తగినవాడు అంటున్నారు పౌలుగారు!

 

చూడండి ఆయన పవిత్రుడు లేక పరిశుద్ధుడు:

ప్రకటన :7

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా

 

యోహాను 8: 46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

 

ఇక ఆయన *నీతిపరుడు*: పిలాతుకు ఆయనలో దోషం అనేది ఏదీ కనబడలేదు. యోహాను 18:38

అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి *అతనియందు దోషమును నాకు కనబడలేదు*;

 

యోహాను 19:4

పిలాతు మరల వెలుపలికి వచ్చి *ఇదిగో ఈయన యందు దోషమును నాకు కనబడలేదని* మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

 

పిలాతు బార్య చెప్పినది వినండి....మత్తయి 27: 19

అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య *నీవు నీతిమంతుని జోలికి పోవద్దు*; ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.

 

1పేతురు 2:22

*ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను కపటమును కనబడలేదు*.

 

1పేతురు :18

ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు *నీతిమంతుడైన క్రీస్తు* శరీర విషయములో చంపబడియు

 

కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు పవిత్రుడు నీతిమంతుడు నిర్ధోషి నిష్కలంకుడు!!!

 

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*10 భాగం*

 

హెబ్రీ 7:2628

26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)

27. ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,

28. ఈయన ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

 

       (గతభాగం తరువాయి)

 

పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు*: యేసుక్రీస్తు ప్రభులవారు భూమిపై జన్మించి జీవించిన వారు. పాపుల మధ్య జీవించారు. కాని పాపము ఆయనకు అంటలేదు! చేప సముద్రంలో ఉప్పునీటిలో జీవిస్తున్న చేపకు ఉప్పు ఎలా అంటడం లేదో అలాగే యేసయ్యకు లోకంలో ఉన్నప్పుడు పాపము ఆయనకు అంటలేదు. అంటనివ్వలేదు! అది ఆయన వ్యక్తిత్వం! పాపులను అంటకుండా మడి కట్టుకు తిరగలేదు. పాపులతోనే తిరిగారు ఆయన! వారి పట్ల ప్రేమభావం చూపించారు. వారికోసమే మరణించారు ఆయన! నేను నీతిమంతులను పిలువరాలేదు! పాపులనే పిలువవచ్చితిని అని చెప్పారు. మార్కు 2:17

మత్తయి 11:19

మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి(అనేక ప్రాచీన ప్రతులలో-దాని పిల్లలనుబట్టి అని పాఠాంతరము) తీర్పుపొందుననెను.

 

లూకా 15:2

పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

 

రోమా 5:8

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

 

1పేతురు :18

ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

 

వచనాలు అన్నింటి బట్టి ఆయన పాపులతోనే తిరిగారు గాని ఆయనకు పాపం అంటలేదు. ఆయనలో బ్రష్ట స్వభావం అనేది లేనేలేదు! అందుకే ఆకాశమండలం కంటే హెచ్చైన వాడు అని ఆయన వ్యక్తిత్వం కోసం రాస్తున్నారు పౌలుగారు.

హెబ్రీ 1:

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.

 

హెబ్రీ 8:2

మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

 

మరి ఇతర ప్రధాన యాజకులు ఇలా జీవించలేదు! ఇలా చెయ్యలేదు! కాబట్టే ఈయన మనకు సరిపోయిన వారు! తగినవారు!

 

ఇక మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మిగిలిన యాజకుల లాగా ప్రతీ సంవత్సరం చేస్తూ ఉండలేదు. ఒక్కసారే యాగము చేసి ముగించేశారు. దీనికోసం గత భాగం లో చూసుకున్నాం......

 

సమస్త మానవాళి పాపానికి ఒక్కటే బల్యర్పణ అని తెలుస్తుంది

 

హెబ్రీయులకు 7: 28

ఈయన ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

 

హెబ్రీయులకు 9: 28

ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

 

హెబ్రీయులకు 10: 10

యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము.

 

1పేతురు :18

18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

19. ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను

 

ఇక తర్వాత విషయం 27 వచనం: ధర్మశాస్త్రం బలహీనమైన లేక బలహీనతలు గల మనుష్యులను యాజకులుగా నియమించింది గాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం- అనగా ధర్మశాస్త్రం నిష్ప్రయోజమైనది అని తెలిసిన తర్వాత వచ్చిన ప్రమాణ వాక్యముతో గల యాజకత్వము తిన్నగా దేవుని కుమారున్నే యాజకుడుగా నియమించింది. ఈయన దైవ మానవుడు! అందుకే భూమి మీద జీవించినప్పుడు మానవుల సాధక భాదలు ఎరిగిన వాడు- పరలోకంలో ఉన్నవాడు కనుక పరలోకానికి వెళ్ళాలంటే రకమైన గుణాలు కావాలో తెలిసిన వాడు కాబట్టే మనకొరకు ఆయన మధ్యవర్తిత్వం చేయతగిన వాడు! ప్రదానయాజకుడుగా సరిపోయిన వాడు!

 

తర్వాత అంటున్నారు: ఈయన సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిందిమరికొన్ని ప్రతులలో సంపూర్ణసిద్ధి పొందిన దేవుని కుమారుని యాజకునిగా నియమించెను అని ఉంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను- హెబ్రీ పత్రిక ముఖ్య అంశం: యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు! అయితే ప్రధాన యాజకత్వములో మూలాంశము: పరిపూర్ణత- సంపూర్ణత- సంపూర్ణసిద్ధి! ఇది ప్రతీ విశ్వాసి పొందుకోవాలని దేవుని ఆశ! మొదటగా యేసుక్రీస్తు ప్రభులవారు పొందుకున్నారు. తర్వాత మనలను కూడా పొందుకోవాలని ఆశిస్తున్నారు.

హెబ్రీ 2:10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 

హెబ్రీ 5:9

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

 

అందుకే హెబ్రీ 6:2 వచనాలలో మన అందరికీ చెబుతున్నారు- పాత మూల పాటాలు వదిలి సంపూర్ణత పొందుకొనేలాగా ప్రయత్నం చేయండి అంటున్నారు.

 

మరి ఇతర యాజకులు కూడా సంపూర్ణసిద్ధి పొందుకోలేదు. కేవలం యేసుక్రీస్తుప్రభులవారు మాత్రం పొందుకున్నారు. మనలను కూడా పొందుకోమంటున్నారు.

 

మరి నీవు ప్రయత్నం చేస్తున్నావా ప్రియ సహోదరి/ సహోదరుడా!

ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు! తగినవాడు!

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు).

అలాగే మనం కూడా పవిత్రమైన జీవితం, నిర్ధోషమైన నిందారహితమైన జీవితం, పాపములేని జీవితం కలిగి ప్రత్యేకమైన జీవితం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మూర్ఖులైన తరమువారికి వేరై రక్షణ పొందుడని పేతురు గారు ఆత్మావేశుడై పలుకుతున్నారు. అపొ 2:40;

 

అట్టి ప్రధానయాజకుని పొందుకుని అట్టి కృపను మనమందరం పొందుకుందుము గాక!

 

ఆమెన్!

 

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*11 భాగం*

 

హెబ్రీ 2:1418

14. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

15. జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

16. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగాలలో హెబ్రీ 7 అధ్యాయం నుండి లేవీ/ఆహారోను యాజకత్వము  కంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము విధంగా గొప్పదో చూసుకున్నాం! భాగంలో 2 అధ్యాయం నుండి కూడా దానినే మరో కోణంలో చెబుతున్నారు. దానినే ధ్యానం చేసుకుందాం.

 

  ప్రియులారా! భాగంలో యేసుక్రీస్తుప్రభులవారు అసలు మానవుడుగా పుట్టటానికి కారణం ఏమిటో చాలా స్పష్టముగా చెబుతున్నారు భక్తుడు ఆత్మావేశుడై!

 

*ఇంతకీ ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు భూలోకానికి ఎందుకు వచ్చారు*?

మానవుల పాపములనుండి విడుదల చేయడానికి-

 

*పాపము ఎలా పోతుంది?*

బైబిల్ ప్రకారం గాని, మిగతా మత గ్రంధాలు గాని రక్తము చిందించకుండా మానవుల పాపముపోదు కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు

తన రక్తమును చిందించి బలియాగము చేయడానికి వచ్చారు! హెబ్రీ 9:22;

 

*మరి ఆయనే ఎందుకు రావాలి? కోడె మేక పశువుల రక్తము చిందించి పాప విముక్తి పొందుకోవచ్చు కదా*!!!

పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారం దానిని ప్రయత్నించి విఫలమైపోయారు కాబట్టి తానే రావలసి వచ్చింది!

 

*ఇంతకీ మానవుడిగానే ఎందుకు రావాలి*???

దానికి జవాబుగా హెబ్రీ 1418 వచనాలున్నాయి.

 

మొదటగా: మానవులు రక్తమాంసాలతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్తమాంసాలతో రావలసి వచ్చింది. 14 వచనం.

 

రెండవది: మానవులను సాతానుడు తన బలముతో అనగద్రొక్కుతూ నరకానికి/మరణానికి తీసుకుపోతున్నాడు కాబట్టి సాతానుని మరణమును జయించటానికి మానవుడుగా వచ్చారు. 14 వచనం!

 

మూడవది: మానవులను అర్ధం చేసుకోడానికి, వారి సాధకభాదలు తెలుసుకోడానికి ఆయనకూడా మానవుడిగా రావలసి వచ్చింది. 15--17  వచనం!

 

నాల్గవది: అన్ని విషయాలలో తన సహోదరులను (అనగా అబ్రాహము సంతానము మరియు మనము-) పోలి ఉండాలని నమ్మకమైన ప్రధాన యాజకత్వము- మార్పులేని ప్రధాన యాజకత్వము జరిగించాలి అని మెల్కీసెదెకు క్రమంలో మానవుడుగా వచ్చారు! 17 వచనం!

 

ఐదవది తాను మొదట శోధింపబడి అసలు శోధన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని- ఎలా శోధనను జయించాలో ప్రజలకు నేర్పించాలి అని ఆయనకూడా భూలోకంలో మానవుడిగా పుట్టి మనలాగే శోదింపబడి మనకు మార్గదర్శిగా ఉన్నారు. 18 వచనం!

 

  ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం! మొదటగా పిల్లలు రక్తమాంసాలతో ఉన్నారు కాబట్టి- పిల్లలు అనగా అబ్రాహము సంతానమే కాకుండా సమస్తమైన ప్రజలు కూడా ఆయన పిల్లలే! ఒకసారి 2:10 చూసుకుందాం.......

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 చూడండి అనేకులైన కుమారులు అనగా సమస్త మానవాళి అని అర్ధం! అనగా సమస్తమైన మానవులను పాప విముక్తులను చేయడానికే ఆయనకూడా రక్తమాంసాలతో భూలోకానికి రావలసి వచ్చింది. ఒకసారి క్రింద రిఫరెన్సులు చూడండి

 

మత్తయి 1:2021

21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

 

లూకా  2:10,11

10. అయితే దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;

11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

 

లూకా సువార్త 2:5,6,7

5. గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.

6. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక

7. తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

 

యోహాను 1:14

వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని ( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

యోహాను 6:5358

53. కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.

54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.

56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

58. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము; పితరులుమన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను

 

గమనించాలి ఆయన భూమి మీదకు రావడంలో మూడు ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి.

మొదటగా  మానవుల కోసం మరణించడం:

మత్తయి 16:21

అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా

 

మత్తయి 20:28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

యోహాను 10:1718

17. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఆజ్ఞ పొందితిననెను.

 

రెండవది: మరణించడం ద్వారా సైతానుని నాశనం చెయ్యడం, తన ప్రజలను సాతాను నుండి మరణం నుండి విడిపించడం:

 

మూడవది: అపవాది / సాతానుడు మరణశక్తి గలవాడు, కాబట్టి మరణ భయం పోగొట్టి- మానవులను మరణబంధకాలనుండి విడుదల కలిగించడానికి!

 

ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి- నూతన నిబంధనలో రెండు అదృశ్యశక్తులు లేకా అదృశ్య రాజ్యాలు ఒకదానికొకటి వ్యతిరేఖంగా పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని రాజ్యం! రెండు సాతాను రాజ్యం! దేవుని రాజ్యాన్ని పాడుచేయడానికి సాతాను ఆదినుండి అనగా వాడు పరమునుండి త్రోయబడిన రోజు దగ్గరనుండి నేటి వరకు ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో మొదటగా ప్రజలకు శోధనలు కలిగించి దేవుని నుండి దూరం చేద్దామని ప్రయత్నం చేస్తాడు. చివరికి యేసుక్రీస్తుప్రభులవారుని కూడా శోధించాడు వాడు మత్తయి 4 అధ్యాయంలో! తర్వాత అనేకమైన ప్రలోభాలకు గురిచేసి దేవుని మార్గమునుండి తొలగించాలి అని చూస్తుంటాడు. రోగాలు/ వ్యాదులు కలిగిస్తూ ఉంటాడు. చివరిగా మరణభయం కలిగిస్తూ ఉంటాడు. అన్ని రకాలైన శోధనలనుంది మానవులను విడిపించటానికి, ఇలాంటి శోధనలు కలిగినప్పుడు ఎలా జయించాలో మొదట ఆయన జీవించి చేసి చూపించి- మీరు కూడా ఇలాగే జీవించాలి అని చెప్పి వెళ్ళారు యేసుక్రీస్తుప్రభులవారు! అందుకే ఆయన మానవుడిగా వచ్చారు. ఆయన దైవమానవుడు!

 

(ఇంకాఉంది)

 

 

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*12 భాగం*

హెబ్రీ 2:1418

14. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

15. జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

16. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

           (గతభాగం తరువాయి)

 

గమనించాలి: వాడు మొదటగా ఆదాము హవ్వలను పాపములో పడవేయడం ద్వారా మరణాన్ని లోకంలోకి తీసుకుని వచ్చాడు. ఆదికాండం ౩వ అధ్యాయం. అప్పటినుండి పాప మరణ రాజ్యమును స్థాపించి దానిలో మానవులను పడద్రోసి ఏలుతున్నాడు. 2తిమోతి 2:26.

అలాచేసి వారున్న ఆత్మ సంబంధమైన మరణ స్తితి నుండి వారు తప్పించుకోకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాడికి చంపేందుకు కూడా అధికారం ఉంది. యోబు 2:6

అయితే ఇప్పుడు యేసుక్రీసుప్రభులవారు మనిషి స్థానంలో చనిపోవడం ద్వారా వారికి పాపక్షమాపణ- ఆధ్యాత్మిక జీవం కలగటానికి, వారు మరణం నుండి అనగా ఆత్మీయ మరణం నుండి పూర్తిగా తప్పించడానికి మార్గం సిద్దం చేశారు దేవుడు!

 

యోహాను 5:24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

యోహాను 11:2526

25. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

 

1కొరింథీ 15:54-57

54. క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

55. మరణమా, నీ విజయమెక్కడ? మరణమా, నీ ముల్లెక్కడ?

56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

 

2తిమోతి 1:10

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచ బడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

అలా చేయడం వలన సైతానుని వాడి రాజ్యాన్ని నాశనం చెయ్యడం అనేవి రెండూ జరిగాయి.

యోహాను 12:31

ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడును;

 

ప్రకటన 20:10, 13,14,

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; అగ్నిగుండము రెండవ మరణము.

 

సైతానుగాడు మానవులను తన దాస్యంలో ఉంచుకోడానికి వాడు ఉపయోగించే ఆయుధం- మరణభయం!! దీనిని బాగా గమనించాలి! భయం ద్వారా మానవులు మామూలు పరిస్తితులలో వారు చేయకూడని/ చేయకూడదు అని అనుకొనే పనులను వారు సైతాను ప్రోద్బలంతో చేస్తుంటారు. రోమా 7:15-25  ప్రకారం వారు వాటిని చెయ్యాలని అనుకోరు. గాని చేసేస్తుంటారు.

15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.

18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.

19. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.

20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.

21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.

 

కాబట్టి ఇప్పుడు పాపానికి మరో పాపం కలుపుకుని మరణభయాన్ని పెంచుకుంటారు. ఇది మనుషులను ఒకరకమైన స్తితిలోకి తీసుకుని పోతుంది. అలా సాతాను బానిసలుగా మారిపోతుంటారు మానవులు! మంచి మార్గంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటే మనిషి గొప్ప చేసేస్తున్నావు గాని ఆరోజు అలా చేశావు, ఇలా చేశావు అని చెప్పి- మానవుణ్ణి అపరాధ భావంతో కృంగిపోయేలా చేస్తాడు వాడు!

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు ఇలాంటి స్థితిలో ఉన్న మానవులను తనను అంగీకరించిన విశ్వాసులను మరణభయం నుండి- సైతానుడి ఇతర దాస్యబందాల నుండి విడుదల కలుగజేశారు.

 

యోహాను 8:32,34,36

32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

34. అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

 

రోమా  6:17,18

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

 

రోమా  8:2,15,20,21

2. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

15. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,

21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.

 

    ప్రియ స్నేహితుడా! నీవు ఒకవేళ ఇలాంటి పరిస్తితిలో ఉన్నావా? కంగారుపడకు! యేసే నీకు మార్గం! యేసే నీ ప్రశ్నలకు జవాబు! యేసురక్తమును ఆశ్రయిస్తే నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రునిగా చేసి- ప్రతి దాస్యమునుండి విడుదల చేస్తుంది. 1 యోహాను 1:7;

 మరి నీవు వస్తావా? ఆయన రక్తము ఇప్పటికి కల్వరి సిలువలో ప్రవహిస్తుంది. ఆయనకు జాతి మత లింగ బేధము లేదు! ఎవరినైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకును సమస్త జనులార నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. మత్తయి 11:28;

 నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము! పరలోకం చేరాలంటే మరో మార్గం లేదు అంటున్నారు. యోహాను 14:6;

మీ పాపములనుండి విడుదల కలగజేసి మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు.

మరి వస్తావా?

నేడే రక్షణ దినం!

నేడే అనుకూల సమయం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*13 భాగం*

 

హెబ్రీ 2:1418

14. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

15. జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

16. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

           (గతభాగం తరువాయి)

     

     ఇక అబ్రాహాము సంతానమును అనగా యేసుక్రీస్తుప్రభులవారు మనష్యులకు సహాయం చేసేటందుకు దేవుడు మానవుడయ్యారు. దేవదూత కాలేదు. అబ్రాహాము సంతానము అనగా కేవలం యూదులే కాదు క్రీస్తులో నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరు కూడా అబ్రాహము సంతానమే! లూకా 19:9;

అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నట్లు అబ్రాహాము గారివలె దేవుని నమ్మినవారు కూడా అతని ఆధ్యాత్మిక సంతానమే!

 

రోమా 4:11,12,16,17,18

11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.

12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు గురుతు పొందెను.

16. హేతువుచేతను వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

 

గలతీ :79

7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

8. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగాచూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

 

ఇక 17 వచనంలో తన సోదరుల వంటివారుగా అంటున్నారు. ఇంకా ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యక్రములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయాలలో తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను అంటున్నారు. ఇక్కడసోదరుల వంటివాడు అనగా సహోదరుల వంటి పాపుల వంటివాడు అని ఎంతమాత్రము కాదు. లేదా బ్రష్ట స్వభావము గలవాడు అని కూడా కాదు!

 

హెబ్రీ 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

 

హెబ్రీ 7:26

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (లేక, తగినవాడు)

 

లూకా 1:35

దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

 

యోహాను 8:46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

 

2కొరింథీ 5:21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

1పేతురు 2:22

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను కపటమును కనబడలేదు.

 

అంతేకాకుండా ఆయన లోకంలో ఉన్నప్పుడు అనగా లోకంలో మనిషిగా ఉన్నప్పుడు దేవుడు కాకుండా మానవుడుగానే ఉండిపోయారు అని కాదు! హెబ్రీయులకు 1:6,8

6. మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.

8. గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.

 

ఇదేవిషయం కీర్తన 110:15 చూసుకుంటే చాలా వివరంగా ఉంది.

1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

2. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

5. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

 

దీని అర్ధం ఏమిటంటే ఆయనకు నిజమైన రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావము- నిజమైన దేవత్వము, నిజమైన దేవస్వభావము రెండు ఉన్నాయి! ఆయనకూడా మనలాగే బాధలను, విషమ పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. ఉదాహరణకు: కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడే యోసేపు గారు చనిపోయారు. అంతేకాకుండా ఆయన చిన్నతనంలో ఆయన యోసేపుగారితో పాటు అడవులకు వెళ్లి చెట్లు నరికి కలపను ఆయనే మోసుకొచ్చి తన తండ్రికి సహాయం చేసేవారు. తండ్రి చనిపోయాక కుటుంబ పోషణభారం మొత్తం తనే మోసి, తమ్ముళ్ళను ప్రయోజకులను చేసి, వారికి తమ తండ్రి నేర్పించిన వృత్తి నేర్పించి చెల్లెళ్ళకు వివాహం చేసి- అప్పుడు సేవ ప్రారంభించారు. ఆయనకు కూడా ఆకలిభాదలు కష్టసుఖాలు- ఆటుపోటులు అన్ని తెలుసు!

అందుకే పౌలుగారు ఈయన మనకు సరిపోయిన వారు, తగినవారు అంటున్నారు.

 

సరే, ఇలా మనలాగే సమానుభావం వహించటానికి రెండు కారణాలున్నాయి! మొదటిది విమోచన కార్యం నెరవేర్చడం!

రెండవది: తన ప్రజలకోసం ప్రదానయాజకత్వం చేయడం!

 

రోమా  3:24,25,26

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

    ఇక నమ్మకమైన ప్రధాన యాజకుడు కోసం గొప్ప విషయాలలో ఒకదానిని పరిచయం చేస్తున్నారు. కారణం ఈయన నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రికలో అంటున్నారు- మోషే ఏలాగు తన ఇంటివారిలో నమ్మకమైనవాడో ఈయనకూడా దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు అంటున్నారు. ఇక్కడ నమ్మకమైన ప్రదానయాజకుడు అంటున్నారు.

 

హెబ్రీయులకు 3: 2

దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.

 

హెబ్రీ 4: 14

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

 

హెబ్రీయులకు 5: 9,10

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

 

హెబ్రీ 6:20

నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

 

హెబ్రీ 7:26

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)

 

హెబ్రీ 8: 2

మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

 

హెబ్రీ 9:11,11

అయితే క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా,

మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

 

హెబ్రీ 10:21

దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

 

బైబిల్ లో ఎక్కడైనా యాజకుడు అని వ్రాయబడితే అతడు ప్రజల పక్షముగా దేవునికి బలులను అర్పించేవాడు అని అర్ధమవుతుంది. దేవుని సన్నిధిలో లేక మందిరములో లేక దేవాలయములో పనులను చూసుకొనేవాడు. ఇంకా దేవుని ఎదుట తన ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించేవాడు అని అర్ధం!

ప్రధాన యాజకుడు అనగా యాజకులు అందరికీ నాయకుడు! అతి పరిశుద్ధ స్థాలములోనికి వెల్లదగిన వాడు!

కారణం అతనొక్కడే చేయదగిన కొన్ని ప్రత్యేకమైన విధులున్నాయి

 

హెబ్రీ 5:1

1. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.

2. తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.

3. హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.

 

హెబ్రీ 9:7

సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

 

ఇంకా నిర్గమ 16 అధ్యాయం!

 

అయితే ఇప్పుడు దేవుడు పాత నిబంధన- ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, రద్దుచేశారు. ఇప్పుడు భూమిమీద ఎక్కడా ప్రధాన యాజకుడు లేడు! కారణం పరలోకంలో మనకు నిత్యమూ జీవించే ఒకేఒక ప్రధానయాజకుడు ఉన్నారు మనకు! ఇక ఇప్పుడు ఆయన విశ్వాసులందరూ భూమి మీద దేవునికి అంగీకారమైన యాజకులు!

 

1పేతురు  2:5,9

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ప్రకటన 1:6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో-కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

యేసుక్రీస్తుప్రభులవారు నమ్మకమైన మరియు కనికరం గల ప్రధాన యాజకుడు. ఆయన మనుష్యుల పట్ల జాలి దయ చూపించేవాడు! తన సేవంతటిలో నమ్మకమైన వాడు!

 

ఇక 18 వచనం.   తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

హెబ్రీ 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

 

అలాగే మత్తయి 4 అధ్యాయం మొత్తం!

యేసుక్రీస్తుప్రభులవారి కి కూడా నీలాగే నాలాగే శ్రమలు వచ్చాయి. అయితే తన స్వార్ధం చూసుకునే వారైతే మానవుల కోసం భూలోకానికి వచ్చి సిలువ మరణం పొందకుండా తప్పించుకుని ఉండేవారు ఆయన! అలాగే సైతాను గాడి ప్రలోభాలకు పడిపోయి వాడికి మ్రొక్కి భాదలను తప్పించుకుని ఉండేవారు ఆయన! గాని ఆయన బాధలను అనుభవించడానికే సిద్ధమయ్యారు గాని సైతాను ప్రలోభాలలో పడిపోలేదు! అందుకే ఆయనకు సాతానుగాడి ప్రలోభాలు వాడి విధివిధానాలు మొత్తం తెలుసు! వాడి విధానాలు మానవుల హృదయాలలో/ మనస్సులలో రకంగా పనిచేస్తాయో కూడా తెలుసు! అందుకే శ్రమలను అనుభవించేటప్పుడు హృదయపూర్వకంగా మొర్రపెడితే దేవునికి భాధలు తెలుసు కాబట్టి ఆయన అర్ధం చేసుకుని వెంటనే సహాయం చేస్తారు.

 

మత్తయి 6:13

మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి (లేక-కీడునుండి) మమ్మును తప్పించుము.(కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది) అని ప్రార్థన చెయ్యమంటున్నారు.

 

1కొరింథీ 10:13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 

చూశారా మనం మొర్రపెట్టిన యెడల ఆయన మనకు శోధన తప్పించుకునే మార్గం చూపిస్తారు.

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు! నీవు ఎటువంటి కష్టాలలో ఉన్నా సరే నేడే మొర్రపెట్టు! ఆయన నీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరికినే ఆయన మీద అభాండాలు వేయకు! నమ్మకముగా కనిపెట్టు! ఆయనమీద విశ్వాసాన్ని వదలకు!

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*14 భాగం*

 

హెబ్రీ 3:16

1. ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.

2. దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.

3. ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును;(లేక, స్థాపింపబడును) సమస్తమును కట్టినవాడు(లేక, స్థాపించినాడు) దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,

4. ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థ ముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగాలలో హెబ్రీ 7, 2 అధ్యాయాల నుండి లేవీ/ఆహారోను యాజకత్వము  కంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము విధంగా గొప్పదో చూసుకున్నాం! భాగంలో ౩వ అధ్యాయం నుండి మోషే గారికంటే కూడా యేసుక్రీస్తుప్రభులవారు గొప్పవారు అని నిరూపిస్తున్నారు పౌలుగారు!

 

    అసలు మోషేగారికంటే యేసుక్రీస్తుప్రభులవారు గొప్పవారు అని నిరూపించడానికి అవసరం ఏమొచ్చింది? కారణం ఇశ్రాయేలు ప్రజలందరూ ధర్మశాస్త్రం రాసింది (దేవదర్శనంతో) మోషేగారు కాబట్టి ఆయన చాలా చాలా గొప్పవాడు అని వారి మనస్సులలో స్తిరపడిపోయి ఉంది. అందుకే మోషేగారి కంటే క్రీస్తుయేసు గొప్పవారు అని రుజువులు చూపిస్తున్నారు ఇక్కడ! అంతేకాకుండా మోషేగారు పాత నిబంధనకు- ధర్మశాస్త్రానికి ప్రతినిధి అయితే క్రీస్తు క్రొత్త నిబంధనకు- ప్రధాన యాజకత్వానికి గుర్తు! కాబట్టి పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ధర్మం గొప్పదని చెబుతున్నారు.

 

   గమనించాలి మూడవ అధ్యాయం- *ఇందువలన* అంటూ మొదలయ్యింది. పౌలుగారి పత్రికలలో అందుచేత- ఇందువలన- కాబట్టి- కాగా ... ఇలాంటి మాటలు వాడిన వెంటనే గొప్ప సత్యాలు చెప్పడం అలవాటు. ఇక్కడ కూడా గొప్ప సత్యం చెబుతున్నారు. అదేమిటంటే మనమందరం పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్దులం!!! కాబట్టి దానికి మూలాధారం- అపోస్తలుడు- ప్రధానయాజకుడు అయిన యేసు వైపు లక్ష్యముంచండి అంటున్నారు.

మొదటగా పరలోక సంబంధమైన పిలుపులో పాలుపంచుకున్నాం అంటున్నారు.

 

రెండవది యేసుక్రీస్తుప్రభులవారు అపోస్తలుడు- అనగా ఆది అపోస్తలుల కంటే ప్రధమ అపోస్తలుడు యేసుక్రీస్తుప్రభులవారు;

 

మూడవది: ప్రదానయాజకుడు! కాబట్టి ఈయన మీదనే మీరు లక్ష్యముంచాలి గాని మరి ఇతర విషయాల మీద లక్ష్యముంచకూడదు అంటున్నారు- కారణం నీకు కలిగింది పరలోక సంబంధమైన పిలుపు- కాబట్టి పైనున్న వాటినే లక్ష్యపెట్టండి గాని క్రింద నున్నవాటి మీద లక్ష్య పెట్టొద్దు అని మరోచోట చెబుతున్నారు.

సరే, దీనికోసం మరికొంచెం ఆలోచిద్దాం!

 

 అటువంటి పిలుపు కలిగి ఉన్నందుకు ఎలా ఉండాలి?

 

రోమా 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.

 

1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

2కొరింథీ 7:1

ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

 

గలతీ 5:1

స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

ఎఫెసీ 4:1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

 

కొలస్సీ 3:1,2,3

1. మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.

2. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

3. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.

 

ఇక పరిశుద్ద సహోదరులారా... అంటున్నారు! దీనికోసం ఆలోచిస్తే- హెబ్రీ 2:11-12. లో అంటున్నారు...

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచ బడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

12. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య(లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను.

 

అందుకే 2:17 లో సహోదరుల వంటి వాడు అయ్యారు అంటున్నారు......

17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

 

ఇక మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు- ప్రధాన యాజకుడు అయిన క్రీస్తుమీద లక్ష్యముంచుడి అంటున్నారు.. ఏమిటి ఒప్పుకున్నాము? యేసుక్రీస్తు ప్రభులవారు నీ సొంత రక్షకుడని- నీకు దేవుడని- ఆయన ద్వారానే పరలోకముందని నమ్మి ఒప్పుకుని బాప్తిస్మం పొందుకున్నావు కాబట్టి ఆయన మీదనే లక్ష్యముంచాలి.

