*మోరస్తీయుడైన మీకా-11వ భాగం*
మీకా 2: 7—10
7. యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
8. ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించువారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారిపై వస్త్రములను లాగుకొందురు.
9. వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.
10. ఈ దేశము మీ విశ్రాంతి స్థలముకాదు; మీరు లేచి వెళ్లిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా
ఈ భాగంలో దేవుడు తన
ఉక్రోషం తెలియజేస్తున్నట్లు ఉంటుంది.
మొదటగా 7వ వచనంలో అంటున్నారు:
యాకోబు సంతతివారని పేరు
పెట్టబడిన వారు
అనగా యూదులు మరియు ఇశ్రాయేలు వారు, అనగా మొత్తం పన్నెండు గోత్రాలవారిని ఉద్దేశించి చెప్పినది.
ఆదికాండము 28:12,13,14,15
12. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
13. మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
14. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
15. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
ఇలా ప్రారంభమైన ఆశీర్వాదము
నిజమై, వారు గొప్ప జనాంగమయ్యారు.
యెషయా 46: 3,4
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.
ఇలా వాగ్దానం చేసినా వారు తిరగబడ్డారు అందుకే అడుగుతున్నారు
యిర్మియా 2: 4,5
యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివార లారా,
మీరందరు యెహోవా వాక్కు వినుడి.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?
యాకోబు సంతతివారు అని పేరు పెట్టబడిన వారలారా! యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? ఎందుకు అలా అంటున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న లేక జరుగబోయే ప్రతిదండన క్రియ ఆయన చేతనే జరుగుతాయా? ఇంతవరకు ఆయన ఎంతో కరుణామయుడు అనియు, దీర్ఘశాంతుడు, కృప చూపు వాడని చెప్పారు కదా! ఎందుకు ఇలాంటి ప్రతిదండనకు యోచిస్తున్నారు అని మీరు అడగొచ్చు! అయితే మీరు నా మాటలు వినడం లేదు! మరికొంతమంది మాటలను/ ఆయన వాక్కులను కలిపి చెరుపుతున్నారు. అందుకే ఈ కీడు! ఇంకా అంటున్నారు: యధార్ధముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనాలు!
వీటికోసం క్లుప్తంగా పరిశీలన చేద్దాం! యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? బైబిల్ లో
ఇలాంటి మాట
మరొకచోట ఉంది?
కీర్తనలు 77:7—9
7. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?
8. ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?
9. దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)
ఇలా అనుకోనడానికి కారణం కూడా అక్కడే 10వ వచనంలో భక్తుడు రాస్తున్నారు:10,11
10. అందుకు నేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము.
11. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును ...
అయితే అసలు కారణం యెషయా గారు ప్రవచిస్తున్నారు:59:1—4...
1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు! విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు! మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను!
2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను! గనుక ఆయన ఆలకింపకున్నాడు.
3. మీ చేతులు రక్తముచేతను, మీ వ్రేళ్లు దోషముచేతను, అపవిత్రపరచబడియున్నవి!! మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. !!
4. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
ఇంకా వారు ఎలాంటివారో ఈ అధ్యాయం మొత్తం చదివితే దేవుని బాధ
ఉక్రోశాన్ని అర్ధం
చేసుకోవచ్చు!
ఇక్కడ దేవుడు మీకా గారిద్వారా మాట్లాడుచున్నారు! దేవుడు వారిపట్ల కోపం తెచ్చుకోడు అని వారనుకొంటే అది చాలా పొరపాటు! దేవునికి లోబడి, ఇతరుల విషయాలు న్యాయంతో వ్యవహరిస్తూ ఉంటే వారికి దేవుని మాటలు ఎంతో మేలు కలుగజేస్తాయి! అయితే దుర్మార్గులు దేవుని ప్రవక్తల నోళ్ళు మూయించడానికి ప్రయత్నం చేయడం ద్వారా దేవుని తీర్పు రాకుండా ఆగిపోదు! వచ్చేది తప్పకుండా వస్తుంది! అలా
చెయ్యడం
ద్వారా
దేవుని
ఉగ్రత తిన్నగా వారి నెత్తిమీదకే వచ్చినట్లుగా చేసుకుంటున్నారు అన్నమాట!
కాబట్టి
మనలో దోషములు పాపములు ఉంచుకుని దేవునిమీద నిందలు వేయకూడదు! అవును దేవుడు కరుణామయుడు! కృపామయుడు! కనికరమూర్తి! గాని ఆయనకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడు? ఆయన
మాట వినకుండా, ఆయన చెప్పిన మాట చేయకుండా విగ్రాహారాధన, అన్యాచారాలు చేస్తే కోపం వచ్చి ఈ ప్రతిదండన
తీసుకుని
వస్తారు
దేవుడు! ఇంకా దేవుడు నా మొర్ర వినలేదు, నన్ను మరచిపోయారు దేవుడు అంటూ నిందలు వేస్తున్న ఓ పెద్దమనిషి! ముందుగా నీ ప్రార్ధనలు దేవునికి వినబడటం లేదు- కారణం నీ దోషములు, పాపములు నీకును దేవునికి మధ్య అడ్డగా గోడలా పెరిగిపోయాయి! ముందు నీ పాపాల
గోడను పెరికివేయు! అప్పుడు నీ ప్రార్ధన
దేవునికి
చేరుతుంది. అప్పుడు దేవునితో సమాధాన పడు!
ఇలా
దేవునితో
సమాధానంగా
ఉంటూ ఆయన మాటలమీద ధ్యానముంచి లక్ష్యముంచి జీవిస్తే ఆ మాటలు అనగా దేవుని మాటలు ప్రజలకు ఎంతో క్షేమమను కలిగిస్తాయి! ఇంకా చెప్పాలంటే క్షేమం కావాలంటే సాధనం- దేవుని మాట వినడమే!
ద్వితీ 4:40
మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని *క్షేమము కలుగుటకై* నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు *నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.*
ద్వితియోపదేశకాండము 5: 29
వారికిని వారి సంతాన మునకును నిత్యమును *క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.*
1సమూయేలు 12:14
మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి *ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును*.
ప్రసంగి 8:13
భక్తిహీనులు దేవుని సన్నిధిని భయ పడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగు దును.
యెషయా 48:18
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.
యిర్మియా 7:23
ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
కాబట్టి ప్రియ స్నేహితుడా!
నీకు క్షేమం కావాలా? నీ ఇంట్లో, కుటుంబంలో, బయట క్షేమము కావాలా? అయితే ఒక్కటే మార్గం!! దేవుని మాటలు
విని- వాటి ప్రకారం చెయ్యడమే! అలా చేస్తే నీకు క్షేమము! వినకపోతే ప్రతిదండన!
దేవుని మాటలను విందాం!
వాటి ప్రకారం నడచుకొందాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-12వ భాగం*
మీకా 2: 7—10
7. యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
8. ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించువారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారిపై వస్త్రములను లాగుకొందురు.
9. వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డల యొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొని పోవుదురు.
10. ఈ దేశము మీ విశ్రాంతి స్థలముకాదు; మీరు లేచి వెళ్లిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా
ఈ భాగంలో తన ఉక్రోషం తెలియజేస్తున్నట్లు ఉంటుంది.
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఈ 8,9 వచనాలలో దేవుడు చెబుతున్నారు నా ప్రజలు నా శత్రువులు అయిపోయారు. దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణలు కూడా
మనకు కొంచెం అర్ధం కావు.
ఇప్పుడే కదా నా జనులు నాకు శత్రువులైరి- అంటూ నిర్భయముగా సంచరించువారిని చూసి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారిపై వస్త్రములను లాగుకొందురు- ఎవరిదో లాగుకొంటే దేవునికి శత్రువులు ఎలా అవుతారు?
దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు ఎంతగా అంటే వారి ఒంటిమీద వస్త్రాలు కూడా లాగుకునిపోతున్నారు. దీనిలో మరో ఆత్మీయ అర్థం ఏమిటంటే నాయకులు ప్రజలయొక్క రక్షణను కోల్పోయేలా చేస్తున్నారు. వారి రక్షణ వస్త్రాన్ని సాతానుగాడు ఎత్తుకుని పోతున్నాడు. దానికి నాయకులు సహకరిస్తున్నారు అన్నమాట! వారే విగ్రహారాధన ను ప్రోత్సహిస్తూ రక్షణ కోల్పోయేలా చేస్తున్నారు.
ఇక రెండవది:
వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను వెల్లగొట్టుదురు!
ఇంకా దేవునికి రావలసిన ఘనతను ఈ నాయకులే దొంగిలిస్తున్నారు. దేవుడు అంటున్నారు నాకు రావలసిన ఘనత నేను ఎవరికీ ఇయ్యను. యెషయా 42:8;
సరే, వీళ్ళకు చేస్తే దేవునికి శత్రువులు ఎలా అవుతారు?
సింపుల్ జవాబు: అది మత్తయి 25లో యేసుక్రీస్తుప్రభులవారు గొర్రెలు మేకలు ఉపమానంలో మిక్కిలి దీనులైన ఈ సహోదరులలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్టే! వారికి చెయ్యకపోతే నాకు చెయ్యలేదు అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ మిక్కిలి దీనులైన తన ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే దానిని దేవుడు తనకు వ్యతిరేఖంగా చేసినట్లు భావిస్తున్నారు అన్నమాట! అంతేకాదు: మిమ్మును ముట్టినవాడు తనగుడ్డును ముట్టినట్లు దేవుడు భావిస్తున్నారు! జెకర్యా 2:8; కాబట్టి దీనులకు, దిక్కులేని వారికి, అనాదలకు, నిరాశ్రయులకు, బలం లేని వారికి ఎవరైనా అన్యాయం చేస్తే అది తిన్నగా దేవునికి వ్యతిరేఖమైన పనిచేసి దేవునికి శత్రువుగా మారిపోయావు అన్నమాట! అదేరకంగా ఎవరైనా ఈ మిక్కిలి దీనులైన ప్రజలకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లు అన్నమాట! అందుకే దేవుడు అంటున్నారు:
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు! సామెతలు 19:17
ఇంకా కీర్తనలు 41:1
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
సామెతలు 14:21 బీదలను కటాక్షించు వాడు ధన్యుడు!
సామెతలు 17:5..
బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచ బడడు.
సామెతలు ౩౦:14
అసలు భక్తి అంటే ఏమిటో దేవునికి మెచ్చిన భక్తి ఏమిటో యెషయా గారు చెబుతున్నారు 58:6,7,8
6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
హబక్కూకు గారు ప్రవచిస్తున్నారు ౩:14
బీదలను రహస్యముగా మింగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు.
కాబట్టి దీనులను బీదలను బాధిస్తే వారు
దేవునికి శత్రువులు అవుతున్నారు. వారికి సహాయం చేస్తే దేవునికి అప్పిచ్చి,
దేవునికి ప్రీతిపాత్రమైన ప్రజలుగా మారుచున్నారని గ్రహించాలి!
ఇక 10వ వచనం....
ఈ దేశము మీ విశ్రాంతి స్థలముకాదు; మీరు లేచి వెళ్లిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
ఈ దేశం మీకు విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపొండి. కారణం మీరు నాశనం నిర్మూలం కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు చేశారు అంటున్నారు దేవుడు. ఇక మీకు ఈ దేశంలో ఏ మాత్రం భద్రతా అనేది లేదు. మీరు చేసిన పాపాలతో ఈ దేశాన్ని మొత్తం అపవిత్రం చేసేశారు. ఇప్పుడు మీ భూమి విశ్రాంతి దినాలు అనుభవించాలి. ఒకసారి లేవీయ కాండంలో దేవుడు ఏమని చెప్పారో చూద్దాం , లేవీ 26వ అధ్యాయంలో మీరు నా మాట వినకపోతే నేను మీ దేశమును పాడుచేస్తాను. మీ దేశంలో మనుష్యులు లేకుండా చేస్తాను. అప్పుడు మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైయున్న దినములలో మీ భూమి తన విశ్రాంతి కాలములను అనుభవించును! 26:34,౩5
ఇక తర్వాత వచనంలో వారికి ఎటువంటి ప్రవక్తలు కావాలో చెబుతున్నారు- వ్యర్ధమైన
మాటలు పలుకుచు అబద్ధికుడై వచ్చి- నాకు ఎక్కువ ద్రాక్షారసం, మద్యం ఇస్తే నేను
మీతో దైవావేశంతో పలుకుతాను అని
ఎవడైనా అంటే
వాడే ఈ ప్రజలకు తగిన
ప్రవక్త!! ఆ ప్రజలకు తమకు
అవసరమైన సత్యాన్ని వినడం ఇష్టం
లేదు గాని
తాము వినేందుకు ఇష్టంగా ఉండేవే అనగా తమకు
అనుకూలమైన మాటలు
చెప్పే వారే
తమకు ప్రవక్తలగా కావాలి అని
కోరుతున్నారు. 2తిమోతి 4:3,4
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన)
సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
నేటిరోజులలో
ప్రజలు
కూడా అలాగే ఉన్నారు- ఖండించి గద్దించి బుద్ధిచెప్పే వాక్యం ఎవరైనా చెబితే అలిగి గుడిలోనికి రావడం మానేస్తున్నారు. అదే కొన్ని జీతాలిచ్చి సేవకులను పోషించే సంఘాలలో అయితే అలాంటి బోధలు ఎవరైనా చేస్తే వెంటనే ఆ వారమే
ఆ సంఘం నుండి బయటకు నెట్టివేయడం గాని, మరో సంఘానికి ట్రాన్స్ఫర్ గాని చేసేస్తున్నారు. పెద్దలను మెప్పించే వారు, పిట్టకధలు, సైన్సు
చెప్పేవారు, నవ్వించేవారు కావాలి సంఘానికి! ఆత్మావేశంతో గద్దింపులు చేస్తే పుసుక్కున ఫీలై పోతున్నారు. ఇది
బ్రష్టత్వానికి
సూచన! ఆ కాలంలో అలా అనుకున్నారు కాబట్టే దేవుడు ఆ దేశం
నుండి వారిని వెళ్ళగొట్టారు. నేడు నీవు కూడా అలా అనుకుంటే దేవుడు తన రాజ్యం
నుండి నిన్ను వెళ్ళగొడతారు జాగ్రత్త!
సంఘపెద్దలారా! విశ్వాసులారా! జాగ్రత్తగా ఉండండి! హెచ్చరికగా ఉండండి!
మీకు నచ్చిన ప్రసంగాలు చేసేవాడు, మిమ్మల్ని నవ్వించేవాడు మిమ్మల్ని నరకానికి తీసుకుని పోతున్నాడు. వాక్యంలో మిమ్మల్ని గద్దించి మిమ్మును ఏడిపించేవాడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అందుకే గద్ధిస్తున్నాడు., విని మారుమనస్సు పొంది అలాంటి కాపరిని హత్తుకో! అదే నిజమైన ఆహారం! సైన్సు వెనుక,
పిట్టకదల వెనుక, నవ్వుల వెనుక పడ్డావా- నరకానికి పోతున్నావు అని గ్రహించు!
నేడే నిన్ను నీవు పరిశీలన చేసుకుని, నిన్ను నీవు
సరిదిద్దుకో!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-13వ భాగం*
మీకా 2: 12—13
12. యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.
13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ఇక చివరగా ఈ అధ్యాయంలో
ఇంతవరకు కలుగబోయే తీర్పులు చెప్పాక, ఇప్పుడు అంత్యదినాలలో జరుగబోయే మేలులు చెబుతున్నారు.
యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగుచేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును! .. దేవుడు ఇప్పుడు ఆదరణకరమైన తన వర్తమానము వినిపిస్తున్నారు. నేను మిమ్మునందరిని పోగుచేస్తాను. ఇంతవరకు మీ పట్టణం రాళ్ళకుప్ప అయిపోతాది. మీరు చెదిరిపోతారు అన్న దేవుడు అయితే ఆఖరికి మిమ్మును క్షమించి మరలా మిమ్మును పోగుచేసి తీరతాను అంటున్నారు. ప్రవక్త కేవలం దేవుని ఉగ్రతనే కాదు- దేవుని ఓదార్పులు కూడా ప్రజలకు వినిపించాలి. ఆయన అనగా దేవుడు ఏమి చెప్పినా పొల్లుపోకుండా తనప్రజలకు చెప్పాలి! ప్రవక్త/సేవకులు దేవుని వార్తావహులు/పోస్ట్ మెన్ అంతే. చెప్పపమన్న విషయం ఉన్నదిఉన్నట్టు చెప్పాలి అంతే! దానికి కలుపకూడదు తీసివేయకూడదు! అదీ ప్రవక్త ముఖ్యలక్షణం! మీకా గారు అదే చేస్తున్నారు ఇక్కడ! యధావిధిగా మిగిలిన ప్రవక్తలతో దేవుడు చెప్పినట్లుగానే మీకా గారితో కూడా దేవుడు తాను చేయబోయే నాశనం/ విపత్తు కోసం మొదట చెప్పి, చివరగా వారిని సమకూరుస్తాను. వారిని దీవిస్తాను, వారిని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు!
మిమ్మును నేను సమకూరుస్తాను అని కేవలం
మీకా గారితోనే కాకుండా ఇంకా
అనేక మంది
ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశారు యెషయా
గ్రంధం నుండి
మలాకీ వరకు!
యెషయా 54:7
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
యిర్మియా 29:14
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను;
నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
యిర్మియా 31:8,10
8. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అంద రిని సమకూర్చుచున్నాను, మహా సంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు
10. జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
యేహెజ్కేలు 34:13
ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
యేహెజ్కేలు ౩6:24
నేను అన్యజను లలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించె దను.
జెఫన్యా 3: 19
ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని
సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,
జెకర్యా 10:8
నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.
ఇక ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చెదను అంటున్నారు. దీని అర్ధం- కొద్ది శేషం మాత్రమే మిగిలుతుంది. ఆ మిగిలిన శేషాన్ని తప్పకుండా నేను మరలా సమకూర్చెదను అంటున్నారు. ఇంతవరకు వారు అనేక దేశాలలో చితికిపోయి చెదిరిపోయి ఉన్నారు. ఇప్పుడు మొదటగా వారిని ఈలవేసి పిలుస్తాను, తర్వాత వారిని ఒకచోటుకు చేరుస్తాను. తర్వాత వారిని ఇక కదలకుండా నాటుతాను. ఇప్పుడు వారు ఎప్పుడును కదల్చబడరు! ఇదీ దీని అర్ధం!
ఇక
తర్వాత
మాటలో బొస్రా గొర్రెలు కూర్చినట్లు వారిని సమకూరుస్తాను అంటున్నారు.
ఒకసారి
ఆగి ఆలోచన చేస్తే, బొస్రా అనేది ఒకానొకప్పుడు ఎదోము అనగా ఇరాక్ కి చెందినది. కాలక్రమేణా ప్రస్తుతం జోర్డాన్ దేశంలో ఉంది. ప్రస్తుతం దానిపేరు బుషైరా.
బొస్రా
గొర్రెలు
అన్నీ ఒకే వరుసలో వెళ్తాయి. కారణం ఆ రోడ్డు
చాలా ఇరుకైనది.
బొస్రా అనేది నదీ తీరంలో ఉండటం వలన అక్కడ పచ్చని పచ్చిక దొరుకుతుంది. ఇక అవి
పొలం లోకి వెళ్లాక కూడా అదే వరుస క్రమాన్ని పాటించడం వలన బొస్రా గొర్రెలకు మంచి పేరు వచ్చింది.
అలాగే
విశ్వాసి
జీవితంలో
క్రమబద్ధమైన
అలవాట్లు
కలిగి ఉండాలి.
ఇక ఈ వచనం ప్రకారం దేవుడు బొస్రా గొర్రెలు సాయంత్రం ఎలా వరుసగా తమ గొర్రెల దొడ్డిలోకి వస్తాయో అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా రప్పిస్తాను అంటున్నారు.
యిర్మియా గ్రంధంలో ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు.... అంటున్నారు. యిర్మీయా 23:3,4
3. మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.
4. నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
యేహెజ్కేలు 28:25
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచు కొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు.
యేహెజ్కేలు 37:24
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.
ఆయన మన కాపరి!
కోపమొస్తే ఎలా చెదరగొట్టారో అలాగే తన వాత్సల్యముతో తిరిగి సమకూర్చే దేవుడు! ఆదుకుని అ ఆదరముతో హక్కున చేర్చుకునే దేవుడు! దినమొల్ల ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. నీవు దూరమైనా నీ కోసం చేతులు చాపి పిలుస్తున్నారు. లోబడనొల్లని పిల్లలకోసం దినమెల్లా నా చేతులు చాపి పిలుస్తున్నాను అంటున్నారు. నా గొర్రెలు నామాట వింటాయి అని దేవుడే చెప్పారు. మరి వస్తావా? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నారు. ఆయన కాపరత్వము క్రిందకి, ఆయన అపొస్తలత్వము క్రిందికి వస్తావా?
ఇక చివరి వచనంలో ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దానిద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును . ఇది కూడా అంత్యదినాలలో జరిగే ప్రవచనము!
గోడలు పడగొట్టే వాడు అనగా అభిషక్తుడైన యేసుప్రభులవారిని సూచిస్తుంది. ఇశ్రాయేలు వారిని సమకూర్చి వారు దేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఉన్న అన్ని అడ్డంకులు ఆయన తొలగిస్తారు. ఆయనే అనగా దేవుడే వారి రాజు అని అర్ధము!
ఇంకా ఇది దేవుడు వారి చెరను విముక్తి చేయడం సూచిస్తుంది. ప్రాకారాలు పడగ్రోట్టే వాడు అనగా అది తప్పకుండా యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే! ఆయన ఈ ప్రాకారాలు మాత్రమే కాకుండా ఆ కల్వరి సిలువలో మరణించి పాపపు గోడలు/ ప్రాకారాలు కూల్చి, పాపాన్ని/ ధర్మశాస్త్రాన్ని బాహాటముగా వేడుకకు కనపరచి పాపపు చెరలో ఉన్న ప్రజలను చెరను చెరగా తీసుకుని పోయి అందరికీ విముక్తులనుగా చేశారు. ప్రాకారాలు – పాపపు గోడలు అంటారు. ఏదిఏమైనా నీవు ఆయన వద్దకు వస్తే నేడే నీ పాపపు గోడలను బ్రద్దలుగా చేసి నిన్ను ఆ పాపపు చెరనుండి విడిపించి నీతిమంతులుగా తీర్చి పరిశుద్దులుగా చేసి పరముకు నిన్ను హక్కుదారునిగా చేయగలరు! మరి నీవు వస్తావా?
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-14వ భాగం*
మీకా ౩: 1—3
1. నేనీలాగు ప్రకటించితిని యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.
2. అయినను మేలునసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకల మీది మాంసము చీల్చుచుందురు.
3. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా! గతరెండు అధ్యాయాలలో గల
ఆత్మీయ అర్ధాలు ఇంతవరకు ధ్యానం చేశాము. ఇక మూడవ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనకు
ఏమి భోదిస్తున్నాడో ధ్యానం చేద్దాం!
ఈ మూడవ అధ్యాయంలో ఇశ్రాయేలు నాయకులను/ ప్రధానులను ఎండగడుతున్నారు! అసలు న్యాయం కాపాడవలసిన మీరే న్యాయాన్ని పీకనొక్కేస్తున్నారు. అసలు మీకు న్యాయం, నీతి అంటే ఏమిటో మీకు తెలుసా అని అడుగుచున్నారు! ఈ అధ్యాయంలో చాలా మాటలు ఆమోషు, మరియు ఇంకా మిగిలిన ప్రవక్తల మాటలతో పోలిఉంటాయి!
చూడండి ఈ మూడు వచనాలలో దేవుడు ఏమని బాధపడుతున్నారో! యాకోబు సంతతి ప్రధానులారా! అనగా కేవలం 10 గోత్రాలే కాదు మొత్తం యూదులు, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ!
న్యాయమును ఎరిగియుండుట మీ ధర్మమే కదా!
అనగా న్యాయము ఏమిటో తెలుసుకుని దానిని నెరవేర్చడం మీ ధర్మం లేక భాద్యత కదా! అయితే మీరు ఎందుకు దానిని పాటించడం లేదు అంటున్నారు. అయితే కొన్ని ఇంగ్లిష్ తర్జుమాలలో ఇలా ఉంది-
అసలు మీకు న్యాయం, నీతి అంటే ఏమిటో మీకు తెలుసా? మీరే న్యాయాన్ని తుంగలో త్రొక్కి అన్యాయాలు చేస్తూ అన్యాయాన్ని ప్రేరేపిస్తున్నారు అని వ్రాయబడింది!
రెండవ వచనంలో అయినను మీరు మేలును అసహ్యించుకొని కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు! ఇంకా నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకలను వాటిమీది మాంసమును చీల్చుచుందురు అంటున్నారు, ఇంకా ౩వ వచనంలో నా జనుల మాంసమును మీరు తింటున్నారు. వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి తింటున్నారు అంటున్నారు. అయితే నిజంగా వీరు తన ప్రజల మాంసమును తింటున్నారా అంటే లేదు గాని వారు అనగా ఈ ప్రధాన నాయకులు ఇశ్రాయేలు ప్రజలను ఎంతఘోరంగా హింసిస్తున్నారో చెబుతున్నారు ఇక్కడ!
నిజం చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకొన్నప్పుడు వారు నీతిన్యాయాలను అనుసరించే ప్రజలుగా , పవిత్ర జనంగా ఉండటానికి పిలిచారు. అందుకే ధర్మశాస్త్రమును కూడా రాయించి ఇచ్చారు. ఈ నాయకులు వాటిని చదివి అర్ధం చేసుకుని ప్రజలను పాటించేలాగా చెయ్యాలి! అయితే నాయకులే చెడిపోయి అన్యాయస్తులుగా మారిపోయారు!
జెఫన్యా ౩:1—4
1. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.
2. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.
3. దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
4. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.
ఆమోషు 2:6—8,11—12
6. యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.
7. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
8. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.
11. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను (వ్రతము పట్టినవారుగాను) నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.
12. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.
హోషేయ 4:1—౩
1. ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు.
2. అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.
3. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.
యెషయా 1:23
నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.
అందుకే దేవుడు వారిమీదకు భయంకరమైన ఉగ్రతను పంపిస్తున్నాను అని
సెలవిచ్చారు!
ఇంతకీ దేవునికి ఏమి కావాలి?
ఇక్కడ
ప్రవక్త
చెబుతున్నారు
ఆమోషు 5:24- నీళ్ళు పారినట్లు న్యాయమును జరుగనియ్యుడి గొప్ప ప్రవాహము వలే నీతిని ప్రవహింప నియ్యుడి! దేవుని కావలసినవి మన నైవేద్యాలు
అర్పణలు
కానుకలు
కావు! ప్రజల మధ్య శాంతి సమాధానాలు! దేశంలో నీతిన్యాయాలు! మనుష్యులలో శాంతి ప్రవర్తన! మనుష్యుల
మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లి ఒకరిని ఒకరు చంపుకోకుండా ప్రేమకలిగి యుండాలి ఇదే దేవుడు అడుగుచున్నారు!
హోషేయ 10:12
నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
ఇంకా అంటున్నారు: మీకా
6:6—8 లో చెబుతున్నారు....
6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?
7. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
చూశారా న్యాయముగా నడుచుకోవడం,
కనికరమును ప్రేమించడం,
దీనమనస్సు కలిగి
దేవునిఎదుట ప్రవర్తించడం ఇదే దేవునికి కావాలి!
ప్రియ దైవజనమా! నేటి దినాలలో కూడా ఎక్కడ చూసిన అవినీతి అక్రమము విస్తరించి యుండగా ఓ క్రైస్తవుడా నీవు హెచ్కరికగా ఉండటమే కాకుండా మాదిరిగా ఉండగలవా? కొంతమంది క్రైస్తవ నాయకులు అన్యాయముగా ప్రవర్తిస్తున్నారు. లంచాలు పుచ్చుకుంటున్నారు. ఇంకా చాలామంది క్రైస్తవ సంఘ నాయకులు అధికారం కోసం ఎన్నెన్నో ఘోరమైన కార్యాలు చేస్తున్నారు. తగవులాడుకుంటున్నారు ! కోర్టులకు వెళ్తున్నారు. దేవుని పరువు, సంఘం పరువు, క్రైస్తవుల పరువు తీసేస్తున్నారు. మరికొంతమంది సంఘపెద్దలు దేవుని కానుకలను దొంగిలిస్తున్నారు. సంఘపెద్దలే కాదు సంఘకాపరులు కూడా దేవుని సేవకు వాడాల్సిన కానుకలతో విలాసవంతమైన బిల్డింగ్లు కట్టుకుని విలాసవంతమైన కార్లలో తిరుగుతూ సేవను పైపైకి చేస్తున్నారు. వారి సేవ కేవలం సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తుంది. ఇంకెక్కడా కనబడటం లేదు! మరి వీరి మీదకు దేవుని ఉగ్రత న్యాయంగా దిగి రాదా?
నాయకులారా! పెద్దలారా! తీర్పు దేవుని ఇంటినుండే బయలుదేరు సమయం వచ్చింది అని పేతురు గారు ముందుగానే హెచ్చరించారు! 1పేతురు 4: 17
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
నేడే మార్పు నొంది
దేవునితో సమాధాన పడి ఆయన
దగ్గర తప్పు
ఒప్పుకో! లేకపోతే మొదటివారు కడపరి
వారు, కడపరి వారు మొదటి
వారు అవుతారు. పరలోకంలో ఉండాల్సిన సంఘపెద్దలు, కాపరులు నరకం లోనికి; నరకంలో ఉంటారు అని మీరు
భావించే పాపులు పశ్చాత్తాప పడి
పరలోకంలో ను
ఉంటారు.
నేడే మార్పునొందుకో!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-15వ భాగం*
మీకా ౩: 4
వారు దుర్మార్గతననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ఇక్కడ దేవుడు నేను మీ
మాట వినను
ఎంత మొర్రపెట్టినా మీమనవి ఆలకించను అంటున్నారు!
కారణం మీరు మీ దుర్మార్గతను వదలకుండా దానిని అనుసరిస్తూనే భక్తివేశం వేస్తున్నారు.
అందుకే మీరు
ఎంత మొర్రపెట్టినా నేను వినను అంటున్నారు.
ఇంకా మీకు
కనబడకుండా నన్ను
మరుగుచేసుకుంటాను అంటున్నారు!
ఎంతోమంది భక్తులు అడుగుతున్నారు- ప్రభువా మేము మొర్రపెట్టినప్పుడు నీవెందుకు
ఉత్తరమీయకున్నావు?
ఒకసారి సామెతలు గ్రంధం చూసుకుంటే ఎంతో
వివరంగా ఉంది: 1:24—31
24. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
25. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.
26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను
27. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.
28. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
29. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.
30. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు
చూశారా నేను పిలిచినప్పుడు మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు పిలిచినప్పుడు నేను వినను అంటున్నారు.
మీరు చేసినట్టే మీకు కూడా
కలుగుతుంది.
యెషయా 1:15
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును
మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో
నిండియున్నవి.
యెషయా 59:1—2
1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక
యుండునట్లు ఆయన
చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
యిర్మియా 11:11
కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.
చూడండి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే
వారు కోరి
దుష్టత్వాన్నే ఎన్నుకున్నారు,
అందుకే ఇక
దేవుని న్యాయమైన ఉగ్రత వారిమీదకు రాక మానదు! దానినుండి తప్పించే వారు కూడా
ఎవరూ ఉండరు! అందుకే వారు
ఎంతగా ప్రార్ధనా చేసినా నేను
వినను అంటున్నారు.
యిర్మియా 14:12
వారు ఉపవాస మున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించు నప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను
యేహెజ్కేలు 8:18
కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
యిర్మియా 7:16
కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.
యిర్మియా 11:14
కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.
యిర్మియా 22:21
నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గానినేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.
ఇంతగా దేవుడు విసికిపోయారన్నమాట!
పెద్ద ప్రవక్త బిలాము గారు,
ధనాశ చేత ఇశ్రాయేలు ప్రజలను శపిద్దామనుకుంటే దేవుడు గాడిద చేత బుద్ది చెప్పించారు. ఇక వెళ్ళి నీతిమంతులకు కలుగునట్టి మరణం నాకు సంభవించాలి అని ప్రార్థన చేశాడు. గాని ఏమి దొరికింది? కుక్క చావు చచ్చాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు. సంఖ్యాకాండము 31: 8
చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకె మును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.
గతి తప్పితే ప్రవక్త ప్రార్థనకూడా దేవుడు వినరు అంతే!
ఇక చివరికి దేవుడు జాలితలచి పిలుస్తున్నారు: 4:1 ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావలెను అంటున్నారు.
విశ్వాసి నీవుకూడా ఇప్పుడు నీ దగ్గర ధనముంది!
బలముంది! ఆస్తి ఉంది! పలుకుబడి ఉంది! ఈ వ్యక్తి నాకు తెలుసు! అతడు నాకు తెలుసు అని విర్రవీగావా? దేవుడు నిన్ను తన నోట నుండి నిన్ను ఉమ్మివేస్తారు జాగ్రత్త! భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలుపించుకుని దేవునిచే సెహబాస్ అనిపించుకుంటావా లేక దేవుడు తన నోటితో ఛీ అనిపించుకుంటావా? నీవే తేల్చుకో!
దేవునికి నీ ముఖము చూపుంచే స్తితిలో ఉంటావా లేక ఆదాము అవ్వల లా ముఖాన్ని చూపించలేక దాగుకునే స్తితిలో ఉంటావా?