 

అంతేకాకుండా మొదటగా ఆయన నీకు అపోస్తలుడు- అనగా పంపబడిన వాడు!

 దేనికోసం పంపబడ్డారు? నీ పాపములనుండి విడిపించటానికి పంపబడ్డారు!

 

ఎవరితో లేక ఎవరి ద్వారా పంపబడ్డారు? తండ్రియైన దేవుని నుండి పంపబడ్డారు.

 యెషయాలో దీనికోసం వ్రాయబడియుంది.

1. రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.

3. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

8. అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా .....

 

గమనించాలి బైబిల్ గ్రంధంలో ఇక్కడే యేసుక్రీస్తు ప్రభులవారు అపోస్తలుడు అని చెప్పబడింది. కొన్ని ప్రతులలో క్రీస్తు రాయభారి అని చెప్పబడింది.

 ఇంకా  హెబ్రీయులకు 10: 7

అప్పుడు నేనుగ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

 

హెబ్రీ 1:2

దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో- యుగములను) నిర్మించెను.

 

యోహాను 6:38,39

38. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

39. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

 

కాబట్టి మన మొదటి అపోస్తలుడు యేసుక్రీస్తుప్రభులవారు! మరి మిగిలిన వారిని అనగా శిష్యులను అపోస్తలులు అని ఎందుకు అంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారికి పేరే పెట్టారు కాబట్టి!....లూకా 6: 13

ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను.

 

 మరి వీరు దేనికోసం పంపబడ్డారు? సత్యాన్ని అందరికీ చాటి చెప్పడానికి పంపబడ్డారు!

 

ఇకప్రధాన యాజకుడు: హెబ్రీ 2:17

కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

 

కాబట్టి ఆయన అపొస్తలుడు మరియు ప్రధానయాజకుడు! ఆయన ప్రధమ అపొస్తలుడు కాబట్టి ఆయన బోధలోను, ఆది అపొస్తలుల బోధలో నీవు నేను నిలిచియుండాలి.

 

(ఇంకా ఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*15 భాగం*

 

హెబ్రీ 3:16

 

    (గతభాగం తరువాయి)

 

ఇక రెండవ వచనంలో మోషేగారి కంటే యేసుక్రీస్తుప్రభులవారు ఎలా గొప్పవారో చెబుతున్నారు.

 

మొదటగా  2. దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ..

ఇక్కడ నమ్మకత్వం- విశ్వసనీయత విషయంలో ఇద్దరూ ఒకేవిధంగా ఉన్నారు

సంఖ్యాకాండము 12:7

అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.

ఇది దేవదేవుడు స్వయంగా ఇచ్చిన స్టేట్ మెంట్!

 

యోహాను 8:2829

28. కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

29. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

 

యోహాను 17:4

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని.

 

ఇక్కడ ఇల్లు అంటే దేవుని ప్రజలు అన్నమాట! అందుకే మనమే ఆయన ఇల్లు అంటున్నారు!!!

 

ఇక మూడవ వచనంలో మరో లాజిక్ లేక ముఖ్యాంశం చెబుతున్నారు- మోషేగారి కంటే యేసయ్య ఎలా గొప్పవారో! ఏమిటంటే ఇంటికంటే దానిని కట్టించినవాడే గొప్పవాడు! కారణం దానికి డబ్బులు ఖర్చు పెట్టినవాడు, దానిని కట్టడానికి లేక కట్టించడానికి కష్టపడ్డవాడు కట్టించిన వాడు! కాబట్టి ఇంటికంటే కట్టినవాడు/ కట్టించిన వాడే గొప్పవాడు!

 

ఇక్కడ పౌలుగారి ఉద్దేశ్యం ఏమిటంటే మోషేగారు ఇంటిలో ఒక భాగమే తప్ప ఇంటిని కట్టించలేదు! అయితే దానిని కట్టించినది లేక కట్టినది యేసుక్రీస్తుప్రభులవారు! కాబట్టి ఆయనే గొప్పవాడు అని అర్ధం! అంతేకాదు మోషేగారి కంటే ఎక్కువ మహిమకు పాత్రుడు యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు!

 

ఇక 56 వచనాలలో మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- మోషేగారు నమ్మకముగా ఉన్నారు పరిచారకుడుగా లేక సేవకుడుగా! గాని యేసుక్రీస్తుప్రభులవారు కుమారుడుగా నమ్మకముగా ఉన్నారు అంటున్నారు. .....

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

దీనిని స్టడీబైబిల్ లో కూడా చూసుకుందాం!....

5  మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నది సేవకుడుగానే. అది తరువాత చెప్పబడేవాటికి సాక్ష్యంగా ఉంది.

6  క్రీస్తు అయితే నమ్మకంగా ఉన్నది కుమారుడుగానే తన సొంత ఇంటి మీదే. మనం అంతంవరకూ ఆశాభావం వల్ల కలిగే ధైర్యాన్నీ అతిశయాన్నీ గట్టిగా చేపట్టామంటే మనమే ఆయన ఇల్లు.

 

గమనించాలి దేవుని ఇంటిమీద అధికారిగా ఉన్న కుమారుడు ఇంటికి సేవకులు కంటే ఎంతో పై స్థానంలో ఉన్నారు. ఇక అక్కడ ముందు చెప్పబోవు సంగతులు- అంటున్నారు అంటే దేవుడు మోషేగారి ద్వారా వెల్లడిచేయబోయే సంగతులు లేక సత్యాన్ని గురుంచి చెబుతున్నారు.

 

ద్వితియోపదేశకాండము 18: 16

గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను *నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.*

ఇంకా అపొస్తలుల 3:22; 7:37;

 

హెబ్రీ 10:1

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

 

అధికారి లేక ఆయన యేసుక్రీస్తుప్రభులవారు!

 

లూకా 24:27

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

 

యోహాను 5:46

అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.

 

మోషేగారి కంటే యేసుక్రీస్తు ప్రభులవారు గొప్పవారు ఎందుకంటే పైన చెప్పిన విధంగా ఆయన క్రొత్త నిబంధనకు ప్రతినిధి! విషయమే హెబ్రీ 8:613 లో చాలా విస్తారంగా రాశారు పౌలుగారు! దయచేసి ఒకసారి మీ బైబిల్ తీసి చదవమని మనవిచేస్తున్నాను!

 

కాబట్టి క్రొత్త నిబంధనకు స్తాపకుడు యేసుక్రీస్తు ప్రభులవారు కాబట్టి పాత దానికన్నా క్రొత్తది మంచిది అని నిరూపిస్తున్నారు పౌలుగారు!

 

సరే, అయితే ఏమి చెయ్యాలట??? మనము ధైర్యమును నిరీక్షణవలన ఉత్సాహమును వదలకుండా తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి! హెబ్రీ 3:7--10;

 

కొలస్సీ 1:23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకుడనైతిని.

 

1కొరింథీ 15:21

మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

 

 కాబట్టి ఇంటివారైన విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోకూడదు! విశ్వాసంలో కొనసాగడమే ఇంటిలో సభ్యులు అనడానికి ఋజువు! కాబట్టి ఎవరైనా ఒకసారి విశ్వాసాన్ని రుచిచూసి నిరీక్షణను సువార్తను త్రోసిపుచ్చి పాపములో పడిపోతే వారు ఇక ఇంటివారు కానేకారు. ఇంటివాడను అని వారు తలస్తున్నా వారు సాతాను ఇంటివారే తప్ప దేవుని ఇంటివారు కానేకాదు! పాపములో పడిపోయిన వానికి రక్షణలో పాలుపంపులు లేవు!

అందుకే ఏమంటున్నారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమంటున్నారు తర్వాత వచనాలలో! హెబ్రీ 3:7-10

7. మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు.

8. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

9. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.

10. కావున నేను తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.

 

ప్రియ స్నేహితుడా! నీ బ్రతుకు ఎలా ఉంది?

దేవుని ఇల్లంతటిలో మనం కూడా నమ్మకముగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అట్టి గొప్ప ప్రధాన యాజకున్ని కలిగిన నీవు ఇంకా విశ్వాసములో బలపడాలే తప్ప కృంగిపోకూడదు! విశ్వాసమునుండి జారిపోకూడదు! ఇంకా ఆయనకు కోపం పుట్టించకూడదు! ఆయనకు కోపం రేపి ఇశ్రాయేలు వారు అరణ్యంలో రాలిపోయారు! నీవునేను అలా చేయకూడదు! చేస్తే- సొంత జనాన్నే రాలిపోయినట్టు చేసిన దేవుడు నిన్ను కూడా లేపేస్తారు జాగ్రత్త!

కాబట్టి భయమునొంది పాపము చేయవద్దు! ఒకవేళ నీలో ఇంకా దేవునికి కోపం కలిగించేవి ఏవైనా ఉంటే నేడే విడిచిపెట్టి ఆయనను క్షమాపణ వేడుకుని శరణువేడుకో!

ఆయన నిన్ను విమోచించడానికి క్షమించడానికి సిద్దంగా ఉన్నారు!

ఆమెన్!

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*16 భాగం*

హెబ్రీ 4:1416

14. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకున్నాం! గతభాగాలలో హెబ్రీ 7, 2 అధ్యాయం నుండి లేవీ/ఆహారోను యాజకత్వము  కంటే యేసుక్రీస్తు ప్రభులవారి యాజకత్వము విధంగా గొప్పదో చూసుకున్నాం! అలాగే ౩వ అధ్యాయం నుండి మోషే గారికంటే కూడా యేసుక్రీస్తుప్రభులవారు గొప్పవారు అనియు ధ్యానం చేసుకున్నాం! అయితే అధ్యాయంలో ఈభాగంలో మరలా రెండవ అధ్యాయం చివరి వచనాలలో వదిలేసిన భాగాన్ని మరలా కొనసాగిస్తున్నారు పౌలుగారు! అది ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు ఆయన కూడా మనలాగే శోధనలకు గురయ్యారు ఆయనకూడా మనలాంటి శోధనలను అనుభవించి మనలాగే సమానుభవము గలవారు కాబట్టి మన శ్రమలను శోధలను బాగా అర్ధంచేసుకోగలరు అన్నారు. దానినే హెబ్రీ 4:1416 లో మరల విస్తారంగా రాస్తున్నారు.

 

    ప్రియులారా మూడు వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు ప్రధానయాజకుడుగా మనమధ్యకు వచ్చారు. అయితే లోకమంతటా ఒక అభిప్రాయం ఉంది ఏమిటంటే మనుష్యులు తమకు ఒక యాజకుడు అవసరం అని తలస్తున్నారు కారణం తమ పక్ష్యంగా దేవునిదగ్గర తమవంతు కార్యక్రమాలు చక్క పెట్టడానికి తమకు బదులుగా దేవునికి సన్నిహితంగా దేవుని దగ్గర అర్పణలు యజ్ఞయాగాదులు బలులు అర్పించడానికి దేవునితో సత్సంభాదాలు గల ఒక వ్యక్తి అవసరం! ఆయన తమకు బదులుగా అర్పనలు బలులు అర్పించి తాము చేసిన పాపాలకు పరిష్కారం చేసి దేవుని కోపాన్ని మరల్చి దేవునితో ఐక్యబంధం ఏర్పరచాలని మానవాళి ఆశ! ఇదే అన్ని మతాలలోను ఉన్న అభిప్రాయం! అయితే యేసుక్రీస్తుప్రభులవారు భూలోకానికి రాకముందు సుమారు 1400 సంవత్సారాలుగా యూదులకు/ ఇశ్రాయేలువారికి యాజకులు ప్రదానయాజకులు ఉన్నారు. అయితే క్రీస్తును అంగీకరించిన విశ్వాసులకు కంటికి కనిపించే ప్రధాన యాజకుడు గాని యాజకుడు గాని భూమిపై ఎవరూ కనబడటం లేదు అని  యూదులు ఇంకా ఇతరులు అనుకుంటున్నారు. అలాగే వాక్యాన్ని బాగా అర్ధం చేసుకోలేని విశ్వాసులకు కూడా అభిప్రాయం రావచ్చు! అభిప్రాయం తప్పు అని ఇక్కడ పౌలుగారు చాల వివరంగా చెబుతున్నారు. మిగిలిన వారికంటే ప్రముఖుడైన గొప్ప ప్రదాన యాజకుడు మనకున్నారు. ఆయన సాక్షాత్తుగా దేవుని కుమారుడే! ఈయన భూమిపై ప్రత్యక్షంగా కనబడకపోయినా పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు ఉండి మన పక్ష్యంగా విజ్ఞాపనం చేస్తున్నారు. మిగిలిన వారికి యాజకులు కేవలం మానవులు! అయితే మన ప్రధానయాజకుడు దేవుని కుమారుడు! దేవుడే! కారణం ఆయన ఆకాశమండలం గుండా ఎక్కిపోయిన వాడు. ఎక్కడికి ఎక్కిపోయారు అంటే పరలోకం- తండ్రి దగ్గరకు ఎక్కిపోయారు- చావును గెలిచి- మానవులకు పాప ప్రక్షాళన చేసి- రక్షణ ప్రణాళికను అమలులోనికి తీసుకుని వచ్చి- ప్రక్రియ ఆగిపోకూడదు అని అపోస్తలులను పెట్టి భూమిమీద- వారిద్వారా రక్షించబడిన వారు విశ్వాసంలో కొనసాగాలని, శ్రమలను తట్టుకోవాలని తానే తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తున్నారు తండ్రి ప్రక్కనే ఉండి! కాబట్టి వారికంటే గొప్ప బ్రహ్మాండమైన యాజకత్వం మనకుంది!! భూమిమీద నున్న యాజకుడు చేయలేనంతగా ఆయన మనకోసం చేస్తున్నారు! సత్యం లోకానికి తెలియక పోవడం వలననే మానవ-యాజకధర్మం అనేది ఇంకా మానవాళిని బానిసలుగా ఉంచింది. కాబట్టి పరలోక యాజకత్వం- మెల్కీసెదెకు క్రమం మనకు విధంగా తగినదో సరిపోయినదో పౌలుగారు చక్కగా వివరిస్తున్నారు.

 

     ఇక 15 వచనంలో చెబుతున్న సమానుభవం/ సహానుభవం కోసం ఆలోచిస్తే: దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి యాజకవ్యవస్త పెట్టినది ఎందుకంటే మనుషులు వారి సాధకభాదలు దేవునికి తెలియజేయడం- ఇంకా వారి బలహీనతలు చింతలు దుఃఖాలు బాధలు అవసరతలు తెలుసుకుని వాటిని ప్రజలపక్ష్యంగా దేవునికి తెలియజేయడం , ఇంకా వారు చేసిన అపరాధాలు ఉంటే క్షమాపణ కోసం బలులు అర్పించి దేవుణ్ణి శాంతి పరచడం! హెబ్రీ 5:12; నిర్గమ 28:29; ఇదీ యాజకులు చేయవలసిన విధి! అయితే దీనిని ఇశ్రాయేలు వారిలో యాజకుడు అన్ని విషయాలు చేయలేదు! అయితే యేసుక్రీస్తుప్రభులవారు అన్ని లక్షణాలను చాలా జాగ్రత్తగా నిర్వర్తించారు! కాబట్టి ఈయన మనకు సరిపోయిన వారు!

 

  అందుకే16 వచనంలో ఈయన మనకు సరిపోయిన వారు- మనలాగే శోధనలను భాదలను అనుభవించినవారు కనుకనే మనం ఇప్పుడు ధైర్యంగా ఆయన కృపాసనం అనగా కృపా సింహాసనం దగ్గరకు చేరి మన బాధలు చెప్పుకుందాము అంటున్నారు పౌలుగారు! గమనించాలి- లోకాన్ని ఏలేందుకు యేసుక్రీస్తుప్రభులవారు ఎంచుకున్న సింహాసనం కృపా సింహాసనం! ఆయన మన పాపాలకు బలియాగం చేసిన దగ్గరనుండి కృపాకాలం రాజ్యమేలుతుంది ఇప్పుడు! మన ప్రధానయాజకుడైన యేసుక్రీస్తుప్రభులవారు దానిపై ఆసీనులై ఉన్నారు!

హెబ్రీ 1:3,4

3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.

 

ప్రకటన :21

నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

 

కృప రాజ్యమేలుతుంది--రోమా 5:21

ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

 

కాబట్టి ఇప్పుడు నీవు శోధనలో ఉన్నావా భాధలో ఉన్నావా? అవసరతలో ఉన్నావా? అయితే దేనికోసమైనా సరే నీవు ఇప్పుడు కృపాసనం సమీపించి అడగమని దేవుడు ప్రోత్సహిస్తున్నారు!

మత్తయి  7:7,8

7. అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

8. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.

 

యోహాను 16:2324

23. దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

 

అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే వీటన్నింటికంటే ముఖ్యంగా మనకు కావలసినది దేవుని కృపా కరుణ విశ్వాసం- ఇంకా మనం పాపం చేయకుండా దేవుని కాపుదల- భద్రత కావాలి! వీటికోసం ధైర్యంగా దేవుని దగ్గర అడగాలి! ఇంకా పాపం చేస్తే వెంటనే తప్పు ఒప్పుకుని విడిచిపెట్టి క్షమాపణ అడగాలి పొందు కోవాలి! అందుకే ఆయన సింహసనమే కృపాసింహాసనం కాబట్టి ధైర్యంగా వద్దాము అంటున్నారు పౌలుగారు! ఆయనకు మనం అడిగినవి ఇవ్వడానికి ఇష్టమే అని చెబుతున్నారు పౌలుగారు ఫిలిప్పీ 4:19లో.

కాబట్టి ఇలాంటి నిబ్బరం ధైర్యం గుండె నిబ్బరం దీనికంటే ఏముంది?

 

మరచిపోవద్దు ఆయన కృప నిత్యముండును. ఆయన విశ్వాస్యత తరతరములుండును.

ఆయన కృపయే శాశ్వతజీవము!

ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది కీర్తన 57:9

జీవము కంటే ఉత్తమం! కీర్తన 63:3

ఆయన కృప బలపరిచేది. కీర్తన 94:18;

భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉంది. 103:11

ఆయన కృప యుగయుగాలు నిలిచేది. 103:18;

ఆయన కృప అంత బ్రహ్మాండమైనది కాబట్టే మెల్కీసెదెకు క్రమంలో కృప పరిపూర్ణత సాధిస్తూ కృప కృప వెంబడి కృపను తీసుకుని వస్తుంది.

యోహాను 1: 16

ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.

 

అందుకే దైర్యంగా ఆయన కృపాసనం దగ్గరకు నేడే రా!

ఒకవేళ కృంగిపోయి ఉన్నావా?

బాధలలో ఉన్నావా?

రోగంతో ఉన్నావా?

అపరాధ భావంతో ఉన్నావా?

అప్పులలో ఉన్నావా?

వ్యభిచారంలో ఉన్నావా?

త్రాగుడు అనే బానిసత్వం లో ఉన్నావా?

 దేనిలో ఉన్నా సరే, నీవున్న స్థితిలోనే నేడే ఉన్నపాటుగా దేవుని దగ్గరకు కృపాసనం దగ్గరకు రా! తప్పులు ఒప్పుకో! పశ్చాత్తాపపడు!

ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆదరించడానికి నిన్ను ఆదుకోడానికి సిద్దంగా ఉన్నారు!

వస్తావా? నేడే అనుకూల సమయం! ఇదే రక్షణ దినం!

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*17 భాగం*

 

హెబ్రీ 5:14

1. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.

2. తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.

3. హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.

4. మరియు ఎవడును ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.

 

   ప్రియ దైవజనమా! మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేసుకుంటున్నాము! మనకొక ప్రధాన యాజకుడు ఉన్నారు! ఆయన క్రీస్తుయేసు అని ధ్యానం చేసుకుంటున్నాం! 5 అధ్యాయంలో కూడా అదే విషయాన్ని భక్తుడు వివరిస్తున్నారు! అధ్యాయంలో 14 వచనాలలో అసలు యాజకునికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? అతడు చేసే కార్యాలు లేక అతని భాద్యతలు ఏమిటి అనేది తెలియజేస్తున్నారు! అలాగే 510 వచనాలలో లక్షణాలు అన్ని అనగా యాజకునికి ఉండవలసిన లక్షణాలు అర్హతలు అన్ని యేసుక్రీస్తుప్రభుల వారికున్నాయి అని భక్తుడు తెలియజేస్తున్నారు!

 

     మొదటి వచనం....ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.

మానవ యాజకుడు- మొదటగా మనుష్యులలో నుండి ఏర్పరచబడి ,

రెండవది- మానవుల పక్ష్యంగా దేవునికి పాపముల కొరకు అర్పణలు బలులు అర్పిస్తాడు,

మూడవదిగా దేవుని కార్యములు మనుషుల పక్ష్యంగా చేస్తాడు!

ప్రతి ప్రదానయాజకుడు కూడా మోషేగారి దగ్గరనుండి యేసుక్రీస్తుప్రభులవారి కాలం వరకు ఇలాగే మనుష్యుల నుండి ఏర్పరచబడి మానవుల పక్ష్యంగా దేవుని కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. అయితే తర్వాత వచనాలలో ప్రధాన యాజకులు కూడా మనలాగే బలహీనతలు కలవారు అంటున్నారు. కారణం వారు కూడా మానవులే! వారుకూడా పాపం చేసే అవకాశం ఉన్నవారే!! అందుకే మొదట వారికొరకు బలులు అర్పించుకుని అప్పుడు మిగిలిన అందరికొరకు బలులు అర్పించేవారు!

 

  ఇక ఏమియు తెలియని వారియెడల.... ఇంకా త్రోవ తప్పిన వారియెడల.... అంటున్నారు. దీని అర్ధం ఏమిటంటే లేవీయకాండంలో వివరించినట్లు తెలియక పాపంచేసిన వారు అన్నమాట!

లేవీ 4:2

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా..

 

లేవీ 5:17

చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకు శిక్ష భరించును.

 

సంఖ్యా 15:28

పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చి త్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.

 

అయితే తర్వాత మాటలలో ఇలాంటివారి విషయంలో తాలిమి చూపగలగినవాడు అంటున్నారుస్టడీబైబిల్లో మృదుభావంతో వ్యవహరించగలడు అంటున్నారు. దీనికోసం ఆలోచన చేస్తే దైవజనుడు సేవకుడు కూడా తన సంఘస్తులతో ఓర్పుతో మృదువుగా ప్రవర్తించాలి తప్ప వారిమీద అధికారిలా వారు మీ బానిసలు పనివారిలా దురుసుగా ప్రవర్తించకూడదు అని దీనిద్వారా గ్రహించవచ్చు!

 

అయితే కావాలని ఎవరైనా పాపం చేస్తే దేవుడు కటినముగా వ్యవహరిస్తారు.

ద్వితీ 17:1213 ప్రకారం కావాలని పాపం చేసినా, న్యాయాధిపతి, ప్రదానయాజకుడు మాటవినకపోతే అట్టివారిని హతమార్చాలి అని వ్రాయబడింది.

హెబ్రీ 2:2

సంఖ్యా 15:౩౦36

నిర్గమ 21:14

అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.

 

 కాబట్టి యాజకుడు అనేవాడు మొదటగా ప్రజల నిమిత్తం బలులు అర్పించాలి.

లేవీ 16:1516, 324

15. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధ బలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.

16. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.

32. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.

33. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.

34. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.

 

తర్వాత తన నిమిత్తం కూడా బలులు అర్పించాలి.

లేవీ 16:6

6. అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ....

 

ఇక 4 వచనం చాలా ప్రాముఖ్యమైనది. .....మరియు ఎవడును ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.

చూడండి ఘనత తనకుతానే పొందుకోకూడదు. ఆహారోను కూడా దేవునిచేత పిలువబడి ఘనత పొందుకున్నారు అంటున్నారు. ఒకసారి ఇక్కడ ఆగుదాం! నిర్గమ 28:1 ప్రకారం దేవుడు మోషేగారికి నీ అన్నయైన ఆహారోనును అతని కుమారులను నాకు యాజకులుగా ఉండేలాగా ప్రతిష్థ చేయమని చెబితే మోషేగారు ప్రతిష్ట చేశారు. అక్కడనుండి ఆహారోను కుమారులకు వారసత్వంగా వచ్చింది. అయితే నేటిరోజులలో సేవా-పరిచర్య అనేది వారసత్వంగా వస్తుంది అనేది తప్పు! కారణం- ఒకసారి వారి కుటుంబంలోనే జరిగిన సంఘటనలు చూసుకుంటే- ఆహారోను గారి కుమారుడు ఎలియాజరు కూడా ప్రధానయాజకుడుగా పనిచేశారు గాని ఆయన కుమారుడైన ఫీనేహాసు ఎలియాజరు కంటే గొప్ప సేవ చేశారు. దేవునిచేత సెహబాస్ అనిపించుకున్నారు. కారణం ఆయనకు దేవుని కార్యాల పట్ల ఎంతో ఆశక్తి! దేవుని ఆత్మ నడిపింపు చేత కార్యాలు చేశారు! దేవుని మనస్సును అర్ధం చేసుకున్నవారు ఫీనెహాసు- అందుకే నేను ఓర్వలేనిదానిని తానుకూడా ఓర్వలేకపోయాడు అని దేవుడే సర్టిఫై చేస్తున్నారు. సంఖ్యాకాండము 25: 11

వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు....

 అదే ఎలియాజరుకు అలాంటివి ఏమీలేవు. తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది దానిని ఒక డ్యూటీ చేసినట్లు చేసి వెళ్ళిపోయాడు అంటే తప్ప ఎలాంటి డెడికేషన్ లేదు! కాబట్టి దీనిని నేటి సేవకులకు అన్వయించుకుంటే సేవ- సంఘకాపరత్వము అనేది కూడా వారసత్వంగా చేస్తే అంతగా ఫలభరితంగా ఉండదు అని నా ఉద్దేశ్యం! అది దేవుని నుండి ఏర్పరచుకుని పిలువబడి ఒక రకమైన త్యాగభరితంగా దేవునికి సమర్పించుకుని సేవ చేయాలి తప్ప ఏదో మా తండ్రి కాపరి ఆయన తర్వాత సేవ నాదే అని పొట్టకూటికోసం దేవుని సేవ చేయడం మంచిది కాదు అని నా ఉద్దేశ్యం! గమనించాలి- దీనిని రాస్తున్న నేను కూడా ఒక అనుభవజ్ఞుడైన సంఘకాపరి కుమారుడనే!

 

అయితే సేవకులు కుమారులు- సేవకులు కాపరులు కాకూడదా అని అడగవచ్చు! నేనంటాను చేయవచ్చు! గాని మొదట డెడికేషన్, కమ్మిట్ మెంట్ ఉంటేనే గాని చేయడం అనవసరం! నీవు దేవుని సేవ మీద దేవునిమీద ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో కనిపెడితే నీ ఆసక్తి చూసి దేవుడే నిన్ను సేవకు పిలుస్తారు. నీకు ప్రత్యేకమైన వరములు ఫలములు ఇచ్చి నా సేవ చేయు నా కుమారుడా అని నిన్ను పిలిచి వాడుకుంటారు! అప్పుడు సేవచేస్తే సేవ ఎంతోగంభీరముగా ఉజ్వలంగా ఉంటుంది తప్ప- అలాంటివి లేకుండా చేస్తే సేవ చప్పగా ఉంటుంది. ఉదాహరణగా మాకు బాగా తెలిసిన ఒకదైవజనుడు ఉన్నారు. ఆయన ఎంతో ఘనమైన సేవ చేసి ఎన్నో సంఘాలు కట్టారు! కాని ఆయన ఏకైక కుమారుడు సేవను గాని పరిచర్యను గాని పట్టించుకోకుండా కొన్ని రోజులు లోక సంబంధమైన కార్యాలలో తిరుగుతూ రాజకీయంలో తిరుగుతూ, విలేకరిగా పనిచేస్తూ సేవను అశ్రద్ధ చేశాడు. మధ్యనే దైవజనుడు చనిపోయారు. ఇప్పుడు కుమారుడు సేవను నడిపిస్తున్నాడు గాని మొదటగా వ్యక్తికి సాక్ష్యం లేనందువలన, సాక్ష్యం కోల్పోయినందువలన సేవ ఫలించడం లేదు! ప్రక్క సేవకులు సేవను- విశ్వాసులను తన్నుకుపోతున్నారు. కారణం మొదటగా సాక్ష్యం లేదు. రెండవది పిలుపు ఏర్పాటు లేదు. మూడవది సిద్దపాటు లేదు! కాబట్టి సేవ అనేది వారసత్వంగా వచ్చేది కాదు అని నా ఉద్దేశ్యం! గమనించాలి ఒకసారి మోషేగారిని చూసుకుంటే నా తర్వాత నాయకుడుగా ఎవరు ఉంటారు దేవుడా అని అడిగితే దేవుడు యెహోషువాను అభిషేకించు! అతడు ఆత్మను పొందుకున్నవాడు అని చెప్పారు దేవుడు! వెంటనే అలాగే చేశారు మోషేగారు! నా కొడుకులని నాయకులుగా చేస్తాను అని ఆయన అనుకోలేదు! గాని సమూయేలు గారు అనుకున్నారు చేశారు- ఏమయ్యంది? ప్రజలచేత తిరస్కరించబడ్డారు- కారణం వారు లంచగొండులు! అందుకే సౌలును దేవుడు రాజుగా చేయడం జరిగింది. చివరగా ఒకమాట చెప్పనీయండి. ఆత్మీయ వారసత్వమే మెల్కీసెదెకు క్రమం! క్రమం లోనే పౌలుగారి నుండి తిమోతి తీతుగార్లు వచ్చారు. ఒకరకంగా ఆత్మీయ వారసత్వం లోనే మోషే గారి నుండి యెహోషువకు, ఏలియా గారినుండి ఎలీషాగారికి వచ్చింది.

 

కాబట్టి సేవ అనేది మొదటగా దేవుని ఏర్పాటు, రెండు పిలుపు, మూడవది సిద్దపాటు అనేది ఉంటేనే సేవచేయాలి తప్ప వారసత్వంగా చేస్తే బొక్కబోర్లాపడతావు అని గ్రహించాలి! కాబట్టి సేవగాని యాజకత్వం గాని వారసత్వం కాదు అని గ్రహించాలి!

 

   ప్రియమైన సేవకుడా! దయచేసి నీవు నీ కుమారున్ని నీ తర్వాత సేవకునిగా చేయాలి అనుకుంటే దయచేసి దీనిని గమనించమని మనవి చేస్తున్నాను! నీ తర్వాత సేవను ఎవరికీ అప్పగించాలో దేవుణ్ణి అడుగు! నీ కుమారున్ని చేయాలి అనుకుంటే అతడు ఏర్పాటుచేసుకున్న వాడు అవునా కదా, పిలుపు ఉందా లేదా ఇంకా అతడిని నీవు సేవకు సిద్దపాటు చేశావా అతడు సిద్దపడ్డాడా లేదా అనేది దయచేసి ఒకసారి గమనించి అప్పుడు నిర్ణయం తీసుకోమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను!