ఇక యేసయ్య కూడా తాను తన దూతలతో వచ్చినప్పుడు నీగూర్చి భళా నమ్మకమైన దాసుడు అని చెప్పే స్తితిలో ఉన్నావా లేక నిన్ను గూర్చి సిగ్గు పడే స్తితిలో ఉన్నావా? మార్కు 8:38;
జాగ్రత్త పడి దేవునితో సమాధాన పడు! నీమోస బ్రతుకు- ఈలోక ఆశలు
ఈ నాటికైనా మారాలి!! మార్పునొందితే సరి లేకపోతే నేను వచ్చి
దీప స్తంభాన్ని దాని చోట
నుండి తీసివేస్తాను అంటున్నారు. దేవుని మాట వింటావా లేక దేవునిచేత ఛీ అనిపించుకుంటావా నీవే తేల్చుకో!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-16వ భాగం*
మీకా ౩: 5—7
5. ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టనియెడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా
6. మీకు దర్శనము కలుగకుండ రాత్రికమ్మును, సోదె చెప్పకుండ మీకు చీకటి కలుగును; ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును, పగలు చీకటిపడును
7. అప్పుడు ధీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తర మియ్యకుండుట చూచి నోరు మూసికొందురు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా
ఇంతవరకు నాయకుల కోసం, ప్రజలకోసం
చెప్పిన దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రవక్తలు ఎటువంటి వారో చెబుతున్నారు!
చూడండి 5వ వచనం: ఆహారమును నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు నోట ఆహారము పెట్టనియెడల అతనిమీద యుద్దము ప్రకటించువారునై , నా జనులను పొరపెట్టు (మోసగించు) ప్రవక్తలను గూర్చి.....
ఇదే వచనాన్ని మనం స్టడీ బైబిల్ లో చూసుకుంటే : నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తల గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే : తమకు భోజనం పెట్టేవారికి క్షేమం కలుగును గాక అని చెబుతూ, భోజనం పెట్టనివారితో పోరాటం జరిగించడానికి సిద్ధపడతారు!!! చూశారా ఎంతఘోరమండి!! మన తెలుగులో సామెత చెబుతారు కదా: పెడితే పెళ్లి ! పెట్టకపోతే చావు (కోరుతారు) అట ఈ ప్రజలు! ఈ ప్రవక్తలు కూడా అలాగే తయారయ్యారు అంటున్నారు దేవుడు!
అందుకే దేవునికి కోపం వచ్చి మీకు దర్శనాలు రాకుండా రాత్రికమ్మేలా చేస్తాను అంటున్నారు. సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును అంటున్నారు. ఇక్కడ దేవుడు మీకు ప్రవచనాలు రాకుండా మీ నోరు మూయిస్తాను అనడం లేదు, మీరు సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగుతుంది అంటున్నారు. అనగా నిజంగా దేవుడు చెప్పకపోయినా వీరి సొంతమాటలు సోదెగా చెబుతున్నారు అన్నమాట! అందుకే యిర్మియా గారు యెషయా గారు చెబుతున్నారు: తమ సహోదరుల మాటలను దొంగిలించి చాలామంది ఇదే యెహోవా వాక్కు అంటూ ఇతరుల ప్రవచనాలు- తాము చెప్పినట్లు లేదా తమకే ప్రవచనం వచ్చినట్లు చెబుతున్నారట చాలామంది ప్రవక్తలు! వీరికి నాశనం తప్పదు అంటున్నారు! యిర్మియా 23:౩౦,31,32...
30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.
32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.
అందుకే ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును అంటున్నారు అనగా గుడ్దోల్లు అయిపోతారన్నమాట! ఇలాగే అపోస్తలుల కాలంలో ఒకడు ఫోజు
కొడితే గుడ్డోడు అయిపోయాడు. ....Acts(అపొస్తలుల కార్యములు) 13:8,9,10,11
8. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి, తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
9. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై
10. అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది(అనగా-సాతాను) కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
11. ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
ఇంకా దేవుడు ఏమంటున్నారు? దీర్ఘదర్షులు సిగ్గునొందుదురు దీర్ఘదర్శి అనగా జరగబోయేది ముందుగానే వివేచించి చెప్పేవారు! సోదేగాండ్రు తెల్లబోవుదురు! ఇక తర్వాత వీరు ఎంత మొర్రపెట్టినా దేవుడు జవాబివ్వడం లేదని చూచి నోరు మూసుకుని కూర్చుంటారు అంటున్నారు. అవును ఇలాంటి దొంగ ప్రవక్తలకు దేవుడు ఎలా ఎందుకు సమాధానం ఇస్తారు??!!
చూడండి దేవుని పక్షాన మాట్లాడవలసిన ప్రవక్తలు ఇశ్రాయేలు నాయకుల వలె చెడ్డవారు అయిపోయారు. ప్రజలను సత్యమార్గం లోనికి సన్మార్గం లోనికి నడిపించవలసిన వారే దుర్మార్గం వైపు నడిపిస్తే దేవునికి కోపం రాదా?
ఇలాంటి ప్రవక్తల కోసం, ఇంకా ఎలాంటి ప్రవక్తలు ఆ కాలంలో ఉన్నారో ఒకసారి చూద్దాం!
యెషయా ౩:12
నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు
యిర్మియా 6:13—14
13. అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.
14. సమాధానములేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.
1రాజులు 22వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తల నోట
ఎలా అబద్దమాడు ఆత్మను ఉంచారో చూసుకోవచ్చు! ఇలా ప్రవక్తలందరూ అబద్దాలు చెప్పడం వలన
ఆహాబు రాజు
యుద్ధానికి వెళ్లి చచ్చాడు!
అందుకే దేవుడు పెద్దలను యాజకులను ప్రవక్తలను అందరినీ చంపేస్తాను అంటున్నారు:
యెషయా 9:14—17
14. కావున యెహోవా ఇశ్రాయేలులోనుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును.
15. పెద్దలును ఘనులును తల; కల్లలాడు ప్రవక్తలు తోక.
16. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మింగివేయబడు దురు.
17. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతోషింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.
యిర్మియా 2:8
యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు
యిర్మియా 5:13 ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురు
ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
యిర్మియా 5:31 : అబద్ద ప్రవచనములు చెబుతారు.
ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజ కులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?
యిర్మియా 14:14, 15
యెహోవా నాతో ఇట్లనెనుప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.
కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గ మై నను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.
అవివేక క్రియలు చేస్తున్నారు:
యిర్మియా 23:13
షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.
ఘోరమైఅన క్రియలు చేస్తున్నారు యిర్మియా 23:14
యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
అబద్దములు ప్రకటిస్తున్నారు యిర్మియా 23:25,26
25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.
26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?
27. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?
యిర్మియా 27: 16
యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.
విలాపవాక్యము 2:14
నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచి యున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.
యేహెజ్కేలు 13:4
ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.
యెహేజ్కేలు 22: 28
మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెల విచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.
హోషేయ 9:7
శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.
ఇదే మీకా ౩:11 లో చెబుతున్నారు ద్రవ్యము కొరకు సోదె చెబుతున్నారు
గప్పాలు కొట్టువారు జెఫన్యా ౩:4
దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు,
విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి
ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.
ఎప్పుడైతే దేవుడు వారితో మాట్లాడటం మానేస్తారో ఇక వారు
ఏమిచేస్తారంటే జెకర్యా
13:4,5
ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు.
వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనైయున్నాననును.
అప్పుడేనా? ఇప్పుడు కూడా ఈ అబద్ద ప్రవక్తలు బోధకులు ఉంటారని దేవుడే చెప్పారు: మత్తయి 24:11
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
మత్తయి 24: 24
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
ఇంకా యోహాను గారు అంటున్నారు 1యోహాను 4:1
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
నేటిరోజులలో అనేకమంది అబద్ద బోధకులు అబద్ద ప్రవక్తలు వచ్చి అనేకులను మోసం చేస్తున్నారు. ప్రజలు ఆ మోసగాళ్ళ వెనుక గొర్రెల్లా వెళ్ళిపోతున్నారు.
ప్రియ దైవజనుడా! ఇలాంటి అబద్ద బోధకులు అబద్ద ప్రవక్తలను గమనిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ వారి బారినుండి సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత సంఘ కాపరిది మాత్రమే కాదు, సంఘ నాయకులది కూడా! అనేకమైన దుర్భోదకులు లేచి ప్రజలను కలవర పెడుతున్నారు. వీరికి దూరంగా ఉండాలి!
ప్రియ సేవకుడా! సంఘపెద్డా! నీవు అప్రమత్తంగా ఉంటున్నావా? జాగ్రత్త దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి మనలను అధ్యక్షులుగా ఉంచారు కాబట్టి ఆ యావత్ మంద భాద్యత మనమీదనే పెట్టారని మరచిపోవద్దు!
సంఘాన్ని రక్షించుకుందాం!
మరి వీరు అబద్ధికులు అని ఎలా తెలుస్తుంది?
1) మత్తయి 7: 16,17
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
మత్తయి 7: 20
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
మత్తయి 7: 22
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
2) ఇంకా పరిశుద్దాత్ముని సహాయంతో వివేచించి తెలుసుకోవచ్చు!
3) వారు చెప్పేది వాక్యానుసారమా కాదా అని పరిశీలించి తెలుసుకోవాలి బెరయ సంఘస్తుల వలే! (అపొ 17:18)
అది నిజంగా లేఖనములలో
వ్రాయబడిందా లేక
సొంతమాటలా? లేక వాక్యాన్ని కలిపిచెరుపుతున్నారా లేక మీవలన లాభం
సంపాదించుకొనడానికి వారికి అనుకూలంగా వాక్యాన్ని మలుచుకొని బోధిస్తున్నారా అనేది లేఖనములు పరిశీలించి మాత్రమే చెప్పగలము!
ఒకవేళ ఇది చదువుతున్న
మీలో ఎవరైనా ఆ అబద్ద
ప్రవక్తల- బోధకుల లిస్టులో ఉంటే
మరచిపోవద్దు! దేవుని ఉగ్రత- తీర్పు దేవుని ఇంటినుండే బయలు దేరు
సమయం ఆసన్నమయ్యింది!
తీర్పును తప్పించుకోలేవు జాగ్రత్తః!
నేడే మార్పు నొంది బ్రతుకు మార్చుకుని దేవునితో సమాధాన పడు!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-17వ భాగం*
మీకా ౩: 8—12
8. నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.
9. యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
10. నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
11. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు,
యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
12. కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా
దేవుడు ఇంకా
ఈ భాగంలో కూడా ఇశ్రాయేలు జాతి చేస్తున్న తప్పులు, పొరపాట్లు
చూపిస్తూ, వారు అపరాదాలు చేస్తున్నా ఏమీ తప్పులు చేయనట్లు ఫోజు
కొడుతున్నారని ఎండగడుతున్నారు .
ఈ 8వ వచనంలో ప్రవక్త అంటున్నారు: నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలుకు తమ పాపములను కనుపరచుటకై యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తోనూ శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనైయున్నాను అంటున్నారు. చూడండి దేవుడు ఈ ప్రవక్తను దేనికోసం ప్రతిష్టచేసుకున్నారో!! యాకోబు సంతతి వారికి వారి అతిక్రమాలను దోషాలను గుర్తుచేసి చాటి చెప్పడానికి, ఇశ్రాయేలు ప్రజలకు తమ పాపములను అపరాధాలను చూపించి ఎలుగెత్తి వారికి రాబోయే తీర్పులను ప్రచురము చేయడానికి యెహోవా ఆత్మావేశంతో—కొన్ని ప్రతులలో యెహోవా ఆత్మా బలముచేత నింపబడి – బలముతోను తీర్పుతోను, శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడను అంటున్నారు.
ప్రియ
దైవజనమా! ఈ ప్రత్యక్షత కేవలం మీకా గారికే కాదు – ప్రవక్తలందరికీ ఇచ్చారు. ఆ పాత నిబంధన ప్రవక్తలకు మాత్రమే కాదు నేటి విశ్వాస సంఘానికి నేటి సేవకులకు కాపరులకు బోధకులకు ప్రవక్తలకు కూడా అదే ఆత్మావేశం దేవుడు దయచేశారు. ఎప్పుడైతే అలాంటి ఆత్మను పొందుకుంటావో వెంటనే నీవు ఆయన ఆత్మతో నింపబడి ప్రజల యొక్క అపరాధాలు పాపాలు బహిరంగంగా ఖండిస్తూ గద్దిస్తూ బుద్దిచెప్పుచూ దేవుని శక్తితోను దేవుని ఆత్మతోను దేవుని బలంతోను దేవుడిచ్చిన ధైర్యముతో రాబోయే తీర్పులను ప్రకటించవలసిన అవసరం ఉంది! ఇది ప్రతీ సేవకుని భాద్యత! గమనించాలి ఇవన్నీ చెయ్యాలి అంటే మొట్ట మొదటగా పొందుకోవలసినది దేవుని ఆత్మ, ఆ ఆత్మద్వారా ఆత్మావేశము పొందుకోవాలి. అప్పుడే నీవు ధైర్యముగా శక్తితోను బలంతోను ప్రకటించగలవు!
ప్రియ సేవకుడా విశ్వాసి నీవు ఆ ఆత్మను పొందుకున్నావా? ఆయనాత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని దేవుడే చెబుతున్నారు. రోమా 8:9; ఆయనవాడు కాదు అంటే సైతాను గాడి పార్టీ అన్నమాట నీవు! ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో! ఆత్మనడిపింపు లేని సేవకుడు విశ్వాసి- పొగబట్టిన దీపం లాంటివాడు లేదా కొడిగట్టిన దీపం లాంటివాడు, కునికే కోడి లాంటి వాడు, ముసలి సింహం లాంటివాడు! పేరుకు క్రైస్తవుడు గాని వానిలో సరుకు లేదు! చచ్చుబడిపోయిన అంగములు గలవాని కింద లెక్క అన్నమాట! ఇప్పుడు నీవు తేల్చుకో! దేవుని ఆత్మను పొందినవాడవై ఆత్మావేశం కలిగి క్రీస్తుకోసం చంపడానికైనా(సాతాను పాప బంధకాలను చేదించి వాణ్ని చంపడానికి), క్రీస్తుకోసం చావడానికైనా సిద్ధపడతావా? లేక చచ్చుబడిపోయిన అంగాలు గలవాడిలా పక్షవాయు రోగిలా ముక్కుతూ మూల్గుతూ ఉంటావా? క్రీస్తుకోసం - పౌరుషము గల ప్రవక్త ఏలీయా గారిలా పౌరుషంగా జీవిస్తావా లేక గేహాజిలా ధనానికి ఆశపడి కుష్టరోగం తెచ్చుకుంటావా నిర్ణయించుకో!
దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఈయలేదు గాని
శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహం గల
ఆత్మను దయచేశారు అని జ్ఞాపకం చేసుకో! 1తిమోతి 1:7;
యెషయా 58:1లో దేవుడు ఒక ప్రవక్త చేయవలసిన విషయాలు చెబుతున్నారు:
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన
తిరుగుబాటును నా
జనులకు తెలియ
జేయుము యాకోబు ఇంటివారికి వారి
పాపములను తెలియ
జేయుము
యేహెజ్కేలుగారికి దేవుడు చెబుతున్నారు ౩వ అధ్యాయంలో.... 3:11,17,18,19,20,21
11. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.
17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.
18. అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.
19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.
20. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.
21. అయితేపాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చరింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు.
ఒకసారి ఒక ప్రధానయాజకుడు దేవుని పని
చేయకుండా విగ్రహాల పూజచేస్తూ ప్రజలను దారి తప్పిస్తున్నప్పుడు దేవుడు ఆమోషుగారిని అక్కడికి పంపించి తన
వాక్కును ప్రకటించి వెళ్లిపోతుంటే ఈ ప్రధాన యాజకుడు వచ్చి అంటున్నాడు-
ఓ ప్రవక్త నీవు ఈ దేశంలో నీ
ప్రకటన చెయ్యొద్దు యెహోవా నామంలో ప్రకటన చెయ్యొద్దు-
నా చేతిలో చావొద్దు అంటే
ప్రవక్త అంటున్నారు:Amos(ఆమోసు) 7:12,13,14,15,16,17
12. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;
13. బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమైయున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు.
14. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను,
కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.
15. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.
16. యెహోవా మాట ఆలకించుము ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువ కూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.
17. యెహోవా సెలవిచ్చునదేమనగానీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.
ఇలాంటి పౌరుషం గల
ప్రవక్తలు దేవునికి కావాలి! మరి నీవు ఆ ప్రవక్తవు కాగలవా?!!! ఈ పౌరుషం ఎప్పుడు వస్తాది అంటే మీదన
చెప్పినట్లు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే!
నిర్గమ 31:5లో దేవుడు చెబుతున్నారు నా
పని చెయ్యడానికి అతనిని నేను
ఆత్మతో నింపాను.....
సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
ఇప్పుడు కూడా నీవు
దేవుని పని
ఘనంగా బలంగా
చెయ్యాలి అంటే
నీవు కూడా
దేవుని ఆత్మతో నింపబడాలి.
యెషయా 48:16
ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను
యేహెజ్కేలు 2:2
ఆయన నాతో మాటలాడి నప్పుడు ఆత్మ నాలోనికివచ్చి నన్ను నిలువబెట్టెను; అప్పుడు నాతో మాటలాడినవాని స్వరము వింటిని.
జెకర్యా 4:6
అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
ఎఫేసి 5:18
మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు;
అయితే ఆత్మపూర్ణులైయుండుడి.
1పేతురు 1: 12
పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
యోహాను 14:16—17
16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను (లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
మరి నీవు అలాంటి ఆత్మను పొందుకున్నావా?
పొందుకున్నది గట్టిగా పట్టుకుంటున్నావా? జెకర్యా 3: 7
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా
మార్గములలో నడుచుచు నేను నీ
కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద
అధికారివై నా
ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
ఒకసారి జాగ్రత్తపడి మెలుకువగా ఉండుము!
ఆత్మను పొందుకో!
దైవావేశం కలిగి దేవుని సేవలో సాగిపో!
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-18వ భాగం*
మీకా ౩: 8—12
8. నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.
9. యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
10. నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
11. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు,
యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
12. కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములవలె అగును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా
దేవుడు ఇంకా
ఈ భాగంలో కూడా ఇశ్రాయేలు జాతి చేస్తున్న తప్పులు పొరపాట్లు చూపిస్తూ, వారు అపరాదాలు చేస్తున్నా ఏమీ తప్పులు చేయనట్లు ఫోజు
కొడుతున్నారని ఎండగడుతున్నారు .
(గతభాగం తరువాయి)
ఇక 9వ వచనంలో యాకోబు సంతతి ప్రధానులారా! ఇశ్రాయేలు అధిపతులారా! న్యాయమును తృణీకరించి దుర్నీతిని నీతిగా ఎంచేవారలారా! ఈ మాట ఆలకించుడి! చూడండి ఇక్కడ ఎలాంటి ఘోరమైన దుష్టత్వములో ఉన్నారో?
ఎవరూ? యాకోబు సంతతివారిలో ప్రధానులు ఇంకా ఇశ్రాయేలు అధిపతులు! ఈ అధికారులే ఏమి చేస్తున్నారు? న్యాయాన్ని తృణీకరిస్తున్నారు దుర్నీతిని నీతిగా ఎంచి దానిని జరిగిస్తున్నారు! న్యాయాన్ని తృణీకరించడం అంటే న్యాయాన్ని అసహ్యించుకుని అన్యాయాన్ని ప్రేమించి జరిగించడం అన్నమాట!
ఇంకా చెప్పాలంటే న్యాయాన్ని తమ స్వలాభం కోసం తారుమారు చేసి , తీర్పులను తమకు ఎవరి వలన లాభం కలుగుతుందో వారి పక్షంగా తీర్పులు తీర్చడం అన్నమాట! ఒకసారి యేహెజ్కేలు 22:27 చూద్దాం
.
దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.
మరి ఇలాంటి వారిమీదకు దేవుని శాపం తీర్పు న్యాయంగా రాదా??!!
ఇంకా 10వ వచనంలో నరహత్య జరిగించుటచేత సీయోనును కడుతున్నారు అంటున్నారు.
దుష్టత్వము జరిగించుట చేత యేరూషలేమును కడుతున్నారు అంటున్నారు.
ఎంత ఘోరామండి!!
దేవుడు చెప్పిన దానిని వ్యతిరేఖంగా వీరు చేస్తున్నారు.
మీకా 7:2
భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు,
అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును.
యిర్మియా 22:13,17
13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.
17. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలా త్కారము చేయుచున్నావు.
యెషయా 59:7
వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
అయితే దేవుడు ఏ విధంగా సీయోనును కడతాను అన్నారు? యేరూషలేమును ఎవరు
కడుతున్నారు ఎలా
కడుతున్నారు అని
ధ్యానం చేస్తే: దేవుడే సీయోనును కట్టేవాడు – అయితే వీరు అన్యాయంతో కడుతున్నారు. రక్తపాతంతో
కడుతున్నారు అన్యాయంగా!
కీర్తనలు 69:౩5
దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
కీర్తనలు 102:16
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
యెషయా 14:32
జనముల దూత కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించియున్నాడు ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్ర యింతురు అని చెప్పవలెను.
యెషయా ౩౩:5 లో న్యాయంతోను నీటితోను సీయోనును నింపియుండగా వీరు రక్తపాతం చేత నరహత్య చేత నింపుతున్నారు...
యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
యెషయా 51: 3
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును
2రాజులు 21:16 ప్రకారం యేరూషలేము ఈ చివరనుండి ఆ చివర వరకు
రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడట ఎవరండి? రాజైన మనష్శే! న్యాయాన్ని
కాపాడవలసిన వాడే
అన్యాయంగా ప్రవర్తించాడు!
అందుకే దేవుడు యేరూషలేమును పాడు దిబ్బలుగా చేశారు. కీర్తనలు 79:1
దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
అయితే జాలి చూపించి మరలా కడతాను అంటున్నారు
కీర్తనలు 147:2
యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు
ఇంకా 11వ వచనంలో వారు చేస్తున్న అన్యాయాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి/....జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు,
వారి యాజకులు కూలికి బోధింతురు,
ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె
చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన
మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
చూడండి జనముల ప్రధానులే లంచాలు పుచ్చుకుంటున్నారు, యాజకులు కూలికి బోధిస్తున్నారు. ప్రవక్తలు డబ్బులు కోసం సోదె చెబుతున్నారు. అయితే వీరు యెహోవాను ఆధారం చేసికొని యెహోవా మనమధ్య ఉన్నాడు మనకు ఏ కీడు రానే రాదు అని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు.
యిర్మియా 8: 11
సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు.
అధికారులకు యాజకులకు పెద్దలకు కేవలం ధనం కావాలి గాని ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజలపట్ల మంచితనం న్యాయం అనేది వారికి లేదు. బ్రష్టత్వం క్షేత్రస్థాయిలో (peaks) లో ఉంది .
అందుకే
12వ వచనంలో చేను దున్నబడునట్లు సీయోను దున్నబడుతుంది. యేరూషలేము రాళ్ళకుప్పగా అయిపోతుంది అంటున్నారు. దీనిని యిర్మియా గారి దినములలో జ్ఞాపకం చేసుకున్నారు. యిర్మియా 26: 18
యూదారాజైన హిజ్కియా దినములలో మోర ష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెనుసైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
అదే యిర్మియా గారి కాలంలోనే ఇది జరిగింది.
అయితే 12వ వచనంలో మీ వల్లనే ఇలా జరగబోతుంది అని దేవుడు చాలా స్పష్టముగా చెబుతున్నారు. నిజంగా నాయకులు, రాజులు, యాజకులు, ప్రవక్తల వలెనే దేవుడు ఈ ఘోరమైన తీర్పులు ప్రకటించి జరిగించారు.
గమనించాలి సీయోనును, యెరూషలేమును ఆత్మతోనే కట్టాలి.
నీతి న్యాయాలతోనే కట్టాలి గాని రక్తపాతం తో కాదు. నేడు నీవు నేను పరమ సీయోనుగా కట్టబడుతున్నాము. మనము కూడా ఆత్మతోను ఆత్మద్వారా కట్టబడాలి తప్ప మీ సొంత ప్రయత్నాల ద్వారా కుదరదు!!!
ప్రియ
దేవుని
సంఘమా! దేవుని పరువు పోయినా సంఘం పరువుపోయినా దానికి కారణం మనమే! విశ్వాసులు! నాయకులు! దైవసేవకులు! కాపరుల వల్లనే!! వారి
అవిశ్వాసం, ధనలోబం వలననే! నాయకుల మధ్యనున్న అధికార కాంక్షల వలన నేడు సంఘాలలో అల్లరులు జరుగుతున్నాయి చివరికి దేవుని సంఘం- కోర్టుల మధ్య నిలవబడవలసి వస్తుంది,. సంఘం
పరువు దేవుని పరువు కోర్టుల మధ్య పోలీష్ స్టేషన్ల మధ్య పోతుంది., ఆనాడు ఇస్కరియోతు చేసిన పనివలన యేసుక్రీస్తు ప్రభులవారు ప్రజల కోర్టులో నిలబడాల్సి వచ్చింది. ఈరోజు
ఈ నాయకులనే ఇస్కరియోతుల వలన మరోసారి దేవుడు కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది!
ప్రియ సంఘమా! నాయకులారా! దైవసేవకులారా! ఇది న్యాయమా? ఒకసారి ఆలోచించండి!! దేవుడంటున్నారు యెషయా 52:5
నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
రోమా 2:24
వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
మరినీవు దేవునికి అవమానం, దూషణ తీసుకొస్తావా?
దేవుని నామమునకు మహిమ తీసుకుని వస్తావా?
ఎవడో ఒక్క త్రాగుబోతు
వలన, ఎవడో/ ఎవరో ఒక్క
వ్యభిచారి వలన
అంటారు- ఈ క్రైస్తవులంతా ఇంతే! చర్చిలో భక్తివేషం వేసి బయట
ఈ బుద్దులు చూపిస్తారు అని! ఈ రకంగా దేవుని పరువు, సంఘం పరువు
మొత్తానికి పోతుంది!
దయచేసి దయచేసి నాయకులారా సేవకులారా! దేవుని పరువు తీయొద్దు! దేవునికోసం రోషమైన కార్యాలు చెయ్యండి గాని దేవునికి అవమానం కలిగే
పనులు ఎంతమాత్రము చెయ్యొద్దు!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-19వ భాగం*
మీకా 4: 1—2
1. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
2. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ప్రియులారా ఇంతవరకు మూడు అధ్యాయాలు ధ్యానం చేశాం! ఇక ఈ నాల్గవ అధ్యాయం మొత్తం అంత్యదినాలలో జరుగబోయే విషయాలను ప్రవచిస్తున్నారు మీకా గారు! కారణం మొదటి వచనంలో అంత్యదినాలలో అంటూ మొదలయ్యింది కాబట్టి ఈ అధ్యాయం మొత్తం అంత్యదినాలలో జరుగబోయే విషయాలు కోసం వ్రాయబడ్డాయి అని గ్రహించాలి. అయితే ఈ అంత్యదినాలు అనగా ఎప్పుడో రాబోయే భవిష్యత్ లో అని అర్ధం అని చెప్పుకోవచ్చు! అయితే మనం బైబిల్ భాషలో లేదా క్రొత్త నిబంధన భాషలో – దేవుని రాకడ సమయం అని మామూలుగా చెప్పుకుంటాము. అయితే కొన్ని వచనాలు చూసుకుంటే ఈ సంఘ యుగం ఆఖరిలో అన్న అర్ధం వస్తుంది. ఉదా అపో 2:17 అంత్యదినాలలో లేదా చివరి రోజులలో నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. మరి ఇది ఎప్పుడు జరిగింది అంటే యేసయ్య మొదటిరాకడ అనంతరం ఆరోహణమైన తర్వాత నెరవేరింది. అదే హెబ్రీ 1:2 లో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను అంటున్నారు. అనగా సంఘం మొదలైన తొలిరోజులను సూచిస్తుంది.
1పేతురు 1:20 లో కడవరి కాలములయందు ప్రత్యక్షమయ్యెను అంటున్నారు అనగా ఇది కూడా సంఘం మొదలైన రోజులనే సూచిస్తుంది. కాబట్టి చివరి దినాలు- అంత్యదినాలు అనగా యేసుక్రీస్తు మొదటి రాకడ అయ్యాక- రెండవరాకడ దినాలు అని లేక ఈ చివరి రోజులలో జరుగబోతుంది అని అర్ధం! ఇంకా చెప్పాలంటే యేసుప్రభువు పరలోకం నుండి తిరిగి రాకముందు ఉన్న సంఘయుగమే ఆఖరుది. క్రీస్తు తిరిగి రావడం, తద్వారా కలిగే ఫలితాలు ఇవన్నీ చివరి రోజులలో జరుగుతాయి. చివరిరోజుల అంతములో ఆయన రాకడ ఉంటుంది.
అయితే ఈ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది ఈ అధ్యాయం అంతా యుగాంతమందు నెరవేరబోతుంది. అనగా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ సమయంలో జరుగుతుంది.
అంత్యదినాలలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లుగా జనులు దానిలోనికి వత్తురు అంటున్నారు. ఈ
మూడు వచనాలు జాగ్రతగా పరిశీలన చేస్తే యెషయా 2:2—4 వచనాలను పోలి ఉంటుంది. కొంచెం ఇటూ అటుగా ఉన్నా అర్ధం మాత్రం అదే! మరి మీకా గారు యెషయా గారి ప్రవచనాలను కాపీ కొట్టారా అంటే కానేకాదు! ఇద్దరి
యందు పనిచేసి వ్రాయించిన వాడు ఒక్కడే- ఆయనే పరిశుద్దాత్ముడు! అందుకే అనేక మంది రాసిన ప్రవచనాలు – వేర్వేరు కాలములయందు వ్రాయబడినా – ఒక్కరే రాసినట్లు- ఒకే కాలమందు రాసినట్లు ఉంటాయి!
ఇక యెషయా 2:2—4 లో కూడా ఇదేమాటలు వ్రాయబడ్డాయి!అంత్యదినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడును అంటున్నారు. ఇక అప్పుడు సమస్త అన్యజనులు ప్రవాహము వచ్చినట్లుగా దానిలోనికి వచ్చెదరు అంటున్నారు. గమనించాలి- మీకా గారికంటే యెషయా గారు బాగా చదువుకున్న వ్యక్తి- ఇంకా రాజుల ఆశ్రయం దొరికి రాజుల మందిరాలలో నివశించే వారు కాబట్టి యెషయా గారు పండితుల మధ్యలో తిరిగి పండితుల భాష- మరియు విషయాలను వివరంగా వ్రాయడం జరిగింది. ఈయన పండితుల మధ్యలో తిరగలేదు. ఏ రాజుల ఆశ్రయం లేకుండా దేవుడు చెప్పమన్న విషయాలు కుండబ్రద్దలు గొట్టినట్లు చెప్పేసి వెళ్ళిపోయేవారు. అయితే ఇద్దరు చెప్పినది లేక ప్రవచించినది అచ్చు గుద్దినట్లు ఒక్కటే భావం గాని రాసిన విధానం కొంచెం మారింది అంతే!
ఇక
మనం అంత్యదినముల కోసం చెప్పుకున్నాం! ఇక యెహోవా మందిర పర్వతం అనగా సీయోను పర్వతం అని గ్రహించాలి! మీకా గారే కాదు- ఈ పర్వతం కోసం యెషయా గారు చాలా సార్లు ప్రవచించారు: అయితే ఈ పర్వతం కోసం వచ్చిన ప్రతీ ప్రవచనం అంత్యదినాలలో జరిగే సంగతులు కోసమే అనగా యేసుక్రీస్తుప్రభులవారు రెండవ రాకడ సమయంలో జరిగే సంగతులు కోసమే చెప్పబడ్డాయి!
యెషయా 11:9
నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
యెషయా 27:13
ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.
యెషయా 65:25
తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 66:20
ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్య మును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
గమనించాలి: సీయోను పర్వతం కోసం చెప్పినప్పుడు అది యెరూషలేము నగరాన్ని మరియు మందిరాన్ని కూడా సూచిస్తుంది.
కారణం ఆ పర్వతం మీదనే
యెరూషలేము కట్టబడింది.
ఇక కొండలకంటే ఎత్తుగా సీయోను పర్వతం ఎత్తుగా ఎందుకు ఉంటుంది అంటే
దానికి వివరణ
మనకు జెకర్యా గ్రంధంలో కనబడుతుంది.
Zechariah(జెకర్యా) 14:10,11
10. యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
11. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.
ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో భౌగోళికంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి అని చెబుతున్నారు. గెబ అనేది యేరూషలేము 10 కి.మీ దూరంలో ఉత్తరంగా ఉంది. రిమ్మోను అనేది దక్షిణంగా 60 కి.మీ దూరంలో ఉంది. గెబ నుండి రిమ్మోను యూదయ ప్రాంతంలో కొండ ప్రాంతం. అది ఇప్పుడు మైదానంలా మారిపోతుంది అంటున్నారు. గలిలియ సముద్రం నుండి మృత సముద్రం వరకు ఇంతవరకు కొండలు లోయలు గల ప్రాంతం ఇప్పుడు మైదానం లా మారిపోతుంది.
ఇక యేరూషలేము ఎందుకు ఎత్తుగా కనిపిస్తుంది అంటే మిగతా ప్రాంతాలు కృంగిపోయి మైదానంలా ఇంకా లోయలా మారిపోయాయి కాబట్టి యేరూషలేము ఎత్తుగా కనిపిస్తుంది.
ఇక అది ఎప్పుడూ నాశనం కాదు. కారణం దేవుడే మహారాజుగా ప్రత్యక్ష పరిపాలన చేస్తున్నారు కాబట్టి.
ఇక్కడ ఆగుదాం! గతంలో చెప్పిన విధంగా ఇది నూతన నిబంధన సంఘంలో పరమ సీయోను అనుభవానికి సాదృశ్యంగా ఉంది. సీయోను ఎందుకు ఎత్తుగా ఉంది అంటే
వీరి ఆత్మీయ స్థితి అంత ఉన్నతముగా ఉంది కాబట్టి వీరు పరమ సీయోనుగా కట్టబడుతున్నారు. ఇలాగే వీరు పరిపూర్ణత సాధిస్తారు. అంతేకాకుండా సీయోను అనుభవం అన్ని అనుభవాలకంటే ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవం. అందుకే అంత ఎత్తుగా ఉంది. ఆ అనుభవంలో నీవున్నావా ప్రియ స్నేహితుడా!!!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-20వ భాగం*
మీకా 4: 1—2
1. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
2. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా
ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము.