దైవాశీస్సులు!

 

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*18 భాగం*

హెబ్రీ 5:510

5. అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.

6. ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

7. శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.

8. ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

9. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

10. తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

 

           (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా గతభాగంలో యాజకత్వపు అర్హతలు, నిర్వర్తించవలసిన విధులను గూర్చి ధ్యానం చేసుకున్నాం! అంతేకాకుండా అది కేవలం వారసత్వంతో చేస్తే ఫలభరితంగా ఉండదు అని ఉదాహరణలతో చూసుకున్నాం!

 

    ఇక ఈభాగంలో యేసుక్రీస్తుప్రభులవారికి యాజకత్వపు అర్హతలు అన్నీ ఉన్నాయని వాటిని అన్నిటిని యేసయ్య నెరవేర్చారని భక్తుడు రాస్తున్నారు. దానినే ధ్యానం చేసుకుందాం!

 

ఒకసారి 5 వచనం చూద్దాం!..అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.. చూడండి అటువలె అనగా అహారోనుకి రకంగా దేవుని నుండి పిలుపు ఏర్పాటు వచ్చి యాజకత్వము కలిగిందో అలాగే క్రీస్తుకూడా ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమ పరచుకోలేదు గాని నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను అంటున్నారు. గమనించండి యేసయ్య తనకుతానే మహిమ పరచుకోలేదు! తను ఎప్పుడు తండ్రిని మాత్రమే మహిమ పరిచారు. అందుకే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అన్నారు తండ్రి  కీర్తన 2:7 లో.... అందుకే హెబ్రీ 1:5 లో పౌలుగారు అంటున్నారు.....హెబ్రీయులకు 1: 5

ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?

 

ఒకసారి దీనికోసం యోహాను సువార్త 17 అధ్యాయంలో చాలా వివరంగా ఉంది చదవమని మనవిచేస్తున్నాను!

 

   గాని నేటి రోజులలో తనకుతానే మహిమపరచుకోవడం గౌరవించుకోవడం హెచ్చించుకోవడం ఎక్కువైపోయింది. తమకుతామే తాము డాక్టర్ అంటూ, భిషప్ అంటూ అపోస్తలులు అంటూ, రెవరెండు ఇరవైరెండు అంటూ బిరుదులూ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఆచార్యులు అంటూ తగిలించుకుంటున్నారు. గమనించాలి భయంకరుడు అనబడే రెవరెండు గాని ఆచార్యుడు అనే పూజార్హుడు కేవలం దేవుడే! మానవులకు అర్హత లేదు! శిష్యులకు అపోస్తలుడు అనే బిరుదు దేవుడు ఇచ్చారు. నేటి రోజులు లాగ కొనుక్కోలేదు! రోజులలో చాలామంది కొనుక్కుంటున్నారు రెవరెండు, భిషప్, డాక్టర్, అపోస్తలుడు అంటూ!. మా జిల్లాలో అమ్మేవారున్నారుగమనించాలి- యేసయ్య కొనుక్కోలేదు! అర్హత మహిమ రాడానికి కష్టపడ్డారు! వెల చెల్లించారు! వెల చెల్లించడం అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు! దానికోసం కొరడా దెబ్బలు తిన్నారు. అవమానాలు పొందారు! సిలువమరణం పొందారు! తన రక్తం చిందించారు! చివరకు అందరికోసం చనిపోయారు! అప్పుడే మహిమ అధికారం ఆధిపత్యం అర్హత అన్ని కలిగాయి! ఇదే ఆయనకు పరిపూర్ణతను తీసుకుని వచ్చింది. శ్రమలద్వారా సంపూర్ణత సాధించడం అంటే ఇదే!

 అది ఆయనకు ఉచితంగా రాలేదు! బజారులో కొనుక్కోలేదు! ప్రియ దైవజనుడా! ఇది ఒకవేళ నిన్ను భాదించినా సత్యాన్ని గ్రహించమని ప్రేమపూర్వకంగా ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను! ఘనత మహిమ మెప్పు నీకు దేవుని నుండే కలగాలి తప్ప మనుష్యుల నుండి కానేకాదు!

 

ఇక 6 వచనంలో మరలా కీర్తనల గ్రంధం 110:4 లో వ్రాయబడిన సంగతి  రాస్తున్నారు. నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరమూ యాజకుడవై ఉన్నావు. దీనికోసం మనం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం గనుక ముందుకు పోదాం! అయితే ఇక్కడ మరలా మాటను రాయడానికి కారణం అక్కడ అనగా నిర్గమ 28:1 లో యాజకత్వపు ఘనత ఆహారోను గారికి ఎలా వచ్చిందో ఇక్కడ కీర్తన 110:4 ప్రకారం ఘనత యేసుక్రీస్తుప్రభులవారికి కూడా వచ్చింది అని తెలియజేస్తున్నారు భక్తుడు!

 

   ఇక 78 వచనాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతీ క్రైస్తవ విశ్వాసికి కాపరికి సేవకునికి మార్గదర్శకమైనవి!

78.....శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.

8. ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

 

ఆయన భూమిమీద ఉన్నప్పుడు మహా రోధనముతోను కన్నీళ్ళతోనూ ప్రార్ధన చేశారు అంటున్నారు. ఇక్కడ మహా రోధనము అనేమాట గమనించాలి! అసలు యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు- దేవుని కుమారుడు కదా మరి ఎందుకు ప్రార్ధన చెయ్యాలి! ఎందుకు కన్నీటితో రోధనంతో ప్రార్ధన చెయ్యాలి అంటే రెండు కారణాలున్నాయి!

 

మొదటగా నీతి యావత్తు ఒక క్రమ పద్దతిలో జరగాలి! దానినే 8 వచనంలో విధేయత అంటున్నారు..... ఒకసారి మత్తయి 3:14-15 లో బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఆయనతో ఏమ్మన్నారు ఆయన బాప్తిస్మం తీసుకోడానికి వచ్చినప్పుడు... అయ్యా నేను నీతో బాప్తిస్మం పొందాలి అలాంటిది నాతో నీవు బాప్తిస్మం పొందుతావేమిటి అని అడిగితే నీతి యావత్తు ఇలా జరగాలి కాబట్టి కానీయమని చెప్పారు! మరలా చెబుతున్నాను- ఏదైనా జరగాలి అంటూ దానికి ఒక పద్దతి, రివాజు, రూల్స్ రెగ్యులేషన్ అన్ని ఉంటాయి! లోకంలో ప్రార్ధన అనే అప్లికేషన్ పెట్టవలసిన అవసరం భూమి మీద పుట్టిన మనిషికి ఉంది. అలా పెడితేనే అప్పుడు దేవుడు జవాబు ఇస్తారు! కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు దేవుడయినా సరే, ఈలోకంలో మానవునిగా వచ్చారు కాబట్టి పద్దతి నియమం రివాజుని మించకుండా మనకు మాదిరిగా నిలిచారు! దీనిని చదువుతున్న ప్రియ దేవుని బిడ్డా! యేసుక్రీస్తుప్రభులవారే ప్రార్ధన చేసినప్పుడు అదికూడా కన్నీటితో రోధనతోను ప్రార్ధన చేసినప్పుడు నీవు నేను తప్పకుండా కన్నీటితో రోధనముతో ప్రార్ధన చెయ్యాలి అందంతే! నీవు నేను యేసుక్రీస్తుప్రభులవారి కంటే గొప్ప వారము కాము అని గ్రహించాలి! ఆయనే భాప్తిస్మం తీసుకున్నారు. మనం కూడా తీసుకోవాలి! ఆయనే ఉపవాసముండి ప్రార్ధన చేశారు. మనం కూడా ఉపవాసముండి ప్రార్ధన చెయ్యాలి! ఆయనే నాయకులకు అధికారులకు లోబడ్డారు! మనం కూడా లోబడాలి! అంతే! ఈరోజులలో కొంతమంది పెద్ద సేవకులం/ ప్రసంగీకులు అని పిలువబడే వారు ఉపవాసముండవలసిన అవసరం లేదు! దేవుడు చెబితేనే చెయ్యాలి! దశమభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ పనికిమాలిన బోధ చేస్తున్నారు. దయచేసి వారిని అనుకరించకుండా యేసుక్రీస్తుప్రభులవారినే అనుసరించమని అందరికీ మనవి చేస్తున్నాను! ఆయనే విధేయత చూపించినప్పుడు మనం కూడా విధేయత చూపిద్దాం!

 

ఇక రెండవ కారణం ఏమిటంటే: తనను మరణం నుండి తప్పించగలిగిన వానికి ప్రార్ధనలు యాచనలు చేశారు అంటున్నారు. గమనించాలి. తననుచావు నుండి తప్పించమని యేసుక్రీస్తుప్రభులవారు ప్రార్ధన చేశారు అని పౌలుగారు రాస్తున్నారు ఇక్కడ!

గమనించాలి: దీనికోసం మూడు విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. మూడు మీకు చెబుతాను!

 

మొదటిది: వచనం ప్రకారం సైతాను గాడు గెత్సమనే తోటలో యేసుక్రీస్తుప్రభులవారు ప్రార్ధన చేస్తుంటే చంపటానికి ప్రయత్నం చేశాడని అందుకే యేసుక్రీస్తుప్రభులవారు చావునుండి తప్పించమని ప్రార్ధన చేశారని ఒక అభిప్రాయముంది! ఇది తప్పు అనిగ్రహించాలి! కారణం సేవ మొదలుపెట్టకముందు సాతానుతో శోధించబడినప్పుడే ఆయన సాతానుమీద విజయం సాధించారు! సాతానా పొమ్మని గద్ధిస్తే వాడు పారిపోయాడు! కాబట్టి వివరణ తప్పు అని గ్రహించాలి!

 

రెండవది: తండ్రీ నీచిత్తమైతే గిన్నెను నాయొద్దనుండి తొలగించమని ప్రార్ధన చేసినట్లు సువార్తలలో చూసుకుంటున్నాము. మత్తయి 20:28; యోహాను 10:1718; అనగా ఆయన దేవుడు గాని మనిషిగా పుట్టినందువలన భాధలు ముందుగా ఎరిగి దయచేసి సిలువమరణం పొందకుండా నన్ను తప్పించు! అయినా నా చిత్తం కాదు నీ ఇష్టమే ప్రభువా! అని ప్రార్ధించినట్లు రెండవ వివరణ/ అభిప్రాయం! అయితే దీనిని కూడా చాలామంది బైబిల్ పండితులు తప్పు అంటారు. కారణం ఆయన భూలోకానికి వచ్చినదే సిలువమరణం పొంది రక్తము చిందించటానికి. విషయం తనకు తెలుసు! మరి ఆయనెలా ప్రార్ధన చేస్తారు అలాగా!? కాబట్టి అభిప్రాయం కూడా తప్పు కావచ్చు!

కారణం తను చేసే పని తనకు తెలుసు కాబట్టి అనేకసార్లు తాను యెరూషలేము వెళ్లి ప్రజలచేతిలో చనిపోబోతున్నట్లు చెప్పారు ముందుగానే యేసయ్య! మత్తయి 16:21; 20:28; యోహాను 12:2728; అయితే తర్వాత మాటలలో ప్రార్ధన దేవుడు అంగీకరించినట్లు చూస్తున్నాము. అంటే దేవుడు సిలువమరణం పొందకుండా ఉండటానికి అంగీకరించారా? లేదు కదా! అనగా వివరణ కూడా తప్పే అని తెలుస్తుంది. మరి దేనికోసం ప్రార్ధన చేసి ఉంటారు?

 

మూడవది: యేసయ్యకు తెలుసు తాను చనిపోతున్నట్లు. కాబట్టి మరణలోకంలో మరణం ఆయనను బంధించి ఉంచకూడదని వేడుకున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!!

అపోస్తలులు 2:24.

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.

 

ఇంకా చెప్పాలంటే తండ్రి తనను మరణించినవారిలో నుండి సజీవంగా లేపాలని ప్రార్ధన చేశారు.

కీర్తనలు 22:1521

15. నా బలము యెండిపోయి చిల్ల పెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.

16. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు.

17. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు

18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

19. యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.

20. ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.

21. సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు

 

అయితే మరో అనుమానం వస్తుంది మరి యేసయ్యకు తండ్రి తనను చావునుండి లేపుతారు అని తెలియదా అంటే తెలుసు! కీర్తన 16:10...

ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

మరి ఎందుకు ప్రార్ధన చేశారు అంటే మీదన చెప్పినట్లు విధేయత! నీతియావత్తు క్రమ పద్దతిలో నెరవేర్చడానికి! అప్లికేషన్ పెట్టడానికి! అంతే! అలా చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు.

యోహాను 17లో దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నారు.

మత్తయి 26:39 లో గిన్నెను తొలగించమని బ్రతిమిలాడారు!

 

కాబట్టి ప్రియ సహోదరి! సహోదరుడా! నీవు నేను కూడా విధేయత కలిగి ప్రార్ధించవలసిన అవసరం ఉంది అని గమనించమని మనవిచేస్తున్నాను!

మరి అలాంటి ప్రార్ధన రోదన విన్నపములు నీవు చేస్తున్నావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*19 భాగం*

హెబ్రీ 5:910

9. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

10. తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

 

   (గతభాగం తరువాయి)

 

మనం ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడైనా సరే భూమిమీద మానవునిగా పుట్టారు కాబట్టి ప్రార్ధన యాచనలు చేస్తూ విధేయత చూపించారు అని చూసుకున్నాం! అయితే తర్వాత వచనాలలో చూసుకుంటే మొదటగా ఆయన విధేయత ద్వారా బలియాగం ద్వారా సంపూర్ణ సిద్ధి తానుపొంది మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకక్రమములో చేరిన ప్రదానయాజకునిగా, తనకు విధేయులైన అనగా విశ్వాసమునకు, నిబంధనకు, యాజక క్రమమునకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడయ్యారు. అనగా తాను మొదటగా సంపూర్ణసిద్ది, పరిపూర్ణతను సాధించి విశ్వాసమునకు, నిబంధనకు విధేయులైన వారికందరికీ మొదటగా నిత్యరక్షణ రెండవదిగా పరిపూర్ణత సంపూర్ణ సిద్ధి ప్రసాదించారు.

 

   ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మనకు పరిపూర్ణుడైన సంపూర్ణసిద్ధి పొందిన ఒక యాజకున్ని దయచేయడానికి దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని అనేకమైన భాధలకు గురిచేశారు. తద్వారా ఆయన సంపూర్ణసిద్ధి పొందటమే కాదు భాధలను ఆయన బాగుగా అర్ధం చేసుకోగలుగుతున్నారుహెబ్రీ 2:10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 

భాదలకోసం శ్రమలకోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాం! అయితే బాధలు లేకుండా, సిలువమరణం లేకుండా మనకు మొదటగా నిత్యరక్షణ వచ్చేది కాదు! రెండవదిగా ఆయన సంపూర్ణసిద్ధి/ పరిపూర్ణత గల ప్రధానయాజకుడు అయ్యుండేవారు కాదు!

 

    ఇక తర్వాత జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసమునకు విధేయులైన వారికి లేక తనకు విధేయులైన వారికి అందరికి లేక ఆయనకు విధేయులైన వారికి మాత్రమే నిత్యరక్షణ కలుగుతుంది. అలాగే సంపూర్ణసిద్ధి పరిపూర్ణత ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఎవరైతే దీనిని నిరాకరిస్తారో వారికి పాపవిముక్తి లేదు! నిత్యనరకమే! మరలా ఒకసారి గుర్తుకు చేస్తున్నాను!యేసుక్రీస్తుప్రభులవారు కార్చిన రక్తము కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు! అది కాలంలో ఉన్నవారికి, తర్వాత జన్మించిన వారికి, నేటి దినాలలో జీవిస్తున్న మనకు, ఇంకా రాబోయే కాలంలో పుట్టబోయే వారికొరకు అందరికొరకు కూడా రక్తము చిందించబడింది. అంతేకాకుండా రక్తము సరిపోతుంది. అది ఇంకా ప్రవహిస్తుంది. అయితే ఎవరైతే దీనిని అంగీకరిస్తారో వారు మాత్రమే పాపములు కడుగబడి విడుదల పొంది రక్షణ పొందుతారు! నమ్మి బాప్తిస్మము పొందనివారు రక్షించబడరు! నమ్మనివారికి శిక్ష విధింపబడును అని బైబిల్ సెలవిస్తుంది. మార్కు 16:16; కాబట్టి ఇప్పడు దీనిని అంగీకరించిన వారిని మాత్రమే దేవుడు నిత్యరక్షణ కలిగించి సంపూర్ణులుగా చేస్తారు.

యోహాను :36

కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

 

అపో 5:32

మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

 

2థెస్సలొనికయులకు 1: 9

దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింప బడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

 

ఇది నమ్మకానికి లేక విశ్వాస సంభంధమైన విధేయత! ఇది కేవలం ఉచితంగా దేవుడిచ్చిన కృప! ఉచితంగా దేవుడు దయచేశారు. మన మంచి పనుల వలన ఇది సాధ్యం కాదు!

ఇదంతా కేవలం దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని మెల్కీసెదెకు క్రమంలో యాజకునిగా పంపించినందు వలననే ఇది సాధ్యమయ్యింది.

 

ఇక 11 వచనంలో ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి గాని మీరు అర్ధం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు....హెబ్రీయులకు 5: 11

ఇందునుగూర్చి (లేక, ఇతనిగూర్చి) మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.

 

ఇక చివరి వచనం ప్రకారం  వయస్సు వచ్చినవారై లేక పరిపూర్ణముగా గ్రహించదానికి మేలుకీడులు వివేచించటానికి ప్రయత్నం చేయాలి ...

 

  ప్రియ స్నేహితుడా! ప్రధాన యాజకత్వంలో నీవున్నావా? అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయనలాగా విధేయత చూపిస్తున్నావా? ఆయనలాగా ప్రార్ధన విజ్ఞాపనలు చేస్తున్నావా నీవు? ఆయనలాగా పరిశుద్దుడుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఆత్మపూర్ణుడుగా ఉంటున్నావా?

 

గమనించాలి! ఆత్మకలిగి పరిపూర్ణత కలిగియుంటేనే పరిశుద్దత కలిగియుంటేనే తప్ప పరలోకం చేరలేవు అని గ్రహించమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*20 భాగం*

 

హెబ్రీ 8:12

1. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.

2. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు,(మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

 

      ప్రియదైవజనమా! మనం కొద్దిరోజులుగా మెల్కీసెదెకు క్రమం కోసం ధ్యానం చేసుకుంటున్నాము. ఇంతవరకు మెల్కీసెదెకు క్రమము అనగా నూతన నిబంధన యాజకధర్మమునకు కర్త అయిన యేసుక్రీస్తుప్రభులవారు పాత నిబంధన ధర్మశాస్త్ర యాజక ధర్మం లేక ఆహారోను యాజకధర్మం కంటే విధంగా గొప్పవారు అనేది, లేవీ కంటే, మోషేగారి కంటే ఆయనే గొప్పవాడు అని ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం! అలాగే అసలు యాజకుడు చేసే పనులు విధులుకూడా ధ్యానం చేసుకున్నాం! అయితే దానికోసం ఇంతవరకు 2, , 4,5 మరియు 7 అధ్యాయాలనుండి ధ్యానం చేసుకున్నాం! ఇక 6 అధ్యాయం కోసం చివర్లో ధ్యానం చేసుకుందాం! ఇక ఈరోజునుండి 8 అధ్యాయం నుండి 10:21 వరకు ధ్యానం చేసుకుందాం! అన్ని అధ్యాయాలు చెప్పేది మెల్కీసెదెకు క్రమం పరిపూర్ణమైనదని సంపూర్ణసిద్ధి కలిగించేది అని తెలియజేస్తున్నాయి.

 

   ఇక 8 అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మామూలుగానే పాత నిబంధన యాజకధర్మము కంటే యేసుక్రీస్తుయొక్క నూతన నిబంధన యాజకధర్మం గొప్పదని వివిధకోణాలలో ఋజువుచేస్తున్నారు. అనగా మానవ యాజకధర్మం కంటే దేవుని ఆధ్యాత్మిక యాజకధర్మం ఎంతో శ్రేష్టమైనదని చెబుతున్నారు. కారణం ఆయన సాక్షాత్తుగా పరలోకంలో గల దేవుని పవిత్ర దేవాలయములోనే మనకోసం యాజకుడుగా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి యాజకధర్మం ఎంతో శ్రేష్టమైనది. ఉత్కృష్ఠమైనది!

 

మరో విషయం ఏమిటంటే 15వచనాలలో  మానవ యాజకులందరూ పరలోకంలో ఉండే దేవాలయానికి సూచనగా ఉన్న చిన్న ప్రత్యక్షగుడారంలో లేక చిన్న మందిరంలో/ దేవాలయంలో పరిచర్య చేశారు గాని యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన లేక ఒరిజినల్ దేవాలయంలోనే యాజకుడుగా ఉన్నారు అంటున్నారు అధ్యాయంలో!

 

 ఇక మిగిలిన వచనాలలో పాత నిబంధన కంటే మరింత శ్రేష్టమైన క్రొత్త నిబంధన యాజకధర్మం పాత నిబంధన ధర్మం కంటే మరింత శ్రేష్టమైనది అని 613 వచనాలలో చెబుతున్నారు!

 

1. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.

2. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను

 

చూడండి మేము వివరిస్తున్న సంగతులలో అంటూ మొదలుపెట్టారు. అనగా ఇంతవరకు మొదటి అధ్యాయం నుండి 7 అధ్యాయం వరకు యేసుక్రీస్తుప్రభులవారి యాజకధర్మం పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన యాజకధర్మం కంటే ఎలా గొప్పదో వివరిస్తున్నారు కదా బోధయొక్క సారాంశం ఏంటంటే అని మొదలుపెట్టారు... అనగా ఇంతవరకు ఆయన చెబుతున్న విషయాలనే అధ్యాయంలో కొనసాగిస్తున్నారు.

 

  మనకు అట్టి ప్రధానయాజకుడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యులుకాక దేవుడే స్తాపించిన నిజమైన గుడారానికి లేక మందిరానికి పరిచారకుడై పరలోకమందు మహామహుని అనగా దేవదేవుని సింహాసమునకు కుడి ప్రక్కన ఆసీనుడాయెను అంటున్నారు.

ఇదే విషయాన్ని హెబ్రీ 1: లో కూడా చెప్పారు.....

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక....

 

ప్రధానయాజకుని గుణగణాలు హెబ్రీ 7:26 లో చెప్పారు. మానవ యాజకుల కంటే ఎంత శ్రేష్టుడో వివరిస్తున్నారు......

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (లేక, తగినవాడు)

 

అట్టి గొప్ప ప్రధానయాజకుడు ఇప్పుడు దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు అని చెబుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గుర్తుకుచేస్తున్నారు. ఒకసారి వచనాలు స్టడీబైబిల్ లో చూసుకుని అప్పుడు వివరంగా ధ్యానం చేద్దాం!

 

1  మేము చెపుతున్న సంగతులలో ముఖ్యాంశమిదే: ఇలాంటి ప్రముఖయాజి ఒకడు మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్న మహా ఘనపూర్ణుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు.

2 పవిత్ర గర్భాలయంలో, అంటే నిజమైన ఆరాధన గుడారంలో ఆయన సేవ చేస్తున్నవాడు.

  ఆరాధన గుడారాన్ని వేసినది మనుషులు కాదు గాని ప్రభువే.

 

ఇక్కడ రెండవ వచనంలో పరలోకంలో సింహాసనం ఉంది అంటున్నారు. మీద చెప్పిన రిఫరెన్సులోనే కాకుండా మనం ప్రకటన గ్రంధంలో చూడవచ్చు పరలోకంలో సింహాసనం మీద దేవదేవుడు ఆసీనుడైయున్నారు, ఆయన కుడిప్రక్కన యేసుక్రీస్తుప్రభులవారు కూర్చొన్నారు.

ఇక పరిశుద్ద ఆలయంలో అంటున్నారు- ఎక్కడ పరిశుద్ధ ఆలయం ఉంది? పరలోకంలో ఒక పరిశుద్ధ ఆలయం ఉంది. దానికి పరిచారకుడు లేక యాజకుడుగా యేసయ్య ఉన్నారు. దేవాలయమే నిజమైన దేవాలయం, నిజమైన గుడారం.

హెబ్రీ 9:1, 11

1. మొదటి నిబంధనకైతే సేవానియమములును లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.

11. అయితే క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా....

 

ప్రకటన 7:15

అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;

 

ప్రకటన 11:19

మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

 

ప్రకటన 13:6

గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

 

ప్రకటన 14:15

అప్పుడు మరియొక దూత దేవాలయములోనుండి వెడలివచ్చి భూమి పైరుపండి యున్నది, (మూలభాషలో- యెండిపోయియున్నది) కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో మేఘముమీద ఆసీనుడైయున్న వానితో చెప్పెను.

 

ప్రకటన 15:56

5. అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.

6. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని (అనేక ప్రాచీన ప్రతులలో- నారబట్టను అని పాఠాంతరము) ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.

 

ప్రకటన 16:1

మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.

 

కాబట్టి పై రిఫరెన్సులు అన్నింటినిబట్టి పరలోకంలో దేవాలయం ఉంది, అలాగే సింహాసనం కూడా ఉంది అని అర్ధమవుతుంది.

గమనించాలి! ఇది నిజమైన దేవుని ఆధ్యాత్మిక దేవాలయం! అయితే నిర్గమకాండం 25౩౦ అధ్యాయాలలో దేవుడు చెబితే మోషేగారు చేయించిన ఒక ప్రత్యక్ష గుడారం, దానిలో కొన్ని వస్తువులు, పరికరాలు కనబడతాయి. అవన్నీ దేవాలయంతో పోల్చుకుంటే నిజమైనవే గాని నిజమైన ఆధ్యాత్మిక దేవాలయానికి నిర్గమకాండంలో గల ప్రత్యక్షగుడారం పోలిక అని గ్రహించాలి! దీనినే భక్తుడు ఎత్తి రాస్తూ ఎంతో బాగా వివరిస్తున్నారు 8,9 అధ్యాయాలలో! ధర్మశాస్త్రంలో- పాత నిబంధనలో గలది అబద్దమైనది కాదు గాని నిజమైనది పరిశుద్ధమైనది అయిన పరలోక దేవాలయానికి ఇది నమూనా మాత్రమే! 5 వచనం...హెబ్రీయులకు 8: 5

మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

హెబ్రీ 9:2324

23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను గాని పరలోక సంబంధ మైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.

24. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.

 

హెబ్రీ 10:1

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

 

అనగా ఇప్పుడు నూతన నిబంధన కాలంలో పరలోక ఆరాధన క్రమం లేక పరలోక ఆరాధన గుడారం లేక దేవుని సన్నిధి భూమిమీదకు వ్యాపించినట్టుంది. అతి పరిశుద్ధ స్థలము అనగా దేవుని సన్నిధి అని గ్రహించాలి! అది పరలోకంలో ఉంది! అయితే తెర చిరిగిపోయాక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సిలువకు కొట్టాక ఇప్పుడు దేవుని సన్నిది మనుష్యులతో కూడా ఉన్నది. అనగా దేవుని సన్నిధి భూమిమీదకు దిగి దిగినది అని గ్రహించాలి.

ఇక అక్కడ గల ఇత్తడి బలిపీటం యేసుక్రీస్తుప్రభులవారు చేసిన బలియాగం నకు, కల్వరి గిరికి సూచనగా ఉంది. నిర్గమ 27:1-8;

పరలోక సంబంధమైన ఆరాధనా గుడారం దగ్గరలో గంగాళం ఉంది. పరలోక గంగాళం ప్రస్తుతం భూమిపై ఉంది- దానిలో విశ్వాసులు తమనుతాము ప్రతీరోజు కడుగుకోవలసిన అవసరం ఉంది. ఆయన వాక్యపువెలుగులో, ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడగా పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి కడుగుకోవలసిన అవసరం ఉంది. నిర్గమ ౩౦:1721

ఇక పరిశుద్ధ స్థలము అనగా భూమిపై ఉన్న దేవుని సంఘమే! నిర్గమ 25:3140; ప్రకటన 1:12, 20; ప్రకటన 2:1; దీనికోసం ప్రత్యక్షగుడారమును ధ్యానం చేసుకునేటప్పుడు ధ్యానం చేసుకుందాం!

 

ఇంకా గుడారాన్ని మనుష్యులు చేసింది కాదు లేక మనుషులు స్తాపించినది కాదు- ప్రభువే దీనిని స్తాపించారు అంటున్నారు.

కాబటి అట్టి ఘనమైన దేవుని పరిశుద్ధ గుడారంలో యేసుక్రీస్తుప్రభులవారు మన పక్షంగా ప్రధానయాజకుడుగా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఆయన కృపాసనం దగ్గరకు ధైర్యంగా చేరుదాం అంటున్నారు పౌలుగారు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*21 భాగం*

హెబ్రీ 8:35

3. ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.

4. ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న యెడల యాజకుడై యుండడు.

5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

          (గతభాగం తరువాయి)

 

      ప్రియదైవజనమా! మూడు వచనాలలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు రాస్తున్నారు పౌలుగారు! గమనించాలి యేసుక్రీస్తుప్రభులవారు చిన్న మందిరాలలో కాకుండా నిజమైన పరలోక దేవాలయంలోనే యాజకత్వము చేస్తున్నారు అనే విషయాన్నే మూడు వచనాలలో కొనసాగిస్తున్నారు

 

మొదటగా ౩వ వచనంలో ...ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. .  ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులు అర్పించడానికి నియమింపబడును. కాబట్టి ఈయనకు కూడా అర్పించడానికి ఏదో ఒకటి ఉండుట అవశ్యము! దీనినే హెబ్రీ 5:1 లో కూడా చెబుతున్నారు....

ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.

 అయితే ఇక్కడ ఈయనకు కూడా అర్పించడానికి ఏదైనా ఒకటి ఉండాలి అంటున్నారు. మరి యేసుక్రీస్తుప్రభులవారు మెల్కీసెదెకు క్రమంలో ఒకేఒక ప్రధానయాజకుడు కదా, మరి ఈయనకు అర్పించడానికి ఏముంది?

ఆయనకు కూడా ఉంది- అయితే ఆయన అర్పించింది కోడెల రక్తము, గొర్రెల రక్తము కాకుండా తనను తాను కల్వరిలో అర్పించుకున్నారు. నీకోసం నాకోసం- నీపాపాలు నా పాపాలు , ప్రజలందరి పాపముల క్షమాపణ కోసం తనసొంత రక్తాన్నే బలిపీటం మీద అర్పించారు. మాటిమాటికి కోడెలు గొర్రెలు జంతువులూ బలి అర్పించకుండా తననుతానే అర్పించుకున్న త్యాగమూర్తి ప్రధానయాజకుడు! మిగిలిన యాజకులు జంతువుల రక్తమును లేక ఇతరుల రక్తముతో ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటే ఈయన తన సొంత పవిత్ర రక్తాన్నే అర్పించారు.

 

హెబ్రీ 7:27

ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,

 

హెబ్రీ 9:12

మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

 

అందుకే కోడెల గొర్రెల రక్తముకంటే అభిషక్తుని రక్తము ఇంకా బాగా మానవుల పాపములను శుద్ధి చేస్తుంది అంటున్నారు. హెబ్రీ  9:13,14లో

13. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ (మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

 

ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం: 4 వచనం:.... ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న యెడల యాజకుడై యుండడు.

జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తుప్రభులవారు పరలోకంలో గల నిజమైన మందిరంలో యాజకత్వము చేయడానికి- లేక అక్కడే యాజకత్వం చేయడానికి మరో కారణం ఇక్కడ కనిపిస్తుంది. లేక మృత్యుంజయుడై లేచాక పరలోకం ఎందుకు వెళ్ళవలసివచ్చిందో మరో కారణం ఇక్కడ ఉంది!

చూడండి ఈయన గాని భూమిమీద ఉంటే ఆయన యాజకుడై ఉండరు కారణం భూమిమీద యాజకులు అని పిలువబడిన వారు, యాజకులుగా చేయబడినవారు కొందరున్నారు వారు లేవీయులుఅయితే ఈయన లేవీయుడు కాదు! యూదుడు! మానవ-యాజకధర్మం భూమిమీద ఓడిపోయింది. అనగా దేవుడు ఏమి సాధించాలి అని ఉద్దేశించారో ఉద్దేశ్యం నెరవేర్చలేకపోయింది కాబట్టే నూతనయాజక ధర్మమును దేవుడు తీసుకుని వచ్చారు అని ధ్యానం చేసుకున్నాం! కాబట్టి ఇప్పుడు భూమిమీద లేవీగోత్రం యొక్క క్రమమే ఉంటుంది కాబట్టి అది కూడా పరలోక దేవాలయపు ఛాయ కాబట్టి ఇక నిజమైన దేవాలయంలోనే ఒకేఒక అర్పణ చేసి బల్యర్పణ కార్యము నిర్వహించి ముగించారు. అందుకే భూమిమీద ఉంటే అయన యాజకుడై ఉండరు- ఇప్పుడు పరలోకం వెళ్లి నిజమైన దేవాలయంలోనే యాజకత్వము చేస్తున్నారు. అంతేకాదు మానవ యాజకులు ఎవ్వరూ నిజమైన దేవాలయంలో యాజకత్వం చేయడానికి అర్హులు కాదు కాబట్టి ఈయన అర్హత సాధించి అనగా సంపూర్ణసిద్ధి- పరిపూర్ణత సాధించి దేవాలయంలో యాజకత్వం చేశారు. అంతటితో చేతులు కడుక్కుని కూర్చోకుండా తండ్రి కుడిప్రక్కన కూర్చొని మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు. కాబట్టి ఈయన మానవ యాజకులు కంటే ధర్మశాస్త్ర యాజకులు కంటే ఎంతో శ్రేష్టుడు అంటున్నారు!

 

ఇక మూడవది: 56 వచనాలు:...

5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

6. ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు

మోషేగారు ప్రత్యక్షగుడారం చేసినప్పుడు గాని నిలబెట్టినప్పుడు గాని దేవుడు నీకు కొండమీద చూపించిన మాదిరిచొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్తపడుము అంటూ హెచ్చరిక చేశారు. గమనించాలి ఇది ఎంతో పాముఖ్యమైనది కాబట్టి విధమైన తప్పులు జరగకూడదని నాలుగుసార్లు దేవుడు మోషేగారిని హెచ్చరించారు.

నిర్గమ 25:89

నిర్గమ 25:40

నిర్గమ 26:౩౦

నిర్గమ 27:8

పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.

 

ఇలా హెచ్చరించడానికి కారణం భూమిమీద ఉన్న ప్రత్యక్షగుడారం లేక సన్నిధి గుడారం పరలోక సత్యాలను ప్రతిభింభించేదిగా లేక సూచించేదిగా ఉండాలని దేవుని కోరిక! విధమైన పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తపడమని దేవుడు నాలుగుసార్లు మోషేగారిని హెచ్చరించారు. క్రమం తప్పితే పరలోక సత్యాన్ని వక్రీకరించినదైపోతుంది. కాబట్టి అలా హెచ్చరించారు దేవుడు! అయితే హెబ్రీ 8:2 వచనంలో నిజమైన దేవుని దేవాలయంలోనే ఈయన తప్పులకు తావులేకుండా ఆయనే యాజకత్వము చేసున్నారు అంటున్నారు.....

మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

  ఇక మానవయాజకులు చాయారూపమైన గుడారంలో సేవచేస్తున్నారు గాని ఈయన ఒరిజినల్ మందిరంలోనే సేవచేస్తున్నారు అంటున్నారు.

 

      ప్రియ దైవజనమా! దీనిని బట్టి మనము ఏమి నేర్చుకోవచ్చు?

1) యేసుక్రీస్తు ప్రభులవారు కూడా అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆయన తన రక్తాన్ని అర్పించారు.

మరి మనకు కూడా అర్పించడానికి ఏదయినా ఉండాలి. స్తుతి యాగము చేస్తూ, జిహ్వాఫలము అర్పించాలి. ఇంకా ఆత్మఫలము ఫలిస్తూ ఆయనకు మనమే కానుకగా అర్పించాలి.

 

2) మోషే గారితో నాలుగుసార్లు కొండమీద నీకు చూపించిన విధంగానే గుడారం నిర్మించడానికి జాగ్రత్త పడు అంటూ హెచ్చరించారు. కారణం అది అంత ప్రాముఖ్యతను కలిగిఉంది. అయితే నిజమైన మందిరంలో ప్రవేశించే మనము కూడా అంతే జాగ్రత్తగా ఆధ్యాత్మిక విధులను పాటించవలసిన అవసరం ఉంది. ఆచారపరంగా కాకుండా నిజమైన హృదయం తో మనస్పూర్తిగా ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించాలి.

 

కాబట్టి ప్రియ దైవజనమా! ఈయన నీకు నాకు సరిపోయిన వారు! అట్టి ఘనుడైన కాపరి మరియు యాజకుడు మరియు అపోస్తలుడు అయిన ఆత్యాగమూర్తి కాపరత్వము-యాజకత్వము క్రింద నీకు సంపూర్ణత పరిపూర్ణత సంపాదించగలవు!

ఆమెన్!

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*22 భాగం*

 

హెబ్రీ 8:68

6. ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

7. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.

8. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును.

 

  ప్రియులారా! ఇక అధ్యాయంలో మిగిలిన వచనాలలో అనగా 613 వచనాలలో పాతనిబంధన కంటే క్రీస్తుయేసు యొక్క క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన యాజకధర్మం కంటే క్రొత్త నిబంధన యాజకధర్మం ఎంతో శ్రేష్టమైనదని వివరిస్తున్నారు.

 

  ప్రియ దైవజనమా! 6 వచనంలో మూడు విషయాల కోసం చెబుతున్నారు పౌలుగారు!

మొదటగా పాత వాగ్దానాల కంటే శ్రేష్టమైన వాగ్దానాలు బట్టి నియమింపబడ్డారని,

 రెండవదిగా పాత నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి అని,

మూడవది పాత నిబంధన సేవకత్వము కంటే మరింత శ్రేష్టమైన సేవకత్వము యేసుక్రీస్తుప్రభుల వారిది అని నొక్కివక్కానిస్తున్నారు!

 

   మోషేగారి ద్వారా దేవుడిచ్చిన పాతనిబంధనతో క్రొత్త నిబంధనను భక్తుడు పోల్చి ఏది శ్రేష్టమైనదో చెబుతున్నారు ఇక్కడ! ఇక్కడనుండి అనగా 6 వచనం నుండి 10:18 వరకూ ఇదే ప్రయత్నం చేస్తున్నారు భక్తుడు! పాతనిబంధనకోసం ముఖ్యమైన వాగ్దానాలు నిబంధన మనకు నిర్గమ 19:56, నిర్గమ 19:2125 లో కనబడతాయి మనకు! అలాగే క్రొత్త నిబంధన కొరకైన వాగ్దానాలు యిర్మియా 31:3134 వచనాలలోను, మత్తయి 26:28 లోనూ కనిపిస్తున్నాయి.........

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

 

మత్తయి 26: 28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

ఇక రెంటినీ భక్తుడు ఒకే దగ్గర పోల్చి చెబుతున్నారు 2కొరింథీ :618 వచనాలలో....

6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

7. మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.

8. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?

11. తగ్గిపోవునదే (లేక, కొట్టివేయబడు) మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.

12. తగ్గిపోవుచున్న (లేక, కొట్టివేయబడు) మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.

14. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ముసుకే నిలిచియున్నది.

17. ప్రభువే ఆత్మ! ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.

18. మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత (లేక, ఆత్మయగు ప్రభువుచేత) పోలికగానే మార్చబడుచున్నాము.

 

ఇక్కడ ఆయన రాసినదాని ముఖ్యసారాంశం ఏమిటంటే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే ఏది నెరవేరాలని దేవుడు కోరారో, దానిని పాత నిబంధన నెరవేర్చలేక పోయింది! అయితే క్రొత్త నిబంధన దానిని నెరవేర్చింది. మరి రెండు దేవుడే కదా ఇచ్చారు మరి పాతది ఎందుకు నెరవేర్చలేకపోయింది అంటే పాత నిబంధన లో కేవలం నియమ నిబంధనలు మాత్రమే ఇవ్వబడ్డాయి. వాటిని మీరితే పాపులని దోషులని తీర్పుతీర్చడం జరుగుతుంది. అయితే క్రొత్త నిబంధనలో నిబంధనను నెరవేర్చడానికి ప్రజలు నిబంధనలో కొనసాగటానికి మొదటగా తోడుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండవదిగా క్రీస్తుకృపా సింహాసనం ఉంది. అక్కడ ఇక్కడ తప్పుచేస్తే దండన ఉంది. గాని ఇక్కడ కరుణ కృప క్షమాపణ ఉన్నది. నిబంధనలో కొనసాగటానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఎల్లప్పుడూ ఉంటారు. అక్కడ కేవలం దండన మాత్రమే కనిపిస్తుంది. కేవలం భూలోకసంభంధమైన శుద్ధి కార్యక్రమాలు మాత్రం ఉన్నాయి. నిబంధనలో కేవలం శుద్ధి కార్యక్రమాలే కాకుండా దేహము, మనస్సు ఆత్మ శుద్ధిగా ఉండేలా పరిశుద్ధమైన జీవితం జీవించేలా దోహదమవుతూ నిన్ను శుద్ధిచేస్తుంటుంది,. పాత నిబంధనలో దేవుడు తన ఆజ్ఞలకు విదేయులైతే వారికి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయి అని మాట ఇచ్చారు దేవుడు! క్రొత్త నిబంధనలో దీవెనలకు ప్రాధాన్యత నీయకుండా శ్రేష్టమైన విషయాలు కోసం వాగ్దానం చేయబడింది.

మొదటగా పాప క్షమాపణ,

రెండవది నూతన హృదయం,

మూడవది శాశ్వతజీవం,

నాల్గవది దేవుని గురించిన జ్ఞానం,

ఐదవది పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తానని దేవుడు ప్రమాణం చేశారు! ఇచ్చారు! ఇవన్నీ కలగటానికి కేవలం పాపినని గ్రహించి పశ్చాత్తాప పడి ఆయనను శరణువేడి పాపాలు కడుగుకుని ఆయనమీద విశ్వాసం ఉంచడం అంతే! అప్పుడు ఇవన్నీ కలుగుతాయి!

 

      పాత నిబంధనలో అయితే అన్నీ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంతే! అయితే వీటిని పొందుకోవాలంటే బలులు, అర్పణలు దూపదీపాలు నైవేద్యాలు అన్ని చేయాలి! మరి క్రొత్త నిబంధనలో అవన్నీ అవసరం లేదా అంటే బౌతికంగా అవసరం లేదు! ఆధ్యాత్మికంగా కావాలి! దీనికోసం ప్రత్యక్ష గుడారం కోసం ధ్యానం చేసుకునేటప్పుడు ధ్యానం చేద్దాం! క్రొత్త నిబంధన అనేది ఆధ్యాత్మికమైన విషయాలకు సంబంధించింది. పాతనిబంధన భూలోక సంభంధమైన ఆశీర్వాదాలకు దేహశుద్ధికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏది శ్రేష్టమైనది?!!

 

    కాబట్టి ఇంతశ్రేష్టమైన వాగ్ధాలన్నీ క్రొత్త నిబంధనలో ఉన్నాయి. శ్రేష్టమైన నిబంధనలకు మధ్యవర్తిగా యేసుక్రీస్తుప్రభులవారు ఉన్నారు!

హెబ్రీ 8:1012

10. దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.

11. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.

12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

 

ఆయన మంచి మధ్యవర్తి!

హెబ్రీ 9:15

హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

హెబ్రీ 12:24

క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.

 

1తిమోతికి 2: 5

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

అయితే మధ్యవర్తిత్వం దేవుడే దానిని క్రీస్తుయేసు ద్వారా స్థాపించారు. అంతేకాకుండా క్రొత్త నిబంధనకు కారకుడుగా కూడా క్రీస్తుయేసునే దేవుడు నియమించారు. ఆయనద్వారానే ఎప్పుడూ దీనిని ఫలవంతంగా దేవుడు చేస్తున్నారు.

 

ఒక విషయం చెప్పనీయండి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారినే ఎందుకు మధ్యవర్తిగా నియమించారు?

జవాబు: ఉదాహరణ: ఇప్పుడు ఒక హెబ్రీ ప్రసంగీకుడు మన దగ్గరకు వచ్చి ప్రసంగం చేస్తే మనకు అర్ధమవదు! అది అర్ధం కావాలంటే తెలుగు భాష హెబ్రీ భాష రెండు భాషలు వచ్చిన ఒక వ్యక్తి మనకు తర్జుమా చేస్తేనే అర్ధమవుతుంది మనకు! రెండు భాషలలో తర్జుమా దారుడికి మంచి పట్టుండాలి. అప్పుడే బాగా చెప్పగలరు! అంతంత మాత్రమే తెలిస్తే మనకు అర్ధం అవ్వదు సరికదా అర్ధాలు మారిపోతాయి. అలాగే ఇప్పుడు దేవుడు లేక పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిత్వం చేయాలంటే రెండు భాషలు వచ్చిన వాడు ఉండాలి. అక్కడ ఇక్కడ నివశించిన వాడు అయి ఉండాలి. అక్కడ పరిస్తితులు ఇక్కడ పరిస్తితులు తెలిసిన వాడై ఉండాలి. లేకపోతే తేడాలు జరిగిపోతాయి! రెండు దేశాల మధ్య రాయభారిగా గాని మధ్యవర్తిగా ఉండాలి అంటే రెండు ప్రాంతాలలో తిరిగిన వాడు, రెండు ప్రాంతాల మీద అవగాహన కలిగిన వాడై ఉండాలి. అలాగే ఇప్పుడు పరలోక భూలోకాల మీద అవగాహన ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు! దేవదూతలు కేవలం పరలోక సంబంధమైన విషయాలు తెలుసు! భూమి మీద పరిస్తితులు తెలియవు! వారికి రక్తమాంసాలు లేవు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అదే రక్తమాంసాలతో ఉన్న మానవులను రక్షించడానికి అదే రక్తమాంసాలతో భూలోకానికి వచ్చి రక్షణ కార్యం జరిగించి బలియాగం చేసి యాజకత్వం చేసి ఇప్పుడు మానవులకు దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉన్నారు ఇప్పుడు! మధ్యవర్తి కూడా ఎక్కడ ఉన్నారు, తండ్రి కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు! అందుకే మధ్యవర్తి, ఉత్తరవాది, యాజకుడు మనకు సరిపోయిన వారు అంటున్నారు పౌలుగారు!

మరి ఆయన మధ్యవర్తిత్వం లోనికి వస్తావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*23 భాగం*

 

హెబ్రీ 8:68

6. ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

7. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.

8. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును.

 

  ప్రియులారా! 613 వచనాలలో పాతనిబంధన కంటే క్రీస్తుయేసు యొక్క క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన యాజకధర్మం కంటే క్రొత్త నిబంధన యాజకధర్మం ఎంతో శ్రేష్టమైనదని వివరిస్తున్నారు. దానినే ఇంకా ధ్యానం చేద్దాం మనం!

 

  7 వచనంలో ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ క్రొత్త నిబంధనకు అవకాశం ఉండేది కాదు అంటున్నారు. ఏడవ అధ్యాయంలో వివరించిన విషయాన్ని మరలా ఎత్తి రాస్తున్నారు పౌలుగారు! 7:11.

లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీ సెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?

 

ఇక్కడ 8:7 లోను దానినే రాస్తూ అలా అనడానికి గల కారణాలు వివరిస్తున్నారు.

 

   ఇంతకీ *పాతనిబందనలో గల లోపములు ఏమిటి*? అంటే మొదటగా సంపూర్ణసిద్ధి తీసుకుని రాలేదు. రెండవది మానవుల పాపములనుండి సంపూర్తిగా విడిపించలేదు! ప్రజలంతా పాపులే అని చెబుతుంది. కారణం మనుషులు అన్ని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించలేరు! ఒకవేళ ఎట్టి పరిస్తితులలోను ఒక ఆజ్ఞను మీరితే అన్ని ఆజ్ఞలను మీరినట్లే! .యాకోబు 2: 10

ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినయెడల (తొట్రిల్లిన యెడల), ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;

 

 అందుకే ప్రజలు ఆజ్ఞలను పాటించలేకపోయారు! ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము! 1యోహాను 3: 4

పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

 ఇది మరింత పాపులుగాను దోషులుగాను తీర్చిదిద్దింది. తద్వారా దేవుని దీవెనలకు బదులుగా శాపాన్నే తీసుకుని వచ్చింది ధర్మశాస్త్రం మరియు పాత నిబంధన లేక పాత ఒడంబడిక!

రోమా 8:3,4

3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము

4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

 

గలతీ  3:10-13

10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

12. ధర్మ శాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో- శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

 

మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చింది మనుష్యులను వారి పాపములనుండి విడిపించి పవిత్రులనుగా చేసి మరలా వారిని దేవునితో ఐక్యపరచడానికి గాని ఇప్పుడు అంతా విరోధంగా జరుగుతుంది. మోషే గారి దగ్గరనుండి మలాకి గారి వరకు అలాగే జరిగింది. అందుకే యిర్మియా గారి సమయంలో దేవుడు మరో క్రొత్త నిబంధన చేశారు. యిర్మియా 31:3134లో. దానినే ఇక్కడ పౌలుగారు ఒక్కోమాట వివరించి రాస్తున్నారు 812 వచనాలలో!

 

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

 

Hebrews(హెబ్రీయులకు) 8:8,9,10,11,12

8. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును.

9. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.

10. దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.

11. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.

12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

 

ఇదిగో దేవుడు చెప్పేదేమిటంటే ఒక కాలం రాబోతుంది అప్పటిలో అనగా ఆరోజులోపల ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేస్తాను. అది నేను మీ పితరులను ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చినప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు అంటున్నారు. మరి నిర్గమకాండంలో నిబంధన చేశారు. అలాంటి నిబంధన కాదు అంటున్నారు. ఎందుకంటే అది మానవులను తమ పాపములనుండి విడిపించలేదు విడిపించలేకపోయింది. ఇంకా ఏమంటున్నారు అంటే వారు నిబంధన నియమాల వలన వారు నా నిబంధనలో నిలువలేదు అందుకే నేను వారిని అలక్షము చేశాను అంటున్నారు. గతభాగంలో వివరించినట్టు పాత నిబంధన మనుష్యులు ఎలా ఉండాలి ఏమి చెయ్యకూడదో నియమ నిబంధనలు ఇచ్చింది గాని వారు దానిని పాటించడానికి ఏవిధమైన సహాయం చెయ్యలేదు! నిర్గమకాండం నుండి మలాకి వరకు పాతనిబందనలో చరిత్ర మొత్తం వారు చేసిన నమ్మకద్రోహాల కోసమే వ్రాయబడింది.

 

అయితే నిబంధన అనగా ఇప్పుడు చేయబోయే నూతన నిబంధన అలాంటిది కాదు అంటున్నారు. క్రొత్త నిబంధనలో నా శాసనాలను నా ఆజ్ఞలను వారి హృదయాలలోనే ఉంచుతాను. వారి మనస్సులలో ఉంచుతాను అంటున్నారు. వారి హృదయాల మీద రాస్తాను అంటున్నారు. అప్పుడు నేను వారికి దేవుడనై ఉంటాను వారు నాకు ప్రజలై లేక పిల్లలై ఉంటారు అంటున్నారు దేవుడు!

 

   ఇది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం! తన ప్రజలను నూతన హృదయం గలవారిగా భిన్నమైన వారుగా చేసి వారు తన ఆజ్ఞలను పాటించగలిగే మనస్సునూ హృదయాన్ని వారికి ఇస్తాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నారు! అక్కడ యిర్మియా గ్రంధంలో వాగ్దానం చేశారు! దేవుడు యేసుక్రీస్తుప్రభువుగా లోకానికి వచ్చి అదే వాగ్దానాలను తిరిగి తనదైన రూపులో మరలా ప్రజలతో ఇచ్చారు!

యోహాను 1:1214

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు.

14. వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని ( లేక, జనితైకకుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

యోహాను :8

3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా ( లేక, పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేముముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

రోమా 8:4

3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

 

2కొరింథీ 5:172

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

 

 ఇప్పుడు వారు నాకు ప్రజలై ఉంటారు అంటున్నారు.

2కొరింథీ 6:1618

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.

 

1పేతురు 2:910

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

 

ఇంకా ముందుకుపోతే వారు ఎలాంటివారైనా అనగా అల్పులైనా ఘనులైనా , ఇంకా చెప్పాలంటే పండితులైనా పామరులు/మోటువారైన గాని వారంతా నన్ను తెలుసుకుంటారు అంటున్నారు.

 

మత్తయి 11: 28

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

 

John(యోహాను సువార్త) 14:6,17

6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

 

యోహాను 17:2, 6

2. నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.

6. లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

 

ఇక్కడ నన్ను తెలుసుకుంటారు అనేది దేవుని గురించిన జ్ఞానము మాత్రమే కాదు. అది ఒకరకమైన సూటియైన ఆధ్యాత్మికమైన అనుభవపూర్వకమైన జ్ఞానం. ఇంకా దేవునితో పరిచయం! మరి ఇతర మార్గము వేదాంతము మతవ్యవస్థ  దీనిని  ఇవ్వడం అసాధ్యం!

1కొరింథీ 1:1921

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

20. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? లోకపు (మూలభాషలో- యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*24 భాగం*

హెబ్రీ 8:11-13

11. వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.

12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

13. ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు (మూలభాషలో- నివర్తనమగుటకు) సిద్ధముగా ఉన్నది.

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 11 వచనంలో ఒకడు మరొకరికి ఉపదేశంచేయడు. వారిలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు అందరు నన్ను తెలుసుకుంటారు అంటున్నారు.

 

ఇక 12 వచనం చాలా చాల ప్రాముఖ్యమైనది. నేను వారి దోషముల విషయమై దయకలిగి వారి పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకం చేసుకోను అంటున్నారు. ఇది చాలా దొడ్డమాట!

యెషయా 44:22

మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

 

మీకా 7:19

ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.

 

లూకా 24:47

యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

 

అపో 13:3839

38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,

39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.

 

రోమా 4:68

6. ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు.

7. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

8. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,

 

 ఇక్కడ నేను వారి దోషముల విషయమై దయకలిగి వారి పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకం చేసుకోను అంటున్నారు. ఇది చాలా దొడ్డమాట!

అయితే మాటతో అపోహపడవద్దు! ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఉన్నాము గనుక మనం పాపం చేసినా పర్వాలేదు, వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోను అని వాగ్దానం చేశేశారు గనుక ఎన్ని పాపాలు చేసినా క్షమించు బాబు అని అడిగితే దేవుడు క్షమించివేస్తారు, మరలా మనం మన పాపాలు యధావిధిగా చేసుకోవచ్చు అనుకుంటే పుచ్చులేచిపోతుంది. కారణం అక్కడ దేవుడు వాగ్దానం చేసింది ఇంతవరకు వారు గాని వారియొక్క పితరులు చేసిన పాపములను జ్ఞాపకం చేసుకోను అంటున్నారు, గాని వారు పాపం చేస్తే చూసి చూడకుండా ఉంటాను, వాటిని మరచిపోతాను అనడం లేదు! మంచి ఫలాలు ఫలించక పోయినా కారు ద్రాక్షలు కాచినా, అసలు ఫలాలే ఫలించక పోయినా గొడ్డలి ఇప్పుడే చెట్టువేరున ఉంచబడింది దానితో తెగనరుకుతాను అనికూడా చెప్పారని మరచిపోవద్దు! అయితే ఆయన కరుణామయుడు కాబట్టి మనం పాపం చేయకుండా ఆయన వాక్యాన్నే మన హృదయాలలో మన మనస్సులలో రాస్తున్నారు కాబట్టి మన మనసాక్షి, మన అంతరాత్మ మనకు బోధించినప్పుడు హెచ్చరించి నప్పుడు మనం దానిని చేయకుండా మానివేయాలి! అంతేకాకుండా ఆయన వాక్యం మనలను ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనలను నడిపిస్తూ ఉంటారు. వీటన్నింటిని కాదని పాపం చేస్తే, అవి తప్పని తెలిసి కావాలనే పాపం చేస్తే అప్పుడు ప్రతిదండన తప్పదు అని గ్రహించాలి. అయితే పొరపాటున కొన్ని పరిస్తితులలో పాపం చేస్తే, నిజమైన పశ్చాత్త్తాపం కలిగి కన్నీటితో దేవుని పాదాలు కడిగి ఆయన కరుణా పీఠం వద్ద, ఆయన కృపాసనం వద్దకు వచ్చి క్షమాపణ అడిగి వాటిని విడిచిపెడితే దేవుడు ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్దమనస్సు గల దేవుడు! (నెహెమ్యా 9:17; కీర్తన 86:5); ఆయన యెద్ద కృప దొరుకుతుంది. క్షమాపణ దొరుకుతుంది. ఆయన పేరే కరుణామయుడు! తప్పకుండ క్షమిస్తారు.

అందుకే ఇక్కడ మనం పాపము చేయకుండా మనలను ఆపడానికి ఇన్ని అవకాశాలు ఇచ్చారు దేవుడు!

 

ఇక 13 వచనంలో  క్రొత్త నిబంధన అని చెప్పడం వలన మొదటిది అనగా పాత నిబంధన పాతదిగా చేసియున్నాడు అంటూ ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమగుటకు లేక నివర్తనమగుటకు అనగా రద్దుచేయడానికి సిద్దముగా ఉంది అంటున్నారు. అనగా పాత నిబంధన రద్దుచేశారు అంటున్నారు. గమనించండి యేసుక్రీస్తు ప్రభులవారు అన్నమాట గమనించాలి: మత్తయి 5:17 లో

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; *నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు*.

 

ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చారు. మరి పౌలుగారు రద్దుచేశారు అంటున్నారేమి? అనగా మొదటగా ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు దానిని అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చి-సంపూర్తిచేసి, తన రక్తముతో క్రొత్త నిబంధన చేసి ఇక పాత దానితో పనిలేదు కాబట్టి పాత ధర్మశాస్త్రాన్ని రద్దుచేశారు అని అర్ధం!

 

కాబట్టి నూతన నిబంధనలో ఉన్న ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు చాలా ఘనమైన నిబంధనలో ఉన్నావు! నిబంధనలో కరుణ కృప దొరుకుతుంది. అయితే కావాలని పాపం చేస్తే ఇక నిత్య ప్రతిదండానే అని మరిచిపోవద్దు!

 

Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

 

2 Peter(రెండవ పేతురు) 2:17,20,21,22

17. వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

21. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

22. కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

కాబట్టి భయమునొంది పాపము చేయకు!

నీకునీవుగా పరిశుద్దుడుగా ఉండలేవు! ఆదరణ కర్తను ఎల్లప్పుడూ సహాయం చేయమని అడుగు! అతడు అనగా పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించి/ నడిపిస్తూ నిన్ను తన మార్గములో దేవుని మార్గములో బాటలో నడిచేలా సహాయం చేస్తారు!

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*25 భాగం*

హెబ్రీ 9:17

1. మొదటి నిబంధనకైతే సేవానియమములును లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.

2. ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

3. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధస్థలమను గుడారముండెను.

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

5. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

6. ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

7. సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

 

  ప్రియులారా! 9 అధ్యాయంలో కూడా పాతనిబంధన కంటే క్రీస్తుయేసు యొక్క క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన యాజకధర్మం కంటే క్రొత్త నిబంధన యాజకధర్మం ఎంతో శ్రేష్టమైనదని వివరిస్తున్నారు. హెబ్రీ పత్రికలో ఈఅధ్యాయం 7 అధ్యాయం వలె అతి శ్రేష్టమైనది.

 

అధ్యాయంలో 17 వచనాలలో పాతనిబంధనలోగల ప్రత్యక్ష గుడారం ఎలా ఉండేది, అందులో యాజకులు ఎలా పరిచర్య చేసేవారు అనేదానిని వివరిస్తున్నారు

 

అయితే ప్రత్యక్ష గుడారపు పరిచర్య దేనికి సాదృశ్యముగా ఉంది అనేదానిని 810 వచనాలలో వివరిస్తున్నారు భక్తుడు!

 

 ఇక 1128 వచనాలలో ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు చేసిన ఒకేఒక బలియాగం/అర్పణ గూర్చి వివరించి ఆయన ఏరకంగా నిజమైన పరలోక దేవాలయంలో పవిత్ర రక్తాన్ని అర్పించారో ఎలా దేవాలయంలో ప్రవేశించారో చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యేలా చెబుతున్నారు.

 

మరి అనుకోవచ్చు ఇప్పుడు మనం నూతన నిబంధన లో ఉన్నాము మనకు ప్రత్యక్షగుడారం, అర్పణ అర్చనాదులు లేవు కదా ఇవన్నీ మనకెందుకు అని!!! అయితే ఇప్పుడు మనం అర్చనలు అర్పణలు నైవేద్యాలు చేస్తున్నామా లేదా అనేదానిని భక్తుడు వివరిస్తున్నారు!