(గతభాగం తరువాయి)
ఇక తర్వాత ధ్యానించవలసిన మాట: పర్వతాలన్నిలో ప్రధానమైన పర్వతంగా ఉంటుంది అనగా అంత్యదినాలలో యెరూషలేము – ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో రాజకీయంగా గాని లేక అధికార సంబంధంగా ఉన్నత స్తితిలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యెరూషలేము- ఇశ్రాయేలు మూలంగానే చిట్టచివరి యుద్ధం జరిగేటంత ప్రధానమైనదిగా ఉంటుంది.
ఇక మీకా 4:2, యెషయా 2:౩ : ఆ
కాలంలో అన్యజనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును యేరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి.
ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకుందురు.
పై రెండు రిఫరెన్సులలో
ఒకే విధముగా వ్రాయబడి ఉంది.
ఇలాగే జరుగుతుంది అనగా అన్యజనులు అనేకమంది దేవుణ్ణి ఆరాదించడానికి వస్తారని ఇంకా చాలామంది చెప్పారు.
కీర్తనలు 117: 2
కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.
యిర్మియా ౩:17
ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.
యిర్మియా 16:19
యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.
జెకర్యా 14:16
మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
ప్రకటన 21:26
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.
కాబట్టి అన్యజనులు అనేకమంది వస్తారు. ఇలా అక్కడికి వెళ్ళడానికి కారణం తర్వాత వచనంలో మనకు
కనిపిస్తుంది. అయితే యుగాంతంలో ప్రపంచదేశాలన్నీ ఇశ్రాయేలు
దేవుడే ఏకైక
నిజమైన దేవుడని తెలుసుకుని ఆయన
మార్గాలను నేర్చుకోవాలని అనుకుంటారు. అప్పుడు దేవుడే వారికి ఉపదేశకుడుగా ఉంటారు.
ఇక తర్వాత గమనించవలసిన
మాట: యాకోబు
యొక్క దేవుడు! లేదా యాకోబు దేవుని మందిరం! యాకోబు
అనగా మనమందరం మోసగాడు లేక మడిమెను పట్టుకొనువాడు అని చదువుకున్నాం! మరి మోసగాడి దేవుడా ? కానేకాదు- మోసగాడిని కూడా ఆశీర్వదింపబడిన వానిగా, ప్రార్ధనలో దేవున్నే జయించిన వాడుగా లేక ప్రార్ధనలో దేవున్నే మెప్పించి దీవెనలు పొందుకున్న వాని దేవునిగా ప్రజలకు కనపరుచుకుంటారు దేవుడు!
కీర్తనలు 146:5
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు
యాకోబు దేవుడు అనే
మాట మనకు
పాత నిబంధనలో
24సార్లు కనిపిస్తుంది.
దేవుడు అత్యంత పవిత్రమైన వాడు- మరి అట్లాంటి దేవుడు తన
నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టుకున్నారు? యాకోబు పవిత్రులందరిలో గొప్పవాడు
కానేకాదు! అనేక రీతిలలో దారితప్పిన వాడు. అతడి చరిత్ర పరిశీలిస్తే యాకోబు యొక్క
దేవుడు అనే
పేరులో అర్ధం
బోధపడుతుంది మనకు! వ్యక్తులను జాతిమొత్తాన్ని తన ఇష్ట ప్రకారం ఎన్నుకునే దేవుడాయన!
రోమా 9:10—13
10. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,
11. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
12. పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
13. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
ఎఫేసి 1:4-6
4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,
5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ద్వితీ 7:6—8
6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.
7. మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా.
8. అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబల ముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.
ఇంకా ఆయన కృపగలదేవుడు
రోమా 11:5
ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది.
ఎఫేసి 2:8—9
8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
ఇక్కడ గమనించవలసిన విషయం
ఏమిటంటే ప్రజలు తప్పుచేసినా తన
వాగ్దానాలను మాత్రం ఆయన నిలబెట్టుకునే దేవుడు!
కీర్తనలు 89:1—2
1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.
2. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.
ఆదికాండం 28:14,15
నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
రోమా 11:29
ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
తీతుకు 1: 3
నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను
ఇంకా ఆయన గొప్ప సహనాన్ని చూపించిన దేవుడు
నిర్గమకాండము 34: 6,7
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
2పేతురు ౩:15
మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.
ఇంకా ఆయన పాపులను పవిత్రులనుగా మార్చే దేవుడు:
ఆదికాండం ౩2:24—29
24. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.
25. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.
26. ఆయన తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
27. ఆయననీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.
28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
29. అప్పుడు యాకోబునీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
రోమీయులకు 8: 29,30
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
2కొరింథీ 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
అందుకే యాకోబు యొక్క
దేవుణ్ణి తనకు
సహాయకుడుగా కలిగిన వాడు నిజంగా ధన్యుడు అని
ఈ కీర్తన మనకు చెబుతుంది.
అందుకే ఇంతటి గొప్ప
మహాత్యము గల
యాకోబు దేవుని మందిరానికి మనం
వెళ్దాము రండి. అప్పుడాయన తన
విధానాలను మనకు
నేర్పిస్తారు. అప్పుడు మనం ఆయన
త్రోవలలో నడుచుకుంటాము. అప్పుడు సీయోనులో నుండి ఉపదేశం, యేరూషలేము నుండి
యెహోవా వాక్కు వెలువడతాయి అంటున్నారు.
మరినీవు ఆయన త్రోవలలో నడుస్తున్నావా? పేరుకు మాత్రము క్రైస్తవునివా లేక నిజంగా పేరుకు తగ్గ జీవితం జీవిస్తున్నావా?
నులివెచ్చని జీవితం జీవిస్తే దేవుని నోటనుండి ఉమ్మి వేయించుకుంటావని చివరికి నరకానికి పోతావని మర్చిపోకు!
సరిచూసుకుందాం!
సరిచేసుకుందాము!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-21వ భాగం*
మీకా 4: 3—4
3. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
4. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను
తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము.
(గతభాగం తరువాయి)
ఇక తర్వాత వచనం ధ్యానం చేసుకుంటే- ఈ మూడవ వచనంలో ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయం తీర్చును అంటున్నారు. ఆయన అనగా ఎవరు? 2వ వచనంలో యాకోబు దేవుడు అంటున్నారు కాబట్టి ఆ యాకోబు దేవుడు మధ్యవర్తియై తీర్పు తీర్చుతారు అన్నమాట! అయితే 1తిమోతి
2:5 ప్రకారం : దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు అని సెలవిస్తున్నారు. అనగా ఈ మధ్యవర్తి యేసుక్రీస్తుప్రభులవారు అని అర్ధం అవుతుంది.
దీనిని బాగా అర్ధం చేసుకోవాలి అంటే యెషయా
59: 16 చూసుకుంటే మనకు అర్ధం అవుతుంది. ఇక్కడ ఆయన అంటున్నారు: సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను అంటున్నారు. యెషయా గ్రంథం వరకు మధ్యవర్తి అనేవాడు లేకుండా పోయాడు అంటున్నారు.
అయితే ఒక్కసారి గలతీ ౩:19
,20 ధ్యానం చేస్తే— అలాగైతే ధర్మశాస్త్రమెందుకు ఈయబడింది అంటూ ఎవనికి ఆ వాగ్ధానము చేయబడిందో ఆ సంతానం వచ్చువరకు ఈయబడింది. గలతీ పత్రిక ప్రకారం ఆ సంతానం ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభులవారే ఆ సంతానం! అనగా యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చేవరకు ఈ ధర్మశాస్త్రం ఇయ్యబడింది. ఎవరిద్వారా ఈయబడింది అంటే మధ్యవర్తి చేత ఇంకా దేవదూతల చేత ఈయబడింది అంటున్నారు. ఆ మధ్యవర్తి మోషేగారు. ఎందుకు ఈయబడింది అంటే అది అతిక్రమములను చేసేవారికి పరిష్కారం కోసం ఇయ్యబడింది. అయితే ఈ మధ్యవర్తిత్వము ఫెయిల్ అయ్యింది. మోషేగారు చనిపోయారు. ఆయన సమయంలో ఈయబడిన/ ఏర్పాటుచేయబడిన యాజకధర్మము మానవుల పాపములకు విమోచనం కోసమే ఏర్పాటుచేయబడినా గాని అది శాశ్వత పరిష్కారం చెయ్యలేకపోయింది. మానవుల పాపములకు శాశ్వత విమోచనం ఇయ్యలేకపోయింది. కారణం ఏవి చేయకూడదు ఏవి చెయ్యాలి అనేది చెప్పింది గాని అలా చేయకూడని పనులు చేయకుండా ఉండటానికి ఎవరిని సహకారిగా పెట్టలేదు. అంతేకాకుండా యాజకధర్మంలో ప్రధానయాజకుడు చనిపోయిన తర్వాత, లేదా రాజు మారిన తర్వాత వారు తిరిగి పాపులై పోవడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదనుకుని దేవుడు యెషయా 6వ అధ్యాయంలో జరిగిన ఆలోచన సభలో నిర్ణయం తీసుకుని యెషయా 59 లో మధ్యవర్తిగా ఉండటానికి యేసుక్రీస్తుప్రభులవారుని మధ్యవర్తిగా నియమించారు. దానినే 1తిమోతి 2వ అధ్యాయంలో పౌలుగారు ఆత్మావేశుడై చెబుతున్నారు. ఈయన ఈ భూలోకానికి మరో క్రొత్త యాజకధర్మంలో మెల్కీసేదేకు క్రమము చొప్పున నిరంతరమూ యాజకునిగా ఉండటానికి భూమిపైకి పంపబడి, బలియర్పణ చేసి- ఆ పరమ యెరూషలేములో గల ఆలయములోని బలిపీటం మీద తన సొంతరక్తాన్ని అర్పించి, మానవుల పాపములకు శాశ్వత పరిష్కారం చేసి- మొదటగా ఆయన పరిపూర్ణత సాధించి, మనలను పరిపూర్ణులు అయ్యేందుకు మార్గం సిద్దం చేశారు. అంతేకాకుండా ఈ యాజకధర్మంలో తప్పిపోకుండా ఉండటానికి ఆదరణ కర్తను డిపాజిట్ గా మన హృదయాలలో పెట్టారు. ఆ పరిశుద్ధాత్ముడు ప్రతీ నిమిషం మనలను పవిత్రులుగా ఉండటానికి తన వాక్యం ద్వారా, ఆత్మద్వారా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన నిజమైన ఏకైక మధ్యవర్తి యేసుక్రీస్తుప్రభులవారు!! హెబ్రీ 9:15
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.
ఇక
ఈ మూడో వచనంలో మరి ముఖ్యమైన మాట మధ్యవర్తియై ప్రజలను దేవునితో సమాధానపరుస్తున్నారు అనడం లేదు గాని అనేక జనములకు న్యాయము తీర్చును ఇంకా దూరమున నివశించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును అంటున్నారు. ఇది యేసుక్రీస్తుప్రభులవారు
రాకడ సమయంలో జరుగబోయే అంత్యతీర్పును అనగా ధవళ సింహాసనం తీర్పును సూచిస్తుంది.
1దినవృత్తాంతములు 16: 33
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
కీర్తనలు 7:8,11
8. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.
11. న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
కీర్తనలు 9:౩,8,16,19
3. నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు
8. యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
16. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు (హిగ్గాయోన్ సెలా.)
19. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.
కీర్తనల గ్రంథము 82:1,8
1. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
8. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
కీర్తనలు 96: 13
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
కీర్తనలు 98: 9
భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
యెషయా 28: 6
ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.
దానియేలు 7:22
ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
యోవేలు ౩:12,14
12. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
14. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు.
2తిమోతికి 4: 1
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
హెబ్రీయులకు 9: 27
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
ప్రకటన 20:11—15
11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
15. ఎవని పేరైనను (మూలభాషలో-ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రియ
స్నేహితుడా! ఆ యేసుక్రీస్తుప్రభులవారు
త్వరలోనే రాబోవుచున్నారు. అలాగే
ధవళ సింహాసనం తీర్పుకూడా
దాని అనంతరం జరుగబోతుంది.
మరి మొదటగా: నీవు ఎత్తబడే
గుంపులో ఉన్నావా? ఈరోజే యేసయ్య
వస్తే నీవు ఎత్తబడే
స్థితిలో ఉన్నావా? ఒక్కసారి
సరిచూసుకో!
రెండవదిగా: ఆ తీర్పులో, దేవుని త్రాసులో తేలిపోయేలా ఉన్నావా లేక మంచి ఫలములు ఫలించి బరువు తూగే స్థితిలో ఉన్నావా? భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిపించు కొంటావా లేక సోమరియైన చెడ్డదాసుడా అని పిలిపించుకొనే స్థితిలో ఉన్నావా?
ఆయన గొర్రెలను మేకలను విడదీసే సమయములో నీవు గొర్రెల మందలో ఉంటావా లేక నీ స్తితి మేకల గుంపు అనగా నరకానికి పోయే గుంపులో ఉంటావా?
ఒకసారి సరిచూసుకొని ఏదైనా దేవునికి ఆయాసకరమైన విషయాలు నీలో ఉంటే నేడే సరిచేసుకో!
దేవునితో సమాధాన పడు!
ఆయన సిలువచెంతకు నేడే రా!
నేడు అనే సమయముండగానే సిద్దపడు!
విడువబడితే బహు ఘోరం!
ఆ బాధలు నీవు పడజాలవు!
దేవునితో సమాధాన పడి ఆయనను శరణువేడు!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-22వ భాగం*
మీకా 4: 3—4
3. ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
4. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను
తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము.
(గతభాగం తరువాయి)
ఇక ఈ వచనంలో తర్వాత ప్రాముఖ్యమైన మాటలు ఏమనగా: వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులు గాను సాగ గొట్టుదురు! జనము మీద జనము ఖడ్గము ఎత్తక యుండును. యుద్దము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు!
దీనికోసం
జాగ్రత్తగా
పరిశీలన
చేస్తే
ఇది యేసుక్రీస్తు ప్రభులవారి ప్రత్యక్ష రాకడ తర్వాత జరిగే సంభవాలు! ఇదేమాట యెషయా గారు, హోషేయ గారు కూడా ప్రవచించారు. ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే గతభాగాలలో చెప్పినట్లుగా అంత్యదినాలలో జరుగుతుంది. అనగా యేసుక్రీస్తుప్రభులవారు ప్రత్యక్షరాకడ తర్వాత జరుగుతుంది. ఇంకా వెయ్యేండ్ల పాలన తర్వాత ఇంకా చెప్పాలంటే సంఘం ఎత్తబడ్డాక, శ్రమకాలం
గడిచాక, హార్మెగిద్దోను యుద్ధం జరిగాక, సాతాను, మృగము , అబద్దప్రవక్త పట్టబడి అగ్ని గుండములో వేయబడిన తర్వాత, వెయ్యేండ్ల పాలన జరిగాక, మొదటి
పునరుత్థానం
జరిగాక, గోగుమాగోగు యుద్ధం జరిగాక, ధవళ సింహాసనం తీర్పు జరిగాక జరిగే సంభవాలు అన్నమాట. ఇంకా
ప్రకటన 21 ప్రకారము, యెషయా 65:11 నుండి
చివరి వరకు ప్రకారం క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కలిగాక జరిగే సంభవాలు అన్నమాట!
యెషయా 2:4
ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
హోషేయ 2:18
ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.
ఇక అదే సమయంలో గొర్రెపిల్ల సింహము ఒకేచోట గడ్డిమేయును
యెషయా 65:17—25
17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.
18. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.
19. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.
20. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు. కాలమునిండని ముసలివారుండరు. బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును .
21. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభ వింతురు.
22. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
23. వారు వృథాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.
24. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
25. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును. సింహము ఎద్దువలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇక అప్పుడు యుద్ధము అనే మాట మరిచిపోతారు. జనము మీదికి జనము యుద్ధానికి, కయ్యానికి లెగరు! అంతా దేవుడిచ్చే శాంతితో నిండియుంటుంది.
ఇక
4వ వచనంలో చూసుకుంటే ఎవరి భయములేకుండా ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును. ఇంకా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఎవరిభయము లేకుండా అనగా ఇక వారిని కష్టపెట్టేవాడు, శ్రమ పెట్టేవాడు ఎవడూ ఉండడు. అయితే ఇది ఎప్పుడు కలుగుతుంది అనేది లేవీ 26:6 లో ముందుగానే దేవుడు చెప్పియున్నారు....
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;
ఇంకా యెహెజ్కేలు 39:25—29
25. కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ద నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రా యేలీయులందరియెడల జాలిపడెదను.
26. వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలోనుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములోనుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు
27. వారియందు అన్యజనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధ పరచుకొందును.
28. అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమ కూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
29. అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
జెఫన్యా ౩:13
ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు;
ఇక్కడ
మరొక
ప్రాముఖ్యమైన
విషయం
మనకు
అర్ధమవుతుంది. ప్రతివాడు తన ద్రాక్షచెట్టు క్రింద అంజూరపు చెట్టుక్రింద అంటున్నారు అనగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో కూడా దేవుని ప్రజలకు మరియు ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తుప్రభులవారు
ప్రత్యక్ష
పాలనలో
స్వంత
ఆస్తులు
కలిగి
యుంటారు
అని
అర్ధమవుతుంది.
అదే
సమయంలో
మనము
యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పిన
ఉపమానం
కూడా
జ్ఞాపకం
చేసుకోవాలి! లూకా 19 అధ్యాయం ..
12. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై
13. తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల (మినా యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
16. మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక,
నీకు భయ పడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.
22. అందుకతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
24. వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
26. అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
దీని ప్రకారం మొదటగా ఆస్తి ఇవ్వడమే కాకుండా అధికారం కూడా దేవుడు ఇవ్వబోతున్నారు అని
అర్ధం!
ప్రియ
తమ్ముడా! అన్నా! తల్లీ! చెల్లీ! నీ పరిస్తితి ఎలా ఉంది. దేవుడిచ్చిన తలాంతులు దేవునికోసం వాడి ఆత్మలను సంపాదించి భళానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావా లేక తలాంతులను దాచిపెట్టి, కుటుంబ
తిరస్కారములను
జడిసి రొమ్ములో
పాపము ఉంచుకుని, సోమరియైన చెడ్డదాసుడా అని పిలిపించుకుని నిత్యనరకానికి పోతావా నీవే తేల్చుకో!
ఇక 5వ వచనం:..మీకా 4: 5
సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.
దీనిని
జాగ్రత్తగా
పరిశీలన
చేస్తే
ఇది వెయ్యేండ్ల పాలన జరిగే సమయంలో అనగా యేసయ్య ప్రత్యక్షరాకడ సమయంలో జరిగే సంభవం! అప్పటికి మీదన వివరించిన విధంగా హార్మేగిద్దోన్ యుద్ధం జరిగి సాతాను, మృగం, అబద్ద ప్రవక్త అగ్నిగుండములో వేయబడినా గాని వాడి శక్తులు ప్రభావం వలన వాడి అనుచరులు మరియు మరికొంతమంది అన్యజనులు ఇంకా భూమిమీద ఉంటారు. వారిని ఈ వెయ్యేండ్లపాలనలో
పరిశుద్ధులు
పాలిస్తారు. అయితే ఈ పరిశుద్ధులు మనము యేసయ్యతో పాటుగా వారిని పరిపాలిస్తున్నా ఇంకా ఈ అన్యజనులు
వారి వారి దేవతలను పూజిస్తూ ఉంటారు. మనమైతే మన దేవుడైన
యెహోవాను
పూజిస్తాము
అంటున్నారు
మీకా గారు!
(ఇక్కడ మరోలా కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతవరకూ ప్రవక్త రాబోయే లేక జరుగబోయే సంభవాలు ప్రవచించిన తరువాత మరలా ప్రవచనం నుండి బయటకు వచ్చి, ఎవరు ఎవరిని పూజించినా సరే, మనకు ఇంతగొప్ప మహోన్నతుడైన మన దేవుడైన యెహోవానే ఎల్లప్పుడూ పూజిస్తా ఉంటాము అని చెబుతున్నట్లు ఉంది ఇక్కడ)
ప్రియ విశ్వాసి! సేవకుడా! నీవు ఆ పరిపాలించే గుంపులో ఉండగలవా?
లేక విడువబడిన గుంపులో ఉన్నావా?
గమనించు!
విడువబడుట బహుఘోరం!
ఆ బాధలు నీవు పడలేవు కనుక
నేడే మార్పు నొంది దేవునితో సమాధాన పడు!
దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నారు!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-23వ భాగం*
మీకా 4: 6—7.
6. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమకూర్చుదును; ఇదే యెహోవా వాక్కు.
7. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలము వరకు వారికి రాజుగా ఉండును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో
మనము అంత్యదినాలలో లేక యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ సమయంలో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
ప్రియులారా! ఇక 6,7 కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తాయి.
వీటిని చదువుకుంటూ పోతే అర్ధం
కాదు గాని, లోతుగా ఆలోచిస్తే దేవుని మనస్సు మనకు అర్ధం
అవుతుంది.
ఆదినమున నేను కుంటివారిని పోగుచేయుదును. అవతలకు వెళ్ళగొట్టబడినవారిని బాధించబడినవారిని సమకూర్చుదును.....
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ దినమున అంటున్నారు—ఏ దినమున? మొదటి వచనములో తెలియజేసిన వివరములు—అంత్యదినాలలో దేవుని కార్యములు జరిగే రోజున- నేను ఈ కుంటివారిని పోగుచేస్తాను అంటున్నారు. ఇంకా చెప్పాలంటే యెషయా 2:2 లో జరిగే సంభవాలు జరిగే రోజులలో అన్నమాట! ఇంకా చెప్పాలంటే యెషయా 2వ అధ్యాయంలో వ్రాయబడిన సంభవాలు జరిగే రోజులలో యెషయా 2:2, 11, 17, 17, 20
2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను ....
సరే,
ఈ రోజులలో లేక ఆ దినమున కుంటివారిని పోగుచేస్తాను అవతలకు వెళ్ళగొట్టబడినవారిని పోగుచేస్తాను, ఇక 7వ వచనంలో కుంటివారిని శేషముగాను, వెళ్ళగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును. అంటూ యెహోవా సీయోను కొండయందు ఇప్పటినుండి శాశ్వత కాలమువరకు యెహోవా వారికి రాజుగా ఉండును అంటున్నారు!
గతభాగంలో చెప్పిన విధముగా ఈ సంభవాలు అంత్యదినాలలో జరుగబోతున్నాయి.
ఈ రెండు వచనాలలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనము
ధ్యానం చెయ్యవచ్చు!
మొదటగా: కుంటివారిని పోగుచేస్తాను, వెళ్ళగొట్టబడినవారిని సమకూరుస్తాను అంటున్నారు! ఇంతకీ ఈ కుంటివారు, వెళ్ళగొట్టబడినవారు ఎవరు???
మొదటిజవాబు: ఇది మామూలుగా చూసుకుంటే చెరలోనికి పోయిన ఇశ్రాయేలీయులను దేవుడు సమకూరుస్తాను అని అనేకచోట్ల సెలవిచ్చారు.
యిర్మియా 31:8-9
8. ఉత్తర దేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అంద రిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు
9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
యిర్మియా ౩:14, 17
14. భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
17. ఆ కాలమునయెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు; జనములన్నియు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమునుబట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు.
యిర్మీయా 16:14,15
14. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగానేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలోఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట
15. అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీ యులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.
యిర్మీయా 23:3
మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.
యిర్మీయా 29:14
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను;
నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
యిర్మీయా 33:26
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతాన మును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
యెషయా 43:5
భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
యెషయా 54:7
నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను
జెఫన్యా 3: 18
నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.
జెకర్యా 10:8
నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.
ఇక్కడ కూడా దేవుడు చెరలోనికి పోయిన ఇశ్రాయేలు వారిని రప్పిస్తాను అని చెప్పడమే కుంటివారు, వెళ్లగొట్టబడినవారు . అవును ఇశ్రాయేలు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు,
యూదులు వెళ్ళగొట్టబడ్డారు. ఇప్పుడు దేవుడు వారిని తిరిగి రప్పిస్తాను అంటున్నారు. కుంటివారు అనడానికి మొదటి కారణం అక్కడ అనగా చెరలో వారు సుఖంగా లేరు. అనేకమైన కష్టాలు పడుతున్నారు కాబట్టి కుంటివారు అన్నారు ఇక్కడ!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-24వ భాగం*
మీకా 4: 6—7.
6. ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును, అవతలకు వెళ్లగొట్టబడినవారిని బాధింపబడినవారిని సమకూర్చుదును; ఇదే యెహోవా వాక్కు.
7. కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలము వరకు వారికి రాజుగా ఉండును.
ప్రియమైన దైవజనమా! మనం మీకా ప్రవచన గ్రంధం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో
మనము అంత్యదినాలలో లేక యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ సమయంలో జరుగబోయే సంభవాలు కోసం ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
రెండవదిగా: దీనిలో ఏమైనా ఆత్మీయ అర్ధం కనబడుతుందా అంటే చాలా పెద్ద/గొప్ప ఆత్మీయ మర్మము దీనిలో గోచరమౌతుంది.
ఈ
ప్రవచనం
ఇశ్రాయేలు
వారికోసమే
చెప్పబడినా, దీని మర్మం ఆత్మీయ ఇశ్రాయేలుగా, ఆత్మీయ వారసులుగా పిలువబడిన మనకు కూడా చెందుతుంది అని నా ప్రగాడ నమ్మకం! ఇక్కడ కుంటివారు అనగా శారీరకంగా కుంటివారు అని కాదు అని నా ఉద్దేశం! ఈ కుంటివారు వెళ్ళగొట్టబడినవారు శారీరకంగా కాదు గాని లూకా సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన ఉపమానంలో ఉన్న కుంటివారు గుడ్డివారు అంగహీనులు వగైరా వారితో ఈ వచనానికి సంబంధమున్నట్లు మనకు లోతుగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది.
మచ్చుకు
ఒక
ఉదాహరణ: గతభాగంలో ఇచ్చిన మొదటి రిఫరెన్సు: యిర్మియా 31:8—9 ధ్యానం చేస్తే – నేను ఉత్తర దిక్కునుండి తీసుకుని వస్తాను, ఇంకా భూమి కొనల నుండి వారిని సమకూరుస్తాను అంటూ వారిలో కొంతమంది గుడ్డివారు కుంటివారు, గర్భిణులు ప్రసవించని స్త్రీలు ఉంటారు... అంటూ వారు మహా గొప్ప సమూహముగా ఇక్కడికి వస్తారు అంటున్నారు, ఇంకా ఏడుస్తూ వస్తారు అంటున్నారు. దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఉత్తర దేశం అనగా ఉత్తర ఇరాక్ – అనగా అస్సూరీయులు క్రీ.పూ. 721 లో ఉత్తర ఇశ్రాయేలు దేశం నుండి ఇశ్రాయేలు 10 గోత్రాలను చెరలోనికి తీసుకుని పోయారు. ఆ తర్వాత క్రీ.పూ. 586 లో నెబుకద్నేజర్ దక్షిణ ఇశ్రాయేలు రాజ్యమైన యూదులను చెరలోనికి తీసుకుని పోయారు. అయితే ఎజ్రా 2:64 ప్రకారం చెరలోనుండి తిరిగివచ్చిన వారు 42,360
మంది
మాత్రమే! వీరిని మహా గొప్ప సైన్యం లేక సమూహము అని అనలేము కదా! అంతేకాకుండా ఆ రోజులలో బబులోను రాజైన నెబుకద్నేజర్ తీసుకుని పోయిన వారే ఎక్కువగా తిరిగి స్వదేశమునకు వచ్చారు గాని ఉత్తర దేశమైన అస్సూరుకి వెళ్ళినవారు చాలా తక్కువమంది వచ్చారు. అనగా ఈ ప్రవచనం క్రీ.పూ 52౦ సుమారుగా ఇశ్రాయేలు వారు తిరిగి వచ్చినప్పుడు నెరవేరలేదు అన్నమాట! అంటే ఇది అంత్యదినాలలో జరుగబోయే సంభవము అని బాగా అర్ధం చేసుకోవచ్చు!
అయితే ఈ
6—7 వచనాలకు, లూకా 14వ అధ్యాయానికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఈ ఉపమానంలో మొదటగా పిలువబడిన వారు అనగా ఇశ్రాయేలు వారు, శాస్త్రులు పరిసయ్యలు అని అర్ధం అవుతుంది. అయితే వారు సాకులు చెప్పి పెండ్లివిందుకు రాలేదు. అయితే 14:21—23 ప్రకారం నీవు వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని చెప్పారు. మరి ఇక్కడ నిజంగా ఏ బీదవారిని అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలిచారు అని మనం లోతుగా పరిశీలన చేస్తే ఈ మీకా 4:6—7 వచనాలకు దీనితో సంభంధం కనిపిస్తుంది.
మొదటగా
బీదలు అనగా నిజంగా బీదలు ఇంకా ఆత్మవిషయమై బీదలు/ దీనులు అని అర్ధం అవుతుంది. కారణం
యేసుక్రీస్తుప్రభులవారు
పేదలైన/ బీదలైన మీకు సువార్త చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పారు. (లూకా 4: 18
ప్రభువు
ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును)
ఇంకా ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వారిది అని కొండమీద ప్రసంగంలో దేవుడు చెప్పారు. మత్తయి 5:3;
ఇక
తరవాత అంగహీనులు అనగా నిజంగా అంగహీనులా? కాదు—ఈలోకంలో
లోపం లేని మానవుడు లేడు! ఆత్మీయంగా ఏదో ఒక లోటుగా
ఉన్నవారిని
దేవుడు
కనికరించి
పిలుస్తున్నారు. అవును మనం పరిపూర్ణులము కాము, కారణం మనం మానవులం! అయితే
దేవుడు
తన ఉచితమైన కృప ద్వారా తన రక్షణ భాగ్యము అయోగ్యులమైన మనకు ఇచ్చారు. మనలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. మనమే
ఆ అంగహీనులము! అయితే ఇప్పుడు మనము ఆ రక్షణ
భాగ్యమును
కాపాడుకుంటూ
ఆత్మీయంగా
ఎదుగుతూ
పరిపూర్ణత
సాధించడానికి
ప్రయత్నం
చేస్తూ
ఉండాలి.
ఇక గుడ్డివారు ఎవరు? కనులున్నా దేవుని మాటలు వినకుండా, దేవుడిచ్చిన మేలులు, దీవెనలు, దేవుడు చేసిన గొప్ప కృత్యాలు ఆశ్చర్యాలు కానకుండా కళ్ళుమూసుకుని పోయి సాతాను అంధకారంలో మ్రగ్గిపోతున్న ఆత్మీయ గ్రుడ్డివారిని దేవుడు కనికరించి పిలుస్తున్నారు అన్నమాట!
ఇంకా ఆయన సేవకులు కూడా గ్రుడ్డివారే!
యెషయా 42: 19
నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
ఇక
కుంటివారు
ఎవరు? దేవుడు ఎన్నో మేలులు చేసినా- గాని గ్రహించకుండా ముళ్ళపొదలలో ఇంకా త్రోవప్రక్కన పడిన విత్తనాల వలే, జీవితం కలిగిన వారిని అనగా ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ కుంటినడక నడుస్తున్న వారిని జాలితలచి పిలుస్తున్నారు దేవుడు!
మరి
వెళ్ళగొట్టబడినవారు
ఎవరు? లోకంలో ఘనులు, పెద్ద కులం వారు, పెద్ద డబ్బున్న వారు అని పిలువబడిన వారు- డబ్బులేని వారిని, నిమ్న కులాల వారు అని ఊరినుండి వెల్లగొట్టబడిన వారు, అంటరానివారు అని పిలువబడిన వారు, లోకంలో పేరు లేని మనలాంటి వారే అనగా ఆ గొప్పవారితో వెళ్ళగొట్టబడిన మనమే ఆ వెల్లగొట్టబడిన వారము! అందుకే బైబిల్ చెబుతుంది. ఈలోకంలో ఘనులైన వారిని సిగ్గుపరచడానికి , జ్ఞానులను సిగ్గు పరచడానికి దేవుడు ఎందుకు పనికిరాని వారిని ఎన్నుకున్నారు....
మొదటి కొరింథీయులకు 1:28,29
28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. వీరే ఆ వెళ్ళగొట్టబడినవారు!
ప్రియ
స్నేహితుడా! నా ఉద్దేశం
ప్రకారం నీవు పైన
ఉదహరించబడిన
కనీసం ఏదో ఒక
గుంపులో నైనా ఉన్నావని
నాఉద్దేశ్యం. మరి అలాంటి
స్తితిలోనున్న
నిన్ను దేవుడు పిలుచుకుంటే, నిన్ను ఏర్పరచుకుంటే
మరినీవు దేవునికి నమ్మకముగా, కృతజ్ఞత కలిగి
జీవిస్తున్నావా? లేక తిరస్కారంతో
లేక లెక్కలేనితనంతో జీవిస్తున్నావా? జాగ్రత్త దేవుడు
కరుణామయుడే
గాని దానికి కూడా
హద్దు ఉంది. సొంతవారే
పాపం చేసి దేవుణ్ణి
తిరస్కరించారు
కాబట్టి అన్యులమైన మనలను
దేవుడు తనతో అంటుకట్టారు. మరి సొంత
తీగెలను కత్తిరించిన దేవుడు
అంటు కట్టబడిన తీగెలను
కూడా కత్తిరించేస్తారు జాగ్రత్త!
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పనీయండి. ఆత్మీయంగా కుంటి బ్రతుకు కలిగి, గ్రుడ్డి బ్రతుకు కలిగి,
అంగహీనత కలిగిన బ్రతుకు కలిగి, లోటైన బ్రతుకులు కలిగిన మనల్ని దేవుడు తన కృపతో జాలిచూపి పిలచుకొన్నారు కదా, కాబట్టి మనము ఈ విధంగా ఇదే బ్రతుకును కొనసాగించినా పర్వాలేదు అనుకోకూడదు. ఇక మన పాప జీవితం,
పాత రోత జీవితాన్ని వదిలి,
పవిత్ర జీవితం, ఆత్మీయ జీవితం జీవించాలి. ఆ వ్యభిచారం లో పట్టబడిన స్త్రీకి దేవుడిచ్చిన ఆజ్ఞనే ఇప్పుడు కూడా మనకు కూడా ఇస్తున్నారు. *ఇకను పాపము చేయకుము*. (యోహాను
8:11; 5:14)
ఇంకా దేవునికి అభ్యంతరం కలిగించే విషయాలు అలవాట్లు మనలో ఏమైనా ఉంటే వదిలెయ్యాలి. లేకపోతే లవొదొకయ సంఘాన్ని నోటనుండి ఉమ్మివేసినట్లు నిన్ను కూడా ఉమ్మివేస్తారు. శారీర కోరికలు ఆశలను సమాధి చెయ్యాలి. అందుకే యేసయ్య చెబుతున్నారు: నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే దానిని పెరికివేసేయ్! నీ కాలు, లేక ఇతర అవయవం వలన నీవు పవిత్రతను కోల్పోతుంటే ఆ అవయవాన్ని పెరికే అంటున్నారు. (మత్తయి 5:29,30). దీని అర్థం ఏవిధంగా నైనా నీవు పరిశుద్ధమైన జీవితమే జీవించాలి గాని చూపు ద్వారా,
తలంపుల ద్వారా, మాటలు ద్వారా, చేతల ద్వారా గాని దేవునికి మహిమ తేవాలి గాని నీకు అపవిత్రతను తెచ్చుకోగూడదు. గమనించాలి అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఏదీ ఆయన రాజ్యం లో ప్రవేశించదు. (ప్రకటన
21:27) అందుకే పరిశుద్ధ మైన జీవితం కలిగి, పూర్ణతనుండి సంపూర్ణతకోసం ప్రయత్నించు!
ఇక మూడవదిగా: యెహోవా ఇప్పటినుండి శాశ్వతకాలము వరకు వారికి రాజుగా ఉండును! ఇది ఇప్పటికి నెరవేరలేదు! ఇది వెయ్యేండ్లపాలన తరవాత, ధవళసింహాసనం తీర్పు జరిగాక, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలిగాక దేవుడే రాజుగా పరిపాలిస్తారు. అప్పుడు మనం యుగయుగాలు ఆయనతో పాటు ఉంటాము. అప్పుడు జరుగబోయే సంభవము అన్నమాట!
దానియేలు 2: 44
ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
దానియేలు 7:14
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.
యోవేలు ౩:21
21. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.
ఓబధ్యా 1:21
మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
జెకర్యా 14: 9
యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
లూకా 1:౩౩
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
ప్రకటన 11:15
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.
ప్రకటన 22:5
రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
ప్రియ దేవుని బిడ్డా! ఆయన రాజ్యములో నీవుండాలి అంటే ముఖ్యమైన అర్హత పరిశుద్ధత!!! మరి నీవు పరిశుద్ధత కలిగి యున్నావా? ఆయన బిడ్డలకు తగినట్లుగా జీవిస్తున్నావా? ఆయనతో సమాధానంగా ఉన్నావా?
ఆయనకు ఆయాసకరమైనవి నీలో ఏమైనా ఉన్నాయా ? ఒకసారి పరిశీలన చేసుకో! ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము! ఆయన రాజ్యము ఎలా శాశ్వత రాజ్యమో అలాగే నరకము కూడా శాశ్వత మైనదే!ప్రకటన 20:10 ప్రకారం! అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయి!! మరి నీకు ఏమి కావాలో ఇప్పుడే నిర్ణయించుకో!
అందుకు అనుగుణంగా ఇప్పటినుండే నడచుకో!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-25వ భాగం*
మీకా 4:8
మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వము కలుగును;
ప్రియ
దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో
జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనంలో మందల గోపురమా సీయోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యేరూషలేము కుమార్తె మీద నీకు
ప్రభుత్వం కలుగును అంటున్నారు.
మందల గోపురము అనగా ఏమిటి అనగా సీయోను పర్వతము లేదా యెరూషలేము అని అర్ధం చేసుకోవచ్చు! దీనికి మరో అర్ధం ఉంది-
మందలు కావలి గోపురము! అయితే దీనిలో ఆత్మీయ అర్ధం
ఏమిటంటే – ఇశ్రాయేలు పజలు అంతా ఆయన అనగా దేవుడు మేపే మంద! అందుకే మనము ఆయన ప్రజలము! ఆయన మేపు గొర్రెలము అని భక్తుడు దైవావేశుడై పలుకుతున్నాడు! కీర్తనలు 95:6; 100:3; కాబట్టి ఈ దేవుని మందకు కావలిగా ఉండేలా యేరూషలేము పర్వతాన్ని దేవుడు కోరుకున్నారు. అందుకే ఇక్కడ మందల కావలి గోపురము అని చెప్పబడింది. మనము కూడా ఆత్మీయ యేరూషలేముగా కట్టబడుచున్నాము కనుక మనకు కూడా కావలి పరమ యెరూషలేములో మహారాజు గా ఉన్న దేవుడే! అందుకే దేవుడు ఆ యెరూషలేము చుట్టూ పర్వతములను పెట్టారు. అనగా ఇంకా ఎక్కువ కావలి లేక protection కోసం!
అనగా నూతన యెరూషలేముగా లేక పరమ యెరూషలేముగా కట్టబడుచున్న మనము ఆయనలో ఇంకా భద్రముగా ఉండటానికి దేవుడు కాపలాగా ఉన్నారు అని చెప్పడానికే యెరూషలేముచుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యమూ తన ప్రజల చుట్టూ ఉందును అని కీర్తనాకారుడు ప్రవచిస్తున్నారు. కీర్తన 125:2
ఇక తర్వాత మాట: సీయోను కుమార్తె పర్వతమా!!! గమనించాలి సీయోను పర్వతము, యేరూషలేము, దావీదు పట్టణము/పురము, దేవాలయము ఇవన్నీ సీయోను అనే పేరుతో పిలువబడుతున్నాయి! అయితే వాడబడిన సందర్బము బట్టి అర్ధం కొద్దిగా మారుతుంది. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే బైబిల్ లో చాలాచోట్ల ఎక్కడైతే సీయోను అని చెప్పబడిందో- వెంటనే యేరూషలేము అని కూడా చెప్పబడింది. ముఖ్యంగా జెకర్యా ప్రవచన గ్రంధంలో ఎక్కువగా ఇలాగే వ్రాయబడింది.
అసలు సీయోను కోసం ఆలోచిస్తే: మొట్టమొదటగా 2సమూయేలు 5:6—7 లో చూసుకుంటే....
యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమన బడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను.
దేవునికి ఈ సీయోనుకి గల సంభంధం చాలా విశిష్టమైనది:
*1. సీయోను దేవుని యొక్క పరిశుద్ద పర్వతము.*
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కీర్తనలు 2:6
*2. సీయోను దేవుడు నివసించే స్థలము.*
సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి కీర్తనలు 9:11
కీర్తనలు 74:2
నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము.
యెషయా 8:18
ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
*3. సీయోను మహారాజు పట్టణము*
ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది.
కీర్తనలు 48:2
*4. సీయోను పరిపూర్ణ సౌందర్యము గలది.*
పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు కీర్తనలు 50:2
*5. సీయోనులో యెహోవా నిబంధనా మందసం వుంది.*
అప్పుడు సీయోను అను దావీదు పురములోనుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసికొని వచ్చుటకు యెరూషలేములోనుండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను, అనగా ఇశ్రా యేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తనయొద్దకు సమకూర్చెను. 1రాజులు 8:1
*6. సీయోనులో నుండే ఇశ్రాయేలీయులకు రక్షణ.*
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును. కీర్తనలు 53:6
*7. విమోచకుడు సీయోనులో నుండే వచ్చును.*
అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; రోమా 11:25,26
*8. యేసు ప్రభువు వారు నిలిచే స్థలము.*
నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ప్రకటన 14:1
*9. రక్షణను బట్టి హర్షించే స్థలము*
కీర్తనలు 9:13
నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము.
*10. సీయోను పర్వతము- దేవుడు ప్రేమించేది*
కీర్తనలు 78:68
యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.
*11. యెహోవాకు ప్రియమైనది*
కీర్తనలు 87:2
యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై యున్నవి
*12. సీయోను పర్వతము- స్థిరమైనది*
కీర్తనలు 125: 1
యెహోవా యందు నమ్మిక యుంచు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
*13. దేవుని స్తుతించుటకు/ పాటలు పాడుటకు అనువైనది*
కీర్తనలు 137: 3
అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి
*14. దేవుడు రాజయ్యే స్థలము*
యెషయా 24:23
చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.
గమనించాలి: సీయోను పట్టణము- యేరూషలేము పట్టణము పై రిఫరెన్సుల ప్రకారము- దేవుణ్ణి ఎరిగినది. దేవుని మహిమను ఎరిగినది. అయితే వారు చేసిన పాపముల వలన అది అనగా ఆ ప్రజలు విడువబడ్డారు: యెషయా 1:8
వారు గర్విష్టులు: యెషయా ౩:16
అందుకే దేవుడు వారిమీద తీర్పులు పంపించారు.
ఇక
మరో
ప్రాముఖ్యమైన
విషయం
ఈ
వచనాన్ని
ధ్యానం
చేస్తే
తెలుస్తుంది- సీయోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యేరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును!!!
దీనిని
జాగ్రత్తగా
ఆలోచిస్తే- మొదటగా సీయోను పర్వతము లేక సీయోను కుమారి పర్వతానికి యేరూషలేము మీద అధికారం మరలా రాబోతుంది. ఇంకా చెప్పాలంటే దావీదు గారు రాజైనప్పటి ఆత్మీయ స్థాయి మరియు రాజరికం మరలా అంతటి రాజరికం మరియు ఆత్మీయ స్థాయికి పొందబోవుచున్నావు... దీని అర్ధం: ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజలు దాస్యములో ఉన్నా ఒకరోజు మరలా అధికారంలోకి మరియు ఆధ్యాత్మికతను పొందబోతున్నారు అనేది మొదటి అర్ధం!
ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు ఆత్మీయ దాస్యము లేక సాతాను దాస్యము క్రింద ఉన్నారు అయితే ఒకరోజు ఆ బంధకాలు తొలిగిపోయి ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి రాబోతున్నారు. కారణం సీయోను నుండే దేవుడు పాలించబోతున్నారు. (కీర్తన
2:6, 48:2, యెషయా 24:23, మీకా 4:7). అక్కడ నుండే ఆశీర్వదించబోతున్నారు. (కీర్తనలు 133:3) అక్కడ
నుండే ధర్మశాస్త్రం దేవుని వాక్కులు వినబోతున్నారు. (యెషయా
2:3) అక్కడ నుండే సహాయం రాబోతుంది. (కీర్తనలు 20:2). చివరకు గొర్రెపిల్ల అక్కడనే నిలవబోతుంది. ప్రకటన
(14:1)
మరో అర్ధం సీయోను అనుభవం గల
ప్రజలు త్వరలో దేవునితో పాటుగా పాలిస్తారు.
ఇక్కడ మరో అర్ధం మనకు స్పష్టముగా కనిపిస్తుంది. ఈ వచనం ప్రకారం-
సీయోను అనుభవం అనేది – యేరూషలేము అనుభవము లేక పరమ యేరూషలేము అనుభవము కన్నా శ్రేష్టమైనది మరి గొప్పది! మనం భౌగోళికంగా చూసుకున్నా- యేరూషలేము పర్వతం కన్నా ఎత్తుగా అదే పర్వతం మీద సీయోను పర్వతం ఉంది. అలాగే సీయోను అనుభవం – యేరూషలేము అనుభవము కన్నా గొప్పది! సీయోను అనుభవం లేక యేరూషలేము అనుభవం అనేది విశ్వాసుల ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. ఒక రక్షించబడిన విశ్వాసి – తన ఆత్మీయ జీవితంలో రోజురోజుకి తన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండరాదు. చిన్న ప్రార్ధన చేసేవాడు- కన్నీటి ప్రార్ధన అనుభవంలోకి వెళ్ళాలి. ప్రార్ధనానుభావం కలిగిన వాడు- వివేచించే స్థాయిని పొందుకోవాలి! భాషలు మాట్లాడే వ్యక్తి- ప్రవచించేస్థాయికి చేరుకోవాలి! ప్రవచించే వ్యక్తి అద్భుతాలు చేసే స్థాయికి చేరుకోవాలి! ఇది ఒకరకమైన ఆత్మీయ అభివృద్ధి మరియు స్థాయి!
ఇక
తన
విశ్వాస
జీవితంలో
కూడా
ప్రతీ
విశ్వాసి, సేవకుడు ఉన్నతమైన అనుభవాలు పొందుకోవాలి! మాటలోనూ ప్రవర్తనలోనూ అన్నింటిలోను పరిశుద్ధత పొందుకోవాలి! మాటలో పవిత్రతను సాధించిన విశ్వాసి- తన తలంపులో కూడా పరిశుద్ధతను సాధించాలి! తలంపులో కూడా, ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వ్యభిచార సంభంధమైన లేక పాపపు ఆలోచనలు రాకూడదు! పరిశుద్ధత, పవిత్రత ఎల్లప్పుడూ కనబడాలి! నిత్యమూ ఆత్మతో సంధించబడుతూ, ఆత్మతో నడిపింప బడుతూ ఉండాలి! నిత్యమూ దేవునితో మాట్లాడే అనుభవం పొందగలగాలి! ఇదే సీయోను అనుభవం అని నా అభిప్రాయం! ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు! వీరే ఆ సీయోను కొండమీద నిలువబడే వారు క్రీస్తుయేసుతో పాటు!
ప్రియమైన విశ్వాసి! నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? యెరూషలేముగా కట్టబడే స్థాయిలో ఉన్నావా అనగా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నవా లేక దేవునిచేత ఉమ్మివేయబడే స్థాయిలో ఉన్నావా అనగా ఆత్మీయంగా అధమ స్థాయిలో ఉన్నావా? దినదినము దేవుని సాంగత్యములో గడుపుతూ ఆయన నుండి వరాలు ఫలాలు పొందగలుగుతున్నావా లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావా ఒకసారి నిన్నునీవు సరిచూసుకో!
చివరిగా
ఒకమాట! ఈ యెరూషలేము అనుభవము పొందుకోవాలి అన్నా, సీయోను అనుభవం పొందుకోవాలి అన్నా మొట్టమొదటి మెట్టు—పరిశుద్ధత! పరిశుద్ధత! పరిశుద్ధత! పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు! ఆ అనుభవాలు పొందుకోవాలి! నీమాటలోను, తలంపులోను, ప్రవర్తనలోను పరిశుద్ధత కలిగి జీవిస్తూ క్రీస్తుని చూపించాలి!
ఇక
తర్వాత
ఆత్మానుసారమైన
జీవితం, వాక్యానుసారమైన జీవితం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి! చివరగా వీటన్నిటి ద్వారా పరిపూర్ణత సాధించాలి! అప్పుడే నీవు సీయోను అనుభవమును సాధించగలవు! నీ జీవితంలో పరలోకం కోసం, ఇలాంటి ఆత్మీయ అనుభవం సాధించడం కోసం ప్రయత్నం ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండాలి. You
Must seriously Try For These Spiritual Things! If you do not have this
seriousness, you never achieve these!
అ
పట్టుదల
తెగింపు
నీకుందా!
గమనించాలి
సంపూర్ణతకు సాధనాలు- పరిశుద్ధత మరియు
శ్రమలు. మరో మార్గం లేదు!
అట్టి ఘనమైన శ్రేష్టమైన
అనుభవాలు కోసం
ప్రయత్నం చేద్దాం! పొందుకుందాం!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-26వ భాగం*
మీకా 4:9,10
9. నీవెందుకు కేకలువేయుచున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?
10. సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో జరిగే సంభావాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
నీవెందుకు కేకలు వేస్తున్నావు? నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచన కర్తలు నశించి పోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చాయా అంటూ సీయోను కుమారి ప్రసూతి స్త్రీ వలే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట నివాసం చేస్తావు బబులోనుకి వెళ్తావు అక్కడే నీకు రక్షణ కలుగుతుంది అంటున్నారు.
ఆ మూడు అర్ధాలు చూడక ముందు
మనం ధ్యానం చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి!
మొదటగా ఆమె అనగా సీయోను కుమారి కేకలు వేస్తుంది ఇక్కడ!
ఎందుకు కేకలు వేస్తుంది? బాధ తట్టుకోలేక!
ఎంతటి బాధ అంటే క్రింద చెబుతున్నారు ప్రసూతి స్త్రీకి వచ్చినంత బాధ!
ఎందుకు అంతభాద?
ఆ బాధ ఎలా వచ్చింది? అంటే ఇదే వచనములో చెబుతున్నారు
మొదటగా: నీకు రాజు లేడు!
ఎందుకు రాజు లేడు? నీవు రాజుల
రాజుని లోకమంతటికి మహారాజైన దేవుడ్ని తిరస్కరించి చూడని
వినని విగ్రహాలు వెంట పరిగెత్తి వ్యభిచరిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను వదలివేసి బ్రష్టత్వమునకు అప్పగించేశారు. రోమీయులకు 1: 28
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
కాబట్టి ఇప్పుడు నీకు రాజు ఎవడూ లేడు!
ఇక రెండవది: నీ ఆలోచన కర్తలు నశించిపోవుట వలన నీకు బాధలు కలుగుతున్నాయి! యెషయా
44:28లో ఆలోచన కర్త ఎవడూ లేకపోయాడు అంటున్నారు.
ఇంతకీ
ఆలోచన కర్తలు ఎవరు
ఇశ్రాయేలు ప్రజలకు???
ఇశ్రాయేలు
పెద్దలు, యాజకులు, నాయకులు, రాజులు! అయితే
మనం చరిత్ర చూసుకుంటే
నాయకులే, యాజకులే, పెద్దలే
దారితప్పించారు.
2రాజులు 23:9 ప్రకారం యాజకులే
తినకూడని పదార్ధాలు తినేవారు!
నెహేమ్యా 9:34 ప్రకారం వారి
ప్రధానులు గాని, రాజులు
గాని యాజకులు గాని
దేవుడు చెప్పినట్లు చేయక
ధర్మశాస్త్రమును
అనుసరించలేదు, దేవుని ఆజ్ఞలను
పాటించలేదు.
యేహెజ్కేలు 7:26 ప్రకారం యాజకులు
గాని, పెద్దలు గాని
దేవుని యొద్ద ఆలోచన
చేయడమే మానివేశారు అందుకే
ధర్మ శాస్త్రజ్ఞులు కాకపోయారు
అంటున్నారు.
యేహెజ్కేలు 22:26 ప్రకారం యాజకులు
ధర్మశాస్త్రాన్ని
నిరాకరిస్తున్నారు. వారే దేవునికి
ప్రతిష్టమైన
వాటిని అపవిత్రం చేస్తున్నారు, విశ్రాంతి దినాన్ని
కూడా ఆచరించడం లేదు
అంటున్నారు.
హోషేయ 6:9 ప్రకారం యాజకులు
బందిపోటు దొంగల్లా పొంచి
హత్యలు చేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఘోరమైన
కాముకత్వం చేస్తున్నారు.
ఇక
ఇదే మీకా ౩:11 ప్రధానులు లంచము
పుచ్చుకుంటున్నారు. యాజకులు కూలికి
బోధిస్తున్నారు. ప్రవక్తలు డబ్బుకోసం
సోదే చెబుతున్నారు అంటున్నారు
జెఫన్యా
౩:4 ప్రకారం ప్రవక్తలు
గప్పాలు కొట్టేవారు, ..
కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారికి విరోధిగా మారిపోయారు. అందుకే ఈ వేదనలు శోధనలు బాధలు! ఇప్పుడు ఆ బాధలు తట్టుకోలేక కేకలు పెడుతుంది సీయోను కుమారి!
ఇక రెండవదిగా: ప్రసూతి స్త్రీ వలే నీకు వేదనలు వచ్చాయి అంటూ ప్రసూతి స్త్రీ వలే నీవు వేదనపడు.....
దీనికోసం ధ్యానం చేస్తే వారికొచ్చే బాధలు
ఎంతగా ఉంటాయి అంటే యిర్మియా ౩౦:6 లో చూసుకుంటే ....
మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?
పురుషులు ప్రసూతి వేదన
పడుచున్నారట, స్త్రీలు లాగ నడుము
బాధచేత నడుము
మీద చేతులుంచుకుంటున్నారు అంటున్నారు.
ఇక హోషేయ 13:13 లో .......
ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.
ఇంతకీ ఎవరికోసం చెబుతున్నారు ఇక్కడ అంటే ఎఫ్రాయిము కోసం అనగా ఇశ్రాయేలు పది గోత్రాల కోసమని అర్ధం చేసుకోవాలి!
ఇంకా యెషయా గారు చెబుతున్నారు 21:౩
కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.
యిర్మియా 6:24
దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగు చున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.
ప్రియ
స్నేహితుడా! నీవు కూడా అదేవిధంగా దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశల వెంబడి, లోకాచారాల వెంబడి పరిగెత్తితే ఇశ్రాయేలు ప్రజలకు పట్టిన గతే నీకు
పడుతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలుగెత్తి వేదన
పడి కేకలు
వేసినట్లు ప్రసూతి స్త్రీ ఏడ్చినట్లు బాధలు పడక
తప్పదు!
నేడే నిన్ను నీవు సరిచేసుకో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-27వ భాగం*
మీకా 4:9,10
9. నీవెందుకు కేకలువేయుచున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?
10. సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
ప్రియ
దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో
జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఇక గతభాగంలో ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన అర్ధాలు ఉన్నట్లు చెప్పుకున్నాము. అర్దాలు ఏమిటో ఈరోజు
ధ్యానం చేసుకుందాము!
మొదటగా: ఈ రెండు వచనాలు జాగ్రత్తగా చూసుకుంటే .....
ప్రసూతి వేదనలు నీకు వచ్చాయి. సీయోను కుమారి ప్రసూతి స్త్రీవలే నీవు వేదనపడి ప్రసవించు. నీవు పట్టణం విడిచిపోతావు. బయట నివాసం చేస్తావు, బబులోను పట్టణము వరకు వెల్లిపోతావ్! అయితే అక్కడనే నీవు రక్షణ పొందుతావు, అక్కడే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును అంటున్నారు.
ఇది యూదులు తమ పట్టణాలు వదిలివేసి బబులోను చెరకు పోయి,
అక్కడ ప్రసూతి స్త్రీకి ఎట్లాంటి వేదనలు బాధలు కలుగుతాయో అట్లాంటి శోధన బాధలు వారికి కలుగుతాయి అనే దానిని అనగా జరుగబోయే సంభవాన్ని ముందుగానే ఆత్మద్వారా ప్రవచిస్తున్నారు భక్తుడు!
అయితే చరిత్ర జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది నెరవేరడానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టాయి! మీకా గారు ఈ ప్రవచనం ప్రవచించి చనిపోయిన తర్వాత యిర్మియా గారి చివరి రోజులలో ఈ ప్రవచనం నెరవేరింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పటికి బబులోను చాలా చిన్న బలహీనమైన రాజ్యము! అస్శూరు అప్పటికి చాలా శక్తివంతమైన రాజ్యము! అప్పటికే అస్శూరు వారు అనేక రాజ్యాలను ఆక్రమించి, ఇశ్రాయేలు అనగా పదిగోత్రాల వారిని చెరలోనికి తీసుకుని పోయారు. అయితే ఇక్కడ భక్తుడు ఆత్మద్వారా ప్రవచిస్తున్నారు. యూదులు ఇంకా చెప్పాలంటే సీయోను కుమార్తె అనగా యేరూషలేము పట్టణము వారు చెరపట్టబడి బబులోనుకి వెళ్తారు! ఎవరిద్వారా చెరపట్ట బడతారు అనగా బబులోను ద్వారా! అంతేకాదు ఆ తర్వాత అ బబులోనులో వారికి రక్షణ విడుదల కలిగి మరలా తమ ప్రాంతాలకు వస్తారని ముందుగానే ప్రవచిస్తున్నారు.
ఇలా మీకా గారే కాకుండా అనేకులు బబులోను చెరలోనికి యూదులు పోతారని ప్రవచించారు! ఇక యిర్మియా గారైతే ఎన్నిరోజులు అక్కడ అనగా బబులోనులో ఉంటారో అదికూడా ముందుగానే చెప్పారు. యిర్మియా గారి ప్రవచనం ప్రకారం
70 సంవత్సరాలు వారు చెరలో ఉంటారు అని చెప్పారు!
యిర్మియా 25: 11
ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.
యిర్మియా 29: 10
యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.
2రాజులు 20:17
వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 39:6,7
6. రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.
యెషయా 43:14
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.
యిర్మియా 20:4
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచు చుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.
యిర్మియా 21:10
ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా 27: 6
ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
యెహేజ్కేలు 21: 19
నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆరెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.
కాబట్టి అలా ప్రవచించిన విధముగానే యూదులు క్రీ.పూ 586లో చెరలోనికి
పోయారు!
అంతేకాకుండా దానియేలు గారు, యిర్మియా గారు, జెకర్యా గారు
ఇంకా అనేకులు ప్రవచించినట్లు బబులోను నుండి విడుదల కలిగి నెహేమ్యా, ఎజ్రా గారి
సమయంలో జెరుబ్బాబెలు,
యాజకుడైన యెహోషువా/హోషేయ నాయకత్వంలో తిరిగి వచ్చారు!
ఉదాహరణకు: జెకర్యా 2: 7
బబులోను దేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
ఇక్కడ బబులోను దేశములో నివాసివగు సీయోను కుమారి అంటున్నారు!
అక్కడ అనగా
మీకా 4:10లో సీయోను కుమారి నీవు బబులోను వరకు పోయెదవు అన్నారు. ఇక్కడ బబులోను దేశములో నివాసివగు సీయోను తప్పించుకొని పొమ్ము అంటున్నారు.
యెషయా 48:20
బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.
యెషయా 43:5
భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
యిర్మియా ౩:14
భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
యిర్మియా 16:14—15
యెహోవా సెలవిచ్చు మాట ఏదనగానేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలోఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట
అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీ యులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.
యిర్మియా 29: 14
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
యిర్మియా 33: 26
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
యిర్మియా 46: 27
నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు చున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.
యెహేజ్కేలు 39: 25
కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ద నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరియెడల జాలిపడెదను.
యోవేలు 3: 1
ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున
ఆమోసు 9: 14
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.
జెఫన్యా 2:7
తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.
కాబట్టి ఈ ప్రవచనాలు
అన్నింటి ప్రకారము క్రీ.పూ 520లో వారు తిరిగి రావడం
మొదలుపెట్టారు. ఈ ప్రవచనం నెరవేరింది సుమారు 17౦ సంవత్సరాల తర్వాత!
ప్రియులారా! దేవుడు వాగ్దానం చేశారా—దానిని తప్పకుండా నెరవేరుస్తారు! అయితే దానిని పొందుకొనే వరకు ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది!
ప్రియ స్నేహితుడా! ఒకవేళ దేవుడు నీకేదైనా వాగ్దానం చేశారా? అయితే ఓపికతో నిరీక్షణతో కనిపెట్టు!
ఓలిపోకు! సోలిపోకు! నిరాశపడకు!
అబ్రాహాము గారు 25 సంవత్సరాలు కనిపెట్టారు!
యోసేపు గారు 14 సంవత్సరాలు కనిపెట్టారు.
అపుడు వారు వాగ్ధానఫలం అనుభవించారు!
నీవుకూడా కనిపెట్టి- ఈవులు పొందుకో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-28వ భాగం*
మీకా 4:9,10
9. నీవెందుకు కేకలువేయుచున్నావు? నీకు రాజు లేకపోవుటచేతనే నీ ఆలోచన కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా?
10. సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు, బబులోను పురము వరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలోనుండి నిన్ను విమోచించును.
ప్రియ
దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో
జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన అర్ధాలు ధ్యానం చేసుకుంటున్నాము! ఈ రోజు మిగిలిన అర్ధాలు ధ్యానం చేసుకుందాము!
రెండవదిగా: ఈ వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రకటన గ్రంధం 12వ
అధ్యాయంలో
సూర్యుని
ధరించిన
స్త్రీని
పోలి ఉంది! అనగా అంత్యదినాలలో యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ సమయంలో జరుగబోయే మరో సంభవం- యూదులు/ఇశ్రాయేలు
ప్రజలకు
కలుగబోయే
సంభవం ప్రకటన 12వ అధ్యాయంలో ఉంది!
ఒకసారి దానిని, దీనిని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం! .....
Revelation(ప్రకటన గ్రంథము)
12:1,2,3,4,5,6,13,14,15,16,17
1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.
2. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
3. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.
4. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
5. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
13. ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను;
14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింప బడెను.
15. కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
16. భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మ్రింగివేసెను.
17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
ప్రియులారా ఈ రెండు రిఫరెన్సులు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ కూడా స్త్రీయే! ఇక్కడ కూడా స్త్రీయే! సీయోను కుమారి!
అక్కడ అనగా ప్రకటన
12లో స్త్రీ గర్భిణియై ప్రసవవేదన పడుచున్నది! ఇక్కడ అనగా మీకా 4:10 లో కూడా ప్రసవవేదన పడుచున్నది!
ఇక ప్రకటన
12:6,12 లో ఆమె పారిపోవగా దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్దపరచి పోషించారు. ఇది కడవరి రోజులలో యూదులు అంత్యక్రీస్తు ద్వారా మోసగించబడిన తర్వాత మూడున్నర సంవత్సరాలు అన్యజనులు ఆమెను పోషించుటను సూచిస్తుంది!
కాబట్టి ప్రవక్త ప్రవచించిన ప్రవచనం అంత్యదినాలలో యూదులకు కలుగబోయే సంభవాన్ని సూచిస్తుంది.
గమనించాలి: దానియేలు గ్రంధ ధ్యానాలు ధ్యానించినప్పుడు, జెకర్యా గ్రంధ ధ్యానాలు ధ్యానించి నప్పుడు మనం చూసుకున్నాము—సూర్యుని ధరించిన స్త్రీ సంఘము కానేకాదు! అది ఇశ్రాయేలు ప్రజలను లేక ఇశ్రాయేలు జాతిని సూచిస్తుంది.
ఆమె
పాదముల
క్రింద
ఉన్న
చంద్రుడు- అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధికి సాదృశ్యం!
12 నక్షత్రాలు- ఇశ్రాయేలు 12గోత్రాలు!
స్త్రీ ధరించిన సూర్యుడు – ప్రభువైన యేసుక్రీస్తు!
ఆమె
గర్భిణియై
ప్రసవ
వేదన
పడటం- వారు మహా శ్రమల కాలములో అనుభవించే శ్రమలను- ఇంకా వారు అన్యజనులతోను, క్రీస్తు విరోధి చేతను అనుభవించే హింసలను సూచిస్తుంది.
ఆమె
కనిన
మగ
శిశువు
మొదటగా
ఆ
గోత్రం
నుండి
లేక
ఇశ్రాయేలు
జాతినుండి
వచ్చిన
క్రీస్తుయేసుప్రభులవారు!
ఆమెకు
మరో
సంతానం
ఉంది
వారు
ఇశ్రాయేలీయులలో
రక్షించబడిన
1,44,000 మంది.
కాబట్టి ఇది అనగా ఈ 4:9—10 ప్రవచనము ఆత్మీయంగా సూర్యుని ధరించిన స్త్రీకి సాదృశ్యంగా ఉంది.
మరి మరో అనుమానం రావచ్చు—మరి అక్కడనే అనగా బబులోను నుండే రక్షణ కలుగుతుంది- దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి అనగా ఇలాంటి చెరలోనుండి బాధలలోనుండి దేవుడే వారిని విడిపించి పోషిస్తారు లేక రక్షిస్తారు అనే దానిని సూచిస్తుంది!
ఇక మూడవ అర్ధం: మనము కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులముగా, పరమ యేరూషలేముగా కట్టబడుచున్నాము! ఇంకా చెప్పాలంటే నూతన నిబంధన సంఘాన్ని కూడా సూచిస్తుంది. ఈ నూతన నిబంధన సంఘానికి కలుగబోయే సంభవాలను ప్రవక్త చెబుతున్నట్లుగా ఉంది!
పరమ యేరూషలేముగా నూతన నిబంధన సంఘంలో పౌరులము సభ్యులముగా అవయవాలుగా ఉన్న మనలను మొదటగా సాతానుడు వేసే ఉచ్చులలో పడి అనేకులు దారి తప్పి, బబులోను అనబడే సాతాను చెరలోనికి పోయేటంతగా తప్పిపోతుంటారు. అప్పుడు వారు మొర్రపెట్టినప్పుడు ప్రభువు కరుణించి ఆ బబులోను బంధకాలు తప్పించి తిరిగి సీయోనుకి రప్పించే విధానముగా కనిపిస్తుంది.
మరొక
అర్థం: బబులోను అనే పాపపులోకం లోనే విశ్వాసి ఉండాలి. ఈ బబులోను లోనే నూతన నిబంధన విశ్వాసి కూడా ఉండాలి. అయితే అదే బబులోను నుండి దేవుడు విశ్వాసిని రక్షించి పరమ సీయోను కి తీసుకుని పోబోతున్నారు!
ఇక మరో అర్ధం-
ఇలా నూతన నిబంధన సంఘంలో వీరులుగా శూరులుగా సాగిపోయే మనకు సాతానుడు మరణమగునంతగా మనలను శోధనలకు, బాధలకు గురిచేస్తే మనము కూడా ఆ ప్రసవించు స్త్రీకి కలిగే వేదన వంటి బాధలు అనుభవిస్తూ మనము విడిచే నిట్టూర్పులను సూచిస్తుంది. అందుకు మనకు సహాయంగా పరిశుద్ధాత్ముడు కూడా అబ్బా తండ్రి అంటూ మన తరుపున పెట్టే మొర్రలను కూడా ఇది సూచిస్తుంది. రోమా 8:15,26;
ఇంకా నూతన నిభందన సంఘములో ఉన్న మనము-
సేవకులు నూతన ఆత్మలకోసం – సాతాను బంధకాలలో ఉన్న, బబులోను అనే సాతాను చెరలోనున్న వారి విముక్తికోసం నిట్టూర్పులు విడుస్తూ పౌలుగారి వలే ప్రసవ వేదన పడి, వారిని క్రీస్తుకై కనడాన్ని కూడా సూచిస్తుంది.