 

    మొదటి వచనంలో మొదటి నిబంధనకైతే సేవానియమాలు లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉంది అంటూ అది ఎలా ఉందో వివరిస్తున్నారు. నిర్గమ 25:8 లో దేవుడు ఒకమాట చెబుతున్నారు: నేను వారిమధ్య నివసించేలా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. గమనించాలి దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలమధ్య నివాసం చెయ్యాలని కోరుకుంటున్నారు. వారిమధ్య నివాసం చేస్తూ వారు అర్పించే స్తుతులను ఆస్వాదించాలని వారు సన్మార్గంలో నడవాలని దేవుని కోరిక! అందుకే ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని దేవుడు మోషేగారికి చెబుతున్నారు. ఏం పరిశుద్ధ స్థలమే ఎందుకు? మామూలు స్థలంలో సరిపోదా? అంటే: ఆయన చెబుతున్నారు: నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు. లేవీ 11:44,45;

 అంతేకాకుండా యెషయా 6 అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన పరిశుద్ధుడు గనుక దూతలు సెరూపులు కెరూబులు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని పరిశుద్ధ దేవునికి ఎల్లప్పుడూ గాన ప్రతిగానములు చేస్తున్నట్లు చూడగలం! కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనుక తన పిల్లలు కూడా పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తూ ఉండాలి. గనుకనే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెబుతున్నారు దేవుడు! వారితో నివాసం చెయ్యాలనే తలంపుతోనే వారితో ఎల్లపుడు ఉండేలా ఒక మార్గం ఏర్పాటుచేశారు దేవుడు అదే పత్యక్ష గుడారం! అయితే ఇప్పుడు పవిత్రుడైన దేవుడు మనిషితో సహజీవనం లేక సహవాసం చెయ్యాలంటే అడ్డుపడేది మానవులలో ఉన్న పాపం! పవిత్రుడైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఆయన దగ్గరకు చేరనీయకుండా పాపం అడ్డుకుంటుంది. ఒకసారి యెషయా 59:12 చూసుకుంటే...

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

 

అందుకే ఇప్పుడు మానవులను పాపం నుండి విడుదల చేద్దాం, వారిని పవిత్రులుగా చెయ్యాలనుకుని దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటుచేసి వారి పాపములకు పరిహారం చెయ్యాలని ధర్మశాస్త్రాన్ని నియమ నిబంధనలు- యాజకత్వము- అర్చనాదులు- బలులు- అన్నీ ఇచ్చారు! కారణం దేవునికి తెలుసు మానవులలోని ఊహ బాల్యము నుండి చెడ్డది అని తెలుసు! Genesis(ఆదికాండము) 6:5,6

5. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

6. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

 అందుకే వారు తప్పకుండా తాను చేసిన ఆజ్ఞలను మీరుతారు, దానిని కూడా కడిగి పరిశుద్దులుగా చెయ్యాలనే తలంపుతో ప్రేమతో ఒక మార్గాన్ని ఏర్పాటుచేశారు. అది పవిత్రత, బలియర్పణల మార్గం! అదే ప్రత్యక్షగుడారపు సేవ!

 

  నిర్గమ 2540 అధ్యాయాలలో దీనికోసం విస్తారంగా రాయబడింది. ప్రత్యక్ష గుడారం కోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటగా ఒక గుడారం ఉంది. అందుకో దీప స్థంభమును బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను. అంతటిని పరిశుద్ధ స్థలము అని పేరు అంటున్నారు పౌలుగారు! గమనించాలి. మరి ఇప్పుడు మనకు ఇవి లేవు కదా అనుకోవచ్చు! అవి ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి! వాటిని మనం పాటిస్తున్నాము! అవి అర్ధం కావాలంటే అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయో చాలా క్లుప్తంగా చూసుకుంటూ ముందుకు పోదాం!

 

గమనించాలి: నిర్గమ 2540 అధ్యాయాలు దీనినే వివరిస్తున్నాయి. దాని అంతరార్ధం చాలా మర్మ పూరితంగా ఉన్నాయి! అయితే ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలిదేవుడు సృష్టిని ఎలా చేశారు అనే దానిని బైబిల్ లో కేవలం రెండు అధ్యాయాలు మాత్రమే చెబుతున్నాయి. అయితే పరిశుద్ద నియమ నిబంధనల కోసం సుమారుగా 40 అధ్యాయాలు చెబుతున్నాయి అంటే దీనియొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలి.

 

గుడారంలో మొదటగా ఉండేది: దీపస్తంభం: నిర్గమ 25:3140 లో దీనికోసం చూడవచ్చు! మేలిమి బంగారంతో దీప స్తంభాన్ని చేయమని దేవుడు అక్కడ సెలవిస్తున్నారు. దీప స్తంభం: తేజోరూపియైన యేసుక్రీస్తుప్రభులవారికి సూచన! యోహాను సువార్తలో మనం చూసుకుంటే ఆయనలో జీవముంది. వెలుగుంది. ఇంకా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నారు. ఇంకా నేను లోకమునకు వెలుగును అంటూ మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నారు.

యోహాను సువార్త 1:4,5,9

4. ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

5. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

 

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

యోహాను 9:5

నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

 

ఆయన లోకాన్ని వెలిగించేవారు. ఆయన వెలుగులోనే మనం నడవాల్సిన అవసరం ఉంది. లోకమంతా సాతానుడు కలిగించిన చీకటిలో అంధకారంలో ఉండగా ఇప్పుడు మానవునికి కావలసింది దేవుని వెలుగు! వెలుగు సాతాను చీకటిని పారద్రోలి జీవితాన్ని వెలిగించి నిన్ను పరలోకం చేరుస్తుంది.

 

ప్రియమైన స్నేహితుడా! నీవు ఇంకా పాపపు చీకటిలో దారి తెలియక దిక్కుతోచని పరిస్తితులలో ఉంటే నేడే ఆయన వెలుగు దగ్గరకు రా! నేనే మార్గమును సత్యమును జీవమును అని చెబుతూ నేనే వెలుగును అంటున్నారు. యోహాను 14:6;

 

ఆయన వెలుగులో మన రహస్య పాపములు కనబడతాయి.

కీర్తనలు 90: 8

మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

 

వెంటనే ఆయన రక్తంలో పాపములు కడుగుకోవాలి!

 

దీప స్తంభానికి ఏడు శాఖలు, ఒక్కొక్క శాఖకు ఒక్కో దీపము ఉన్నాయి. బైబిల్ గ్రంధంలో ఏడు అనేది సంపూర్ణ సంఖ్య మరియు సంపూర్ణతకు గుర్తు! ఇది ఆయనలో గల లోపరాహిత్యానికి గుర్తు! ప్రకటన 1:4, 12, 16; ప్రకటన 5:6

వెలుగు క్రీస్తే. దేవుని చెంతకు మార్గం చూపించడానికి, ఆరాధనకు సేవకు వెలుగు తప్ప మరేది అవసరం లేదు! గుడారంలో సూర్యుడు చంద్రుడూ మరి ఇతర కాంతి జనకాలు లేవు. ఇంకా యాజకులు కూడా తమవెంట దీపములు తెచ్చుకోవలసిన అవసరం లేదు! ఇక లేవీ కాండంలో దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దీపములు ఆరిపోకూడదు అంటున్నారు దేవుడు! ఇది రాబోయే కాలంలో దేవుని పట్టణంలో అనగా నూతన యెరూషలేము లేదా పరమ యెరూషలేములో కూడా ఇలాంటిదే చూడగలం!

ప్రకటన 21:23

పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

 

ప్రియ దైవజనమా! దీపస్తంభమైన యేసయ్య దగ్గరకు వస్తావా? ప్రయాస పడి భారం మోసుకొనుచున్న సమస్తజనులారా! నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. వెలుగులో నీ రహస్య పాపములు అన్నీ కనబడితే వాటిని వాక్యముతో కన్నీటి ప్రార్ధనతో కడుగుకోగలవు! ఇక వెలుగు ఆరిపోకుండా నిత్యమూ వెలుగుతూ ఉండాలి అంటున్నారు. అలాగే నీ జీవితం కూడా దేవుని సన్నిధిలో  పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని నిరంతరం ఆత్మాభిషేకం అనుభవిస్తూ మండే జ్వాలగా వెలుగుతూ వెలిగిస్తూ ఉండాలి. నిత్యమూ వెలుగుతూ ఉంటేనే నిత్యరాజ్యంలో ప్రవేశించ గలవు. దీపములు ఆరిపోయినందువలననే బుద్ధిలేని కన్యకలు పెండ్లి విందులో పాలుపొందలేదు!

అలాగే దీపస్థంభానికి ఏడు శాఖలున్నాయి. అనగా పరిపూర్ణముగా ఉన్నాయి. అలాగే మనం కూడా ఆత్మలో మండుతూ ఇతరులను మండిస్తూ పరిపూర్ణత సాధించాలి!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*26 భాగం*

హెబ్రీ 9:17

2. ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.

3. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధస్థలమను గుడారముండెను.

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

 

       (గతభాగం తరువాయి)

ఇక తర్వాత ప్రత్యక్షగుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉండేది : బల్ల!

బల్ల నిర్గమ 25:23౩౦ ప్రకారం తుమ్మకర్రతో చేయమని చెబుతున్నారు దేవుడు! దానిని మేలిమి బంగారంతో పొదిగించాలి

బల్ల ఎందుకు అంటే లేవీ 24:57 ప్రకారం బల్లమీద భక్ష్యాలు పిండివంటలు వండి దేవుని సన్నిదానంలో బల్లమీద పెట్టాలి!

బల్ల జీవాహరమైన క్రీస్తుకు సూచనగా ఉంది!

యోహాను 6:35

అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

 

అంతేకాకుండా బల్ల బల్ల ఆరాధనకు ప్రభు సంస్కారానికి కూడా సాదృశ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

 

గమనించాలి ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు వారు ప్రతిరోజూ పోగుచేసుకుని తినగల మన్నా వంటి పదార్దం కోసం చెప్పలేదు గాని తన గురించే చెబుతున్నారు ఇక్కడ.

 

యోహాను 6:48,50,51

48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 

తనను జీవాహారంగా చెప్పుకుంటూ మానవ దేహానికి ఆహారం ఎలాగో, అలాగే మనుషుల మనస్సులకు హృదయాలకు ఆత్మలకు తాను అనగా యేసుక్రీస్తుప్రభులవారే జీవాహారముగా చెబుతున్నారు ఇక్కడ!

ప్రియ చదువరీ నీకు కూడా జీవాహారం కావాలి! అది లేకనే ఆత్మీయ ఆకలితో, అల్లాడుతూ సాతాను చేతిలో నలిగిపోతున్నావు. ఈలోకంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బక్కచిక్కిపోయి ఉన్నావు! నీకు ఇప్పుడు కావలసింది జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభులవారు! ఆయనను ఆహారంగా స్వీకరిస్తావా?

 

ఇక బల్లమీద సన్నిధి రొట్టెలు ఉన్నాయి

రొట్టెలు యేసుక్రీస్తు ప్రభులవారు! జీవాహారము నేనే అంటున్నారు. ఇది కూడా యేసుక్రీస్తుప్రభులవారినే సూచిస్తుంది. మరి ఎలా రొట్టెలు తినాలి. మనకు అసలు బల్లగాని, పరిశుద్ధ స్థలం గాని గుడారం గాని కనబడటం లేదు కదా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభులవారు నూతన నిబంధన క్రొత్త నిబంధన ఇచ్చేటప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి!

మత్తయి 26: 28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

మత్తయి 26: 26

వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 11:23,24,25,27,29

23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

24. దానిని విరిచియిది మీకొరకైన (అనేక ప్రాచీనప్రతులలో- మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

25. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

27. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

 

గమనించాలి ఇక్కడ రొట్టె ఆయన దేహమునకు గుర్తుగా ఉంది. రొట్టెను మనం భుజించినప్పుడు ఆయన దేహమును భుజించినట్లు! అప్పుడు మనం జీవాహారాన్ని భుజిస్తున్నట్లు! అప్పుడే నీకు పరలోకము! అయితే దానిని అయోగ్యముగా తినకూడదు! అలా తింటే అలా ద్రాక్షరసమును సూచించే ఆయన రక్తాన్ని అయోగ్యముగా తీసుకుంటే జీవానికి ప్రతిగా శాపము వస్తుంది అంటున్నారు పౌలుగారు!

 

ప్రియ స్నేహితుడా! ప్రియ సహోదరి! నీవు ఎలా రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటున్నావు? ఏదో ఆచారబద్దంగా తీసుకుంటే ఫలితం లేదు. తద్వారా దీవెనకు ఆశీర్వాదానికి ఫలితంగా శాపం వస్తుంది. అది భుజించేటప్పుడు అది నిజముగా ఆయన మనకోసం చేసిన బలియాగాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ రొట్టె ఆయన దేహమని, ద్రాక్షారసం ఆయన కార్చిన కల్వరి రక్తమని గ్రహించి భయముతో వణకుతో భక్తితో తీసుకుంటే అది నీకు నిత్య జీవము! జీవాహారము! లేకపోతే శాపమని తెలుసుకోమని కన్నీటితో ప్రభువు ప్రేమతో బ్రతిమిలాడుతున్నాను!

దయచేసి అయోగ్యముగా తీసుకోవద్దు!

నీ పాపములు విడిచి పెట్టి ఒప్పుకుని అప్పుడు తీసుకో!

అదినీకు జీవము!

లేకపోతే మరణమని గ్రహించమని మనవిచేస్తున్నాను!

అంతేకాకుండా యేసుక్రీస్తు ఎలా విరువబడ్డారో నలుగగొట్టబడ్డారో, నలుగగొట్టబడి కూడా ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారో మనం కూడా అలాగే శ్రమలలో విరుగగొట్టబడుతూ శ్రమలను సహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*27 భాగం*

హెబ్రీ 9:17

3. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధస్థలమను గుడారముండెను.

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

 

           (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం పరిశుద్ధ స్థలంలో ఉన్న విషయాల కోసం ధ్యానం చేసుకున్నాం! అనగా గుడారము, దాని ప్రత్యేకత, బల్ల, దీపస్థంభం, సన్నిధి రొట్టెలు కోసం ధ్యానం చేసుకున్నాం! 8 అధ్యాయంలో పరిశుద్ధస్థలము అనగా ఏమో కాదు అది భూమిమీద నున్న దేవుని సంఘము మరియు ఆయన సన్నిధి అని ఇంతకుముందే ధ్యానం చేసుకున్నాం! దేవుని సన్నిధి భూమిమీద వ్యాపించి ఉంది. అది పరలోకంలో మహాదేవుని మందిరం నుండి భూమి మీద దేవుని సంఘం వరకు వ్యాపించి ఉన్నది సన్నిధి! గమనించాలి ఎవరైనా అయన సన్నిధిలో ప్రవేశించాలి అప్పుడే వారి పాపములకు పరిహారం కలుగుతుంది. దేవుని సన్నిధిలో దేవుని ఆలయంలో దేవుడు నిలిచి యున్నారు కాబట్టి ఆయనాత్మ వారిని పాపములను ఒప్పిస్తాడు. వారు పాపులు అని తెలుసుకొనేలా చేస్తాడు. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు తేటగా కనిపిస్తాయి. కాబట్టి ఎవరైనా సరే మందిరానికి రావలిసినదే! నాకు ఇంట్లో అన్ని చానల్లు వస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు దేవుని వాక్యమే వింటున్నాను! ఇక నాకు దేవుని మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అనుకుంటే అది తప్పు అని గ్రహించాలి. దేవుని ఆలయంలో/ సమాజంలో దేవుడు ఉంటారు.

కీర్తనలు 82: 1

దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.

అక్కడ నీకు సహవాసం దొరుకుతుంది. ఆదరణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించవచ్చు!

 

  ఇక మూడవ వచనం నుండి రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది ఇక 4 వచనంలో దానిలో ఉన్న వస్తువులు కోసం చెబుతున్నారు. రెండవ తెర నిర్గమ 26:3135 ప్రకారం పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని విడదీస్తుంది. మొదటి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులకు ప్రవేశం ఉంది గాని అతి పరిశుద్ధ స్థలం లోనికి యాజకులకు కూడా ప్రవేశం లేదు! కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి! అదీకూడా అర్పించబడిన రక్తమును తీసుకుని వెళ్ళాలి! ఇక 36:3536 లో కూడా దీనికోసమే వ్రాయబడింది. తెరకు ఒకప్రక్క దీపస్తంభము బల్ల, దానిమీద సముఖపు రొట్టెలు ఉంటాయి. మరొక ప్రక్క బంగారు దూపార్తి, మందసం పెట్టె మన్నా, చిగిర్చిన ఆహారోను కర్ర లాంటివి ఉంటాయి. రెంటిని తెర వేరుచేస్తుంది. గమనించాలి తెర మోషేగారి సమయం దగ్గరనుండి యేసుక్రీస్తుప్రభులవారి మరణం వరకు ఉంది. యేసుక్రీస్తుప్రభులవారి మరణించినప్పుడు తెర రెండుగా చిరిగిపోయింది. మత్తయి 27:51

కాబట్టి ఇప్పడు పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో అడ్డం అనేది ఏమీ లేదు! ఎవరైనా విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధమైన హృదయంతో పరిశుద్ధ జీవితం కలిగి అతిపరిశుద్ధ స్థలం లోనికి ప్రవేశించవచ్చు!

ఇంకా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతకు వెళ్లాలి అంటే ఆత్మతో నడిపించబడుతూ తలంపులలో కూడా పాపం చేయకుండా ఉండగలగడమే బహుశా అతిపరిశుద్ధత లేక అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం.

ఇదే నూతన లేక పరమ యెరూషలేము లేక పరమ సీయోను అనుభవం! దీనిలోనికి రాడానికి కేవలం ఆహారోను గోత్రానికి చెందినవారే కానక్కరలేదు! జాతి మత కుల వర్ణ బేధాలు ఏమీలేవు. దేవుని దృష్టిలో అందరూ సమానమే!

 హెబ్రీ 9:8; హెబ్రీయులకు 9: 8

దీనినిబట్టి మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

 

హెబ్రీ 10:1922

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచ బడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

గమనించాలి యేసుక్రీస్తు ప్రభులవారి మరణం వరకు మార్గం వెల్లడి కాలేదు! అర్పణల మార్గం, ప్రత్యక్ష గుడారం మార్గమే ఉండేది. ఇప్పుడైతే దేవుని సన్నిధిని చేరే మార్గం పూర్తిగా సరాళం చేయబడింది.

 

ఇక అతి పరిశుద్ధ స్థలంలో మొదటగా బంగారు దూపార్తి లేక సువర్ణదూపార్తి కనిపిస్తుంది. దీనికోసం మనకు నిర్గమ ౩౦:110 వచనాలలో కనిపిస్తుంది. దూపార్తి అనగా దూపం వేసే దూప వేదిక. గమనించాలి దూపవేదిక కొన్నిసార్లు పరిశుద్ధ స్థలంలోను కనిపిస్తుంది. అతి పరిశుద్ధ స్థలం లోను కనిపిస్తుంది. దూపవేధిక దానిపై వేసే పరిమళద్రవ్యములు మనుష్యుల పక్షముగా దేవుణ్ణి వేడుకునే మధ్యవర్తి అయిన మెల్కీసేదేకు క్రమంలో ప్రధాన యాజకుడైన క్రీస్తుయేసును, ప్రజల పక్షముగా తండ్రి కుడిప్రక్కన ఆసీనుడై ఉండి మన పక్షముగా విజ్ఞాపనం చేసే యేసుక్రీస్తుప్రభులవారికి సూచనగా ఉంది.

శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే  రోమా 8:4

హీబ్రు 7:25

ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

 

హెబ్రీ 9:24

అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.

 

యోహాను 17:126

1తిమోతి 2:5

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

గమనించాలి మధ్యవర్తి ద్వారానే అనగా క్రీస్తుయేసు ద్వారానే దేవునికి మనం చేసే స్తుతులు ప్రార్ధనలు విజ్ఞాపనలు చేరుకుంటాయి. మానవునికి దేవునికి మధ్య ఉన్న మధ్యవర్తి కేవలం యేసుక్రీస్తు ప్రభులవారు అని గ్రహించాలి. మరెవరూ లేరు! రోమన్ కేథలిక్ వారు చెప్పినట్లు మరియమ్మ గారు గాని, చనిపోయిన పరిశుద్దులు అని పిలువబడే సెయింట్ లు గాని ఎవరూ మధ్యవర్తులు కానేకారు!

హెబ్రీ 13:15

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

 

ప్రకటన 8:4

3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై (మూలభాషలో-ఇచ్చుటకై) అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.

4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.

 

అనగా మనం చేసే స్తుతులు, ప్రార్ధనలే ఆయనకు ధూపం అని గ్రహించాలి.

గమనించాలి మీదన పరిమళ ద్రవ్యము అనగా క్రీస్తుయేసు చేసే మధ్యవర్తిత్వము మరియు విజ్ఞాపనలు అని చూసుకున్నాము. ఇక్కడ నిర్గమ ౩౦:9 లో పరిమళ ద్రవ్యము కాక అన్య అగ్ని గాని మరే ఇతర పరిమళద్రవ్యములు దూపవేధిక మీద అర్పించకూడదు అంటున్నారు. అన్యాగ్ని అర్పించిన కోరహు దాతాను అభీరాములు కాలిపోయినట్లు మనం సంఖ్యాకాండములో చూడగలం! అంతేకాకుండా హోమం లాంటివి కూడా దూపవేధిక మీద వెయ్యకూడదు. అది ఆవరణంలో ఉన్న బలిపీటం మీద జరగాలి. దీని అర్ధం ఏమిటంటే నీకు నాకు మధ్యవర్తి కేవలం యేసుక్రీస్తు ప్రభులవారే అన్యులు ఎవరూ లేరు! మీ సంఘకాపరి గాని మరే భక్తుడు కూడా మధ్యవర్తి కానేరడు!

 

 ఇక ప్రధానయాజకుడు మధ్యవర్తి కరుణామయుడు, ఆయన సింహాసనమే కృపాసనం కాబట్టి ఏవిధమైన పొరపాట్లు పొరపాటున చేస్తే కరుణామయుని కృపాసనం వద్దకు ధైర్యముగా వద్దాము అంటున్నారు పౌలుగారు!

హెబ్రీయులకు 4: 16

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

 మన అవసరతలు ఏమున్నా సరే ధైర్యముగా సమీపిద్దాము అంటున్నారు. ముఖ్యంగా ఆయన వద్ద నిత్యజీవము, ప్రేమ కరుణ, క్షమాపణ, పరిశుద్ధాత్మ లాంటివి దొరుకుతాయి కాబట్టే ధైర్యంగా వద్దాము అంటున్నారు.

 

ప్రియ దైవజనమా! మధ్యవర్తి నీకు నాకు సరిపోయిన వారు!

ఆయనను ఆశ్రయిస్తావా?

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*28 భాగం*

హెబ్రీ 9:17

3. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధస్థలమను గుడారముండెను.

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

5. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

 

         (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం అతిపరిశుద్ధ స్థలంలో ఉన్న విషయాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము. ఇక దూపవేధిక తర్వాత మనకు కనబడేది మందసం! లేక నిబంధన మందసము! అదే బంగారు రేకులతో తాపబడియున్నది అంటున్నారు.

 

   నిబంధన మందసం కోసం నిర్గమ 25:1015 వరకు చూడవచ్చు! దీనిని కూడా తుమ్మకర్రతోనే చేసి దానికి మేలిమిబంగారుతో పొడిగించారు. మందసం కోసం బైబిల్ లో చాలా విస్తారంగా వ్రాయబడి ఉంది. నిర్గమ కాండం నుండి ప్రకటన గ్రంధం వరకు దీనికోసం వ్రాయబడియుంది. కారణం పరలోకంలో కూడా నిబంధన మందసం ఉంది ప్రకటన 11:19 లో కనిపిస్తుంది.

మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

 

భూలోకం లోని నిబంధన మందసం పరలోకంలో గల నిజమైన మందసానికి పోలిక లేక సాదృశ్యంగా ఉంది

హెబ్రీ 8:12; 5

1. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.

2. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

దీనికోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు తన ప్రజలను ఐగుప్తుదేశం నుండి తీసుకుని వచ్చేటపుడు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనకు సూచనగా ఉంది.

నిర్గమ 25:15

ద్వితీ 10:15

మరి ఇది ఇశ్రాయేలువారికి దేవుడు చేసిన నిబంధనకు అనగా పాత నిబంధన- ఒడంబడికకు అది సూచనగా ఉంటే మరి పరలోకంలో ఉన్న మందసం దేనికి సూచన? మొదటగా యుగాంతంలో ఇశ్రాయేలు ప్రజల విమోచన కోసం దేవుడు చేసిన రెండవ నిబంధన లేక క్రొత్త నిబంధనకు సూచనగా ఉంది.

రెండవది: అన్యజనులందరిని లేక సమస్త అన్యజనులారా అంటూ దేవుడు చేసిన క్రొత్తనిబంధనకు కూడా సూచనగా నిబంధన మందసం ఉంది.

 

నిబంధన మందసానికి సైన్యములకధిపతియగు యెహోవా నిబంధన మందసం అని కూడా పేరు ఉంది! 2సమూయేలు 6:2

కాబట్టి మందసం దేవునికి- తన ప్రజలకు మధ్యలో ఉన్న నిబంధనకు సూచనగా ఉంది.

 

ఇక పెట్టెలో లేక నిబంధన మందసంలో పది ఆజ్ఞలు గల చెక్కిన రాతి పలకలు ఉన్నాయి. రాతి పలకలు దేవుడు సీనాయి పర్వతమందు దేవుడిచ్చిన పది ఆజ్ఞలకు సూచనగా ఉన్నాయి! ద్వితీ 10:25

అంతేకాకుండా నిబంధన మందసం యేసుక్రీస్తు ప్రభులవారికి కూడా సూచనగా ఉంది. కారణం నేను మీతో క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఇది మీ కొరకైన  క్రొత్త నిబంధన అని యేసుక్రీస్తు ప్రభులవారు మత్తయి 26 లో నిబంధన చేశారు. కాబట్టి నిబంధన మందసం ఎవరో కాదు అది యేసుక్రీస్తు ప్రభులవారినే సూచిస్తుంది. అంతేకాకుండా ప్రజలమధ్య నివసించే దేవుని సన్నిధి యేసుక్రీస్తుప్రభులవారే! పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రము, పది ఆజ్ఞలు గల పలకలు ఇస్తే- దేవుని ధర్మశాస్త్రాన్నే తన హృదయంలో ఉంచుకున్నది యేసుక్రీస్తుప్రభులవారు! కీర్తనలు 40:78

మరి ఇప్పుడు మందసం లో దేవుని పది ఆజ్ఞలుగల రాతి పలకలున్నాయి. కాబట్టి అది యేసుక్రీస్తుప్రభుల వారే అని గ్రహించాలి!

 

మరి ఇప్పుడు మరో అనుమానం రావచ్చు! ఎందుకంటే మందసంలో మన్నా గల గిన్నె మరియు చిగిరించిన ఆహారోను కర్ర! మరి అవి ఎలా ఉన్నాయి యేసుక్రీస్తులో??!!

జీవాహారం నేనే అంటూ సెలవిచ్చిన యేసుక్రీస్తే మన్నా! ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుడైయుండెను అంటూ వాక్యమైయున్న దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా క్రీస్తు యేసుగా మనమద్యన నివశించుచున్న యేసే పరమ మన్నా! అంతేకాకుండా ఆయనే తన ప్రజలకొరకు ఆహారమై జీవాహారమై ఉన్నారు. దానిని మనం ప్రభు సంస్కారంలో భుజిస్తున్నాము!

 

సరే, బాగుంది మరి చిగురించిన ఆహారోను కర్ర దేనిని సూచిస్తుంది?

మెల్కీసేదేకు క్రమం చొప్పుణ నిరంతరమూ ప్రధానయాజకునిగా వచ్చిన వాడు మన యేసుక్రీస్తుప్రభులవారు! కాబట్టి చిగురించిన ఆహారోను కర్ర నిరంతరమూ దేవుని సన్నిధిలో మనకోసం యాజకత్వము, మధ్యవర్తిత్వమూ జరిగిస్తున్న ఒకేఒక ప్రధానయాజకుడైన క్రీస్తును సూచిస్తుంది.

దేవునికి స్తోత్రం!

 

ఇనతవరకూ బాగుంది! మరి మందసం గాని, బలిపీటం గాని ఇవన్నీ తుమ్మకర్రతోనే ఎందుకు చెయ్యాలి? సరే చేశారు మరి బంగారంతో లేక మేలిమి బంగారంతో ఎందుకు పొదిగించాలి?

నిర్గమ 26:15౩౦ లో దీనికోసం వ్రాయబడింది. పలకలు చేసే విధానం కోసం నిర్గమ 36:2034 వరకు ఉంది. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం తుమ్మకర్ర ఎడారిలో పెరుగుతుంది. ప్రజలమధ్య అనగా గ్రామాల మధ్య ఉండదు! అనగా ఎడారిలో పెరిగే మొక్క! ఇది యేసుక్రీస్తుప్రభుల వారియొక్క మానవతకు లేక మానవుడుగా యేసుక్రీస్తుప్రభులవారు భూమిమీద నివాసం చేయడాన్ని సూచిస్తుంది. యెషయా 53:2

ఆయన మనకోసం మరణించేటప్పుడు ఆయనకు సొగసైన సురూపమైన లేకుండా పోవడాన్ని సూచిస్తుంది. అనగా ఆయన మనకోసం పడిన శ్రమలను భాధలను కూడా తుమ్మకర్ర సూచిస్తుంది.

 

మరి బంగారం ఎందుకు పొదిగించాలిబంగారం క్రీస్తుయేసు దైవత్వానికి సూచన! ప్రకటన 21:18, 21, ఇంకా ఆయనకు గల దేవుని మహిమకు ప్రకాశానికి కూడా గుర్తుగా ఉంది! నిర్గమ 25:1011

అంతేకాదు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు ఆయనకు బంగారం, సాంబ్రాణి బోళము అర్పించారు. దానిలో బంగారము ఆయన దైవత్వానికి సూచనగా ఉంది!

అయితే జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే తుమ్మకర్ర మీద బంగారం పొదిగించారు! అనగా ఆయన మానవుడు మరియు దేవుడు అని అర్ధం! ఇది ఆయన దైవమానవతకు గుర్తు! అంతేకాకుండా ఆయనకు దైవమానవతలో పరిపూర్ణత రావడానికి కారణం ఆయన చెల్లించిన వెల! ఆయన పడిన హింసలు, బాధలు! అవన్నీ అనుభవించిన తర్వాతనే ఆయనకు పరలోకమందును భూలోకమందును అధికారం ఇవ్వబడింది! మహిమను తీసుకుని వచ్చింది. అందుకే ప్రతీ మోకాళ్ళు ఆయన నామంలో వంగవలసినదే! అదే ఆయనకు అన్ని నామముల కంటే పై నామమును తీసుకుని వచ్చింది!

 

మరి క్రమంలో వెండిని కూడా వాడారు! నిర్గమ 26, 27 అధ్యాయాలు;

 వెండి దేనికి సూచన?

వెండి- విమోచనకు సూచనగా ఉంది! నిర్గమ ౩౦:1116; లేవీ 5:15; సంఖ్యా :4751 ప్రకారం!

ఇది ఆయన చేయబోయే- లేక చేసిన విమోచన కార్యానికి సూచనగా వెండిని వాడారు! ఆయన దైవమానవుడు! యోహాను 1:1, 14;

1తిమోతి 2:5

దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

 

తీతు 2:13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

 

మరి ఆయనచేసింది విమోచనా కార్యం! ఎఫెసి 1:7

దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

 

తీతు 2:14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

కాబట్టి విమోచనా కార్యం ద్వారా రక్షించబడిన నీవునేను కూడా ఆయనలాగే ప్రకాశించాలి. ఆయనలాగే శ్రమలను అనుభవించాలి! అప్పుడు ఆయనలాగే శ్రమల ద్వారా పరిపూర్ణత సాధించగలము! ఆయన శ్రమలను అనుభవించారు కాబట్టే పరిపూర్ణత సాధించగలిగారు! మనం కూడా అదే శ్రమలద్వారా అదే పరిపూర్ణత సాదించగలము! అలాగే శోధనల ద్వారానే ఆయన మహిమపరచ బడ్డారు! మనం కూడా అదే శోధనల గుండా పయనించి మనం కూడా మహిమలోనికి ప్రవేశించగలము!

ప్రియ స్నేహితుడా! నీవు సిద్దమా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*29 భాగం*

హెబ్రీ 9:17

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

5. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

6. ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

7. సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

 

            (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం అతిపరిశుద్ధ స్థలంలో ఉన్న విషయాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము. నిబంధన మందసము అందులో ఉన్న వస్తువులు తర్వాత అతి పరిశుద్ధ స్థలములో మనకు కనబడేది కరుణాపీఠం ఇంకా కెరూబులు!

కరుణాపీటము- దేవుని కృపాసనమునకు గుర్తు! దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం గనుక ముందుకు పోదాం! హెబ్రీ పత్రిక 4 అధ్యాయం లో పౌలుగారు అందుకే అనగా ఆయన దైవమానవుడు మనలను అర్ధం చేసుకునే వాడు, మనలాగే సహానుభవం గలవాడు గనుక ఆయన కృపాసనం దగ్గరకు ధైర్యంగా వద్దాము అంటున్నారు. కాబట్టి ఇక్కడ కనబడే కరుణాపీఠం దేవుని కృపాసనమునకు సూచనగా ఉంది.

ఇక కెరూబులు: కెరూబులు దేవుని విగ్రహాలు కానేకావు! దేవుడు చాలా స్పష్టముగా దేనిరూపముగా నైనా విగ్రహాలు చేయకూడదు అన్నారు. మరి ఇవి ఎందుకు అంటే? వీటిని అక్కడ ఉంచినది వాటిని పూజించమని కాదు! కెరూబులు అనేవి దేవుని పవిత్రసన్నిధిని లేక దేవుని మహిమగల సన్నిధిని సూచిస్తాయి. మనకు యెషయా గ్రంధంలో గాని, యేహెజ్కేలు గ్రంధంలో గాని, ప్రకటన గ్రంధంలో గాని కెరూబులు తండ్రియైన దేవుని సింహాసనమునకు దగ్గరలో ఉంటాయి. అనగా ఆయన మహిమగల పవిత్రమైన సన్నిధానమునకు గుర్తుగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవిచేసే మరో ముఖ్యమైన పని ఇవి రెండవ అడ్డతెర మాదిరిగా పరిశుద్ధస్థలమును, అతిపరిశుద్ధ స్థలమును విడదీస్తాయి! ప్రధానయాజకునికి మాత్రమే దీనిలో ప్రవేశముంది గాని మరెవరికి దగ్గరకు సమీపించడానికి వీలులేదు! అదికూడా ప్రధానయాజకుడు బలిరక్తము తీసుకుని మాత్రమే దేవుణ్ణి సమీపించాలి ఇక్కడ! కాబట్టి ఇక్కడ కెరూబులు దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క పవిత్రతకు సూచనగా ఉన్నాయి అని గ్రహించాలి!

 

కాబట్టి ప్రియ దైవజనమా! ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్దులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. నిషిద్దమైనవి అపవిత్రమైనది ఏదీ అందులో ప్రవేశించకూడదు! కాబట్టి మనం ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే ఆయన మహిమలో ప్రవేశించాలి అంటే కావలసినది పరిశుద్ధత! పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేవు అని గ్రహించాలి. ఇంకా పరమ సీయోను అనుభవం కావాలంటే పరిశుద్ధత నుండి అతిపరిశుద్దతను సాధించాలి. మాటలోనే కాకుండా తలంపులతో కూడా పాపములేని జీవితం కలిగియుండాలి.

 

  ప్రియ దైవజనమా! నేను తొందరగా దీనిని ముగించాలని అనుకుంటున్నాను. ఇక ఇక్కడ కనబడేడి దేవుని మహిమ! ఎక్కడైతే దేవుని కెరూబులు ఉంటాయో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. గమనించాలి- దేవుని సింహాసనం దగ్గరనే కెరూబులు ఉంటాయి కాబట్టి దేవుని మహిమలోనే ఇవి కూడా ఉంటాయి. అనగా దేవుని మహిమను తట్టుకోగలవు కెరూబులు! అయితే గమనించాలి తన ప్రజలమధ్య నివసించే ఉద్దేశంతో దేవుడు తన మహిమతో ప్రత్యక్ష గుడారానికి దిగివచ్చేవారు! అంతేకాకుండా సొలోమోను దేవాలయం ప్రతిష్ఠకు కూడా ఇలా మహిమతో వచ్చారు దేవుడు! మహిమ ఎవరో కాదు అది దేవుని కుమారుడైన క్రీస్తే! ఆయన భూమిమీదకు మనుష్యులతో నివాసం చెయ్యాలని ఆశతో వచ్చేవారు! యోహాను 1:14, 18

మత్తయి 17:22; 2పేతురు 1:1617; 2కొరింథీ 4:46; కొలస్సీ 1:19; హెబ్రీ 1:; ప్రకటన 1:1318; ప్రకటన 21:23;

 

గమనించాలి మనకు ఇంకా ప్రత్యక్ష గుడారములో ఆవరణంలో గంగాళం కనిపిస్తుంది. దీనిలో యాజకులు యాజకత్వము చేసేముందుగా, ఇంకా పరిచర్య చేసేముందు కడుగుకుంటారు. అయితే ఇది భూమిమీద మనుష్యులు దేవుని సన్నిధిని సమీపించి తమ పాపములను కడుగుకోవడాన్ని సూచిస్తుంది. దానిలో గల నీరు విశ్వాసులు కార్చే కన్నీరు లేక పశ్చాత్తాపంతో చేస్తే కన్నీటి ప్రార్దన అనిగ్రహించాలి! దేవుని వాక్యపువెలుగులో ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మన రహస్యపాపములు కనబడినప్పుడు వాక్యం మనలను గద్దించినప్పుడు వెంటనే గద్దింపుకు లోబడి పాపిని ప్రభువా నన్ను క్షమించమని నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్ధన చేస్తే కన్నీటితో దేవుని పాదములను తడిపితే తడిచిన పాదాలతో ఆయన నిన్ను దాటుకుని పోలేరు! గంగాళములో నీ పాపములు శుద్ధి అయిపోతాయి!

 

ఇంకా అక్కడ మనకు కనబడేది ఇత్తడి బలిపీటం! ఇది యేసుక్రీస్తుప్రభులవారు చేసిన యేసుక్రీస్తుప్రభులవారు కల్వరి గిరిలో చేసిన బలియాగమునకు గుర్తు! ఎందుకంటే బలిపీటం మీదనే రక్తమును చిందించి అర్పిస్తారు. అలాగే కల్వరికొండమీద యేసుక్రీస్తుప్రభులవారి బలియాగం వలననే నీకు నాకు విమోచన కలిగింది. దానికి సూచనగా వారు ఇత్తడి బలిపీటము చేసారు. గమనించాలి! ప్రత్యక్ష గుడారం గాని, ధర్మశాస్త్రము గాని రాబోయే లేక జరుగబోయే వాటికి సూచన మాత్రమే గాని నిజమైనది క్రీస్తుయేసులో ఉంది అని పౌలుగారు చాలాసార్లు చెప్పారు! కాబట్టి ఇవన్నీ అనగా బలిపీటం గాని, ఇత్తడి బలిపీటం గాని, కరుణా పీఠం గాని, సువర్ణదూపార్తి గాని, కెరూబులు గాని, ఇవన్నీ దేవుని సన్నిధిని సూచించే యేసుక్రీస్తుప్రభులవారినే సూచిస్తున్నాయి! వాటిని వారు చాయలు తయారుచేసుకుని ఆరాధించేవారు! ఇవన్నీ దేహశుద్ధి కోసమే తప్ప ఆత్మశుద్ధి కోసం కాదు!

 

అయితే నూతన నిబంధన సంఘంలో గల మెల్కీసెదెకు క్రమంలో జరిగే కార్యక్రమాలు అన్నీ మనస్సును, ఆత్మను హృదయాన్ని శుద్ధిచేస్తాయి! పాత నిబంధనలో ఉన్నవి క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నాయి! వాటిని దేవుడు కొట్టివేయలేదు- పూర్తిచేసి లేక నెరవేర్చి- వాటిని క్రొత్త పోలికలో కేవలం దేహాన్ని మాత్రమే కాకుండా తనువూ మనస్సు ఆత్మ కూడా శుద్ధి అయ్యేలా, ఇకను పాపం చేయకుండా చేసేలాగా దేవుడు క్రొత్త నిబంధనలో ఏర్పాటుచేశారు. క్రమమే మెల్కీసేదేకు క్రమము!

 

అయితే మీరనవచ్చు మరి వారు నైవేద్యాలు ధూపాలు వేసేవారు కదా మనం వేయడం లేదు కదా! వారు బలి అర్పించేవారు కదా మనం చేయడం లేదు కదా అంటే మనం కూడా వాటిని చేస్తున్నాము!

ఎలా అనొచ్చు మీరు!

 

మనం కూడా యాగములు చేస్తున్నాము. అదే స్తుతియాగం! కీర్తనలు 50: 14, 23

దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

స్తుతియాగం చెల్లించేవాడు నన్ను మహిమ పరుస్తున్నారు అంటున్నారు దేవుడు!.

 

బలి!! మనం కూడా బలులు అర్పిస్తున్నాము. ఏమిటవి? విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలి అని కీర్తన 51:17 సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో ప్రార్ధన చేయడమే ఆయనకు ఇష్టమైన బలి!

 

మరి ధూపము! కీర్తన 141:2 నా ప్రార్ధన ధూపము వలెను, నేను చేతులెత్తుట అనగా మనం చేతులెత్తి ప్రార్ధన చెయ్యడమే ఆయనకు సాయంకాల నైవేద్యంలా ఉంటుంది. అందుకే పౌలుగారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయమని చెప్పారు. 1తిమోతి 2:8;

 

  కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! ఇవన్నీ మనం కూడా చేస్తున్నాము! అవి అనగా పాత నిబంధన ఆచారాలు ఇప్పుడు మనం చేసేవాటి యొక్క సూచనలు మాత్రమే! వారు చేసినది సూచనలు! మనం చేసేవి యధార్ధమైనవి! కాబట్టి విరిగినలిగిన హృదయం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే ఆయన మనలను పరిశుద్ధాత్మతో నింపి ఆయన మహిమలో మనలను నింపుతారు. అంతేకాకుండా మనం చేసే ఆరాధన ఇశ్రాయేలువారు చేసినట్లు ఆచారపరంగా చేస్తే ఉపయోగం లేనేలేదు! ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని ఆయన సెలవిచ్చారు. యోహాను 4:24;

 

 కనుక ప్రియ స్నేహితుడా! పెదాలతో దేవుణ్ణి ఆరాధించకుండా నిజంగా హృదయ పూర్వకంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చెయ్యాలి. అంతేకాకుండా నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ బలముతోనూ ఆయనను ఆరాదించ బద్ధులమై ఉన్నాము!

ప్రియ స్నేహితుడా! నీవెలా ఆరాధన చేస్తున్నావు?

ఒకసారి నిన్నునీవు పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*30 భాగం*

హెబ్రీ 9:17

4. అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను.

5. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.

6. ఇవి ఈలాగు ఏర్పరచబడి నప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని

7. సంవత్సరమునకు ఒక్క సారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తముచేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

 

         (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం అతిపరిశుద్ధ స్థలంలో ఉన్న విషయాల కోసం ధ్యానం చేసుకున్నాము. ఇక 67 వచనాలలో ఇలా అలంకరింపబడిన లేక ఇలా తయారైనప్పుడు మందిరంలో/ ప్రత్యక్ష గుడారంలో యాజకులు ఆరాధన గుడారము లేక పరిశుద్ధస్థలములోనికి ముందుభాగంలో ప్రవేశిస్తూ ఉంటారు అంటున్నారు. అయితే రెండవ తెర లేక రెండవభాగము అనగా అతిపరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధానయాజకుడు మాత్రమే ప్రవేశిస్తాడు, రక్తము లేకుండా ప్రవేశించలేదు, రక్తము తనకోసం, మరియు ప్రజలందరూ తెలియకచేసిన పాపాలు కోసం అర్పించేవాడు అని రాస్తున్నారు.

 

   గమనించాలి: ముందుభాగం లేక మొదటిగుడారము అనగా పరిశుద్ధస్థలము అనియు, రెండవ గుడారము అనగా అతిపరిశుద్ధ స్థలము అని గ్రహించాలి. ఇక 6 వచనంలో యాజకులు సేవచేయుచు అనగా వారు అర్పించు బలులు, నైవేద్యాలు, దూపములు అని అర్ధము! నిర్గమ 27:21 ప్రకారం వారు దీపము నిత్యమూ వెలిగేలా ఏర్పాటుచేస్తూ ఉండాలి.

౩౦:78 ప్రకారం: దూపద్రవ్యాలు అర్పిస్తూ ఉండాలి.

లేవీ 24:59 ప్రకారం హోమములు అర్పించాలి. భక్ష్యాలు కాల్చాలి. అల్లాడించే అర్పణలు చేయాలి. ఇలా చాలా కార్యాలు చేసేవారు. అవన్నీ నూతన నిబంధనకు సాదృశ్యంగానే ఉన్నాయి అయితే వీటన్నటిని కలిపి సేవచేయుచూ అంటున్నారు.

 

ఇక రెండవ గుడారం లోనికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధానయాజకుడు మాత్రం వెళ్లి బలిరక్తమును అర్పిస్తాడు అని గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేశాము. గమనించాలి- 9 అధ్యాయం బాగా అర్ధం చేసుకోవాలంటే లేవీ 16 అధ్యాయం బాగా చదవమని మనవిచేస్తున్నాను!

 

 ఇక్కడ గమనించవలసిన మరో విషయం రక్తం లేకుండా ప్రధానయాజకుడు కూడా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించడానికి వీలులేదు! మెల్కీసేదేకు క్రమం చొప్పున ప్రధానయాజకుడైన మన యేసుక్రీస్తుప్రభులవారు కూడా రక్తము లేకుండా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించలేదు! ఆయనకూడా రక్తము తీసుకుని వెళ్లారు గాని ఇతరుల వలె అనగా ఇతర ప్రధానయాజకుల వలె కోడెల రక్తము గొర్రెల రక్తము తీసుకుని పోకుండా పవిత్రమైన తనసొంత రక్తమును తీసుకుని ఒక్కసారే బలియాగం చేసి ముగించారు. పాపములకు పరిహారం చేశారు!

గమనించాలి. ఇలా ప్రధానయాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్లి బలిఅర్పణలు అర్పించే దినాన్ని మహా ప్రాయశ్చిత్తదినము అంటారు. రోజు ప్రధానయాజకుడు ఇశ్రాయేలు వారందరి పాపముల కోసం తన పాపముల కోసం బలి అర్పించి ఆరక్తాన్ని అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకుని పోయి అర్పిస్తాడు. రోజున ప్రజలందరి పాపాలు, దుర్మార్గత, తిరుగుబాటు, అపవిత్రత కోసం లాంటి విషయాలు కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు. లేవీ 16:2122, ౩౦, 34; అయితే తెలియక చేసిన పాపాలు అనగా పొరపాటున చేసిన పాపముల కోసం లేవీ 4:2; 5:17, సంఖ్యా 15:28 లో ఎలా ప్రాయశ్చిత్తం చేయాలో వ్రాయబడి ఉంది.

ఇవన్నీ యాజకులు- ప్రధాన యాజకులు చేసే మందిర సేవ! హెబ్రీ 17 వచనాలలో దీనికోసం చెప్పబడింది.

 

ఇక 810 వచనాలు ప్రత్యక్ష గుడారపు సేవ దేనికి సూచనగా ఉన్నదో రాస్తున్నారు పౌలుగారు!

8. దీనినిబట్టి మొదటి గుడారమింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచ బడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.

9. గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

10. ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్న పానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను (మూలభాషలో- బాప్తిస్మములతోను) సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

 

చూడండి: 8 వచనంలో మొదటి గుడారం అనగా పరిశుద్ధస్థలము ఇంకా ఉంటే అనగా నిలిచియుంటే రెండవ గుడారము లేక అతిపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేమార్గము బయలుపరచబడలేదు అని పరిశుద్ధాత్మ తెలియజేయచున్నాడు...! దీని అర్ధం ఏమిటి???? అనగా ప్రాయశ్చిత్తదినమున చేసే అర్పణ వలన అర్ధమయ్యేది ఏమిటంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే మార్గం ఇంకా వెల్లడికాలేదు! ప్రత్యక్షగుడారపు సేవ ఉన్నంతవరకు ప్రధానయాజకుడు తప్ప మిగతా ప్రజలెవ్వరూ అతిపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశం లేదో అలాగే మిగిలిన ప్రజలు ప్రత్యక్షగుడారపు సేవ నిలిచియున్నంతవరకు దేవుని సన్నిధిని అనుభవించలేరు అని అర్ధం! కారణం దేవాలయంలో దేవుని సన్నిధి నిలిచియుండేది కేవలం అతిపరిశుద్ధ స్థలములో మాత్రమే! ఇక్కడ గమనించవలసిన విషయం దేవుని సన్నిధిని అనుభవించే లేక దేవుని సన్నిధికి ప్రవేశించే అడ్డంకులు ఎలా పోతాయో పాతనిబంధన చెప్పడం లేదు అంతేకాకుండా ప్రత్యక్షగుడారపు సేవ కూడా చెప్పడం లేదు! మోషేగారి దగ్గరనుండి మలాకి గ్రంధం వరకు చూసుకుంటే ప్రత్యక్షగుడారపు సేవద్వారానే లేక మందిర సేవ అనగా పరిశుద్ధ స్థలము అతిపరిశుద్ధ స్థలముగా విభజించి చేసే సేవా మార్గంలోనే సేవ జరిగేది! అతి పరిశుద్ధ స్తలములోనికి ఎవరికీ అనుమతి లేదు! యాజకులుకి కూడా అనుమతి లేదు! ఇక సామాన్యప్రజలు దేవుని సన్నిధిని ఎలా అనుభవించగలరు? అక్కడికి వెళ్ళకుండా అడ్డతెర అడ్డు పడుతుంది. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తుని దేవుడు లోకానికి పంపి అడ్డంకులు తొలగించారు. గమనించాలి- దేవుడు నిర్గమకాండంలో ఒక నిబంధన చేశారు- పాప క్షమాపణకోసం, పాపముల పరిహారం కోసం ఒక పద్దతి ఏర్పాటుచేశారు- అదే పద్దతి ద్వారానే క్రొత్త నిబంధనకు స్థాపన జరగాలి! గాని పాపము సంపూర్తిగా ఒక్కసారే పోవాలి! అది కోడెల గొర్రెల పశువుల జంతువుల రక్తము ద్వారా సాధ్యము కాదు కాబట్టే నూతన నిబంధన చేస్తున్నారు. మరి ఆహారోను యాజకత్వము లోపభూయిష్టంగా ఉంది కాబట్టే మరో యాజక క్రమం మొదలుపెట్టారు- అదే మెల్కీసెదెకు యాజక క్రమం- క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభులవారు బలియాగం చేసి అర్పణ చేసి- పాత ధర్మశాస్త్ర విధులను నెరవేర్చి- సిలువకు ధర్మ శాస్త్రాన్ని కొట్టి- దానిని రద్దుచేశారు! కలువరిలో క్రీస్తు మరణమయ్యారువెంటనే దేవాలయపు తెర పైనుండి క్రిందకు అడ్డుగా చిరిగిపోయింది. అడ్డు తొలిగిపోయింది. హల్లెలూయ! ఇప్పుడు ప్రతీ ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రవేశించవచ్చు! కేలవం ప్రధానయాజకునికి మాత్రమే గల ప్రవేశం అందరికీ- సామాన్యులు అందరికి (Available for General Public) ప్రవేశం దొరికింది. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తజనులారా! అని అందరినీ నాయొద్దకు ఇప్పుడు రండి! ఇప్పుడు అడ్డు తెర తొలగిపోయింది. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. మార్గం సుగమం కావడానికి క్రీస్తుయేసు చేసిన బలియాగం మాత్రమే కారణం!!

 

ఇక 9 వచనంలో అంటున్నారు- అదంతా అనగా పాతనిబంధన మరియు ధర్మశాస్త్రం మరియు ప్రత్యక్షగుడారపు సేవ అంతా ప్రస్తుతకాలానికి అనగా క్రొత్త నిబంధనకు ఉపమానముగా లేక ఉదాహరణగా ఉన్నది అంటున్నారు. ఇంకా ఉపమానార్ధమును బట్టి మనస్సాక్షివిషయంలో ఆరాధనచేసే వానికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులు అర్పించబడేవి! అనగా పాత నిబంధనలోని బలులు గాని అర్పణలు గాని ఏవీ కూడా ఆరాధన చేసేవానికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేకపోయాయి! అవి ఎంతవరకు అంటే 10 వచనం ప్రకారం దిద్దుబాటు కాలం వచ్చేవరకు! దిద్దుబాటు కాలము అనగా నూతన నిబంధన సంఘకాలము వరకు లేదా యేసుక్రీస్తుప్రభులవారి కాలం వరకు! అందుకే అంతవరకూ అనగా శాశ్వత పరిష్కారం- పర్మినెంట్ సొల్యూషన్ దొరికేవరకు అన్నపానములు ప్రక్షాళనలు అనగా కొన్ని రకాలైన భాప్తిస్మాలతోనూ ఆచార వ్యవహారాలూ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చడం జరిగింది. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రత్యక్షమై మనకోసం బలియాగం చేశారు.....

.గలతియులకు 4: 4

అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,

 

ఎఫెసీయులకు 1: 8

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

 

 అప్పటినుండి అన్నపానములు, వివిధ రకాలైన ప్రక్షాళనములకు అవసరం లేదు అంటున్నారు. అంతేకాకుండా అవన్నీ *శరీర ఆచారాలు* అంటున్నారు. నేనుకాదు పౌలుగారే అత్మావేశుడై అంటున్న మాట! పాత నిబంధన- ధర్మశాస్త్ర విధులన్నీ శరీరాచారాలు మాత్రమే! అవి ఆధ్యాత్మికమైనవి కాదు! అవి ఆధ్యాత్మికతను సాధించలేకపోయాయి! శరీర సంభంధమైన నియమనిబంధనలు అంతే!!! వాటికి ఎలాంటి ఆధ్యాత్మిక విలువ అనేది లేదు! దిద్దుబాటు కాలం వచ్చిన తర్వాత- దేవుడు వాటిని దిద్దారు అనగా మార్చారు! గమనించాలి! దిద్దుబాటుకాలము అని దేవుడు ఎందుకు అంటున్నారు అంటే అవి సంపూర్ణసిద్ధిని కలిగించలేకపోయాయి! దేవుడు ఉద్దేశించిన ఫలితాలను అవి తీసుకుని రాలేకపోయాయి! అందుకే వాటిని దిద్దవలసి వచ్చింది! అందుకే వాటిని మార్చవలసి వచ్చింది! అందుకే పాత నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధనను ఇవ్వవలసి వచ్చింది! దిద్దుబాటు కాలంలో అన్నీ దిద్దబడ్డాయి! ఇప్పుడు నూతన నిబంధన కార్యాలు- ఆచారవ్యవహారాలూ కానేకావు! అవి ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి! కేవలం శరీరాన్ని శుద్ధిచేసేవి కాదు! మనసును ఆత్మను హృదయాన్ని కూడా శుద్ధిచేస్త్తాయి! ఇంకా

Hebrews(హెబ్రీయులకు) 4:12

12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది

 

కాబట్టి ఇంతటి ఔన్నత్యమైన పిలుపును, ఏర్పాటును, నిబంధనను గల ప్రియ సంఘమా! మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం! మనం కూడా కేవలం ఆచార వ్యవహారాలుగా పరిగణిస్తే పనికిరాదు! త్రోసివేయబడతావు! దీనిలో గల జీవాన్ని ఆస్వాదించాలి! ఆయన జీవాన్ని మనలోనికి నింపుకుని, ఆయన యొక్క నీతిని మనం కూడా పొందుకుని ఆయన శ్రమపడినట్లు శ్రమలకు ఓర్చి ఆయన పొందుకున్న సంపూర్ణసిద్ధి, పరిపూర్ణత, పరిశుద్ధత పొందుకుని ఆత్మపూర్ణతతో పరమయెరూషలేము చేరవలసిన వారమై ఉన్నాము. హెబ్రీ 6:1,2

1. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,

2. దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరు త్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.

 

 అంతేకాకుండా మన ఆరాధనా ఆచారపరంగా కాకుండా ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి అనుదినం! అలా చేస్తూ పరిపూర్ణత లేదా సంపూర్ణత సాధించడం కోసం ప్రయత్నం చేయాలి.

మరి నీవు మార్గం లో నడుస్తావా?

దైవాశీస్సులు!

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*31 భాగం*

హెబ్రీ 9:1114

11. అయితే క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా,

12. మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

13. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,

14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ (మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

 

   ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ప్రత్యక్షగుడారము, అందులోని వస్తువులు దేనికి సాదృశ్యము, దానిలో యాజకులు సేవాపరిచర్య విధానం కోసం ధ్యానం చేసుకున్నాం! ఈరోజు క్రీస్తుయేసు వీటికి సాదృశ్యంగా ఎలా విమోచనయాగం చేశారు అనేది ధ్యానం చేసుకుందాం! 1128 వచనాల వరకు భక్తుడు దీనినే వివరిస్తున్నారు!

 

   11. అయితే క్రీస్తు రాబోవుచున్న లేక ప్రస్తుతం కలిగియున్న మేలుల విషయమై ప్రధానయాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచనం సంపాదించి లేక తానే నిత్యమైన విమోచనము చేసి హస్తకృతముకానిది అనగా చేతులతో చేయనిది, సృష్టికి కూడా చెందనిది అయిన మరింత శ్రేష్టమైన గుడారములో ప్రవేశించారు అంటున్నారు. కారణం గుడారము అనగా ప్రత్యక్షగుడారము గాని సొలోమోను కట్టించిన దేవాలయం గాని ఇవి లోకానికి చెందినవి, మనుష్యులు చేతులతో చేసినవి- అయితే యేసుక్రీస్తుప్రభులవారు చేతులతో చేయని గుడారము, సృష్టికి చెందనిది పరలోక సంభంధమైన నిజమైన గుడారంలో ప్రవేశించి ఒక్కసారే బలి అర్పించి విమోచనా కార్యాన్ని పూర్తిచేశారు! గమనించాలి భక్తుడు మరోసారి గుర్తుకు చేస్తున్నారు ఇక్కడ పాత నిబంధన యాజకధర్మం నిబంధనలు ఏది సాధించలేక పోయాయో దానిని క్రీస్తుయేసు బలియాగం సాధించిపెట్టింది!! హెబ్రీ 8:2, 5

2. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, (మూలభాషలో- పరిశుద్ధ వస్తువులకు) అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై , పరలోకమందు మహామహుని (మూలభాషలో- మహాత్మ్యముయొక్క) సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.

5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

 

ఇక ఇదే వచనంలో నిత్యమైన విమోచన సంపాదించి అంటున్నారు- అనగా శాశ్వత విముక్తిని సంపాదించారు అంటున్నారు! మత్తయి 20:28 లో అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికే నేను వచ్చాను అనిచెప్పారు. అలాగే చేశారు యేసయ్య!

అయితే మానవుల విమోచనం కోసం యేసుక్రీస్తుప్రభులవారు చేసినది శాశ్వత పరిష్కారం. అది శాశ్వతమైనది!

హెబ్రీ 5:9

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

 

హెబ్రీ 10:14

ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

 

ఎందుకు అలా అంటున్నారు అంటే గొర్రెమేకల కోడెల రక్తము కొద్దిరోజుల కొరకైన తాత్కాలిక విమోచనం చేస్తే ప్రశస్తమైన రక్తము అదికూడా దేవాదిదేవుని రక్తము ఇంకా సమృద్ధి గల విముక్తిని కలుగజేస్తుంది. విముక్తికూడా తాత్కాలికమైనది కాకుండా అది శాశ్వత పరిష్కారం! దానినే నిత్యమైన రక్షణ లేక విముక్తి లేదా శాశ్వత విముక్తి అని ఉద్ఘాటిస్తున్నారు! దీనివలన అనగా బలిఅర్పణ వలన కలిగిన ఫలితం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన అలాచేసి తనవారిని కొనుక్కున్నారు!

దానికి ఆయన రక్తమునే చెల్లించి కొనుక్కున్నారు!

1పేతురు 1:1819

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

1కొరింథీ 6:19,20

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

ప్రకటన 5:910

9. పెద్దలునీవు గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

10. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

 

ఆయన పెట్టిన లేక చెల్లించిన వెల ఆయన సొంత రక్తమని 1128 లో వివిధరూపాలలో చెబుతున్నారు పౌలుగారు! ఇక్కడ క్రీస్తురక్తము అనగా ఆయన బలి, మరణమును సూచిస్తున్నాయి వచనాలలో!

రక్తము మొదటగా మనుష్యుల మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది అంటున్నారు. 14 వచనం

 

రెండు: వారిని అనగా మనుష్యులను విడిపించిన వెల రక్తమే అంటున్నారు. 16 వచనం.