ఇలాంటి శోధనలలో ఉన్న మనకు దేవుడు అక్కడ నుండే అనగా ఆ బబులోను బంధకాలలో నుండి మనలను విడిపించి ఆ పరమ యేరూషలేముకి ఆ పరమ సీయోనుకి శ్రమలనుండి సంపూర్ణతకు నడిపించే అనుభవాన్ని కూడా ఈ వచనాలు సూచిస్తున్నాయి.
ప్రియ దైవజనమా!
ఒక్కసారి మిమ్మును మీరు పరిశీలించుకొని ఇలాంటి శోధనలో భాదలో ప్రభువుకోసం నిలబడి, ప్రభువు వైపు చూడమని ప్రోత్సహిస్తున్నాను!
ఒకవేళ విశ్వాసం ఓడిపోయి జారిపోయి ఉంటే నేడే ప్రభువు సహాయం కోసం మొర్రపెట్టు! ఆయన తప్పకుండా నిన్ను ఆ బబులోను బంధకాల నుండి, సాతాను బంధకాలనుండి విమోచించి సీయోనుకు తప్పకుండా నడిపిస్తారు!
అయితే ముందుగా నీవు నీలో దేవునికి ఇష్టం లేని ప్రతీ విషయాన్ని విడిచిపెట్టి, ఆయన సన్నిధిలో మొర్రపెడితే వెంటనే నిన్ను హక్కున చేర్చుకోడానికి ఆయన సిద్దంగా ఉన్నారు!
మరి నీవు వస్తావా?
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-29వ భాగం*
మీకా 4:11—13
11. మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చియున్నారు.
12. కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
13. సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.
ప్రియ
దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో
జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనాలలో చాల ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
ఈ 11వ వచనంలో మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదికి కూడివచ్చియున్నారు అని ప్రవచిస్తున్నారు.
ఈ వచనంలో రెండు విషయాలు అర్ధం చేసుకోవచ్చు!
మొదటగా సీయోనుని అపవిత్రం చేయడం, రెండవదిగా అనేకులు సీయోనుని లేక యేరూషలేమును నాశనం చేద్దామని కూడి రావడం!
మొదటిది ఆలోచిస్తే: సీయోనుని నాశనం చేద్దామని కాదు వాళ్ళ మొదటి గోల్! సీయోనుని అపవిత్రం చేయడం! ప్రియులారా! దానియేలు గ్రంధం ధ్యానాలు ధ్యానం చేసేటప్పుడు చెప్పడం జరిగింది- యేరూషలేమునకు సంభవించిన సంభవాలు- మరలా అంత్యదినాలలో సంభవింపబోతున్నాయి! సీయోనుని అపవిత్రం చేయడం అనగా ఇక్కడ యేరూషలేము దేవాలయమును అపవిత్రం చేయడం అని అర్ధం చేసుకోవాలి!
క్రీ.పూ. 169లో అంతియొకాస్-4 లేదా అంతియొకాస్ ఎఫిఫానిస్ అనేవాడు అన్యాయంగా రాజరికాన్ని ఆక్రమించి ఇశ్రాయేలు దేశం మీదకు దండెత్తాడు. సుమారు రెండు సంవత్సరాల కాలం ఇశ్రాయేలు దేశంలోనే ఉండిపోయాడు. ఇక క్రీ.పూ. 168 లో శాశ్వతంగా యేరూషలేమును ఆక్రమించుకోడానికి విశ్రాంతి దినాన్న సైన్యాన్ని పంపి యేరూషలేమును ఆక్రమించుకొన్నాడు, చాలామంది స్త్రీలను పిల్లలను చెరపట్టుకుని తీసుకుని పోయాడు. దేవాలయాన్ని హస్తగతం చేసుకొని వాడి దేవత జూస్ విగ్రహాన్ని, దేవుని బలిపీఠానికి మీదన ప్రతిష్టించాడు! దేవాలయంలో జరిగే బలులను ఆపివేశాడు. ఇక ఎప్పటికీ బలులు జరుగకూడదని దేవాలయంలో పందిరక్తాన్ని అర్పించాడు. అందువలన మూడున్నర ఏళ్ళు బలి జరుగకుండా చేశాడు. ఈ రకంగా దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. మత్తయి 24:15 లో చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు మరలా అంత్యక్రీస్తు లేక క్రీస్తువిరోది అంత్యదినాలలో అర్పించబోతున్నాడు. దీనినే ప్రవక్త గుర్తుచేస్తున్నారు.
అంత్యదినాలలో కూడా క్రీస్తువిరోధి లేదా అంత్యక్రీస్తు అంతియొకాస్ ఎఫిఫానిస్ వలే ఇచ్చకపు మాటలు చెప్పి రాజ్యాన్ని ఆక్రమించి మొదటి మూడున్నర సంవత్సరాలు వారితో అనగా ఇశ్రాయేలు ప్రజలతో చాలా సఖ్యతతో ఉంటాడు. తర్వాత నేనే దేవుణ్ణి నన్ను నమ్మండి పూజించండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు తాము మోసపోయినట్లు గ్రహించి కొండలకు పారిపోతారు. ఆ సమయంలోనే వాడు మరలా నాశనకరమైన హేయవస్తువు దేవాలయంలో అర్పిస్తాడు. గమనించాలి ఇది జరగాలి అంటే మొదటగా యేరూషలేము దేవాలయం కట్టబడాలి! అంత్యక్రీస్తు బయలుపరచ బడాలి! బలి అర్పణలు మొదలవ్వాలి. అప్పుడే ఈ సీయోనుని లేక దేవాలయాన్ని అపవిత్రం చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా పరమ యేరూషలేముగా సీయోనుగా నూతన నిబంధన సంఘంలో పౌరులము సభ్యులముగా అవయవాలుగా ఉన్న మనలను కూడా సాతానుడు అపవిత్రం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం తో సాతాను శోధనలను ఎదుర్కొంటూ ఉండాలి.
ఇక రెండవదిగా: ఇది జరిగాక మరింత అపవిత్రం చేసి మరింత పాడుచెయ్యడానికి అనేక దేశాలు ఇశ్రాయేలు దేశం మీదకు వస్తారు. అదే హార్మేగిద్దోను యుద్దము! ప్రకటన 16, 19 అధ్యాయాలు; అప్పుడు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి ఒలీవల కొండమీద అడుగుపెడతారు, అప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది. గమనించాలి ఇక్కడ మీకాగారు ఒక వచనంలో
అనేక సంఘటనలు కలిపి చెబుతున్నారు గాని ఆయన తర్వాత సుమారు 200 సంవత్సరాలు తర్వాత వచ్చిన జెకర్యా గారు చాలా వివరంగా కళ్ళకు కట్టినట్లు చెప్పారు.
జెకర్యా 12:1—9 లోను, 14వ అధ్యాయంలోను చాలా
వివరంగా వ్రాయబడింది.....
Zechariah(జెకర్యా) 12:1,2,3,5,6,7,8,9
1. దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
2. నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.
3. ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.
5. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.
6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో నివసించుదురు.
7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.
8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.
అప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా భూమిమీదకు వస్తారు.
Zechariah(జెకర్యా) 14:1,2,3,4,5
1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.
2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
5. కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
ఇదే యేసుక్రీస్తుప్రభులవారి ప్రత్యక్ష రాకడ లేక
రెండవరాకడ!
(సశేషం)
*మోరస్తీయుడైన మీకా-౩౦వ భాగం*
మీకా 4:11—13
11. మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి కూడివచ్చియున్నారు.
12. కళ్లములో ఒకడు పనలు కూర్చునట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలిసికొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు.
13. సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.
ప్రియ
దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ అధ్యాయంలో అంత్యదినాలలో
జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము.
ఇక ఈ వచనాలలో చాల ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
(గతభాగం తరువాయి)
ఇక మనము 12వ వచనం ధ్యానం చేస్తే కళ్లములో ఒకడు పనలు కూర్చునట్లు యెహోవా వారిని సమకూర్చును. దీనికోసం గతభాగంలో చెప్పుకున్నట్లు జెకర్యా గ్రంధంలో 12:9 లోను, 14:2 లోను అన్యజనులందరూ ఇశ్రాయేలు దేశం మీదకు యుద్దానికి వస్తారు. మీకా 4:11 లోను అదే చెబుతున్నారు. దీనినే ప్రకటన 16:14,15 లో చెబుతున్నారు. జెకర్యా 12:11 లో మెగిద్దోను లోయను జ్ఞాపకం చేసుకొంటే ఇక్కడ అది హార్మేగిద్దోను అని చెప్పబడుతుంది.
ఇక
తర్వాత
ఈ
వచనంలో
ధ్యానం
చెయ్యాల్సిన
ముఖ్యమైన
మాట: అయితే వారు అనగా అన్యజనులు లేక ఇశ్రాయేలు మీద యుద్దానికి వచ్చినవారు ఆయన తలంపులు అనగా దేవుని తలంపులు తెలిసికొనకున్నారు! ఆయన ఆలోచన వారు గ్రహించకున్నారు.
నిజానికి మన తలంపులు వంటివి కావు
దేవుని తలంపులు! అందుకే పౌలుగారు దేవుని తలంపుల కోసం ఇలా
రాస్తున్నారు రోమా 11:౩౩—34
33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
ఇక దావీదు గారు కీర్తన
2:1—12 లో రాస్తున్నారు అన్యజనులు అనేకులు ఆయనకు, ఆయన అభిషక్తునికి వ్యతిరేఖంగా కూడారు. వారిని చూసి దేవుడు నవ్వుతున్నాడు అంటున్నారు. ఇంకా నా రాజును సీయోను అనే కొండమీద పవిత్ర పర్వతం మీదన సింహాసనమెక్కించాను అంటున్నారు.
ఆయన ఆలోచనలు వారికి తెలియవు!
ఈ ఆలోచన- ఏమిటది అంటే దేవుడు ఈ రకంగా శత్రుసైనికులను అంత్యక్రీస్తు సైనికులను సమకూర్చి ఒకేసారి నాశనం చెయ్యడం ఆయన ఆలోచన! మాస్టర్ ప్లాన్! ఇది వారికి తెలియదు!
అందుకే ఇక్కడ కళ్ళములోని పనలను కూర్చి నట్లు ఆయన వారిని కూర్చారు అంటున్నారు మీకా గారు! అప్పుడు అందరికీ ఒకేసారి ప్రతీకారం చెయ్యబోతున్నారు దేవుడు!
ఇప్పుడు జెకర్యా గ్రంధం
14వ అధ్యాయంలో చెప్పబడిన సంభవం జరుగబోతుంది.
1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.
2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చ బోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయురీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
12. మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలో ఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.
13. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరికొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.
14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే అన్యజనుల సైన్యాలు వచ్చి పట్టణాన్ని ఆక్రమించుకుంటారు, పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమోతారు.
ప్రకటన 19:19—21
19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
ఇక చివరి వచనం ధ్యానం చేస్తే
....
సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.
అనేక జనములను నీవు అణగద్రొక్కుతావు, లేచి కళ్లము త్రొక్కుము అనగా
ప్రకటన 14:18—20;
18. మరియొకదూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.
19. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను
20. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.
ప్రకటన గ్రంథము 19:13,14,15
13. రక్తములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో- చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
ఇక
చివరిగా వారికి దొరికిన
లాభము నేను యెహోవాకు
ప్రతిష్టించుదును, వారి ఆస్తిని
సర్వలోక నాధునికి ప్రతిష్టించుదును
అంటునారు. ఇంతకీ ఆ
లాభము, ఆస్థి ఎవరిది
ఎక్కడిది?
దీనికి కూడా జవాబు
జెకర్యా గ్రంధములో ఉన్నది.
14:1, 14
1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.
ఇంకా జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును అనికూడా వ్రాయబడింది.
14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.
కాబట్టి ఇలా యుద్ధము చేయడానికి వచ్చిన వారి ధనము ఐశ్వర్యము వెండి బంగారాలు ఇశ్రాయేలు ప్రజలకు ఆస్తిగా ఇవ్వబడుతుంది.
ప్రియ సంఘమా! దానికన్నా గొప్ప ఐశ్వర్యము స్వాస్థ్యము దేవుడు మనకు ఇవ్వబోతున్నారు. బంగారు నగరులో బంగారాన్ని కాలితో త్రొక్కబోతున్నాము. దానికన్నా ప్రాముఖ్యంగా మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తుప్రభులవారితో కలసి ఉండబోతున్నాము. పరిశుద్దుల విందులో తేజోవాసుల స్వాస్త్యములో పాలుపొందబోతున్నాము.
మరి నీవు దానికి సిద్దంగా ఉన్నావా? నీ బ్రతుకు సరిగా ఉందా? ఎత్తబడే గుంపులో నీవున్నావా? వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, ప్రార్ధనాపూర్వకమైన జీవితం, మాదిరిగల జీవితం నీకుందా?
లేకపోతే విడువబడతావు జాగ్రత్త!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-౩1వ భాగం*
మీకా 5:1—3
1. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
2. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
3. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగి వత్తురు.
ప్రియ దైవజనమా!
మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము.గత 4వ అధ్యాయం నుండి అంత్యదినాలలో జరిగే సంభవాలను ధ్యానం చేస్తున్నాము. ఇక ఈ 5వ అధ్యాయంలో కూడా అంత్యదినాలలో జరిగే సంభవాలతో పాటుగా యేసుక్రీస్తుప్రభులవారి మొదటి రాకడ మరియు ఇశ్రాయేలు ప్రజలకు త్వరలో జరిగే సంభవాలు వ్రాయబడ్డాయి! అంతేకాకుండా 2వ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు అభిషక్తుడిగా ఎక్కడ పుట్టబోతున్నారో అడ్రస్ చెబుతున్నారు భక్తుడు!
ఇక ఈ వచనాలలో చాల ప్రాముఖ్యమైన అర్ధాలు గమనించవచ్చు!
మొదటి వచనంలో సమూహములుగా కూడుదానా! సమూహములుగా కూడుము! అయితే మన పట్టణము ముట్టడి వేయబడుచున్నది శత్రువుల ద్వారా అంటున్నారు. ఇంకా ఇశ్రాయేలు న్యాయాదిపతిని కర్రతో చెంపమీద కొట్టుచున్నారు అంటున్నారు.
దీనికోసం మనం ఆలోచన చేస్తే సమూహములుగా కూడే పట్టణము యేరూషలేము పట్టణమే!
ఇక తర్వాత మన
పట్టణము ముట్టడి వేయుచున్నారు అనగా
అదికూడా యేరూషలేము పట్టణమునే ముట్టడి వేయుచున్నారు అని
అర్ధం!
గమనించవలసిన విషయం ఏమిటంటే మీకా గారి సమయానికి యేరూషలేము పట్టణము చాలాసార్లు ముట్టడివేయబడ్డా- ఇది బహుశా సిద్కియా సమయంలో యేరూషలేము పట్టబడి ప్రజలను, సిద్కియాను చెరలోనికి తీసికొనిపోయే సందర్బము అనిపిస్తుంది. కారణం సిద్కియా రోజులలో యేరూషలేము పట్టణము సుమారు రెండుసంవత్సరాలు ముట్టడి వేసినట్లు బైబిల్ సెలవిస్తుంది. 2రాజులు 24:10,11
10. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.
11. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను.
రెండవ రాజులు 25:1,2
1. అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.
2. ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడివేయబడియుండగా ....
యిర్మియా 32:2
ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,
ఇంకా ముట్టడి వేస్తారు అని మీకా గారితో పాటుగా చాలామంది ప్రవచించారు.
యెషయా 1:8
ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
యెషయా 29: 3
నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.
యిర్మియా 4: 16
ముట్టడి వేయువారు దూరదేశమునుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమునుగూర్చి ప్రకటనచేయుడి, జనములకు తెలియజేయుడి.
యిర్మియా 10: 18
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.
యెహేజ్కేలు 4: 3
మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.
కాబట్టి ఆ విధంగానే క్రీ.పూ.587లో ముట్టడి వేయడం జరిగింది. 2రాజులు 25:1,2
1. అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.
2. ఈ ప్రకారము రాజైన సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడివేయబడియుండగా ....
ఇక దానిని ఆధారం చేసుకుంటే ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంపమీద కొట్టుచున్నారు అనగా రెండు అర్ధాలు మనకు వస్తాయి!
మొదటగా రాజైన సిద్కియా బబులోను రాజుమీద తిరగబడ్డాడు (2రాజులు
24:20), దానికి ప్రతీకారంగా బబులోను సైన్యాలు రెండు సంవత్సరాలు యేరూషలేమును ముట్టడి వేయడం జరిగింది. అప్పుడు సిద్కియా రాజు పారిపోతాడు. అప్పుడు బబులోను రాజు అతని పట్టుకుని శిక్షిస్తాడు
రెండవ రాజులు 25:4,5,6,7
4. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.
5. అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.
6. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసికొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను.
7. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి యిత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసికొనిపోయిరి.
కాబట్టి ఇక్కడ జనుల
న్యాయాదిపతి అనగా
రాజు. ఆ రాజునే బబులోను రాజు కన్నులు ఊడబీకి, కొట్టి, కుమారులను చంపించాడు.
ఇది మొదటి
అర్ధం!
ఇక
రెండవ
అర్ధం
కూడా
మనకు
కనిపిస్తుంది. ఇశ్రాయేలు న్యాయాధిపతి అని యెహోవాదేవునికి పేరు! ఇంకా భూలోక న్యాయాధిపతి అని కూడా పేరు. కీర్తనలు 94:2;
అలాగే
యేసుక్రీస్తుప్రభులవారు
చెప్పారు
ఆయనతో
పాటు
పండ్రెండు
మంది
శిష్యులు, మరికొందరు తీర్పు తీర్చబోతున్నారు. లూకా 22:29,30;
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు
కూడా
న్యాయాధిపతియే!
2తిమోతి 4:12
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
యెషయా ౩౩:22
యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
కాబట్టి అట్టి న్యాయాధిపతిని మొదటిరాకడలో ఆయనను కొట్టారు హింసించారు. చెంపమీద కొట్టి యేసూ! నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని హేళన చేశారు. *కాబట్టి ఇది యేసుక్రీస్తుప్రభులవారిని చెంపమీద కొట్టే సన్నివేశాన్ని
సూచిస్తుంది*.
మత్తయి 26: 67, 68
అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
కొందరు ఆయనను అర చేతులతో కొట్టిక్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి.
మార్కు 14: 65
కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
మత్తయి 26:౩1
అప్పుడు యేసు వారిని చూచిఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగాగొఱ్ఱెల కాపరిని కొట్టుదును, మందలోని గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడి యున్నది గదా.
మార్కు 14: 27
అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా.
కాబట్టి ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులవారు పొందబోయే హింసలు మరియు అవమానాన్ని సూచిస్తుంది.
ఇక మరో అర్థం
కూడా వస్తుంది. నూతన నిబంధన సంఘమైన మనలను
కూడా సమూహాలుగా కూడమని చెబుతున్నారు.
ఎందుకంటే శత్రువులు అనే సాతాను వాడి సైన్యం సంఘాన్ని పాడు
చేద్దామని ఎన్నో
ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే భక్తుడు చెబుతున్నారు:
హెబ్రీయులకు 10: 24,25
కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక,
ఒకనినొకడు హెచ్చరించుచు,
ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము.
ఎందుకు కూడాలంటే అందరం
కలసి ఒకే
విషయం మీద
ప్రార్థన చేసి
వాడిపై గొప్ప
విజయం సాధించవచ్చు!
కాబట్టి
1పేతురు 5: 8
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
ఆమెన్!
దైవాశీస్సులు!
(సశేషం)
*మోరస్తీయుడైన మీకా-32వ భాగం*
మీకా 5:1—3
1. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
2. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
3. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగి వత్తురు.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము.
(గతభాగం తరువాయి)
ఇక
రెండవ
వచనంలో
బెత్లెహేము
ఎఫ్రాతా
యూదా
వారి
కుటుంబములలో
నీవు
స్వల్ప
గ్రామమైననూ
నాకొరకు
ఇశ్రాయేలీయులను
పాలించువాడు
నీలో
నుండి
వచ్చును
అంటున్నారు. ఈ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారి
జననం
ఎక్కడ
జరుగబోతుందో 700
సంవత్సరాల
ముందే
అడ్రస్
చెబుతున్నారు! అది బెత్లెహేములోనే అభిషక్తుడు పుట్టబోతున్నారు. అనగా
యేసుక్రీస్తుప్రభులవారి
మొదటరాకడ
ఎక్కడ
జరగబోతుందో
ముందుగానే
చెబుతున్నారు
ప్రవక్త
ఆత్మవశుడై!
బెత్లెహేముకోసం చూసుకుంటే బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు! బైబిల్ గ్రంధంలో మొట్టమొదటగా బెత్లెహేము యాకోబు గారు తను
తనమామ దగ్గరనుండి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో తన భార్యయైన రాహేలు చనిపోయినప్పుడు బెత్లెహేము
ఎఫ్రాతా మార్గమును పాతిపెట్టారు. ఆదికాండం 35:19
అట్లు రాహేలు మృతిబొంది
బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి
పెట్టబడెను.
ఆదికాండము 48: 7
పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితినని యోసేపుతో చెప్పెను.
ఇక తర్వాత న్యాయాధిపతుల కాలంలో జరిగిన కొన్ని ఘోరమైన సంఘటనలు కనిపిస్తాయి, ఇంకా రూతు గ్రంధంలో మరలా మనకు
బెత్లెహేము ఎఫ్రాతా కోసం మనకు
కనిపిస్తుంది. రూతు 1:1—2
వచనాలలో ఎలీమేలెకు గారు
చిన్న కరువు
వచ్చింది అని
బెత్లెహేమును వదిలి
మోయాబు దేశం
పారిపోయారు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను.
తిరిగి నయోమి మగాళ్ళనందరిని పోగొట్టుకొని
తిరిగి 1:22 లో తిరిగి రూతుగారితో పాటు బెత్లెహేము చేరినట్లు చూడగలము!
ఇక దావీదు గారి సొంతగ్రామము బెత్లెహేము! కారణం ఎలీమెలేకు గారికి బోయజు గారు వరసకు కొడుకు అవుతారు! కాబట్టి ఒకే గ్రామం వారు! ఇదే గ్రామంలోనుండే మరలా యేసుక్రీస్తుప్రభులవారు పుడతారు అని మీకా గారు 700 సంవత్సరాల ముందే ప్రవచించారు.
ఇక్కడ మరో మాట కూడా వాడబడింది. బెత్లెహేమా ఎఫ్రాతా! ఎఫ్రాతా అనేది ఏరియా పేరు! బెత్లెహేము యేరూషలేముకి 10 కి.మీ దూరంలో ఉంది. గమనించండి బేతనియ కూడా 10 కి.మీ దూరంలోనే ఉంది గాని బేతనియ మరోవైపు ఉంది, బెత్లెహేము మరో వైపు ఉంది. మరి ఎఫ్రాతా ఏమిటి? బైబిల్ లో చాలా చోట్ల బెత్లెహేము వచ్చినప్పుడు ఎఫ్రాతా అని కూడా వస్తుంది. ఉదాహరణకు మీద చెప్పిన రిఫరెన్సులో రాహేలు చనిపోయినప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టారు అనియు, దావీదు గారి కోసం చెప్పినప్పుడు దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు అని వ్రాయబడింది. 1 సమూయేలు 17:12.
కాబట్టి ఎఫ్రాతా అనేది ఏరియా పేరు!
ఉదాహరణకు తెలంగాణా అనేది ఎంతో పెద్ద ప్రాంతం దానిలో వరంగల్ అనేది ఒక పట్టణం! ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే ఓ నర్సాపురమా! కోనసీమా! అన్నట్లు (ఇది కేవలం మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి మాత్రమే ఉపయోగించడం జరిగింది). కోనసీమలో నర్సాపురమా అని పిలవడం అన్నమాట! అలాగే ఎఫ్రాతా అనే ప్రాంతంలో బెత్లెహేము అనేది చాలా చిన్న గ్రామం! ఆ గ్రామంలో నుండే అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభులవారు రాబోతున్నారు. అందుకే ఇక్కడ మీకా గారు కూడా బెత్లెహేమా ఎఫ్రాతా! నీవు యూదావారి కుటుంబాలలో చాలా చిన్న గ్రామము, రిమోట్ ప్రాంతం! అయినా సరే నాకొరకు ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అంటున్నారు.
ఇది
మనకు
మరలా
మత్తయి 2:5
లో
కనిపిస్తుంది. అక్కడ తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి వచ్చాము అని హేరోదుతో చెప్పినప్పుడు- శాస్త్రులు చెప్పారు ......మత్తయి 2: 5
అందుకు
వారు
యూదయ
బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.
చూడండి ఎందుకు పనికిరాని, ఎవరికీ తెలియని ఒక గ్రామమును యేసుక్రీస్తు ప్రభులవారు తన జనన గ్రామంగా ఎన్నుకున్నారు. ప్రియ విశ్వాసి! నీవు కూడా నేడు ఎందుకు కొరగాని స్థితిలో ఉన్నావా? ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు! నాకు చదువులేదు! నాకు ధనము లేదు! ఆస్తి లేదు అంతస్తు లేదు, మంది మార్బలము లేదు. అని నీకు నీవే బాధపడుతున్నావేమో , బాధపడకు! దేవునికి నీలాంటి వారికోసమే వచ్చారు! నీలాంటి వారినే పిలుస్తున్నారు!
మొదటి కొరింథీయులకు 1:28,29
28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
ఆయనకు నీవు కావాలి!
నేడే యేసయ్య వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే చిన్న గ్రామంలో అనగా అదే చిన్న గ్రామమైన బెత్లెహేములో – చిన్న గొర్రెలమందను మేపుకుంటున్న దావీదు గారిని తీసుకొచ్చి ఆ దేశానికి రాజును చెయ్యడమే కాదు ఆ రాజ్యాలన్నిటికి చక్రవర్తిని చేశారు. నీవు కూడా ఆయనను ఆశ్రయించి దావీదు వలే నమ్మకముగా ఆయనకోసం జీవిస్తే నిన్ను కూడా అలాగే వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు! మరి నీవు వస్తావా?
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-33వ భాగం*
మీకా 5:1—3
1. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
2. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
3. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగి వత్తురు.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము.
(గతభాగం తరువాయి)
ఇక్కడ తర్వాత ధ్యానించవలసిన మరో విషయం పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటున్నారు. ఇక్కడ ఆయన అనగా అభిషక్తుడైన యేసుక్రీస్తుప్రభులవారని అర్ధము చేసుకోవాలి! మరి దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటున్నారు. ఇది ఎప్పుడో జరిగిన సంభవం కాదు పూర్వకాలంలో జరిగింది - ఇప్పుడు జరుగుతుంది - ఇంకా జరగబోతుంది అనే అర్ధాన్ని కలిగియుంది. అందుకే హెబ్రీ
13:8లో అంటున్నారు: యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడు అవును ఆమెన్!
అందుకే ప్రకటన గ్రంధంలో అంటున్నారు నేనే ఆదియు నేనే అంతమునై యున్నాను. ఇంకా నేనే ఆల్ఫా ఒమేగానై ఉన్నాను అంటున్నారు.
ప్రకటన 21:6
మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
ప్రకటన గ్రంథం 22: 13
నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
ఆయన జీవించుచున్నవాడు! ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఎప్పుడో ఉన్న దేవుడు కాదు! ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నారు! ఇప్పుడు ఉన్నారు, ఇక రాబోయే కాలంలో కూడా ఉంటారు!
సరే ఎప్పుడు ప్రత్యక్ష మయ్యారు అని
ఆలోచిస్తే అబ్రాహాము గారికి ప్రత్యక్షమయ్యింది ఆయనే,
ఇంకా ఆదికాండం 16:7 లో కనిపించింది కూడా
ఆయనే!
ఆదికాండము 16:7,8
7. యెహోవా దూత అరణ్య ములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
8. శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అదినా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.
ఇస్సాకు బదులుగా బలి
అయ్యింది మోరియా కొండమీద ఆయనే!
ఆదికాండము 22: 13
అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను.
ఆదికాండం 31:11—13 లో యాకోబు గారికి కనిపించింది కూడా ఆయనే!
Genesis(ఆదికాండము) 31:11,12,13
11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని.
12. అప్పుడు ఆయననీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి;
ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని
13. నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశ ములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
నిర్గమ ౩:2—6 లో మోషేగారికి కనబడింది ఆయనే!
2. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
3. అప్పుడు మోషేఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.
4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండిమోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడుచిత్తము ప్రభువా అనెను.
5. అందుకాయనదగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.
6. మరియు ఆయననేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
బండలో నుండి నీళ్ళు ఇచ్చింది ఆయనే!
ఆ బండక్రీస్తే!
దానియేలు
గారితో సింహాల గుహలో ఉన్నవారు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలతో పాటుగా అగ్ని గుండములో ఉన్నవారు కూడా ఆయనే!
యెహేజ్కేలు, జెకర్యా గ్రంధంలో కనబడి మాట్లాడింది కూడా ఆయనే!
ఇంకా
చెప్పాలంటే
సృష్టి
జరిగినపుడు
ఆయన
అక్కడే
ఉన్నారు
Proverbs(సామెతలు) 8:22,23,24,25,26,27,28,29,30
22. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
23. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
24. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
25. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
26. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
27. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
28. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30. నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
యోహాను 8: 58
యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
గమనించాలి ఎక్కడైతే యెహోవా దూతగా కనబడి తానే దేవుడైనట్లు పాపాలను క్షమించినట్లు, ఇంకా యెహోవా దేవునికి గల అధికారంతో మాట్లాడారో అన్నిచోట్ల కూడా యేసుక్రీస్తుప్రభులవారే కనబడి మాట్లాడినట్లు మనము అర్ధం చేసుకోవాలి!
ఇక చివరికి బాలుడైన యేసయ్యగా మరియ గర్బమున జన్మించి నీకోసం నాకోసం మానవాళి కోసం కల్వరి సిలువలో బలియాగమయ్యింది కూడా ఆయనే!Hebrews(హెబ్రీయులకు) 1:1,2,3,4
1. పూర్వకాలమందు నానాసమయములలోను (మూలభాషలో- నానాభాగములుగాను) నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో- యుగములను) నిర్మించెను.
3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక,
ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి,
దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
అంతేకాకుండా మరలా భూమిమీద తన భక్తులకు అనేక రీతులుగా ప్రత్యక్షమవుతున్నారు.
ఇంకా చివరిగా రెండవరాకడలో ప్రత్యక్షమయ్యేది కూడా ఆయనే!
మరి
ఆయన
అతి
త్వరలో
రాబోతున్నారు. ఆ మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చిన దేవుడు ఇప్పుడు కొదమసింహంలా రాబోతున్నారు! అప్పుడు ప్రేమ క్షమాపణ అనే వాటితో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభులవారు, ఇప్పుడు రెండంచుల ఖడ్గముతో, ఉగ్రతతో, దహించు అగ్నితో ప్రత్యక్షం కాబోతున్నారు!
ఇక మూడవ వచనం చూసుకుంటే:
3. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగి వత్తురు
ఇక్కడ ఈ వచనం చూసుకుంటే ప్రసవమగు స్త్రీ పిల్లను కనేవరకు ఇశ్రాయేలు వారిని శత్రువులకు అప్పగిస్తాను అంటున్నారు. ఇది మామూలుగా యేసుక్రీస్తు ప్రభులవారి జననం వరకు అనే అర్ధమిస్తున్నా, ఆత్మీయ అర్థం మాత్రం మరలా ప్రకటన 12 వ అధ్యాయంలో గల సూర్యుని ధరించిన స్త్రీ నే సూచిస్తుంది. అనగా అంత్యదినాలలో ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు విరోధి చేత మోసగింపబడిన తర్వాత రక్షించబడే సన్నివేశం వరకు, ఇంకా ఒలీవల కొండమీద జరగబోయే యేసుక్రీస్తు ప్రత్యక్షరాకడ వరకు ఆయన వారిని శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉంటారన్నమాట! ఇక సూర్యుని ధరించిన స్త్రీ సంభవము జరిగిన తర్వాతనే ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వత విమోచనం కలుగుతుంది.
యిర్మియా 7: 29
తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.
Hosea(హొషేయ) 3:4,5
4. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదునుగాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.
5. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
Hosea(హొషేయ) 5:6,7,15
6. వారు గొఱ్ఱెలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.
7. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.
15. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.
Romans(రోమీయులకు) 11:11,25,26,27
11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
ప్రియ దేవుని బిడ్డా!
ఇది అంత్యకాలంలో జరుగబోతుంది. త్వరలోనే ఇశ్రాయేలు విమోచనం జరగబోతుంది. ఆయన రాకడ సూచనలు నెరవేరుతున్నాయి.
ప్రియ దేవుని బిడ్డా నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయనముందు నీ ప్రవర్తన సరియైనదిగా ఉందా లేక అగ్నిగుండములో కాలిపోయే విధంగా లేక తీర్పులో తేలిపోయే విధంగా ఉందా? దయచేసి పరీక్షించుకో!
ఒకవేళ ఇంకా నీ బ్రతుకు బాగోలేదా? ఇప్పుడే దేవుణ్ణి క్షమాపణ వేడటానికి ఆయన పాదాలు పట్టుకో!
నేడే మార్పునొందు!
నేడు అనే దినముండగా ఈరోజే మార్పు నొందు!
ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నారు!
విననొల్లని వారికొరకు ఆయన దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నారు!
గమనించండి ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము!