 

మూడు: క్షమాపణకు అదే ఆధారం అంటున్నారు. 22 వచనం

 

అది భూలోకసంభంధమైనవాటినే కాకుండా పరలోక సంభంధమైన వాటిని కూడా శుద్ధి చేస్తుంది. 23 వచనం.

 

అది పాపములేకుండా చేసింది. 26, 28 వచనాలు!

 

కాబట్టి ఇట్టి విలువైన ప్రశస్త రక్తముతో తన సొంత రక్తముతోనే ఆయన అతిపరిశుద్ధ స్థలములో అదికూడా పరలోక దేవాలయంలో గల అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి విమోచనకార్యాన్ని పూర్తిచేశారు! 12 వచనం!

 

ఇక 13 వచనంలో మేకలయొక్కయు కోడెలు యొక్కయు రక్తము మైలపడిన వారిమీద చల్లడం, అపవిత్ర పరచబడిన వారిమీద పవిత్ర జలం చల్లడం, అనగా ఆవుదూడ బూడిద చల్లడం చేసి శరీర శుద్ధి కలుగజేస్తే, వారిని పరిశుద్ధ పరిస్తే, మరి నిత్యుడగు ఆత్మద్వారా తననుతాను అప్పగించు కున్న క్రీస్తుయేసు పరిశుద్ధ రక్తము మన మనస్సాక్షిని మనలను కూడా ఎంతో ఎక్కువగా శుద్ధిచేస్తుంది కదా అని అంటున్నారు. (14 వచనము).

సంఖ్యా 19 అధ్యాయంలో ఆవుదూడ బూడిదతో పవిత్రజలం ఎలా తయారుచెయ్యాలో చెప్పబడింది. ఇంకా ఎలా మనుష్యులు చేసిన అపరాధములకు పరిహారం చెయ్యాలో లేవీకాండం మొత్తం తెలియజేస్తుంది. అవి శరీరాచారాలు అని మీదన చెప్పారు పౌలుగారు!

 

ఇక 14 వచనంలో మీ మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది అని ఎందుకు అంటున్నారు? మనస్సాక్షిని శుద్ధిచేయవలసిన అవసరం ఏముంది?

 

కారణం మన మనస్సాక్షి- మనలో ఉన్న లేక చేస్తున్న చర్యలకు తీర్పు తీర్చి అవి మంచివో కావో, సరైనదో కాదో, తప్పో ఒప్పో అనుక్షణం మనకు తెలియజేస్తూ గద్దిస్తూ ఉంటుంది. అయితే మనమెంత ఘనులమంటే మనస్సాక్షి గొంతును పిసికేసి మన పనులు మనం చేసేసుకుంటున్నాం. ఫలితంగా దోషులముగా మిగిలిపోతున్నాము!

రోమా 2:15

అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.

 

1తిమోతి 1:5

ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.

 

తీతు 1:15

పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వా సులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్ర పరచబడి యున్నవి.

 

ఒకవేళ మన మనస్సాక్షి కలుషితమైపోతే తనలో దోషముందని, తాను చేసేది తప్పు అని గ్రహించడు! మన మనస్సాక్షికి పాపం అంటుకుంటే పాపముతో ఐక్యమైతే దానికి శుద్ధిచేయడం అవసరం! తనలో దోషముందని తప్పు ఉందని మన మనస్సాక్షి గ్రహిస్తే కూడా మనకు మన మనస్సాక్షికి శుద్ధి అవసరం! లేకపోతే దేవుని శిక్ష, తీర్పు కలుగుతాయి. కాబట్టి ముందుగా మనం మనస్సాక్షిని శుద్ధంగా ఉంచుకోవాలి! అది క్రీస్తురక్తము ద్వారానే సాధ్యమవుతుంది!! మన పాపాలు తీయడానికే క్రీస్తుయేసు మనకోసం బలైపోయారని తన రక్తాన్ని అర్పించారు అని గ్రహించి పాపములు ఒప్పుకుని పశ్చాత్తాప పడితే అప్పుడు క్రీస్తురక్తము మన మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది. అది ఎప్పుడు శుద్ధి అవుతుందో అప్పుడే మనం మంచి మనసాక్షితో శుద్ధ హృదయంతో దేవుణ్ణి సేవించగలము

 

ప్రియ స్నేహితుడా! ఒకవేళ నీ మనస్సాక్షి నీమీద దోషారోపణ చేస్తుందా? అయితే దాని పీక నోక్కెయ్యకు! దాని నోరు మూసెయ్యకు! మనస్సాక్షి గద్దింపుకు లోబడు! అందుకే ఒక భక్తుడు పాట రాశాడు. లెమ్ము లెమ్ము సోదరా అంటూమనస్సాక్షి గద్దింపునకు మారుమాట పలుకవద్దురా!

అప్పుడే నీ ఆత్మ మనస్సు అన్ని తేజరిల్లుతాయి!

లేకపోతే నరకమే నీకు శాస్తి అని మరచిపోవద్దు!

ఇప్పుడే పశ్చాత్తాప పడు!

క్రీస్తుయేసును శరణువేడి ఆయన రక్తములో నీ మనస్సాక్షిని నిన్ను కడుగుకో! నిందారహితమైన పరిశుద్ధమైన జీవితం జీవించు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*32 భాగం*

హెబ్రీ 9:1517

15. హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

16. మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.

17. శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 15 వచనంలో కారణం వలన అంటున్నారు కారణం వలన అంటే క్రీస్తురక్తము మన మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది కాబట్టి క్రీస్తుయేసు మనకు మధ్యవర్తిగా ఉన్నారు అంటున్నారు. కారణం ఇది పాత నిబంధన బలులు చెయ్యలేకపోయాయిహెబ్రీ 9:9

గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

 

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.    హెబ్రీ 10:2

 

ఇక 16 వచనంలో ప్రాముఖ్యమైన విషయం రాస్తున్నారు.... మరణశాసనం ఎక్కడ రాయబడుతుందో దాని రాసినవాని మరణం కూడా తప్పనిసరిగా జరగాలి! లేకపోతే మరణశాసనం చెల్లదు! మరణ శాసనం అనగా వీలునామా అని అర్ధం! ఎవరికైనా తండ్రియొక్క ఆస్తిరావాలంటే వారసత్వంగా వచ్చినా వీలునామా ఉంటే తర్వాత అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య తగాదాలు రావు! అయితే దేవుడు కూడా ఒక వీలునామా రాశారు! అది  ఆయన మరణంతో పాపం విమోచనం కావాలి! దానికోసం ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాలి! వీలునామా అయితే రాశారు గాని ఆయన బ్రతికి ఉన్నంతవరకు అది చెల్లదు! అది చెల్లుబాటులోకి రావాలంటే రాసిన వ్యక్తి మరణం తప్పనిసరి!!! అందుకే ఆయన బలియాగమైపోయారు! నీకు నాకు విమోచనం తీసుకుని వచ్చారు! ఆయన సంపూర్ణసిద్ధిని పొందారు! గమనించాలి! అన్యులు మనకు అడిగే ప్రశ్నలలో ఇదొకటి! యేసుక్రీస్తు ఎందుకు మరణించాలి? బ్రతికి ఉండి సాధించవచ్చు కదా విమోచనం కారణం ఆయన దేవుడు కదా అంటారు. దానికి సమాధానం ఇదొకటి! వీలునామా చెల్లు బాటు కావాలంటే మరణశాసనం రాసిన వ్యక్తి మరణమై పోవాలి! అందుకే ఆయన చనిపోయారు. ఇక నీ పాపం నా పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి! పాపవిమోచనం జరగాలి! అందుకే ఆయన తనసొంత రక్తము మనకోసం చిందించి మనపాపములకు విమోచనం చేశారు. అందుకే చనిపోయారు అని చెప్పాలి మనం!

 

మరి ఇప్పుడు అనవచ్చు మరి సర్వోన్నతుడు ఎప్పుడు వీలునామా లేక మరణశాసనం రాశారు? నిర్గమ 19:5,6 లో మీరు నామాటలు విని నేను చెప్పినట్టు చేస్తే మీరే నా సొత్తు! నాకు విశేషమైన ప్రత్యేకమైన ప్రజగా ఉంటారు. అప్పుడు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉంటారు అని శాసనం రాశారు. దానినే పేతురుగారు రాజులైన యాజక సమూహముగా అని రాస్తున్నారు. దీనిని మొదటగా నిర్గమ 24:18 లో స్థిరపరచారు రక్తముతో! అదే వీలునామా అంటారు బైబిలు పండితులు! మరి వీలునామా చెల్లుబాటులోకి రావాలంటే రాసిన వాడు చనిపోవాలి! అందుకే ఆయన లోకానికి రక్తమాంసాలతో మానవునిగా రావాల్సి వచ్చింది. కారణం పరలోకంలో మహిమ దేహంతో చనిపోవడం కుదరదు! అందుకే మానవునిగా పుట్టి బలియాగం చేసి రక్తం చిందించి బలియాగమై వీలునామా చెల్లుబాటు లోకి వచ్చేలా చనిపోయారు!

 

ఇక 18 వచనంలో మొదటి నిబంధన కూడా రక్తముతో ప్రతిష్ట జరిగింది అంటే మీద చెప్పిన రిఫరెన్సులలో జరిగిన సంఘటనలు అన్నమాట!

ఇక 1920  వచనంలో పౌలుగారు చెప్పినది........

19. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని

20. దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను

ఇది కూడా పై రిఫరెన్సు అనగా నిర్గమ 24:18 లోను, ఇంకా మరికొన్ని సార్లు అలాగే చేశారు మోషేగారు!

 

ఇక 2122 వచనాలలో  అన్ని పాత్రల మీద అన్నింటి మీద నిబంధన రక్తమును ప్రోక్షించడం జరిగింది అంటున్నారు. ముఖ్యంగా 22లో  అన్ని మతగ్రందాలలో వివరించినట్లు బైబిల్ కూడా చెబుతుంది- రక్తము చిందించకుండా మనుష్యుల యొక్క పాపమునకు క్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చు అంటున్నారు! కారణం లేవీ 17:11 లో శరీరానికి ప్రాణం రక్తము! రక్తంలో ఉన్న ప్రాణం కారణంగా అది ప్రాయశ్చిత్తం చేస్తుంది అంటున్నారు.......

రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును.

 

అయితే రక్తము క్రీస్తుయేసు కార్చిన రక్తం ఆధారంగా మాత్రమే దేవుడు మనుష్యుల పాపములను క్షమించారు!

మత్తయి 26:28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నదిఎఫెసి 1:7

 

ఇక 2324 లో......

23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను గాని పరలోక సంబంధ మైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను.

24. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.

 

చూడండి పరలోకమందున్న వస్తువులను పోలిన భూలోకంలో గల వస్తువులు అనగా ప్రత్యక్షగుడారంలో గల వస్తువులు ఇలాంటి బలుల వలన విమోచనరక్తము లేక నిబంధన రక్తము వలన శుద్ధిచేయబడుతూ ఉంటే, మరి శ్రేష్టమైన వస్తువులు పరలోకంలో ఉన్న వస్తువులు శుద్ధిచేయబడాలంటే వీటికంటే ప్రశస్తమైన రక్తం, శ్రేష్టమైన రక్తం కావాలి కాబట్టి అందుకే ప్రశస్తరక్తము దొరకదు కాబట్టే తన రక్తాన్నే క్రీస్తుయేసు తీసుకుని వెళ్లి పరిశుద్ధ పరిచారు అంటున్నారు పౌలుగారు! అంతేకాకుండా ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు నిలబడటానికి పరలోకమందు ప్రవేశించారు అంటున్నారు! మరి పరలోకం గల వస్తువులు అనగా పరలోక దేవాలయంలో ఉన్న వస్తువులు ఎలా మలినం అయిపోతాయి? అవి పరలోకంలో గదా ఉన్నాయి. అవి మలినం కావు కదా! అక్కడ డాగు మచ్చ పాపం లేదు కదా అనగా పరలోక సంబంధమైనవి అనగా బహుశా అవి క్రొత్త నిబంధన విషయాలు అనగా దేవునికీ- విశ్వాసులకు మధ్య ఉన్న క్రొత్త సంబంధం, మనుష్యులు విముక్తి పొంది దేవుని సన్నిధికి ప్రవేశం పొంది ఈభూమిమీద ఆయనను సేవిస్తూ ఉండడం లాంటి విషయాలు- అవి ఆధ్యాత్మిక వాస్తవాలు! కాబట్టి మానవుల మనస్సాక్షి, క్రీస్తుయేసు సంఘం లాంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా క్రీస్తుయేసు రక్తము ద్వారా శుద్ధిచేయబడాలి! వచనంలో శ్రేష్టమైన బలులు అనగా క్రీస్తుయేసు రక్తమే అని గ్రహించాలి!

 

కాబట్టి వీటిని పవిత్రం చేయడానికే క్రీస్తు మనకోసం పరలోకంలో ప్రవేశించారు. అంతేకాకుండా మనం పడిపోకుండా ఉండాలి అని మన పక్షముగా విజ్ఞాపనం చేస్తూ, మన పక్షంగా దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వం చేస్తున్నారు!

గనుక మనం పాపముజోలికి పోకుండా మచ్చ డాగు కళంకము లేకుండా పవిత్రమైన హృదయాలను కలిగి పరలోకమునకు అర్హత కలిగి సాగిపోదాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*33 భాగం*

హెబ్రీ 9:2728

27. మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; తరువాత తీర్పు జరుగును.

28. ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

 

      (గతభాగం తరువాయి)

 

   ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ప్రత్యక్షగుడారము, అందులోని వస్తువులు దేనికి సాదృశ్యము, దానిలో యాజకులు సేవాపరిచర్య విధానం కోసం ధ్యానం చేసుకునిక్రీస్తుయేసు వీటికి సాదృశ్యంగా ఎలా విమోచనయాగం చేశారు అనేది ధ్యానం చేసుకుంటున్నాం!

 

  ఇక 2526 వచనాలలో ఒకేసారి ఆయన బలి అర్పించి విమోచనకార్యాన్ని ముగించేశారు అంటున్నారు. దీనికోసం మనం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం గనుక ముందుకు పోదాము!

 

  ఇక 27 వచనంలో మనుషులు ఒకేసారి చనిపోవాలనే నియమం ఉంది తర్వాత మరో జన్మ లేదు- తర్వాత తిన్నగా తీర్పు ఉంది అని చెబుతున్నారు. అది పెద్ద సిద్దాంతం- వాటికోసం మరెప్పుడైనా ధ్యానం చేద్దాం! అయితే ఇక్కడ మనం ధ్యానం చేసుకోవలసిన విషయం ఏమిటంటే- భూమిమీద పుట్టిన మనిషి ఎవరైనా ఒకరోజు చనిపోవలసినదే! అది మాటిమాటికి కాదు! ఒక్కసారే చనిపోవాలి! మరుజన్మలు లేవు. విభిన్న అవతారాలు లేవు! అలాగే యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఈభూమిమీద మనిషిగా పుట్టారు కనుక ఒక్కసారే అనేకుల అపరాధాలను భరిస్తూ చనిపోయారు అంటున్నారు 28 వచనంలో!

 

 ఇక్కడ అనేకులు అనగా సర్వలోక జనులు అని అర్ధము!

యెషయా 53:11

అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.

 

మత్తయి 26:28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

యోహాను 1:29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

 

2కొరింథీ 5:14

క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,

 

యోహాను :16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా ( లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

1యోహాను 2:2

ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు (ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

 

అయితే మరలా ఒకసారి గుర్తుకుచేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభులవారు ఈలోకస్తులందరి కొరకు చనిపోయినప్పటికీ ఆయనను నమ్మకంతో విశ్వాసంతో స్వీకరించిన వారికి మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది. ఆయనను అంగీకరించిన వారే పాపములనుండి విముక్తి పొంది పరిశుద్దులౌతారు.

 

   ఇక తర్వాత ఇక్కడ మరోమాట కనిపిస్తుంది: తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణదీనిఅర్ధము ఏమిటంటే కాలంలో అనగా ప్రత్యక్షగుడారములో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ప్రాయశ్చిత్తదినాన బలిరక్తము తీసుకుని ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించిన తర్వాత ప్రజలు ప్రధానయాజకుడు బయటకు వచ్చేవరకు ఆత్రుతతో కనిపెడుతూ ఉండేవారు. కారణం విధమైన అపవిత్రత కలిగిన అక్కడే చనిపోతాడు ప్రధానయాజకుడు! అందుకే ప్రధానయాజకుని అంగీకి వెనుకభాగంలో బంగారు గంటలు ఉండేవి. వాటి స్వరం వినబడే వరకు ఆయన బ్రతికి ఉన్నాడని అర్ధం! ఒకవేళ స్వరము ఆగిపోతే దాని అర్ధం చనిపోయాడని! అయితే అక్కడ చనిపోతే శవాన్ని తీయడానికి అతిపరిశుద్ధ స్తలములోనికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు! అందుకే ఒక త్రాడు కూడా వెనుక ఉండేది. త్రాడుతో చనిపోయిన శవాన్ని బయటకు లాగాలి!అనగా పరిశుద్ధ స్తలములోనికి లాగేవేసేవారు యాజకులు! ఒకవేళ ప్రాణంతో తిరిగి బయటకు వస్తే దాని అర్ధం ఏమిటంటే దేవుడు వారి అర్పణ అంగీకరించారు. వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది! కాబట్టి వారు సంతోషించేవారు!

 

   ఇంతవరకు బాగుంది- మరి దానిని యేసుక్రీస్తుప్రభులవారికి ఎలా ఆపాదిస్తాము అనగా- అలాగే యేసుక్రీస్తుప్రభులవారు కూడా అతిపరిశుద్ధస్తలములోనికి వెళ్ళారు- ఆయన బయటకు వచ్చేవరకు ఎదురుచూడటం- అనగా ఆయన సిలువలో చనిపోయి మన అందరి పాపములకోసం ఆయన యొక్క నీతిగల పరిశుద్ధ రక్తమును తీసుకుని అతిపరిశుద్ధస్తలములోనికి ప్రవేశించి- బలిరక్తము అక్కడ ప్రోక్షించి- విమోచనకార్యమును సంపూర్తి చేశారు. వెంటనే మానవులకు విమోచనం జరిగింది! ఇప్పుడు మానవులు ఆయనకోసం ఎదురుచూడటం అనగా ఆయన రాకకోసం ఎదురుచూడటం అన్నమాట! అది ఆయన రహస్యరాకడ! ఆయన రహస్య రాకడ సంభవించినవెంటనే రక్షించబడిన వారు అందరూ చెరనుండి విడుదల పొంది ప్రభువును ఎదుర్కొంటారు.

మత్తయి 24:4251

తీతు 2:13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసులు ఆయన నిజమైన దేవుడని, తమ రక్షకుడని విశ్వసించి బాప్తిస్మం తీసుకుని ఇదివరకే వారు పాపము వలన కలిగే శిక్షావిధి నుండి విడుదల పొందారు. యోహాను 5:24; రోమా 8:1 ప్రకారం! ఇంకా పాపపు శక్తి నుండి విడుదల పొందారు! రోమా 6:618 ప్రకారము! మరి దేనికోసం ఎదురుచూస్తున్నారు అంటే: మన ఆత్మ మనస్సు శరీరాలు సంపూర్ణ విముక్తిని పొంది నిరంతరమూ పరమతండ్రి సన్నిధిలో గడిపే క్షణం కోసం ఎదురుచూస్తున్నాము!

ఇదే శుభప్రదమైన నిరీక్షణ! ఆరోజు మనం దేవుణ్ణి కలుసుకుని తేజోవాసుల స్వాస్త్యములో పరిశుద్ధుల విందులో పాల్గొంటాము! జయించిన పరిశుద్ధుల సమూహముతో ఆనందిస్తాము! అబ్రాహము గారిని చూస్తాము! దావీదు గారితో మాట్లాడతాము! యోనాగారిని ఇంటర్వ్యూ చేస్తాము! పౌలుగారి ఆటోగ్రాఫ్ తీసుకుంటాము! ఇలా పరిశుద్ధుల సహవాసంలో గొర్రెపిల్ల విందులో- పరమ తండ్రి సమక్షంలో ఆనందిస్తాము! హెబ్రీయులకు 12: 23

పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును వెళ్ళి వారితో ఆనందిస్తాము.

 అదే శుభప్రదమైన నిరీక్షణ! నిరీక్షణ మనలను సిగ్గుపరచదు! అందుకే చప్పిడి పథ్యము! దానిని పొందుకొవాలనే భక్తి శ్రద్ధలు!

 

ప్రియ సహోదరి సహోదరుడా! శుభప్రదమైన నిరీక్షణ నీకుందా? దానికోసం సిద్దపడుతున్నావా? రాజులకు లేనట్టి పరిచర్య, గొప్పవారికి లేనట్టి ఏర్పాటు అవకాశం నీకిచ్చారు కదా దేవుడు! ఎందుకు పనికిరానిని నిన్ను నన్ను ఏర్పాటుచేసుకుని ఇంతగొప రక్షణ మనకు ఇచ్చారు కదా! మరి ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేసి, తుచ్చమైన కోరికల కోసం ఇంతగొప్ప నిరీక్షణను వదులుకొని లోకంతో కలిసిపోతావా? లేక దేవునికోసం శ్రమలను అనుభవించి ఆయనలో ఐక్యమోతావా? ఏది కావాలో నిర్ణయించుకో!

నేడే రక్షణదినం!

ఇదే అనుకూల సమయం!

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*34 భాగం*

హెబ్రీ 10:14

1. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

2. ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా.

3. అయితే బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి

4. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం మెల్కీసెదెకు క్రమము కోసం ధ్యానం చేస్తూ హెబ్రీ పత్రిక 2 అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు ధ్యానం చేసుకున్నాం! ఇక పదో అధ్యాయంలో ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్న సారాంశాన్ని మరల చిన్నగా చెబుతున్నారు పౌలుగారు!

 

10:1 ధర్మశాస్త్రం అనేది రాబోవుచున్న మేలుల విషయమై గల ఛాయ లేక నీడ మాత్రమే గాని వస్తువుల యొక్క నిజ స్వరూపం గలది కాదు అంటున్నారు. గమనించాలి- ఇక్కడ ధర్మశాస్త్రం అనగా పౌలుగారి ముఖ్య ఉద్దేశం ధర్మశాస్త్రమునకు ఆధారమైన ఆహారోను యాజకత్వము అని గ్రహించాలి! దానితో పాటు వారుచేసే ప్రత్యక్షగుడారపు సేవా-పరిచర్య అని గమనించాలి! ఇవన్నీ రాబోయే లేక ప్రస్తుతం జరుగుచున్న వాటి యొక్క నీడ మాత్రమే! గాని ఒరిజినల్ అనేది క్రీస్తుయేసులోనే ఉంది అని పౌలుగారు అన్ని అధ్యాయాల లోను చెబుతున్నారు.

 

ఇంకా అంటున్నారు- ఇలా ఏటేట అర్పించే బలులు వారిని అనగా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నడును సంపూర్ణసిద్ధిని కలుగజేయలేకపోయాయి!

ఇక్కడ మరోవిషయం మరోసారి గుర్తుకుచేస్తున్నాను: హెబ్రీ పత్రిక ముఖ్యాంశం: *మెల్కీసేదేకు క్రమంలో క్రీస్తుయేసు ఆయన సంపూర్ణసిద్ధిని సాధించి ప్రజలను అలాగే సంపూర్ణ సిద్ధి పొందుకునే వారుగా చేయడం!* సంపూర్ణ సిద్ధి లేక పరిపూర్ణత సాధించడమే విశ్వాసి యొక్క ముఖ్యమైన గురి! సంపూర్ణ సిద్ధి- పరిపూర్ణత కోసం మొదటి నుండి చెబుతున్నారు పౌలుగారు!

హెబ్రీయులకు 2: 10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

 

హెబ్రీయులకు 5: 9

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

 

హెబ్రీయులకు 12: 23

పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,....

అయితే ఇక్కడ మరోసారి చెబుతున్నారు జంతుబలులు అనేవి ఇంతవరకు ఎవరిని సంపూర్ణంగా పాపములనుండి విడుదల చేయలేకపోయాయి! మనిషికి సంపూర్ణ సిద్ధిని అవి సాధించి పెట్టడం అసాధ్యం! హెబ్రీ 7:11, 19;

ఒకవేళ అవి అనగా జంతుబలులు సంపూర్ణసిద్ధిని సాధించియుంటే ఇక వాటిని అర్పించడం మానివేసి ఉండేవారు! కారణం ఆరాధించేవారు పూర్తిగా శుద్దులై ఉండేవారు! అప్పుడు వారి మనసాక్షి వారి పాపముల విషయమై వారిని గద్దించి కూడా ఉండకపోవును! గాని అలా జరగలేదు కాబట్టే మరో యాజకక్రమం రావలసి వచ్చింది. అందుకే దేవదేవుడే యాజకుడై మెల్కీసేదేకు క్రమంలో వచ్చారు!

 

ఇక మరోసారి 4 వచనంలో ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసి వేయుట అసాధ్యము అంటున్నారు! ఎందుచేత అసాధ్యము???

పాపం చేసింది మనుష్యులు- మరి చనిపోయేది జంతువులా?? ఇది ఏమైనా బాగుందా? మరి దేవుడు ఎందుకు దానిని మొదట్లో అనుమతి ఇచ్చారు అంటే వాటి రక్తంలో కూడా ప్రాణముంది కాబట్టి మానవుల దీనిని తెలుసుకుని మారతారు అని! నిజంగా జంతువులుమనుష్యుల స్థానంలో చనిపోవడం కుదరదు! జంతువులకు నైతిక స్వభావం లేదు! అవి నోరులేని జీవులు! అనగా తప్పు ఒప్పు తెలియని జీవులు! అంతేకాకుండా వాటి చావుకు అవి సమ్మతించలేదు! గాని మనుష్యులుచేసిన పాపముల కోసం అవి వాటి అనుమతి లేకుండానే చనిపోతూ వచ్చాయి! ఇక మానవుల పాపములు అధికమైపోతూ అవి భరించలేక పోయాయి! కాబట్టి మానవుడు మారడం లేదు సరికదా దేవుని నుండి మరింత దూరమైపోతున్నాడు! ఒక మనిషి యొక్క పాపములకు విముక్తిగా మరో మనిషి చావడం అనేదే సరికాదు! మనిషి సరిపోడు కూడా! మరి అలాంటప్పుడు జంతువు ఎలా సరిపోతుంది? ప్రతి మనిషి పాపాత్ముడే మరి మనిషి మరో మనిషి కోసం బలి అవ్వలేడు కదా! పాపం లేని మనిషి అంటూ లేడు కదా! అదికూడా అది అతని సమ్మతి ప్రకారం జరగాలి! లేకపోతే అదికూడా హత్య అవుతుంది.

 

మనిషి పాపం చేసి దేవుని నుండి దూరమై- దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దోషాన్ని పాపాన్ని శాపాన్ని సంపాదించుకున్నాడు. మనిషి దేవుని సొత్తు! గాని మనిషి దేవునికి నచ్చే పనులు చేయకుండా సాతానుతో సహవాసం చేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేసి ద్రోహిగా పాపిగా మారిపోయాడు! సృష్టి మొత్తం ఆయన ఇల్లు! మనమే ఆయన ఇల్లు! దానిని ఇప్పుడు మనిషి పాడు చేసేసాడు. ప్రకృతిని పాడు చేసేశాడు! దేవుని ఇంటిని వాడు తగులబెట్టేశాడు అన్నమాట! అయితే ఇప్పుడు దేవుడు కనికరించి వారిని విడుదల చెయ్యాలి అనుకున్నారు! మరి వారు పాపం చేశారు కదా! దానికి శిక్ష ఎవరు భరిస్తారు? పాపం చేస్తే శిక్ష, మరణం అనుభవించాలి అనే రూల్ చేసింది ఆయనే కదా! మరి దీనిని ఎవరు భరిస్తారు? పాపం చేసింది మనిషి! శిక్ష అనుభవించేది జంతువా? అది నిజంగా భరించగలదా శిక్షను? భరించలేదు! ఇది అసాధ్యం! ఇక ఎవరూ దీనిని భరించలేరు కాబట్టి దేవుడే శిక్షను తనమీదను వేసుకుని మానవులకు బదులుగా మరణించి శిక్షను తను పొందడానికి వచ్చారు. పాపం లేని వ్యక్తిగా జీవించారు. ఆయన మొదట దేవుడు- ఇప్పుడు మానవుడు- అనగా దైవ మానవుడు కాబట్టి దేవుడు- మనిషి స్థానంలో ఉండి మానవుల పొందవలసిన శిక్షను సిలువలో పొందారు! శిక్షను సంతోషంగా అనుభవించారు! ప్రేమను చూపించారు. తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు! క్షమించమని క్షమాభిక్ష పెట్టారు! మానవుల పాపం కోసం ఆయనే ప్రాయశ్చిత్తం చేశారు!

 

ప్రియ స్నేహితుడా! ఆయన నీకొరకు చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నీకోసం పొందిన దెబ్బలను గాయాలను ఎప్పుడైనా ఆలోచించావా? నిజంగా దానిని గ్రహిస్తే నీవు ఇకను పాపం చేసేవాడవు కావు! ఇక లోకంలో తిరిగే వాడవు కావు! ఇప్పుడైనా కలువరి సిలువను గుర్తుకు చేసుకో! సిలువయొక్క విలువ ఏమిటో గ్రహించు! ఫిలిప్పీయులకు 2: 8

మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

  ..... మరి ఇంత గొప్ప ప్రేమ చూపించిన దేవునికి నీవిచ్చే ప్రతిఫలం ఏమిటి? ఇంకా ఆయన గాయాలు రేపుతావా?

 Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో *దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు* గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

మరి ఇంకా ఆయనను భాద పెడతావా? ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేస్తే తప్పించుకోగలవా?

ఒకసారి ఆలోచించి మారుమనస్సు పొంది నేడే ఆయనను క్షమాపణ వేడుకుని ఆయన యొద్దకు తిరిగి రమ్మని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*మెల్కీసెదేకు క్రమము చొప్పున......*

*35 భాగం*

హెబ్రీ 10:58

5. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.

6. పూర్ణహోమములును పాపపరిహారార్థ బలులును నీకిష్ఠమైనవికావు.

7. అప్పుడు నేను గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.

8. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

9.ఆయన నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 57వచనాలలో అయితే/ అందుచేత అని మొదలుపెట్టారు అనగా జంతువుల రక్తము మనుష్యుల పాపాలు తీసివేయడం అసాధ్యం కాబట్టి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు బలులు అర్పణలు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చావు కాబట్టి ఇప్పుడు నేను గ్రంధపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను అంటున్నారు. కారణం నీకు పూర్ణహోమములు పాప పరిహారబలులు కూడా నీకిష్టమైనవి కావు అంటున్నారు.

మరి మాట ఎక్కడుంది? కీర్తనల గ్రంధంలో భక్తుడు ప్రవచించారు 40:68 లో. .....

6. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

7. అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది

 

దానినే ఇక్కడ ఎత్తి రాస్తున్నారు భక్తుడు! అదే ప్రకారం యెషయా గ్రంధం 6 అధ్యాయంలో కూడా ఎవరిని పంపుతాను నా తరుపున అంటే నేనున్నాను నన్ను పంపమని దేవునితో చెప్పినట్లు చూసున్నాము!

 

చూడండి ఎప్పుడో పూర్వకాలంలోనే అనగా దావీదు గారి కాలంలోనే దేవుడు చెప్పారు: బలులు అర్పణలు నాకు అవసరం లేదు! విరిగినలిగిన హృదయమే నాకు కావాలి! అదే నాకిష్టమైన బలి అంటున్నారు. మామూలు యాగాలు దేవునికి అవసరం లేదు! స్తుతియాగం కావాలి అంటున్నారు. మరి బలి కన్నా, యాగం కన్నా, అర్పణ కన్నా మరి దేవునికి ఏమి కావాలి అంటే నీ చిత్తమే నేను చేస్తాను ప్రభువా అని దేవుని మాట వినడమే దేవునికి కావాలి! ఆయన చిత్తానికి పూర్తిగా లోబడటం, ఆయన చిత్తానికి సంపూర్తిగా అప్పగించుకోవడమే దేవునికి కావాలి! రకంగా ఆయన చిత్తానికి సంపూర్తిగా అప్పగించుకున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!

ఇంకా అంటున్నారు ఇదిగో పుస్తకం చుట్టలో నా కొరకు వ్రాయబడిన ప్రకారం నీ చిత్తం చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఇంకా మత్తయి 26:39 లో కూడా అయ్యా నా చిత్తము కాదు నీ ఇష్టమే నీ చిత్తమే కొనసాగాలి అని ప్రార్ధన చేశారు. అదీ తగ్గింపు! అదీ లోబడటం! ఒకసారి సమూయేలు గారి మాటలను జ్ఞాపకం చేసుకుందాం! బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం! అవును ఆయన అదే చేశారు. దేవునికి ఇష్టమైన పని చేసి ప్రజల విమోచనకు కారణమయ్యారు.

 

89....

8. బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత

9. ఆయన నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింప బడుచున్నవి. రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

చూడండి బలులు అర్పణలు పూర్ణహోమములు పాప పరిహార బలులు నీవు కోరలేదని అవి నీకిష్టమైనవి కావనీ చెప్పిన తర్వాత నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అని చెబుతున్నారు. తర్వాత ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన బలియాగములు మొత్తము క్రీస్తుయేసు బలియాగానికి గుర్తు మాత్రమే! అవి అనగా ధర్మశాస్త్ర సంభంధమైన బలులు మానవుల పాపాన్ని మాత్రము విముక్తి చేయలేవని ఆయనకు తెలుసు!

 

ఇక 9 వచనంలో మరోమాట రెండోదానిని స్థాపించడానికి మొదటి దానిని రద్దుచేశారు అంటున్నారు. రెండోది అంటే: యేసుక్రీస్తు స్థాపించిన నూతన నిబంధన లేక క్రొత్త నిబంధన! పాతది లేక మొదటి నిబంధన అనగా పాత నిబంధన లో గల ధర్మశాస్త్రము! దానిని రద్దుచేశారు అంటున్నారు. ఎందుకు రద్దుచేశారు?

అది లోపభూయిష్టంగా ఉంది కాబట్టి.హెబ్రీ 8:7;

అది పాతదైపోయింది కాబట్టి! 8:13;

అది సంపూర్ణసిద్ధి సాధించలేకపోయింది కాబట్టి.

మరలా ఒకసారి గుర్తుకుచేస్తున్నాను! పాత నిబంధన రద్దుచేయబడింది అనగా ధర్మశాస్త్రము రద్ధు చేయబడింది అనగా బలులు, యాగములు, అర్పణలు, స్నానాదులు, ఇవి రద్దు చేయబడ్డాయి. ఎందుకంటే వాటిలో ఆధ్యాత్మికత లేదు, కేవలం శరీరాచారాలు మాత్రమే! అది మొదటగా క్రీస్తుద్వారా నెరవేర్చబడి దానితో ఇక అవసరం లేదు కాబట్టి అది రద్దుచేయబడింది. అంతేతప్ప మొత్తం పాత నిబంధన అనగా ఆదికాండం నుండి మలాకి గ్రంధం వరకు రద్దుచేయబడింది అని కాదు!

 

10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.

 

విధంగా యేసుక్రీస్తుప్రభులవారు బలియాగం చేయడం వలన మనము పరిశుద్ధ పరచబడియున్నాము అంటున్నారు. ఇంకా చిత్తమును బట్టి అంటున్నారు. అనగా దేవుని మాటకు లోబడి ఆయన చిత్తమును నేరవేర్చుటను బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము అంటున్నారు. మనము కూడా అదే ప్రకారంగా ఆయన చిత్తానికి లోబడి ఆయనా చిత్త ప్రకారము చేయబద్దులమై ఉన్నాము!

 

   ఇక 1114 వచనాలలో మరోసారి పౌలుగారు బలియాగం ఒక్కసారే చేసి ముగించారు అంటున్నారు. అనగా అర్పణ బలి యాగం అనేది ఒక్కసారే చేసి ఇక ముగించారు అంటున్నారు. ధర్మశాస్త్ర సంభంధమైన యాజకులైతే ప్రతీసారి అర్పణలు చేస్తూ అర్పిస్తూ ఉండేవారు. క్రీస్తు ఒకేసారి ముగించేశారు అని మరలా రాస్తున్నారు. దీనికోసం మనం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం! అయితే సందర్భంగా ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలను వాడుతున్నారు పౌలుగారు!

మొదటిది: నిలిచియుండుట- కూర్చోవడం!

 రెండవది: ఎప్పటికీ నిలిచియుండే ఒకే బలి!

 

నిలిచియుండుట- కూర్చోవడం కోసం ఆలోచిస్తే: ప్రత్యక్ష గుడారములోని సేవా-పరిచర్యలో కూర్చోవడం అనేది లేదు. ప్రత్యక్ష గుడారంలో సింహాసనం గాని, కుర్చీ గాని లేవు! నిలబడి సేవ చేయాల్సిందే! కారణం యాజకుల పని ఎప్పటికీ పని పూర్తికాదు! నిరంతరమూ చేస్తూ ఉండాలి! అయితే 1314 వచనాల ప్రకారం ఒక్కసారే ఆయన బలియాగం చేసి ముగించి తండ్రి ప్రక్కన కూర్చున్నారు అంటున్నారు. కారణం ఆయన ఒకసారి బలియాగం చేశారు. అది శాశ్వత మైనది. ఎప్పటికీ నిలిచియుండేది యాజకులు చేసే బలియాగాలు అనుదినం చేయాలి. గాని ఈయన చేసినది పవిత్రమైనది పరిపూర్ణమైనది. అంతేకాకుండా బలియాగం సంపూర్ణసిద్ధి సాధించింది కాబట్టి ఇక మరలా బలియాగం చేయనవసరం లేదు! అందుకే ఇక పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు తండ్రిప్రక్కన కూర్చున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!

 

ఇక రెండవది: ఎప్పటికీ నిలిచి యుండే బలి: దీని సమాధానం కూడా మీద చెప్పినదే! బలియాగం శాశ్వతమైనది. కాబట్టి అది ఎప్పటికీ నిలిచియుండేది. కారణం ఆయన అర్పించింది మేకల రక్తం, గొర్రెల రక్తం కాదు- పవిత్రమైన నిర్దోషమైన రక్తము!

హెబ్రీ 9:12;  2528;

 

  ఇక 13 వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం రాస్తున్నారు. అప్పటినుండి అనగా ఆయన బలియాగం చేసిన తర్వాత నుండి, వెల చెల్లించిన తర్వాతనుండి- తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచూ దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు అంటున్నారు. హెబ్రీ 1:౩లో మొదలుపెట్టిన విషయానికి మరలా వస్తున్నారు పౌలుగారు!

కీర్తనలు 110: 1...

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

 

అక్కడ దేవుడు చెప్పారు కాబట్టి తనపని తాను నెరవేర్చి- ఇప్పుడు తన శత్రువులు తన పాద పీఠముగా చేయబడే వరకు ఎదురుచూస్తున్నారు. తండ్రియైన దేవుడు క్రీస్తుయేసు యొక్క విరోధులను, అంత్యక్రీస్తును, అపవాధిని, లేదా ప్రకటన గ్రంధంలో చెప్పబడిన క్రూరమృగం, అబద్దప్రవక్తను యేసుక్రీస్తు యొక్క పాదపీఠంగా ఇంకా చెయ్యలేదు! యేసుక్రీస్తుప్రభులవారు ఇంకా దానికోసం ఎదురుచూస్తున్నారు. సమయం గడియ కేవలం తండ్రికే తెలుసు! అందుకే ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రకటన 11:1518 లో వ్రాయబడింది. ....

15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. శబ్దములు లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

16. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి

17. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

18. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

 

అప్పుడు భూలోక రాజ్యాలన్నీ ఆయన వశం చేయబడతాయి తర్వాత ఆయన ప్రత్యక్ష పరిపాలన చేయడానికి వస్తారు.

ప్రియ చదువరీ! రాకడకు నీవు సిద్ధంగా ఉన్నావా?

దైవాశీస్సులు!

*మెల్కీసెదెకు క్రమము చొప్పున......*

*36 భాగం*

హెబ్రీ 10:1922

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచ బడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

      (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం మెల్కీసెదెకు క్రమం కోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాం! అది ధర్మశాస్త్ర- యాజకధర్మం అనగా అహారోను యాజక ధర్మం కంటే గొప్పదని శ్రేష్టమైనదని ధ్యానం చేసుకున్నాం!

 

ఇక 1518 వచనాలలో మరలా యిర్మియా 31:3134 లో దేవుడు చేసిన నూతన నిబంధన కోసం పౌలుగారు రాస్తున్నారు. దీనికోసం మనం విస్తారముగా ధ్యానం చేసుకున్నాం! అయితే ఇక్కడ గమనించవలసిన విషయం పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం చెబుతున్నాడు అంటున్నారు. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మతో అనుభంధం ఎంతో అవసరం! మనం సంపూర్ణసిద్ధి పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ అనుభవం అభిషేకం లేకపోతే దానిని పొందుకోలేము! దినములైన తర్వాత నా ధర్మవిధులను నేను వారి హృదయంలో ఉంచుతాను వారి మనస్సు మీద వ్రాస్తాను. వారు నాకు పిల్లలై ఉంటారు, ఎందుకంటే ఆదరణ కర్త అనబడే పరిశుద్ధాత్ముడు వారిని సర్వసత్యములోనికి నడిపించడమే కాకుండా వారిని పాపం చేయకుండా గద్దిస్తూ ఉంటాడు. మనస్సాక్షిని శుద్ధిచేస్తూ భోధిస్తూ ఉంటాడు.

రోమీయులకు 8: 14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

ఇక 1922 వరకు దీనికోసమైన అనగా మెల్కీసెదెకు క్రమం కోసమైనా తుది పలుకులు పలుకుతున్నారు పౌలుగారు!

సహోదరులారా! యేసు మనకొరకు ప్రతిష్టించిన మార్గమున అనగా మెల్కీసెదెకు క్రమంలో అతిపరిశుద్ధ స్థలమునకు ప్రవేశం సుగమం చేసిన మార్గములో అనగా నూతనమైనదియు, అనగా పాత నిబంధన సంబంధమైనది కాదు, జీవము గలదియు- కారణం పాత నిబంధనలో అన్ని జంతుబలులు- శరీరాచారాలు మాత్రమే- అధ్యాత్మిక మార్గం కాదు అది. జీవము లేనిది. అయితే ఇది జీవము గల మార్గము. అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు నేనే మార్గమును, నేనే సత్యమును నేనే జీవమునైయున్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అనగా ముక్తికి లేక తండ్రి సన్నిదానములో గల అతి పరిశుద్ధ స్థలానికి చేరే దారి మరొకటి లేదు అంటున్నారు! కాబట్టి మనం కూడా అదే ప్రతిష్ఠత కలిగిన వారమై జీవించబద్దులమై ఉన్నాము.

 

ఇక తర్వాత ఆయన శరీరము అనే తెర ద్వారా అంటున్నారు: ఆయన శరీరం తెర ఏమిటి? అడ్డుతెర చిరిగిపోయింది కదా! కొంచెం వివరంగా చూద్దాం! తెర అనేది ప్రత్యక్షగుడారం లోను, సొలోమోను మందిరం లోను ఉండేది. ఇది పరిశుద్ధ స్థలాన్ని- అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది! తద్వారా అప్పుడు తండ్రి సన్నిధిని అనుభవించే లేక సన్నిధిని చేరే మార్గం ఇంకా వెల్లడి కాలేదని సూచిస్తుంది. హెబ్రీ 9:8; తెర క్రీస్తుయేసుకు సూచనగా ఉంది. యేసుక్రీస్తుప్రభులవారు మానవ దేహముతో లోకానికి వచ్చారు. హెబ్రీ 10:5; ఇప్పుడు మన పాపాల కోసం మరణించినప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రిందకు రెండుగా చిరిగింది. మత్తయి 27:2051 ; అనగా క్రీస్తుయేసు సిలువ మరణం ద్వారా దేవుని సన్నిదిలోనికి ప్రవేశించేమార్గం వెల్లడి అయ్యింది అన్నమాట! సిలువలో ఆయన దేహం చీల్చబడింది. అనగా తెర చీల్చబడి రెండుగా చిరిగిపోయి దేవుణ్ణి సమీపించే దారి ఏర్పడింది. అనగా అతిపరిశుద్ధ స్తలములోనికి మార్గం సుగమం అయ్యింది.

 

ఇక్కడ ఒకసారి ఆగుదాం! గతభాగాలలో అతి పరిశుద్ధస్తలములోనికి రక్తము అనగా బలి రక్తము లేకుండా ప్రవేశం లేదు అని చూసుకున్నాం! మరి ఇప్పుడు మనం నూతన మార్గం ద్వారా అనగా మెల్కీసెదెకు క్రమం ద్వారా బలిరక్తము లేకుండా సమీపించవచ్చా??? లేదు లేదు లేదు! బలి రక్తము కావాలి! మరి మన దగ్గర లేదు కదా!!! ఉంది! దానినే 20 వచనంలో రాస్తున్నారు పౌలుగారు!....హెబ్రీయులకు 10: 20

ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

 

మనము కూడా అదే రక్తాన్ని తీసుకుని, అనగా మనము ఆయన రక్తములో కడగబడి నూతన పరచబడి ఉన్నాము కనుక ఆయన రక్తము మనలోను ప్రవహిస్తుంది కనుక, ఆయన రక్తాన్ని మనము ఎల్లప్పుడూ తీసుకుంటూ నిత్య జీవమును పొందుకుంటున్నాము గనుక అదే రక్తముతో అనగా యేసురక్తముతో మనం కూడా అదే అతిపరిశుద్ధ స్థలము అనబడే దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రవేశిస్తున్నాము అంటున్నారు.

 

 గమనించాలి: పాతనిబంధనా కాలంలో సంవత్సరానికి ఒక్కసారే కేవలం ప్రధానయాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్తలములోనికి ప్రవేశించగలిగే వాడు. అయిత నూతన మార్గం ద్వారా అనగా మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున రోజైనా సరే, క్షణమైనా సరే, రక్షించబడిన విశ్వాసి, మారుమనస్సు అనుభవం, వాక్యానుసారమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, ఆత్మాభిషేకం పొందుకున్న విశ్వాసి, అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించగలడు! అనగా దేవుని సన్నిధిని ఆత్మపూర్ణుడై అనుభవించగలడు! దేవుని ఆత్మతో అనుదినం మండించబడాలి విశ్వాసి!

 

హెబ్రీయులకు 10: 21

దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

. అందుకే ఇటువంటి దేవుని ఇంటిమీద నమ్మకస్తుడైన ప్రధాన యాజకుడు మనకు ఉన్నారు కాబట్టి మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయం గలవారమై, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, ఇంకా సంపూర్ణ సిద్ధి పొంది, యదార్ధ మైన హృదయంతో దేవుని సన్నిదానమునకు అనగా అతిపరిశుద్ధ స్థలమునకు చేరుదాం అంటున్నారు.

 

ఇక్కడ ఆగి ఆలోచన చేస్తే 22 వచనంలో ఇలాంటి మాటలు ఎందుకు ఉపయోగించారు పౌలుగారు? ప్రోక్షించబడిన హృదయం అని, ఉదకముతో స్నానం అని... ఇలా? కారణం: పాత నిబంధన యాజకధర్మంలో ప్రత్యక్షగుడారం లో ప్రవేశానికి ముందు మొదటగా గంగాళములో కాలుచేతులు కడుగుకుని వెళ్ళాలి! మరి మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే: ఇవన్నీ అనగా పాత నిబంధన ధర్మశాస్త్రమంతా ప్రస్తుతం ఉన్న వాటి యొక్క చాయలు కాబట్టి- మనం కూడా కన్నీటితో మన పాపాలు ఒప్పుకుని ఆయన నామంలో బాప్తిస్మం పొందుకుని పరిశుద్ధ స్థలము అనే సంఘంలో ప్రవేశించాలి. అప్పుడు మరింత లోతైన అనుభవం పొందుకుని ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కడుగుకుంటూ, అనుదినము ఆయన పరిశుద్ధాత్మ సన్నిధినిఅనుభవిస్తూ అనుదినం ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. అని అర్ధం! అనగా అనుదినము ఆయన ఆత్మాభిషేకం పొందుకోవడం వలన మనము దినదినము శుద్ధీకరించబడి పాపములనుండి విడుదల పొంది పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధత లోనికి ప్రవేశించగలము!

 

ఇక ప్రోక్షించబడిన హృదయాలు అనగా మన అంతరంగంలో స్థిరమైన మనస్సును, నూతనమైన అనుభవాలు కలిగి దేవుని దృష్టిలో నిందారహితమైన జీవితాలు జీవించడం అన్నమాట! దేవుణ్ణి ఆరాదించేటప్పుడు మన మనస్సాక్షి గాని, సాతానుడు గాని మనలను ఆక్షేపించే పరిస్తితి లేకుండా ధైర్యముగా జీవించే హృదయాలే ప్రోక్షించబడిన హృదయాలు!

 

 మరి దేనితో ఇవి ప్రోక్షించబడ్డాయి అంటే క్రీస్తుయేసు రక్తముతో ప్రోక్షించబడి మన మనస్సాక్షి శుద్ధిచేయబడింది.

ఇదే నూతన నిబంధనలో మెల్కీసేదేకు క్రమంలో చేసే యాజకధర్మం!

 

మరి ఇక్కడ మరో విషయం గమనించాలి: పాత నిబంధన-ధర్మశాస్త్ర ఆహారోను యాజకధర్మం లో కేవలం లేవీగోత్రానికి చెందిన వారే యాజకులుగా ఉండేవారు. అది దేవుని కట్టడ! మరి నూతన నిబంధన మెల్కీసెదెకు క్రమంలో దేవుడు విశ్వాసులందరినీ యాజకులుగా చేశారు!

1పేతురు 2:91

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ప్రకటన 1:6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

కాబట్టి ఇప్పడు విశ్వాసి, రక్షణానుభవం, ఆత్మానుభావం, సాక్షార్దమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఎప్పుడైనా క్షణమైనా అతిపరిశుద్ధ సన్నిధిలో యేసురక్తమును చేత పట్టుకుని ప్రవేశించవచ్చు!

 

    విషయంలో ఇదే మెల్కీసేదేకు క్రమంలో దేవుని యాజకత్వము చేసే మరో గుంపుకూడా ఉంది. అది మెల్కీసెదెకులా, యేసుక్రీస్తు ప్రభువు వలే, ఏలీయావలె, ఎలీషావలె, పౌలువలె, తిమోతి వలె, తీతువలె వివాహము చేసుకోకుండా దేవుని సేవ నిస్వార్ధంగా చేసే వారు! వీరు చేసిన సేవ- ఎంతో గంభీరమైన సేవ! ఎందుకు వీరు ఇంత ఘనమైన సేవ చేయగలిగారు అంటే కేవలం వివాహం చేసుకోలేదు కాబట్టి. వీరికి భార్య పిల్లలు లాంటి బంధాలు లేవు కాబట్టి అనుదినం వీరు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆత్మపూర్ణులై దేవుని ఘనమైన సేవ జరిగించగలిగారు. రోజులలో కూడా అనేకమంది దైవసేవకులు వివాహం చేసుకోకుండా దేవునిసేవ ఎంతో గంభీరంగా చేస్తున్నారు. అయితే వివాహం చేసుకుని చేసే సేవ మెల్కీసేదేకు క్రమం యొక్క సేవ కాదా? అంటే అదికూడా మెల్కీసెదెకు సేవయే! గాని వీరి సేవ ప్రత్యేకమైనది. బైబిల్ సెలవిస్తుంది- వివాహాన్ని నిరాకరించే ఒక బాచ్ ఉంది. అది దేవునికి వ్యతిరేఖమైనది. అయితే కొందరు దేవుని సేవకోసం తమనుతాము ప్రతిష్టించుకుని మనస్సును, శరీరాన్ని కట్టుకుని శరీర కోరికలకు తట్టుకుని సేవ చేస్తారు కదా ఇది వీరికి దేవుని వలన కలిగినది. వీరు ప్రత్యేకమైన పిలుపును ఏర్పాటును గలవారని తెలుసుకోవాలి! అయితే వివాహం చేసుకున్న వారు కూడా ఘనమైన సేవ చేయగలిగారు. హనోకు గారు వివాహం చేసుకుని కూడా ౩౦౦ సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నారు. అబ్రాహాము గారు కుటుంబవ్యవస్తలో ఉంటూ దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు. మోషేగారు వివాహం చేసుకుని దేవునికిష్టమైన వ్యక్తిగా ఉన్నారు. దావీదుగారు , యోబు గారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అపోస్తలులలో పేతురు గారు వివాహంచేసుకుని తన భార్యతో కలిసి సేవ చేశారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే వివాహం చేసుకోకుండా సేవ చేసేవారు- పరమ సీయోను అనుభవాన్ని ఎక్కువగా పొందుకుంటారు. వీరు ఎక్కువ సమయం దేవునికే కేటాయించగలరు కాబట్టి అనుభవానికి తొందరగా రాగలరు! వీరు ప్రత్యేకమైన మెల్కీసెదెకు క్రమపు యాజకులు అని అనుకుంటాను. ఇది ఏర్పరచబడిన వారికే తప్ప ఇలాంటి అనుభవం ఏర్పాటు అందరికీ కలుగదు!

 

సరే, ఇప్పుడు మనం అనగా విశ్వాసులమైన మనం ఏమి చేయాలి? మొదటగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ప్రోక్షించబడిన హృదయములు కలిగి సంపూర్ణ నిశ్చయం కలిగి యదార్ధమైన హృదయాలతో దేవుని సన్నిధానమునకు చేరాలి! మన నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి. కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడటం మానెయ్యవద్దు. దినం సమీపించే కొలదీ ఇంకా ఎక్కువగా కలుసుకుంటూ ప్రేమ చూపుతూ సత్కార్యములు చేస్తూ ఉండాలి.

 

రెండవది: 6:12....

1. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు,

2. దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరు త్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.

 

కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, సంపూర్ణ సిద్ధికి లేదా పరిపూర్ణత కోసం ప్రయత్నం చేయమంటున్నారు. క్రమంలో ఆరు మూల పాటాలు కోసం కాకుండా సంపూర్ణత సాధించడానికి ప్రయత్నం చేయమంటున్నారు

ఇక్కడ 6 విషయాలు కోసం కాదు అంటున్నారు. ఆరు విషయాలు- మారుమనస్సు పొందుకోవడం,

 దేవునియందలి విశ్వాసము,

బాప్తిస్మము కోసం భోధ,

హస్త నిక్షేపణం అనగా చేతులేసి ప్రార్ధన చేయడం వలన స్వస్తతలు, వరాలు ఫలాలు పొందుకోవడం,

మృతులు పునరుత్థానం,

నిత్యమైన తీర్పు ఇలాంటి వాటికోసం కాకుండా సంపూర్ణత సాధించటానికి ప్రయత్నం చేయమంటున్నారు. ఎన్నోసార్లు మెల్కీసెదెకు క్రమం కోసం ధ్యానం చేస్తున్నపుడు చెప్పడం జరిగింది. హెబ్రీ పత్రిక ముఖ్యాంశం: మెల్కీసెదెకు క్రమంలో పరిపూర్ణత, సంపూర్ణత, సంపూర్ణసిద్ధి సాధించడమే!

అనగా మనం కూడా సంపూర్ణత సాధించాలి అంటే మన చూపులోను సంపూర్ణత సాధించాలి అనగా చూపులతో పాపం చేయకూడదు, తలంపుతో కూడా పాపం చెయ్యకూడదు అప్పుడు చూపులో సంపూర్ణత పొందుకున్నట్లు. మాటలలో సంపూర్ణత సాధించాలి. మన ప్రవర్తనలో సంపూర్ణత సాధించాలి. మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. అనుదినము ఆయన ఆత్మాభిషేకం అనుభవిస్తూ ఆత్మ నడిపింపు కలిగియుండాలి. ఇలా అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణత నుండి, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతను సాధించాలి.

 

నేటి దైవజనులారా! సేవకులారా! విశ్వాసులారా! నేడు మనం ధ్యానం చేసుకోవలసినది- నేడు మనం భోదించవలసినది- సాధించవలసినది సంపూర్ణసిద్ధి పరిపూర్ణత ఎలా సాధించడం అనేదే! అంతేకాని అస్తమాను- దీవెనలు, ఆదరణ అని, స్వస్తతలు అంటూ, భోదించడం కాదు! అవి భోదించకూడదని నా ఉద్దేశ్యం ఎంతవరకూ కాదు! అవి భోధించాలి అప్పుడప్పుడు! అంతేకాని అస్తమానం అవేకాదు! ప్రజలు తప్పులు చేసినప్పుడు ఖండించాలి. గద్ధించాలి. బుద్ధి చెప్పాలి! ఇంకా రాకడకు ఆయత్త పరచాలి. అలాగని ఎప్పుడూ రాకడ కోసమే భోదించమని కాదు! అన్ని కలిపి భోధించాలి! ముఖ్యంగా పరిపూర్ణత ఎలా సాధించాలో చెప్పాలి! పరిపూర్ణత, సంపూర్ణత శ్రమల నుండి మాత్రమే సాధించగలిగామని దీనిద్వారా నేర్చుకున్నాం! యేసుక్రీస్తు ప్రభులవారు సంపూర్ణసిద్ధి సాధించడానికి కారణం ఆయన పొందిన శ్రమలు, శ్రమలు ఆయనకు విధేయత నేర్పించాయి. విధేయత సంపూర్ణ సిద్ధిని పరిపూర్ణతను తెచ్చి పెట్టాయి. మనం కూడా ఇప్పుడు అదే బోధ నేర్పించాలి. సంఘాన్ని శ్రమల ద్వారా సంపూర్ణసిద్ధి సాధించగలమని బోధించాలి తప్ప యేసుబాబు ని నమ్ముకుంటే కష్టాలు రావు నష్టాలు రావు మీకు అన్నీ దీవనలే, మీ కొడుక్కి ఉద్యోగమ, నీ కోడలికి గర్బఫలం, నీకు పెద్ద మేడ, ఆశీర్వాదాలు వస్తాయి అని కాదు బోధించడం! క్రీస్తును నమ్ముకున్న వారు కష్టాలు శ్రమలు తప్పకుండా అనుభవించాలి, శ్రమలే మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాయి అని భోధించాలి! ఇప్పుడు అనుభవిస్తున్న శోధనలు, అనుభవిస్తున్న కరోనా లాంటి శోధనలు, మిడతల దండ్లు కేవలం సాంపిల్ మాత్రమే అని భోధించాలి. తొందరలో మనం మరణానికి కూడా సిద్దమవ్వాలి అని భోధించాలి. నీవు దేవుణ్ణి నమ్ముకున్నందున ఒకరోజు నీ రేషన్ కార్డు పోతుంది, ఒకరోజు నీ ఉద్యోగం కూడా పోవచ్చు, ఒకరోజు నీ రిజర్వేషన్ కూడా పోగొట్టుకుంటావు. నీకు కలిగినది సమస్తము పోగొట్టుకునే రోజు రాబోతుంది. నిన్ను క్రీస్తుకోసం చిత్రవధ చేసే రోజు వస్తుంది అని భోధించాలి. అన్ని భాదలు పొంది మనమం సంపూర్ణ సిద్ధి సాధించి అప్పుడు పరలోకం పొందుకుంటాము అని చెప్పాలి. శ్రమలకు ఇప్పటినుండే వారిమనస్సులను సిద్ధం చెయ్యాలి. ప్రస్తుత రోజులు గమనిస్తే ఆరోజులు ఎంతో దూరంలో లేవు! మారుతున్న దేశ పరిస్తితులు చూసుకున్నా, మారుతున్నా ప్రపంచ పరిస్తితులను చూసుకున్న రోజులు చాలా తొందరలో వస్తున్నాయి.

 

ప్రియ సంఘమా నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియ సేవకుడా! నీవు పరిపూర్ణత సాధించి, నీ సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించ గలుగుతున్నావా? సంఘమా ఆధ్యాత్మిక విషయాలలో పరిపక్వతను సాధించావా? జాగ్రత్త!

సంఘమా సిద్దపడు!

పరిపూర్ణత సాధించు!

సాక్షిగా సిలువ సాక్షిగా అవసరమైతే హతస్సాక్షిగా దేవునికోసం నిలబడు!

 

అట్టి కృప సంపూర్ణత మనందరికీ దేవుడు దయచేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

సమాప్తం.

 

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

ప్రియ దైవజనమా! మెల్కీసెదెకు క్రమం అనే శీర్షిక ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను. మా కోసం మా పరిచర్య కోసం, సంఘాలు కోసం, చేసే ఉద్యోగం కోసం ప్రార్ధన చేయండి. మా సోషల్ మీడియా పరిచర్య అనగా మా పేజీలు: యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిరీక్షణ ద్వారం కోసం, మా వెబ్సైట్ : ఆధ్యాత్మిక సందేశాలు కోసం, మా వాట్సప్ పరిచర్య కోసం ప్రార్ధన చేయండి. ప్రభువు చిత్తమైతే  మరో శీర్షికతో కలుసుకుందాం!

 

ఇట్లు

ప్రభువునందు మీ సహోదరుడు

 

రాజకుమార్ దోనే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

శరీర కార్యములు

పక్షిరాజు

పాపము