ఒక్కసారి కృపాకాలం ముగిసిందా, దేవునిబూర మ్రోగిందా, సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడా, ఇక నీవు రక్షించబడలేవు!
కాబట్టి నేడే రక్షణపొందుకో!
ఆయన దగ్గరికి రా!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-౩4వ భాగం*
మీకా 5:4—6
4. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును,
5. ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
6. వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ
మరియు రెండవరాకడ సమయంలో జరిగే
సంభవాలు ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఈ మూడు వచనాలలో మూడు
ప్రాముఖ్యమైన విషయాలు లేక మూడు
జరుగబోయే సంభవాలు కోసం వ్రాయబడ్డాయి!
మొదటిది ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు బలము పొంది తన మందను మేపును.
రెండవది:
ఆయన భూమ్యంతముల వరకు ప్రభలుడవుతాడు, సమాధానమునకు కారకుడవుతాడు
మూడవది:
కాపరుల నియామకం, వారు దేశాన్ని రక్షించడం.
గమనించాలి పై
రెండు విషయాలు యేసుక్రీస్తుప్రభులవారి కోసమే
వ్రాయబడ్డాయి.
మొదటిది: అయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు, యెహోవా బలం మూలంగా యెహోవా నామ మహాత్తుచేత తనమందకు కాపరిగా ఉండును!
ఒకసారి
ఆగుదాం! యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు కదా, మరి ఆయన బలం పొందుకోవడం ఏమిటి?
ఆయన
దేవుడైనా
గాని, సశరీరుడుగా భూలోకానికి వచ్చారు కాబట్టి దైవిక బలం కావాలి. అందుకే 40 రోజులు
ఉపవాసం
ఉన్నారు. అప్పుడు బలముపొందుకుని సేవ చేశారు.
తర్వాత
మరణాన్ని
జయించి
పునరుత్థాన
శక్తిని
పొందుకున్నారు.
సేవ
చెయ్యాలన్నా, కాపరత్వము చెయ్యాలన్నా దైవికబలము అవసరం. అందుకే అంటున్నారు శిశ్యులతో ఆరోహణమునకు ముందుగా మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి ఉండుడి. వారు
అలాగే 40 రోజులు కనిపెట్టి, శక్తి పొందుకుని సేవ చేసి, భూలోకాన్ని
తలక్రిందులు
చేయువారు
అనే పేరు పొందుకున్నారు. కాబట్టి ఎవరైనా సేవ చెయ్యాలనుకున్నా ముఖ్యంగా కాపరత్వంలోనికి రావాలన్నా తప్పకుండా శక్తిని బలాన్ని పొందుకోవాలి. శిశ్యులు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు.
పౌలుగారు
సేవ ప్రారంభానికి ముందు గలతీ పత్రిక ప్రకారం మూడు సంవత్సరాలు అరేబియా దేశంలో కనిపెట్టి, ప్రార్ధించి శక్తిని పొందుకుని అప్పుడు సేవ ప్రారంభించారు.
గనుక
ప్రియ కాపరి! దైవజనుడా! నీవు
బలమైన ఘనమైన ఫలవంతమైన సేవ చెయ్యాలి అంటే ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థనా బలము, పరిశుద్ధాత్మ
శక్తి పొందుకుంటేనే చెయ్యగలవు! ఆ బలము
లేకుండా
సేవ చెయ్యకూడదు!
సరే, ఈ వచనం అంత్యదినాలలో
జరిగే సంభవం! దీనికోసం చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. చివరకు యేసుక్రీస్తు ప్రభులవారు కూడా అంటున్నారు యోహాను 10:1—16 లో నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకోసం నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అని చెప్పి ఆయన మేపు
గొర్రెలమైన మనకోసం ప్రాణం పెట్టారు- పాపాలనుండి రక్షించడానికి!
8.గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.
9. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
10. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
11. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
14. నేను గొఱ్ఱెల మంచి కాపరిని.
15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
దీనికోసం మనం చాలాసార్లు ధ్యానం చేశాము కనుక క్లుప్తంగా చూసుకుందాము!
దావీదుగారు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటూ తనను ఆయన మేపు గొర్రె తోనూ, దేవుణ్ణి కాపరిగా పోల్చారు! ఇంకా 100వ కీర్తనలో, 79వ కీర్తనలోను మనము ఆయన మేపు గొర్రెలము ఆయన ప్రజలము అంటున్నారు. కాబట్టి మనము ఆయన మేపు గొర్రెలము! మన కాపరి యేసుక్రీస్తుప్రభులవారు!
అయితే దావీదు గారు గొర్రెలకాపరి కాబట్టి, ఇంకా దావీదు గోత్రం లోనే యేసుక్రీస్తు ప్రభులవారు జన్మించారు కాబట్టి దావీదు గారు చనిపోయిన తర్వాత కూడా అనేకసార్లు దేవుడు నా కుమారుడైన దావీదును నా ప్రజలకు కాపరిగా చేస్తాను. అప్పుడు చెదిరిపోయిన గొర్రెలను అనగా ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి వారికి కాపరిగా దావీదును చేస్తాను అంటున్నారు. ఇక్కడ దావీదు - యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యంగా ఉన్నారు. దావీదు అనగా దావీదు గోత్రంలో పుట్టిన యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభులవారు అని అర్ధము చేసుకోవాలి!
అలా చేసి దేవుడు తన ప్రజలను రక్షించబోతున్నారు.
యెహేజ్కేలు 37: 24
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.
జెకర్యా 9: 16
నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.
యెషయా 40: 11
గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
యిర్మియా 31:10
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
ఇది
ఇశ్రాయేలు
ప్రజలను
గూర్చిన
ప్రవచనాలు
అనగా ఇశ్రాయేలు వారిని సమకూర్చి మరలా వారికి దేవుడిగా, నాయకుడిగా, కాపరిగా
అంత్యదినాలలో
దేవుడు
ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రము!
మరి
మన సంగతి ఏమిటి అంటే మనము కూడా ఆయన గొర్రెలమే! అవునా?
యోహాను 10:16
ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
ఇది నూతన నిబంధన సంఘమైన మనకోసం చెబుతున్నారు కాబట్టి మనము కూడా ఆయన గొర్రెలమే! ఎప్పుడైతే దేవుడు, వారిని మనలను కూర్చుతారో అంత్యదినాలలో, అప్పుడు వారికి అనగా ఇశ్రాయేలు ప్రజలకు, మనకు అనగా అన్యజనుల నుండి రక్షించబడిన నూతన నిబంధన సంఘమునకు ఇద్దరికీ యేసుక్రీస్తు ప్రభులవారు కాపరిగా, నాయకుడిగా ఉంటారు!
పేతురు
గారు
ఇంకా
అడ్వాన్స్డ్ గా చెబుతున్నారు ఆత్మావేశుడై: ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. 5:4;
అనగా
మన
అసలైన
ప్రధాన
కాపరియైన
దేవుడు
ప్రత్యక్షమైనప్పుడు
ఆయన
ప్రతివానికిచ్చు
జీతం
తీసుకుని
వచ్చినప్పుడు
క్రీస్తుకోసం
నిలిచిన
మనం, శ్రమలు పడిన మనం, ఆయన సేవకోసం పాటుపడిన మనము మహిమ కిరీటం పొందుకుంటాము!
ప్రియ స్నేహితుడా! మరినీవు ఆయన కాపరత్వము లోనికి వస్తావా? ఆయన అపోస్తలుల బోధ క్రిందకు వస్తావా? ఆయనకోసం జీవిస్తావా? ఆయనకోసం ఫలిస్తావా? అప్పుడే నీకు ఆ మహిమ కిరీటం!
పౌలుగారు అంటున్నారు: మంచి పోరాటం పోరాడితిని నా పరుగు తుదముట్టించితిని. విశ్వాసమును కాపాడుకొంటిని! ఇక నాకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నారు. 2తిమోతి
4:7;
మరి నీకు అలాంటి కిరీటాలు కావాలంటే నీవు కూడా అలా విశ్వాసము కాపాడుకొని అలా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది!
మరి నీవు సిద్దమా!!!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-35వ భాగం*
మీకా 5:4—6
4. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును,
5. ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
6. వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ
మరియు రెండవరాకడ సమయంలో జరిగే
సంభవాలు ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఈ మూడు వచనాలలో మూడు
ప్రాముఖ్యమైన విషయాలు లేక మూడు
జరుగబోయే సంభవాలు కోసం వ్రాయబడ్డాయి!
మొదటిది ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు బలము పొంది తన మందను మేపును.
రెండవది:
ఆయన భూమ్యంతముల వరకు ప్రభలుడవుతాడు, సమాదానమునకు కారకుడవుతాడు
మూడవది:
కాపరుల నియామకం, వారు దేశాన్ని రక్షించడం.
(గతభాగం తరువాయి)
ఇక రెండవది: ఆయన భూమ్యంతముల వరకు ప్రభలుడవుతాడు, సమాదానమునకు కారకుడవుతాడు!
ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తుప్రభులవారి కోసమే వ్రాయబడింది. భూమిమీద అన్ని దేశాలలోను ప్రభలుడు అవుతారని, ఆయనే సమాధానమునకు కర్త అని సమాధాన రాజు అని, సమాధాన యువరాజు అని బైబిల్ లో చెప్పబడింది!
యెషయా గారు దీనికోసం చాలా వివరంగా ప్రవచించారు 9:6—7
6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
చూడండి!
ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది, అంటూ నిత్యుడగు తండ్రి అంటున్నారు. నిత్యుడగు తండ్రి అనగా యెహోవా దేవుడు! అనగా యేసుక్రీస్తు ప్రభులవారు యెహోవా దేవుని అవతారంలో భూమిమీద పుట్టారు అన్నమాట!
ఇక తర్వాత సమాధాన కర్తయగు అధిపతి అంటున్నారు. ఇంగ్లీష్ లో
Prince of Peace అని చెప్పబడింది. సమాధాన యువరాజు!
అందుకే యేసయ్య ఈ భూలోకము నుండి వెళ్ళిపోయే ముందు ప్రార్ధన చేస్తూ నా శాంతినే మీకిస్తున్నాను లోకమిచ్చునట్లుగా కాదు అంటున్నారు! యోహాను 14:27;
ఆయన శాంతినిచ్చువాడు! శాంతికి రాజు!
ఇక యేసయ్య శిష్యులను సువార్తకు పంపిస్తూ మీకు సమాధానం కలుగును గాక అని చెప్పమన్నారు. సమాధానము నకు కర్త అక్కడ ఉంటే ఆ సమాధానము వారికి కలుగుతుంది లేకపోతే అది తిరిగి మీ వద్దకే వస్తుంది అని చెప్పారు! లూకా 10:5--6;
ఇక యేసుక్రీస్తుప్రభులవారి పునరుత్తానం తర్వాత శిష్యులకు కనిపించి అంటున్నారు సమాధానము కలుగును గాక!
యోహాను 20:19, 21, 26.
కారణం ఆయన సమాధాన మిచ్చువాడే కాదు సమాధాన రాజు!
దూతలు ఆయన పుట్టినప్పుడు అంటున్నారు లూకా 2:14లో
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.
పౌలుగారు రాస్తున్నారు ఆత్మపూర్ణుడై ఎఫెసీయులకు 2: 14
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
ఇక తర్వాత
7వ వచనం ప్రకారం ఆయన కీర్తి వ్యాపిస్తుంది. ఇంకా ఆయన రాజ్యానికి అంతము లేదు అంటున్నారు. స్టడీ బైబిల్ లో ఇలా రాసి ఉంది: ఆయన రాజ్య విస్తీర్ణానికి, శాంతికి అంతము అంటూ ఉండదు! అనగా భూమి చివరి కొనవరకు ఆయన పేరు, ఆయన రాజ్యము వ్యాపిస్తుంది. అవును ఇప్పుడు ప్రపంచంలో గల దేశాల అన్నింటిలోను ఆయన పేరు తెలుసు! ఆయన పాపము లేనివాడని కూడా తెలుసు! ఒకవేళ ఎవరికైనా తెలిసియుండక పోతే చెప్పాల్సిన భాద్యతను దేవుడు మనకు ఇచ్చారు!
ఇంకా దీనికోసం ఆలోచిస్తే
యెషయా 11:4
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
దానియేలు గ్రంధంలో అంటున్నారు
2:34—35, 44
34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.
35. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను.
44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
ఆయన
కీర్తిగలవాడు! రారాజు! అలా అవ్వడానికి ఆయన ప్రేమ చూపించడమే కాకుండా వెలకట్ట లేని వెల చెల్లించారు. తన సొంత రక్తాన్నే చిందించారు.
ఇక మూడవ విషయం కోసం ఆలోచిస్తే: : కాపరుల నియామకం, వారు దేశాన్ని రక్షించడం.
ఇది
చెప్పకముందు
గమనించవలసిన
ప్రాముఖ్యమైన
విషయం ఏమిటంటే ఈ
మీకా 5:4 వరకు దేవుడు
ఒక్కడిగానే
మాట్లాడారు! అయితే ఈ
ఐదవ వచనంలో మేము
అని మాట్లాడుతున్నారు. ఇక్కడ
మేము అనగా దేవుడు
మరియు మీకా గారా? కానేకాదు! ఇది
తప్పకుండా త్రిత్వమై యున్న
దేవుడు పలికే మాటగానే
కనిపిస్తుంది! ఇక్కడ తండ్రియైన
దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు
కలసి మాట్లాడుతున్నారు అన్నమాట!
సరే ఇక్కడ అస్సూరు వారు ఇశ్రాయేలు వారి మీద దండెత్తి వస్తే వారిని రక్షించడానికి ఏడుగురు కాపరులను, ఎనిమిదిమంది ప్రధానులను లేక నాయకులను మేము నియమిస్తాము అంటున్నారు త్రిత్వమై యున్న దేవుడు!
ఇక్కడ అస్సూరు వారు అంటున్నారు ఎందుకంటే ఆ కాలంలో అనగా మీకా
గారి కాలంలోనే అస్శూరు వారు
ఇశ్రాయేలు మీద
దండెత్తి వారిని చెరలోనికి తీసుకుని పోయారు కాబట్టి అస్సూరు వారు
అని అనియుండవచ్చు అని నా
ఉద్దేశం అయితే
ఇక్కడ అస్సూరు వారు అనగా
ఇశ్రాయేలు ప్రజలకు లేక దేవుని ప్రజలకు విరోధులు అని గ్రహించాలి!
ఇక
ఏడుగురు
కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు యొక్క ఆత్మీయ అర్ధం లేక మర్మం నాకు తెలియదు! బహుషా దేవుని ఏడు నేత్రములు, దేవుని ఏడాత్మలు కావచ్చేమో!
లేదా
ఇది
నూతన
నిబంధన
సంఘానికి
మొదటినుండి
సాదృశ్యంగా
ఉంది
కాబట్టి
ఇక్కడ
ఏడు
అనేది
సంపూర్ణ
సంఖ్య. అనగా మెల్కీసెదెకు క్రమంలో గల అపొస్తలుల భోధ క్రింద గల నూతన నిబంధన సంఘములో గల కాపరులు!
ఇక
ఎనిమిది
మంది
ప్రధానులు
లేక
నాయకులు
అదే
నూతన
నిబంధన
సంఘములో 1కొరింథీ 12:28లో
దేవుడు
నియమించిన
ఎనిమిది
పరిచర్య
ధర్మములు
కావచ్చును!
ఇక్కడ
అస్సూరు
తప్పకుండా
సాతాను
గాడి
సైన్యానికి
సాదృశ్యం!
అయితే గమనించవలసిన విషయం
ఏమిటంటే నేను
కాపరులను నియమిస్తాను,
సంరక్షకులు పుడతారు అంటూ మిగతా
ప్రవక్తల గ్రంధాలలో కూడా వ్రాయబడిఉంది.
యిర్మియా 3: 15
నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
యిర్మియా 23:4
నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
అయితే ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఓబద్యా గారి ప్రవచనం వలె ఉంది.
ఓబద్యా 1: 21
మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.
ఇలా రక్షకులు పుట్టి ఇశ్రాయేలు ప్రజలకు సంపూర్ణ విమోచనం కలిగి,
వారు రక్షించబడిన తర్వాత రాజ్యము యెహోవాది అవుతుంది. అప్పుడు యెహోవా భూమి యంతటికి రాజవుతారు! అప్పుడు ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమై, అంతము లేనిదై యుంటుంది
మరి ఆ శాశ్వత రాజ్యములోనికి నీవు వస్తావా?
అలా రాడానికి నీవు సిద్దపడ్డావా?
గమనించాలి నిషిద్దమైనవి ఆయన రాజ్యంలో ప్రవేశించవు తెలుసా?
మరి నిషిద్ధమైనవి నీలో ఏమైనా ఉన్నాయా ఒకసారి గమనించుకో!
అంతేకాదు ఈ క్వాలిటీలు ఉన్నవారు ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించరు
® 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
® ప్రకటన గ్రంథం 21: 8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
® ప్రకటన గ్రంథం 22: 15
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
మరి నీవు ఏ గుంపులో నున్నావు? ఎత్తబడే గుంపా / విడువబడే గుంపా?
పరలోక ప్రియునితో ఆనందించే గుంపా లేక సాతాను గాడు వాడి దూతలతో పాటు అగ్ని గంధకాలలో కాలిపోయే గుంపా?
తొందరగా నిర్ణయించుకో!
నరకంలో బాధలు నీవు పడలేవు అని గుర్తుంచుకో!
ఆ బాధలు తప్పించేవాడు కేవలం యేసయ్య మాత్రమే అని కూడా తెలుసుకో! కారణం ఆయన అంటున్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై యున్నాను! నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని అనగా దేవుని యొద్దకు రాలేరు!
మరి ఆ మార్గములో నీవున్నావా?
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-36వ భాగం*
మీకా 5:4—6
4. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును,
5. ఆయన సమాధానమునకు కారకుడగును, అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము.
6. వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు, అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ
మరియు రెండవరాకడ సమయంలో జరిగే
సంభవాలు ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక ఈ మూడు వచనాలలో మూడు
ప్రాముఖ్యమైన విషయాలు లేక మూడు
జరుగబోయే సంభవాలు కోసం వ్రాయబడ్డాయి!
మొదటిది ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభులవారు బలము పొంది తన మందను మేపును.
రెండవది:
ఆయన భూమ్యంతముల వరకు ప్రభలుడవుతాడు, సమాదానమునకు కారకుడవుతాడు
మూడవది:
కాపరుల నియామకం, వారు దేశాన్ని రక్షించడం.
(గతభాగం తరువాయి)
ఇక మూడవది: కాపరుల నియామకం, వారు దేశాన్ని రక్షించడం.
ప్రియులారా!
ఇక 6వ వచనం చూసుకుంటే వారు అస్శూరు దేశాన్ని దాని గుమ్మముల వరకు ఆక్రమిస్తారు, నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుతారు అంటున్నారు. ఇంకా అస్సూరీయులు మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగు రక్షించును అంటున్నారు. ఎలాగు రక్షిస్తారు? అంటే గతభాగంలో చెప్పిన విధంగా కాపరులను, ప్రధానులను రక్షకులను దేవుడు నియమిస్తారు. వారి ద్వారా దేశాన్ని రక్షిస్తారు!
మరి ఇక్కడ అస్సూరు దేశాన్ని దాని గుమ్మముల వరకు ఇంకా నిమ్రోదు దేశం అంటున్నారు—మరి అస్సూరు దేశం ఉంది గాని నిమ్రోదు దేశం లేదు కదా!!!
అస్సూరు అనగా ఉత్తర
ఇరాక్ అని
అనేకసార్లు చెప్పడం జరిగింది మరి
నిమ్రోదు దేశం
అంటే అర్ధం
కావాలంటే మనం
ఆదికాండం 10వ అధ్యాయానికి వెళ్తే మనకు అర్ధం
అవుతుంది. 10:8—12
8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
9. అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పర క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.
10. షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
11. ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
12. నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.
దీని ప్రకారం బాబెలు,
ఎరెదు, అక్కదు, కల్నే, ఇంకా నీనెవే రహెబోతు, కాలహును, రెసెను ఇవన్నీ నిమ్రోదు రాజ్యంలో పట్టణాలు లేక ప్రాంతాలు! ఇవన్నీ ప్రస్తుతం ఇరాక్ లోనే ఉన్నవి.
ఉత్తర ఇరాక్ (అస్సూరు) దక్షిణ ఇరాక్ (బబులోను).
కాబట్టి దీని ప్రకారం ఈ విరోధులంతా ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా దండెత్తి వస్తే ఇశ్రాయేలు ప్రజలు వారిని దేవుని సహాయంతో జయించి ఆ ప్రాంతాలను ఖడ్గము చేత ఏలుతారు అన్నమాట!
ఇది కూడా అంత్యదినాలలో జరిగే సంభవమే! యెషయా గారు ముందుగానే ఆ రాజ్యాలను ఏలుతారు అని ప్రవచించారు.
ఇక తర్వాత రెండు వచనాలు చూసుకుంటే మీకా 5:7,8
7. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనుష్య ప్రయత్నములేకుండను నరులయోచన లేకుండను గడ్డిమీదపడు వర్షమువలెను ఆయా జనముల మధ్యనుందురు.
8. యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
ఈ రెండు వచనాలలో శేషించిన వారు అంటూ వ్రాయబడింది. అనగా చెరలోనికి పోయి తిరిగి వచ్చిన వారు,
ఇంకా ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన శేషం ఎలా ఉండబోతుందో చెబుతున్నారు! నిజానికి ఇది చెర తర్వాత జరిగే సంభవాన్ని సూచించినా ఈ రెండు అధ్యాయాలు అంత్యదినాలలో జరుగబోయే సంభవాలు కోసం వ్రాయబడ్డాయి కాబట్టి ఇది అంత్యదినాలలో జరిగేది అని గ్రహించాలి!
దీనికోసం జెకర్యా గ్రంధంలో ఇశ్రాయేలు వారు
ఎలా ఉంటారో చాల విస్తారంగా వ్రాయబడింది
జెకర్యా 9:13,15,16
13. యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.
15. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు, వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు.
16. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.
10:5,6
5. వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.
6. నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.
Zechariah(జెకర్యా) 12:2,3,6,7,8
2. నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.
3. ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.
6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో నివసించుదురు.
7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.
8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
ఇక తర్వాత వచనాలు ధ్యానం చేసుకుంటే మీకా 5: 9
నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక, నీ శత్రువులందరు నశింతురు గాక.
పై వచనాలలో ఇశ్రాయేలు
ప్రజలు ఎలా
వారి విరోధులను బాదిస్తారో వ్రాయబడింది
ఇక 10వ వచనం”...మీకా 5: 10
ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును,
ఇక్కడ గుఱ్ఱములుండకుండా ఎందుకు చేస్తాను అంటున్నారు అంటే మొదటగా వాటిని చూచి గర్వించారు కాబట్టి.
కీర్తనలు 20: 7
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
ఇక రెండవదిగా: అప్పుడు యుద్ధములే ఉండవు కాబట్టి,
యెహోవా భూమి అంతటికీ రాజయ్యారు కాబట్టి. మీకా 2:12—13,
12. యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.
13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును.
జెకర్యా 14: 9
యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
దీనికోసం జెకర్యా గ్రంధంలో కూడా వివరంగా వ్రాయబడింది 9:10
ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును.
ఇంకా అప్పుడే యెషయా 65వ అధ్యాయంలో
వ్రాయబడిన సంభవాలు కలుగుతాయి. అనగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి
కలిగాక కలిగే
సంభవాలు 65:20,22,25
20. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును
22. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
25. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇంకా కొన్నిచోట్ల యుద్ధము చేయుట నేను
మాన్పించెదను అంటున్నారు.
ఇక తర్వాత వచనాలు చూసుకుంటే 11—15
11. నీ దేశమందున్న పట్టణములను నాశనముచేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలముచేతును.
12. మేఘములను చూచి మంత్రించు వారు ఇక నీలో ఉండరు.
13. నీచేతిపనికి నీవు మ్రొక్క కుండునట్లు చెక్కిన విగ్రహములును దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును,
14. నీ మధ్యను దేవతా స్తంభములుండకుండ వాటిని పెల్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును.
15. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతికారము చేతును; ఇదే యెహోవా వాక్కు.
చూడండి
10వ వచనంలో గుర్రాలు లేకుండా నాశనము చేతును రధములను మాన్పిస్తాను అన్నారు. ఎందుకు అన్నారంటే యెహోవా రాజై యుంటారు కాబట్టి అలా జరుగుతుంది అని చూసుకున్నాము. బాగుంది. గాని ఇప్పుడు పట్టణాలను నాశనం చేస్తాను కోటలను పడగొడతాను అంటున్నారు ఎందుకు?
దానికి జవాబు కూడా దాని తర్వాత మాటలలోనే ఉంది! ఎందుకంటే ఆ పట్టణాలలో కోటలలో భయంకరమైన విగ్రహారాధన జరిగింది. నిరపరాధుల రక్తముతో ఆ కోటలు పట్టణాలు నిండిపోయాయి. ఇంకా చిల్లంగితనము మంత్రాలు చేసే వారు, మేఘాలను చూసి మంత్రించు వారు, జాతకాలు జ్యోతిష్యం చెప్పేవారు ఉన్నారు. అందుకే దేవుడు వాటిని నాశనం చేస్తాను అంటున్నారు. దేవుని రాజ్యంలో ఇలాంటి అపవిత్రమైన హేయమైన క్రియలకు తావులేదు!
హోషేయ 10:14, 15
14. నీ జనుల మీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లలమీద తల్లులు నేలను పడవేయబడుదురు.
15. ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలనుబట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును.
ఆమోసు 5:9
ఆయన పేరు యెహోవా; బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.
ద్వితీ 18:10—12
10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను
11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.
12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.
యెషయా 2: 6
యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.
యెషయా 8: 19
వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?
ఇంకా యెషయా 2: 18
విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
యెహేజ్కేలు 6: 9
మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతక మైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు
హోషేయా 10: 2
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అప రాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.
జెకర్యా 13: 2
ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.
యిర్మియా 2: 28
నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా,
నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.
యెహేజ్కేలు 16: 24
నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలి పీఠములను ఏర్పరచితివి,
అందుకే దేవుడు వీటిని నాశనం చేస్తాను అంటున్నారు.
ప్రియ స్నేహితుడా! నీలో ఇంకా ఏవైనా విగ్రహాలు ఉన్నాయా?
దేవుడు వాటిని నాశనం చేస్తాను అంటున్నారు. దేవునికి ఇష్టం లేనిది విగ్రహారాధన! విగ్రహారాధన అంటే కేవలం విగ్రహానికి పువ్వుపెట్టి, దండవేసి, ఊదొత్తి పెట్టి పూజించడమే కాదు! దేవుని కన్నా నీవు దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే! నీ మొదటి స్థానం/
ప్రయారిటీ దేవుడే కావాలి!
మరి దేనికైనా ఇస్తే నీవు దేవునికి శత్రువు అయిపోతావు నీవు విగ్రహారాదికుడవు అయిపోతావు!
కాబట్టి దేవునికే ప్రాధాన్యత నిద్దాం!
ఆయన బిడ్డలుగా జీవిద్దాం!
ఆయన రాకడకు ఎత్తబడదాం!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-37వ భాగం*
మీకా 6:1--2
1. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.
2. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. ఇంతవరకు మనం 5 అధ్యాయాల నుండి యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ
మరియు రెండవరాకడ సమయంలో జరిగే
సంభవాలు ధ్యానం చేసుకున్నాము!
ఇక 6వ అధ్యాయంలో
దీనికోసం చెప్పటం లేదు!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు.
ఊరికినే మోపడం
లేదు, వారు చేసిన ఘోరమైన తిరుగుబాటు, విగ్రహారాధనలను చూపిస్తూ వారు
చేసిన నేరాలు ఎత్తి రాస్తున్నారు. హోషేయ గ్రంధంలో కూడా
దేవుడు ఇలానే
ఇశ్రాయేలు ప్రజలు మరియు ఇశ్రాయేలు దేశానికి చుట్టుపక్కల గల దేశాల
ప్రజలు చేసిన
నేరాలను ఎత్తి
రాస్తూ అందుకు దేవుడు విధించిన శిక్ష కూడా
రాశారు!
ఇక్కడ ఒకసారి ఆగుదాం! ఈ అధ్యాయంలో ప్రవక్త దేవుని హృదయాన్ని అర్ధం చేసుకుని ఆయన హృదయవేదనను అర్ధం చేసుకుని ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు. ప్రవక్తకు, సేవకునికి ఉండవలసిన లక్షణం: దేవుని హృదయాన్ని అర్ధం చేసుకోవడం! దేవుని హృదయాన్ని కలిగి ఉండటం! దావీదు గారు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకున్నారు. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన వ్యక్తి అనే దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అందుకే దేవుడు గొర్రెలు కాసే దావీదు గారిని చక్రవర్తిని చేశారు. ఇలా దేవుని హృదయాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తులు బైబిల్ లో చాలామంది ఉన్నారు గాని ఇద్దరినీ మాత్రం జ్ఞాపకం చేసుకుందాము!
ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి మోయాబు రాజైన బాలాకు ప్రవక్తయైన బిలాముని రప్పిస్తాడు. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చివేస్తే డబ్బుకోసం ఆశించిన బిలాము మోయాబు రాజైన బాలాకుకి తప్పుడు సలహా ఇస్తే దాని ప్రకారం మోయాబు స్త్రీలతో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు తెగులు మొదలయ్యింది. అప్పుడు ఒక మిద్యాను నాయకుడి కూతురితో ఇశ్రాయేలు గోత్రపు నాయకుడి కొడుకు పాపం చేస్తుంటే ఆహారోను మనుమడు, ఎలియాజరు గారి కుమారుడైన ఫీనేహాసు గారు ఒక బల్లెము తీసుకుని ఇద్దరినీ ఒక్కపోటు పొడిస్తే అక్కడ వారు చస్తారు. వెంటనే తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ తిరుగులేనిది. Remarkable!! నేను ఓర్వలేని దానిని ఫీనేహసు ఓర్వలేకపోయాడు అంటూ అతనిని దీవించారు దేవుడు!
Numbers(సంఖ్యాకాండము) 25:8,10,11
8. సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.
10. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,
11. వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.
ఇక్కడ ఫీనేహాసు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకున్నారు కాబట్టి సరియైన పని చేశారు,.
అలాగే దేవుని ప్రవక్త సేవకుడు దేవుని హృదయాన్ని అర్ధం చేసుకోవాలి! ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి!
మరో వ్యక్తి ఏలీయా గారు! ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ఘోరమైన కార్యాలు చూసి కుమిలిపోతుంటే దేవుడు వెంటనే వాక్కు నిచ్చారు వెంటనే చెబుతున్నారు నా మాట గాక! నేను మరలా చెప్పేవరకు వర్షం గాని మంచు గాని పడదు; నిజంగా మూడున్నర సంవత్సరాలు అలాగే జరిగింది!
ప్రియ దైవజనుడా! అట్టి దేవుని మనస్సు దేవుని హృదయం నీవు కలిగియున్నావా?
అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో మీకా గారు కూడా దేవుని హృదయాన్ని అర్ధం చేసుకుని అదే మాదిరిగా అనగా దేవునికి గల ఆ ఆవేశం, బాధ, వేదనను తన మాటలలో అదే తీవ్రతతో చెబుతున్నారు. అనగా దేవుడు ఏడిస్తే మీకాగారు ఏడుస్తున్నారు. ఆయన కోప్పడితే ప్రవక్త కోప్పడ్డారు! ఆయన నవ్వితే ఈయన నవ్వారు! ఆయన ఏమి చేస్తే ప్రవక్త దానినే తన మాటలలో హావభావాలలో చూపిస్తున్నారు. ఇదే దేవునికి మానవ ప్రవక్తలనుండి దైవసేవకుల నుండి కావాలి!
సరే, ఈ అధ్యాయంలో దేవుడు తన సొంత జనులైన ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని చూసుకున్నాము! అయితే ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఒక కోర్టు దృశ్యంలా కనిపిస్తుంది. ఈ కోర్టు గదిలో మాత్రం విశాల ప్రకృతి,
పర్వతాలు కొండలూ ఆయనకు సాక్షులుగా ఉన్నారు. ఇదేమాటలు యెషయా 1:2 లో కూడా ఉన్నాయి.
గమనించాలి- మొదటి బాగాలలో చెప్పిన విధంగా మీకా గారి ప్రవచనాలు యెషయా గారి ప్రవచనాలు ఎక్కువగా ఒకేలాగా ఉంటాయి. రెండవ అధ్యాయం మీకా గారి నాల్గవ అధ్యాయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ యెషయా గారి మొదటి అధ్యాయంలో కొన్ని సన్నివేశాలతో ఈ అధ్యాయం పోలి ఉంటుంది. చూద్దాం యెషయా 1:2
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
.. చూడండి ఇక్కడ దేవుడు తన బాధను ఆకాశంతోనూ భూమితోను చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఈ రెంటిని మనుష్యులకు సాక్షులుగా పెట్టారు. వీరిద్దరినే ఎందుకు పెట్టారు అంటే మానవుడు చేసే పాపాలు ఆకాశం క్రిందను, భూమి మీదనే చేస్తాడు కాబట్టి, మరెక్కడికి వెళ్ళలేడు కాబట్టి వీరినే సాక్షులుగా పెట్టారు. అందుకే వీరికే తన బాధను చెప్పుకుంటున్నారు. ఇంకా అంటున్నారు నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, ఇప్పుడు వారు నామీద తిరగబడుతున్నారు అని బాధపడుతున్నారు. ఇంకా క్రిందకు చూస్తే Isaiah(యెషయా గ్రంథము)
1:3,4,5,6,7
3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.
5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.
6. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయు చున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.
ఇదీ దేవుని బాధ!
సరే దేవుడు ఇలా వారు చేసిన
నేరాలు చెబుతూ ఈ అధ్యాయంలో మీరు ఈ నేరాలకు ప్రతివాదం ఏమైనా చేస్తే ధైర్యంగా చెప్పండి అని చెబుతున్నారు.
మొదటి వచనం చూద్దాం!
యెహోవా సెలవిచ్చుమాట ఆలకించండి! నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యెమాడుము అంటున్నారు. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము అంటున్నారు.
ఇంకా రెండవ వచనంలో తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు అంటున్నారు. సరే,
ఇక్కడ మొదటగా ఇశ్రాయేలు ప్రజలమీద వ్యాజ్యెము కలదు అంటూ తర్వాత మాటలలో పర్వతములారా యెహోవా చెప్పే వ్యాజ్యము ఆలకించుడి అంటున్నారు.
ప్రియ స్నేహితుడా! అక్కడ ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటూ చెప్పిన దేవుడు,
ఇక్కడ పర్వతాలను సాక్ష్యంగా పెట్టారు. అనగా ఒకరోజు నీవు చేస్తున్న ప్రతీ పనికిమాలిన పనికి, ప్రతీ మంచి పనికి, ప్రతీ పాపమునకు ఈ ప్రకృతిలో గల కొండలు, లోయలు పర్వతాలు నీమీద సాక్ష్యం పలుకుతాయి అని గ్రహించు! ఎవరూ చూడటం లేదు కదా అని పాపాలు చేసేస్తున్నావేమో జాగ్రత్త! దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టారు. ఇంకా ఈ కొండలు పర్వతాలు కూడా నీమీద సాక్షులుగా ఉన్నారు.
ఇవన్నీ నీమీద సాక్ష్యం పలకబోతున్నాయి. నీకు తప్పించుకునే వీలు లేదు! వీరితో పాటు సాతాను గాడు కూడా మీమీద సాక్ష్యం పలకబోతున్నాడు జాగ్రత్త!
(అయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు కొండలను సాక్ష్యానికి పిలవడానికి మరో కారణం కూడా ఉంది అది ఏమిటంటే ఈ ప్రతి కొండమీద పచ్చని ప్రతీ చెట్టుదగ్గర వీరు విగ్రాహాలు పెట్టి వ్యభిచారం చేశారు అని దేవుడు చెప్పారు. 1 రాజులు 14:23; 2రాజులు 16:4; 17:10; అందుకే వీటిని కూడా సాక్ష్యం పెట్టి ఉండవచ్చు. అయితే ఇది మనకు అప్రస్తుతం!)
కాబట్టి ప్రియ సహోదరి/ సహోదరుడా! నేడే జాగ్రత్తపడి నీ
పాప జీవితాని విడిచిపెట్టి దేవుని పాదాలను పట్టుకో!
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-38వ భాగం*
మీకా 6:3—4
3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మునేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.
4. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని గతభాగంలో చూసుకున్నాము!
ఈ రెండు వచనాలలో దేవుడు మోపిన మొదటి నేరం కనిపిస్తుంది. నాజనులారా నేను మీకేమి చేసితిని అనగా మీకేమి అన్యాయం చేశాను మీకు అని అడుగుతున్నారు! మిమ్మల్ని ఎప్పుడు ఎలాగు ఆయాసపరచితిని అని అడుగుచున్నారు? ఏదైనా ఉంటే నాతో చెప్పండి అంటున్నారు. గమనించాలి దేవుడు ఎప్పుడూ ఇశ్రాయేలు ప్రజలను ఊరకనే ఆయాసపరచడం గాని వారిని బాధపెట్టడం గాని చెయ్యలేదు! గాని ఇశ్రాయేలీయులే దేవుణ్ణి అనేకసార్లు ఆయాసపెట్టారు. దుఃఖపెట్టారు. మాటిమాటికి తప్పిపోయారు.
కీర్తన 78:41
మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.
యెషయా 1,2 అధ్యాయాలలో ఇలాగే బాధపడ్డ్డారు దేవుడు!
యిర్మియా గ్రంధంలో కూడా
ఇలాగే అడుగుచున్నారు దేవుడు! యిర్మియా 2:5
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?
ఇక్కడ యిర్మియా 2వ అధ్యాయం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు అడిగే మాటలు ఎలా ఉంటాయి అంటే: ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత, ఆ స్త్రీ దారితప్పి, మరొక పురుషుని దగ్గరకు వెళ్లి బహిరంగంగా దొరికిపోయినప్పుడు ఆ పురుషుడు నిలదీసి అడిగినట్లు ఉంటుంది ఈ సన్నివేశం! నాయందు ఏ పాపము చూసి, నీవు ఇలా తయారయ్యావు? ఎందుకు నీవు నీ శీలాన్ని పాడుచేసుకున్నావు? నేను నిన్ను బాగా చూసుకోలేదా? నీకు ఏమి తక్కువ చేశాను!
నీకు ఏమి లోటుచేశాను అని అడిగినట్లు ఈ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ అడుగుచున్నారు దేవుడు నాలో ఏ తప్పు చూసి మీ పితరులు నన్ను విడిచి తొలగిపోయారు? నిజదేవుడైన నన్ను వదిలేసి సృష్టిని ఎందుకు పూజిస్తున్నారు అని అడుగుచున్నారు!!! నేను మీకు ఎక్కడ మీ ఎడల అన్యాయం చేశాను అని అడుగుచున్నారు!
ఇక విసికి పోయి యెషయా 1:11—15 లో అంటున్నారు : నా సన్నిధిలోకి మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము
నాకు అసహ్యము! మీరు చేతులు చాపి ప్రార్ధన చేస్తే నా
కన్నులు మూసుకుంటాను అంటున్నారు. మీరెంత ప్రార్ధన చేసినా నేను వినను
అంటున్నారు......Isaiah(యెషయా
గ్రంథము) 1:12,13,15
12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?
13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపుల గుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.
15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
ఇంకా అంటున్నారు 4వ వచనంలో మిమ్మల్ని ఐగుప్టు దేశం నుండి మిమ్మల్ని రప్పించాను దాస్య గృహంలోనుండి మిమ్మల్ని విమోచించాను. మిమ్మల్ని నడిపించడానికి మోషే ఆహారోను మిర్యాములను పంపించాను అంటున్నారు.
ఇక్కడ ఈ వచనంలో వారికోసం ఏమేమి చేశారో వాటిలో కొన్నింటిని ఎత్తి చెబుతున్నారు! మీరు భయంకరమైన దాస్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ దాస్యం విడిపించి ఈ దేశానికి రప్పిస్తే ఇప్పుడు విమోచకుడనైన నన్ను వదిలేశారు. మిమ్మల్ని నడిపించడానికి మోషే ఆహారోను మిర్యాములను పంపించాను అంటున్నారు.
నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు మోషేగారిని ఏర్పరచుకున్న విధానం, ఆయన వారిని నడిపించిన విధానం, ఇంకా ఆహారోనుకి యాజకత్వము ఇచ్చి ధర్మశాస్త్ర విధులను చెయ్యాల్సిన విధానం నేర్పించడం, ఇంకా మిర్యాము స్తుతించడం, ఇంకా వీరి ముగ్గురిమీద ప్రజలు సణగుకోవడం, ఇంకా ఆహారోను-మిర్యాములు కూడా మోషే గారిమీద సణగుకోవడం, ఇంకా వీరిమీద సణగుకొన్న వారిమీద దేవుడు తీర్పు తీర్చి నాశనం చెయ్యడం అంతా వీరికి తెలుసు! ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, యోర్దాను నదిని పాయలుచెయ్యడం, అరణ్యంలో 40 ఏళ్ళు మన్నాతో పోషించడం, అన్ని యుద్దాలలోను విజయాన్నివ్వడం, వీరుచేసిన యుద్దాలకంటే దేవుడు పంపించిన కందిరీగలు, ఈగలు, వడగండ్లద్వారా అనేకులను నాశనం చెయ్యడం అంతా ఈ తరం వారికి తెలుసు! అయినా మీరుకూడా నన్నెందుకు వదిలి అన్యుల విగ్రహాల వెనుక పోతున్నారు అంటున్నారు!
ప్రియ స్నేహితుడా! ఇదే ప్రశ్న నిన్ను కూడా అడుగుచున్నారు దేవుడు—మిమ్మల్ని కూడా పాప బంధకాలలో ఉండగా, రోగాలతో
త్రాగుడు
జీవితంలో
భయంకరమైన
వ్యభిచారంలో
ఉండగా పిలుచుకుని రక్షించి తన రక్షణ భాగ్యము ఇస్తే ఇప్పుడు తుచ్చమైన కోరికలు కోసం ఎందుకు నన్ను వదిలేస్తున్నారు అని దేవుడు అడుగుచున్నారు! మన అందరికోసం
తన సొంత ప్రాణాన్ని ఇచ్చారు కదా! తన సొంత
రక్తాన్ని
కార్చారు
కదా! నీకోసం భయంకరమైన దెబ్బలు తిన్నారు కదా! ఎన్నెన్నో అవమానాలు పొందారు కదా! పిడిగుద్దులు
తిన్నారు
కదా! నీకోసం భయంకరమైన ముళ్ళ కిరీటం పొందారు కదా! అలాచేసి నిన్ను విమోచిస్తే ఇప్పుడు తుచ్చమైన కోరికలు కోసం, దురభిమానపాపం
కోసం మరలా ఆ పాతరోత జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఎందుకు మరలా ఆ పాత
ఆచారాలు? ఎందుకు అన్యాచారాలు? అవి మంచివి కావు వాటిలో జీవం లేడు అనే కదా నిజదేవుని దగ్గరకు వచ్చావు! మరి
ఎందుకు
మరలా ఆ పాత ఆచారాలు? దేవునిలో
ఏమి చూసి మరలా ఆ పాత అలవాట్లకు పాత వ్యభిచారానికి పాత అన్యాచారాలకు మరలి పోతున్నావు??? దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏడుస్తున్నారు. లోబడనోల్లని ప్రజలకోసం దినమంతా చేతులు చాపి పిలుస్తున్నారు. నీకోసం పరిశుద్ధాత్ముడు దుఖిస్తున్న్నాడు. మరి దేవుణ్ణి దుఃఖపరుస్తావా సంతోషపరుస్తావా?
ఆ కాలంలో దేవుడు వారిని నడిపించటానికి మోషే గారిని ఆహారోనును మిర్యామును పంపించారు.
ఈ కాలంలో మొదటగా నిన్ను నడిపించటానికి పరిశుద్దాత్ముని ఇచ్చి, ఇంకా అపోస్తలులను కాపరులను ప్రవక్తలను బోధకులను సేవకులను పెట్టారు. ఇంకా నిన్ను అనుదినము వెలిగించి నడిపించటానికి బైబిల్ ని సంపూర్ణంగా
రాసి ఇచ్చారు దేవుడు! మరి ఇంతమంది ఉండగా
ఇంతగొప్ప సాక్షి సమూహం ఉండగా
మరి ఎందుకు ఆ పాత
అలవాట్లు?పొరపాట్లు? పరిశుద్దాత్ముని ఏడిపిస్తావా లేక సంతోష
పెడతావా? నేడే తేల్చుకో!
దేవునితో సమాధాన పడు!
నీ తప్పులు నేడే ఒప్పుకో!
పరలోకాన్ని పట్టుకో!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-39వ భాగం*
మీకా 6:5
నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చుకొనుడి.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని గతభాగంలో చూసుకున్నాము!
ఇక ఈ 5వ వచనంలో అంటున్నారు నా
జనులారా! గమనించాలి
ఎంత కోపమున్నా ఆయన మన
తండ్రి కాబట్టి నా జనులారా అని ప్రేమతో పలకరిస్తున్నారు. ఆమోసు ౩:2లో అంటున్నారు ఈ భూలోకంలో ఉన్న
వంశాలన్నిటిలో మిమ్మల్నే నేను ఏర్పరచుకున్నాను. అందుకే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే మీరు చేసిన
నేరాలకు అపరాధాలన్నిటికీ మిమ్మల్ని
శిక్షిస్తాను అంటున్నారు.
సామెతల గ్రంధంలో అంటున్నారు తండ్రి తను ప్రేమించు కుమారుని శిక్షించు విధముగా మిమ్మల్ని శిక్షిస్తాను!
సామెతలు 3: 12
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
నా జనులారా యెహోవా నీతికార్యములను మీరు
గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించినది బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటను , ఇంకా షిత్తీము నుండి
గిల్గాలు వరకు
జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి అంటున్నారు.
ఇక్కడ రెండు
విషయాలు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెబుతున్నారు.
మొదటిది:
మోయాబు రాజైన బాలాకు యోచించినదానిని- అందుకు బిలాము అతనికి ఇచ్చిన ప్రత్యుత్తరం
రెండు:
షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన దానిని మనస్సుకు తెచ్చుకొనుడి
ఇప్పుడు మోయాబు రాజైన బాలాకు యోచించినదానిని అందుకు బిలాము అతనికి ఇచ్చిన ప్రత్యుత్తరం కోసం ఆలోచిద్దాం! ఇది మనకు సంఖ్యాకాండం 22—24 అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. ఈ సంఘటన జరుగక మునుపు అమోరీయుల రాజులైన సీహోను ఓగును ఇద్దరి రాజులను జయించి ఇద్దరి రాజ్యాలను ఆక్రమించుకోవడం జరిగింది. ఎప్పుడైతే అలా రెండు రాజ్యాలను జయించారో వెంటనే మోయాబు రాజు భయపడి ఇంత గొప్ప రాజ్యాలను అలవోకగా జయించిన ఇశ్రాయేలు ప్రజలతో మనం యుద్ధము చేసి గెలవలేము కాబట్టి మరో విధంగా వీరిని నాశనం చెయ్యాలి అనుకున్నాడు
Numbers(సంఖ్యాకాండము) 22:3,4
3. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.
4. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.
అలా యోచనచేసి ఆ ప్రాంతంలో ఉన్న
గొప్ప ప్రవక్త బిలామును పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అనుకున్నాడు.
5—6వచనాలు.
5. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెనుచిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.
6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.
చూడండి నీవు దీవించువాడు దీవించబడును శపించువాడు శపింపబడును .. ఇంతగొప్ప పేరు ప్రతిష్టలు గల గొప్ప ప్రవక్త!
అప్పుడు మొదటసారి దేవుడు వెళ్లొద్దు అని చెప్పారు. అందుకని వెళ్ళడం మానేస్తారు బిలాము!
అంతకంటే గొప్ప వ్యక్తులను ఎక్కువ కానుకలను రెండోసారి పంపిస్తాడు బాలాకు రాజు! మరలా నేను దేవుణ్ణి అడిగి చెబుతాను అన్నారు.
గమనించాలి ఒకసారి దేవుడు వెళ్లొద్దు అంటే వెళ్లొద్దు అంతే!
గాని రెండోసారి మరలా అడగటం ఎందుకు? చివరికి దేవుడు వెళ్ళమంటే బయలుదేరారు. దారిలో నోరులేని గాడిద ద్వారా బుద్ధి చెప్పిస్తారు దేవుడు! ఇంకా 22:12 లో నీవు ఆ ప్రజలను శపించకూడదు అని
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
సరే ఇక్కడ 37—39 వరకు బిలాము – బాలాకురాజుకు
చెప్పిన జవాబు
ఉంటుంది. ....
.Numbers(సంఖ్యాకాండము) 22:37,38,39
37. బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.
38. అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి?
ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.
39. అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు ...
ఇక 2౩వ అధ్యాయంలో రెండు సార్లు శాపాన్ని దేవుడు దీవెనగా మార్చుతారు 23:8—10
8. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.
9. మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
Numbers(సంఖ్యాకాండము) 23:19,20
19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
20. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.
ఇక
24వ అధ్యాయంలో కూడా మరోసారి దీవెన కలుగుతుంది అప్పుడు బాలాకు రాజుకి బిలాముకి జరిగిన సంభాషణ 24:10—14
10. అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.
11. నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను.
12. అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారము లను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.
13. యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?
14. చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ...
అలా చెప్పాక యేసుక్రీస్తు ప్రభులవారి మొదట
రాకడ కోసం
కొన్ని ప్రవచనాలు చెబుతారు ఈ ప్రవక్త!17,19 వచనాలు.
17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
19.యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
ఇక 24:25 లో అంతటా బిలాము లేచి
తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకు తన
త్రోవను వెళ్ళెను అని వ్రాయబడినా ఆ తర్వాత జరిగిన సంగతి
మనకు మిగతా
గ్రంధాలలో వ్రాయబడింది.
మొదటగా దేవుడు ఎందుకు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారో చెబుతున్నారు;
ద్వితీ 23:4—5
4. ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చు చుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.
5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిం చెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
యెహోషువా 24:9—10
9. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకులేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా
10. నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.
సరే, ఇక ఆ
తర్వాత
ఏమి జరిగిందో సంఖ్యా 25: 1—౩ లో చూసుకుంటే
ఇశ్రాయేలీయులు
షిత్తీము
లో దిగియుండగా వారు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారు అంటున్నారు ఇది మొదటిది. అలా వ్యభిచారం చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు
వారిని
లాలించి
తమ దేవతలకు బలులు అర్పించి ఆ దేవతలకు బలిచ్చిన వాటిని తినమని బలవంతం చేసి వారితో పాపం చెయ్యించారు. ఇది దేవునికి అసహ్యమైన క్రియ – మూడవ వచనంలో అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులు కొనెను అని వ్రాయబడింది. అసలు దేవుని పిల్లలు మోయాబు రాళ్ళతో వ్యభిచారం చెయ్యడం ఏమిటి? ఆ
రాజు ఇశ్రాయేలు ప్రజలను శపించి నాశనం చేద్దామని అనుకున్నాడు కదా మరి ఇదేమిటి? ఇష్టం లేకుండా వ్యభిచారం చెయ్యడానికి రాజు ఎలా ఒప్పుకున్నాడు? దానికి జవాబు మనకు సంఖ్యాకాండములో కనబడుతుంది.....
Numbers(సంఖ్యాకాండము) 31:14,15,16,17
14. అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.
15. మోషే వారితో మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా?
16. ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా?
అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.
17. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;
దేవునికి
ఇష్టం
లేనిది
విగ్రహారాధన, వ్యభిచారం అని ఈ బిలాముకి తెలుసు! అందుకే
డబ్బులు
కోసం
తప్పుడు
సలహా
ఇచ్చాడు
ఈ
ప్రవక్త! దానిని రాజు పాటించాడు. ఇశ్రాయేలు
ప్రజలు 24000 మంది చనిపోడానికి కారణం అయ్యాడు!
దేవుని
బిడ్డలు
ఈ
విషయం
జాగ్రత్తగా
గమనించాలి! ఒక దేవుని ప్రవక్త చెప్పవలసిన ఆలోచన ఇదేనా? దేవుని
బిడ్డలను
పాడుచెయ్యడానికి
ఒక
అన్యరాజు
ప్రయత్నం
చేస్తుంటే
వాడికి
ఈ
ప్రవక్త
సహకరించవచ్చా? అదీకూడా నీవు వీరితో వెళ్ళకూడదు వారిని శపించకూడదు వారు నా ప్రజలు అని దేవుడు చెప్పాక ఇంకా ఎందుకు?
సరే
వచ్చాడు.- వచ్చాక ఈ తప్పుడు సలహా ఎందుకు? అందుకే
చచ్చాడు! 22:10 లో కోరుకున్నాడు- నీతిమంతులకు కలిగే మరణం వంటి మరణం నాకు రావాలని , గాని
వచ్చిందా ? లేదే, ఈ
విషయం
తెలుసుకున్నారు
కనుకనే
చంపబడిన
ఇతర
రాజులతో
పాటు
ఈ
బెయేరు
కుమారుడైన
బిలామును
ఖడ్గముతో
హతం
చేసిరి
అని
వ్రాయబడిఉంది. ఇదే అధ్యాయం 31:8;
దేవుని బిడ్డలారా! దీనిని గమనించాలి! దేవుని బిడ్డలు- వారిని పాడుచేసే వారితో లాభం కోసం
కలువకూడదు! సహకరించకూడదు!
ఇలాంటి
తప్పుడు
మాట చెప్పిన మరో స్త్రీ కూడా ఉంది! ఆమె నయోమి! సర్వం పోగొట్టుకున్నాక, ముగ్గురు పురుషులను పోగొట్టుకున్నాక, తన కోడల్లతో
అంటుంది—మీరు
కూడా వెళ్ళిపొండి. వెళ్ళిపోయి తిరిగి మీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోండి అన్నాది. ఇంతవరకు
బాగుంది.ఓర్పా వెళ్ళిపోయి, రూతు ఉండిపోతే నీవుకూడా వెళ్ళిపో, నీ
తోటికోడలు
తన ఇంటివారి వద్దకు వారి దేవుళ్ళు వద్దకు వెళ్లిపోయింది నీవుకూడా నీ దేవుళ్ళ వద్దకు వెళ్ళిపో అంటుంది. రూతు 1: 15
ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.
ఇది నిజంగా ఒక రక్షింపబడిన దేవుని బిడ్డ అనవలసిన మాటేనా? ఆమె తన సొంత ప్రజలను దేవుళ్ళను వదిలి యెహోవా దేవుడే నిజమైన దేవుడని గ్రహించి వస్తుంటే కాదు కాదు, నీవు నీ దేవుళ్ళ వద్దకు వెళ్ళిపో అంటుంది! ఇది మంచిది కాదు!
ఈ రోజుల్లో చాలామంది తమ పాత విగ్రహారాధన వదలివేసినా, కొన్ని పెళ్లిళ్లకు పండగలకు అన్యులలో గల తమ చుట్టాలు ఇరుగుపొరుగువారు వచ్చి అమ్మా ఇది ఎలా చెయ్యాలి అని అడిగితే మీరు చెప్పకూడదు! అది తప్పు అని మీకు తెలుసుకదా! మరి వారితో ఆ తప్పులు పాపములు ఎందుకు చేయిస్తున్నారు. ఇది దురభిమాన పాపం కాదా???!!
సరే, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఓ ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు మిమ్మలను శపించాలని నాశనం చెయ్యాలని బిలామును పిలిపించి ఆలోచించినా నేను శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాను! అయితే ఆ తర్వాత తప్పుడు సలహాల వలన మీరు వారితో అనగా మోయాబు స్త్రీలతో పాపం చెయ్యడమే కాకుండా వారి విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నారు కాబట్టి వారిలో 24000 మంది చనిపోయారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి! మీరు కూడా ఆ విగ్రహారాధన, ఆ వ్యభిచారం మరలా చేస్తున్నారు. అందుకే మీమీద కూడా నేను తీర్పులు ప్రకటిస్తున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అంటున్నారు!
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-40వ భాగం*
మీకా 6: 5
నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చుకొనుడి.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని గతభాగంలో చూసుకున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక ఈ 5వ వచనంలో రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెబుతున్నారు.
మొదటిది:
మోయాబు రాజైన బాలాకు యోచించినదానిని అందుకు బిలాము అతనికి ఇచ్చిన ప్రత్యుత్తరం
రెండు:
షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన దానిని మనస్సుకు తెచ్చుకొనుడి
ఇక రెండవ విషయం కోసం ఆలోచిస్తే షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకోండి!
షిత్తీములో జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోన్నాము! అక్కడ ఇశ్రాయేలు ప్రురుషులు- మోయాబు స్త్రీలతోను మిధ్యాను స్త్రీలతోను వ్యభిచారం చెయ్యడమే కాకుండా వారి విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిని యెహోవా మీద తిరుగబడి పాపం చేసినందున 24000 మంది చనిపోయినట్లు చూసుకున్నాము! ఇక ఆ తర్వాత మోషేగారు చనిపోతారు. యెహోషువా గారికి నాయకత్వం అప్పగిస్తారు.
యెహోషువా మొదటి అధ్యాయం లో దేవుడు యెహోషువా గారికి ధైర్యం చెప్పడం, మూడురోజులలో మీరు యోర్దాను దాటిపోవాలి సిద్దంగా ఉండండి అని చెబుతారు దేవుడు!
ఇక రెండవ అధ్యాయంలో యెహోషువా వేగుల వారిని పంపడం,
వారిని రాహాబు అనే వేశ్య దాచడం, వారు తిరిగి రావడం, వారి పర్యటన ద్వారా దేవుడు కనాను దేశాన్ని తప్పకుండా ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించిన కనాను రాజులకు ధైర్యము చెడిపోయింది అనే విషయాన్ని గ్రహించడమే కాకుండా దేవుడు తమతో ఉన్నారనే భరోశా వారికి కలిగింది. అప్పుడు యెహోషువా యాజకులకు పెద్దలకు ఆజ్ఞాపించడం జరుగుతుంది—మీరు సిద్దంగా ఉండండి దేవుడు ఒక గొప్ప కార్యం చెయ్యబోతున్నారు మనం ఈ యోర్దాను నదిని దాటి వెళ్లి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాము.
బహుశా ఎవరైనా అడిగి ఉంటారేమో—ఈ యోర్దాను నదిని ఇన్ని లక్షలమంది ఎలా దాటుతాము?
అందుకు యెహోషువా గారు అని ఉండొచ్చు—దేవుడు ఏదో చెయ్యబోతున్నారు—అది నాకు తెలియదు!
మీరు మాత్రం సిద్దంగా ఉండండి. మనం మాత్రం సిద్ధంగా ఉందాము! అద్భుతాన్ని పొందుకుందాం! దీనిని ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు! యాజకుల కాళ్ళు యోర్దానును తాకిన వెంటనే యోర్దాను విడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువా గారి నాయకత్వంలో యోర్దాను దాటి కనాను దేశం వెళ్లారు. ఇక అక్కడ రాతి కత్తులు చేయించుకుంటారు, కారణం అది రాతియుగం అంతం ఆ దినాలు!
ఇక ఆ తర్వాత కనాను దేశం స్వాధీనం చేసుకొనే ముందుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సున్నతి చేసుకోమని చెబుతారు. వారందరూ సున్నతి చేసుకొంటారు గిల్గాలులో! గిల్గాలు అనగా దొరలింప బడుట! యెహోషువా 5:9
అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు.
అలాగే మనకు కూడా ఈ పాప భారం క్రీస్తు యేసు సిలువ ద్వారా తొలగిపోయింది. మన అవమానం కూడా పోయింది.
ఇప్పుడు ఆయన కోసం సాక్షిగా జీవిస్తూ ఆ రక్షణను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక
ఆ తర్వాత 40 సంవత్సరాలు తినిన మన్నా, వారు
ఆ దేశపు పంట తినిన వెంటనే మన్నా ఆగిపోతుంది.
దాని
తర్వాతనే
యెహోవా
సేనాధిపతితో
ముఖాముకి
కలుగుతుంది
యెహోషువా
గారికి! ఇక అదే
గిల్గాలులో
ఉంటూనే
యెరికో
కోటలు కేవలం స్తుతుల ద్వారా పడగొట్టారు!
కాబట్టి ఇన్ని ఘనమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసిన నన్ను వదిలి మీ పితరులు ఇతరదేవతలను పూజించారు. నన్ను అనేకసార్లు బాధపెట్టి నాకు సంతాపము కలిగించారు. వారి సంతానమైన మీరు కూడా అదే పనిని చేస్తున్నారు. కాబట్టి మీరు మారండి! బ్రతుకులు మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నారు.
ప్రియ విశ్వాసి ఒకవేళ నీవు కూడా
దేవుణ్ణి వదిలి
తిరుగుతున్నవేమో! జాగ్రత్త! దేవున్ని నీవు
సంతోషపెడుతున్నావా లేక
సంతాప పరుస్తున్నావా?
గమనించాలి పూర్వకాలంలో నరులను చేసినందుకు దేవుడు సంతాపపడి ఊరుకోలేదు,
జల ప్రళయం ద్వారా నాశనం
చేసేశారు.
దేవుడు కరుణామయుడే, దయామయుడే గాని దానికికూడా ఒక హద్దు
ఉంది! దేవుని ఉగ్రతను రేపకు! దేవుని కోపాన్ని రేపకు! నేడే మార్పునోంది పశ్చాత్తాప పడు!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-41వ భాగం*
మీకా 6:6—8
6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?
7.
వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని గతభాగంలో చూసుకున్నాము!
ప్రియులారా! పై
మూడు వచనాలు బైబిల్
గ్రంధంలో చాలా ప్రాముఖ్యమైన
వచనాలు అని నా
అభిప్రాయం! బైబిల్
లో నాకు నచ్చిన
వచనాలలో ఇవి ఒకటి! అసలు దేవుడు
మానవుణ్ణి ఎందుకు చేసుకున్నారు
అంటే తనను స్తుతించడానికి
ఇంకా దేవుడు మానవునితో
సంభాషించడానికి! అలా చెయ్యడానికి
కొన్ని నియమనిబంధనలు ఇచ్చారు
అయితే మానవుడు అవన్నీ
మీరిపోతున్నాడు. అందుకే అసలు
దేవుడు మానవునిలో ఏ
లక్షణాలు కోరుకున్నారు? ప్రాణం, ఆస్తి అంతస్తు
బలము ఆరోగ్యం ఇచ్చిన
దేవునికి మానవుడు ఏమి
తిరిగి ఇవ్వాలి అనేది
ఈ వచనాలలో స్పష్టంగా
కనబడుతున్నాయి!
6వ వచనం మొదట మానవుడు అయ్యా నిన్ను సంతోష పరచాలంటే ఏమి చెయ్యాలి అని అడిగినట్లు ఉంటుంది! దేనిని తీసుకొని వచ్చి నిన్ను సంతోష పెట్టాలి? ఏమి తీసుకొని వచ్చి దేవుడా నిన్ను చూడాలి! లేక నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రావాలి? నేను చేసిన పాపముల క్షమాపణకోసం దహనబలులు ఏడాది దూడలను అర్పించి నిన్ను దర్శించి నిన్ను శాంతి చెయ్యాలా? లేక వేలకొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన సుగంధతైలము తీసుకొస్తే నీకు సంతోషం కలుగుతుందా? లేకపోతే నేను చేసిన పాపాలకు పరిహారంగా నా పెద్ద కొడుకుని నీకు బలి ఇవ్వాలా? నా పాపానికి పరిహారం కలగడానికి నాకు పుట్టిన వారిని నీకివ్వాలా? అని అడిగితే దేవుడు దానికి 8వ వచనంలో జవాబు ఇస్తున్నారు ...... మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
చూడండి దేవుడు మనిషి నుండి ఏమి కోరుకుంటున్నారో!!!
మొదటగా:
న్యాయముగా నడచుకోవడం—అనగా నీతిన్యాయాలను పాటించాలి!
రెండు: కనికరమును ప్రేమించాలి అనగా అందరి యెడల కనికరం చూపాలి!
మూడు: దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి! అనగా దేవుని ఎదుట విర్రవీగకుండా దీనమనస్సు అనగా తగ్గింపు హృదయం కలిగి యుండాలి! అందుకే తననుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును తగ్గించు కొనువాడు హెచ్చింపబడును అని
యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పారు! మత్తయి 23:12; లూకా 14:11; 18:14;
ఇంతేకదా యెహోవా నిన్ను అడుగుచున్నారు అంటున్నారు.
నిన్ను
కొండలు
ఎక్కమనలేదు! బలులు అర్పించమని చెప్పలేదు! నీకున్నదంతా దేవునికిచ్చేయ్ అనలేదు! లేదా ఇంకా ఏదేదో చెయ్యమని కోరలేదు! కేవలం పై మూడుంటిని పాటించమని చెబుతున్నారు.
గమనించాలి పై మూడుంటిని పాటించడం ద్వారా దేవునికి నీవు ఏమీ ఇవ్వడం, లేదు దానివలన దేవునికి ఏమీ లాభం లేదు!
మరి
ఎవరికి
లాభం? మానవులకు మాత్రం! దీని ప్రకారం దేవునికి కావలసింది మనుషుల మధ్య ప్రేమానురాగాలు వర్ధిల్లి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంతే! దేవునికి ఇంకేమి అక్కరలేదు! కోపాలు తాపాలు హత్యలు దోచుకోవడం లాంటివి దేవునికి పడవు!
ఒక్కసారి 6,7 వచనాలు చూసుకుంటే ఏవి తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి అంటే దేవుడు మన ఆస్తులను కోరడం లేదు.
మన హృదయాలను కోరుతున్నారు. ముఖ్యంగా పవిత్రమైన హృదయం కావాలి దేవునికి.
నీ బలులు ఆయనకు అవసరం లేదు.
సమూయేలు గారు అంటున్నారు: 1సమూయేలు 15: 22
అందుకు సమూయేలు-తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.
ఇక
తైలం
కావాలా
అంటే
అది
కూడా
వద్దు. జ్యేష్ఠ కుమారుని అర్పించాలా అంటే దేవుడు తన జ్యేష్ఠ కుమారుని ఏకైక కుమారున్ని మనకోసం తానే అర్పించేశారు. ఇక నీవిచ్చేది ఏమిటి? అవేమి వద్దని న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు కావాలని చెబుతున్నారు!
దీనినే యెషయా గారు
కూడా చెబుతున్నారు మొదటి అధ్యాయంలో అసలు మీరు
చేసే ప్రార్ధన నాకు అసహ్యం! మీరు ప్రార్ధన చెయ్యొద్దు మీ
చేతుల నిండా
నిరపరాధ రక్తం
పేరుకుపోయింది అని
చెబుతూ చివరకు కరుణించి ఏమి
చెయ్యాలో చెబుతున్నారు.
Isaiah(యెషయా గ్రంథము)
1:16,17,18,19
16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.
17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.
18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.
దీనికోసం మిగతా చోట్ల
ఏమని వ్రాయబడిందో ఒకసారి ధ్యానం చేసుకుందాం!
జెకర్యా 7:8—14
......
8. మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
9. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.
10. విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.
నాకు కావలసింది మీ ఉపవాసం కాదు గాని మొదటగా సత్యముననుసరించి తీర్పుతీర్చుడి. ఒకరియందుఒకరు కరుణావాత్సల్యములు కనపరచుకొండి. ఆహా ఏమి సింపుల్ గా చెప్పారు. నిజంగా ఈ మాటలు దేవునికి ఘనత తెచ్చేమాటలు కోసం దేవుణ్ణి స్తుతించేవి కాదు. మానవుల మధ్య పరస్పర ప్రేమానురాగాలే దేవునికి ఇష్టమైనవి అని తెలియజేస్తున్నారు.
దీనికోసం బైబిల్ లో
చాలా చోట్ల
విస్తారంగా వ్రాసారు దేవుడు.
మొదటగా పాతనిబంధనలో ఏమన్నారో చూసుకుని క్రొత్త నిబంధన కోసం
చూసుకుందాం!
జెకర్యా 8:
16.మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
17. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా 22:౩
యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
యెహెజ్కేలు 45:9
మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నిర్గమ 22:
21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.
23.వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
లేవీ 25:17
మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
ద్వితీ 10:
18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
19. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుండి.
ఇక క్రొత్త నిబంధనలో కొన్ని చూసుకుందాం.
ఎఫేసి 4:32
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
రోమా 12:10, 17, 19, 20
10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి.
18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
కొలస్సీ ౩:
12. కాగా, దేవునిచేత ఏర్పరచ బడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
ఇంకా చాలా ఉన్నాయి గాని చివరిగా ముఖ్యమైనది యాకోబు 1:27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
ఇదే
నిజమైన
భక్తి అని దేవుడు చెబుతున్నారు. దేవునికి మనలో కావలసిన గుణాలు ఇవే! మన
భక్తి, గొప్ప కార్యాలు, దీర్ఘ ప్రార్ధనలు ఉపవాసాలు, గొప్ప
కానుకలు, దశమభాగాలు ఇవికాదు దేవుడు మనలో కావాలని మొదటగా ఆశించేది. మొదట మనుష్యుల మధ్య, పొరుగువారి
మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు కావాలి. నిన్నువలె నీ పొరుగువారిని
ప్రేమించగలగాలి. ఆ తర్వాత నీవు చేసే ప్రార్ధనలు, భక్తి
ఉపవాసం, కానుకలు మ్రొక్కుబడులు. దయచేసి ఈ విషయం
గమనించి
గ్రహించమని
మనవిచేస్తున్నాను.
ప్రియ దైవజనమా! మనము
కూడా అలా ప్రవర్తించకూడదు. దేవుడు పిలిచినప్పుడు విందాం. ఆయన
బుద్ది
చెప్పినప్పుడు
మాట విని ఆయన మార్గంలో నడుచుకుందాం. లేకపోతే ఇశ్రాయేలు మీదకు వచ్చిన తీర్పులే మనకు కూడా వస్తాయి. వారిని
శ్రమ పరచిన దేవుడు మనలను కూడా శ్రమపెట్ట గలరు. కాబట్టి నేడే బుద్ధి తెచ్చుకుందాం!
కీర్తనలు 18:25—26
25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
కాబట్టి ఆయన మార్గములలో నడుద్దాం!
అందరితో ప్రేమగా ఉందాం! క్రీస్తు ప్రేమను పంచుదాం!
ఇశ్రాయేలు దేశం పాడుగా అవ్వడానికి కారణం
ఇశ్రాయేలు జనాంగమే!
అలాగే ఇప్పుడు మనం కూడా పాడైపోతే దానికి కారణం
మనమే!
మనలను మనము సరిచేసుకుందాం!
దేవునితో సమాధాన పడదాం!
నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-42వ భాగం*
మీకా 6:9
9. ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని ఇంతవరకు చూసుకున్నాము! అయితే దానికి నేను
శిక్ష విధించబోతున్నాను అని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు ఈ తర్వాత వచనాలలో! ఈ 9—16 వరకు దేవుడు వారు
చేసిన కొన్ని నేరాలను ఎత్తిచెబుతూ మీమీద నేను
శిక్ష విధించబోతున్నాను! మిమ్మల్ని మొత్తుతాను అంటున్నారు.
చూడండి తొమ్మిదవ వచనం ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. ఇక్కడ పట్టణం అనగా యేరూషలేము పట్టణము అని గ్రహించాలి! ఇంకా జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును! శిక్షను గూర్చిన వార్త, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి అంటున్నారు.
ఇక్కడ జాగ్రత్తగా గమనించ వలసిన విషయాలు:
మొదటగా:
జ్ఞానముగలవాడు
నీ నామమును లక్ష్యపెట్టును అంటున్నారు. ఈ జ్ఞానము గలవాడు కోసం ఆలోచిస్తే సామెతల గ్రంధంలో చాలా చక్కగా వీనికోసం వివరించారు!
యోబు గ్రంధంలో 15:2 లో *వాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం చెప్పడు, తూర్పు గాలితో కడుపు
నింపుకోడు అనగా
పనికిమాలిన మాటలను పట్టుకుని తిరగడు*!
*విని పాండిత్యము పెంచుకుంటాడు, నీతి సూత్రాలు సంపాదించు కుంటాడు*
సామెతలు 1:5
*ఆలోచనను అంగీకరించును* సామెతలు 12:15
మూఢుని మార్గము వాని
దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన
నంగీకరించును.
*కీడుకి భయపడి దానినుండి తొలగిపోతాడు*
సామెతలు 14:16
జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
*ఇతరులను చూచి బుద్ధి తెచ్చుకుంటాడు*
సామెతలు 21:11
*బలవంతుడు* అనగా జ్ఞానమే వాని బలం! సామెతలు 24:5
జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
*తన కోపాన్ని అణచుకొంటాడు*
సామెతలు 29:11
బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
ఇన్ని మంచి లక్షణాలు జ్ఞానము గలవానికి ఉంటాయి!
ఇంకా జ్ఞానము గలవానినే బుద్ధిమంతుడు అని
కూడా అంటారు!
ఈ బుద్ధిమంతుడు ఏమి
చేస్తాడో చూద్దాం!
*పెదవులను మూసుకుంటాడు*
సామెతలు 10:19
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన
పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
*అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు*
సామెతలు 22: 3
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
సామెతలు 27: 12
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
*చెడుకాలం కనుక నోరుమూసుకుని ఇంట్లో కూర్చుంటాడు*
ఆమోసు 5:13
ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
ఇక యేసుక్రీస్తుప్రభులవారి మాట
వినండి: *బండమీద ఇల్లు కట్టుకుంటాడు*
మత్తయి 7:24;
కాబట్టి యీ నా మాటలు విని
వాటిచొప్పున చేయు
ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
ఇక చివరగా ప్రాముఖ్యంగా
*క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునకు పోవు మార్గమున నడుచుకొంటాడు*
సామెతలు 15:24
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు
పరమునకు పోవు
జీవమార్గమున నడచు
కొనును
ఇదీ మనకు కావలిసినది. మన దేశంలోను ఇంకా ప్రపంచంలో అనేక కోట్లమంది దీనిని తెలుసుకోలేక పాతాళమునకు పోయే
మార్గములోనే ప్రయాణం చేస్తున్నారు.
మరి జీవమార్గం ఏది? యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు: నేనే
మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై యున్నాను ... యోహాను 14: 6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
ఇదే జీవమార్గము! దీనికోసం భక్తుడైన యోహాను గారు అంటున్నారు
1యోహాను పత్రిక 1:1—2
1. జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
2. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.
ఇంకా అపోస్తలులు అంటున్నారు
ఏ నామమున రక్షణ పొందలేము గాని యేసునామము లోనే రక్షణ
పొందుకోగలము! అపో.కార్యములు 4: 12
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
ఇప్పుడు మన పాఠమునకు వద్దాము!
జ్ఞానము గలవాడు నీ
నామమును లక్ష్యపెట్టును! జ్ఞానము గలవాడు అయితే
క్రింద నున్న
పాతాళమును తప్పించుకోవాలని పరలోకం పోయే మార్గం కోసం, పరలోకం ఇచ్చే నామనును లక్ష్యపెడతాడు! ఆ నామము యేసు
నామము!
ప్రియ
చదువరీ! నీ లక్ష్యం ఏమిటి? నీవు బుద్ధిమంతుడివా లేక బుద్ధిహీనునివా? జ్ఞానము గలవానివా లేక
జ్ఞానము లేనివాడవా పైన ఉదాహరించిన రిఫరెన్సులు చూసి
నీకు నీవే
తేల్చుకో!
పాతాళమును
తప్పించుకోవాలంటే యేసే
శరణం!
దైవాశీస్సులు!
(ఇంకా ఉంది)
*మోరస్తీయుడైన మీకా-4౩వ భాగం*
మీకా 6:9
ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని ఇంతవరకు చూసుకున్నాము! అయితే దానికి నేను
శిక్ష విధించబోతున్నాను అని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు ఈ తర్వాత వచనాలలో! ఈ 9—16 వరకు దేవుడు వారు
చేసిన కొన్ని నేరాలను ఎత్తిచెబుతూ మీమీద నేను
శిక్ష విధించబోతున్నాను! మిమ్మల్ని మొత్తుతాను అంటున్నారు.
(గతభాగం తరువాయి)
రెండవది: శిక్షను గూర్చిన వార్త
మూడవది: శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి.
దీనికోసం ఆలోచిస్తే శిక్షను గూర్చిన వార్త
ఏమిటి? ధర్మశాస్త్రం
మొత్తం సెలవిస్తుంది మీరు నేను
నేడు విధించిన నిబంధనలు కట్టడలు విని పాటిస్తే మీకు మేలు
కలుగుతుంది. వినకపోతే నీకు శిక్ష
తప్పదు అని!
నిర్గమకాండము 15: 26
మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.
దానికోసం ఏ నిబంధన పాటించక పోతే
దానికి సంబంధించిన శిక్ష ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది!
ఇక నిర్గమ కాండం 20వ అధ్యాయంలో
పది ఆజ్ఞలు ఇచ్చి వీటిని తప్పకుండా పాటించమని చెప్పారు. ఇంకా నిర్గమ కాండం
నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఎన్నెన్నో ఆజ్ఞలు ఇచ్చారు!
ఒకసారి యెషయా 10:5—6 చూసుకుంటే
నేను మిమ్మల్ని శిక్షించడానికి అస్సూరు వారిని రప్పిస్తాను అంటున్నారు.
5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.
6. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
ఇంకా
ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో
మాట వింటే
దీవెనలు అంటూ 14 వచనాలు చెప్పి మాట వినకపోతే శిక్ష అంటూ 54 వచనాలు శాపాలున్నాయి అవే శిక్షలు!
ధర్మశాస్త్రంలో చెప్పబడిన శిక్షలు కాకుండా మరి
ఎవరికి శిక్ష
అని చూసుకుంటే:
*పరస్త్రీని మోహిస్తే శిక్ష*
యోబు 31:9—11
9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన యెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల
10. నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.
11. అది దుష్కామకార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరము
*పొరుగువాని భార్యతో పాపం చేసినవాడు*
సామెతలు 6:29
తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
*భక్తిహీనునికి*
సామెతలు 11:21
నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష
తప్పదు. నీతిమంతుల
సంతానము విడిపింపబడును.
*గర్వ హృదయులకు*
సామెతలు 16:5
గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు
శిక్ష నొందుదురు.
*కూటసాక్షికి*
సామెతలు 19:5
కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
చివరిగా యేసుక్రీస్తుప్రభులవారి మాట: నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును.
నమ్మనివానికి శిక్ష
విధించబడును! మార్కు 16:16
కారణం యెషయా
53:5 ప్రకారం మన అతిక్రమాలను బట్టి దోషాలను బట్టి మన శిక్ష ఆయనమీద పడింది. ఆయన రక్తము ద్వారా మనకు విమోచనం కలిగింది ఇప్పుడు దీనిని నీవు నమ్మకపోతే శిక్ష!....యెషయా 53: 5
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
పౌలుగారు అంటున్నారు ఏ భేదమును లేదు
అందరును పాపము
చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు!!! రోమా 3:23.
ఇక
శిక్షను నిర్ణయించిన వాని గూర్చిన వార్త అనగా
ఆయన దయామయుడు కరుణామయుడు అంతేకాక దీర్ఘశాంతము గలవాడు ఇవేకాక ఆయన
తండ్రుల దోషమును కుమారుల మీద
వేసేవాడు! దోషిని నిర్దోషిగా ఎంచడు! ఆయన వేంచేయుచున్నాడు! Exodus(నిర్గమకాండము) 34:6,7
6. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.
7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
ఇంకా ఆయన మౌనముగా ఉండడుఆయన చుట్టూ ప్రచండవాయువు విసరుతుంది. అగ్ని మండుచున్నది!
Psalms(కీర్తనల గ్రంథము) 50:1,2,3
1. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచు చున్నాడు.
2. పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించు చున్నాడు
3. మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది.
పౌరుషం గల దేవుడు! రోషం గల దేవుడు!
ద్వితియోపదేశకాండము 4: 24
ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
ఆయన త్వరలోనే రాబోవుచున్నాడు.
ప్రజలకు తీర్పు తీర్చబోతున్నారు
తనకిష్టమైన వారిని సిద్దపడిన వారిని తనతోపాటు తీసుకుని పోబోతున్నారు. అప్పుడు రెండే
రెండు గమ్యాలు! అయితే పరమ
యెరూషలేము లేదా
నరకం!
ఒకవేళ విడువబడితే అక్కడ అనగా ఆ నరకంలో/ పాతాళంలో అగ్ని ఆరదు
పురుగు చావదు! యుగయుగములు ఆ భాద అనుభవించవలసినదే
ఇదీ శిక్ష విధించే వానిని గూర్చిన వార్త
మరి నీ బ్రతుకు ఎలా ఉందో
పరిశీలన చేసుకుంటున్నావా?
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-44వ భాగం*
మీకా 6:10—14
10. అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
11. తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
12. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
13. కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని ఇంతవరకు చూసుకున్నాము! అయితే దానికి నేను
శిక్ష విధించబోతున్నాను అని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు ఈ తర్వాత వచనాలలో!
ఈ 9—16 వరకు దేవుడు వారు చేసిన
కొన్ని నేరాలను ఎత్తిచెబుతూ మీమీద
నేను శిక్ష
విధించబోతున్నాను! మిమ్మల్ని
మొత్తుతాను అంటున్నారు.
(గతభాగం తరువాయి)
ప్రియులారా తొమ్మిదో వచనంలో నేను మీకు
శిక్ష విధిస్తాను అనిచెప్పి ఎవరెవరి మీద శిక్ష
విధించబోతున్నారో ఇక్కడ
కొంతమందిని చెబుతున్నారు.
అలాగే కొన్ని రకాలైన శిక్షలు కూడా చెబుతున్నారు!
10..అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులు చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నాయి అంటున్నారు. దానికి కొనసాగింపు తప్పుత్రాసు తప్పు రాళ్ళుగల సంచి ఉంచుకుంటే అపవిత్రుడవు అంటున్నారు.
వీరికోసం ఆలోచిస్తే మొదటగా అన్యాయం చేత సంపాదించిన ధనం కోసం చూసుకుంటే:
సామెతలు గ్రంధంలో 16:8
అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
సామెతలు 22:16
లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
త్రాగుబోతులు అన్యాయము చేస్తారు సామెతలు 31:5
త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు
దుష్టులు అన్యాయము చేస్తారు
యెషయా 26:10
దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.
ఇక ఆమోసు గారు చెబుతున్నారు 5:11—12
11. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
12.
మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్షతోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.
మలాకీ 3: 5
తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికులమీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుడు అంటున్నారు యెషయా 61:8 లో
ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
ఇంకా యేహెజ్కేలు గ్రంధంలో అంటున్నారు యెహేజ్కేలు
18: 17
బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.
యెహేజ్కేలు 22: 29
మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.
యెహేజ్కేలు 28: 18
నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.
మీకా 2: 2
వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.
హబక్కూకు 2: 9
తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
మలాకీ 2: 14
అది ఎందుకని మీరడుగగా, యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్యగదా.
యేసుక్రీస్తుప్రభులవారి మాట:
లూకా 16:10
మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించు కాలేరు అంటున్నారు.
అయితే మారుమనస్సు పొందినవాని మాట వినండి లూకా 19:8
జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
ప్రియ స్నేహితుడా! ఒకవేళ నీవు అన్యాయముగా ప్రవర్తిస్తుంటే నీవు వర్దిల్లవు అని గ్రహించుకో! దీని అంతము నరకు మరణము అని మరచిపోకు!
ఇక
హేయమైన
కొలతలు, తప్పుత్రాసు కోసం ఆలోచిస్తే : ఇక్కడ తప్పుత్రాసు హేయమైన కొలత ఉపయోగిస్తే అపవిత్రుడవు అంటున్నారు దేవుడు!
లేవీ కాండంలో 19:35
తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.
ద్వితీయోప 25:13—16
13. హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
14.
హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.
15.
నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.
16.
ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
సామెతలు 20:10;23
10. వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
23. వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.
యేహెజ్కేలు 45:10
ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.
చూశారా దేవునికి ఏదిష్టమో ఏది ఇష్టము కాదో! అలా దొంగ త్రాసులు దొంగ రాళ్ళు వేసి సంపాదించిన సొమ్ము కూడా దేవునికి అసహ్యమే! దేవునికి ఇష్టుడు కానివాడు ఆయన రాజ్యములో ప్రవేశించలేరు అని గ్రహించాలి!
దానికి శిక్ష
13. కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును.
అనగా ఒకరకమైన HIV లాంటి వ్యాధి వస్తుంది అంటున్నారు జాగ్రత్త! ఇక్కడ ఆ వ్యాధులు, అక్కడ నరకము తప్పదని గుర్తుచేసుకో!
(దైవాశీస్సులు)
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-45వ భాగం*
మీకా 6:10—14
10. అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
11. తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
12. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
13. కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని ఇంతవరకు చూసుకున్నాము! అయితే దానికి నేను
శిక్ష విధించబోతున్నాను అని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు ఈ తర్వాత వచనాలలో! ఈ 9—16 వరకు దేవుడు వారు
చేసిన కొన్ని నేరాలను ఎత్తిచెబుతూ మీమీద నేను
శిక్ష విధించబోతున్నాను! మిమ్మల్ని మొత్తుతాను
అంటున్నారు.
(గతభాగం తరువాయి)
ప్రియులారా తొమ్మిదో వచనం
లో నేను
మీకు శిక్ష
విధిస్తాను అనిచెప్పి ఎవరెవరి మీద
శిక్ష విధించబోతున్నారో ఇక్కడ కొంతమందిని చెబుతున్నారు.
ఇక 12వ వచనంలో వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు. పట్టణస్తులు అబద్దమాడుడురు! వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును అంటున్నారు
మొదటగా డబ్బున్నవాడు ఎడతెగక బలాత్కారం చేస్తున్నారు.
కీర్తనల గ్రంధంలో దుష్టుడు తలంచిన బలాత్కారం వాని నెత్తిమీదనే పడుతుంది అంటున్నారు 7:16
కీర్తనలు 58: 2
మీరు హృదయ పూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.
ఇక సామెతలు గ్రంధంలో వాని నోరు పడిపోతుంది అంటున్నారు
సామెతలు 10:6, 11
నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
ఆమోసు ౩:10
వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.
హబక్కూకు 2:17
లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును,పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును.
Micah(మీకా) 3:2,3
2. అయినను మేలునసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకల మీది మాంసము చీల్చుచుందురు.
3. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.
జెకర్యా 1: 21
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
ఇలా లేచినప్పుడు భక్తుడు మొర్రపెట్టారు దేవునికి కీర్తనలు 86:14
దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.
అయితే ఒకరోజు బలత్కారులు ఉండరు.
యెషయా 29:20
బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
ఇక తర్వాత పట్టణస్తులు అబద్దమాడుడురు!
వారి నాలుక కపటముగా మాటలాడును
కీర్తనలు 52: 3
మేలు కంటె కీడు చేయుటయు నీతి పలుకుట కంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)
కీర్తనలు 119: 163
అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
యిర్మియా 9: 5
సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
హోషేయా 10: 13
నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యు లను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.
మీకా 2: 11
వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును.
దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఒకటి అబద్దమాడకూడదు నిర్గమ 20:16
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
కీర్తనలు 12: 2
అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
కీర్తనలు 34:13
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.
కీర్తనలు 62: 4
అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)
సామెతలు 6: 19
లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
సామెతలు 19: 22
కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
యెషయా 32: 7
మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
యెషయా 59: 3
మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.
యిర్మియా 9: 3
విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.
యోహాను 8: 44
మీరు మీ తండ్రియగు అపవాది (అనగా,సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక,అబద్దకునికి జనకుడునై) యున్నాడు.
యోబు 15: 35
వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును.
కీర్తనలు 5: 6
అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
కీర్తనలు 50: 19
కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.
అయితే గమనించాలి వీరంతా నాశనమైపోయే బ్యాచ్ అని గ్రహించాలి.
ప్రకటన 22:15 ఇలాంటి వారు నరకానికి పోతారు
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును *అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు*
(ఇంకాఉంది)
*మోరస్తీయుడైన మీకా-46వ భాగం*
మీకా 6:10—14
10. అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
11. తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
12. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
13. కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
ఈ అధ్యాయంలో దేవుని హృదయవేదన కనిపిస్తుంది!
దేవుని బాధ
కనిపిస్తుంది. చివరికి దేవునికి బాధకలిగి ఇశ్రాయేలు ప్రజలపై నేరాలు మోపుతున్నారు అని ఇంతవరకు చూసుకున్నాము! అయితే దానికి నేను
శిక్ష విధించబోతున్నాను అని ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు ఈ తర్వాత వచనాలలో! ఈ 9—16 వరకు దేవుడు వారు
చేసిన కొన్ని నేరాలను ఎత్తిచెబుతూ మీమీద నేను
శిక్ష విధించబోతున్నాను! మిమ్మల్ని మొత్తుతాను అంటున్నారు.
(గతభాగం తరువాయి)
సరే, ఇలాంటి వారికి దేవుడిచ్చే తీర్పు ఏమిటంటే 13—14 వచనాలు...
13. కాబట్టి నీవు బాగుపడకుండ నేను నీ పాపములనుబట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును.
14. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీ వెప్పుడు పస్తుగానే యుందువు, నీవేమైన తీసికొనిపోయినను అది నీకుండదు, నీవు భద్రము చేసికొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును.
నీవు బాగవ్వకుండా నీ పాపాలను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును. అనగా గతభాగంలో వివరించిన విధముగా ఒకరకమైన
HIV లాంటి వ్యాధి కలిగి వచ్చిన రోగాలు పోకుండా వ్యాధి ముదురుపోతూ చివరకు చస్తారు అన్నమాట!
ఇక్కడ
గమనించవలసిన
మాట
నీ
పాపములను
బట్టే
నిన్ను
మొత్తుతాను
అంటున్నారు. దేవుడు ఎవరిని అన్యాయముగా శిక్షించడు బాధించరు శ్రమ పెట్టరు!...
యాకోబు 1:13,14,15
13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింప బడుచున్నానని అనకూడదు.
14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.
15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ..
నీవు చేసిన పనులవలనే నీకు ఈ కష్టాలు శ్రమలు అని గ్రహించాలి!
ఇక 14వ వచనంలో నీవు భోజనం
చేసినా నీకు
తృప్తి కానేరదు నీవెప్పుడు ఆకలిగానే ఉంటావు నీకు
ఏమి దాచుకున్నా అది దోపుడికి అప్పగించ బడుతుంది అంటున్నారు.
దీనికోసం ఆలోచిస్తే దేవుని మాటలను ఆజ్ఞలను వినకుండా ఉంటే
ఇలాంటివే జరుగుతాయి అని ముందుగానే దేవుడు చెప్పారు ద్వితీయోపదేశాకాండం లో .
ఇంకా హగ్గయి గ్రంధంలో దేవుడు చెబుతున్నారు 1:6...
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
ఎందుకు ఇలా అవుతుంది అంటే హగ్గయి 1:2,4
2. సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
4. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీ వేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
ఇంకా 1:9—11
9. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.
10. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండకయున్నది.
11. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.
దేవుని మాట వినకపోతే చివరకు ఏమవుతుంది అంటే:
యెషయా 28:18--20
18. మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయ బడును. పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు. ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటు నప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు
19. వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.
20. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.
ఇంత ఘోరముగా ఉంటుంది చివరకి!
ఇక ముందుకుపోతే మీకా 6: 15
నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవ పండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.
దీనికోసం ఆలోచిస్తే దీనికోసం కూడా ద్వితీయోప
28 లో ముందుగానే చెప్పారు.
28:17,30,33,38,39,40,45,48,51
17. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
30. స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.
33. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.
38. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.
39. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.
40. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.
45. నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
48. గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
51. నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.
ఎందుకు ఇలా జరుగుతుందో చూసుకున్నాము!
ఇక 16 వచనములో కూడా దీనికి కారణం
చెబుతున్నారు దేవుడు
....మీకా 6: 16
ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదము గాను చేయబోవుచున్నాను.
ఒమ్రీ ఏమిచేశాడు? 1రాజులు 16:25—26
25. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.
26. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను. ,
ఇక వాడి కొడుకు ఆహాబు ఏమిచేశాడు
1 Kings(మొదటి
రాజులు) 16:30,31,32,33
30. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
32. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
33. మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
ఇంట ఘోరమైన విగ్రహారాధన జరుగించారు కాబట్టి దేవుడు ఇన్ని శాపాలు కష్టాలు శిక్షలు పంపించారు!
అందుకే మిమ్ములను అపహాస్యాస్పదముగా చేస్తాను అన్నారు. దారిన పోవువారందరూ చూసి
ఆశ్చర్యపడేలా చేస్తాను అంటున్నారు.
కాబట్టి ప్రియ స్నేహితుడా!
వారికి చేసిన
దేవుడు నీకు
కూడా చేయగలరు! కాబట్టి భయము
కలిగి దేవునియందు భయభక్తులు కలిగి
జీవించాలి! అలా చేయకపొతే నీవు
కూడా జనులకు సామెతగా ఉంటావు జాగ్రత్త!
దైవాశీస్సులు!
*మోరస్తీయుడైన మీకా-47వ భాగం*
మీకా 7:1—3
1. వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్షపండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగేయున్నది. ద్రాక్షపండ్ల గెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమున కిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.
2. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు,
అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును.
3. రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
ప్రియ దైవజనమా! మనం మీకా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు ఆరు అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము!
6వ అధ్యాయంలో దేవుని హృదయవేదన వెల్లడి చేశారు. ఇక ఈ 7వ అధ్యాయంలో మీకా
గారే తన
బాధను చెబుతున్నారు.
ఏడుస్తున్నారు! ఇక తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పక్ష్యంగా తను మాట్లాడుచున్నారు. మరలా మధ్యలో దేవుని ప్రవచనాలు కలిగాయి. చెరలోనికి పోయిన
ఇశ్రాయేలు వారు
తిరిగి వస్తారు. మరలా చివర్లో మీకా గారే
మాట్లాడుచున్నారు.
మొదటి వచనంలో వేసవి
కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత ద్రాక్ష పండ్ల
పరిగె ఏరుకొనిన తరువాత ఎలాగుంటాదో నాస్థితి కూడా
అలాగే ఉంది
అంటున్నారు. ఇంకా ద్రాక్ష పండ్ల
గెల ఒకటి
కూడా లేదు. నాకిష్టమైన అంజూరపు పండ్లు కూడా
లేవు అంటున్నారు.
మొదటగా పండ్లకాలం అయిపోయిన తర్వాత పరిగె
ఏరుకొనే వాడు
ఎవరు? దీనులు అనాదలు పరదేశులు.
లేవీ 19:9—10;
23:22; ద్వితీ 24:21
కాబట్టి పరిగె ఎవరు ఏరుకుంటారు అంటే పరదేశులు, తండ్రిలేని వారు, విధవరాళ్ళు! ఇక్కడ భక్తుడు అంటున్నారు నా బ్రతుకు పరిగె ఏరుకొనేవాడిలాగా అయిపోయింది. అంత దీనస్తితి వచ్చేసింది అంటున్నారు.
సరే, వెళ్లాను వెదికాను గాని ద్రాక్షపండ్ల గెల ఒక్కటి కూడా లేదు! నాకిష్టమైన అంజూరపు పళ్ళు కూడా లేవు అంటున్నారు.
ఇక్కడ చూసుకుంటే నేను పరదేశిలా అనాదలా మారిపోయాను, పరిగె ఏరుకొందామన్నా ఏమీ
దొరకలేదు అని
చెప్పినట్లు ఉంది!
అయితే దీనిలో మరో ఆత్మీయార్ధం ఉంది అనిపిస్తుంది! కారణం ఇక్కడ భక్తుడు ఎప్పుడు పరిగె ఏరుకోడానికి వెళ్లారు? ఎందుకు పండ్లు దొరకలేదు అంటే అక్కడ ముందే కోత జరిగిపోయింది. అప్పుడు పళ్ళు ఎలాగు ఉండవు! ఇక వేసవికాలపు పండ్లను ఏరుకొంటున్నారు. ఇంకా ఎప్పుడు? ద్రాక్షపండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత భక్తుడు వెళ్లారు. అనగా కొంతమంది ముందుగానే వచ్చి పరిగె ఏరుకుని వెళ్ళిపోయారు! ఇంకెలా పళ్ళు దొరుకుతాయి?
ఇదే అనుభవం ఒకసారి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా కలిగింది. అంజూరపుచెట్టు మోసగించింది. అక్కడ బైబిల్ లో అది పండ్ల కాలము కాదు గాని యేసుక్రీస్తుప్రభులవారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే పండ్లు కాసే చెట్టులా ఆ అంజూరపు చెట్టు ఆకులు పూసింది. దూరం నుండి చూస్తే పండ్లకాలంలో పరిపక్వ స్థితిలో ఉండే చెట్టులా కనబడింది. తీరా వెళ్తే ఏమీలేవు అందుకే దేవుడు దానిని శపించారు! ఇక్కడ భక్తుడికి కూడా ఏవీ కనబడలేదు!
అయితే ఇది మరో అనుభవాన్ని సూచిస్తుంది అనిపిస్తుంది! ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారి రహస్యరాకడ జరిగి తనకిష్టమైన ఫలములను తీసుకుని పోయిన తర్వాత, ఏడేళ్ళ శ్రమల కాలం తర్వాత పరిగెలాంటి హతస్సాక్షులు కూడా వెళ్ళిపోయిన తర్వాత విడువబడిన నులివెచ్చని స్తితిలో ఉన్న సంఘాన్ని సూచిస్తుంది. విడువబడిన వారి బ్రతుకులు ఎలా ఉంటాయో, ఎలా ఆకలితో అలమిటిస్తారో, ఎలా వాక్యపు ఆకలి ఉంటుందో, ఎలా ప్రార్ధనాలేమి ఉంటుందో, ఎలా ఆత్మ లేమి ఉంటుందో ఇక్కడ కనబడుతుంది. ద్రాక్షాపళ్ళు, ద్రాక్షారసం- యేసుక్రీస్తుప్రభులవారి రక్తానికి పరిశుద్దాత్మకు సాదృశ్యం! ఇక అంజూరపు పళ్ళు స్వస్తతకు సాదృశ్యం! అందుకే ఎక్కడా చూసిన స్వస్తత లేదు పచ్చిపుల్లే అంటున్నారు మరోభక్తుడు!
యెషయా 1: 6
అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
అనగా రెండవరాకడ జరిగాక, రక్షణ గాని, స్వస్తత గాని
లేక ప్రజలు ఆత్మీయ ఆకలితో ఎలా ఉంటారో భక్తుడు ఆత్మీయంగా అనుభవిస్తున్నారు అన్నమాట!
అయితే తర్వాత వచనాలు చూసుకుంటే ఈ అధ్యాయానికి
, యిర్మియా 8:21 నుండి చివర వరకు
గల వచనాలకు చాలా దగ్గర
సంభంధం కనిపిస్తుంది,
యిర్మియా గారు
కూడా అలాగే
బాధపడ్డారు! ఇక్కడ మీకా గారు
కూడా అలాగే
బాధ పడుచున్నారు!
Jeremiah(యిర్మీయా) 8:21,22
21. నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.
22. గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?
Jeremiah(యిర్మీయా) 9:1
1. నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
భక్తుడు దేశం మొత్తం మీదనే లేడు,
ప్రతీవాడు ప్రాణహాని చేయడానికి చూసున్నాడు అధిపతులు లంచాలు తీసుకుంటున్నారు. వారిలో మంచోడే ముల్లచెట్టులాగా ఉన్నాడు! స్నేహితుని నమ్మొద్దు అంటున్నారు. ఇక అక్కడ చూసుకుంటే .....
ఒక దైవజనునికి ఉండవలసిన లక్షణాలు వీరిద్దరిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి!
ఇప్పుడు ఒక్కో వచనం
క్లుప్తంగా చూసుకుందాం!
భక్తుడు దేశంలో లేకుండా పోయాడు! యదార్ధంగా
నడిచేవాడు ఒక్కడూ లేడు! ప్రతీ ఒక్కడు తన
సహోదరుని ముంచాలని చూస్తున్నారు.
దీనికోసం కీర్తనలు 12:1—2 లో...
1. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.
2. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
కీర్తనలు 37: 32
భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
కీర్తనలు 59: 3
నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.
యెషయా ౩:5
ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.
యిర్మియా 5:26
నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
యెషయా 59: 15
సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.
యోవేలు 1:10
పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
చూశారా పరిస్తితి ఎలా ఉందో??!!
అందుకే దేవుడు వీరిని చెరలోనికి పంపించారు!
క్రైస్తవుడా నీవు
కూడా ఎలా
ఉన్నావో ఆలోచించుకో!
నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా లేదా విడువబడే గుంపులోనా? నేడు అనే దినముండగానే ఈరోజే బ్రతుకు మార్చుకుని ప్రభువు పాదాలను పట్టుకో! నీ భక్తిహీనతను
ఇప్పుడేవదిలెయ్! గమనించాలి విడువబడుడ బహుఘోరము! ఆ భాధలు తప్పించుకోవాలంటే ఆత్మీయ జీవితం, సాక్షార్ధమైన
జీవితం, వాక్యానుసారమైన కావాలి! వాటిని పొందుకుని పాపపు
జీవితానికి స్వస్తిచెప్పు!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి