తెస్సలోనికయుల పత్రికలు


*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతము-1*

 

          దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక! యేసుక్రీస్తుప్రభులవారి పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనములు! ఆధ్యాత్మిక సందేశాలు-8 సిరీస్ లో భాగంగా మరో పత్రిక ధ్యానములతో మిమ్మల్ని రకంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అట్టి కృప నిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనములు! సారి మనం అపోస్తలుడైన పౌలుగారు థెస్సలోనికయులకు వ్రాసిన రెండు పత్రికలను ఆధారం చేసుకుని సంవత్సరం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధాత్ముడు వ్రాయించిన పత్రికలలో థెస్సలోనికయులకు వ్రాసిన రెండు పత్రికలలో ఉన్నన్ని ప్రత్యక్షతలు మరే పత్రికలలో కూడా లేవు. యేసుక్రీస్తుప్రభులవారు తన రెండవరాకడకు సంబందించిన విషయాలు సువార్తలలో చెప్పారు. ఇక ప్రకటన గ్రంధం మొత్తం ప్రత్యక్షతలే! అయితే మిగిలిన ప్రతీ పత్రికలలోనూ రెండవరాకడ కోసం వ్రాయబడింది. అంతెందుకు? క్రొత్త నిబంధన మొత్తం అన్ని గ్రంధాలలోను  అయన రాకడకోసం వ్రాయబడ్డాయి. అయితే సువార్తలు, ప్రకటన గ్రంధం తరువాత ఎక్కువగా ఆయన రాకడ కోసమైనా ప్రత్యక్షతలు కేవలం థెస్సలోనికయులకు వ్రాసిన రెండు పత్రికలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాము! మరలా చెబుతున్నానునేను బైబిల్ పండితుడను కానేకాను! కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన సంగతులు బైబిల్ ఆధారంగా కొద్దిగా సామాన్య ప్రజలకు వివరించాలని వాడుక భాషలో వాఖ్యానం చెయ్యాలని పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాస్తున్నాను. దయచేసి నా పాండిత్యలేమిని అర్ధం చేసుకుని మార్కులు వేయవద్దు అని వినయపూర్వకంగా మనవిచేస్తున్నాను!

 

   మొదటగా అసలు పత్రిక ఎందుకు, ఎవరికి, ఎప్పుడు, సందర్భంలో , ఎక్కడ వ్రాయబడ్డాయి అనేది మొదట ధ్యానం చేసుకుంటే పత్రికలు చాలా బాగా అర్ధమవుతాయి కాబట్టి ముందు వాటినే చూసుకుందాము! చరిత్ర కేవలం పత్రికల యొక్క నేపధ్యం తెలుసుకోడానికే చరిత్రను బైబిల్ నుండి వివరిస్తున్నాను తప్ప నాకు అన్నీ తెలుసు అని మాత్రము కాదు!

 

*రచయిత*: అపోస్తలుడైన పౌలుగారు

*వ్రాసిన కాలం*: క్రీ.. సుమారు 51లో

*ఎక్కడనుండి వ్రాసారు*: కొరింథీ పట్టణం నుండి

*ఎవరికి వ్రాసారు*: థెస్సలోనికయులకు

*థెస్సలోనికయులు అంటే*: పట్టణం ప్రస్తుతం గ్రీసు దేశంలో ఉంది. అది రోమా సామ్రాజ్య కాలంలో గ్రీసు దేశానికి రాజధాని! (కేపిటల్). Port City! ముఖ్యమైన ఓడరేవు గల పట్టణము! కాలంలో సుమారు ఒక లక్షమంది పట్టణంలో ఉండేవారట! దీనిని బట్టి ప్రాంతపు పరిస్తితులను అర్ధం చేసుకోవచ్చు! అపోస్తలుల కార్యములో 17 అధ్యాయంలో పౌలుగారు సీల గారు, తిమోతి గారు పట్టణాన్ని సందర్శించి అనేక హింసలు పొంది ఇక్కడ సంఘాన్ని స్థాపించినట్లు చూడగలము! అనగా పౌలుగారు తన రెండవ మిషనరీ యాత్రలో సంఘాన్ని స్థాపించారు అని గ్రహించాలి. అప్పుడు గొప్ప అల్లరి జరిగినట్లు చూడవచ్చు! ఒకసారి అధ్యాయం 110 వచనాలు చదవమని మనవిచేస్తున్నాను!

Acts(అపొస్తలుల కార్యములు) 17:1,2,3,5,6,7,8,10

 

1. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను

2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,

3. నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు (లేక, మూడువారములు) తర్కించుచుండెను.

5. అయితే యూదులు మత్సరపడి, పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

6. *అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొని యున్నాడు*.

7. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.

8. మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

10. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.

 

సరే, రకంగా పౌలుగారు సంఘాన్ని స్థాపించి బెరయ మీదుగా ఏథెన్స్ పట్టణం వెళ్ళినట్లు అధ్యాయం చెబుతుంది.

 

* ఉత్తరం ఎందుకు రాశారు? లేదా సంధర్బంలో వ్రాసారు? మిగిలిన పత్రికలలో లేని ప్రత్యక్షతలు పత్రికలలోనే ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? కొరింథీ పట్టణం నుండే ఉత్తరాన్ని ఎందుకు వ్రాసారు?*

జవాబులకు కొంచెం చరిత్రను చూసుకుందాము!

 

మొదటగా: పై రిఫరెన్సులు ప్రకారం పౌలుగారు థెస్సలోనికయ పట్టణంలో మూడువారాలు సేవచేసినట్లు కనిపిస్తుంది. అయితే చరిత్రకార్లు మూడునెలలు సేవచేసినట్లు చెబుతారు. ఏదిఏమైనా అక్కడ అల్లరి జరిగి పౌలుసీల తిమోతి గార్లను చంపుదామని చూసినప్పుడు సంఘము వారిని బెరయకు పంపినట్లు అక్కడనుండి ఏథెన్స్ కి అక్కడనుండి కొరింథీ పట్టణానికి వచ్చి అక్కడ 18 నెలలు పరిచర్య చేసిన తర్వాత గొప్ప అల్లర్లు జరిగినట్లు, అల్లర్లు జరిగాక కూడా సుమారు ఆరునెలలు ఇంకా కొరింథీ పట్టణంలో పరిచర్య చేసినట్లు మనం 18 అధ్యాయంలో చూడవచ్చు!  సమయంలోనే పౌలుగారు ఉత్తరాలు రాసి థెస్సలోనికయులకు పంపించారు. అయితే పౌలుగారే తానే స్వయంగా వెళ్దామని అనుకున్నారు గాని దానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వలన తిమోతి గారిని పంపించినట్లు చెబుతారు. అయితే మరికొందరు 18 అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా నీవు భయపడకు, ఇక్కడ నాకు అనేకమంది జనాలున్నారు కాబట్టి ఇక్కడే ఉంది సేవచేయ్యమని చెప్పారు కాబట్టి కొరింథీని వదలకుండా తిమోతి గారిని పంపించారు అని చెబుతారు!

అపో.కార్యములు 18: 10

నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా...

  మొత్తానికి కారాణాలు ఏమైనా కొరింథీ పట్టణంలో రెండు సంవత్సరాల కాలంలో రెండు పత్రికలు రాసి పంపినట్లు మనం చూడగలం!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతము-2*

 

         ప్రియసంఘమాపౌలుగారు థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు ఎందుకు రాశారో చూసుకుంటున్నాము!

 

       (గతభాగం తరువాయి)

 

*ఉత్తరాలు రాయడానికి గల నేపధ్యం*:

*మొదటగా*: పౌలుగారు అక్కడ మూడు వారాలు మాత్రమే పరిచర్య చేసినట్లు 17 అధ్యాయం చెబుతుంది. తర్వాత బెరయ, తర్వాత ఏథెన్స్ వచ్చినట్లు అక్కడ కొద్దిరోజులు మాత్రమే పరిచర్య చేసినట్లు మనం చూడగలం! పౌలుగారు ఏథెన్స్ లో ఉండగానే   థెస్సలోనికయ సంఘానికి యూదుల ద్వారా ఇంకా అన్యజనులు అనగా తమ సొంత ప్రజల ద్వారా భయంకరమైన శ్రమలు కలిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిని థెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఎత్తి రాశారు. 2:14,15. 1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 2:14,15

 

14. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.

15. యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, ....‌

 

 అందుకే :1—5 ప్రకారం పౌలుగారు థెస్సలోనికయ సంఘాన్ని బలపరచడానికి వారి బాగోగులు కనుక్కోడానికి తిమోతి గారిని పంపించారు.

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 3:1,2,3,4,5

 

1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,

2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

3.మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

4. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

5. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.

 

దానికి సమాధానంగా :6 ప్రకారం తిమోతి గారు చక్కని చల్లని వార్తను మోసుకుని వచ్చారు- అది ఏమంటే ఎన్ని శ్రమలు కలిగినా థెస్సలోనికయ సంఘం మాత్రము విశ్వాస బ్రష్టులు కాలేదు! విశ్వాసంలో ధైర్యంగా నిలిచారు అన్న సమాచారం వచ్చింది. ఇప్పుడు వారిని అభినందించడానికి ఇంకా వారిని విశ్వాసంలో బలమైన పునాది వేయడానికి పౌలుగారు మొదటి ఉత్తరం రాశారు!

 

2. తిమోతి గారు సంఘ వర్తమానం చెప్పాక- సంఘస్తులు అడిగిన ప్రశ్నలు లేక అనుమానాలు కూడా చెప్పారు. వాటిని నివృత్తి చేద్దామని పత్రికలు రాసి పంపించారు.

 

*మొదటి అనుమానం*: పౌలుగారు చెప్పారు యేసుక్రీస్తుప్రభులవారు అతి తొందరలో మరలా భూలోకానికి మహా మహిమతో ప్రభావంతో రాబోతున్నారు. దానిని మనస్పూర్తిగా నమ్మారు థెస్సలోనికయ సంఘము! అయితే బ్రతికి ఉన్నవారు యేసుక్రీస్తుప్రభులవారితో బూర మ్రోగగానే ఎగిరిపోతారు బాగుంది! దానిని వారు నమ్మారు! అయితే పౌలుగారు వెళ్ళిపోయిన తర్వాత రక్షించబడి ఆత్మను పొందుకున్న విశ్వాసులు శ్రమలవలన హింసల వలన చనిపోయారు సంఘంలో! అయితే యేసుక్రీస్తు ప్రభులవారు ఇంకా తిరిగి రాలేదు! మరి వారి సంగతేంటి అనగా చనిపోయిన వారి సంగతేంటి? బ్రతికి ఉన్నవారి కోసం చెప్పారు, మరి చనిపోయిన వారి సంగతేంటి? ఇది ఒక ప్రశ్న!!

 

 దానికి జవాబుగా రాస్తున్నారు: చనిపోయిన వారికంటే ముందుగా మనము అనగా ప్రస్తుతం బ్రతికి ఉన్నవారమైన మనము లేవము గాని ముందుగా చనిపోయిన వారు అనగా క్రీస్తునందు పవిత్ర జీవితం జీవించి చనిపోయిన వారు ముందుగా లేస్తారు. తర్వాత మనము లేచి ఎగిరిపోతాము అని వారి సందేహనివృత్తి చేశారు!! గమనించాలి వారి విశ్వాసాన్ని నూరి పోస్తున్నారు  ఏమిటంటే ఒకరోజు చనిపోయిన వారు తిరిగిలేస్తారు. ఒకవేళ మనము ప్రభువు రాకడ కన్నా ముందుగా చనిపోతే మనము కూడా తిరిగిలేస్తాము తర్వాత మనందరం ప్రభువును ఎదుర్కోడానికి వెళ్తాము. అక్కడ ప్రభువుతో ఎల్లప్పుడూ నివాసం చేస్తాము అంటున్నారు.

 

*రెండవ కారణం*:  ఏథెన్స్ వారికి గాని మాసిదోనియా ప్రజలకు ఎఫెసి ప్రజలకు ఎల్లప్పుడూ ఏదో క్రొత్త విషయాలు తెలుసుకుందాము అనే తాపత్రయం తప్ప బ్రతకడానికి ఏదో ఒక పనిచేసుకోవాలి అని ఉండేది కాదు! అయితే యుద్దాలకు వెళ్ళాలి లేదా ఇంట్లో కూర్చుని ఏదో ఒక క్రొత్త విషయాలు తెలుసుకోవాలి! ఇదీ వారి పని! అయితే పౌలుగారు చెబుతున్నారుఇది మంచి పని కాదు, అన్యులు ఎలా పోయినా గాని మీరు మాత్రము మీ చేతులతో కష్టపడి పనిచేసుకుని బ్రతకాలి అని రాస్తున్నారు.

 1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:11,12

 

11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,

12. మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

 

*మూడు*:  మరికొంతమంది విశ్వాసులు ఎలాగూ దేవుడు తొందరలో వచ్చేస్తున్నాడు కదా ఇంకెందుకు మనం పనిపాటులు చేసుకోవడం అనుకుంటూ పనీపాటు లేకుండా కేవలం ఆరాధనలకు వెళ్ళడం తప్ప మరో పనిలేకుండా తిరగడం మొదలుపెట్టారు! అంతేకాకుండా మీ పనిపాటులు మానేసి మీరు కూడా ఇలాగే ఉండండి అంటూ భోదించడం మొదలుపెట్టారు!  గమనించాలి ఆది అపోస్తలుల కాలంలో ప్రజలు అనగా విశ్వాసులు తమకు కలిగినవి అనగా ఆస్తిపాస్తులు తమవి అనుకోకుండా సంఘాభివృద్ది కోసం పరిచర్య కోసం పరిశుద్ధుల అవసరతల కోసం తమ ఆస్తులు అమ్మి ఇచ్చేసేవారు. కాబట్టి ఎవడో ఒకడు తమ ఆస్తి అమ్మితే వాటితో మనం కొన్ని రోజులు తినొచ్చు కదా అని వీరి ఉద్దేశ్యం! అందుకే రెండో ఉత్తరాన్ని మొదటి పత్రిక రాసిన ఆరునెలల్లో వెంటనే రాస్తున్నారుమీ ఆలోచన తప్పు! అవును యేసుక్రీస్తు ప్రభులవారు తొందరలో వస్తున్నారు. అది ఎప్పుడో మనకు తెలియదు. అయితే ఆయన వచ్చేవరకు మీరు మాత్రం భక్తిగలిగి జీవిస్తూనే అనగా సాక్ష్యార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం పవిత్రమైన జీవితం జీవిస్తూనే మీరు బ్రతకటానికి మీ సొంత పనిపాటులు చేసుకోవాలి అంటూ మరోసారి హెచ్చరిస్తున్నారు! అంతేకాకుండా మేము మీ దగ్గర ఉన్నప్పుడు మేము బ్రతకడానికి విధంగా మా పనులు చేసుకుంటూ దేవుని పరిచర్య చేసి మాదిరిగా జీవించామో అలాగే మీరు కూడా మమ్మును పోలి మీ పనిపాటులు చేసుకుంటూ పరిచర్యలో పాల్గొనండి అంటున్నారు2 థెస్స 2:8—12 ప్రకారం- పని చెయ్యకుండా భోజనం చెయ్యొద్దు అని మరోసారి ఆజ్ఞాపిస్తూన్నారు.2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 3:8,9,10,11,12

 

8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.

9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారములేదని చేయలేదు.

10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు-- ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా.

11. మీలో కొందరు పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.

12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞా పూర్వకముగా హెచ్చరించుచున్నాము

చూడండి ఎవడు సంపాదించిన సొమ్ముతో వాడే తినాలి గాని అప్పనంగా వచ్చిన ఆహారాన్ని తినొద్దు అని హెచ్చరిస్తున్నారు.

 

*నాలుగు*: కొంతమంది విశ్వాసులు తమకు కలిగిన హింసల వలన కృంగిపోయి ఉన్నారు. అయితే విశ్వాస బ్రష్టులు కాకుండా స్థిరంగా ఉన్నారు. అలాంటి వారిని బలపరచడానికి కృంగిపోవద్దు అంటూ రెండు పత్రికలలో కూడా ధైర్యపరుస్తున్నారు. మేము మీతో ఉన్నప్పుడే మనము అనేకమైన హింసలు పొంది పరలోకం వెళ్ళాలి అని చెప్పాము కదా! ఇప్పుడు అలాగే అవుతుంది కాబట్టి బాధపడొద్దు అంటున్నారు. ఇంకా రెండవ అధ్యాయంలో శ్రమలు తట్టుకుంటున్న మీకు తొందరలో ఆయన మహిమలో పాలుపొందులు పొందబోతున్నారు. ఆయన మహిమ పరచబడినట్లు మీరు కూడా మహిమపొందబోతున్నారు. ఇక మిమ్ములను హింస పరుస్తున్న మీ విరోధులకు దేవుని మహా ప్రతిదండన శ్రమ ఉగ్రత కలగబోతుంది అంటూ వారిని ధైర్య పరుస్తున్నారు. 2 థెస్స 1:112

 

*ఐదవది*: కొంతమంది దేవుని రాకడ వచ్చేసింది. అది జరిగిపోయింది అంటూ థెస్సలోనికయులను కలవరం చేశారు. అందుకే రెండవ పత్రికలో దేవుని రాకడ ఇంకా రాలేదు. దానిని నమ్మవద్దు.  మొదట బ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు అనగా నాశన పుత్రుడు అనబడే పాపపురుషుడు లేక ధర్మ విరుద్ద పురుషుడు అనబడే క్రీస్తు విరోధి బయలు పరచ బడిన తర్వాతే దేవుని రాకడ వస్తుంది అంటూ ఎంతో స్పష్టముగా చెప్పారు. అయితే ధర్మ విరోధమైన సాతాను క్రియలు అంత్య క్రీస్తు క్రియలు ఇప్పుడు జరుగుచున్నా గాని  ధర్మ విరోధి మీకు బయలు పరచబడిన తర్వాతే ఆయన రెండవ రాకడ జరుగుతుంది అంటున్నారు.

 

*చివరగా*: పత్రికలోనే అన్ని ప్రత్యక్షతలు ఎందుకు రాయబడ్డాయి అంటే: పౌలుగారు ప్రాంతంలో ఉన్నప్పుడే ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన/ ఆధ్యాత్మిక విషయాలు కోసం, విశ్వాసులు పొందుకోబోయే మహిమ శరీరం, శ్రేష్ఠుల విందు,  వాడబారని మహిమ కిరీటం కోసం, రాకడకోసం మాత్రమే అడిగేవారు తప్ప, వారు పొందుకోబోయే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం అనగా భౌతికమైన ఆశీర్వాదాల కోసం ఎప్పుడూ వారు అడగలేదు ఆయన చెప్పలేదు! అంతేకాకుండా పౌలుగారు పరిచర్య ముగించి వెళ్ళిపోయినా తర్వాత కూడా వీరు ఎప్పుడూ వీటికోసమే అడుగుతుండే వారు! మృతులు ఏమవుతారు? బ్రతికి ఉన్న మనం ఏమవుతాము? ఎలా ఎగిరిపోతాము? అక్కడ ఎవరిని చూస్తాము! ఎలా ఉంటాము? ఎవరెవరు ఉంటారు? విడువబడిన వారు ఏమవుతారు? ఇవే ప్రశ్నలు వారికి! ఎప్పుడూ ఆత్మసంబంధమైన విషయాలు కోసమే అడిగేవారు! అందుకే వారు అడిగేకొలది పౌలుగారు తాను పొందిన ప్రత్యక్షతలు అన్నింటిని ఉపయోగించి ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇట్టి ఘనమైన రెండు పత్రికలు వ్రాసారు! గమనించాలి! వారికి ఇవి తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉంది కాబట్టి పౌలుగారు రాసారు. మిగిలిన వారికి ఆసక్తి లేదు కాబట్టి కొందరికి గద్దింపు కొందరికి ఆదరణ వ్రాసి ముగించారు! అయితే ఒకవిషయం గమనించాలి! పరిశుద్ధాత్ముడు ఒక్కో పత్రికలో లేక ఒక్కో గ్రంధంలో సంఘం ఎలా ఉండాలి అలా ఉంటె ఏమి పొందబోతున్నారో పరిశుద్ధాత్ముడే వ్రాయించారు కాబట్టి మొదటగా అది దేవుని సంకల్పము ఇంకా సంఘానికే మొట్టమొదటిగా సంగతులు తెలుసుకునే అవకాశం కల్గించారు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తి పరచును అని వ్రాయబడినట్లు విషయాలు తెలుసుకోవాలి అనే వారి ఆశను దేవుడు తీర్చారు!

 

   ప్రియ సంఘమా! నీ ఆశ నీ ఆత్రుత ఏమిటి? లోకాశలా? లేక ఆత్మానుసారమైన లేక ఆత్మ సంబంధమైన విషయాలా? సంఘస్తులకు ఆసక్తి ఉంది కాబట్టి అన్ని ప్రత్యక్షతలు కోసం తెలుసుకోగలిగారు! నీకు అటువంటి ఆసక్తి ఉందా? ఆత్మను పొందుకోవాలి- ప్రత్యక్షతలు పొందుకోవాలి- ప్రవచనాలు పొందుకోవాలి- దేవుని వరాలు ఫలాలు పొందుకోవాలి అనే ఆసక్తి ఉందా?  ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తారు. అటువంటి ఆశ ఆసక్తి దేవుడు మనందరికీ దయచేయను గాక!

ఆమెన్!

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*మూడవ భాగం*

 

          దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక! ఇంతవరకు మనము థెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక ఎందుకు పరిస్తితులలో వ్రాయబడిందో చూసుకున్నాము! రోజు పత్రికల యొక్క ప్రత్యేకతలు మరియు మొదటి పత్రిక విభజన చూసుకుందాము. అనగా మొదటగా మొదటి పత్రికను క్షుణ్ణంగా పరిశీలించి రెండవ పత్రికను చూసుకుందాము!

 

*ప్రత్యేకతలు*:

 

*మొదటగా*: పత్రికల యొక్క ముఖ్య ఉద్దేశం : యేసుక్రీస్తు ప్రభులవారి రెండవ రాకడ!!! రెండు పత్రికలలో ఆయన రెండో రాకడ యొక్క ఎన్నో ప్రత్యక్షతలు మనకు కనిపిస్తాయి!!

 

*రెండు*: రెండు పత్రికలలోనూ ప్రతీ అధ్యాయం లోను యేసుక్రీస్తు ప్రభులవారి రాకడకోసం వ్రాయబడింది.

మొదటి పత్రిక 1:10; 2:19; :13; 4:1317; 5:14; 

రెండవ పత్రిక: 1:56; 910; 2:14; 68;

 

*మూడు*: యేసుక్రీస్తు ప్రభులవారి రహస్య రాకడకు సంబంధించిన విషయాలు పత్రికలలోనే వ్రాయబడ్డాయి!

 

*నాలుగు*: పత్రికలలో ఆధ్యాత్మికమైన హెచ్చరికలు కనబడవు. కారణం వీరు ఆధ్యాత్మికంగా స్థిరమైన విశ్వాసం కలిగిన వారు.

 

*ఐదు*: ప్రతీ ఒక్కడు అనగా రక్షించబడిన విశ్వాసి పనీపాటు లేకుండా కూర్చుని తిరుగుతూ తినకూడదు. తన చేతులతో ఏదో ఒక పనిచేసుకుంటూ కష్టపడి సంపాదించి అప్పుడు భోజనం చెయ్యాలి! ఇది నేడు యువత గుర్తు పెట్టుకోవలసిన ఎంతో ముఖ్యమైన విషయం: నేను చదివిన చదువుకు తగిన ఉద్యోగం, జీతం వచ్చేవరకు నేను చెయ్యను అంటూ ఇంట్లో కూర్చుంటున్నారు యువత! ఉద్యోగం దేవుడు తప్పకుండా నీకు ఇస్తారు. అయితే అది వచ్చేవరకు ఇంట్లో కాళీగా కూర్చుని ఉండకూడదు తినకూడదు అని పత్రికలలో వ్రాయబడింది.  అది వచ్చేవరకు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి!

 

*ఆరు*: థెస్సలోనికయుల ప్రజలు ఎంతో ఆదర్శవంతమైన విశ్వాసులు! అలాగే మనము కూడా ఆదర్శవంతంగా ఉండాలి!

 

*ఏడు*: ఎన్ని హింసలు కష్టాలు కలిగిన విశ్వాసంలో ఇసుమంత కూడా బెణకలేదు వీరు!

 

*ఎనిమిది*: లోకాన్ని కాకుండా దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి! అలా సంతోష పెట్టడానికి ఏమి చెయ్యాలి!

 

*తొమ్మిది*: శ్రమలలో హింసలలో సోలిపోవద్దు- క్రీస్తుయేసుకు కలిగిన మహిమను నీవు నేను పొందబోతున్నాము!

 

 

*ఇక మొదిటి పత్రిక విభజన లేక వివరణ లేక విషయ సూచిక*:

 

పౌలుగారి ప్రార్థన, కృతజ్ఞతలు 1:2-3

ఆదర్శ సంఘం 1:4-10

ఆదర్శ క్రైస్తవ పనివారు 2:1-12

ధైర్యం కలిగియుండుట 2:1-2

నిజాయితీ, నమ్మకత్వం, మంచి ఉద్దేశాలు 2:3-6

ప్రేమించే హృదయాలను కలిగియుండుట 2:7-8

నిత్య ప్రయాస లేక శ్రమపడుట 2:9

పవిత్ర జీవితాలు 2:10

తండ్రిలాంటి ప్రవర్తన 2:11-12

మరిన్ని కృతజ్ఞతలు 2:13-14

యూదుల వ్యతిరేకత 2:14-16

విశ్వాసులంటే పౌలుకున్న ప్రేమ 2:17-20

పౌలు తిమోతిని థెస్సలొనీకకు పంపడం 3:1-5

తిమోతి తెచ్చిన కబురు 3:6

థెస్సలొనీకవారిని దర్శించాలని పౌలు ఆశ, అతని ఓదార్పు 3:7-11

వారికోసం పౌలు ప్రార్థన 3:12-13

దేవుణ్ణి సంతోషపెట్టడానికే జీవించడం 4:1-12

పవిత్ర జీవితం 4:3-8

సోదర ప్రేమ 4:9-10

ఆకర్షణీయమైన జీవిత విధానం 4:11-12

క్రీస్తు తిరిగి రావడం, సంఘం పైకెత్తబడడం 4:13-18

కాలాలు, సమయాలు 5:1-4

వెలుగు సంతానంలాగా జీవించడం 5:5-11

ముగింపు మాటలు 5:12-27

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*నాల్గవ భాగం*

1థెస్స 1:1—

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

      ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము ఉపోద్ఘాత మాటలు, ప్రత్యేకతలు మరియు విషయ సూచికను చూసుకున్నాము! నేటినుండి మొదటి పత్రికను జాగ్రత్తగా పరిశీలన చేద్దాము!

 

   ఎప్పుడూ చెబుతున్నట్లుగా పౌలుగారి పత్రికలు చాలా ప్రత్యేకమైనవి. ఆయన రచనలలో ఆయన యొక్క భక్తి పరిమితి పరిణితి కనిపిస్తుంది. అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే క్రొత్త నిబంధన గ్రంధం రాసిన భక్తులలో  పౌలుగారు మరియు లూకాగారు తప్ప మిగిలిన వారందరూ పామరులే! చదువుసంధ్యలు లేనివారే! గాని పరిశుద్ధాత్మ ప్రేరణతో మహాద్భుతమైన గ్రంధాలు/ పత్రికలు వ్రాశారు. అయితే పౌలుగారు పండితుడైనా గాని తన పాండిత్యాన్ని కేవలం రోమా పత్రికలో తప్ప మిగిలిన పత్రికలలోనూ వాడలేదు! రోమీయులు మరియు ప్రాంత ప్రజలు విద్యావంతులు విజ్ఞానవంతులు! కాబట్టి కాలంలో అక్కడ అనగా రోమా ప్రాంతంలోని పండితుల గ్రాంధిక బాష చలామణిలో ఉండేది కాబట్టి పౌలుగారు ఉత్తరాన్ని ప్రజలకు సరిపోయినట్లు రాశారు. అయితే మిగిలిన ప్రాంతాల ప్రజలు అనగా రక్షించ బడిన ప్రజలు సామాన్యులు కాబట్టి సామాన్య భాషలో లేక వాడుక బాషలో రాశారు. పౌలుగారు పత్రికలు కూడా అందరికీ ఇట్టే అర్ధమయ్యేలా సామాన్య పదాలలో పత్రికలు రాశారు. అయితే పదాలలో ఆయన భక్తి ఉనికిపడుతుంది.

   చూడండి మొదటి వచనం: తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న థెస్సలోనికయుల సంఘమునకు అంటూ మొదలుపెట్టారు. దీనిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే *ఇప్పుడు సంఘము తండ్రియైన దేవుని యందును కుమారుడు ప్రభువును అయిన యేసుక్రీస్తు నందును ఉన్నది* అంటున్నారు.  ఇక్కడ పౌలుగారి మాటలలో తండ్రియైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కలిసే ఉన్నారు అన్న భావన కనిపిస్తుంది. అనగా సంఘము లేక సార్వత్రిక సంఘము మీద కుమారుడైన/ ప్రాణము పెట్టిన/ స్వరక్తమిచ్చి సంపాదించిన కుమారునికి ఎంత హక్కు ఉందో, ఎలా కుమారుని యందు భద్రత ఉందో అదే భద్రతా మరియు హక్కు తండ్రియైన దేవునికి కూడా ఉంది అంటూ సామాన్య భాషలో ఎంతో ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు పౌలుగారు!

 

      ఇక్కడ పౌలుగారు దైవత్వంలో తండ్రి మరియు కుమారుడు- ఇద్దరు వేరు వేరు వ్యక్తుల ఏకత్వాన్ని నొక్కివక్కానిస్తున్నారు!  ఇదే రకమైన ఏకత్వము మనకు బైబిల్ లో చాలా దగ్గర కనిపిస్తుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభులవారు భాప్తిస్మము తీసుకున్నప్పుడు మత్తయి :1617 లో మనకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కనిపిస్తారు మూడు వ్యక్తులు వ్యక్తిత్వాలు ఉన్నట్లు! అయితే ముగ్గురు కలిసే ఉన్నారు. త్రిత్వమై యున్న త్రియేక దేవుడు! Matthew(మత్తయి సువార్త) 3:16,17

 

16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

17. మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.......

అదే మత్తయి సువార్తలో 28:19 లో యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామంలో వారికి భాప్తిస్మం ఇవ్వండి అని ఎంతో స్పష్టంగా చెప్పారు. మీరు నా పేరిట మాత్రమే  బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పలేదు! దైవత్వంలో ముగ్గురికి సమానమైన పాత్ర ఉంది! మరి ఐతే పేతురు గారు యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తిస్మం ఇచ్చారు ఎందుకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమన్నారు అంటే తండ్రియైన దేవుని నామం, కుమారుని నామం, పరిశుద్దాత్మ నామం ఒక్కటే కాబట్టి ముగ్గులు ఒక్కరే కాబట్టి యేసునామంలో బాప్తిస్మమివ్వమని పరిశుద్ధాత్ముడే చెప్పారు పేతురు గారు చేశారు.

 

అయితే యోహాను 10:౩౦ లో యేసయ్య అంటున్నారు: నేను తండ్రి ఒక్కటే ఇద్దరం ఏకమై ఉన్నాము అంటున్నారు. అనేకసార్లు అలాగే చెప్పారు యోహాను సువార్తలో! తండ్రియైన దేవునితో తననుతాను సమానంగా చెప్పినందువలనే యూదులు/ ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుప్రభులవారి మీద కసి పెంచుకుని ఆయనను చంపారు!

 17 అధ్యాయంలో తాను భూలోకానికి రాకముందు తండ్రితో ఉన్నట్లు చెబుతున్నారు.  ఫిలిప్పీ 2:6 లో ఆయన దేవుని స్వరూపియై ఉండి కూడా భాగ్యాన్ని వదులుకుని మనకోసం భూలోకానికి వచ్చారు అంటున్నారు.....ఫిలిప్పీయులకు 2: 6

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని....

 

 కాబట్టి ఇక్కడ మొదటగా పౌలుగారు కుమారుడు-- తండ్రి ఇద్దరు ఏకీభవించి ఉన్నారు అని చెబుతూ విశ్వాసులు కూడా ఇప్పుడు తండ్రియైన దేవునియందును కుమారుడైన యేసుక్రీస్తు నందును ఏకమై ఉన్నారు అని చెబుతున్నారు. విశ్వాసులు ఇప్పుడు దేవునితో ఉన్నారు. ఆయనే వారి ఆశ్రయం! వారి నివాసం లేక వారి ఇల్లు దేవుడే!  వారి ఆధ్యాత్మిక జీవితానికి స్థిర నివాసం దేవుడే! అందుకే కీర్తనా కారుడు ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే! నీవే మనుష్యులను మంటికి మార్చుచున్నావు అంటున్నారు 9:1లో . కొలస్సీ : లో మన జీవం క్రీస్తుతో దేవునిలో మరుగై యుంది అంటున్నారు!

 

  కాబట్టి విశ్వాసి తప్పకుండా గమనించాలి- గుర్తుపెట్టుకోవాలి- మనము క్రీస్తుద్వారా తండ్రియందు ఉన్నాము! తండ్రికి అంటుకట్టబడి ఉన్నాము! ఆయనలో మన ఉనికిని కలిగి ఆయనలో చలిస్తున్నాము! కాబట్టి మనము దేవుని యందు ఉన్నాము కాబట్టి ఆత్మపూర్వకమైన పనులు చేస్తూ ఆత్మాను సారమైన జీవితం జీవించాలి తప్ప బురదపనులు/ లోకానుసారమైన పనులు చేయనేకూడదు! ఆయనయందు మనము నిలిచియుంటే ఫలిస్తాము. అప్పుడే మనకు నిత్యజీవము కలిగియున్నాము అని గ్రహించాలి! అంతేకాకుండా మనము దేవునియందు ఉన్నాము కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి దేనికి భయపడకూడదు! అనగా లోకంలో కలిగే శోధనలకు శ్రమలకు భయపడక ఆయనయందు నిలిచియుంటే మనము ఆయన సొత్తు కాబట్టి మన పక్షముగా యుద్ధము చేసేవాడు ఆయనే! కాబట్టి విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు!

 

   ఇక వచనంలో పౌలుగారు సీలగారు తిమోతి గారు ఉత్తరాన్ని రాస్తున్నట్లు చెబుతున్నారు. గతభాగాలలో వివరించడం జరిగింది థెస్సలోనికయుల పట్టణానికి ముగ్గురు వెళ్లారు. ఇంకా వారు పత్రిక వ్రాసిన సమయంలో ఒకచోట ఉన్నారు కాబట్టి ముగ్గురు కలసి వ్రాస్తున్నట్లు పౌలుగారు చేబుతునారు. అయితే పౌలుగారు ఉత్తరాన్ని రాసినా గాని తనతోటి సహా పౌరులు తనతో పాటు అక్కడ మరియు ఇప్పుడు కూడా క్రీస్తుకోసం శ్రమను నిందను అనుభవిస్తున్నారు కాబట్టి మొత్తం క్రెడిట్ పౌలుగారు తీసుకోకుండా తన సహచరులకు కూడా ఇస్తున్నారు పౌలుగారు! ఇదే నిజమైన నాయకత్వము అంటే! ఘనత కలిగితే అందరికీ పంచి, ఓటమిని తనపై వేసుకొనే వాడే నిజమైన నాయకుడు!

 

   ప్రియ సంఘమా! నీవునేను క్రీస్తుయేసునందు దేవునితో దేవునియందు ఉన్నాము కాబట్టి మనము కూడా ఓలిపోక సోలిపోక దేవునియందు స్థిరముగా సాగిపోదాము!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*ఐదవ భాగం*

 

1థెస్స 1:1—

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! గతభాగంలో సంఘము తండ్రియైన దేవునియందును కుమారుడైన యేసుక్రీస్తు నందును భద్రముగా ఉంది అని ధ్యానం చేసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

      ప్రియులారా! ఇక రెండుమూడు వచనాలు ఎంతో శ్రేష్టమైనవి ! చూడండి విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును .....

 

ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవ జీవితానికి కావలసిన మూడు గొప్ప లక్షణాలు కనిపిస్తాయి! ఇవి ప్రతీ క్రైస్తవ విశ్వాసి/ సేవకుడు/ కాపరి తప్పకుండా పొందుకోవాలి!

 

చూద్దాము: మొదటిది *విశ్వాసముతో కూడిన మీ పనిని*... విశ్వాసము అనగా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అబ్రాహాము గారు! ఆయన కేవలం విశ్వాసము ఉంచడమే కాకుండా తన విశ్వాసమును క్రియల్లో చూపించారు. మొదటగా నీ తండ్రి ఇంటివారిని అందరిని విడిచి నేను చూపించబోయే దేశానికి వచ్చెయ్ అంటే దేశము వెళ్లాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్తే నాకేంటి? అని అడగకుండా బయలుదేరి పోయారు. తన విశ్వాసాన్ని చేతలలో చూపించారు!

Genesis(ఆదికాండము) 12:1,2,3,4

1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

4. యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.

*రెండవదిగా*: నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కగానొక్క కొడుకుని నేను చూపించే కొండమీద బలి ఇచ్చేయ్ అంటే నీవు దేవుడువా రాక్షసుడివా?నాకు కొడుకుని ఇచ్చి మరలా తీసేసుకుంటావా అనలేదు! ఏమీ మారుమాట్లాడకుండా వెళ్లి బలి ఇచ్చేస్తున్నారు. దేవుడు ప్రత్యక్షమై వరాలు ఫలాలు ఇచ్చారు! అదీ విశ్వాసం! విశ్వాసం క్రియలతో కూడినది అయినందున ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డారు ఇంకా నీతిగా ఎంచబడింది అని వ్రాయబడింది బైబిల్ లో!

యాకోబు 2: 21

మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

 .. యాకోబు గారు అంటున్నారు 2:14—17..James(యాకోబు) 2:14,15,16,17

 

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

15. సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై నాటికి భోజనములేకయున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ..

 

యాకోబు 2: 26

ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

 

    కాబట్టి క్రియలు లేకుండా కేవలం విశ్వాసం ఉంటే అది నిష్పలం! అయితే ఇక్కడ సంఘానికి క్రియలతో కూడిన పని! విశ్వాసముతో కూడిన మీ పనిని అంటున్నారు పౌలుగారు!  ప్రతీ విశ్వాసికి విశ్వాసముతో పాటుగా క్రియలు ఉండాలి! క్రియలు లేకపోతే వ్యర్ధము!

ఇక పౌలుగారు అబ్రాహము గారి విశ్వాసము కోసం ఇంకా ఏమని వ్రాసారో చూసుకుందాము!

 

రోమా 4:17—22;

16. హేతువుచేతను వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.

17. తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

18. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక

21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

 

హెబ్రీ 11:8—18Hebrews(హెబ్రీయులకు) 11:8,9,10,11,12,13,17,18,19

 

8.అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.

9.విశ్వాసమునుబట్టి అతడును, అతనితో వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

10.ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11.విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12.అందుచేత మృతతుల్యుడైన యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13.వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

17.అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

18.ఎవడు వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,

19.తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

 

ఇంకా యాకోబు గారు చెప్పేది విందాము 2:21—23

21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?

22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?

23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.

 

కాబట్టి మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి! ప్రియ విశ్వాసి! నీ విశ్వాసం కేవలం మాటలతో ఉన్నదా లేక క్రియలు కూడా కనిపిస్తున్నాయా? ఒకవేళ క్రియలు లేకపోతే మ్రోగెడు కంచు గణగణ లాడు తాళం అని మర్చిపోవద్దు!

 

ఒక విషయం జ్ఞాపకము చేసుకుందాము! యేసుక్రీస్తు ప్రభులవారి వద్దకు అనేకమంది స్వస్థత కోసం వచ్చినప్పుడు అనేకమందికి యేసయ్య నీ విశ్వాసము నిన్ను స్వస్త పరిచింది అన్నారు! కారణం వారు విశ్వాసముంచడమే కాదు దానిని నమ్మి యేసయ్య వద్దకు వచ్చారు! అందుకే స్వస్థత పొందగలిగారు! 12 సంవత్సరాలనుండి రక్తస్రావముతో బాధ పడుచున్న స్త్రీ యేసు వస్త్రపు చెంగుమాత్రము ముడితే బాగుపడతాను అని నమ్మి విశ్వసించి ముట్టింది బాగుపడింది. అందుకే దేవుడు చెప్పారు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్త పరచింది!

 మత్తయి 9:22; మత్తయి 15:28; మార్కు 2:5; మార్కు 5:34; మార్కు 10:52; లూకా 7:50; లూకా 8:47; లూకా 17:19; లూక 18:42; 

అయితే గమనించాలి: పక్షవాయువు వ్యాధితో బాధపడుచున్న వ్యక్తిని ఇంటి పైకప్పు విప్పి యేసయ్య వద్దకు దించితే అక్కడ వ్రాయబడింది వారి విశ్వాసమును చూసి.... అక్కడ నలుగురి విశ్వాసమును చూసి రోగిని యేసుక్రీస్తుప్రభులవారు స్వస్తపరిచారు! కాబట్టి విశ్వాసం మాత్రమే సరిపోదు దానితో పాటుగా క్రియలు కావాలి!

 

*ఇక తర్వాత లక్షణం*: ప్రేమతో కూడిన మీ ప్రయాస!  దేనికోసం ప్రయాస? క్రీస్తు సువార్త కోసం, క్రీస్తులో విశ్వాసమందు నిలబడటానికి ప్రయాస! పరిచర్య కోసం ప్రయాస! అవును ఆది అపోస్తలులు ఎన్నో ప్రయాసలు పడి మనకు సువార్తను అందించారు కాబట్టే మనము రక్షంచబడ గలిగాము! ఆది అపోస్తలులుతో పాటుగా కొన్ని లక్షలమంది మిషనరీలు మనకోసం ప్రయాసలు పడి ప్రాణత్యాగాలు చేశారు. తద్వారా మనం ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్తితిలో ఉన్నాము! దీనినే ప్రేమతో కూడిన ప్రయాస అంటారు! సంఘానికి కూడా అట్టి ప్రేమతో కూడిన ప్రయాస ఉంది! ఆనాడు వారు చూపించారు కాబట్టి మనవరకు సువార్త వచ్చింది మనము అంగీకరించాము! చూడండి మనలో అనేకమంది దైవజనులు సువార్త చెబుతుంటే గేలిచేసిన వారున్నారు! వారిని అవమానించి వారిని కొట్టిన వారున్నారు అయినా వారు మనలను శపించలేదు! మనలను క్షమించి  మనకోసం కన్నీటితో ప్రార్ధన చేసి  ప్రేమ చూపించారు! ఎంతో ప్రయాసలు పడ్డారు! కాబట్టి ఇలాంటివారిని మనము సన్మానించాలి! అయితే మనము సన్మానించినా లేకపోయినా వారికి దేవుని నుండి గొప్ప బహుమానాలున్నాయి!

 

ఇక్కడ ప్రేమ అనేమాట కు గ్రీకు భాషలో ఆగాపే అని వాడబడింది. ఆగాపే అనగా తండ్రియైన దేవుని ప్రేమ!  అది అర్ధం అవ్వాలంటే మనకు 1కొరింథీ 13 అధ్యాయం మొత్తం చదవి అర్ధం చేసుకోవాలి!  ..

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

9. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని

10. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

 

కాబట్టి ఎలాంటి క్రియలు ఉండాలి అంటే ప్రేమతో కూడిన అనగా దేవుని ప్రేమతో కూడిన క్రియలు గల విశ్వాసము గలవారుగా ఉండాలి!

 

అంతెందుకు? యేసుక్రీస్తుప్రభులవారు నిన్ను నన్ను ప్రేమించడమే కాకుండా నిన్ను నన్ను రక్షించడానికి ఎన్నో ప్రయాసలు పొందారు! పిడిగుద్దులు తిన్నారు! రక్తాన్ని కార్చారు! సిలువ మరణం పొందారు! అవమానాలు పొందారు! అన్ని ప్రయాసలు పడ్డారు కాబట్టి నిన్ను నన్ను రక్షించ గలిగారు! ఇదీ ప్రేమతో కూడిన ప్రయాస అంటే!

థెస్సలోనికయ సంఘము కూడా  ఇలాంటి గొప్ప పరిణితి కలిగి మాదిరిగా ఉంది!

 

మరి అటువంటి ప్రేమ లేక ప్రేమతోకూడిన ప్రయాస నీకుందా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*ఆరవ భాగం*

1థెస్స 1:1—

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! గతభాగంలో సంఘము తండ్రియైన దేవునియందును కుమారుడైన యేసుక్రీస్తు నందును భద్రముగా ఉంది అని ధ్యానం చేసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

*ఇక తర్వాత గొప్ప లక్షణం*: *మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు*!  ఇక్కడ రెండు కనిపిస్తాయి మనకు మొదటగా నిరీక్షణ- ఎవరియందు నిరీక్షణ? ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ! తర్వాత ఓర్పు! అనగా శ్రమలయందు ఓర్పు! శోధనలయందు ఓర్పు! పరీక్షల యందు ఓర్పు! ఎందుకు ఓర్పు చూపిస్తున్నారుమనప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన కలిగిన ఓర్పు నిరీక్షణ!

ప్రసంగి అంటున్నాడు: 10:4 ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండా చేయును!

పౌలుగారు రోమా పత్రిక రాస్తూ అంటున్నారు 5: లో అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ లేక శీలమును కలుగజేయును...

కాబట్టి యేసుక్రీస్తులో గల ఓర్పు ఉంటే శ్రమలలో ఓర్పు నిరీక్షణ శీలము అనగా సాక్ష్యమును కాపాడుకోవడం అన్నీ పొందుకొవచ్చు!

ఇంకా అంటున్నారు పౌలుగారు రోమా 12:12 లో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్ధన యందు పట్టుదల కలిగి యుండుడి! చూడండి ఎప్పుడైతే ఓర్పు నిరీక్షణ కలిగి యుంటారో అప్పుడు ప్రార్ధన యందు పట్టుదల వస్తుంది అన్నమాట!

 

యాకోబుగారు అంటున్నారు మీరు సంపూర్ణులు అవ్వాలంటే ఇంకా విషయంలోనైనా కొరత లేకుండా ఉండాలంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనియ్యండి అంటున్నారు. 1:4;

అంతకంటే గొప్ప మాట దొడ్డ మాట మనకు ప్రకటన :10 లో కనిపిస్తుంది : నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు అనగా శ్రమలయందు ఎంతో ఓర్పు కల్గి విశ్వాసమందు నిలకడగా ఉన్నావు కాబట్టి భూనివాసులను శోదించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను! హల్లెలూయ!

ఎవరైతే దేవుని వాక్యము నిమిత్తము ఆయన నామము నిమిత్తము ఓర్పు నిరీక్షణ కలిగియుంటారో వారిని దేవుడు శోధన గడియలో కాపాడు తాను అంటున్నారు! మరి ప్రియ సంఘమా నీకు శ్రమలలో ఓర్పు నిరీక్షణ కలిగి యున్నావా?

 

గమనించాలి ఆదిమ భక్తులకు అనగా పాత నిబంధన భక్తులకు మరియు క్రొత్త నిబంధన భక్తులకు అందరికీ శ్రమలు శోధనలు కలిగాయి. గాని ఎన్ని శోధనలు కలిగిన వారు చావడానికైనా సిద్దపడ్డారు తప్ప దేవుణ్ణి దేవునియందలి విశ్వాసము వదలకుండా నిరీక్షణ కలిగియున్నారు కాబట్టే అన్ని గొప్ప కార్యాలు చేయగలిగారు!

 

షడ్రాక్ మేషాక్ అబెద్నేగో లను అగ్ని గుండములో వేసేశారు అయినా నిరీక్షణ విశ్వాసమును కోల్పోలేదు! చావనైనా చస్తాము గాని నీ బంగారు బొమ్మను మొక్కము అని తెలుసుకో అని చక్రవర్తికి సమాధానం చెప్పారు! ఏమయింది? చక్రవర్తికి మరియు అక్కడున్న ప్రజలకు దేవుని సాక్షాత్కారము కలిగించడమే కాకుండా, రాజైతే నా చేతిలోనుండి మిమ్మును తప్పించ గలిగే దేవుడెవడైనా ఉన్నాడా అన్నాడో రాజుతోనే  ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని  అనిపించ గలిగారు!!

 

దానియేలు గారిని సింహాల బోనులో వేసేశారు అయినా ఆయన ప్రార్ధన మానలేదు! ఏమయ్యింది దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించారు.

 

ఇక ఆది అపోస్తులులు మరణాన్ని ఆహ్వానించారు, క్రీస్తుకోసం నిలబడ్డారు! రంపములతో కోయబడ్డారు చెరశాల అనుభవించారు రాళ్ళ దెబ్బలు తిన్నారు అయినా వారి ఓర్పు తగ్గలేదు నిరీక్షణను కోల్పోలేదు! ప్రియ విశ్వాసి నీకు అటువంటి ఓర్పు నిరీక్షణ ఉన్నదా? శ్రమలు వస్తే కృంగిపోతున్నావా? భక్తుడు అంటున్నాడు శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతకాని వాడవౌదువు! సామెతలు 24: 10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

 నీవు చేతకాని వాడిగా ఉంటావా లేక పౌరుషము కలిగి ఉంటావా?

 

చివరగా మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి ఓర్పుతో కూడిన నిరీక్షణ అంటున్నారు భక్తుడు! ఓర్పు ఎందుకంటే శ్రమలు కలుగుతాయి గనుక ఓర్పు! మరి ఇక్కడ నిరీక్షణ కోసం మాట్లాడుచున్నారు పౌలుగారు! శుభప్రదమైన నిరీక్షణ కోసం! ఇంకా చెప్పాలంటే తీతుకు 2:121 లో వ్రాయబడిన శుభప్రదమైన నిరీక్షణ కోసం! శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు . లోకములో స్వస్తబుద్ధితోను నీతితోను భక్తితోనూ బ్రతుకుచుండాలి అని మనకు బోధించుచున్నది!!!!

 

శుభప్రదమైన నిరీక్షణ అంటే.... మన రక్షకుడు నిజదేవుడైన యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు నేను వెళ్లి మీకు స్థలము సిద్దపరుస్తాను అప్పుడు నేను మరలా వచ్చి నేనుండే స్థలములో మీరుండే లాగు నేను మిమ్మును తీసుకుని పోతాను. ఆయన మహా మహిమతో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో రాబోతున్నారు. మనము మంటి దేహమును వదలి మహిమ శరీరము దాల్చి మేఘాలమీద మన ప్రభువైన యేసును ఎదుర్కోడానికి వెల్లబోతున్నాము! అక్కడ మన ప్రియ రక్షకుని చూడబోతున్నాము వేవేల దూతల సమూహమును చూసి దూత పాటలను వినబోతున్నాము! మన ప్రియలైన వారిని కలుసుకోబోతున్నాము! అబ్రాహము గారికి హాయ్ చెబుతాము! దానియేలు గారితో విందు చేస్తాము! యోనా గారిని ఇంటర్యూ చేస్తాము చేప కడుపులో మూడు రోజులు ఎలా ఉండగలిగారు అంటూ! పేతురు గారితో మాట్లాడతాము! పౌలు సీలలతో కలిసి పాటలు పాడతాము! చివరికి యుగయుగాలు దేవునితో కలిసి ఉంటాము! ఇదే శుభప్రదమైన నిరీక్షణ! నిరీక్షణలో ఉండాలి అంటే మొదటగా ఓర్పు కావాలి! విశ్వాసమందు నిలకడగా ఉండాలి! థెస్సలోనికయుల సంఘము వాటియందు నిలకడగా ఉంది!

 

ప్రియ సహోదరి సహోదరుడా! నీవు అటువంటి శుభప్రదమైన నిరీక్షణను కలిగి యున్నావా? శ్రమయందు ఓర్పు ఓర్పుయందు నిరీక్షణ కలిగియున్నావా? అయితే బైబిల్ లో వ్రాయబడిన మేలులు నీకే! ఏది కావాలో నిర్ణయించుకో!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*ఏడవ భాగం*

1థెస్స 1:1—

1. తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ఇంతవరకు మనము థెస్సలోనికయుల సంఘంలో గల మూడు గొప్ప లక్షణాలను ధ్యానం చేస్కున్నాము! అవి విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు!!!

 

        (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! సంఘములో గల మూడు లక్షణాలను చూసి మెచ్చుకోవడమే కాకుండా వారు ఇంకా అలాగే వాటిలో కొనసాగాలని పౌలుగారు గారు సీలగారు తిమోతి గారు వారి అనుదిన ప్రార్ధనల యందు థెస్సలోనికయ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారికోసం విజ్ఞాపనం చేస్తున్నాము అంటున్నారు!  గమనించాలి ఇక్కడ పౌలుగారు నేను ప్రార్ధన చేస్తున్నాను అనడం లేదు గాని మా ప్రార్ధనలయందు మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటున్నారు! అవును సంఘకాపరి / నాయకులు తప్పకుండా తమ మందకోసం అనుదినం ప్రార్ధనా విజ్ఞాపనము చెయ్యాలి! అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది.

 

     దురదృష్టవశాత్తూ కొన్ని సంఘాలలో (గమనించాలి అన్ని సంఘాలలో కాదు) కాపరులు ఆదివారంనాడు, ఇంకా కొన్ని కధా కార్యక్రమాలలో ప్రసంగం చేసి దులిపేసుకుని పోతున్నారు. కారణం వారు జీతానికి పని చేస్తున్నారు. సంఘస్తుల పేర్లు కూడా అనేకమందికి తెలియదు! అయితే దానికి సంఘ యాజమాన్యం కూడా భాద్యత ఉంది. కొన్ని సంఘాలలో కాపరి విశ్వాసుల ఇంటికి వెళ్లి ప్రార్ధన చెయ్యాలి అంటే యాజమాన్యం అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఉంది!  ఇలాంటి సంఘాలలో కాపరి-విశ్వాసుల సంబంధం ట్యూషన్ మాస్టర్- విద్యార్ది లాగ, జీతగాడు-గొర్రె లాగ ఉంది గాని తండ్రి- కుమార/కుమార్తెల అనుబంధం లేక, ప్రేమాభిమానాలు అంతరించి పోతున్నాయి! ఇది నిజంగా దేవుడు- పరిశుద్ధాత్ముడు ఆశించిన లక్షణం కానేకాదు! మరి ఇలాంటి పరిస్తితిలో కాపరి – తన మందకోసం ఎలా ప్రార్ధన చెయ్యగలడు??!!! అయితే కొంతమంది సేవకులు – కేవలం ప్రసంగాలు చేసి- విశ్వాసులు కోసం ప్రార్ధన చెయ్యడం మానేస్తున్నారు, వారి ఆత్మీయ జీవితం కోసం పట్టించుకోవడం మానేస్తున్నారు! వీరు తప్పకుండా ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. అందుకే పౌలుగారు తిమోతి గారితో నిన్ను గూర్చియు నీ బోధ గూర్చియు జాగ్రత్తగా చూసుకో అంటూ నీ సంఘాన్ని కూడా పట్టించుకోమంటున్నారు!....

1తిమోతికి 4: 16

నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.

 

1తిమోతికి 6: 20

తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.

 

   ఇక మూడవ వచనంలో మీ అందరి నిమిత్తము ఎల్లపుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు! గమనించాలి- ఇక్కడ కూడా బహువచనమే! ఏక వచనం అనగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను అనడం లేదు! ఇదీ అందరినీ కలుపుకొని పోవడం అంటే! నాయకునికి ఉండవలసిన లక్షణం ఇది! తానే కాకుండా తన జూనియర్లను కూడా కలుపుకుని పోతున్నారు పౌలుగారు ఆడంబరం లేకుండా!

 

         అయితే ఇక్కడ మీకో విషయం గుర్తుచెయ్యాలని అనుకుంటున్నాను! మిగిలిన పత్రికలలో పౌలుగారి ప్రార్ధన కనిపిస్తుంది! ఇక్కడ కూడా పౌలుగారి ప్రార్ధన ఉంది గాని మిగతా పత్రికలలో పౌలుగారి ప్రార్ధన ప్రత్యేకమైన అంశమును గూర్చి ఉంటుంది అనగా వారు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలని పౌలుగారు కోరుకుంటున్నారో దానికోసం ఆయన ప్రార్ధన ఉంటుంది. ఉదాహరణకు కొలస్సీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి ఇంకా అనేక సంఘాలకు రాస్తూ ఎలా వారు ఇంకా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదగాలో ప్రార్ధనలలో కనబడుతుంది.

కొలొస్సయులకు 1:9,10,11,12

 

9. అందుచేత సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

11. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

 

గమనించాలి! ఎన్నోసార్లు చెప్పానుపౌలుగారి ప్రార్ధనలలో ఎక్కడ భౌతికమైన వాటికోసం ఇంకా మెటిరియల్ బ్లెస్సింగ్స్ కోసం ప్రార్ధన చెయ్యలేదు! అన్నీ ఆత్మీయ సంగతులు, ఆధ్యాత్మికమైన సంగతులు ఇంకా చెప్పాలంటే పరలోక సంబంధమైన సంగతులు- మాత్రమే కనిపిస్తాయి!

 

అయితే థెస్సలోనికయులకు మాత్రం దానికోసం ఏమీ రాయలేదు! మీ మూడు లక్షణాలు చూసి మేము మీకోసం అనుదినం మా ప్రార్ధనా విజ్ఞాపనల యందు మిమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నారు అంతే!!! ఏమి ఇలా వీరికోసం ప్రత్యేకమైన ప్రార్ధన చేయడం లేదు? సంఘమంటే పౌలుగారికి ఇష్టం లేదా???

 

కానేకాదు! కారణం వీరికోసం ప్రత్యేకమైన ప్రార్ధన అవసరం లేదు! మీద రెండో వచనం చూసుకుంటే వీరి ఆత్మీయ స్థాయి మనకు అర్ధమవుతుంది. వీరు ఇప్పటికే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు కాబట్టే వీరికోసం ప్రత్యేకమైన ప్రార్ధన చెయ్యలేదు!

వీరు తండ్రియైన దేవునితోను కుమారుడైన యేసుక్రీస్తు తోను ఐక్యమై పరిపూర్ణత సంపూర్ణత సాధించి రాకడ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది? ఎలా ఎగిరిపోతాము? ఎంత తొందరగా ఎగిరిపోతాము? తీసుకుని వెళ్లడానికి ఎవరొస్తారు? ఎలా ఎగిరిపోతాము? శరీరంతో ఎగిరిపోతాము? దేనిమీద ఎగిరిపోతాము? ఇదే వారి ధ్యాస!!! ఇక వారి ఆలోచనలన్ని రాకడలో ఎగిరిపోవడం కోసమే తప్ప మరో ధ్యాస లేదు! అంతా ఆధ్యాత్మిక జిజ్ఞాస;

ఇంతటి పరిపూర్ణ పరిపక్వ స్థితిలో వీరున్నారు కనుకనే వీరు ఇంకా లోతైన అనుభవాల కోసం లోతైన మర్మాలు కోసం పౌలుగారిని తిమోతి గారిని సీల గారిని అడగడం మొదలుపెట్టారు కాబట్టే వీరు ఇంకా ప్రార్ధనలో కనిపెట్టి ఆత్మావేశులై ఉత్తరాన్ని రాస్తున్నారు! వీరికి అంత లోతైన విషయాలు తెలుసుకోవాలనే ఆశ జిజ్ఞాస ఉంది కాబట్టే పత్రికలోను లేని ప్రత్యక్షతలు పత్రికలలో మనకు కనిపిస్తాయి! నేడు ప్రతీ సంఘము ఇలాంటి అనుభవానికి రావాలి!

 

నిజం చెప్పాలంటే మన భారతదేశ సంఘం ఇప్పుడు నిద్రావస్త స్థితిలో ఉంది! కరోనా వచ్చాక బాగుపడుతుంది అంటే మరింత దిగజారిపోయింది. ఇంతమంది చనిపోతున్నా ఇంతమంది దైవసేవకులు చనిపోతున్నా గాని ఎవరికీ పట్టకుండా ఉంటుంది! ఆధ్యాత్మికంగా ఇంకా నిద్రపోతున్నారు! కాబట్టి సంఘమా వెంటనే మేలుకో! ప్రార్ధించడం మొదలుపెట్టు!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*8 భాగం*

*ఆదర్శ సంఘము*

 

1థెస్స 1:4—5

4. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

5.మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు.

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ఇంతవరకు మనము థెస్సలోనికయుల సంఘంలో గల మూడు గొప్ప లక్షణాలను ధ్యానం చేస్కున్నాము!

 

    ప్రియులారా! థెస్సలోనికయ సంఘము ఎంతో ఆదర్శవంతమైనది! రకముగా అది ఆదర్శవంతమైనదో కొన్ని రోజులు ధ్యానం చేసుకుందాము!

 

    నాలుగో వచనంలో దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా! అంటూ సంభోదిస్తున్నారు పౌలుగారు! చూడండి- నా విశ్వాసులారా! అని గాని నా పిల్లలారా! అని గాని పిలవడం లేదు! ఇక్కడే అసలు విషయం కనిపిస్తుంది! నేడు ఎంతోమంది కాపరులు సేవకులు నాయకులు విశ్వాసులమీద అధికారులు లాగ ఫీలైపోతున్నారు! వారి మీద రాజులులా ప్రవర్తిస్తున్నారు! అందుకే పేతురు గారు అందరిని హెచ్చరిస్తున్నారు- మీకు అప్పగింప బడిన వారిపైన ప్రభువైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి అంటున్నారు! 1పేతురు 5:14

 

1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.

2. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

3. *మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి*;

4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

 

   నిజంగా ఇది నేటి కాపరులకు నాయకులకు సేవకులకు ఆదర్శం కావాలి! పేతురు గారు అలాగే ప్రభువులాగ వారిమీద అధికారం చెయ్యకుండా వారితో సమానమైన వాడిగా భావించి ఆదర్శంగా నిలచిపోయారు! ఇక పౌలుగారు ఎప్పుడు తనకున్న అధికారాలు ఉపయోగించకుండా మాదిరిగా ఉన్నారు! ఇక్కడ అంటున్నారు *దేవునివలన ప్రేమించబడిన సహోదరులారా*! చూడండి సహోదరులు అనగా తనతోపాటు సమానమైన వారు! నిజానికి థెస్సలోనికయులు పౌలుగారికి ఎన్నో విధాలుగా రుణపడి ఆయనకంటే తక్కువ ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు గాని దానిని చెప్పకుండా తగ్గించుకుని క్రీస్తు స్వారూప్యము తనయందు ఏర్పరచబడాలని సహోదరులారా అంటూ తనతో సమానమైన వారుగా సంబోదిస్తున్నారు! పౌలుగారికి ఆదర్శం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు!!! ఆయనకూడా తన మరణమునకు ముందుగా యోహాను పత్రికలో స్నేహితులారా అంటూ దేవాదిదేవుడు తన శిష్యులను తనతో పాటు సమానంగా భావించి సంబోధించారు! యోహాను 15:1415;

 

14. నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.

15. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక *ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను*, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.  

దానినే పేతురు గారు నేర్చుకున్నారు! దానినే యేసుక్రీస్తు ప్రభులవారితో భౌతికంగా సహవాసం చెయ్యకపోయినా ఆత్మలో సహవాసం చేసి అదే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారు పౌలుగారు!

నాకు తెలుసు నేడు అనేకమంది కాపరులు, టీవీ ప్రసంగీకులు, మామూలు ప్రసంగీకులు- సమయానికి కారు రాకపోయినా, AC రూమ్ ఇవ్వలేకపోయినా, మర్యాదలు చేయలేకపోయినా, కానుక తక్కువ ఇచ్చినా కస్సుబుస్సు లాడుతూ, దుర్భాష లాడుతూ అలిగి పారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు! మాత్రం దిక్కులేకపోతే నన్నెందుకు పిలిచారు అంటున్నారు!

 నేడు బోధకుడు/ కాపరి/ సేవకుడు/ అపోస్తలుడు/ తండ్రి/ అంటూ ఇంకా రెవరెండు అంటూ/ ఆచార్య అంటూ పిలిపించుకుంటున్న పెద్దమనిషి!! ఇలా నీ విశ్వాసులను సంభోదిస్తున్నావా ? సంభోదించడమే కాదుఅలా వారితో జీవిస్తున్నావా? నేడే పరిశీలన చేసుకుని- యేసుక్రీస్తు ప్రభులవారు, పౌలుగారు, పేతురు గార్ల వలే మాదిరిగా జీవించమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

 

    సరే ఇక్కడ దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా అని పిలవడమే కాకుండా వచనంలో చివరి పాదంలో మాకు తెలుసు అంటున్నారు పౌలుగారు! (ఇక్కడ కూడా బహు వచనమే) దీని అర్ధమేమిటి? కారణం పౌలుగారికి థెస్సలోనికయుల సంఘం నిజమైన విశ్వాసులు అనేందుకు అనేకమైన సాక్ష్యాధారాలు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. రెండో వచనంలో చెప్పిన లక్షణాలే కాకుండా వారి నడవడిక, ప్రవర్తన, ప్రార్ధన, విశ్వాసము అన్నీ చూసి వారిని దేవుడు నిత్యజీవమునకు ఎన్నుకున్నారని వాటి మూలంగా పౌలుగారికి గట్టి నమ్మకం కుదిరింది అందుకే మాకు తెలియును అని నొక్కివక్కానించి బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఇక్కడ!

 

  మొదటి విషయం మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త.....

మీరు ఏర్పరచబడిన సంగతి అంటున్నారు .. దేనికోసం ఏర్పరచబడ్డారు? నిత్యజీవం కోసం!  దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎఫెసీ పత్రికలో పౌలుగారు ఇంకా అర్ధమయ్యే విధంగా రాస్తున్నారు ఎఫెసీయులకు 1:4,5,6,8,9,11,12

 

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, కృపను మనయెడల విస్తరింపజేసెను.

11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

 

 గమనించాలి మనలను ఆయన ముందుగానే నిర్ణయించు కొన్నారు లేదా ఏర్పరచుకున్నారు! మనము ఆయన సంకల్పంలో ఉన్నాము! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అంశం ఏమిటి అంటే దేనికోసం మనకు ఏర్పరచు కున్నారు?? ఆయన సన్నిధిలో పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన అనగా దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకొన్నారు! హల్లెలూయ! ఎంత దొడ్డ మాట కదండీ! ఇంకా మనలను కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే నిర్ణయం తీసుకున్నారు! ఇది ఆయన సంకల్పం! ఇంత మహోన్నతమైన సంకల్పం కలిగి పిలుపును ఏర్పాటును కలిగిన ప్రియ విశ్వాసి/ సేవకుడా/కాపరి! దానికి తగిన జీవితం జీవిస్తున్నావా?

 

అసలు నీ పిలుపు ఎంత గొప్పదో తెలుసా? 1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

పేతురు 1: 2

ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

 

రోమీయులకు 1: 2

దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న *దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి* (శుభమని చెప్పి) వ్రాయునది.

1కోరింథీయులకు 1: 2

కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా *క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని*, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

ఒకవేల పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించకపోతే ప్రకటన గ్రంధంలో  అంటున్నారు నీ దీప స్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసేస్తాను అని నోట నుండి ఉమ్మేస్తాను అని అంటున్నారు జాగ్రత్త! 2:5; 3:16;

 

 పిలుపుకు తగినట్లుగా జీవించమని చెబుతున్నారు!

 

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

 

1థెస్సలొనికయులకు 2: 11

తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,

 

అందుకే పేతురుగారు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటున్నారు....2పేతురు 1: 10

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

 

దేవుని సేన ప్రకటన గ్రంధంలో పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారును అయి ఉన్నారు అందుకే సాతాను గాడి సైన్యాన్ని చితకదన్నేరు అక్కడ!

ప్రకటన గ్రంథం 17: 14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన రాజులను జయించును.

 

నీ పిలుపుకు తగిన జీవితం నీవు జీవిస్తున్నావా ప్రియ విశ్వాసి/ సేవకుడా/ కాపరి! లేకపోతే విడువబడతావు జాగ్రత్త!

కాబట్టి మనము మన పిలుపునకు ఏర్పాటునకు తగిన జీవితం జీవిద్దాము! కాలదన్నుకున్న గేహాజి, దేమా నాశనమైపోయారు!

భయము కలిగి జీవిద్దాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*9 భాగం*

*ఆదర్శ సంఘము-2*

1థెస్స 1:4—5

4. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా మీరు  ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాకుండా అది శక్తితోను, పరిశుద్ధాత్మ తోనూ, సంపూర్ణ నిశ్చయత తోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును అంటున్నారు. ఏర్పరచబడిన వారు అనేదానికోసం గతభాగంలో చూసుకున్నాము! ఇప్పుడు అంటున్నారు మీ దగ్గరకు వచ్చిన సువార్త కేవలం మా మాటల ద్వారా కాకుండా అది శక్తితోను అంటూ పరిశుద్ధాత్మ శక్తితోను సంపూర్ణ నిశ్చయత తోనూ వచ్చినది అంటున్నారు. మా సువార్త కేవలం మాటతో రాలేదు మీ దగ్గరకు- అది ఎంతో ప్రభావముగా మీ దగ్గర అది ప్రత్యక్ష పరచబడింది లేక సాక్షాత్కరించ బడింది ( manifested with Might & Power) ప్రియులారా మనము 10 వచనం వరకు చూసుకుంటే వారు అనగా థెస్సలోనికయ వారు విధంగా రక్షించ బడ్డారో చాలా సాక్షాధారాలు ఇస్తున్నారు మనకు!  పౌలుగారు మరియు సీల, తిమోతి గార్లు సువార్త అందించినప్పుడు ఎంతో పరిశుద్ధాత్మ సన్నిధిని, తాకిడిని అనుభవించారు భక్తులు! అదే తాకిడిని పరిశుద్దాత్మ అభిషేకాన్ని థెస్సలోనికయ సంఘము కూడా అనుభవించింది. అది ఎంతో గంభీరమైన మార్పును వారి జీవితాలలో తీసుకుని వచ్చింది. అది ఎంతో ప్రస్పుటముగా కనిపించింది సంఘంలో! అలా అనుభవించిన అభిషేకపు తాకిడి వారు క్రీస్తుకోసం ఎన్ని శ్రమలను అనుభవించినా ఇంకా విశ్వాసమందు నిలకడగా నిలపడేలా ఇంకా  బలపడేలాగా చేసింది తప్ప విశ్వాస బ్రష్టులను చెయ్యలేదు! ఇదీ పరిశుద్ధాత్మ మహాత్యం మరియు శక్తి! ఇది ముగ్గురు దైవజనులు చూశారు చూసి సాక్ష్యం చెబుతున్నారు! అందుకే మాకు తెలియును అంటున్నారు! ప్రియ సంఘమా! మిమ్మును చూసి మీ విశ్వాసమును చూసి మీ కాపరి నేడు ఇలా  సాక్ష్యమును చెప్పగలరా? అందుకే సంఘము ఆదర్శ సంఘమయ్యింది!

 

    పౌలుగారు మా సువార్త మాటతో మాత్రమే రాలేదు అంటున్నారు. ఇంకా కొన్ని సంఘాలకు మీకు మేము వాక్చాతుర్యము చూపించి మీకు సువార్త ప్రకటించలేదు అంటున్నారు! 1కొరింథీ 17,18 ...

17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

 

1కోరింథీయులకు 2: 5

నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.

 

ఇంకా 1థెస్స 2:5

మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

 

సువార్త ఎంతో శక్తి కలది లేక దేవుని శక్తి అంటున్నారు భక్తులు: 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:23,24

23. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

 

1కోరింథీయులకు 1: 18

సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

 

రోమా పత్రికలో ఇంకా లోతైన మర్మము చెబుతున్నారు సువార్త కోసం పౌలుగారు. 16:25....

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

ఇంతకీ మర్మము ఏమిటి? సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు కావాలి.. ఇంకా

ఎఫెసీయులకు 3: 6

మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.

 

ఇంకా సువార్తలో ఏమున్నది? లేక సువార్త అంటే ఏమిటి?

1కొరింథీ 15:1—8...1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:1,2,3,4,5,6,7,8

1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.

2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

4.  లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

 

వచనాలన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడైతే సువార్త ప్రకటన జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధి/ శక్తి/ పరిశుద్ధాత్మ ఎంతో బలంగా పనిచేస్తుంది.

అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు తాను ఆరోహణమై వెళ్ళేటప్పుడు మీరు పైనుండి శక్తి పొందే వరకు ఎక్కడికి వెళ్లొద్దు ఏమీ చెయ్యొద్దు! పట్టణంలో నిలిచియుండండి ఎందుకంటే మొదటగా మీరు పైనుండి శక్తి పొందుకోవాలి అప్పుడు మీరు నాకు భూదిగంతముల వరకు సాక్షిగా ఉండగలరు! శక్తిలేకపోతే మీరు ఏమీ చెయ్యలేరు!

లూకా 24:49

ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

 

Acts(అపొస్తలుల కార్యములు) 1:4,8

4. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;

8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

  శక్తి పెంతుకోస్తు పండగ దినమందు మేడగది లో ప్రార్ధనచేయుచుండగా పొందుకున్నారు!

Acts(అపొస్తలుల కార్యములు) 2:1,2,3,4

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

 

అలా పొందుకున్న శక్తి రోజునుండి ఇంతవరకు ప్రవహిస్తూ అనేకులను బలపరుస్తూ మండిస్తున్నది! దురదృష్టము ఏమిటంటే అనేకమందిలో నేడు శక్తి లేక చేవలేని సేవ చేస్తున్నారు! అనేకమంది కేవలం ఉపదేశించడంలో మాటలు మాత్రం కనిపిస్తున్నాయి గాని వారిలో దైవిక శక్తి కనబడటం లేదు! కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు గాని ఏదో మ్రొక్కుబడిగా చేస్తున్నారు- అయినా సువార్తలో గల బలప్రభావాల వలన ఎంతోమంది రక్షించబడుతున్నారు! అదే బలము శక్తి పొందుకుని ఆది అపోస్తలులులాగా సువార్త ప్రకటిస్తే థెస్సలోనికయుల పట్టణంలో మన పౌలుగారు, తిమోతి గారు సీల గారు పట్టణస్తులు ఏమన్నారు భూలోకమును తలక్రిందులుగా చేసేవారు మనదగ్గరకు వచ్చేసారు! అదీ శక్తి!

అపో  17:6

6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి *భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు*; యాసోను వీరిని చేర్చుకొని యున్నాడు.

 

1కొరింథీ 2:4—5...

4. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని,

5. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.

మరి అలాంటి శక్తిని పొందుకోవాలని లేదా ప్రియ విశ్వాసి సేవకుడా! దయచేసి అలాంటి శక్తిని పొందుకుని సేవలో సువార్తలో సాగిపో!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*10 భాగం*

*ఆదర్శ సంఘము-3*

1థెస్స 1:4—5

4. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత ఎలా సువార్త ప్రకటిస్తుందో ధ్యానం చేసుకుంటున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

    యేసుక్రీస్తుప్రభులవారు పరిశుద్ధాత్మ కోసం ఏమన్నారో గుర్తు చేసుకోండి ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు మిమ్ములను నడిపిస్తారు...

యోహాను 14:16—17.

16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను (లేక,ఉత్తరవాదిని), అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

17. లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ (లేక,ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

 

ఇంకా ఈయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు....

John(యోహాను సువార్త) 16:13,14

13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్మ శక్తి తో నింపబడాలి!

 

 పౌలుగారు మరో భయంకరమైన మాట అన్నారు: మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు గాని దేవుని పరిశుద్ధాత్మతో నిండిఉండండి అప్పుడు మీరు గొప్ప కార్యాలు చెయ్యగలరు ఎఫేసి 5:18

మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.

 

      గమనించాలి ఇంత గొప్పగా ఘనముగా పౌలుభక్తుడు సువార్త ప్రకటించి నాలుగు మిషనరీ ప్రయాణాలు చెయ్యడానికి కొన్నివందల సంఘాలను స్తాపించడానికి తాను బలహీనుడైనా ఇంత బలమైన కార్యాలు చెయ్యడానికి మూలాధారం ఏమిటో తనకు తెలుసు: కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే పౌలుగారు ఇన్ని ఘనమైన కార్యాలు చేశారు! అంత బలంగా సువార్తను ప్రకటించ గలిగారు అన్ని దేశాలలో!

 

        సువార్త సత్యము అన్యజనులకు చేరకుండా చెయ్యాలని సాతాను గాడు వారి మనో నేత్రములకు గుడ్డితనము కలిగించి యుండగా కేవలం సువార్త సత్యము మరియు బల ప్రభావాలతో మాత్రమే మనం గ్రుడ్డితనం పారద్రోలగలము!

2కోరింథీయులకు 4: 4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 

పౌలుగారు సువార్త కోసం సిగ్గుపడే వాడను కాదు అంటున్నారు రోమా 1:16 లో...

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

 

సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనికూడా అంటున్నారు..

1కోరింథీయులకు 9: 16

నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

 

ప్రియ విశ్వాసి! సేవకుడా! మరి సువార్త సత్యమును ప్రజలకు వినిపిస్తున్నావా? సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నారు జాగ్రత్త! ఆదర్శ సంఘము భక్తుల నుండి నేర్చుకుని అనేకులకు సిలువసువార్త, సువార్త సత్యము ప్రకటించగా పట్టణంలో అనేకులు దేవుని బిడ్డలుగా మారారు! మరి నీవు ఆదర్శ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటావా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*11 భాగం*

*ఆదర్శ సంఘము-4*

1థెస్స 1:5—6

5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు.

6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

      ప్రియులారా ఇక 5 వచనంలో మీ నిమిత్తము మేము మీ యెడల ఎటువంటి వారమో మీకుతెలుసు అంటున్నారు అలాగే 6 వచనంలో మీరుకూడా సువార్తను అంగీకరించి గొప్ప ఉపద్రవంలో కూడా మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును మరియు ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడచుకున్నారు అంటున్నారు. చూడండి యధా రాజ తధా ప్రజా అన్నట్లు యధా గురువు తధా శిష్యులు అన్నమాట! ఇంకా చెప్పాలంటే గురువును మించిన శిష్యులు!

సరే, 5 వచనం పలకటానికి కారణం ఏమిటి? అనగా మీ నిమిత్తము మేము మీ యెడల ఎటువంటి వారమో మీకుతెలుసు! దీనికోసం మనం రెండో అధ్యాయంలోని చూసుకుంటే బాగా అర్ధమవుతుంది.

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 2:5,6,7,8,9,10,11,12

5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి

11. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,

12. తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.

 5—12 వచనాలు వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే

1. మేము మీకు సువార్తను ప్రకటించడానికి ఇచ్చకపు మాటలను వాడలేదు!

2. ధనాశను కప్పిపుచ్చే టెక్నిక్ లు వాడలేదు.

.  క్రీస్తు అపోస్తలులమైన మాకుండే అధికారాలు వాడలేదు.

4.  మీనుండి మెప్పు గొప్ప మేము కోరలేదు గాని

5. పాలిచ్చే తల్లి తన చంటి బిడ్డను ప్రేమించినట్లు లేక సాకినట్లు మిమ్మును చూశాము అంటున్నారు. నేటి దినాలలో గొప్ప గొప్ప పేరున్న దైవసేవకులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు! ఇవి ఉపయోగించకపోతే ఎక్కడ చిన్న సేవకుడు అంటారేమో వారి ఢాంభికాన్ని దర్పాన్ని చూపించడానికి ఎన్నెన్నో మేజిక్ లు జిమ్ముకులు చేస్తున్నారు! ఇక్కడ పేరు తెచ్చుకుంటున్నారు గాని మరి అక్కడ అనగా పరలోకంలో భళా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించు కుంటారో లేక సోమరివైన చెడ్డ దాసుడా అని పిలిపించుకుంటారో అక్కడకు వెళ్ళాక తప్పకుండా చూద్దాం!

వచనాలకోసం మనం రెండో అధ్యాన్ని ధ్యానం చేసేటప్పుడు విస్తారంగా చూసుకుందాం!

 

మరి ఇంత నిస్వార్ధంగా భక్తులు సేవచేశారు కాబట్టే మేము మీ యెడల ఎటువంటి వారమో మీకు తెలుసు అని యదార్ధంగా అనగలుగు తున్నారు!

 

సంఘానికే కాదు ఎఫెసీ సంఘానికి కూడా పౌలుగారు అదే అంటున్నారు తన మూడవ మిషనరీ యాత్ర చివరలో తాను క్రీస్తు కొరకు హతస్సాక్షిగా అయ్యే రోజు వచ్చింది అని గ్రహించి చెబుతున్నారు అపో 20:1820.౩౩--35....  చూడండి ఎంత నిస్వార్ధంగా సేవచేశారో!!!

 

18. వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు.

19. యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.

20. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

33. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;

34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

 

           మరి దీనికి ప్రతిఫలంగా థెస్సలోనికయుల సంఘం కూడా ఉంది! చూడండి యధా రాజ తధా ప్రజా అన్నట్లు యధా గురువు తధా శిష్యులు అన్నమాట! ఇంకా చెప్పాలంటే గురువును మించిన శిష్యులు! చూడండి పరిశుద్దాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడచుకొన్నారు అంటున్నారు!

 

అవును వీరు ఇన్ని శ్రమలు శోధనలు వచ్చినా విశ్వాస మందు స్థిరులై నిలబడటానికి కారణం పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారు! పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సహించారు వాక్యమందు నిలిచి వాక్యాధారమైన జీవితాన్ని జీవించగలిగారు! అందుకే వీరు ఆదర్శవంతమైన సంఘము గా ఉన్నారు! అసలు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకపోతే ఏమి ఆనందం కలుగుతుంది? ఎలా ఉపద్రవాలలో సహించ గలరు? ఎలా క్రీస్తులో ఆనందించ గలరు? కాబట్టి తప్పకుండా సంఘములో పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించాలి! అప్పుడు అధ్బుతాలు ఆనందం రక్షణ స్తుతి గానాలు వినబడతాయి!

 

వీరు పొందిన శ్రమలకోసం కూడా మనకు రెండో అధ్యాయంలో పౌలుగారు ప్రస్తావించారు. 2:14...

అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.

 

ఆదిమ సంఘం యూదులతో ఎలా భాధలు పడ్డారో అలాగే వీరు కూడా అదే యూదుల తోను ఇంకా సొంత జనులు అయిన అన్యజనులతో కూడా వీరు అదే రకమైన బాధలు పడ్డారు అలా శ్రమలు సహించి క్రీస్తుయేసులో ఉన్న అన్ని దేవుని సంఘాలను పోలి నడచుకున్నారు అని సర్టిఫికేట్ ఇస్తున్నారు పౌలుగారు ఇక్కడ!

అందుకే ఆరవ వచనంలో మమ్మును మరియు ప్రభువును పోలి నడచుకున్నారు అంటున్నారు!

 

అవును సంఘము క్రీస్తుని పోలి నడచుకోవాలి! క్రీస్తు శ్రమపడ్డారు కాబట్టి మనము కూడా శ్రమ పడాలి! శ్రమలను శోధనలను అనుభవించ వలసినదే! మరో షార్ట్ కట్ లేనేలేదు! భూలోకంలో గల నిజ సంఘాలు అన్నీ ఇంతవరకు శ్రమలను శోధనలను అనుభవించాయి! ఒకవేళ నీవు సార్వత్రిక సంఘములో సభ్యునిగా ఉన్నావా లేక ఉండాలి అంటే శ్రమల మార్గము తప్ప పరలోకానికి/ నిత్యత్వానికి సంపూర్ణతకు మరో మార్గము/ బాట లేనేలేదు! థెస్సలోనికయుల సంఘము అదే బాటలో పయనిస్తుంది అందుకే పౌలుగారు సెహబాష్ అంటున్నారు! అక్కడ దేవుడు కూడా ప్రతీ ఒక్కనికి భళా నమ్మకమైన మంచి దాసుడా లేక దాసురాలా అంటారు!!

 

    పౌలుగారు అంటున్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు! అయితే దీనిని కొంతమంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారునేను క్రీస్తును పోలి నడచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడచుకోండి అంటే పౌలుగారిని పోలి నడచుకోండి అని పౌలుగారు అనడం లేదు! పౌలుగారు చెబుతున్నారునేను క్రీస్తుని పోలి ఎలా నడచుకున్నానో అలాగే మీరు కూడా నాలాగే క్రీస్తును పోలి నడచుకోండి అంటున్నారు!

 

1కోరింథీయులకు 11: 1

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

 

1కొరింథీ 4:16

క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

ఫిలిప్పీ :17

సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.

 

అయితే ఎఫెసీ పత్రికలో ఇలాంటి గందరగోళము లేకుండా రాస్తున్నారు 5:1 లో కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడచుకొనుడి!

 

సంఘము దేవుని పోలి, క్రీస్తుని పోలి ఇంకా భక్తులను పోలి, సంఘములను పోలి నడచుకుని ఆదర్శవంతమైన సంఘమయ్యింది! ఇలాంటి ఆదర్శవంతమైన లక్షణములు మీకున్నాయా ప్రియ సహోదరి సహోదరుడా! అనగా పరిశుద్ధాత్మ శక్తి కలిగి పరిశుద్దాత్మలో కలిగిన ఆనందంలో ఎన్ని ఉపద్రవాలు శోధనలు శ్రమలు వచ్చినా క్రీస్తుకోసం నిలిచి దేవుని పోలి నడచుకునే గుణం నీకుందా?

లేకపోతే నేడే అలవరచుకో!

అది లేకపోతే బహుశా సోమరివైన చెడ్డదాసుడా అని అనిపించుకుంటావేమో జాగ్రత్త!

 

దైవాశీస్సులు!

 

(ఇంకాఉంది)

 

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*12 భాగం*

*ఆదర్శ సంఘము-5*

1థెస్స 1:7—8

7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

8. అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా ఇక 7,8 వచనాలలో కాబట్టి మాసిదోనియా లోను అకయలోను విశ్వాసులందరికి మీరు మాదిరియైతిరి అంటూ దానికి కారణం కూడా చెబుతున్నారు పౌలుగారు!  రకంగా మాదిరి అయ్యారు అంటే థెస్సలోనికయుల సంఘం, వీరి యొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మారుమ్రోగెను అంటున్నారు. ఇంకా అక్కడే కాకుండా ప్రతి స్థలమందు అనగా సువార్త ప్రకటించబడే అనేకచోట్లలో వీరి విశ్వాసము కోసం, తెగింపు కోసం చెప్పబడుతుంది అట! రకంగా వీరు ఆదర్శ సంఘానికి నిదర్శమునముగా నిలిచిపోయారు!

 

  ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మాసిదోనియా దేశం ముఖ్యంగా రెండు భాగాలు. మాసిదోనియా మరియు అకయ! పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణా రాయలసీమ కోస్తా ఆంధ్ర ఎలా మూడు భాగాలో అలాగే దేశం కూడా రెండు బాగాలు అన్నమాట! అంటే ఇప్పుడు వీరి భక్తివిశ్వాసాలు మాసిదోనియా మరియు అకయలో మారుమ్రోగాయి అంటే మొత్తం దేశమంతా మారుమ్రోగింది అన్నమాట!

 

       ఇంకా చూసుకుంటే వారి విశ్వాసం భక్తిమాత్రమే కాకుండా వారియొద్ద నుండి వాక్యము కూడా దేశమంతటా వ్యాపించింది అంటున్నారు! ఎంత ఆదర్శవంతమైన సంఘమో కదా ఇది!!! వారు విన్నవాక్యం, వారు పొందుకున్న రక్షణ వారితో ఆగిపోకుండా ఒక ప్రక్క శోధనలు ఉపద్రవములు ఎదురైనా, శ్రమలు కలిగినా సహించి సువార్త ప్రకటన కోసం దేశమంతా తిరిగి వారిని క్రైస్తవులుగా చేసి ఆదర్శవంతులయ్యారు! నేడు ఇలాంటి ఆదర్శవంతమైన సంఘాలు విశ్వాసులు కావాలి! ఇటువంటి తెగింపు పట్టుదల సమర్పణ లేకనే మనదేశం ఇంకా పూర్తిగా రక్షించబడలేదు! చూడండి పౌలుగారు చెబుతున్నారు మీరు విశ్వాసులందరికీ మాదిరియైతిరి!!

 

   మాదిరి కోసం చూసుకుంటే మనందరికీ మాదిరి యేసుక్రీస్తుప్రభులవారు! తగ్గించుకోవడంలో, శ్రమలు పొందుకోవడం ఓర్చుకోవడంలో, క్షమించడంలో అన్నింటికీ ఆయనే మన మాదిరి! రోల్ మోడల్! తగ్గించుకోవాలి ఒకరికొకరు క్షమించుకోవాలి అని చెప్పడానికి ఆయన దేవుడైయుండి కూడా శిష్యులందరి పాదములు కడిగి తువ్వాలుతో తుడిచారు!

క్షమించాలి అని చెప్పడానికి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఇన్ని భాధలు హింసలు పెడుతున్నవారిని కూడా క్షమించారు!  శ్రమలను అనుభవించాలి అని చెప్పి ముందుగా ఆయన శ్రమలను శోధనలను సహించి మనకు మాదిరి అయ్యారు!

 

అందుకే పేతురు గారు అంటున్నారు 2:21--25 లో ఇందుకు మీరు పిలువబడితిరి దేనికి పిలువబడ్డారు? శ్రమలను సహించడానికి పిలువబడ్డారు అంటూ క్రీస్తుకూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను అంటున్నారు! తర్వాత మాటలలో ఆయన పాపము చేయలేదు ఆయాన నోట కపటమును లేదు ఆయన దూషింప బడియు బదులు పలకలేదు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబదియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకున్నారు అంటున్నారు పేతురు గారు! చూడండి ఎటువంటి మాదిరి ఉంచిపోయారో యేసయ్య మనకోసం!! నేడు ఎవరైనా నిన్ను ఏమైనా అంటే చాలు కదిపితే కయ్యం దయ్యం అన్నట్లు వారిమీద విరుచుకు పడిపోతున్నావ్! ఇక నీకేం మాదిరి ఉంది? కొళాయి దగ్గర నీకంటే ఎవరైనా ముందు నీళ్ళు పట్టుకుంటే చాలు తాండవమాడేస్తున్నావు! ఇదేనా క్రీస్తు చూపిన మాదిరి నీకు? ఇదేనా క్రైస్తవ్యం??  ఆయన ఎన్ని భాధలు కలిగినా ఓర్చుకుని మనకు మాదిరిగా నిలబడ్డారు! నీవైతే--  నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే పాటికి మట్టిలో కలిసిపోయి ఉందువు అంటున్నావు.. మరికొందరు ఒక్కసారి నా బాప్తిస్మం తీసి గట్టుమీద పెట్టానా నీవు నీకుటుంబం మటాస్ అయిపోతారు అంటున్నారు! ఇలాంటి సగం సచ్చిన బ్రతుకులు విసర్జించి యేసుక్రీస్తు ప్రభులవారిని మాదిరిగా తీసుకుని ముందుకు సాగిపోదాం!!

 

   పౌలుగారు అంటున్నారు అపో 20:35...

మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

 నేను మీకు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అంటున్నారు! ప్రియ సేవకుడా సంఘకాపరి నీవు కూడా పౌలుగారి లాగ మాదిరి చూపగలుగు తున్నావా నీ మందకు?

 

యేసుక్రీస్తుప్రభులవారు శిష్యుల పాదములను కడిగిన తర్వాత శిష్యులు అడిగారు అయ్యా మీరెందుకు ఇలా మా పాదములను కడిగారు అంటే ఆయన అన్నారు యోహాను 13:15 లో నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని అంటున్నారు!

 

  పౌలుగారు రెండవ థెస్సలోనికయుల పత్రిక రాస్తూ మూడో అధ్యాయంలో 7—9....

7. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;

8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.

9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారములేదనిచేయలేదు.

 

మనము కూడా ఇలాంటి మాదిరికరమైన జీవితాలు జీవించాలి మొదటగా దైవసేవకుడా! కాపరి! నీవు మాదిరిగా జీవించి ఇతరులకు మాదిరిగా ఉండాలి! పౌలుగారు ఆది అపోస్తలులు అదే చేశారు అందుకే విశ్వాసులు కూడా అదే చేశారు!

 

  పౌలుగారు తిమోతి గారికి చార్జి అప్పగిస్తూ అంటున్నారు 1తిమోతి 4:12 లో....

నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.

చూశారా మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసము లోను పవిత్రత లోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నారు.

 

 నేడు నీవు నేను కూడా మన మాటలలో ప్రవర్తనలో ప్రేమ చూపించుటలో, విశ్వాసములో, పవిత్రతలో, విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది! మరీ ముఖ్యముగా ప్రతీ దైవసేవకుడు/ కాపరి/ సువార్తికుడు మాదిరికరమైన జీవితాలు జీవిస్తే సంఘము కూడా మాదిరికరమైన జీవితాలు జీవిస్తారు!

 

 యేసయ్య తాను మాదిరిగా జీవించి ఇలాగే బ్రతకమంటే పౌలుగారు పేతురు గారు అలాగే జీవించారు! పౌలుగారు తాను మాదిరి చూపించి థెస్సలోనికయులను ఇలాగే జీవించమంటే వారు మాదిరికరమైన జీవితమా జీవించి విశ్వాసులందరికీ మాదిరిగా నిలిచిపోయారు!

సేవకుడా నీవుకూడా మాదిగా జీవించి నీ సంఘాన్ని మాదిరిగా జీవించమని ప్రోత్సహించు!

 

 తీతుతో అంటున్నారు పౌలుగారు 2:7 ...

పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

 

 చూడండి పరపక్షమందు ఉండువాడు నీకోసం విధమైన చెడ్డమాట పలుక కుండా మాదిరిగా బ్రతుకు అంటున్నారు! ఎవడూ నిన్ను వేలెత్తి చూపించలేనంత పవిత్రమైన జీవితం సాక్ష్యార్ధమైన జీవితం జీవించమని చెబుతున్నారు! మనం కూడా అలాగే ఉండాలి!

 

యాకోబు గారు అంటున్నారు 5:10లో నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటున్నారు!

 

   చివరిగా ప్రియ విశ్వాసులారా! మీరు బైబిల్ లో గల భక్తులను మాదిరిగా తీసుకుని జీవించమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను! ముఖ్యంగా యేసుక్రీస్తుప్రభులవారిని మీ రోల్ మోడల్ గా తీసుకుని ఆయనను పోలి నడచుకోండి!!

 

   ఇక యవ్వనస్తులారా! మీరు కూడా పనికిమాలిన సినిమా యాక్టర్ లను, క్రికెట్ ఆటగాళ్లను లేక ఎవరెవరినో రోల్ మోడల్ గా లేక మాదిరిగా తీసుకోకుండా యేసుక్రీస్తుప్రభులవారిని, బైబిల్ లో గల విశ్వాస వీరులను మీకు రోల్ మోడల్ గా తీసుకుని విధముగా జీవించమని మనవిచేస్తున్నాను!

 

మీ వివాహవిషయంలో సంసోను గారిని రోల్ మోడల్ గా తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు! అదే ఇస్సాకు గారిని రోల్ మోడల్ గా తీసుకుంటే బ్రతుకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెన కరంగా ఉండగలరు!

 

యవ్వన స్త్రీలారా! యాకోబు కుమార్తె అయిన దీనాను మాదిరిగా తీసుకుంటే బ్రతుకు దుంపనాశనం అయిపోతుంది గాని ఎస్తేరు గారిని, యేసుప్రభులవారి తల్లియైన మరియమ్మ గారిని రోల్ మోడల్ గా తీసుకుంటే బ్రతుకు, మీ జన్మ ధన్యమవుతుంది! మీరే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలరు! దీనా సొంత నిర్ణయం తీసుకుని బలాత్కరించబడి జీవితాంతం తండ్రి ఇంటిలో ఉండి ఏడ్వవలసి వచ్చింది!

 

యవ్వనస్తులారా మీకు రోల్ మోడల్ గా యోసేపుగారిని తీసుకుంటే భవిష్యత్ లో గొప్ప ఆఫీసర్లు కాగలరు!

 

శీలాన్ని కాపాడుకోవడంలో సాక్ష్యం మరియు భక్తి కాపాడుకోవడంలో మీకు మాదిరిగా యోసేపు గారిని, దానియేలు గారిని, షడ్రక్ మేషాక్ అబెద్నోగో లను తీసుకోండి గాని పనికిమాలిన సినిమా యాక్టర్లను తీసుకుంటే వారి బ్రతుకులాగే చివర్లో దయనీయమైన పరిస్తితి రాగలదు జాగ్రత్త!

 

శ్రమలను సహించడంలో, విశ్వాసమును కాపాడుకోవడం మీకు షడ్రక్ మేషాక్ అబెద్నేగో లు మాదిరిగా ఉండాలి!

 

సువార్త ప్రకటనలో ఆత్మాభిషేకంలో మీకు ఆది అపోస్తలులు రోల్ మోడల్ గా ఉండాలి!

 

ఆరాధన చేయడంలో ఇప్పటి భక్తులు కాకుండా దావీదు గారు మీకు ఆదర్శం కావాలి!

 

దేవునికి ఇవ్వడంలో బర్నబా గారిని , ఫిలిప్పీ సంఘాన్ని రోల్ మోడల్ కావాలి గాని అననీయ సప్పీరాలు మీకు ఆదర్శవంతమైతే మీ దినాలు పూర్తికాకుండానే పరదేశులమో ప్రియులారా పాడేయవలసి వస్తుంది జాగ్రత్త!

 

థెస్సలోనికయుల సంఘం తమ రోల్ మోడల్ గా యేసయ్యను మరియు పౌలుగారిని తీసుకున్నారు! దేశమంతటా సువార్త జ్వాల వెలిగించడమే కాకుండా విశ్వాసులందరికీ మీరు మాదిరిగా ఉన్నారు అంటూ సర్టిఫికేట్ పొందుకున్నారు!

 

  కాబట్టి ప్రియ సంఘమా! మీకు ఆదర్శంగా థెస్సలోనికయుల సంఘాన్ని, స్ముర్ణ సంఘాన్ని, ఫిలదెల్ఫియ సంఘాన్ని తీసుకొనండి గాని లవోదొకాయ సంఘాన్ని తీసుకుంటే దేవుడు తన నోట నుండి ఉమ్మి వేస్తారు జాగ్రత్త!

 

అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక!

 

ఆమెన్!

 

(ఇంకాఉంది)

 

 

‌   *థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*1౩వ భాగం*

*ఆదర్శ సంఘము-6*

1థెస్స 1:9—10

9. మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! వచనాలలో రకంగా సంఘము ఆదర్శవంతమయ్యిందో మరో కారణం చెబుతున్నారు పౌలుగారు! మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రతనుంది మనలను తప్పించు చున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేస్తున్నారు అంటున్నారు!

 

  సంఘానికి ఉన్న మరో లక్షణంవిగ్రహారాధన చేసేవారు గాని వాక్యము విన్న తర్వాత వాటిని విడిచి నిజదేవున్ని తెలుసుకున్న తర్వాత ఆయన రాకడ కోసం కనిపెట్టు వారైయున్నారు!

 

గమనించాలిఅబ్రాహాము గారి యొక్క తండ్రి భయంకరమైన విగ్రహారాధికుడు! గాని ముత్తాత గారైన నోవాహు గారి దగ్గర సత్యము తెలుసుకుని, నేర్చుకుని విశ్వాసులకే తండ్రి అన్న పేరు తెచ్చుకున్నారు! తన తండ్రి విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారు అని తెలుసుకున్నారు కాబట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి అనే జిజ్ఞాశ ఆయనను నిజదేవుని దగ్గరకు తీసుకుని వచ్చి మనందరికీ మాదిరికరమైన వానిగా చేసింది!

 

చూడండి యేసు క్రీస్తు ప్రభులవారికి పౌలుగారు చెబుతున్న బిరుదులూ లేక లక్షణాలు లేక గుణగణాలు :

 

మొదటది: *జీవము గలవాడు*...

యోహాను 14: 6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

 

యోహాను 1: 4

ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

 

యోహాను 5: 24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

యోహాను 6: 33

పరలోకము నుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడను గ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

రోమీయులకు 5: 17

మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.

 

1యోహాను 1: 2

జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్యజీవమును మేము చూచి, జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.

 

రెండవది: *సత్యవంతుడు*....

యోహాను 14: 6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

 

యోహాను 18: 37

అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.

 

మూడవది: *మృతులలో నుండి లేచిన/ లేపిన యేసు*....

ప్రకటన గ్రంథం 1: 18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

 

ప్రకటన గ్రంథం 2: 8

స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా

 

ప్రకటన గ్రంథం 1: 5

*నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు*, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

 

Matthew(మత్తయి సువార్త) 28:6,7

6. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి

7. త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

 

Luke(లూకా సువార్త) 24:5,6,7

5. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?

6. ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు

7. మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి.

 

నాల్గవది: *రాబోవు ఉగ్రతనుండి తప్పించే వాడు* ....

రోమీయులకు 5: 9

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

 

10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.

 

Zephaniah(జెఫన్యా) 2:2,3

2.విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి.

3. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.

 

 

ఐదవది: *పరలోకం నుండి వచ్చేవాడు*....

 Acts(అపొస్తలుల కార్యములు) 1:10,11

10. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి

11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

John(యోహాను సువార్త) 6:39,42,50,51

39. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.

42. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

50. దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

51. పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

ప్రకటన గ్రంథం 22: 12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

Matthew(మత్తయి సువార్త) 24:30,31

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క చివరనుండి చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

1థెస్సలొనికయులకు 4: 16

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 

    గమనించాలిఆయన సత్యవంతుడు జీవం గలవాడు అని రాయడానికి కారణం లోకంలో జీవము లేని అబద్దమైన దేవుళ్ళు కోకొల్లలు అందుకే అబద్దమైన దేవుళ్ళకు వేరుగా యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన సత్యదేవుడు జీవము గలదేవుడు అంటూ ఇక్కడ నొక్కివక్కానిస్తున్నారు పౌలుగారు!

 

(సశేషం)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*14 భాగం*

*ఆదర్శ సంఘము-7*

1థెస్స 1:9—10

9. మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

               (గతభాగం తరువాయి)

 

గమనించాలిఆయన సత్యవంతుడు జీవం గలవాడు అని రాయడానికి కారణం లోకంలో జీవము లేని అబద్దమైన దేవుళ్ళు కోకొల్లలు అందుకే అబద్దమైన దేవుళ్ళకు వేరుగా యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన సత్యదేవుడు జీవము గలదేవుడు అంటూ ఇక్కడ నొక్కివక్కానిస్తున్నారు పౌలుగారు!

 

1కొరింథీ 8:4—61

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

కీర్తన 115:—8

3. మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు

4. వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

5. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

6. చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

7. చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

8. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

 

Isaiah(యెషయా గ్రంథము) 44:9,10,11,12,13,14,15,16,17,18,19,20

9. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

10. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?

11. ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

13. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.

14. ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

15. ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

16. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు

17. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

18. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.

19. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

20. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.

 

యిర్మియా 10:14

వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.

యిర్మియా 10: 5

అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయ నేరవు మేలుచేయుట వాటివలనకాదు.

 

రోమా 1:22,23,25

22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.

 

   కాబట్టి సజీవుడైన నిజమైన సత్య దేవుడు మనకు దేవుడుగా ఉండాలి అంటే మనము కూడా థెస్సలోనికయుల వారు చేసినట్లు చెయ్యాలి! నిజమైన దేవుణ్ణి సేవిస్తూ విగ్రహాలను పూజించడం కుదరనే కుదరదు! వాటిని తోసి రాజనాలి!

 

  రెండు వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరైతే రాబోయే ఉగ్రతనుండి మనలను తప్పించడానికి పరలోకం నుండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు పరలోకం నుండి రాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారో వారు తప్పకుండా అన్ని రకాలైన విగ్రాహాలను విసర్జించాలి! అది రకమైన విగ్రహమైనా గాని దానిని విసర్జించాలి! అనేకసార్లు చెప్పడం జరిగింది విగ్రహము అనగా ఏదో ఫోటోకో లేక కర్ర రాతి బొమ్మకో దండవేసి పువ్వుపెట్టి దీపం పెట్టి పూజిస్తే విగ్రహారాధన అవుతుంది అని కాదుగాని దేవునికంటే నీవు దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో విగ్రహము! దేవునికంటే నీవు దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అదే నీ జీవితంలో విగ్రహం! అది నీ ఉద్యోగమైన, నీ పిల్లలైనా, ధనాశ గాని, సుఖభోగములు గాని, కామవాంచ గాని చివరకు దేవునికంటే , దేవుని ఆరాధన వాక్య పఠనం కంటే నీవు నీ మొబైల్ ని వాడితే నీ మొబైల్ ఫోన్ నీ యొక్క విగ్రహము అని మరచిపోకు! పేరు ప్రతిష్టలు కోసం ప్రాకులాడుట, ఆస్తులు సంపాదించాలి అన్న ఆశ, నీ ఈగో, ఇలా ఏదైనా సరే దేవునికంటే దేనినైతే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నవో అదే నీ విగ్రహము! విగ్రహం ఏదైనా సరే అది నిన్ను దేవుని నుండి దూరం చేసి  నరకానికి తీసుకుని పోతుంది నిన్ను! కాబట్టి విగ్రహారాధన మానేస్తేనే విగ్రహాలు నీ జీవితం నుండి నీ ఇంటినుండి తీసేస్తేనే గాని రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న యేసయ్య పరలోకం నుండి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళరు అని గ్రహించాలి!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*15 భాగం*

*ఆదర్శ సంఘము-8*

1థెస్స 1:910

9. మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

10. దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియ సంఘమా! మనం థెస్సలోనికయుల సంఘం రకంగా ఆదర్శ సంఘమయ్యిందో మనం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! గతభాగాలలో చెప్పినట్లు రెండు పత్రికలలోనూ యేసుక్రీస్తుప్రభులవారి రాకడను ఎత్తి రాశారు పౌలుగారు! అధ్యాయంలో పదో వచనం అంటున్నారు- మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకం నుండి వస్తున్నారు అంటున్నారు. ఎందుకు పరలోకం నుండి వస్తున్నారు అంటే నిన్ను నన్ను అనగా నమ్మిన వారినందరినీ రాబోవు ఉగ్రతనుండి తప్పించడానికి వచ్చి తనతో ఉండేలాగా మనలను తీసుకుని పోడానికి యేసుక్రీస్తుప్రభులవారు అతి తొందరలో రాబోవుచున్నారు!

 

పౌలుగారు 1కొరింథీ 1:7 లో అంటున్నారు...

గనుక కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

తీతు 2:12,13

12.మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

హెబ్రీ 9:28

ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

 

యోహాను 14:2—

2. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

3. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

4. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.

 

   మొదటి భాగం నుండి చెప్పడం జరిగింది రెండు పత్రికలలో ముఖ్యాంశం: యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ!!  రెండు పత్రికలలోనే కాకుండా మొత్తం క్రొత్త నిబంధన అంతటా ఆయన రెండోసారి రాబోవుచున్నారు అని తెలియజేస్తుంది!

 

అపో 1:11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

మత్తయి 24: 30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

 

1థెస్సలొనికయులకు 3: 12

మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:13,14,15,16

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 

2థెస్సలొనికయులకు 1: 6

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

 

ఇక దేవునికి అసహ్యమైన చర్య ఏమిటంటే విగ్రహారాధన! ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారిని అవిధేయులైన పిల్లలు అన్నారు! అవిదేయులైన పిల్లలమీదకు దేవుని ఉగ్రత వస్తుంది అని బైబిల్ పదేపదే చెబుతుంది.

 

కారణం మాట్లాడే దేవుడు నిజమైన దేవుణ్ణి మాటరాని చూడలేని రాతి బొమ్మలలో కర్ర బొమ్మలలో మనిషి చేతితో చేసిన రూపంతో పోల్చడం దేవునికి ఇష్టం లేని పని! ఆయనకు కోపం తెచ్చే పని! అందుకే దేవుడు నా ఉగ్రతను మీ మీద కుమ్మరిస్తాను అంటున్నారు!

ఇక్కడకూడా రాబోయే ఉగ్రత అంటున్నారు. ఉగ్రత తప్పించుకోవాలి అంటే మొదటగా విగ్రహాలు వదలి వేయాలి! పశ్చాత్తాప పడి ఆయన రక్తములో కడగబడాలి అప్పుడే నీకు పాప విమోచన! రక్షణ!

 

దేవుని ఉగ్రతకోసం ఆలోచిస్తే

రోమీయులకు 1: 18

దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

 

రోమీయులకు 2: 5

నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

 

ఎఫెసీయులకు 5: 6

వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి(మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును

 

కొలస్సీ :6

వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి) వచ్చును.

 

ప్రకటన 6:16,17

16. బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

 

గమనించాలి ఆదినుండి దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం లేదు- బిలాము మాటలు ఆలకించి మోయాబీ స్త్రీలను ఇశ్రాయేలు ప్రజలమీదకు వదిలితే ఇశ్రాయేలు ప్రజలు వారితో వ్యభిచరించడమే కాకుండా వారి దేవతలకు మ్రొక్కితే దేవుని కోపం రగిలింది. ఫీనేహాసు రోజున పరిహారం చేసారు కాబట్టి సరిపోయింది గాని ఇశ్రాయేలు ప్రజలు ఆరోజే సర్వనాశనం అయ్యుండే వారు!

 

సంఖ్యాకాండము 25: 3

అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

 

Psalms(కీర్తనల గ్రంథము) 90:7,8,9

7. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము.

8. మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

9. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

 

దేవుడు లోకానికి తీర్పు తీర్చాలి అని అనుకున్నప్పుడు దేవుని కోపం లోకం మీదికి అనేకరకాలుగా వస్తుంది. తీర్పును తప్పించు కోవాలి అంటే నీవు ఆయన రక్తంలో కడుగబడి రక్షణ పొందాలి!

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:6,7,8,9

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

 

మత్తయి 25: 46

వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.

 

కాబట్టి ఉగ్రత నుండి మానవులను రక్షించ గలిగేది కేవలం యేసుక్రీస్తు ప్రభులవారు మాత్రమే!

రోమీయులకు 5: 9

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

 

   ఇక్కడ గమనించాలి- దేవుని కోపం ఉగ్రత వేరు- మహా శ్రమల కాలం వేరు!  మహా శ్రమల కాలం దేవుని ఉగ్రత కానేకాదు! అది సాతాను గాడి కోపం!  అదే మహాశ్రమల కాలం! ఇది భూలోకమంతటి మీదికి రాబోతుంది! దీనినుండి దేవుడు తనకు ఇష్టమైన వారిని తప్పిస్తారు ప్రకటన :10 ప్రకారం!!!

నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో- శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను.

 

దేవుని ఉగ్రత అనగా మత్తయి 24:29

దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

 

ప్రకటన 6:12—17

12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16. బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

 

కాబట్టి ఆయన ఉగ్రతను నీవు తప్పించుకోవాలంటే తప్పకుండా నీవు ఆయన రక్తములో కడగబడి ఆయనకు ఇష్టమైన వానిగా జీవించాలి! అటువంటి వాక్యాదారమైన జీవితం సాక్ష్యార్ధమైన జీవితం పవిత్రమైన జీవితం నీవు జీవిస్తున్నావా? నీ జీవితంలో నుండి విగ్రహాలను తీసి పారవేశావా?

నేడే ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకుని సరిచేసుకో!

ఆయన రాకడ తొందరలో ఉంది!

ఎత్తబడే గుంపులో ఉండు!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*16 భాగం*

1థెస్స 2:1—2

1. సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని

2. మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ఇంతవరకు మనం మొదటి అధ్యాయం నుండి థెస్సలోనికయుల సంఘము యొక్క మంచి లక్షణాలు, విధంగా అది ఆదర్శ సంఘమయ్యిందో ధ్యానం చేసుకున్నాము! ఇక రెండో అధ్యాయం ధ్యానం చేసుకుందాము!

 

    అధ్యాయంలో పౌలుగారు తన సువార్త విధానం అందరికీ చెప్పడమే కాకుండా ఒక నిజమైన దైవసేవకుడు రకంగా సేవచేయాలి అనేది చెబుతూ, సువార్త అనేది కపటమైన బోధలు మోసయుక్త మాటలు కాదు, అదే విధంగా ధనాపేక్షను కప్పిపెట్టి వేషధారణ బోధ చేయకూడదు గాని సువార్తను సిలువశక్తిగా భావించి చెయ్యమంటున్నారు! ఇంకా అధ్యాయంలో పౌలుగారు తన విశ్వాసులను అధికారం చేత ఏలడం చెయ్యకుండా చంటి బిడ్డను తల్లి రకంగా సాకుతాడో అలాగే నేను మిమ్మల్ని చూసుకున్నాను అంటూ ప్రస్తుత దైవసేవకులకు మాదిరి చూపించారు!

 

     మొదటి వచనంలో సహోదరులారా! మీ యెద్ద మా ప్రవేశం వ్యర్ధము కాలేదు అంటున్నారు. మరికొన్ని ప్రతులలో వచనం ఇలా ఉంది: సహోదరులారా మేము మీ దగ్గరకు రావడం వ్యర్ధం కాలేదని మీకు తెలుసు!  అనగా మీ దగ్గరకు వచ్చి సువార్త చెయ్యడం నిష్పలం కాలేదు గాని అది ఎంతో ఫలించింది అని పౌలుగారు సంతోషిస్తున్నారు ఇక్కడ!  అవును నిజమైన మనస్సుతో సువార్త వ్యాప్తి మాత్రమే లేక ఆత్మల రక్షణ మాత్రమే సువార్తికుని ఎజెండా అయితే ఆత్మల పంట పుష్కలంగా పూస్తుంది! అందుకే మీ ఆహారం నీటిమీద వేయు! చాలారోజుల తర్వాత నీవు కోస్తావు అని చెబుతుంది బైబిల్!

ప్రసంగి 11: 1

నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము లైన తరువాత అది నీకు కనబడును.

 

కన్నీటితో విత్తేవాడు సంతోషంతో పానాలు కోసుకుంటూ పోతాడట!

Psalms(కీర్తనల గ్రంథము) 126:5,6

5. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

6. పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

అలా కాకుండా ధనాపేక్ష ఎజెండాతో ముందుకు పోతే ఇప్పుడు ధనం సంపాదించినా చివరకు నీవు కోసేది పొల్లు గింజలు! అక్కడ సోమరివైన చెడ్డ దాసుడా అని పేరు తెచ్చుకుని వెలపట చీకటిలో ఉంటావు జాగ్రత్త!!

పౌలుగారు సీల గారు తిమోతి గారు కష్టపడి ఆత్మల రక్షణ ధ్యేయంగా సువార్త చాటితే అది ఆసియా ఐరోపా ఆఫ్రికా ఖండాలు దాటిపోయాయి! అదీ సువార్త! పౌలుగారు గాని సీల గారు గాని తిమోతి గారు గాని తోమా గారు గాని పేతురు గాని తమ కోసం ఒక్క బిల్డింగ్ కట్టుకోలేదు! ఒక్క వాహనం కూడా కొనుక్కోలేదు! తమ కుటుంబం కోసం వెనకేసుకోలేదు! నిస్వార్ధ సేవ చేసి ఆత్మల పంట పండించారు! అందుకే పౌలుగారు అంటున్నారు మంచి పోరాటం పోరాడితిని నా పరుగును తుద ముట్టించితిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక నాకొరకు నీతి కిరీటం ఉంచబడింది అని బల్లగుద్ది చెబుతున్నారు! 

2 Timothy(రెండవ తిమోతికి) 4:7,8

7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

8. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును

*బహుశా వారు లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు పరలోక దూతలు అందరూ పరలోక ద్వారం దగ్గర నిలుచుని గొప్ప యోధులకు స్వాగతం పలికి ఉంటాయి!*

 

   వారి సువార్త ఫలాన్ని  మనం గత అధ్యాయంలో చూసుకునాము 510 వచనాలలో...

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 1:5,6,7,8

5. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమైయుంటిమో మీరెరుగుదురు.

6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

7. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను;

8. అక్కడ మాత్రమేగాక ప్రతి స్థలమందును దేవునియెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక, మేమేమియు చెప్పవలసిన అవశ్యములేదు.

 

     ఇక రెండో వచనంలో మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమ పడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొన్నామని మీకు తెలుసు అంటున్నారు! ఇక్కడ రెండు విషయాలు కలిపి చెబుతున్నారు పౌలుగారు! మొదట మేము మీ దగ్గరకు రాకమునుపు ఫిలిప్పీ లో శ్రమపడ్డాము అవమానం పొందాము! ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకు వచ్చాము అప్పుడు ధైర్యము తెచ్చుకున్నాము అంటున్నారు! చూద్దాం ఒకసారి బైబిల్ నుండి!

 

   జాగ్రత్తగా పరిశీలన చేస్తే- పౌలుగారి త్రయము- థెస్సలోనికయుల పట్టణానికి ఎప్పుడు వచ్చారుఅపోస్తలుల కార్యములు 17 అధ్యాయంలో! మరి ఫిలిప్పీకి ఎప్పుడు వెళ్ళారు? అపోస్తలుల కార్యములు 16 అధ్యాయంలో! మరి పౌలుగారు సరిగానే చెప్పారు కదా! మరి సమయం వచ్చింది కాబట్టి ఫిలిప్పీలో పౌలుగారి త్రయం ఎన్ని కష్టాలు పడిందో దాని తర్వాత థెస్సలోనికయలో ఏవిధంగా కష్టాలు శ్రమలు పడ్డారో ఒకసారి అపోస్తలుల కార్యములు 16, 17 అధ్యాయాలు నుండి క్లుప్తముగా చూసుకుందాము!

 

16 అధ్యాయంలో దేర్బెకు లుస్త్రకు వచ్చాక తిమోతి గారు మొట్టమొదటగా పౌలుగారితో కలుస్తారు! అక్కడనుండి అనేక ప్రాంతాలలో పౌలుగారు సీల గారు సువార్త ప్రకటిస్తూ ఉండగా పౌలుగారికి ఒక దర్శనం కలుగుతుంది మాసిదోనియా దేశస్తుడు ఒకడు కనబడి మాకు సహాయం చెయ్యండి అంటూ వేడుకున్నట్లు! వెంటనే పౌలుగారి త్రయం ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు! ఫిలిప్పీ అనగా మాసిదోనియా దేశంలో రోమన్ కోలనీ లేక సెటిల్మెంటు! అక్కడ వారు సువార్తను ప్రకటించినప్పుడు లూదియ అనే దైవభక్తురాలు రక్షింపబడుతుంది ఆమె ఇంట్లో ఫిలిప్పీ సంఘం ప్రారంభమవుతుంది! రకంగా సంఘం అభివృద్ధి చెందేటప్పుడు పుతోను దయ్యం పట్టిన స్త్రీని బాగు చేశారు! వెంటనే సోదే చెప్పడం వలన కలిగే లాభం పోయింది అని స్త్రీ యజమానులు పౌలుగారిని సీలగారిని పట్టుకుని ఈడ్చుకుపోయారు. న్యాయాధిపతులు వీరికి వస్త్రాలు లాగేసి బెత్తములతో కొట్టమని శిక్ష వేస్తారు! వారు చాలా దెబ్బలు కొట్టి రక్తసిక్తమైన దేహాలతో వారిని చెరసాలలో త్రోసేస్తారు! అయితే ఇప్పుడు పౌలుగారి సీలగారి విశ్వాసం కనిపిస్తుంది! ఏం దేవుడవయ్యా నీవు? నీ సేవకొస్తే ఇన్ని దెబ్బలా ఇన్ని తిప్పలా అని దేవుణ్ణి నిందించలేదు! ఓరి మూర్ఖులారా! మేము నిజదేవుని సువార్తను ప్రకటిస్తే మమ్మల్ని కొడతారా మీరు మాడిమసైపోదురు గాక అని శపించలేదు! ఇవేమీ చెయ్యకుండా మధ్యరాత్రివరకు పౌలుగారు సీలగారు దేవునికి ప్రార్దించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అని వ్రాయబడింది! (25)

అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కల్గి అందరి బంధకాలు ఊడిపడ్డాయి! ఖైదీలు పారిపోయారేమో చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోబోతాడు! పౌలుగారు కేకవేసి నిన్ను నీవు హాని చేసుకోవద్దు! మేమంతా ఇక్కడే ఉన్నాము అని చెప్పగా మారుమనస్సు పొంది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడిగితే ప్రభువైన యేసునందు విశ్వాస ముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు అని చెప్పిన వెంటనే ఆయన ఆయన కుటుంబమ సకుటుంబ సమేతంగా బాప్తిస్మము తీసుకుంటారు. తర్వాత రోజు విడుదల పొంది అక్కడనుండి తిన్నగా థెస్సలోనికయుల పట్టణానికి వస్తారు త్రయం! ఇది మనకు 16 అధ్యాయంలో కనిపిస్తుంది! ఇక అక్కడ కూడా అనేకులు రక్షించబడిన తర్వాత మరలా ఇక్కడకూడా అనేకమైన శ్రమలు శోధనలు కలిగినందు వలన అక్కడ నుండి ఏథెన్స్ వెళ్తారు త్రయం! 17:56..

 

5. అయితే యూదులు మత్సరపడి, పని పాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొని యున్నాడు.

 

ఈరకంగా త్రయం ఫిలిప్పీ లోను, థెస్సలోనికయుల పట్టణం లోను శ్రమపడ్డారు!

 

   అయితే ఇక్కడ పౌలుగారు సీలగారు వారు పొందిన శ్రమలకు శోధనలను ఎత్తి వీరిని దెప్పి పొడవడం లేదు! ఇన్ని కష్టాలు పడి మీకు సువార్తను ప్రకటించినప్పుడు మీరుకూడా దానిని తేలికగా తీసుకోకుండా మీ వలన సువార్త మాసిదోనియా అకయ అంతా మారుమ్రోగింది అని సంతోష పడుచున్నారు! అంతేకాదు ఇలాంటి శ్రమలు కలిగినా దేవుని సువార్తను మీకు  భోధించుటకు మన దేవునియందు ధైర్యము తెచ్చుకొన్నాము అంటున్నారు! అవును శ్రమలు శోధనలు కలిగినప్పుడు కృంగిపోకుండా సాగిపోతే శ్రమలయందు పౌలుగారిలా సీలగారిలా సంతోషముతో పాటలు పాడే జీవితం కలిగియుంటే నీది విజయవంతమైన జీవితం అవుతుంది!

 

  అట్టి కృప ధన్యత ప్రతీ దైవజనునికి దేవుడు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*17 భాగం*

 

1థెస్స 2:36

3. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.

5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

  ఇక్కడ అంటున్నారు మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు గాని....

దీనికోసం చాలాసార్లు వ్రాశారు ఇతర పత్రికలలో పౌలుగారు! 

 

2కొరింథీ 1:12

మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

2కోరింథీయులకు 2: 17

కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.

 

కోరింథీయులకు 4: 2

అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము.

 

పౌలుగారు మాటలు రాయడానికి కారణం అక్కడ తన నిస్వార్ధతను రుజువుచేయడానికి మాత్రమే కాకుండా రోజులలో కూడా క్రీస్తు సేవకులమని చెప్పుకుంటూ సేవ వలన తమ ఏమైనా లాభం కలుగుతుందా అని ఎదురుచూసే వారు!

అందుకే తిమోతికి ఉత్తరం రాస్తూ అంటున్నారు 6:5...

చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.

 

యేసుక్రీస్తు ప్రభులవారి శిష్యుడు/ కేషియర్ యూదా కూడా అలాగే చేశాడు

యోహాను 12:4—6

4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా

5. యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు( ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును) అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.

6. *వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను* గనుక ఆలాగు చెప్పెను.

 

పేతురు గారు కూడా ఇదే రాశారు

2పేతురు  2:1,3,13,14,15,17,18,19,22

 

1. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

3. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, *మీవలన లాభము సంపాదించుకొందురు*; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనముకునికి నిద్రపోదు.

13. ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంక ములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.

14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి,

15. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.

17. వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

18. వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

19. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

22. కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

 

ఫిలిప్పీయులకు 3: 19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

 

   అందుకే వీరు కపటమైన బోధలు చేస్తారు! అపవిత్రమైన బోధ చేస్తారు! రోజులలో కొందరు అపవిత్రమైన బోధలు చేస్తున్నారు మానవుడు శరీరంతో చేసిన పాపం వారి ఆత్మకు అంటదు! దేహానికే అంటుతుంది కాబట్టి చిన్నచిన్న పాపాలు చేసినా పర్వాలేదు! త్రాగినా పర్వాలేదు వ్యభిచారం చేసినా పర్వాలేదు అంటున్నారు! పెద్దమనిషి! నీవు యేసుక్రీస్తుప్రభులవారి కన్నా గొప్పవాడివా? వ్యభిచారం చేసే ప్రతీవాడు తానేకాదు తనతోపాటు తన దేహమును ఆత్మను కూడా చెరుపుతున్నాడు అని చెప్పారు కదా అంతేకాకుండా వ్యభిచారం ఒక్కరే చెయ్యరు ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు పాపులని చెప్పారు కదా! అంతేకాకుండా వ్యభిచారం చేయవద్దు అనేమాట మీరు విన్నారు కదా వ్యభిచారం చేయడమే కాదు ఒక వ్యక్తి పర స్త్రీని వ్యభిచార చూపుతో/మోహపు చూపుతో చూస్తే అప్పుడే స్త్రీతో వ్యభిచరించినట్లే అని కుండబద్దలు గొట్టి యేసయ్య చెబితే (మత్తయి 5:25,26) శరీరంతో చేసిన పాపం ఆత్మకు అంటదు అని నీవు క్రొత్త బోధలు డాక్టరన్ ఇస్తావా? ఇదే అపవిత్రమైన బోధ! మరొకడు అంటాడుపెద్ద పెద్ద పాపాలు చేస్తే తప్పు గాని చిన్నచిన్న పాపాలు చేస్తే తప్పులేదు అంటాడు! పాపం చిన్నదైనా పాపమే పెద్దదైనా పాపమే! ప్రియ సంఘమా ఇలాంటి అపవిత్రమైన బోధలనుండి పారిపో! అసలు అపవిత్రమైనది ఏదీ అంటే యేసయ్య చెప్పారు మానవుని లోపలినుండి బయటకు వెళ్ళే తప్పుడు ఆలోచనలే!.....

Matthew(మత్తయి సువార్త) 15:11,18,19

11. నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను.

18. నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

 

కీర్తనాకరుడు అంటున్నారు 34:13

చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

 

కీర్తనలు 52: 4

కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

 

    కాబట్టి వీటికి దూరంగా ఉండమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!

మరికొందరు మోసయుక్తంగా బోధలు చేస్తున్నారు: ఆలయం కడుతున్నాము- బీదలకు సహాయం చేస్తున్నాము- సువార్త ప్రకటిస్తున్నాము అంటూ ప్రజల యొద్ద అడగడం వాటితో వారు మేడలు కట్టుకోవడం, పెద్ద పెద్దకార్లు బంగళాలు కట్టుకోవడం చేస్తున్నారు! అలా చేసినవారు ఏమైపోయారో మనం చూశాము! ఇలాంటి మోసం దేవుడు సహించరు!

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

 

కీర్తనలు 101: 7

మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

 

సామెతలు 20: 17

మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

 

ఇంకా యిర్మియా అంటున్నారు 6:13

అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.

 

రోమా :13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

 

ఇలాంటివి దైవసేవకుడు చెయ్యకూడదు! అందుకే పౌలుగారు అంటున్నారు మేము ఎవరిని మోసం చెయ్యలేదు!  మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి అంటున్నారు 2కొరింథీ 7:2

మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.

 

1థెస్సలొనికయులకు 4: 6

విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.

 

   ప్రియ దైవజనుడా! సేవకుడా! ఒకవేళ నీ బోధ మోసకరమైనది అయినా, కపటమైనది అయినా, అపవిత్రమైనది అయినా నీవు శిక్షను తప్పించుకోలేవు జాగ్రత్త! అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని బైబిల్ చెబుతుంది. 1కొరింథీ 6:9.

కాబట్టి నిన్ను నీవు సరిచేసుకో! అయితే మీ బోధ దయతోను  దీర్ఘశాంతము తోనూ ఉండాలి అంటున్నారు 2కొరింథీ 6:4—8

4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక

5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాస ములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,

6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమైయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.

 

తీతు 2:8

*నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో (ఆరోగ్యకరమైన వాక్యముతో) కూడినదిగాను ఉండవలెను.*

 

అట్టి బోధను కలిగి బోధిస్తూ జీవిద్దాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*18 భాగం*

1తెస్స 2:—6

3. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.

5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

                 ప్రియులారా! తర్వాత నాల్గవ వచనంలో అంటున్నారు సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారమై కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టువారమై బోధించుచున్నాము అంటున్నారు!  వచనంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి మనకు!

1. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని

2. దేవునిచేత ఎంచబడిన వారము లేక ఏర్పరచబడిన వారము,

. మనుష్యులను సంతోషపెట్టు వారము కాదు,

4.  హృదయములను పరీక్షించు దేవున్నే సంతోషపెట్టు వారము అంటున్నారు!

    వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సువార్తను ప్రకటించడానికి  వీరిని దేవుడు యోగ్యులుగా గుర్తించారట అప్పుడు వీరిని పిలిచారట! దేవునివలన వీరు సువార్త ప్రకటించడానికి అర్హులు యోగ్యులు అని ఎంచబడి వీరికి సువార్త ప్రకటన అనేదానిని వీరి బుజాలమీద పెట్టారు! అవును కదా ఒకసారి పౌలుగారి కోసం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకరోజు ఈయన క్రైస్తవ వ్యతిరేఖి- మార్గమందు ఉన్నవారిని పట్టి చెరసాలలో వేయడానికి హింసించడానికి అధికారం పొందిన వాడు అని అపోస్తలుల కార్యములో వ్రాయబడింది.

అపో.కార్యములు 9: 2

యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.

 

 మత పిచ్చి, కుల పిచ్చి ఎక్కువ ఈయనకు! క్రైస్తవ హింసకుడు, హంతకుడు అయిన పౌలుగారిని దేవుడు ఎలా ఎన్నుకున్నారు? ఎలా ఆయనకు ఇంతటి బృహత్తరమైన భాద్యత అప్పగించారు? మనకే కాదు అననీయ భక్తునికి కూడా ఇదే అనుమానం వచ్చింది యేసుక్రీస్తు ప్రభులవారు ఆయనకు కనబడి పౌలుగారి కోసం ప్రార్ధన చెయ్యమంటేదేవుడు చెప్పారు ఈయన నేను ఎంచుకున్న సాధనం!! ......

Acts(అపొస్తలుల కార్యములు) 9:13,14,15,16

13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.

14. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయువారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను.

15. అందుకు ప్రభువు నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు (మూలభాషలో-పాత్రయైయున్నాడు)

16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.

 

అవును అయన పిలుచుకునే విధానం, ఏర్పాటు చేసుకునే విధానమే ప్రత్యేకమైనది! పౌలుగారు ఇన్ని కష్టాలు ఓర్చుకోగలరు, ఇన్ని పత్రికలు రాయగలరని ప్రభుకు తెలిసి ఆయనను ఎన్నుకున్నారు! పేతురు గారు పిరికివాడు భయస్తుడు అని తెలిసినా వారి తెగింపు ఆయనకు తెలుసు కాబట్టే ఆయనను ఎన్నుకున్నారు! అవును కొన్ని జాతుల వారు నమ్మారా- నమ్మిన దానికోసం ప్రాణమైన ఇస్తారు లేదా ప్రాణమైనా తీసేస్తారు! చేపలు పట్టేవారి కోసం యేసయ్యకు బాగా తెలుసు! అందుకే ఆయనను ఎన్నుకున్నారు! కేవలం కొద్దిమంది వద్ద యేసు ఎవరో నాకు తెలియదు అన్న పేతురు గారు, ఆత్మను పొందుకున్న తర్వాత వేలకొలది ప్రజలమధ్య అనేక దేశాలలో యేసే క్రీస్తు అని ధైర్యంగా ప్రకటించారు! చివరకు ఆయనకోసం చనిపోయారు!

 

  ఇశ్రాయేలు ప్రజలను దాస్యం నుండి విమోచించాలి అనేది దేవుని ప్రణాళిక! అయితే దానికోసం భూమిమీద ఉన్న ప్రజలందరిలో సౌమ్యుడు, సాత్వికుడు  అయిన మోషేగారిని ఎన్నుకున్నారు! అందుకోసం ఆయనకు 80 సంవత్సరాలు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు! కారణం సుమారు ముప్పై నలబై లక్షలమందిని విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను అడవులలో కొండలలో అరణ్యంలో ఒకటి కాదు రెండు కాదు నలబై సంవత్సరాల పాటు నడిపించాలి అంటే ఎవరు సమర్ధులు అని చూసి ఏరికోరి మోషే గారిని ఎన్నుకున్నారు! ట్రైనింగ్ ఇచ్చారు! అప్పుడు పంపించారు! దేవుడే ఎవరిని ఎప్పుడు విధంగా ఎన్నుకోవాలో ఆయనకు తెలుసు! మనం ఆయనకు సలహాలు ఇవ్వక్కర్లేదు!

 

    దేవుడు అబ్రాహాము గారిని ఎన్నుకోవడానికి ఆయనకున్న విశ్వాస నిగ్రహం దేవునికి తెలుసు! అందుకే ఆయనను ఎన్నుకున్నారు!

 

చూడండి సౌలు ని దేవుడు ఎన్నుకున్నా నిలబెట్టుకోలేక పోయాడు! దేవుని దగ్గరనుండే దురాత్మ పంపించాల్సి వచ్చింది!

 

 అదే గొర్రెల దొడ్ల మధ్య ఉన్న దావీదు గారిని ఎన్నుకున్నారు దేవుడు- అంతేతాను చనిపోయే వరకు దేవుడు దేవుడు అంటూ బ్రతికారు! ఇంత పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయినా సరే, ఎవరైనా వచ్చి అయ్యా దేవుని మందిరానికి వెళ్దామా సార్ అంటే చాలుఎంతటి ముఖ్యమైన సమావేశంలో ఉన్న వెంటనే వాటిని మానేసి ముందు దేవుని పని చేసేవారు! అయితే దేవుని పని!లేదా దేవుని పాటలు! ఇంతే ఆయన జీవితంలో! అందుకే దేవుడు ఏరికోరి దావీదు గారిని ఎన్నుకున్నారు!  దేవునికి ఒక్కొక్కరి సామర్ధ్యం తెలుసు! దాని ప్రకారమే దేవుడు మనలను ఎన్నుకుంటారు!

 

పిలుపు కోసం ఏర్పాటు కోసం చూసుకుంటే పౌలుగారు కొరింథీ పట్టణం వారికి రాస్తూ అంటున్నారు

1కొరింథీ 1:26—29

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో-శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

 

    చూశారా- మన పిలుపు ఎంతటి గొప్పదో! నిజానికి మనకంటే గొప్పవారు బలవంతులు ధనవంతులు తలాంతులు గలవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు గాని వారికి లేని ఘనత ఆధిక్యత మనకు ఇచ్చారు దేవుడు! కనుక మనం ఆయన పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నామా లేదా?

 

     అయితే దేవుడు ఒక్కక్కరిని ఒక్కో పనికి పిలుస్తుంటారు! ఇంకా ఒక్కో ప్రదేశంలో ఉన్నవారిని రక్షించటానికి ఒక్కో రకమైన మనుష్యులను దేవుడు ఏర్పాటుచేసుకుంటారు! పౌలుగారి మాటలలో ఇది కనిపిస్తుంది మనకు గలతీ పత్రికలో! 2:79

7. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,

8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

 

ఎఫేసి :7—8

6. మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.

7. దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడనైతిని.

8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

 

1 Timothy(మొదటి తిమోతికి) 1:12,13

12.వపూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

 

పౌలుగారు అంటున్నారు ఎన్నికలేని మనలను దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి మనము ఎలా ఉండాలంటే ఇంకా దేవుని సేవకులను ఎలా భావించాలి అంటే 1కొరింథీ 4:1

ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

 

అయితే దైవసేవకుడు తానూ దేవునిచేత ప్రత్యేకంగా ఎన్నుకొన బడిన వ్యక్తి కాబట్టి గర్వపడకుండా యేసుక్రీస్తు ప్రభులవారిలా దీనత్వం కలిగి మేము ఎన్నికలేని పనివారం! మేము చేయాల్సిందే మేము చేశాము అని చెప్పమంటున్నారు.......లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

 అంటే తప్ప గర్వపడ్డావా? దేవుడు స్వాభావికమైన కొమ్మలైన ఇశ్రాయేలు ప్రజలను విరిచేసి మనలను తనతో అంటుకట్టారు! కాబట్టి స్వాభావికమైన కొమ్మలనే విరిచేసిన దేవుడు నీ బ్రతుకు బాగోలేకపోతే అంటుకట్టబడిన నిన్నుకూడా విరిచి అవతల పారేస్తారు జాగ్రత్త!

కాబట్టి నీ పిలుపు యొక్క ఆధిక్యత తెలుసుకుని- పిలుపుకు తగిన జీవితం జీవించు!

 క్రీస్తు సాక్షిగా క్రీస్తుకు పోలి నడుచుకో!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*19 భాగం*

1థెస్స 2:3—6

3. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.

5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

                 ప్రియులారా!  నాల్గవ వచనంలో అంటున్నారు సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారమై కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టువారమై బోధించుచున్నాము అంటున్నారు!  వచనంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి మనకు!

1. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని

2. దేవునిచేత ఎంచబడిన వారము లేక ఏర్పరచబడిన వారము,

. మనుష్యులను సంతోషపెట్టు వారము కాదు,

4.  హృదయములను పరీక్షించు దేవున్నే సంతోషపెట్టు వారము అంటునారు!

 

ఇక మనష్యులను సంతోషపెట్టు వారము కాదుగాని దేవుణ్ణి సంతోషపెట్టే వారము అంటున్నారు! ఎందుకు ఇలా అంటున్నారు అంటే మేము దేవునిచేత సువార్త ప్రకటించడానికి యోగ్యులముగా గుర్తించబడి పరిచర్య మాకు ఇచ్చారు కాబట్టి పిలుపును ఏర్పాటును తేలికగా తీసుకోకుండా మనసారా పూర్ణ బలంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో తమ యొక్క ప్రాణాలు ఉన్నంత వరకు పరిచర్య కొనసాగించాలని త్రయము యొక్క కోరిక! ఇటువంటి స్థిరమైన సమర్పణ జీవితాలనే దేవుడు మననుండి కోరుకుంటున్నారు!

 

అందుకే పౌలుగారు గలతీ 1:10 లో అంటున్నారు నేనిప్పుడు మనుష్యులను మెప్పించాలా లేక దేవున్నా? నేను గాని మనుష్యులను మెప్పించడానికి ప్రయత్నం చేశానా అయితే నేను దేవునికి దాసుణ్ణి కానేకాదు అంటున్నారు......

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

   గమనించారా ప్రియ దైవజనులారా/ సేవకులారా! నేడు అనేకమంది దేవునికి భయపడకుండా సంఘంలో గల పెద్దలకు కానుకలు ఇచ్చేవారికి బయపడి వారిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు! గద్దించి బోధచేస్తే నన్ను గాని సంఘం నుండి పంపించేస్తారేమో అని కొందరు, నన్ను కొడతారేమో అని కొందరు, వారు కానుకలు ఇవ్వరేమో అని కొందరు, గద్దించి వాక్యం చెబితే అలిగి మరో సంఘానికి పోతారేమో అని మరికొందరు ఆలోచిస్తున్నారు! అయితే ప్రియ సంఘమా ఎవరైతే ఇలా మనుష్యులకు భయపడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడం లేదో వారు దేవుని దాసులే కారు అని బైబిల్ చెబుతుంది! వారు దేవునికి దాసులు కారు గని వారి కడుపుకే వారు దాసులు! మన వలన లాభం సంపాదించుకొనేవారు! ఇటువంటి వారికి దూరంగా ఉండటం శ్రేష్టము!

 

     ప్రియ సంఘమా! మీ సంఘంలో కాపరి మీకు ఖండించి గద్దించి వాక్యం చెప్పడం లేదంటే మీ కాపరి నిన్ను నరకానికి పంపిస్తున్నారు అని జ్ఞాపకం చేసుకోండి! పౌలుగారు తిమోతికి ఉత్తరం రాస్తూ సంఘాల చార్జి, సువార్త చార్జి అప్పగిస్తూ అంటున్నారు 2తిమోతి 4:14 లో అంటున్నారు: దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టు చెప్పేదేమిటంటే సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుము, ఖండించుము గద్ధించుము బుద్ధి చెప్పుము అంటున్నారు!!!

 

1. దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

2. వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

4. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

 

   ఇక్కడ డైరెక్టుగా ఖండించు గద్దించు బుద్ధి చెప్పుము అనడం లేదు! దేవుని ఎదుట, మృతులకు సజీవులకు తీర్పు తీర్చు  క్రీస్తు ఎదుట ఇంకా ఆయన ప్రత్యక్షత తోడు అంటున్నారు ఇంకా ఆయన రాజ్యముతోడు అంటూ నేను ఒట్టేసి చెప్పేదేమిటంటే అంటూ అప్పుడు చెబుతున్నారు ఖండించుము ద్ధించుము బుద్ధిచెప్పుము! యేసయ్య ఒట్టు పెట్టుకోవద్దు అంటే ఒట్టేసి మరి చెబుతున్నారు పౌలుగారు! అయితే ఇంగ్లీస్ తర్జుమాలో ఇలా లేదు! ........

2 Timothy 4: 1

I charge thee therefore before God, and the Lord Jesus Christ, who shall judge the quick and the dead at his appearing and his kingdom;

2 Timothy 4: 2

Preach the word; be instant in season, out of season; reprove, rebuke, exhort with all longsuffering and doctrine.

 

దీని అర్ధం ఏమిటంటే దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చే యేసుక్రీస్తు ఎదుట నేను నీకు సంపూర్ణ అధికారమిస్తూ నీకు ఆజ్ఞాపించే దేమిటంటే వాక్యాన్ని ప్రకటించు సమయం చూడకుండా కష్టపడు! దీర్ఘశాంతంతో ఉపదేశం చేస్తూ ఖండించు గద్దించు బుద్ధిచెప్పు.....

 

దీని భావము ఏమిటంటే ప్రజలు ఇప్పుడు హితవాక్యం వినకుండా కల్పనా కధలను కోరుకుంటున్నారు అవే వారికి వినసొంపుగా ఉంటున్నాయి! అయితే మనము సంతోష పెట్టవలసినది దేవుణ్ణి కాని వీరిని కాదు మనలను సేవకు ఎన్నుకున్నది పిలిచినది ప్రత్యేకించినది దేవుడే గాని ప్రజలు కాదు కాబట్టి ఎవడైనా తప్పుచేస్తే వదలొద్దు! ఖండించు గద్దించు బుద్ధిచెప్పు ఎవడికీ భయపడకు! లేకపోతే మనలను భయపెట్టే వాడు ఒకడున్నాడు అని పౌలుగారి మాటల తాత్పర్యం!

 ఇది ప్రతీ ఒక్క దైవసేవకునికి కాపరికి సేవకునికి చెందుతుంది! ప్రజలను మేగే ప్రసంగాలు చేశావా వారి ఆత్మల భారం నీ మీద ఉందని వారు నరకానికి పోతే నీవే ఉత్తరవాదివని మరచిపోకు!

 

యేహెజ్కేలు గారితో దేవుడు అదే చెప్పారు! నరపుత్రుడా నేను చెప్పమన్నది చెప్పావా – అవతలి వాడు మారుమనస్సు పొందుతాడు! అయితే నీవు చెప్పినా వాడు వినలేదా? వాడి ఆత్మకు వాడే ఉత్తరవాది! అయితే నీవు భయపడి చెప్పకపోతే వాడు ఎలాగు నశించి పోతాడు గాని వాని ప్రాణమునకు ఆత్మకు నిన్ను ఉత్తరవాదిని చేస్తాను అంటున్నారు! Ezekiel(యెహెజ్కేలు) 3:17,18,19,20,21

17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి యున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.

18. అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.

20. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణ మవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తర వాదిగా ఎంచుదును.

21. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరికచేయగా అతడు హెచ్చ రింపబడి పాపముచేయక మానినయెడల అతడు అవశ్య ముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించు కొందువు.

 

కాబట్టి ప్రియ దైవసేవకుడా నీవు కాపలాదారుడవని మరచిపోకు! అపాయమొస్తుంది అని ప్రజలను హెచ్చరించు! దేవుని రాకడకు నీ సంఘాన్ని తయారు చేయు!

 

   ఇక చివరి విషయం: ఎందుకు ఇలా ఉన్నది ఉన్నట్లు బోధించాలి అంటే ఆయన అనగా దేవుడు హృదయాలను పరీక్షించే దేవుడు! అందుకే ఆయను సంతోషపెట్టు గాని మనుష్యులను సంతోషపెట్టడానికి కాదు అంటున్నారు!

 

సమూయేలు గారితో దేవుడు అంటున్నారు 1సమూయేలు 16:7,8

7. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను-అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.

8. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు-యెహోవా ఇతని కోరుకొన లేదనెను.

 

Psalms(కీర్తనల గ్రంథము) 139:1,2,3,23,24

1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

24. నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

 

సామెతలు 21: 2

ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.

 

యిర్మియా 17:10

ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.

 

ప్రకటన 2:23

దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

 

కాబట్టి ఆయన మన అందరి అంతరంగాలు కనిపెడుతున్నారు- నీవు మనుష్యులను సంతోషపెట్టి లాభం సంపాదించుకోడానికి చూస్తున్నావో లేక మనుష్యుల హృదయాలను ఇప్పుడు నీ బోధల ద్వారా వారిని నొప్పించినా వారిని పరలోకం వైపు తీసుకుని పోతున్నావు అని కూడా దేవుడు మన అంతరంగాలను పరిశీలిస్తున్నారు! కాబట్టి ప్రియ సేవకుడా విశ్వాసి నిన్ను నీవు పరిశీల చేసుకో!

 

దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా మారు!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*20 భాగం*

1థెస్స 2:36

3. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.

5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

6. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

   ప్రియులారా! ఇక తర్వాత వచనం చూసుకుంటే మీరెరిగియున్నట్లు మేము ఇచ్చకుపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగించలేదు! ఇందుకు దేవుడే సాక్షి అంటున్నారు! ఇక్కడ ఇందుకు దేవుడే సాక్షి అని పలకడానికి మరి ఎవరైనా భక్తులమీద చెడ్డమాటలు పలికి ఉంటారు లేదా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోడానికి అయినా చెబుతున్నారు! అయితే మేము ఇంతవరకు ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు మాటలను వేషాలను మేము వెయ్యలేదు! అది మీకు కూడా తెలుసు ఇంకా దానికి దేవుడే సాక్షి అంటున్నారు!

 

 గమనించాలి రోజులలో ధనాపేక్షతో ఎన్నెన్నో టెక్నిక్కులు జిమ్ముక్కులు వాడి విశ్వాసులను దోచుకుంటున్నారు పెద్దపెద్ద బోధకులు! నిజంగా వీరికి దేవుడే సాక్షి! నాకు తెలిసిన ఒక దైవసేవకుడు ఉన్నాడు! ఆయన వాక్యం బాగా చెబుతారు. చివరి ప్రసంగంలో నాకు సరియైన మందిరం లేదు, సరియైన ఇల్లు లేదు నాకు! దయచేసి ప్రార్ధన చెయ్యండి! వీలయితే సహాయం చెయ్యమని అడిగి ఊరుకుంటే బాగుణ్ణు! విశ్వాసులందరి ముందు ఏడ్చేస్తూ ఉంటాడు! వెంటనే సంఘస్తులు అతి తక్కువలో పాష్టర్ గారు ఇచ్చిన కానుకలు కాకుండా కనీసం ఇరవై వేలైన ఇస్తారు అవి తీసుకుని వెళ్లిపోతుంటారు ఈయన! ఆయన మా ఊరు కూడా వచ్చారు! మా సంఘస్తులు కూడా ఇచ్చారు! ఆయనతో పిలువబడిన మరో ప్రసంగీకుడు చెప్పారు! ఈయనకు ఇదే అలవాటు! ప్రతీ సభలలో ఇలాగే చెప్పి దండుకుని వెళ్లిపోతూ ఉంటాడు అని!

 

    గమనించాలి- మనలని పిలిచింది దేవుడు! కట్టే మందిరం దేవునికి! కాబట్టి నీవు నిజమైన సంకల్పంతో మందిరాన్ని ప్రారంభిస్తే దేవుడే సంపూర్తి చేస్తారు గాని ఇలా అడుక్కోవడం ఎందుకు? దేవుని పరువు తీయడం ఎందుకు? అయితే గతభాగాలలో దీనికోసం చూసుకున్నాము కాబట్టి ముందుకు పోదాము! అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి! ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బులు ఉండవు! హాస్పటల్ పాలవ్వాల్సిందే! లేదా దోపిడీదారులు పాలైపోతాయి! లేదా మన ఆంధ్రప్రదేశ్ జరిగినట్లు దైవసేవకుల గృహాలలో ధనం కోసం ఆస్తి కోసమే హత్యలు జరుగుతాయి! అందుకే అంటున్నారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము!....1తిమోతికి 6: 10

ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

 

పౌలుగారి మాదిరి చూడండి!

అపో 20:౩౩—35

33. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;

34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

 

2కొరింథీ 7:2

మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.

 

1తిమోతి 6:5

చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.

 

దేవుని కోపం తప్పకుండా ఇలాంటి అత్యాసపరుల మీదకు వస్తుంది!

ఎఫేసి 5:5—6

5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి (మూలభాషలో-అవిధేయత కుమారుల మీదికి) వచ్చును

 

కొలస్సీ :5—6

5. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.

 

1తిమోతి 6:9—11

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము).

 

ఇక తర్వాత వచనంలో అంటున్నారు క్రీస్తు రాయబారులమై లేక అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయడానికి సమర్దులమై ఉన్నా గాని మీవలన గాని ఇతరుల వలన గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అంటున్నారు! అవును అపోస్తలులు అందరూ సంఘాన్ని తయారుచేయడానికి ఎంతో ప్రసవవేదన పడ్డారు కాబట్టి సంఘం మీద అధికారం చేయడానికి వారికి హక్కు ఉంది గాని వీటిని మేము ఎప్పుడూ ఉపయోగిచలేదు అంటున్నారు! ఇంకా మీ దగ్గరనుండి గాని లేక ఇతరుల నుండి గాని ప్రత్యేకమైన మెప్పు/ ఘనత/ భజన పొగిడింపు మాకు అవసరం లేదు అంటున్నారు!

 

1కొరింథీ 9:7—15

7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

8. మాటలు లోకాచారమును బట్టి (మూలభాషలో-మనుష్యరీతిగా) చెప్పుచున్నానా? ధర్మశాస్త్రముక ూడ వీటిని చెప్పుచున్నదిగదా?

9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు (నూర్చెడి యెద్దు) మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?

12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.

13. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో (బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా?

14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.

15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

 

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:1,2,3,5

1. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?

2. మా హృదయముల మీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?

3. రాతిపలక మీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని మీరు తేటపరచబడుచున్నారు.

5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

 

2కొరింథీ 11:9

మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియ నుండి సహోదరులు వచ్చినా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్తపడుదును

 

ఇక్కడ నా అవసరాలు మాసిదోనియా వారు తీర్చారు అంటే బహుశా ఫిలిప్పీ సంఘము వారు అయి ఉంటారు!

 

1కొరింథీ 4:5

కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

2కొరింథీ 12:11—13

11. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను విషయములోను తక్కువవాడను కాను.

12. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.

13. నేను మీకు భారముగా ఉండక పోతినను విషయములో తప్ప, మరి విషయములో మీరితర సంఘముల కంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి.

 

   కాబట్టి ఇదే నిజమైన సేవ! ఘనత కోసం ఆశించకుండా, ధనాన్ని ఆశించకుండా మెప్పు ఆశించకుండా సువార్త ప్రకటించడానికి ఆత్మలను కాయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నారని ఎరిగి ఆత్మల రక్షణ కోసమే సువార్త ప్రకటన కోసమే పరిచర్య చేస్తే అప్పుడు మనకు మెప్పు దేవుని వలన కలుగుతుంది! అప్పుడు దేవుడు అంటారు భళా నమ్మకమైన మంచి దాసుడా! అలా దేవునిచేత సెహబాష్ అనిపించుకుందాం!

 

ఆమెన్!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*21 భాగం*

1థెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

  చూడండి ఇక్కడ 7 వచనంలో అయితే స్తన్యమిచ్చు తల్లి తనసొంత బిడ్డలను గారవించు నట్లు అనగా సాకినట్లు మేము మీ మధ్యను సాదువులమై ఉంటిమి అంటున్నారు! ఈమాటను మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది! ప్రతీ దైవసేవకుడు కాపరి కూడా అనుసరించవలసిన విధానం ఇదే! తన సంఘ విశ్వాసులను తల్లి విధంగా తను పాలిచ్చే తన చంటిబిడ్డను సాకుతుందో అలాగే వారిని సాకాలి! చూడండి చంటిపిల్లలు తమ తల్లిని ఎంతో సతాయిస్తూ ఉంటారు గాని తల్లి కోపగించుకోదు చిరాకు పడదు! ఎందుకంటే చంటి పిల్లలకు మంచి ఏమిటో చెడు ఏమిటో ఏమీ తెలియదు గనుక చిరాకు పడకుండా అలా చెయ్యకూడదు అని చెబుతూ ఉంటారు! అలాగే మనము కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది! గలతీ 4:19లో పౌలుగారు అంటున్నారు నా చంటి బిడ్డలారా క్ర్రీస్తు స్వరూపం మీయందు ఏర్పడే వరకు నాకు ప్రసవవేదన కలుగుతుంది అంటున్నారు. మనము సంపూర్ణ దీర్ఘశాంతం చూపించాలి అని పౌలుగారు తిమోతి గారికి చెబుతున్నారు 2తిమోతి 4:12

 

అయితే ఇదే విషయాన్ని మరలా 11, 12 వచనాలలో పౌలుగారు రెట్టిస్తున్నారు! ఎందుకు మేము మీ ఎడల ఒక చంటి బిడ్డలను చూస్తున్నట్లు చూస్తున్నాము అంటే తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడచుకోవాలని మీలో ప్రతివానిని హెచ్చరిస్తున్నాము ధైర్య పరుస్తున్నాము! ఇంకా తండ్రి తన బిడ్డలఎడల నడచుకొన్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడచుకోన్నామని మీకు తెలుసు అంటున్నారు!

 

చూడండి 7 వచనంలో స్తన్యమిచ్చు తల్లిలా మీ ఎడల నడుచుకున్నాము అని చెబితే 12 వచనంలో తండ్రి తన బిడ్డలఎడల నడుచుకొనే రీతిలో మీ ఎడల నడుచుకున్నాము అంటున్నారు! అనగా సంఘానికి పౌలుగారు తల్లి మరియు తండ్రి అన్నమాట! ఆకలి వేసినప్పుడు తల్లి నిర్వర్తించే బాధ్యతలను అనగా ఆత్మీయ ఆహారాన్ని పెట్టే భాద్యతను, పిల్లలు ఇటూ అటూ చెదిరిపోకుండా ఎవరివలన హాని కలుగుకుండా ముఖ్యంగా తప్పుడు బోధలవలన చెదిరిపోకుండా సంరక్షణ కలిగించే విషయంలో తండ్రి భాద్యతను నిర్వర్తిస్తూ దారి తప్పినప్పుడు ఖండించి గద్దించి బుద్దిచెప్పడానికి తండ్రి భాద్యతను పోషిస్తున్నారు అన్నమాట! కాబట్టి ప్రతీ దైవసేవకునికి కాపరికి పౌలుగారు ఆదర్శం కావాలి!

 

  మరోసారి 11, 12 వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాము! మేము మీ ఎడల చంటి బిడ్డలఎడల తల్లిదండ్రులు ప్రవర్తించే విధానంలో ఎందుకు ప్రవర్తిస్తున్నాము అంటే మొదటగా తన రాజ్యమునకు , రెండవది తన మహిమకు మిమ్మును పిలుచుకున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని, మూడవది: మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు వచ్చాము అంటున్నారు

 

         మొదటిది తన రాజ్యానికి, రెండవది తన మహిమకు దేవుడు మిమ్మును పిలుచుకున్నారు కాబట్టి పిలుపుకు తగిన జీవితం మీరు జీవించాలి అంటే దారితప్పకుండా చూడాల్సిన బాధ్యత మాది కాబట్టి మేము మీ ఎడల రకంగా ప్రవర్తించడమే కాకుండా మిమ్మల్ని విధంగా నడవాలో తర్ఫీదు నిస్తున్నాము అంటున్నారు! పౌలుగారు నేను మీకు తండ్రిని అంటున్నారు 1కొరింథీ 4:15

చూడండి.

క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.

 

 ఇతర మతాలలో నుండి క్రైస్తవులుగా మారిన వారిపట్లు సంఘ కాపరులు, సువార్త సేవకులు ఇలాగే మెలగాలి!

 

మిమ్మల్ని దేవుడు పిలిచారు కాబట్టి దానికి తగినట్లుగా ఉండాలి!

రోమా 1:1

యేసు క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,

 

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఇక మహిమలోకి రాజ్యములోకి పిలువడం కోసం చూసుకుంటే:

మత్తయి 4:17

అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

 

మత్తయి 25: 34

అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

 

యోహాను 17: 22, 24;

22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

24. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.

 

రోమా 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

రోమీయులకు 8: 17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

 

కొలస్సీ 1:12—13

12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క (మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

 

హెబ్రీ 12:28

అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

 

2పేతురు 1: 11

ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.

 

కాబట్టి ఇంతటి ఘనమైన పిలుపును కలిగి ఉన్నారు కాబట్టి దేవునికి తగినట్టుగా జీవించాలి

 

ఎఫేసి 4:1,2

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఫిలిప్పీ 1:27

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

 

కొలస్సీ 1:10,11

10. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

11. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, ....

 

సరే, ఇలా వారిని చూసుకుంటూ తండ్రి తన సొంత పిల్లపట్ల ఎలా ప్రవర్తిస్తారో అలాగే మీలో ప్రతీ ఒక్కరిని హెచ్చరిస్తూ ధైర్యపరస్తూ సాక్ష్యమిస్తూ ఉన్నాము అంటున్నారు! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే 2తిమోతి 4:14 ప్రకారం దేవుడిచ్చిన అధికారం ప్రకారం ఖండిచు గద్దించు బుద్ధిచెప్పు అని తిమోతి గారికి అక్కడ ఆజ్ఞాపించినా ఇక్కడ హెచ్చరిస్తూ ధైర్య పరుస్తూ సాక్ష్యమిస్తూ ఉన్నాము అంటున్నారు. అనగా ఎలా ప్రవర్తించాలో హెచ్చరికలు చేయడం , కష్టాలో శ్రమలలో ఉన్నవారిని ధైర్యపరచడం, యేసుక్రీస్తుప్రభులవారికి కూడా శ్రమలు కలిగాయి గనుక మీరు కూడా శ్రమలలో ధైర్యంగా ఉండమని ప్రోతహించడం చేస్తూ క్రీస్తుసిలువ కోసం సాక్ష్యమిస్తూ ఉండాలి అంటున్నారు!

 

   ప్రియ దైవజనుడా! నీవు ప్రవర్తించవలసిన విధానం ఇదే! అవసరమైనప్పుడు ఖండించడం గద్దించడమే కాకుంగా వారు నిరాశల్లో ఉన్నప్పుడు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉండాలి! అందుకే దేవుడు నిన్ను పిలిచారు తప్ప తీయటి మాటలు వంకరమాటలు చెప్పి కపటమైన మాటలు చెబుతూ వారిని మోసగిస్తూ ఉండకూడదు! పౌలుగారిని యేసుక్రీస్తు ప్రభులవారిని ఆదర్శంగా తీసుకుని నీ పరిచర్యలో ముందుకు సాగిపో!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*22 భాగం*

1థెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

     ప్రియులారా! ఇక 8 వచనంలో మీరు మాకు బహు ప్రియులై ఉన్నారు కాబట్టి మీయందు విషేశాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాకుండా మీకు మా ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధపడ్డాము అంటున్నారు! చూశారా ఎంతలా ప్రేమించారో భక్తులు థెస్సలోనికయులను! మీయందు మాకు విషేషాపేక్ష ఉంది కాబట్టి ఇలా చేశాము అంటున్నారు! అయితే ఫిలిప్పీ పత్రికలో సాక్ష్యమిచ్చినట్లు పత్రికలో మీరు మా అవసరాలు తీర్చారు లాంటివి చెప్పలేదు! అయినా మరి ఎందుకు విశేష ఆసక్తి? కారణం ఒక్కటే! వీరు ఆత్మలో స్థిరమైన వారు! ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనే తప్ప సుఖబోగములయందు గాని శారీరక అవసరాల కోసం గాని ప్రయత్నం చేయకుండా దేవుని సంగతులు తెలుసుకోవడం కోసం, పరలోకం ఎలా ఉంటుంది, ఎవరు వెళ్తారు ఇంకా ఎలా ఎగిరిపోతాము లాంటి రెండవ రాకడకు సంబంధించిన విషయాలు కోసమే వీరు ఆసక్తి ఆశ! అందుకే అస్తమాను వీరు వీటికోసం అడిగేవారు! మిగిలిన సంఘాలలో ఏదో ఒక తగాదాలు లోపాలు ఉండేవి! వీటిని సరిద్దటానికి సరిపోయేది! సంఘమయితే అసలు అలాంటి సమస్యలు లేకుండా ఆధ్యాత్మికంగా ఎదిగిపోతున్నారు కాబట్టి మీ ఎడల మాకు విషేశాపేక్ష ఉంది అంటున్నారు! అవును ఇలాంటి సంఘం ఉంటే నిజమైన సేవకుడు తప్పకుండా వీరికోసం ఎంతైనా చేస్తారు!

 

   ఇక్కడే కాదు ఇలాంటి ప్రేమ ఆసక్తి పౌలుగారు ఇతర సంఘాలమీద కూడా చూపించారు! అవసరమైతే ఆయన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దపడ్డారు!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 7:2,3,4

2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.

3. మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా

4. మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను.

 

    యోహాను గారు చెప్పేది వినండి: యేసుక్రీస్తు మనకోసం తన ప్రాణం దారపోశారు కాబట్టి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలిసింది మనము కూడా మన సహోదరుల కోసం మన ప్రాణాలు ధారపోయడానికి సిద్దంగా ఉండాలి అంటున్నారు! 1 యోహాను పత్రిక  :16

అదే యోహాను సువార్త :16 లో అంటున్నారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అందుకే మానవ పాపాలను పోగొట్టడానికి రానా సొంతకుమారున్నే ఈలోకానికి పంపించి ఆయనయందు విశ్వాసముంచు వానికి నిత్య జీవాన్ని ఇస్తున్నారు అంటున్నారు...

యోహాను 3: 16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా (లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

 

  ప్రేమ పౌలు గారు సీల గారు ఆది అపోస్తలులు ప్రేమకన్నా ఘనమైనది బలమైనది ఉన్నతమైనది! కాబట్టి సంఘకాపరి కూడా తన సంఘస్తులను ఇదేరకంగా ప్రేమించ వలసి ఉంది! కేవలం కానుకలు ఇచ్చేవారిని ప్రేమించి, కానుకలు ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకుండా వారికి సరియైన సమాధానం ఇవ్వకపోతే సంఘము బాగుపడదు! అనేకసార్లు చెప్పడం జరిగింది. సామాన్య పరిస్తితులలో సంఘకాపరి తప్పకుండా ప్రతీనెలా గృహ దర్శనాలు చెయ్యాలి! కేవలం ఇంటికి వెళ్ళి ప్రార్ధనచేసి కానుకలు తీసుకుని పోతే ఏమీ ఉపయోగం లేదు! వారి గృహాన్ని దర్శించి వారి సాదకభాధలు తెలుసుకుని అక్కడే వారి భాధలకోసం కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి! అప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చెయ్యడమే కాకుండా నా సంఘకాపరి నా కోసం కన్నీటితో ప్రార్ధన చేశారు, నాకు చాలు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు అనే విశ్వాసం వారికి కలగడమే కాకుండా నాకోసం కన్నీటితో ప్రార్ధించే కాపరి ఉన్నారు అని తండ్రి-కుమారా/కుమార్తెల అనుబంధం ఏర్పడుతుంది. అది సంఘాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది!

 

   కాబట్టి ఇలా సంఘాన్ని ప్రేమించవలసిన అవసరం ప్రతీ దైవసేవకునికి కాపరికి ఉంది! గమనించాలి ఆది అపోస్తలులు మాత్రమే కాదు అనేకమంది మిషనరీలు రకంగా మనలను ప్రేమించారు! మన భారతదేశ సువార్త- మిషనరీల చరిత్ర బయోగ్రఫీలు చదివితే కొన్ని వందలమంది మిషనరీలు తమ స్వదేశాన్ని వదలి మనల్ని మన దేశాన్ని ప్రేమించి ఇక్కడ ఎన్నో వ్యయప్రయాసలకు, ఆకలి భాధలను ఓర్చి సువార్త ప్రకటించారు! అంతేకాదు మనలను ప్రేమించి చనిపోయే వరకు ఎంతోమంది తమ దేశానికి ఇంటికి తిరిగి వెళ్ళలేదు! కేవలం ఐరోపా దేశాలనుండి అమెరికా దేశాలనుండే కాకుండా రష్యా లాంటి దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి ఇక్కడే చనిపోయారు! ఇంకా కొన్నివందలమంది సువార్త ప్రకటనలో తమ ప్రాణాలు వదలి హతస్సాక్షులు అయ్యారు! మరికొంతమంది మన దేశ వాతావరణ పరిస్తితులు అనుకూలించక మలేరియా ఫ్లూ కలరా వంటి రోగాలతో ఇక్కడే తమ ప్రాణాలు వదిలేశారు! వారి త్యాగాల ఫలితంగానే మనం రక్షించబడ్డాము! మనచేతిలో పవిత్ర గ్రంధము ఉంది! విలియం కేరి గారు ఇంకా అనేకమంది తమ దేశం నుండి వచ్చి మరలా వారి దేశం వెళ్ళలేదు ఇక్కడే అమరులయ్యారు!

మదర్ థెరిసా , తల్లి యుగోస్లేవియాలో పుట్టి ఇక్కడకు వచ్చి చనిపోయేవరకు ఇక్కడే సేవచేసారు గాని వారి దేశం వెళ్ళలేదు! కాటన్ దొర లాంటి భక్తులు మనలను ప్రేమించి ఎంతో కష్టపడి మనకోసం ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో కష్టాలు పడ్డారు! మధ్యలో వారికి మలేరియా లాంటి వ్యాదులు సంక్రమించినా పని ఆపి వెళ్ళిపోలేదు! మరలా వచ్చి పనిచేసి అమరులయ్యారు! కాబట్టి క్రీస్తుయేసుకు కలిగిన అటువంటి మనస్సు ప్రేమ పతీ దైవసేవకుడు కలిగి సువార్త ప్రకటిస్తే దేశాన్ని ప్రభువుకై గెలవగలం!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*23 భాగం*

1థెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబందించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

     ప్రియులారా! ఇక 910 వచనాలలో పౌలుగారి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది! సహోదరులారా! మా ప్రయాసము మా కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా అంటున్నారు! మా ప్రయాసమును మా కష్టమును అనే మాటలో రెండు అర్ధాలు మనకు కనిపిస్తాయి! మొదటది: పౌలుగారి త్రయం థెస్సలోనికయుల పట్టణంలో పడిన శ్రమలు కష్టాలు కోసం ఇక్కడ రాసి ఉండవచ్చు అని ఒక భావం వస్తుంది! ఎన్ని కష్టాలు పడ్డారో మనకు అపోస్తలుల కార్యములు 17 అధ్యాయంలో మనం చదువుకున్నాము!

 

       ఇక రెండవ అర్ధం ఏమిటంటే ఇదే వచనంలో మిగిలిన పాదము చూసుకుంటే మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టముచేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించాము అంటున్నారు! చూడండి ఇక్కడ వారి పోషణం కోసం థెస్సలోనికయుల సంఘం మీద ఆధారపడకుండా వారిసొంత వృత్తులు చేసుకుంటూ సువార్త పరిచర్య చేశారు!  ఇక్కడ మరో అనుమానం రావచ్చురాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేశాము అంటున్నారు మరి సువార్త ఎప్పుడు ప్రకటించారు? చరిత్ర చూసుకుంటే పౌలుగారు ఎక్కువగా సమాజమందిరాలలో విశ్రాంతి దినమున సువార్త ప్రకటించే వారు కారణం- ఆరోజు ఎక్కడెక్కడో పనిచేస్తున్న యూదులు సమాజమందిరానికి వచ్చేవారు! ఇంకా మిగిలిన రోజులలో తన పనులు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారికి పనిచేసుకుంటూనే సువార్త ప్రకటించేవారు!  ఎందుకు ఎలా చేశారు అంటే మేము మీకు భారంగా ఉండకూడదని ఇలా చేశాము అంటున్నారు! అపొస్తలుల కార్యములో మనకు పౌలుగారు కొరింథీ పట్టణంలో తన సొంత వృత్తి అయిన డేరాలు కుట్టుకుంటూ సువార్త పరిచర్య చేసినట్లు, అప్పుడే ఆకుల ప్రిస్కిల్ల తో పరిచయం జరిగినట్లు చూడగలము!....Acts(అపొస్తలుల కార్యములు) 18:1,2,3,4,5

1. అటు తరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.

2. యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు.

3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.

4. అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.

5. సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.

 

2కొరింథీ 11:9

గమనించాలి విశ్వాసుల నుండి పౌలుగారు ఎప్పుడూ ఆర్ధిక సహాయం స్వీకరించ లేదు అని అనుకోకూడదు! అప్పుడప్పుడు తీసుకున్నారు! అయితే వారు తమకు తాముగా ఇస్తే తీసుకున్నారు తప్ప ఎవరిని ఇవ్వండి అంటూ అడగలేదు! కేవలం యేరూషలేము యూదయ ప్రాంతాలలో శ్రమలను అనుభవిస్తున్న పరిశుద్దుల కోసం చందా మాత్రం అడిగారు తప్ప తనకోసం ఎప్పుడు అడగలేదు!

 

2థెస్స ౩అధ్యాయంలో మరలా దీనినే రెట్టిస్తున్నారు పౌలుగారు. మేము మీకు మాదిరిగా ఉండాలి అని మేము మీలో ఎవనికి భారమగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేసి జీవనం చేశాము అన్న తర్వాత ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు అంటున్నారు! .2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 3:7,8,9,10

7.ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;

8.ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితిమి.

9.మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితిమి గాని, మాకు అధికారములేదనిచేయలేదు.

10.మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు--ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. ....

దీనిని ఇంగ్లీషు నుండి డైరెక్టుగా తెలుగులోకి తర్జుమా చేస్తే డబ్బివ్వకుండా ఎవరి దగ్గర మేము భోజనం చెయ్యలేదు అంటున్నారు! అనగా ఎవరి ఇంట్లో నైనా ఎప్పుడైనా భోజనం చేస్తే దానికి వెంటనే పౌలుగారు డబ్బులు ఇచ్చేసేవారు! ఇది మనదేశంలో కొంచెం అవమానంగా భావిస్తాము గాని చాలా దేశాలలో మన బంధువులు గాని స్నేహితులు గాని పిలిచినప్పుడు వారింటికి వెళ్తే భోజనం అయ్యాక భోజనానికి ఐన ఖర్చు మొత్తం ఇవ్వడం అలవాటు! దేశ పద్దతి! కారణం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో వండిన ఆహారం కాబట్టి తిన్న ఆహారానికి బంధువుల వద్ద స్నేహితుల వద్ద ధనము చెల్లించడం అక్కడ ఆచారం! అలాగే పౌలుగారు కూడా ఎవరి వద్దను ఎప్పుడూ డబ్బులు ఇవ్వకుండా భోజనం చెయ్యలేదు అంటున్నారు! మనమైతే భోజనం చేసేస్తాము తప్ప ఏమీ ఇవ్వము, కనీసం కుటుంబం కోసం కన్నీటితో ప్రార్ధన కూడా చెయ్యము!

కాబట్టి పౌలుగారిని చూసి మనము కూడా నేర్చుకోవాలి! వారు కష్టపడి తమ జీవనానికి అనగా తినడానికి తిండి కోసం తమ చేతులతో కష్టపడి జీవించేవారు! తమ ప్రయాణ ఖర్చులు తామే భరించేవారు! రోజులలో రాను పోను ఫ్లైట్ టికెట్ పంపకపోతే ప్రసంగీకులు రావడం లేదు సభలకు! ఇంకా AC రూమ్ లేకపోతే అలిగి వెళ్ళిపోతున్నారు! ఇది దేవుడు చూపిన పద్దతి కానేకాదు!

 

     ఇక 10 వచనంలో విశ్వాసులైన మీ పట్ల ఎంత భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించామో దానికి దేవుడే సాక్షి మీరు సాక్షులు అంటున్నారు! ఇక్కడ పౌలుగారి మాటలలో మేము మీ పట్ల ఎక్కడ మమ్మల్ని ఆక్షేపించే విధంగా మామీద నేరారోపణ చేసేవిధంగా మేము ప్రవర్తించలేదు దానికి మీరు సాక్షులు దేవుడు సాక్షి అని కుండబద్దలు గొట్టి చెబుతున్నారు! చూశారా ఎంత నిస్వార్ధమైన ప్రేమ, సేవ కదా! నేడు అనేకమంది దైవసేవకులు విశ్వాసుల యొద్ద ధనం అప్పుగా తీసుకుని మరలా ఇవ్వడం లేదు! ఎవరైనా అడిగితే రేపు ఎల్లుండి అని చెప్పేవారు కొంతమంది, బీద ఏడుపులు ఏడ్చి ఎగ్గొట్టే వారు కొంతమంది, నన్ను నిలదీసి అడుగుతావా అని నీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటూ శాపనార్ధాలు పెట్టి భయపెట్టే వారు కొంతమంది! ఇది నిస్వార్ధమైన సేవకాదు!  ఇది పద్దతికాదు! ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే 2కొరింథీ :9 మీరు మమ్మును పోలి నడుచుకోవాలి! ప్రతీ విషయంలో మేము మీకు మాదిరిగా ఉండాలని మేము అలా చేశాము అంటున్నారు!

 

     సందర్భంగా మరో విషయం మీకు జ్ఞాపకం చెయ్యాలనుకుంటున్నాను. తొమ్మిదవ వచనంలో మా ప్రయాసము మా కష్టాలు మీకు తెలుసు అంటున్నారు కదా! సువార్త పరిచర్యకోసం త్రయం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. చివరికి వివాహం చేసుకోకుండా తమ సంసార జీవితాన్ని కూడా త్యాగం చేశారు. ఇది మహోన్నత మైన పరిచర్య! ఎవరో కొందరు ఇలాంటి సేవకోసం ప్రత్యేకించబడి లేక దేవునిద్వారా పొందుకుని ఈసేవ చేశారు. అందుకు తప్పకుండా వీరికి ప్రత్యేక బహుమానాలు కలుగుతాయి!

మత్తయి 19: 12

తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. ( మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

 

    ప్రియ దైవజనుడా! నీకు ఇటువంటి గుణముందా? లేకపోతే నీవు నిస్వార్ధసేవ చేయడంలేదు కేవలం నీ కడుపుకోసం మాత్రమే సేవ చేస్తున్నావు అని గ్రహించి పౌలుగారిని సీలగారిని తిమోతి గారిని ఆదర్శంగా తీసుకుని వారిని క్రీస్తుని పోలి నడచుకో!

 

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*24 భాగం*

*దైవజనుని లక్షణం-1*

1థెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

     ప్రియులారా! ఇక 910 వచనాలలో పౌలుగారి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది! సహోదరులారా! మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతభక్తి గాను, నీతి గాను అనింద్యము గాను ప్రవర్తించామో మీరు సాక్షులు అంటున్నారు!  వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక దైవసేవకునికి కాపరికి ఉండవలసిన మూడు ముఖ్యమైన లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి! మూడు లక్షణాలు తప్పకుండా సేవకునికి కావాలి! అవి 1. భక్తి, 2. నీతి, . అనింద్యము అనగా నిందలేని జీవితము! మూడు లక్షణాలు పౌలుగారి లో సీలగారిలో ఇంకా తిమోతి గారిలో ఉన్నాయి కాబట్టి జయ జీవితం జీవించి ఘనమైన పరిచర్య చేయగలిగారు! ప్రియ దైవజనుడా! లక్షణాలు నీకున్నాయా? ఏదో ఒకటి మాత్రమే ఉందా?

 

   మొదటగా భక్తి కోసం ధ్యానం చేసుకుంటే భక్తి పరుడు అని బైబిల్ లో కొందరికి డిగ్రీలున్నాయి! వారిలో ఒకరు ఎలీషా గారు మరొకరు కొర్నేలీ గారు! మరొకరు అననీయ గారు!

         ఘనురాలైన షూనేమీయురాలు తన భర్తతో అంటుంది మన యొద్దకు వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తిగల దైవజనుడు చూశారా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ఎలీషా గారు! ...2రాజులు 4: 9

కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.

 

 ఎలీషా గారి ట్రైనింగ్ ఎవరిదగ్గర పొందారు? ఏలీయా గారి దగ్గర! ఆయన నుండి భయభక్తులు దేవునియందు భక్తి విశ్వాసులు నేర్చుకుని చివరలో ఏలీయా గారు పొందుకున్న ఆత్మకు రెండింతలు పొందుకుని , భక్తికి పిలుపుకు తగిన యదార్ధ మైన జీవితం జీవించారు! ఇది మనకు నయమాను కధ వలన బాగా అర్ధమవుతుంది! అయితే అదే నయమాను చరిత్ర వలన మరొకటి కూడా అర్ధమవుతుంది ఏమిటంటే ఏలీయా గారి దగ్గర ట్రైనింగ్ అయిన ఎలీషా గారు భక్తిగల దైవజనుడు అని పేరు తెచ్చుకుంటే అదే భక్తిగల దైవజనుని వద్ద ట్రైనింగ్ అయిన గేహాజీ గారు ధనాపేక్ష వలన ఏమైనా సంపాదించుకుంటాను అని వెళ్ళి తనకు తన కుటుంబానికి నయమాను పోగొట్టుకున్న కుష్టువ్యాది సంపాదించుకున్నాడు! ఇదీ వారి భక్తికి గల తేడా!!!

 

   ఇక కొర్నేలీ గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్యుడు! గాని దేవునియందు భయభక్తులు కలవాడు! మార్గం ఎవరూ ఆయనకు నేర్పించలేదు! ఆయన భక్తిని ఆయన చేసిన మంచికార్యాలకు దేవుడే మెచ్చి తన దూతను పంపించి తన మార్గమును తెలియజేశారు!ఈయనకోసం దేవుడిస్తున్న సర్టిఫికేట్ ..... 10.Acts(అపొస్తలుల కార్యములు) 10:1,2,3,4

1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

2. అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

3. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చికొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

4. అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

 

 మొదటగా భక్తిపరుడు, రెండవది దానకార్యాలు చేసేవాడు!  మూడవది ప్రార్ధనాపరుడు! చివరికి అన్యుడైనా గాని దేవుని దర్శనాన్ని పొందుకున్నారు! ఇంకోమాట పరిశీలిస్తే తనకు దైవదర్శనం కలిగిన తర్వాత దూత ఆయనకు యొప్పేకు మనుషులను పంపించి పేతురు గారిని పిలిపించుకుని వర్తమానం పొందుకో అంటే కోర్నేలీ గారు ఎవరిని పంపించారు అంటే భక్తిపరుడు మరో ఇద్దరు భక్తిపరులైన సైనికులను పంపించారు!

 

              పౌలుగారు తన సాక్ష్యాన్ని రాజుల దగ్గర యూదుల దగ్గర ఇచ్చేటప్పుడు తనకోసం ప్రార్ధన చేసిన అననీయ గారికోసం అంటున్నారు ధర్మశాస్త్రము చోప్పిన భక్తిపరుడును, అక్కడున్న యూదులతో మంచిపేరు పొందిన వాడు నైన అననీయ అనే ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి ఇలా అన్నాడు అంటున్నారు అపో 22:12

అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి

 

బైబిల్ లో భక్తి కోసం ధ్యానం చేసుకుంటే:

యోబు గారిని తన స్నేహితులు అడుగుతారునీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యదార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా!!! 4:6

ఇంతకీ భక్తి అంటే ఏమిటి? యాకోబు 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

భక్తిలేకపోతే నీలో క్రోధము ఉంటుంది యోబు 6:13

 

కాబట్టి దైవజనునికి విశ్వాసికి కావలసినది భక్తి! భక్తిలేకపోతే శక్తి లేదు! శక్తిలేకపోతే చచ్చిన కుక్కతో సమానం! కోరలు పీకిన పాముతో సమానం! గొలుసులతో బంధించిన సింహముతో సమానం! మొరిగే కుక్క కరవదు అన్నట్లు పెద్ద పెద్ద ప్రసంగాలు దీర్ఘ ప్రార్ధనలు చేసినా ఒక్కడు రక్షించబడడు! పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది అతని జీవితం! కాబట్టి భక్తికలిగి భక్తిని కాపాడుకుంటూ బ్రతుకుదాము!

 

భక్తిహీనుల కోసం బైబిల్ చెబుతుంది : వారు సిగ్గు పడతారు , ఇంకా పాతాళమందు మౌనముగా ఉంటారు కీర్తన 31:17

 

భక్తిహీనులు లేకపోతారు వారికి వెదికినా కనబడరు కీర్తన 37:10

 

వారు నశించి పోతారు కీర్తన 37:20

 

అప్పుచేసి తీర్చరు కీర్తన 37:21

 

నీతిమంతులను చంపాలని అనుకుంటారు కీర్తన 37:32

 

నిర్మూలం అయిపోతారు కీర్తన 37:34

 

విపరీత బుద్ధి ఉంటుంది కీర్తన 58:

 

దేవుని సన్నిధిని కరిగి నశించుదురు కీర్తన 68:2

 

ధనవృద్ధి చేసుకుంటారు కీర్తన 7:12

 

గడ్డిలా చిగుర్చుదురు, నిత్యనాషణం అయిపోతారు కీర్తన 92:7

 

వారి ఆశ భంగమై పోవును కీర్తన 112:10

 

వారికి రక్షణ దూరంగా ఉంది కీర్తన 119:155

 

తమ వలలో తామే చిక్కుకు పోతారు కీర్తన 141:10

 

ఇంకా బోలెడు రిఫరెన్సులు ఉన్నాయి. కాబట్టి భక్తిహీనులు వర్దిల్లరు కాబట్టి దైవజనుడా భక్తికల్గి జీవిస్తూ భక్తిని కాపాడుకో!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*25 భాగం*

*దైవజనుని లక్షణం-2*

1థెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

     ప్రియులారా! ఇక 910 వచనాలలో పౌలుగారి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది! సహోదరులారా! మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతభక్తి గాను, నీతి గాను అనింద్యము గాను ప్రవర్తించామో మీరు సాక్షులు అంటున్నారు!  వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక దైవసేవకునికి కాపరికి ఉండవలసిన మూడు ముఖ్యమైన లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి! మూడు లక్షణాలు తప్పకుండా సేవకునికి కావాలి! అవి 1. భక్తి, 2. నీతి, . అనింద్యము అనగా నిందలేని జీవితము!

 ఇక దైవజనుని రెండవ లక్షణం కోసం ధ్యానం చేసుకుంటే- పౌలుగారి త్రయమునకు ఉన్న మరో లక్షణం నీతి!! దైవజనునికి విశ్వాసికి కావాలి నీతి! నీతిగల జీవితం! నీతి మరణం నుండి రక్షిస్తుంది అంటుంది బైబిల్!...సామెతలు 10:2;

 

బైబిల్ లో నీతిమంతులు లేక నీతిపరులు అని పేరు పొందిన భక్తులు   ఉన్నారు వారిలో ప్రధముడు నోవాహు గారు! నోవాహు గారితో దేవుడు రెండుసార్లు చెబుతున్నారు తరమువారిలో నీవే నా యెదుట నీతి పరుడుగా కనబడ్డావు! ఆదికాండం 6, 7 అధ్యాయాలు! చివరికి ఈయన నీతి మరణం నుండి రక్షించింది ఎవరిని? తనను తన కుటుంబాన్ని! 12 సంవత్సరాలు నీతిమంతుడు ప్రకటించినా సువార్త చెప్పినా మిగిలిన వారు వినలేదు! జలప్రళయంలో నశించిపోయారు!

 

తర్వాత వాడు లోతు! అబ్రాహాము గారితో ఇంకా బైబిల్ ద్వారా కూడా నీతిపరుడు అని సర్టిఫికేట్ పొందినవాడు! 2పేతురు 2:8; చివరికి ఈయన నీతి కూడా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది అగ్ని గంధకాల నుండి గాని ఆయన కుమార్తెలు నీతి తప్పి ప్రవర్తించారు!

 

మోషే గారు చెబుతున్నారు మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మనకు నీతి కలుగుతుంది ద్వితీ 6:25

 

మరోమాట చెప్పనాబైబిల్ అనేకసార్లు వ్రాయబడింది- అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను!.....రోమా 4:3; గలతీ 3:6; యాకోబు 2:23

 

 అనగా దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మడమే నీతి! నమ్మి విశ్వసించడమే నీతి! రకంగా ఈయన నీతిమంతుడుగా తీర్చబడ్డారు!

 

కీర్తనలు 15:2 ప్రకారం యెహోవా పర్వతమందు నివసించు వాడు ఎవడు అంటే నీతిని అనుసరించే వాడే!

 

ఈలోకంలో నీతిమంతుడు ఎవరంటే మొదటగా : యెహోవాయే నీతిమంతుడు, కీర్తన 11:7, 116:5;

 

నీతిమంతుడు నిత్యమూ నిలుచు కట్టడం వలె ఉంటాడు సామెతలు 10:25

 

ఎన్నడును కదిలించ బడడు! సామెతలు 10:౩౦

 

బాధ నుండి తప్పించబడును సామెతలు 11:8

 

పశువుల ప్రాణమును దయతో చూస్తాడు సామెతలు 12:10

 

ఆపదను తప్పించుకొంటాడు సామెతలు 12:13

 

తన పొరుగువానికి దారి చూపును. సామెతలు 12:26

 

ఆకలితీర భోజనం చేయును సామెతలు 13:25.

 

యెహోవా నామమునకు పరుగెత్తి అందులో సురక్షితముగా ఉంటాడు సామెతలు 18:10

 

వెనుక తీయకుండా ఇస్తాడు సామెతలు 21:26

 

ఏడు మారులు పడినా లేస్తాడు సామెతలు 24:16

 

సంతోష గానములు చేయును సామెతలు 29:6

 

బీదల కొరకు న్యాయము విచారించు వాడు సామెతలు 29:7

 

నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును హబక్కూకు 2:4; రోమా 1:17; గలతీ :11

 

కాబట్టి ప్రియ దైవజనుడా విశ్వాసి నీతిని అనుసరిస్తున్నావా? నీతి తప్పి ప్రవర్తిస్తున్నావా? నీటిని తప్పితే నరకం తప్పదని గుర్తుకు చేసుకో!

నీతిమంతులైన నోవాహు గారిని, అబ్రాహాము గారిని లోతుగారిని యోబు గారిని గుర్తుకు చేసుకో!

వారిని పోలి నడచుకో!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*26 భాగం*

*దైవజనుని లక్షణం-*

1తెస్స 2:7—10

7. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమైయుంటిమి (శిశువులమైయుంటిమి).

8. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.

9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

10. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

          (గతభాగం తరువాయి )

 

     ప్రియులారా! ఇక 910 వచనాలలో పౌలుగారి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది! సహోదరులారా! మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతభక్తి గాను, నీతి గాను అనింద్యము గాను ప్రవర్తించామో మీరు సాక్షులు అంటున్నారు!  వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక దైవసేవకునికి కాపరికి ఉండవలసిన మూడు ముఖ్యమైన లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి! మూడు లక్షణాలు తప్పకుండా సేవకునికి కావాలి! అవి 1. భక్తి, 2. నీతి, . అనింద్యము అనగా నిందలేని జీవితము!

 

 ఇక దైవజనుని రెండవ లక్షణం కోసం ధ్యానం చేసుకుంటే- పౌలుగారి త్రయమునకు ఉన్న మరో లక్షణం అనింద్యము! దైవజనునికి విశ్వాసికి నిందలేని జీవితం! మచ్చలేని జీవితం! ఇలా సవాలు కరమైన జీవితం జీవించిన వారిలో ఇంకా సవాలు విసిరిన వారిలో యేసుక్రీస్తు ప్రభులవారున్నారు! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించగలడు అంటూ సవాలు విసిరారు! యోహాను 8:46;

 ఆయన మచ్చలేని జీవితం పాపం లేని జీవితం జీవించారు! నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటూ ముందుగానే చెప్పారు! లేవీ 11:45; 20:46; 21:8; క్రీస్తుయేసు కు కలిగిన మనస్సు ప్రియ దైవజనుడా విశ్వాసి నీకుందా??!!!

 

దేవుని రౌండ్ టేబుల్ సమావేశంలో రెండు సార్లు దేవుడు చెబుతారు- సాతానుతో నా సేవకుడైన యోబు సంగతి విచారించావా? అతడు యధార్ధవర్తనుడు .. న్యాయవర్తనుడు దేవునియందు భయమును భక్తిగలవాడు అంటున్నారు ఇంకా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు! 1:8; 2:3; వాడు అనగా సాతాను గాడు అంటున్నాడు నీవు ఆయన చుట్టూ కంచె వేశావు ఇది చేశావు అది చేశావు అంటున్నాడు గాని ఆయనమీద నేరం మోపడానికి కూడా సాతాను గాడికి ఏమీలేదు! అందుకే తన భక్తుడైన యోబు గారి కోసం దేవుడు అంతగొప్పగా చెప్పుకున్నారు! ప్రియ విశ్వాసి సేవకుడా! నేడు రోజు దేవుడు నీకోసం అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరా!!!

 

ఇక్కడ పౌలుగారు అంటున్నారు మీ ఎదుట మేము నీతిగాను భక్తిగాను అనింధ్యము గాను ఉన్నాము! అనగా ఎవడూ మమ్మల్ని తప్పుపట్టే స్థితిలో మేము లేము అంటున్నారు!

అదే పౌలుగారు తీతుకు గారితో అంటున్నారు పరపక్ష్యమందు ఉండువాడు నీ మీద చెడ్డమాటలు చెప్పకుండా వాడే సిగ్గుపడేలా నీవు ప్రవర్తించు! తీతుకు 2:7

పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

 

ప్రతీ దైవజనుడు నాయకుడు కూడా సంఘమునకు వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొంది ఉండాలి అంటున్నారు పౌలుగారు తిమోతికి నాయకుడు ఎలా ఉండాలో చెబుతూ  1తిమోతి :7

 

కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నారు పౌలుగారు సంఘములో చాలామంచి పేరు సంపాదించారు సెహబాస్! అదే సమయంలో సంఘమునకు వెలుపటి వారిఎడల కూడా మంచి ప్రవర్తన కలిగి వారి యెడల జ్ఞానం కలిగి జీవించండి అంటున్నారు! 4:5

 

కాబట్టి సేవకుడు లేక దైవజనుడు కాపరి విశ్వాసి నిందలేని జీవితం జీవించాలి! అయితే భక్తిగా నీతిగా జీవించేవానిమీద ఎన్నో నిందలు వస్తాయి గాని నిజం దేవుడెరుగు! అంతేకాకుండా నీవు ఎలాంటి వాడవో నిన్ను నీ ఇరుగుపొరుగు వారు ముఖ్యంగా అన్యులు నిన్ను 24గంటలూ గమనిస్తూ ఉంటారు! కాబట్టి వారి ముందు కూడా నీవు నిందలేని నిప్పులాంటి జీవితం జీవించవలసిన అవసరం ఉంది!

 

దైవజనుడు సాక్ష్యాన్ని కోల్పోకూడదు!  అప్పుడే నిందలేని జీవితం జీవించగలడు! గమనించాలి దైవజనుడు సాక్ష్యాన్ని, శీలాన్ని ఎక్కువగా రెండు విషయాలలో పోగొట్టుకుంటాడు ఒకటి స్త్రీ, రెండు ధనము! మూడవది అధికార కాంక్ష లేక గొప్ప కొరకు ప్రాకులాడటం! దైవజనుల సాక్ష్యం చాలాసార్లు స్త్రీల వలన అనేకుల సాక్ష్యం పోగొట్టుకున్నారు! ఎంతో ఘనత పొందిన వ్యక్తి చక్రవర్తి, ప్రవక్త దైవజనుడు పాటగాడు వాయిద్యకారుడు కీర్తనాకారుడు అని పేరు తెచ్చుకున్న దావీదు గారు ఇదే స్త్రీ విషయంలో తప్పిపోయి జీవితానికి నింద తెచ్చుకున్నారు! బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే కంపు కొడుతుంది అలాగే కొంచెము బుద్దిహీనత ఘనతను పొగుడుతుంది అని సోలోమోను గారు చెబుతున్నారు..ప్రసంగి 10: 1

బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును.

.. మాట ఎప్పుడు చెప్పారో తెలుసా? తాను ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చుకుని, తనకున్న కామాతురత వలన తన వృద్ధాప్యంలో ఘనతను పోగొట్టుకున్నాక అనుభవంతో రాశారు మాట! ప్రియ దైవజనుడా! విషయంలో పడిపోతున్నావ్? స్త్రీ వ్యామోహమా? లేక ధనాపేక్ష! నేడు అనేకమంది గొప్పగొప్ప దైవజనులు ధనం దగ్గర పడిపోయి సాక్ష్యాన్ని పోగొట్టుకుని శీలాన్ని పోగొట్టుకుని నేడు నిందలపాలయ్యేరు!

 

పౌలుగారు మాటిమాటికి చెబుతున్నారు పరపక్ష్యమందు ఉన్నవారు అనగా అన్యులు నిన్ను నిందించడానికి అవకాశం చాన్సు ఇవ్వవద్దు! తద్వారా నీవు సాక్ష్యాన్ని కాపాడుకుని జీవ కిరీటం మహిమ కిరీటం నీతి కిరీటం పొందుకోగలవు!  పౌలుగారు చెప్పడమే కాదు చేసి చూపించారు! యేసుక్రీస్తు ప్రభులవారి వలె సవాలుకరమైన జీవితం జీవించారు! యేసుక్రీస్తుప్రభులవారి వాలే సవాలు విసిరారు! మంచి పోరాటం పోరాడాను నా పరుగు తుదముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను! ఇక నాకు నీతి కిరీటం ఉంది అంటున్నారు! ఇలా సవాలుకరమైన జీవితం నీకుందా ప్రియ చదువరి!!!!

 

నిన్నునీవు నేడే పరిశీలించుకుని సరిచేసుకో!

పరలోకాన్ని సంపాదించుకో!

మచ్చలేని జీవితం నిందలేని జీవితం జీవించు!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*27 భాగం*

1థెస్స 2:13—14

13. హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

14.అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది! అయితే థెస్సలోనికయుల సంఘం మొత్తం దేవుని రాకడకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల కోసం ఎదురుచూస్తుంటే కొంతమంది పౌలుగారిమీద చెడ్డమాటలు పలికారు అందుకే పౌలుగారు మాటలు రాశారు అని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం!

 

   ప్రియులారా ఇక 13, 14 వచనాలు చూసుకుంటే హేతువుచేత అంటూ మొదలుపెట్టారు! హేతువుచేత అనగా మొదటగా పౌలుగారి సీలగారి తిమోతి గార్ల నిస్వార్ధమైన సేవా పరిచర్య వలన, మరియు తల్లి మరియు తండ్రి తన పిల్లలపట్ల ఎలా ప్రవర్తిస్తారో అలాగే థెస్సలోనికయుల సంఘము పట్ల కూడా సేవకుల త్రయము ప్రవర్తించి నందువలన మీకు అనగా థెస్సలోనికయుల సంఘము కూడా దేవుని గూర్చిన వర్తమాన వాక్యము అనగా సువార్తను మావలన అనగా పౌలుగారి త్రయము వలన వినినప్పుడు అది మనుష్యులు చెప్పినది అని ఎంచకుండా అది నిజముగా ఉన్నట్లు అనగా దేవుని శక్తిని అక్కడ రుచిచూసి దేవుడే అక్కడ తన దూతలచేత సువార్త చెప్పినట్లు మీరు అది నిజంగా దేవుని వాక్యమని అంగీకరించారు సువార్తను! అందుకే మేము కూడా దేవునికి మానకుండా మీ కోసం దేవునునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నారు! అదే వాక్యం ఇప్పుడు విశ్వాసులైన మీలో ఇప్పటికీ కార్యసిద్ధి కలుగుజేస్తుంది అంటున్నారు అనగా ఇప్పటికీ అది సజీవమై వెలుగుతుంది వెలుగిస్తుంది అంటున్నారు!

 

  దీనికోసం మరలా 1థెస్స 1:4 లో చెప్పబడిన విషయమును జ్ఞాపకం చేసుకోవాలి! ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు ఏర్పరచా బడిన సంగతి అనగా మా సువార్త మాటతో కాకుండా శక్తితోను పరిశుద్ధాత్మ తోనూ అనగా పరిశుద్ధాత్మ శక్తితోను సంపూర్ణ నిశ్చయతతోనూ మీ దగ్గరకు వచ్చియున్న సంగతి మీకు తెలుసు అంటున్నారు!  గతభాగాలలో చూసుకున్నాముపౌలుగారి త్రయము అక్కడ వాక్య పరిచర్య సువార్త పరిచర్య చేస్తుంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చి వారిని కదిలించింది దేవుని సన్నిధిని వారు అక్కడే అనుభవించి మారుమనస్సు పొంది రక్షణ పొందారు! అలా పొందుకున్న విశ్వాసము నిరీక్షణ రక్షణ ఎన్ని శ్రమలు కలిగినా వారు తట్టుకుని నిలబడ్డారే తప్ప సోలిపోలేదు!

 

    దీనినే ఇక్కడ మరోసారి గుర్తుచేస్తున్నారు పౌలుగారు 13 వచనంలో! దేవుని గూర్చిన వార్త వర్తమాన వాక్యమనే సువార్తను మావలన అంగీకరించినప్పుడు ఇది మనుష్యులు చెప్పే వాక్యమని మీరు తలంచలేదు! నిజంగా దేవుడే తన దూతలను పంపించి తన వర్తమానం మా దగ్గరకు పంపించారు అని భయపడి నమ్మి పశ్చాత్తాప పడి మారుమనస్సు పొంది విశ్వసించారు!! అప్పుడు విశ్వసించి వెంటనే మీరు విశ్వాసాన్ని కోల్పోలేదు  ఇంతవరకు దానిలో దృడంగా నిలిచారు! అందుకే ఇంకా వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అంటున్నారు! కార్య సిద్ధి అనగా కార్యమును సిద్ధించుట అనగా సంపూర్తి చేయుట! అనగా మీరు మావలన వినిన వాక్యాన్ని మీరు దేవుని వాక్యమని నమ్మి విశ్వసించి అనుసరించారు!

 

 అంతటితో ఆగకుండా అందరికీ దేవుని వర్తమాన వాక్యము ప్రకటిస్తున్నారు కనుక అదే వాక్యము ఇంకా మీలో పనిచేస్తూ అనేకులను వాక్యమునకు లోబడునట్లు చేస్తుంది అనగా కార్యసిద్ధి కలుగజేస్తుంది అంటున్నారు! ఒకరకంగా పౌలుగారు చెబుతున్నారు భళా నమ్మకమైన మంచి దాసులారా అని సర్టిఫికేట్ ఇస్తున్నట్లు ఉంది ఇక్కడ! అందుకే మీరు అంత భక్తిశ్రద్ధలతో విశ్వాస నిరీక్షణ లతో జీవిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా బలంగా దేవునికోసం నిలబడాలని వాడబడాలని మీకోసం అనుదినం మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా ప్రార్ధన చేస్తున్నాము అంటున్నారు!

        ఇంకా 14 వచనంలో అంటున్నారు అవును సహోదరులారా! మీరు యూదయలో   క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములన్నింటిని పోలి నడుచుకొన్న వారయ్యారు అంటున్నారు! రకంగా వారిని పోలి వీరు నడచుకున్నారో దానికి వివరణ కూడా ఇస్తున్నారు: వారు అనగా యూదయలో ఉన్న దేవుని సంఘములు యూదులవలన అనేక భాధలు అనుభవించారు! మీరు కూడా మీ సొంత దేశస్తుల వలన మరియు యూదుల వలన శ్రమలను అనుభవించారు అంటున్నారు!  సంఘము యూదయలో ఉన్న లేక ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంఘాలు, విశ్వాసులు ఎటువంటి శ్రమలను శోధనలను యూదులవలన అనుభవించారో అదే రకమైన శోధనలు శ్రమలను వీరుకూడా అనగా థెస్సలోనికయుల సంఘము కూడా యూదుల వలన ముఖ్యంగా వారి సొంత జనుల వలన అనేకమైన శోధనలు అనుభవిస్తున్నా బలంగా క్రీస్తు కొరకు నిలబడ్డారు!

 

   థెస్సలోనికయుల సంఘములో కేవలం అన్యజనులే కాదు యూదులు కూడా ఉన్నారు! మాసిదోనియలోను  అనేకమంది యూదులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు! వారిలో కొంతమంది మారుమనస్సు పొంది క్రీస్తును అంగీకరించారు కాబట్టే యూదులు అన్యులను ప్రేరేపించి ఇద్దరూ కలిసి అనేకమైన చిత్రహింసలు చేసారు సంఘాన్ని! అయినా సంఘము శోధనలకు హింసలకు భయపడలేదు! వెరువలేదు జడియలేదు! వర్తమానం తెచ్చిన తిమోతిగారు సంతోషించారు!  అందుకే పౌలుగారు ఇప్పుడు సంతోషిస్తున్నారు!

 

  అది ఇంకా అలాగే నిలబడాలని కోరుకుంటున్నారు పౌలుగారు! అదే ఫిలిప్పీ సంఘాన్ని కూడా కోరారు! ఫిలిప్పీయులకు 1: 4

మీలో సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

 

ఎందుకు వాక్యము నిలిచి ఫలించాలి అని పౌలుగారు కోరుకుంటున్నారు అనగా వాక్యమునకు శక్తి ఉంది గనుక! అది సజీవమైనది గనుక!

హెబ్రీయులకు 4: 12

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.

 

అందుకే శక్తిగల వాక్యం మీలో సమృద్ధిగా ఉండనివ్వండి మాటలు ఒకరినొకరు నేర్చుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఉండండి  ఇంకా వాక్యము మీదనే కీర్తనలు పాటలు పాడుకుంటూ ఆత్మ సంభంధమైన సంగీత ధ్వనులు చేసుకుంటూ ఉండండి అంటున్నారు కొలస్సీ :16....

సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 

  అందుకే పౌలుగారు సంఘానికి ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టిన వెంటనే చెబుతున్నారు మీరు మమ్ములను ప్రభువునూ పోలి నడచుకున్నారు! ఇప్పుడు యూదయ ఇంకా అనేకమైన నిజ సంఘాలను పోలి నడచుకున్నారు అంటున్నారు!

1థెస్స 1:6

 

   ప్రియ సంఘమా! థెస్సలోనికయ సంఘము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనగా అది దేవుని వాక్యమే అని నమ్మి విశ్వసించి దేవునికోసం బలంగా నిలబడ్డారు! నీవు కూడా ఆదిమ సంఘాలను పోలి నడచుకుంటావా లేక ఆధునిక పోకడలో కొట్టుకుని పోతున్నావా? ఒకసారి పరిశీలించుకో! దేవుడు అంటున్నారు అంత్యము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటం ఇస్తాను! మరో దగ్గర అంటున్నారు మరణము వరకు నమ్మకముగా ఉండు! మరి నీవు అంత్యము వరకు అనగా నీ మరణం వరకు నమ్మకముగా ఉండగలవా? ఎన్ని శోధనలు శ్రమలు కలిగినా ప్రభువుకై సాక్షిగా నిలువగలవా!

 

దైవాశీస్సులు!

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*28 భాగం*

1థెస్స 2:15—16

15. యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,

16. అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునైయున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది!

 

    ఇక 15,16 వచనాలలో యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి, మమ్ములను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టులు కానివారై పోయారు ఇంకా మనుష్యులకందరికీ విరోధులై పోయారు అంటున్నారు. ఇక్కడ యూదులు తమ పాపములను సంపూర్తి చేయడానికే ఇలా పాపపు పనులు చేస్తున్నారు అంటున్నారు!

 

 మొదటగా ప్రభువైన యేసుక్రీస్తును చంపారు! దీనికోసం మనందరికీ తెలుసు! ఎందుకు చంపారు? నేను దేవుని కుమారుడిని అన్నందుకు! వారి తప్పులు ఎత్తి చూపినందుకు చంపారు! దేవుని కుమారుడిని అనగా నేను దేవునితో సమానమైన వాడిని అన్నందుకే వారు ఆయనమీద పగబట్టి చంపారు! అయితే అది దేవుని ప్రణాళిక అనుకోండి! గాని శారీరకంగా ఎందుకు చంపారు అంటే దేవునితో తనను సమానంగా చేసుకోవడం వలన!

 

   ఇంకా ప్రవక్తలను చంపారు! దీనికోసం పాత నిబంధన గ్రంధం మొత్తం చెబుతుంది! చివరికీ ఏలీయా గారు కూడా దేవునికి పిర్యాదు చేశారు వీరికోసం! నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీటాలు పడద్రోశారు సైన్యములకు అధిపతియైన యెహోవాకు నేను ఒక్కడినే రోషము కలిగి యుంటే ఇప్పుడు నన్నుకూడా చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు అని దేవునికి చెప్పారు ఏలీయా గారు! 1 Kings(మొదటి రాజులు) 19:13,14

13. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో-ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.

14. అందుకతడు-ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను. ఇది యూదులకు అలవాటే!

 

Romans(రోమీయులకు) 11:2,3

2. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?

3. ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.

 

 యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇదే అన్నారుయేరూషలేమా ప్రవక్తలను చంపుతూ వస్తున్నదానా నీవు నాశనం అయిపోతావు అన్నారు మత్తయి 23:37,38..

37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.

38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది

 

  భక్తుడైన స్తెఫెను దీనికోసం ఎత్తి చెప్పారు అపో 7:52 ....

మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.

 

చివరకు ఆయనను కూడా రాళ్ళురువ్వి చంపారు!

 

యేసయ్య చెప్పారు మీరు బరకీయ కుమారుడైన జెకర్యాను చంపారు అని! మత్తయి 23: 35

నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.

 

 యాజకుడైన యెహోయూదా కుమారుడైన జెకర్యాను దేవుని మందిరం లోనే చంపారు!.....2 Chronicles(రెండవ దినవృత్తాంతములు) 24:20,21,22

20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.

21. అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.

22. ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

 

ఇలా ఎంతోమంది ప్రవక్తలను చంపారు! ఇలా చంపి వారి పాపాన్ని సంపూర్తి చేస్తున్నారు అంటున్నారు! సంపూర్తి చేయడం కోసం ఆలోచిస్తే – దేవుడు సంపూర్తి చేసే లెక్క పూర్తి అయ్యేవరకు ఏవిధమైన ప్రతీకారం చేయరు! ఉదాహరణకు సోదోమగోమోర్రా పట్టణాలను అగ్ని గంధకములతో నాశనం చేసేముందు ఇద్దరు దేవదూతలను పంపించారు సోదోమ గోమోర్రా లకు! వారి లెక్క సంపూర్తి అయ్యిందా లేదా అని! చూడండి అది అబ్రాహము గారికి దేవుడు ముందుగానే తెలియజేశారు! ఆదికాండం 18:20—21

20. మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను

21. నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.

 

   ఇక ఇదే విషయం ప్రకటన గ్రంధం లో కూడా వ్రాయబడి ఉంది! బలిపీఠం దగ్గర ఆత్మలు అడుగుతాయి దేవుణ్ణి నాధా సత్య స్వరూపి! ఎంతకాలం ఇంకా మా రక్తముకోసం న్యాయం తీర్చకుండా ఉంటావు అని అడిగితే మీలాగే చంపబడ బోయే వారి లెక్క పూర్తి అయ్యేవరకు వేచి యుండండి అప్పుడు భూలోకం మీదకు తీర్పు వస్తుంది అని దేవుడు చెప్పారు....Revelation(ప్రకటన గ్రంథము) 6:10,11

10. వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

11.తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియువారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ..

 

  కాబట్టి లెక్క పూర్తి అయ్యేవరకు దేవుడు ఏమీ చెయ్యరు! ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు యూదులు యేసుప్రభులవారిని ప్రవక్తలను మమ్ములను హింసించి వారు తమ లెక్కను పూర్తిచేస్తున్నారు అంటున్నారు.  నీవు కూడా అనుకోవచ్చు- నేను ఎలా తిరిగినా దేవుడు ఏమీ అనడం లేదు! చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు దేవుడు! మరికొందరు దేవుడు ఏమీ ప్రతిదండన చేయకపోతే దీనిని దేవుడు ఆమోదించేశాడులే అని బుజాలు ఎగరేస్తున్నారు! ఓరి అమాయకుడా! దేవుడు నీవు చేస్తున్న తప్పులు అన్ని లెక్కపెడుతున్నారు! లెక్క ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అంతే నీకు అడ్రస్ లేకుండా శాల్తీ గల్లంతు అయిపోతుంది నీది! అప్పుడు నీవు వెదికినా దొరకవు! జాగ్రత్త నేడే తప్పులు ఒప్పుకుని పశ్చాత్తాప పడి దేవుని పాదాలు పట్టుకుని పాపాలు కడిగేసుకో! లేకపోతే నీ గతి అధోగతే!!!

(ఇంకా ఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*29 భాగం*

1థెస్స 2:15—16

15. యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,

16. అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునైయున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది!

 

      (గత భాగం తరువాయి)

 

ఇక మమ్మును హింసించారు అని అంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడ పౌలుగారికి ఇంకా భక్తులను హింసించారో ఒకసారి చూసుకుందాము!

అపో.కార్యములు 13: 50

గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

 

Acts(అపొస్తలుల కార్యములు) 14:2,5,19

2. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.

5. మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.

19. అంతియొకయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.

 

అపో.కార్యములు 17: 5

అయితే యూదులు మత్సరపడి, పని పాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

 

ఇంకా పౌలుగారు తన జీవితంలో క్రీస్తుకోసం ఎన్ని పాట్లు పడ్డారో వివరిస్తూ కూడా చెబుతున్నారు........

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27

23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

 

అయితే 16 వచనంలో అంటున్నారు యూదులు ఇలా చేసి మొదటగా దేవునికి ఇష్టం కానివారుగా మారిపోయారు! తర్వాత సర్వ ప్రజలకు విరోధులై పోయారు అంటున్నారు! అవును దేవునికి ఇష్టులు కాకపోతే అందరికీ వ్యతిరేకులై పోతారు! ఎన్నో తరాలు నుండి ఇశ్రాయేలు ప్రజలు బోలెడు దేశాలకు శత్రువులుగా ఉన్నారు!  ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మేము చెప్పే బోధలు కనీసం అన్యజనులు కూడా వినకూడదు అని! అయితే పౌలుగారు చెబుతున్నారు ఒకసారిమీరు మేము చెప్పింది వినడం లేదు కాబట్టి అన్యజనుల యొద్దకు వెళ్తున్నాము! వారికే సువార్త ప్రకటన చేస్తున్నాము అంటున్నారు.....

Acts(అపొస్తలుల కార్యములు) 13:45,46,47

45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.

46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు,గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము;

47. ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.

50. గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

 

అపో.కార్యములు 20: 3

అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్లవలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించు కొనెను.

 

అపో.కార్యములు 21: 27

ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని

 

 

 Acts(అపొస్తలుల కార్యములు) 22:21,22,23,24,25

21. అందుకు ఆయనవెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.

22. మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.

23. వారు కేకలువేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా

24. వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.

25. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.

 

అందుకే యేసయ్య అంటున్నారు మీ పూర్వీకుల అపరాధ పరిమాణం పూర్తి అయ్యేవరకు అలాచేయండి లేదా వారి అపరాధ పరిమాణాన్ని పూర్తి చెయ్యండి అంటున్నారు!

 Matthew(మత్తయి సువార్త) 23:31,32

31. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.

32. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.

 

 అయితే పత్రికలు రాస్తున్నప్పుడు ఒక ప్రత్యక్షత చెబుతున్నారు- ఏమిటంటే యూదులు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అన్యజనులలో నుండి రక్షించబడవలసిన సంఖ్య పూర్తి అయ్యే వరకు మాత్రమే ఇలా ఉంటారు! ఇక్కడ కూడా లెక్క పూర్తి అయ్యేవరకు ఇలా చేస్తున్నారు అంటున్నారు! వారి లెక్క పూర్తి అయ్యిన వెంటనే విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని వ్రాయబడిన విధంగా యూదులు రక్షణ పొందుతారు!.....

Romans(రోమీయులకు) 11:25,26,27

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

     ఇక చివరిగా అందుకే దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదు వచ్చెను అంటున్నారు! మాట ఎందుకు అంటున్నారు అంటే మొదటగా వీరు యేసుక్రీస్తు ప్రభులవారిని చంపించడానికి పిలాతు ఒప్పుకోకపోతే పాపం మామీద మా పిల్లలమీద ఉండును గాక అన్నారు కాబట్టి పాపం వారికి తగిలింది అనేది ఒక యోచన! ఇక యేసయ్య రాకడ గుర్తులు చెబుతూ యేరూషలేము దేవాలయం లోను ఇంకా పట్టణము రాతిమీద రాయి లేకుండా నాశనం అయిపోతుంది అని దేవు వారికి తీర్పు తీర్చి నందుకు!

 

Luke(లూకా సువార్త) 21:6,20,21,22,23,24

6. ఆయన కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను.

20. యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.

21. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.

22. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు.

23. దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ప్రజలమీద కోపమును వచ్చును.

24. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.

 

ఇక్కడ వీరు పశ్చాత్తాప పడటానికి నిరాకరించారు సరికదా దేవుని మీదనే తిరగబడ్డారు! అందుకే శాపం!

 

ఇక రెండవ కారణం ఏమిటంటే: పత్రిక రాయబోయేసరికి యూదుల పరిస్థితి ఏమిటంటే రోమనుల ద్వారా బహు యాతన పడుతున్నారు అన్నమాట! అప్పటికే రోమాలో లేక రోమారాజ్యంలో యూదుడు అనేవాడు ఉండటానికి వీలులేదు అన్నాడు అప్పుడే అకుల ప్రిస్కిల్ల దంపతులు రోమా వదిలి కొరింథీ కి వచ్చేశారు! అపో.కార్యములు 18: 2

యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు.

ఆజ్ఞ రానురాను ఇశ్రాయేలు దేశంలో కూడా ప్రకటించారు! యూదుడు అన్నవాడు ఇశ్రాయేలు దేశంలో కూడా ఉండకూడదు అన్న యోచన చేసి అక్కడనుండి కూడా ఇశ్రాయేల్ దేశంలో కూడా ఆజ్ఞ పుడితే యూదులు భూమిమీద సమస్త దేశాలకు చెదరి పోయారు!  కాబట్టి దేవుని ఉగ్రత ఇదే! దేవుని మాట వినకపోతే ఎవరైనా అంతే!

 

కాబట్టి ఆయన మాటలు విందాము!

 లోబడదాము!

దైవాశీస్సులు!

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*30 భాగం*

1థెస్స 2:17—20

17. సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితిమి.

18. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.

19. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.

20. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది!

 

    ఇక 17, 18 వచనాలలో సంఘాన్ని చూడటానికి పౌలుగారి తాపత్రయం కనిపిస్తుంది.  మేము శరీరమును బట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసి యున్నాము గాని మా మనస్సు మీ దగ్గరే ఉంది అంటూ మీ ముఖమును తొందరగా చూడాలని ప్రయత్నం చేశాము కాని సాతాను మమ్మల్ని అడ్డగించింది అంటున్నారు! దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారి త్రయం థెస్సలోనికయలో కేవలం మూడు వారాలు లేక మూడునెలలు మాత్రమే ఉన్నారు! అందుకే మేము శరీరమును బట్టి మీ దగ్గర కొద్దికాలము మాత్రమే ఉన్నాము అంటున్నారు! దీనికోసం మనం అపో 17లో చూడగలం...

Acts(అపొస్తలుల కార్యములు) 17:3,5

3. నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు (లేక, మూడువారములు) తర్కించుచుండెను.

5. అయితే యూదులు మత్సరపడి, పని పాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

 

    అక్కడ అల్లర్లు జరిగాయి కాబట్టి పౌలుగారి త్రయాన్ని చంపాలని అనుకున్నారు కాబట్టి పౌలుగారు థెస్సలోనికయ విడిచి ఏథెన్స్ వెళ్ళిపోయారు అయితే తర్వాత పౌలుగారు చాలాసార్లు థెస్సలోనికయ వెళ్దాము అని ప్రయత్నం చేశారు కాని కొన్ని కారణాలు వలన వెళ్ళలేకపోయారు అంటారు.

 

మొదటి భాగాలలో చెప్పినట్లు మొదటి కారణం థెస్సలోనికయు సంఘం ఎన్నో శోధనలు శ్రమలు ఎదుర్కుంటుంది అని వర్తమానం వచ్చింది వెంటనే వెళ్దామని బయలుదేరారు.  దీనికోసం మనకు మూడో అధ్యాయం మొదట్లో కనిపిస్తుంది. అయితే వెళ్దామని అనుకున్నారు గాని ఆయనకు ఆరోగ్యం పాడయింది అందుకే తన బదులు తిమోతి గారిని పంపించారు! ఇదే సాతాను అడ్డగించింది అని రాయడానికి కారణం అంటారు!

 

ఇక రెండవ కారణం ఏమిటంటే ఉత్తరం కొరింథీ పట్టణం నుండి రాసినట్లు మొదటి భాగాలలో చూసుకున్నాము కదా అయితే కొన్ని నెలలు కొరింథీ పట్టణంలో సువార్త జరిగించాక అక్కడ అల్లర్లు జరుగుతాయి. గాని దేవుడు నీవు ఇక్కడే ఉండు నాకు ఇక్కడ అనేకమైన ప్రజలున్నారు అంటారు అపో 18 అధ్యాయం ప్రకారం! Acts(అపొస్తలుల కార్యములు) 18:9,10,11

9. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.

10. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా

11. అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.

 

దేవుడు ఉండమన్నారు కాబట్టి థెస్సలోనికయ సంఘాన్ని చూద్దామని పౌలుగారికి ఆశ ఉన్నాగాని తన బదులు తిమోతి గారిని పంపించి యోగక్షేమాలు తెలుసుకున్నారు! ఇది రెండవ కారణం!

 

ఇక మూడవ కారణం: పౌలుగారు థెస్సలోనికయ వెళ్దాము అనుకున్నారు గాని సీలగారు తిమోతి గారు ఆపివేశారు ఎందుకు ఆపివేశారు అంటే పౌలుగారిని చూసిన వెంటనే అక్కడ జనులు భూలోకమును తలక్రిందులు చేసేవారు మన మధ్యకు వచ్చారు అంటూ దొమ్మిగా ఆయనను మరియు త్రయాన్ని చంపుదామని అనుకున్నారు గాని వారు కనబడ నందున వారిని చేర్చుకున్న యాసోను ను హింసించారు! అయితే ఇప్పుడు థెస్సలోనికయుల సంఘానికి శోధనలు శ్రమలు హింసలు శిఖరాగ్రముగా ఉన్నాయి లేక పీక్స్ లో ఉన్నాయి సమయంలో! సమయంలో పౌలుగారు అక్కడ కనిపిస్తే అగ్నికి నూనె తోడయినట్లు వారి శ్రమలు ఇంకా పెరిగిపోతాయి కాబట్టి దయచేసి మీరు వెళ్ళకండి అంటూ ఆయనను ఆపివేశారు! అందుకే సాతాను మమ్మును అడ్డగించింది అంటున్నారు! గాని ఏదీ ఏమైనా చాలా ప్రయత్నాలు చేశారు గాని కుదరలేదు! దీనిని :15 వచనాలలో చూసుకోవచ్చు!...

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 3:1,2,5

1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,

2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

5. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.

 

Acts(అపొస్తలుల కార్యములు) 17:6

6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిభూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొని యున్నాడు.

 

  పౌలుగారికి ఇలా సంఘాలను దర్శించడమంటే చాలా ఇష్టం! అందుకు గాను ఆయన ఎన్ని శ్రమలైనా శోధనలయినా దేనికైనా సిద్దమే! విషయం మనకు అపోస్తలుల కార్యములలో అర్ధమవుతుంది! రోమా సంఘాన్ని కూడా చూద్దామని అనుకున్నారు గాని తాను చెరలోనికి వెళ్ళే వరకు చూడలేకపోయారు! వారిని చూద్దామనే ముందుగా సిద్దపరచడానికే ఆయన రోమా పత్రిక రాసి దైవజనురాలైన ఫెబే తో పంపించారు! రోమా 1:13 దీనిని బలపరుస్తుంది!

 Romans(రోమీయులకు) 1:12,13

12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.

13. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు

 

 కొలస్సీయులను చూద్దామని చాలా ప్రయత్నాలు చేశారు గాని వెళ్ళలేక పోయారు! ఇలా చాల సంఘాలను మరలా మరలా చూడాలని పౌలుగారు ఆశించారు! అయితే అస్తమానం దేవుని సేవకులకు సైతానుడు ఇలాంటి ఆటంకాలు కలిగిస్తాడు కారణం వీరు వెళ్తే సాతాను సామ్రాజ్యం ముక్కలై పోతుందిఅని వాడికి తెలుసు! అందుకే ఇలాంటి శ్రమలు శోధనలు పెడుతుంటాడు! వాడికోసం యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెబుతున్నారు... యోహాను 8:44

మీరు మీ తండ్రియగు అపవాది (అనగా,సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి జనకుడునై) యున్నాడు.

 

  దైవసేవకునికి తప్పకుండా ఇలాంటి ఆశ అనగా తన సంఘ బిడ్డలను కలుసుకోవాలి వారి బాగోగులు తెలుసుకోవాలి అనే ఆశ తప్పకుండా ఉండాలి! అప్పుడు వీరిమధ్య తండ్రి కుమారుల అనుబంధము ఏర్పడుతుంది! 

(ఇంకాఉంది?

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*31 భాగం*

1థెస్స 2:17—20

17. సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితిమి.

18. కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.

19. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.

20. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మూడో వచనం నుండి చివరివరకు పౌలుగారి నిస్వార్ధ సేవ కోసం వ్రాయబడింది!

 

             (గతభాగం తరువాయి)

 

       ఇక 19, 20 వచనాలలో చాలామంచి మాటలు చెబుతున్నారు! దీనిని బట్టి పౌలుగారు తన సంఘాన్ని విధంగా ప్రేమించారో ఎంతగా ప్రేమించారో అర్ధమవుతుంది! ఏలయనగా మా నిరీక్షణ యైనా ఆనందమైనా అతిశయ కిరీటమైనా ఏది? అది మన ప్రభువైన యేసు యొక్క రాకడలో ఆయన ఎదుట మీరే కదా అంటున్నారు! నిశ్చయంగా మా మహిమ ఆనందము మీరే అంటున్నారు!

 

 ఇక్కడ అధ్యాయంలో మరోసారి దేవుని రెండవరాకడ కోసం మాట్లాడుతున్నారు! దేవుడు రెండవరాకడలో రాబోతున్నారు ఆరోజు అతిశయ కిరీటం భక్తులకు కలుగబోతుంది! ఎందుకు కలుగబోతుంది అంటే తాము పడ్డ ప్రయాసలకు దేవుడు భళా నమ్మకమైన మంచి దాసులారా అని పిలవడమే కాకుండా వారికి అతిశయకిరీటం ఇవ్వబోతున్నారు.

 

కొరింథీయులను కూడా అంటున్నారు పౌలుగారు మా హృదయములమీద వ్రాయబడి ఉంది మనుష్యులందరూ తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా!

 

ఇలా అనడానికి కారణం బాగా అర్ధం చేసుకోవాలి అంటే మనము 1కొరింథీ :1115  ని బాగా అర్ధం చేసుకోవాలి!....

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

15. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

 

ఇక్కడ వెండి బంగారము వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు అనగా వివిధ రకాలైన బోధలు! బోధనా విధానాలు! ఎవరి బోధ ద్వారా విశ్వాసులు స్థిరంగా నిలబడతారో విశ్వాసంలో వారికి దేవుడు జీతం ఇస్తారు! అగ్నిచేత పరీక్షించబడుతుంది అంటే శ్రమలలో శోధనలలో కష్టాలలో సంఘము స్థిరంగా నిలబడి క్రీస్తుకు సాక్షులుగా నిలబడతారో కాపరికి దేవుడు బహుమానాలు ఇస్తారు! యజమాని- సేవకులు ఉపమానం ప్రకారం ఎవరైతే దేవునికోసం అనేక ఆత్మలు సంపాదించి పెడతాతో వారినే దేవుడు భళానమ్మకమైన మంచి దాసుడా అని పిలువబోతున్నారు! వారికి కొన్ని పట్టణాల మీద ఆధిక్యత అధికారం ఇవ్వబోతున్నారు!....

Luke(లూకా సువార్త) 19:12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26

12. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై

13. తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల (మినా యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.

14. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి.

15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.

16. మొదటి వాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

17. అతడు భళా, మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా

19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.

20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;

21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.

22. అందుకతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా

23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి

24. వీనియొద్దనుండి మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.

25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.

26. అందుకతడు కలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.

 

      రోజులలో కొంతమంది ధనాపేక్ష వలన పొట్టకూటి కోసం ప్రజలను మెప్పించే బోధలు చేస్తున్నారు దేవుని మెప్పించే బోధలు మానేసి! ఇలా చేసి నిజమైన సంఘాన్ని తయారుచేయకుండా పొల్లును పొట్టును తయారుచేస్తున్నారు! గమనించాలి దేవునికి పొట్టు పొల్లు అవసరం లేదు! వాటిని కూర్చి అగ్నిలో వెయ్యమని చెప్పారు దేవుడు!......

లూకా 3: 17

ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.

 

    నిజమైన గింజలు మాత్రమే దేవుడు కోసి కొట్టులో వేసుకుంటారు! పరమగీతం 4 చివరి వచనం ప్రకారం- ఉత్తరవాయువు ఏతెంచు! దక్షిణ వాయువు విసరు అంటూ నా ప్రియుడు తన కిష్టమైన ఫలాలను భుజించును గాక అంటున్నారు! ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు తీసుకుని పోతారు! అప్పుడు ఎవరు చేసిన సేవా ఫలితములను బట్టి వారికి జీతం ఇవ్వబోతున్నారు! అందుకే నేను సిద్దపరచిన జీతం నా దగ్గర ఉంది అంటున్నారు దేవుడు.....

ప్రకటన గ్రంథం 22: 12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

 ఆరోజు దేవుడు నీవు చేసిన సేవా పరిచర్య కు ప్రతిఫలం ఇవ్వబోతున్నారు! అప్పుడు నీ సేవ నిలిచిందా నీకు అతిశయ కిరీటం వాడబారని మహిమ కిరీటం ఇవ్వబడుతుంది! పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు ఉందా అనగా 1000 మందికి భాప్తిస్మం ఇచ్చాను, మా సంఘానికి లక్షమంది వస్తారు పదివేల మంది వస్తారు అని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా రోజు నిన్ను ప్రక్కన నిలబెట్టి- మరోప్రక్కన నీ సంఘాన్ని నిలబెడితే త్రాసులో సంఘ విశ్వాసులను తూయగా తక్కువగా కనిపిస్తే లక్షమంది వెయ్యిమంది అని డప్పాలు కొట్టుకున్న నీకు అక్కడ కేవలం ఒక యాబై మంది మాత్రమే తీర్పులో నిఖార్సైన గింజలుగా మిగిలితే – దేవుడు తప్పకుండా అంటారు- ఇదేనా నీ సేవ? నీకు ఇన్ని ఆత్మలను అప్పగిస్తే ఇలాగేనా మేపేది గొర్రెలను? సోమరివైన చెడ్డదాసుడా అని అంతమంది నిన్ను అంటే నీ ముఖమును ఎక్కడ పెట్టుకుంటావు??!!

 

అయితే ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు మంచి పోరాటము పోరాడితిని నా పరుగును తుదముట్టించితిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక నా కొరకు నీతి కిరీటం ఇవ్వబడింది అని తిమోతి పత్రికలో కుండబ్రద్దలు గొట్టి చెబుతున్నారు ధైర్యంగా పౌలుగారు! కొరింథీ పత్రికలో మా పత్రికలు మీరే అంటూ థెస్సలోనికయుల పత్రికలో రెండుసార్లు మా మహిమ మా అతిశయం మా ఆనందం మీరే అంటున్నారు! మీ వలన మాకు గొప్ప బహుమానాలు కలుగుతాయి అంటున్నారు! ఎందుకంటే సంఘము ఎన్ని శ్రమలు కలిగినా శోధనలు కలిగినా దేవునికోసం ధైర్యంగా నిలబడ్డారు! ఎత్తబడే సంఘంలో వీరి పేరులు ఖరారయ్యాయి! రెండు పత్రికలు బట్టి వీరి అత్మీయజీవితం ఏమని అర్ధమవుతుంది అంటే వారు అన్ని విధాల రడీగా ఉన్నారు! దేవుడు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఎత్తబడతామా అని ఎదురుచూస్తున్నారు! అందుకే అంత ధైర్యముగా తన సంఘము పొల్లు కాదు నిఖార్సైన గింజలు అని తెలిసి అంటున్నారు మా మహిమ అతిశయం కిరీటం మీరే!

 

      ఒకసారి 19 వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ మనకు అతిశయ కిరీటం కనిపిస్తుంది. కిరీటం అందరూ పొందుకోలేరు. కేవలం ఆత్మల సంపాధన లక్ష్యంగా సువార్త పరిచర్య చేసి అనేకులను క్రీస్తు కోసం గెలిచిన వారికి, ఇంకా అనేక సంఘాలు కట్టిన వారికి మాత్రమే కిరీటం దొరుకుతుంది. అనగా పౌలుగారు సీలగారు తిమోతి గారు పేతురు గారిలా నిస్వార్ధ సేవ చేస్తూ ఆత్మల సంపాదన లక్ష్యంగా పెట్టుకుని ధన సంపాదనను తుచ్చంగా ఎంచిన మహా అతిరధ సేవకులకు మాత్రమే ఇది దొరుకుతుంది. ప్రియ సేవకుడా/ కాపరి/ అపొస్తలుడా! నీకుఅతిశయ కిరీటం కావాలా? నీవు కోవలో ఉన్నావా? కిరీటం నీకు కావాలా? అయితే పౌలుగారిలా సేవ చెయ్యాలి!!

 

       ప్రియ దైవజనుడా! నీ సేవా పరిచర్య ఇలా ఉందా? నీ సంఘంలో అనేకమంది రోజు రెండవ రాకడ వస్తే ఎత్తబడతారు అనేటి నిశ్చయం నీకుందా??? వారి సంగతి వదిలేయ్! అసలు నీవు రోజు ఆయన రాకడ అయితే ఎత్తబడతావు అనే నిశ్చయత నీకుందా? లేకపోతే కేవలం ఒక్కరో ఇద్దరో లేక పదిమందో యాబై మందో ఎత్తబడితే నీ సంఘంలో దేవునిచేత సోమరియైన చెడ్డ దాసుడా అని గాని పిలువబడతావు లేదా అందరిముందు తలవంచుకుని నీ మట్టుకు నీవు రక్షించబడతావు 1కొరింథీ :15 ప్రకారం!...

ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

 

   కాబట్టి దైవసేవకుడా! ఇప్పుడే నిన్ను నీవు పరిశీలించుకో! నీ విశ్వాసులను మెప్పించే బోధలు చేసి వారిని పొల్లు గింజలులా తయారు చేసి నీ పొట్ట పోసుకుని రోజు దేవునిచేత చీవాట్లు తెచ్చుకుంటావా లేక రోజు నీ సంఘము నిన్ను ఎన్ని మాటలనినా, పాష్టరేట్ కమిటీ నిన్ను సంఘం నుండి తరిమేసినా, ఖండించి గద్దించి బుద్ధిచెప్పి వారిని పరమునకు అర్హులుగా చేసి భళా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావో తేల్చుకో!

 

సంఘమా! నీకు అనుకూలమైన బోధలు చెప్పించుకుని నరకానికి పోతావా లేక ఉన్నది ఉన్నట్లు నీ బోధకునితో వర్తమానాలు చెప్పించుకుని పరముకు వెళ్తావా సరిచూసుకో!

థెస్సలోనికయుల సంఘంలా ఎత్తబడే గుంపులో ఉంటావా లేక లవొదొకయ సంఘంలా ఎఫెసి సంఘంలా విడువబడతావా?

నేడే పరీక్షించుకో!

రాకడకు సిద్దపడదాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*32 భాగం*

1థెస్స 3:1—5

1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,

2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

3. *మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును*;

4. *అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు*.

5. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ఇంతవరకు మనం రెండు అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక మూడో అధ్యాయంలో గల సంగతులు మనము ఇంతకుమునుపే ధ్యానం చేసుకున్నాం గనుక క్లుప్తంగా చూసుకుందాం!  అధ్యాయం లో గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే థెస్సలోనికయుల సంఘానికి శ్రమలు విస్తరించాయని పౌలుగారికి తెలిసింది ఆయన ఏథెన్స్ లో ఉన్నప్పుడు! అయితే తన వెళ్దామని అనుకున్నా కొన్ని కారణాల వలన అయన వారి యొద్దకు వెళ్ళలేక పోతారు అప్పుడు తిమోతి గారిని పంపిస్తారు! పౌలుగారు వారు విశ్వాసములో స్థిరంగా నిలబడ్డారని వర్తమానం తీసుకుని వస్తారు! విషయాలు ఇక్కడ ఉటంకించి మీరు ఇంకా అలాగే స్థిరంగా నిలబడాలని వారిని ప్రోత్సహిస్తూ వారిని విశ్వాసం లో బలపరచడానికి ఉత్తరం రాసి అదే తిమోతి గారితో పంపిస్తారు!

 

     అధ్యాయం మొదట్లో-- కాబట్టి ఇక సహించజాలక అంటూ మొదలుపెట్టారు పౌలుగారు! అనగా ఇది రెండో అధ్యాయానికి కొనసాగింపు అన్నమాట! రెండో అధ్యాయంలో పౌలుగారు వారి విశ్వాసం గూర్చి మాట్లాడుతూ మీరు శ్రమలలో ధైర్యము చూపి విశ్వాసమందు స్థిరంగా ఉన్నారు అనే విషయం , ఇంకా ప్రాముఖ్యంగా వారి బోధలు కపటమైనవి ధనాపేక్ష తో కూడినవి కాకుండా కేవలం సువార్తను మాత్రమే ప్రకటించాము అని చెబుతూ మీకు శ్రమలు కలిగాయని విన్నాము కాబట్టి వెంటనే ఇక సహించజాలక మేము ఏథెన్స్ లో ఉన్నప్పుడు తిమోతిని మీ దగ్గరకు పంపించాను అంటున్నారు!    

 

         ఒకసారి మనం  అపోస్తలుల కార్యములు 17 అధ్యాయం 10 నుండి చివరి వరకు చూసుకుంటే థెస్సలోనికయలో శ్రమలు ఆటంకాలు కలిగాయని పౌలుగారు శిష్యుల ద్వారా బెరయ పంపబడినట్లు చూడగలం! అక్కడ కూడా యూదులు అల్లర్లు లేపినందుకు అక్కడనుండి ఆయనను సముద్రము వరకు సువార్త చెప్పుకుంటూ వెళ్ళమని శిష్యులు ఆయనకు చెప్పారు! సముద్రము అనగా మధ్యధరా సముద్రము అని గ్రహించాలి! కావున పౌలుగారు అక్కడనుండి ఏథెన్స్ కి ఒంటరిగా వెళ్తారు! బెరయలో సీలగారిని తిమోతి గారిని వదిలేస్తారు వారిని ఇంకా బలపరచడానికి! అయితే ఇక్కడ అనగా మూడో అధ్యాయంలో ఏథెన్స్ లో ఒంటిగా ఉండటానికి కూడా సిద్దపడ్డాము గాని తిమోతిని మీ యొద్దకు పంపించాను అంటున్నారు! మరి దీని అర్ధం ఏమిటంటే పౌలుగారు బెరయ పట్టణంలో విశ్వాసులను స్థిరపరచి తొందరగా ఏథెన్స్ రమ్మని చెప్పారు! అయితే వారు ఆలస్యం చేశారు! అప్పుడు పట్టణంలో అనగా ఏథెన్స్ పట్టణంలో పౌలుగారు ఒంటరిగానే సువార్త ప్రకటించారు! అదికూడా The great Areopagus కౌన్సిల్ లో! దీనినే Mars' Hill Council అనికూడా అంటారు. ఇది చాలా చారిత్రాతకమైనది మరియు భయంకరమైనది! అక్కడ వారు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే వారు ఒక గ్లాసులో ద్రాక్షారసం తీసుకుని వస్తారు అది తప్పకుండా తాగాలి అంతే! అయితే ద్రాక్షారసం విషంతో కలిసిఉంటుంది! వెంటనే అక్కడే చనిపోతాడు వ్యక్తి! ఇలాంటి సభలో కూడా ఒంటరిగా సువార్త ప్రకటిస్తారు పౌలుగారు! అవన్నీ జరిగాక అప్పుడు తిమోతిగారు   ఏథెన్స్ వస్తారు! సీల గారు ఇంకా బెరయలోనే ఉన్నారు! పాటికి థెస్సలోనికయుల సంఘము కోసం ఒక వర్తమానం వచ్చింది! ఏమిటంటే థెస్సలోనికయుల సంఘములో భయంకరమైన శ్రమలు విస్తరించాయి అనేకులు చంపబడుతున్నారు అని! కాబట్టి పౌలుగారికి  తిమోతి గారికి వారికోసం ఎంతో గాబరా వచ్చింది! కారణం అక్కడ వారు ఎక్కువకాలం సువార్త ప్రకటించలేదు! కేవలం మూడువారాలు మాత్రమే ప్రకటించారు! మూడు వారాలలోనే అత్యంత బలమైన విశ్వాసం గలవారుగా వారు నిలిచారు! అయితే ఇప్పుడు శ్రమలు విస్తరించాయి కాబట్టి వారు అనగా థెస్సలోనికయుల వారు విశ్వాసంలో నిలబడ్డారా లేదా అనే అనుమానం, గాబరా వచ్చి పౌలుగారు అక్కడికి వెళ్దామని అనుకున్నా అనివార్య కారణాల వలన ఆయన వెళ్ళలేక వెంటనే ఏథెన్స్ నుండే పౌలుగారు తిమోతిగారిని థెస్సలోనికయుల పట్టణం పంపిస్తారు! దానినే ఇక్కడ చెబుతున్నారు పౌలుగారు! నేను వ్యతిరేకుల మధ్య ఒంటరిగానైనా ఉంటాను గాని మీకు ఆదరణ కలగాలని తిమోతిని పంపించాను అంటున్నారు!

 

   ఇక్కడ విశ్వాసుల పట్ల పౌలుగారికి ఉన్న ప్రేమ ఆప్యాయత మనకు కనిపిస్తాయి! రెండో వచనంలో అంటున్నారు శ్రమలవలన ఎవడును కదిలింప బడకుండా మిమ్మును విశ్వాసంలో స్థిరపరచడానికి మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించడానికి తిమోతిని మీ యొద్దకు పంపించాను అంటున్నారు! ఇక్కడ పౌలుగారి తాపత్రయం కనిపిస్తుంది! శ్రమల వలన మీరు కదిలించబడకూడదు అని తలంచి మిమ్మును విశ్వాసంలో బలపరచడానికి పంపించాను తిమోతిని అంటున్నారు! అయితే 5 వచనంలో అంటున్నారు ఇందుచేత ఇక సహించజాలక శోధకుడు ఒకవేళ మిమ్మును శోదించాడేమోయని, మా ప్రయాసం వ్యర్థమై పోయిందేమో అని మీ విశ్వాసాన్ని తెలుసుకోవాలని అతని పంపితిని అంటున్నారు! చూశారా ఇంతకష్టపడి అక్కడ సువార్త ప్రకటిస్తే ఇప్పుడు శ్రమల వలన వారు విశ్వాసంలో జారిపోయారేమో అని ఆయన గాబరా! అందుకే తిమోతి గారిని పంపించాను అంటున్నారు!

 

పౌలుగారి బోధలు, పత్రికలు ఆయన తాపత్రయము ఇలాగే ఉంటుంది! వారు క్రీస్తులో బలపడాలని క్రీస్తుకోసం క్రీస్తులా జీవించాలని ఆయనను చూస్తూ ప్రోత్సాహం పొందుకోవాలని ఆయన ఆకాంక్ష!

1థెస్సలొనికయులకు 2: 12

తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.

1థెస్సలొనికయులకు 2: 17

సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితిమి.

 

అపో.కార్యములు 14: 22

శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

 

2కొరింథీ 12:19

మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నియు చెప్పుచున్నాము.

 

ఎఫెసీయులకు 3: 18

మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

 

కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

కొలస్సీయులకు 1: 12

తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము.

 

 కొలస్సీయులకు 2: 6

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

 

నిజంగా నిజమైన సేవకుడు ఇలా ఎప్పుడు తన సంఘము కోసం ఆలోచిస్తూ వారి ఆత్మీయ సంబంధమైన బాగోగులు చూడాలి! ఇది ప్రతీ దైవజనుడు పౌలుగారి దగ్గర నేర్చుకోవాలి!

 

   నేటి రోజులలో ఇది కరువైపోయింది! వారి కానుకలను మాత్రం ఆశిస్తున్నారు గాని వారు విశ్వాసంలో స్తిరంగా ఉన్నారా లేదా? ఆత్మీయ జీవితం కాపాడుకుంటున్నారా లేదా అనేది చూడటం లేదు! వారు ఎలా పొతే నాకెందుకు? నాకు కానుకలు, జీతం వస్తుందా లేదా? ఇదే చాలామంది దైవజనుల ఆలోచన! ఇది కాపరి మనస్సు అసలు కాదు! దేవుని మనస్సు అసలే కాదు!

కాబట్టి ప్రియమైన దైవసేవకుడా! పౌలుగారికున్న కాపరి మనస్సు, యేసుక్రీస్తు ప్రభులవారి కున్న తండ్రి మనస్సు కలిగి ఆయనసేవలో సాగిపోమని క్రీస్తు పేరిట మనవి చేస్తున్నాను!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*౩౩వ భాగం*

1థెస్స 3:1—5

1. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి,

2. యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

3. *మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును*;

4. *అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు*.

5. ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం మూడో అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

     ఇక మూడు నాలుగు వచనాలలో ప్రాముఖ్యమైన మాటలు రాస్తున్నారు పౌలుగారు! మనము శ్రమను అనుభవించవలసి యున్నదని ముందుగా చెప్పితిమి కదా! అలాగే జరిగినది! ఇది మీకు తెలియును అంటున్నారు! దీనికోసం గతభాగాలలో వివరించడం జరిగింది కాబట్టి క్లుప్తంగా చూసుకుని ముందుకు పోదాము! అయితే నాలుగో వచనంలో అట్టి శ్రమలను అనుభవించడానికి మనం నియమించ బడ్డామని మీకు తెలుసు అంటున్నారు! చూడండి ఎంత విచిత్రముగా ఉన్నదో!!! అవును విచిత్రముగా ఉంది గాని అది నిజము! కారణం చెప్పినది పరిశుద్ధాత్ముడు! ఆయన అబద్దమాడడు! అబద్దమాడుటకు ఆయన నరుడు కాడు! 

 

   ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారు మసిపూసి మారేడు కాయ చేసి వారికి సువార్త ప్రకటించడం లేదు! ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి వారిని క్రైస్తవులుగా చేయలేదు పౌలుగారు! మనము శ్రమలు అనుభవించవలసి యున్నది అని మీకు ముందుగానే చెప్పాము కదా! అలాగే జరుగుతుంది అంటున్నారు! అనగా పౌలుగారి త్రయం వారికి ముందుగానే చెప్పారుయేసయ్యను నమ్ముకోవడం, ఆయనను అనుసరించడం ఆషామాషీ కాదు! ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళాలి అని ముందుగానే చెప్పారు! నేడు చాలామంది యేసుక్రీస్తుప్రభులవారిని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి! అనీ సుఖాలే! మీకు ఇల్లు కార్లు బంగళాలు అన్నీ వచ్చేస్తాయి! ఒకనాడు నాకు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు అనీ ఇచ్చారు దేవుడు అనిచెప్పి  వారిని మోసం చేస్తున్నారు! ఇది తప్పు! యేసయ్య ను నమ్ముకుంటే కష్టాలు ఇంకా పెరిగిపోతాయి! అవును ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి తనను నమ్మినవారిని ఆశీర్వదించే దేవుడు కాబట్టి భౌగోళిక ఆశీర్వాదాలు ఇస్తారు గాని దానికన్నా ముందుగా లోకంలో శ్రమలు పడక తప్పదు! యేసుక్రీస్తు ప్రభులవారే శ్రమలను అనుభవించినప్పుడు మనము కూడా శ్రమలను అనుభవించవలసినదే!

 

   యేసుక్రీస్తుప్రభులవారు తన శిష్యులను మోసం చెయ్యలేదు! యోహాను 16:౩౩లో ముందుగానే చెప్పారు నా శాంతినే మీకు ఇస్తున్నాను లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను అన్నారు! అలాగే ఆయనకు శ్రమలు కలిగాయి శిష్యులకు కూడా శ్రమలు విస్తరించాయి!

 

             ఇక శిష్యులు కూడా ఆదిమ సంఘాన్ని మోసం చెయ్యలేదు! అపో 14:22 లో చెబుతున్నారు శిష్యులను స్థిరపరచి విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండమని చెపి అనేకమైన శ్రమలు భాధలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ముందుగానే చెప్పారు!

విషయం పౌలుగారు కూడా థెస్సలోనికయులకు ముందుగానే చెప్పాను అని గుర్తుచేస్తున్నారు! మరీ ఘోరమైన మాట ఏమిటంటే అట్టి శ్రమలను అనుభవించడానికే మనము నియమిచబడ్డాము! అవును క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు  శ్రమలు కలుగును అని వాక్యం ముందుగానే చెప్పింది! 2తిమోతికి 3: 12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 

 అయితే ఇక్కడ  ఒక మెలిక ఉంది! ఎవరైతే సద్భక్తితో బ్రతకాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే శ్రమలు! నలుగురితో ........ కులంతో ........ అన్న వారికి ఏమీ కష్టాలు రావు! ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది, మా సంఘంలో హెలీనమ్మ అనే విశ్వాసి ఉంది! ఆమె క్రొత్తగా రక్షించబడిన విశ్వాసులకు చెబుతూ ఉంటుంది దేవుణ్ణి ప్రేమించి ప్రేమించనట్లు ఉండాలి! దేవునితో అంటీ అంటనట్లు ఉండాలి! అప్పుడు కష్టాలు కలగవు! అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మనకు ఎన్నెన్నో కష్టాలు వచ్చేస్తాయి! నన్ను చూడండి నాకు ఇంతవరకు ఒక శోధన కష్టాలు రాలేదు! నేను ఎప్పుడో రెండు నెలలకు చర్చికి వస్తాను ఎప్పుడో ఒకప్పుడు ప్రార్ధన చేస్తాను! నాకు అన్నీ సుఖాలే అంటుంది! ఇది పనికిమాలిన భక్తి! నరకానికి పోయే గుంపు! ఎవరైతే మంచిగా భక్తిలో దేవునిలో సాగుతారో వారికే శ్రమలు కలుగుతాయి! ఇంకా చెప్పాలంటే పరలోకం పోయే గుంపులో ఉన్నవారికి ఎన్నెన్నో శోధనలు కలుగుతాయి! ఎవరికైతే శ్రమలు శోధనలు కలగడం లేదో వారికీ నరకం బాచ్ అన్నమాట!

ఇది చదువుతున్న ప్రియ స్నేహితుడా! నీకు శ్రమలు శోధనలు కలుగుతున్నాయా చింతపడకు! నీవు పరలోకం పోయే గుంపులో ఉన్నావు కాబట్టి నీకు ఇవి కలుగుతాయి! ఇవి కొన్ని రోజులు మాత్రమే అని మరచిపోకు!

 

పేతురు గారు కూడా రాస్తున్నారు 1 Peter(మొదటి పేతురు) 4:1,2,12,13,14

 

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

 

చూశారా యేసుక్రీస్తుప్రభులవారు శ్రమలు అనుభవించారు కాబట్టి మనము కూడా ఆయనలాగే శ్రమలు అనుభవిద్దాము అంటున్నారు! ఇంకా మీకేదో విపరీతం జరుగుతుంది అనుకోవద్దు అంటున్నారు! ఇది కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే అని తెలుసుకుకోండి అంటున్నారు! థెస్సలోనికయులకు ముందుగానే చెప్పారు పౌలుగారు! 2:14 లో అంటున్నారు మీకు ముందుగా ఉన్న సంఘాలలో ముఖ్యంగా యూదయలో ఉన్న సంఘాలకు అలాగే జరిగింది! మీరు కూడా సంఘాలను పోలి శ్రమల బాటలో నడుస్తున్నారు అది మంచిదే అంటున్నారు!

 

   కాబట్టి ప్రియ విశ్వాసి/ దైవజనుడా! శ్రమలలో సంతోషించు! శ్రమల ద్వారానే మనము సంపూర్ణులుగా మారతాము! క్రీస్తు రూపంలో కి మారాలి అంటే కేవలం శ్రమల మార్గమే ఉంది! మరో షార్ట్ కట్ లేనేలేదు!  విశ్వాసులారా! భయపడకండి! శ్రమలను సహిస్తూ ఆయనకు తగినట్లుగా ఆయన బాటలో సాగిపోదాము! శ్రమలు అనుభవించడానికే మనం పిలువబడ్డాము నియమించబడ్డాము కాబట్టి మార్గములోనే సాగిపోయి మన గమ్యస్తానమైన పరలోకం చేరుదాం!

 

దైవాశీస్సులు!

 

 

 

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*34 భాగం*

1థెస్స 3:711

7. అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి.

8. ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.

9. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,

10. మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?

11. మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం మూడో అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

 

          ఇక 6 వచనంలో తిమోతి మీ దగ్గరనుండి వచ్చి మేము మిమ్మును ఏవిధంగా చూడాలని ఆశకలిగి ఉన్నామో ఆవిధంగానే మీరుకూడా మమ్మును చూడాలని అపేక్షిస్తున్నారు అని విన్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాము మీ ప్రేమను మీ విశ్వాసమునును చూచి మేము ఎంతో ఆనందపడుతున్నాము అంటున్నారు!గతభాగంలో చెప్పడం జరిగింది పౌలుగారికి తన సంఘ బిడ్డలను చూడడానికి ఎప్పుడు ఆత్రుతపడుతూ ఉండేవారు! తన పత్రికలలో శీఘ్రముగా మిమ్మును చూడాలని ఆశిస్తున్నాను అంటూ రాశారు!  ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే: పౌలుగారు అంతటి ప్రేమ ఆప్యాయతలు తన సంఘస్తులపై చూపించారు, వారితో మమేకమై పోయారు కాబట్టి సంఘస్తులు కూడా తమ కాపరిని చూడాలని ఎంతో ఉబలాట పడుతున్నారు! తనకు- సంఘస్తులకు మధ్య ఒక తండ్రి-కుమారుల/కుమార్తె సంభందాన్ని, ఒక సోదరభావాన్ని కల్పించారు కాబట్టి ఆయనను ఎంతో గొప్ప వ్యక్తిగా చూడకుండా పౌలుగారు తమ కుటుంబ సభ్యునిలా భావించి తొందరగా ఆయనను చూడాలని ఆశ పడుతున్నారు! ఇటువంటి బంధము తప్పకుండా ఒక సేవకుడు/ కాపరి నెలకొల్పగలిగితే సంఘము ఎంతగానో దినదినాభివృద్ధి చెందుతుంది! నేడు సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి ఇదొక కారణం! తామేదో పరలోకం నుండి ఊడిపడ్డట్టు ప్రవర్తిస్తూ సంఘాన్ని దూరంగా పెడుతూ తనకు ప్రత్యేక ఆహ్వానం, ప్రత్యేక బాగోగులు చూడాలని ఆశిస్తున్నారు. తన కోరికలు డిమాండ్ చేస్తున్నారు! అందుకే సంఘాలు అభివృద్ధి చెందటం లేదు! రోజులలో సంఘాలు అభివృద్ధి చెందటానికి ఇదే కారణం! కేవలం పౌలుగారే కాదు, పేతురు గారు యోహాను గారు ఇంకా ఆది అపోస్తలులు కూడా అలాగే ప్రవర్తించారు! వారు ఎక్కడ నేర్చుకున్నారు అంటే యేసుక్రీస్తుప్రభులవారి దగ్గర నేర్చుకున్నారు! ఆయన దేవుడై యుండి కూడా తన గొప్పతనాన్ని తన ఔనత్యాన్ని ఎక్కడా చూపించలేదు! ఒక సామాన్యునిగా జీవించి వారితో కలసిపోయారు! అదే శిష్యులు నేర్చుకున్నారు! నేటి రోజులలో కొందరు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించి దేవునికంటే ఎక్కువగా తమనుతాము చూపించుకుంటున్నారు! ఇది దేవుడు నేర్పించిన పద్దతి కానేకాదు!

 

   ఇక 7 వచనం చూసుకుంటే అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఎంతో ఆదరణ పొందాము అంటున్నారు! కొన్ని ప్రతులలో ఇలా తర్జుమా చేయబడిందిఅందువల్ల మాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు మధ్య మేమున్నా గాని మీ విశ్వాసమును చూచి మేము ఎంతగానో ఆదరించబడ్డాము, సంతోషించాము! ఇక్కడ దీని అర్ధం ఏమిటంటే – ఎన్నో వ్యయప్రయాల తర్వాత థెస్సలోనికయ సంఘం కట్టబడింది పట్టణంలో! అక్కడ కొంతకాలం ఉందామనుకున్నా సాతాను గాడి శోధన వలన బెరయ వెళ్లారు అక్కడకూడా ఇలాంటి భాధలు పడ్డారు! అక్కడనుండి ఏథెన్స్ వెళ్ళగా అక్కడ కూడా ఇలాంటి శ్రమలు పడుతున్నారు! సమయంలో కొరింథీ వెళ్ళిపోయారు! అక్కడనుండి ఉత్తరం రాస్తున్నారు. మేము ఎన్నో శ్రమలు శోధనల గుండా ఉంటూ సువార్త ప్రకటిస్తుండగా మీ నుండి వచ్చిన సమాచారం మమ్మల్ని ఎంతో ఆదరించింది. మా శ్రమలను శోధనలను కష్టాలను మర్చిపోజేసింది మీ విశ్వాసము అంటున్నారు! విషయాన్ని ఎనిమిదో వచనంలో చెబుతున్నారుఏలయనగా మీరు ప్రభువునందు నిలిచితిరా మేము బ్రతికినట్టే అంటున్నారు! అంటే ఇప్పుడు చనిపోతున్నట్లా? కాదు- ఇక్కడ ఆయన మాటలు చూస్తుంటే తన బ్రతుకు వారి బ్రతుకుకు ముడిపడి నట్టుగా చెబుతున్నారు! వారు క్రీస్తుకోసం నమ్మకంగా జీవిస్తే తనకు ప్రాణం వచ్చినట్లుగా పౌలుగారికి అనిపించింది. ఇది ఆయన రాతలలో కనిపిస్తుంది మనకు 1కొరింథీ 12:2427

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

సరే, వారు అనగా విశ్వాసులు ఎన్ని శోధనలు కలిగినా తట్టుకుని ప్రభువునందు విశ్వాసమందు స్థిరముగా నిలిస్తే తాము చేసిన ప్రయాసము వ్యర్ధము కాలేదు కాబట్టి వారికి దేవుని నుండి నీతి కిరీటం ఇంకా బోలెడు కిరీటాలు కలుగుతాయి!

 

 అంతేకాకుండా దేవుడు తమను ఎన్నుకుని తన పరిచర్యలో భాగస్వామిని చేసుకున్నందుకు వారు కష్టపడి సేవ చేసినందుకు ప్రతిఫలం కలిగితే వారికి ఎంతో ఆనందం! కారణం ఒక దినాన దేవుడు వారిని భళా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అందరిముందు అనగా కోటానుకోట్ల దూత గణముల ముందు తనను పొగిడితే సంతోష పడాలని వారి ఆశ! అందుకే ఇక్కడ మీరు విశ్వాసమందు నిలిచారా మేము బ్రతికినట్లే అంటున్నారు!

 

    అందుకే 7 వచనంలో మీ విశ్వాసమును చూసినప్పుడు మా శ్రమ అంతటిలోను మీ విషయంలో ఎంతో ఆదరణ పొందాము అంటున్నారు! కారణం వారి విశ్వాసం ఎన్నో పరీక్షలకు నిలిచింది! అది నిజమైన నిరీక్షణ నిజమైన స్థిరమైన విశ్వాసము అని రూడిచేయబడింది కాబట్టి మాకు ఎంతో ఆదరణ ఓదార్పు కలిగింది అంటున్నారు.

 

పేతురు గారు కూడా వీటికోసం ఆనందిస్తూ రాశారు1:67

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

1పేతురు 5:9—10

9. లోకమందున్న మీ సహోదరులయందు విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి,విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

పౌలుగారు తన సంఘము విశ్వసమందు స్థిరంగా ఉండాలని చాలాసార్లు చాలా సంఘాలకు చెప్పారు

 

1కొరింథీ 15:58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

1కోరింథీయులకు 16: 13

మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

 

గలతియులకు 5: 1

స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

కొలస్సీయులకు 2: 5

నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతో కూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను (మూలభాషలో-యుద్ధసన్నద్దులై నిలుచుటను) క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.

 

ఇంకా యాకోబు గారు కూడా అంటున్నారు

యాకోబు 5: 8

ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.

కాబట్టి మన హృదయాలు స్థిరపరచుకుందాము!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*35 భాగం*

1థెస్స 3:7—11

7. అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి.

8. ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే.

9. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా,

10. మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము?

11. మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం మూడో అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

 

               (గతభాగం తరువాయి)

 

   ఇక తొమ్మిదో వచనంలో అంటున్నారు మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేటట్లు అనుగ్రహించమని దేవునికి అత్యధికంగా వేడుకుంటున్నాను అంటున్నారు! ఇక్కడ పౌలుగారి ఆకాంక్ష బయటకు వస్తుంది! ఇక్కడ నిజంగా వారి విశ్వాసంలో లోపం ఉందా అంటే లేనేలేదు! కానీ ఒకవేళ ఉంటే లోపాన్ని సరిదిద్దాలని తలంచారు త్రయము!  అయితే ఇక్కడ మరో అర్ధం కూడా మనకు కనిపిస్తుంది! వారు శ్రమలలో స్థిరంగా నిలిచారు కాబట్టి వారి విశ్వాసం పరిపక్వమైపోయింది సెబాస్ అని చెప్పి వారిని సంతృప్తి పరచి- కల్లబొల్లి మాటలు చెప్పకుండా ఇంతవరకు చాలా బాగా పరిపూర్ణంగా చేశారు . అయితే ఇంకా విశ్వాసంలో ఎదగండి అంటూ ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ! ఈమాటలు మనకు బాగా అర్ధమవ్వాలంటే 2కొరింథీ 10:15 చదువుకోవాలి! ..

మేము మేరకు మించి యితరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు,

 

2థెస్స 1:

ఇప్పుడు ఎందుకు వారిని చూడాలని పౌలుగారు ఆశిస్తున్నారు అంటే ఇప్పటికే ఎంతో విశ్వాసమందు స్థిరులుగా ఉన్నా మరింత బలమైన అనుభవాలు వారు పొందుకోవాలని ఇంకా వాక్యంలో ఎదగాలని ఆయన ఆశిస్తున్నారు- అందుకే వినుట వలన విశ్వాసం కలుగును వినడం దేవుని వాక్కు లేదా వాక్యం అయితే ఇంకా విశ్వాసం కలుగుతుంది అంటున్నారు రోమా 10:17 లో..

కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

 

ఎఫెసి 4:12—15

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,

15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

 

      కాబట్టి ఇలాంటి ఉపదేశాలు ఇంకా చేసి వారిని ఆధ్యాత్మికంగా మరింత స్తిరులు చెయ్యాలని పౌలుగారి తాపత్రయం!

 

     ఇక 10 వచనంలో మన దేవుని ఎదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా గుంటాము అంటున్నారు! చూడండి వారు అనగా థెస్సలోనికయులకు విశ్వాసంలో స్థిరంగా నిలిచినందుకు ఎంతగా సంబరపడుతున్నారో పౌలుగారు!ఎంతో ఆనందపడుతున్నాము అంటున్నారు! మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నారు! అందుకే రెండో అధ్యాయంలో మా ఆనందం కిరీటం అన్నీ మీరే అన్నారు! 2:19—20

19. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.

20. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.

 

వారు నిజమైన విశ్వాసులుగా క్రీస్తులో బలవంతులుగా తమను తాము కనపరచుకున్నారు కాబట్టి పౌలుగారికి ఆనందం కలిగింది. తన పిల్లలు యోగ్యులుగా మారితే ప్రయోజకులైతే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది! ముఖ్యంగా తండ్రి ఎంతో సంతోసిస్తాడు! కాబట్టి పౌలుగారు కూడా వారు యోగ్యులుగా యోగ్యమైన ప్రవర్తనతో వర్దిల్లుతున్నారు కాబట్టి మరీ ఆనందం కలిగింది! ఇది నిజంగా దేవుని సహవాసంలో కలిగే దొరికే ఆధ్యాత్మిక ఆనందం! యోహాను గారు కూడా ఇలాగే సంతోషించారు- నాపిల్లలు సత్యమును అనుసరించి నడుస్తున్నారు అన్నదానికంటే నాకు గొప్ప ఆనందం లేదు అంటున్నారు....

3యోహాను 1: 4

నా పిల్లలు సత్యమును అనుసరించి (సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

 

     ప్రియ సంఘమా! నీకోసం నీ కాపరి సేవకుడు ఇలాంటి ఆనందం కలిగియున్నారా? ఒకసారి పరిశీలించుకో! నీ దైవసేవకుని నీ ఆత్మీయ ఎదుగుదలను చూచి సంతోషించే స్థితిలో ఉన్నావా లేక పోయి బోరున ఏడిపించే స్థితిలో ఉన్నావా? నీ కాపరి సేవకుని మాత్రమే కాదు! నిన్నుచూసి పరిశుద్ధాత్ముడు సంతోషిస్తున్నారా లేక దుఃఖిస్తున్నరా ఒకసారి పరిశీలన చేసుకో!

 

   ఇక వచనంలో మరో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే మీ విశ్వాసంలో ఉన్న లోట్లు తీర్చేటట్లు అనుగ్రహించమని దేవుణ్ణి అడగటం, వారు స్తిరులుగా ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం! 1:2లో కూడా మా ప్రార్ధనలలో ఎప్పుడూ మిమ్ములను పేర్కొంటూ మీ అందరికోసమూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నారు! అయితే థెస్సలోనికయ సంఘము పౌలుగారి పరిచర్య మూలంగానే క్రీస్తులోనికి వచ్చారు గాని ఆయన దేవునికే కృతజ్ఞతలు చెబుతున్నారు! ఎందుకంటే నారు పోసింది నీరు పోసింది మేము గాని దానిని బ్రతికించింది విస్తరింప జేసింది దేవుడే కాబట్టి ఘనత తాను తీసుకోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు!.....

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,6,7,8,9

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

9. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

 

నేటి రోజులలో నేను అక్కడ పరిచర్య చేశాను ఇంతమంది రక్షింపబడ్డారు అన్ని సంఘాలు కట్టాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని ఎందుకు పనికిరాని నన్ను దేవుడు వాడుకుని ఇక్కడ అక్కడ తన పరిచర్యలో వాడుకున్నారు! ఇంతమందిని దేవుడే నన్ను ఉపయోగించుకుని తనకోసం రక్షించుకున్నారు అని చెప్పడం లేదు! నేను చెప్పేదేమిటంటే *నేను* అనేమాట *నా పరిచర్య* అనేమాట ఉపయోగిస్తున్నారు గాని పౌలుగారిలా దేవుడు చేశారు అనేమాట రావడం లేదు! దేవుడు గాడిదను కూడా వాడుకున్నారు! వీరు నోరుకూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నారు! కాబట్టి గొప్పతనం నీదికాదు! నీలో పనిచేస్తున్న దేవునిది కాబట్టి దేవునికే ఘనతను ఆపాదిద్దాము!

 

  ఇక 11 వచనంలో మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తును మమ్మును తప్పకుండా నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక అంటున్నారు! ఇక్కడ కూడా తండ్రియును కుమారుడును కలసి ఏకత్వంలో ఉన్నట్లు చెబుతున్నారు! అయితే ఇక్కడ తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు కలసి నన్ను మీ దగ్గరకు శీఘ్రముగా తీసుకుని వస్తారు అనే నిరీక్షణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు!

 

  ఇక్కడ మాట అనడానికి కారణం: ఇప్పటికే చాలా ప్రయత్నం చేశారు పౌలుగారు థెస్సలోనికయ సంఘం వెళ్లి వారిని బలపరచాలని, గాని కుదరలేదు! అయితే తొందరగా దేవుడు తనకు అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నారు! అయితే మనం 2:18 చూసుకుంటే అంటున్నారు మీ దగ్గరకు రావాలని మేము ఆశించినా పౌలనే నాకు ఆశ తరుచుగా కలిగినా గాని సైతాను మమ్ములను ఆటంకపరిచాడు అంటున్నారు! కాబట్టి ఇలాంటి ఆటంకాలు అన్ని తొలగించి దేవుడు తొందరగా మమ్మును మీ దగ్గరకు నడిపిస్తారు అనే ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పౌలుగారు!

 

  ప్రియ దైవసేవకుడా! నీవుకూడా సేవలో ఎటువంటి ఆటంకాలు కలిగినా దేవుడు ఒకరోజు ఆటంకాలు అన్నియు తీసివేసి తనపనిని చేసుకుంటారు అనే విశ్వాసం నిరీక్షణ కలిగి ముందుకు సాగిపో! పౌలుగారిని సీలగారిని తిమోతి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపో!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*36 భాగం*

1థెస్స 3:12—13

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! చివరి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

     మొదటిది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను అధ్యాయంలో ఎత్తిరాయడం, అనగా ఆయన తన పరిశుద్దులందరితో కలిసి తొందరలో రాబోతున్నారు,

రెండవది: పౌలుగారి ప్రార్ధన!

 

    మొదటగా: యేసుక్రీస్తుప్రభులవారి రాకడ కోసం ఇక్కడ పౌలుగారు ఏమని చెబుతున్నారు అంటే మన ప్రభువైన యేసు తన పరిశుద్దులందరితోపాటు వచ్చినప్పుడు అంటున్నారు--- అయితే ఇక్కడ ఎక్కడికి వచ్చినప్పుడు అనేది రాయడం లేదు! దీనికోసం తర్వాత విస్తారంగా చూసుకోవచ్చు!

 

గమనించాలి యేసుక్రీస్తు ప్రభులవారి రెండవ రాకడ రెండు విధాలుగా లేక రెండు ధఫాలుగా ఉంటుంది అని అనేకమంది బైబిల్ పండితులు నమ్ముతారు! ఒకటి రహస్యరాకడ! ఇది కేవలం క్రీస్తునందుండి మృతి నొందిన పరిశుద్ధులను, సిద్ధపడిన విశ్వాసులు అనగా ఆత్మానుసారమైన జీవితం కలిగి, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, పవిత్రులుగా జీవిస్తున్న విశ్వాసులను తీసుకుని పోడానికి ఆయన తన దూతలను పంపి తీసుకుని పోడానికి రాబోతున్నారు! అయితే రహస్య రాకడలో యేసుక్రీస్తుప్రభులవారు భూలోకానికి రారు! కేవలం మధ్యాకాశం కి వస్తారు! ఎత్తబడిన విశ్వాసుల గుంపు కూడా మధ్యాకాశం వరకు కొనిపోబడి దేవునితో ఉంటారు! అప్పుడే మధ్యాకాశంలో ఏడేండ్ల పెండ్లి విందు, భూలోకంలో ఏడేండ్ల మహా శ్రమలు కలుగుతాయి! 

 

   ఇక మరో రెండవ రాకడ! దీనినే బహిరంగరాకడ అంటారు! మత్తయి సువార్త 24లో యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన రాకడ ఇదే! జెకర్యా, యెషయా గ్రంధం, యేహెజ్కేలు గ్రంధాలలో వ్రాయబడిన రాకడ ఇదే! ఎందుకు వస్తారు అంటే భూలోక జనులందరూ ఇశ్రాయేలు దేశం మీదకు దండెత్తి వారిని సర్వనాశనం చేద్దామని వస్తారు! ఇశ్రాయేలీయులు మొర్ర పెడతారు! వెంటనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి భూమి మీద ఒలీవల కొండమీద అడుగుపెడతారు! తర్వాత శత్రువులను సంహరించిన తర్వాత ధవళసింహాసనపు తీర్పు ఉంటుంది!  

 

   అయితే రెండు దఫాలుగా ఎందుకు రావాలి దేవుడు? అంటే తానూ వాగ్దానం చేశారు- భూలోకమంతటి మీదికి రాబోయే ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తాను అని ప్రకటన :10, ఇంకా నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను! నేను వెళ్ళిన ఎడల నేనుండే చోటున మీరు కూడా ఉంటారు అన్నారు దేవుడు!

John(యోహాను సువార్త) 14:2,3,4

2. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

3.నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

4. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.

 

 ప్రకటన గ్రంథం 3: 10

నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో- శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను.

 

భూలోకం అతి తొందరలో కాలిపోబోతుంది దేవుని ఉగ్రతతో! నోవాహు గారి కాలంలో ఇది జలప్రళయంలో నాశనమయ్యింది అయితే ఇక ఎప్పుడు నీటి ద్వారా నాశనం చెయ్యను అన్నారు, కాబట్టి ఇక మరోసారి నాశనం చేస్తే అది అగ్ని గంధకాలతో నాశనం చెయ్యబోతున్నారు అన్నమాట! మరి దేవుడు ప్రమాదం నుండి తప్పించడానికి భూమిమీద నున్న పరిశుద్ధులను భూమిమీద ఉండకుండా మధ్యాకాశంలోనికి తీసుకుని పోతున్నారు!

 

       అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే  ఈరెండు సందర్భాలలోనూ యేసుక్రీస్తుప్రభులవారు ఒంటరిగా రారు! ఆయనతోపాటుగా ఎవరు వస్తారు అంటే వచనంలో చెబుతున్నట్లు తన పరిశుద్దులందరితో పాటుగా వస్తారు! ఇంకా మరికొన్ని చోట్ల తన వేవేల దూతలను తీసుకుని వస్తారు అని వ్రాయబడింది!  ఇక 4:14 లో యేసు మృతిపొంది లేచెనని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారణం యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అంటున్నారు!

 

ఇక ఇదే 2థెస్స 1:6 లో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై... అంటున్నారు! ఇక్కడ దూతలతో కూడా వస్తారు అంటున్నారు అయితే 12 వచనంలో పరిశుద్ధులతో వస్తారు అంటున్నారు! దీని అర్ధం ఏమిటంటే: రెండు సందర్భాలలోనూ యేసుక్రీస్తు ప్రభులవారు తన దూతలను మరియు పరిశుద్ధులను వెంటబెట్టుకొని వస్తారు అన్నమాట!

 

Matthew(మత్తయి సువార్త) 24:30,31

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క చివరనుండి చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

Matthew(మత్తయి సువార్త) 25:31,32

31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

32. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

 

యూదాగారు కూడా రాస్తునారు 1:14,15

14. ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,

15. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

 

ఒలీవల కొండమీద ఆయన శిష్యులతో దూతలు చెప్పారుగలలీయ మనుష్యులారా! ఏవిధంగా యేసుక్రీస్తు ప్రభులవారు పరలోకానికి ఎత్తబడ్డారో అదేవిధంగా ఆయన భూలోకానికి తిరిగి వస్తారు! .....

అపో.కార్యములు 1: 11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

ఇదిగో నేను త్వరగా రాబోవు చున్నాను అంటున్నారు

ప్రకటన గ్రంథం 22: 7

ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నారు ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, భూజనులందరును ఆయనను చూసి రొమ్ముకోట్టుకుంటారు అంటున్నారు....

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

 

త్వరగా రాబోవుచున్నాను! ప్రతివానికి సిద్ధపరచిన జీతం నా చేతిలో ఉంది అని కూడా అంటున్నారు!

ప్రకటన గ్రంథం 22: 12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

     కాబట్టి దేవుడు అతి తొందరలో రాబోతున్నారు మరి నీవు ఆయన రాకడకు సిద్ధపడి ఉన్నావా? విడువబడుట బహు ఘోరమని మరచిపోకు!     

నేడే నీలో ఆయనకు ఆయాసకరమైనవి దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే ఇప్పుడే తొలగించుకో!

ఆయనతో సమాధాన పడు!

రాకడలో ఎత్తబడు!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*37 భాగం*

*పౌలుగారి ప్రార్ధన-1*

1థెస్స 3:12—13

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! చివరి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

     మొదటిది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను అధ్యాయంలో ఎత్తిరాయడం, అనగా ఆయన తన పరిశుద్దులందరితో కలిసి తొందరలో రాబోతున్నారు, రెండవది: పౌలుగారి ప్రార్ధన!

 

             (గతభాగం తరువాయి)

 

  ఇక తర్వాత విషయం: పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం! గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పౌలుగారి ప్రార్ధనలో భూలోక సంబంధమైన విషయాల కోసం ఆశీర్వాదాల కోసం ఎప్పుడు ఉండవు! ఆధ్యాత్మిక విషయాలకోసమే ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటారు! ప్రార్ధనలో కూడా ఎంతో గొప్ప రైమింగ్/ ప్రాస చాలా బాగుంటుంది! ఉదాహరణకు కొలస్సీ పత్రికలో పౌలుగారి మహత్తర మైన ప్రార్ధన కనిపిస్తుంది మనకు.

 

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారి మిగతా పత్రికలలో గల ప్రార్ధనలకు పత్రికలో గల ప్రార్ధనలకు చాలా తేడా ఉంటుంది! మిగతా సంఘాలకు వారు ఇంకా విశ్వాసంలో భక్తిలో ఎదగాలని ప్రార్ధన చేస్తే పత్రికలో రెండవ రాకడకు సంబంధించిన ప్రార్ధన కనిపిస్తుంది మనకు! కారణం గతంలో చెప్పిన విధంగా వారు అప్పటికే విశ్వాసంలో భక్తిలో స్థిరులై పరిపూర్ణతకు దగ్గరగా ఉంటూ కేవలం యేసుక్రీస్తుప్రభులవారి రాకడకొరకు ఆసక్తితో కనిపెడుతున్నారు కాబట్టి పత్రికలో కనబడిన ప్రార్ధన కూడా రాకడకు సంబంధించిన ప్రార్ధన లాంటి ఆశీర్వాదంగా మనం తలంచవచ్చు!

 చూడండి ప్రార్ధన!...

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై...

 

12 వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు పరిశుద్ధులతో వచ్చేటప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనింద్యముగా అయన స్థిరపరచాలి! ఇది మొదటిది!!!

ఇక 13 వచనంలో మరో రకమైన ప్రార్ధన కనిపిస్తుంది

 

మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్దులందరితో వచ్చినప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో  అనింద్యముగా ఉండాలి అని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నారు! ఇది బాగా అర్ధం కాలేదు కదా! పౌలుగారు వారి ఆధాత్మిక స్థాయిని అంచనా వేసాకనే మాట అంటున్నారు! ప్రభువైన యేసు తొందరగా రావాలని మీరు ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు కదా అప్పుడు మీ హృదయాలు దేవుని ఎదుట అనింద్యముగా అనగా నిందమోపలేనంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు పౌలుగారు! ఇది నిజంగా ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన స్టేజ్! ఎందుకు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలని కోరుకుంటున్నారు?

 

జవాబు చాలా సింపుల్! *పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు* కాబట్టి! వీరు ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభులవారు ఎప్పుడొస్తారు... అంటూ అడుగుతుండే వారు.! ఇప్పుడు ఆయనను చూడాలంటే పరిశుద్ధత కావాలి!

 అందుకే మొదటగా పరిశుద్దత విషయంలో ఎవడు నిన్ను వేలెత్తి చూపడమే కాకుండా దేవుని ఎదుట కూడా మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలి! నిజం చెప్పాలి అంటే మన క్రియలు దేవుని యెదుట మురికి గుడ్డలా ఉంది అని బైబిల్ సెలవిస్తుంది! మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండలేడు అనికూడా చెబుతుంది బైబిల్!

 యోబు 15: 14

శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

 

Job(యోబు గ్రంథము) 25:4,6

4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

6. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

 

అయితే మరి దేవుని ఎదుట ఇప్పుడు ఒక మనిషి నిందారహితుడుగా అదికూడా పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఎలా ఉండగలడు? అబ్రాహాము గారిలాంటి వ్యక్తినే దేవుడు నా ఎదుట నిందారహితుడుగా ఉండమని హెచ్చరించారు దేవుడు! ఆది 17:1;  ఇది సాధ్యమా? అంటే అవును సాధ్యమే! సాధ్యం కాని విషయాలు దేవుడు ఎప్పుడు చెప్పరు! మానవునికి ఇది సాధ్యం కానేకాదు! అయితే ఒకవ్యక్తి క్రీస్తుయేసు రక్తంలో కడుగబడి పరిశుద్దాత్మతో నింపబడితే ఆత్మద్వారా నడిపించబడితే ఆత్మలో ముందుకు సాగిపోతే ఇది సాధ్యమే! ....

Galatians(గలతీయులకు) 5:16,18

16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.

 

కీర్తనలు 119: 11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

 

అనగా పౌలుగారు మీరు దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే వారు ఆత్మానుసారులై ఉండమని చెబుతున్నట్లు లెక్క! ఎందుకంటే ఆత్మానుసారులై ఉండండి అప్పుడు మీరు శరీరకార్యాలు చెయ్యలేరు అంటున్నారు పౌలుగారు!

ఇంకా వాక్యాన్ని మన హృదయం లో ఉంచుకుంటే, మన హృదయం నిండా వాక్యముతో నిండిపోతే నీవు పాపము చేయనే చేయవుఅప్పుడు నీవు నిందారహితుడుగా ఉండగలవు!

 

  ఇదే విషయాన్ని పౌలుగారు 5:23 లో కూడా చెబుతున్నారు....1థెస్సలొనికయులకు 5: 23

సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. *మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు* కాపాడబడును గాక.

 

ఇంకా 1కొరింథీ 1:8 చూసుకుంటే

మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

 

ఎఫెసి 5:26—27

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 

2పేతురు 3: 14

ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, *ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు* జాగ్రత్తపడుడి.

 

ఈరోజు పౌలుగారు మనకు కూడా చెబుతున్నారుమనం కూడా ప్రభువైన యేసు తన పరిశుద్దులందరితో పాటు వచ్చేటప్పుడు మన హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితముగా ఉండాలి! నీవు ఎవరిని మోసగించినా దేవుణ్ణి మోసగించడం నీ చేతకాదు! అలా మోసగిద్దాము అనుకున్నారు అననీయ సప్పీరలు! మందిరంలోనే పడి చచ్చారు! నీవుకూడా గొప్పోడివి కాదు! అలా ఘోరమైన తీర్పు పొందకముందే ఇప్పుడే మారుమనస్సు నొంది దేవునితో సమాధాన పడు! కారణం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అంటున్నారు.

యిర్మియా 17: 9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

 

  వ్యాధి అంటే పాపరోగం! పాపరోగానికి మందు యేసు రక్తము!

 

  కాబట్టి ఆయన రక్తముతో కడగబడి ఆయనాత్మతో నింపబడదాము ఆత్మద్వారానే నడిపింపబడదాము! దేవునిఎదుట నిందారహితముగా ఉందాము!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*38 భాగం*

*పౌలుగారి ప్రార్ధన-2*

1థెస్స 3:12—13

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను,ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! చివరి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

 

     మొదటిది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను అధ్యాయంలో ఎత్తిరాయడం, అనగా ఆయన తన పరిశుద్దులందరితో కలిసి తొందరలో రాబోతున్నారు, రెండవది: పౌలుగారి ప్రార్ధన!

 

             (గతభాగం తరువాయి)

 

  ఇక తర్వాత   పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం ఏమిటంటే: మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును మొదటగా ఒకనిఎడల ఒకడును, రెండవది మనుష్యులందరి యెడలను ప్రేమలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రేమలో వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక!  చూడండి ఎంతచక్కని ప్రార్ధన మరియు ఆశీర్వాదం!!

 

   పౌలుగారి ప్రార్ధనలలో గాని ఆయన రాతలలో గాని ఆయన ప్రసంగాలలో గాని ప్రేమను కలుపకుండా ఉండలేరు! నిజం చెప్పాలంటే పౌలు మహాశయునిలా యేసుక్రీస్తుప్రభులవారి ప్రేమతత్వాన్ని భూలోకంలో ఎవరూ అర్ధం చేసుకోలేదు అని నా అభిప్రాయం! ఆయనతో పాటుగా తిరిగినా అది అపోస్తలులకి కూడా ప్రేమతత్వం ఇలా పూర్తిగా అర్ధం కాలేదేమో అని నా ఉద్దేశ్యం! ఇక పౌలుగారి తర్వాత ప్రేమతత్వం కోసం ఎక్కువగా రాసింది అర్ధం చేసుకున్నది దైవజనుడైన అపోస్తలుడైన యోహాను గారు మాత్రమే! యోహాను గారు ప్రేమకోసం రాస్తూ రాస్తూ ఇంకా ఆత్మావేశుడై ఏమి చెప్పాలో అర్ధం కాక ఒకేఒక్క మాటలో తేల్చాల్సివచ్చింది ఆయనకు! దేవుడు ప్రేమయై ఉన్నాడు! దేవుడే ప్రేమ, ఆగాపే ప్రేమే దేవుడు!

1యోహాను 4: 8

దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

 

   సరే ఇప్పుడు పౌలుగారి ప్రార్ధన కోసం చూసుకుందాము! మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యెడల ఒకడును , రెండవది మనుష్యులందరి యెడలను అభివృద్ధి పొందాలి వర్ధిల్లాలి!

 

ఒకసారి ఆగుదాం! పౌలుగారు వీరిని ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లమని ప్రార్ధిస్తూ ఆశీర్వాదించాల్సిన అవసరం ఏమొచ్చింది? వీరిమధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా? వీరు ఆత్మీయంగా పరిపక్వ స్థితిలో ఉన్నారని చెప్పారు కదా అని అనొచ్చు మీరు! అయితే వీరిమధ్య ఏవిధమైన తగాదాలు లేనేలేవు! మరి ఎందుకు అలా రాశారు అంటే రెండు కారణాలు ఉండి ఉండవచ్చు!

 

మొదటగా: 4:9 ప్రకారం: సహోదర ప్రేమ కోసం మీకు రాయడం అవసరం లేదు ఎందుకంటే మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి అనగా బహుశా వీరు రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారని మొదటి భాగాలలో చూసుకున్నాము మనం! కాబట్టి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరికి సహోదరులను ఎలా ప్రేమించాలో ఆయనే నేర్పించాడు వీరికి! ఆవిధంగా వీరు ఎంతో ప్రేమను కనపరిచారు కాబట్టి ఇంకా ప్రేమలో నిలిచి ఉండటమే కాకుండా అభివృద్ధి చెందమని, అభివృద్ధి చెందటమే కాకుండా వర్ధిల్లమని పౌలుగార్రి ప్రార్ధన మరియు ఆశీర్వాదం! వర్ధిల్లడం అనగా మానవ రీతిలో చెప్పాలంటే ఒకరు ఒక ఇల్లు కట్టుకుంటే- అది దేవుని ఆశీర్వాదంగా చెప్పుకోవచ్చు! అదే వ్యక్తి అలాంటి ఇల్లు మరో పది కట్టి ఎన్నో రంగాలలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందటాన్ని వర్ధిల్లడం అంటారు! మరి ప్రేమలో వర్ధిల్లడం అనగా ఆత్మీయంగా అవతలి వ్యక్తి మనలను ప్రేమించినా లేకపోయినా నీవు మాత్రం ప్రేమిస్తూ అవతలి వ్యక్తి నిన్ను కసురుకున్నా ప్రేమలో సాగిపోతూ అవతల వ్యక్తిని ద్వేషించకుండా నీ ప్రవర్తనతో అవతలి వ్యక్తిలో మార్పు తేవడం ప్రేమలో వర్ధిల్లడం అని నా భావం! అంతేకాకుండా ప్రేమగల వ్యక్తికి ఉదాహరణగా నిన్ను చెప్పుకోవడమే ప్రేమలో వర్ధిల్లడం!

 

   ఇప్పుడు పౌలుగారు వీరిని కూడా అలాగే ప్రేమలో అభివృద్ధి పొందడమే కాకుండా ప్రేమలో వర్ధిల్లమని వీరికోసం ప్రార్ధన చేస్తూ ఆశీర్వదిస్తున్నారు!  ప్రియమైన సంఘమా! నీవు నేను కూడా ఇదేవిధంగా ప్రేమలో నడవడమే కాకుండా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు!

 

   ఇక రెండవ కారణం ఏమై ఉండవచ్చు అనగా: మొదటి భాగాలలో చెప్పిన విధముగా పౌలుగారు యేసుక్రీస్తుప్రభులవారు అతి తొందరలో మరలా రెండో రాకడలో రాబోతున్నారు అని చెప్పారు కాబట్టి మాసిదోనియా ఎఫెసి ప్రాంతాల వారికి ఎల్లప్పుడూ పనిచేయకుండా ఏదైనా క్రొత్త విషయాలు తెలుసుకోవడంలోనే ఆసక్తి తప్ప పనిపాటులు మీద శ్రద్ధ ఉండేది కాదు! అయితే పౌలుగారు తాను అక్కడ సువార్త ప్రకటించినప్పుడు రాకడ వచ్చేవరకు మీ సొంతకార్యములను జరుపుకొంటూ మీ చేతులతో పనిచేసి డబ్బులు సంపాదించుకుని వాటితోనే భోజనం చెయ్యమని ఖండితముగా చెప్పారు! దీనిని అందరు పాటించడం జరిగింది! అయితే పౌలుగారు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బేచ్ తయారయ్యారు! యేసుప్రభువు తొందరలో వచ్చేస్తున్నప్పుడు పనిపాటులు కష్టపడటం ఎందుకు? నిరంతరం ఆయన ప్రార్ధనా విజ్ఞాపనలలో వాక్య ధ్యానంలో ఉంటే చాలు, అని బోధించడమే కాకుండా అనేకులను పనిచెయ్యకుండా మానిపించేసారు. సంఘపెద్దలు అలాకాదు పౌలుగారు చెప్పినట్లు చెయ్యండి అంటే బహుశా వీరు కొద్దిగా వీరిమీద అలిగారు! దీనిని 4:12 లోను. 2థెస్స 2 లోను దీనికోసం వ్రాశారు! కాబట్టి రకంగా ఫీల్ అయినవారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి అలాంటివి మీ మధ్యలో పెట్టుకోవద్దు! ప్రేమలో ఒకనికొకడు వర్దిల్లడమే కాకుండా ప్రజలందరి యెడల కూడా ప్రేమతో వ్యవహించమని చెబుతున్నారు పౌలుగారు

 

  సరే ఇంకా పౌలుగారు ప్రేమ కోసం ఏమి చెప్పారో చూసుకుందాం

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:9,10

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు,

 

2థెస్సలొనికయులకు 1: 3

సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

 

యోహాను 13: 34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

రోమా 12:9—10

9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:1,2,3,4,5,6,7,8,13

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

 

1 John(మొదటి యోహాను) 2:5,9,10,11

5.  ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.

10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.

11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.

 

 1 John(మొదటి యోహాను) 3:10,11,14,15,16,17,18,19

10. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా

14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; నరహంతకుని యందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

16. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

17. లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

18. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.

19. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.

 

   కాబట్టి భక్తులు చెప్పిన ప్రేమ మార్గంలో నడుస్తూ ప్రేమలో అభివృద్ధి పొందుచూ ప్రేమలో వర్దిల్లుదాము! ప్రేమ లేకనే కయీను హేబెలును చంపాడు! యాకోబు గారి కుమారులు తమ్ముడైన యోసేపును కొట్టడమే కాకుండా గోతిలో త్రోయడమే కాకుండా తమ్మున్ని ఒక బానిసగా అమ్మేశారు!

అదే ప్రేమగల యోసేపు ఇన్ని చేసినా క్షమించి వారిని పోషించారు! ఇదీ దేవుని ప్రేమ! సహోదర ప్రేమ! అందుకే అంత గొప్ప భక్తుడయ్యారు యోసేపు గారు! అందుకే ఆయనకు పేరు పెట్టారు దేవుడు- ఫలించెడి కొమ్మ! నీవుకూడా అలా ప్రేమలో ఫలించే కొమ్మలా ఉంటావా?

 

ఆమెన్!

దైవాశీస్సులు! 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*39 భాగం*

1థెస్స 4:1—2

1. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

2. కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం ఇంతవరకు మూడు అధ్యాయాలు ధ్యానం చేశాము! ఇక నాల్గవ అధ్యాయం నుండి ధ్యానం చేసుకుందాము!

 

    ప్రియులారా! నాల్గవ అధ్యాయంలో నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి పరిశుద్ధాత్ముడు చెప్పడం జరిగింది!

మొదటిది: *దేవుని చిత్తమేమిటి*?

రెండవది: *సహోదర ప్రేమ కలిగి ఉండాలి*

మూడవది: *క్రీస్తులో ఉండి చనిపోయిన వారు ఏమవుతారు?*

నాల్గవది:  *యేసుక్రీస్తు ప్రభులవారి రెండవరాకడ విధానం!*

 

    సరే, ఇప్పుడు మొదటి రెండు వచనాలు పరిశీలన చేద్దాం! మెట్టుకు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు అంటున్నారు మొదటి వచనంలో! పభువైన యేసుక్రీస్తు ద్వారా మేము మీ కిచ్చిన ఆజ్ఞను మీకు తెలుసు అంటున్నారు! అయితే ప్రాచీన ప్రతులలో వచనం ఇలా ఉంది: *మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న అధికారంతో మీ కిచ్చిన ఆదేశాలేవో మీకు తెలుసు!*

 

దీనిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే పౌలుగారు రాసిన పత్రిక గాని లేక మరే పత్రిక గాని తనసొంతమాటలు చెప్పలేదు! అక్కడ సేవచేసి నప్పుడు గాని, పత్రికలు రాసినప్పుడు గాని ప్రభువైన యేసుక్రీస్తు తనకు బోధించి- ప్రజలకు సంగతులు బోధించమని దేవుడిచ్చిన అధికారంతోనే పత్రికలు రాయడం గాని, సువార్త పరిచర్య గాని చేశారని అర్ధమవుతుంది. అందుకే గలతీ పత్రికలో అంటున్నారు పౌలుగారు: నేను పొందుకున్న సువార్త మరియు పరిచర్య- దేవుని నుండే పొందుకున్నాను. మనుష్యులెవరు నాకు బోధించలేదు అంటున్నారు.....

Galatians(గలతీయులకు) 1:11,12

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

 దేవుడు అట్టి అధికారం ఇచ్చారు కాబట్టి సంఘము ఎలా ప్రవర్తించాలో అనేది పరిశుద్ధాత్ముడు బోధిస్తే 14 పత్రికల రూపంలో పౌలు గారు రాశారు! అందుకే పౌలుగారు, పేతురు గారు అంటున్నారు లేఖనం మనుష్యుల ఇచ్చబట్టి కలుగలేదు! మనుష్యులు దైవావేశులై రాశారు! కాబట్టి బైబిల్ లో గల ప్రతీ వచనం అది పరిశుద్దాత్మున్ని సందేశంగా భావించాలి తప్ప బైబిల్ లో గల భక్తులు వారికి తోచింది రాశారు అని భావించకూడదు! .....

2తిమోతికి 3: 16

దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు *దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము (ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)* ఉపదేశించుటకును,

 

2పేతురు 1:20—21

20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 

    అయితే వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుద్వారా లేక యేసుక్రీస్తుప్రభులవారు మాకిచ్చిన అధికారంతో మీ కిచ్చిన ఆజ్ఞలు మీకు తెలుసు అన్నారు గాని ఆజ్ఞలు ఏవో ఇక్కడ వ్రాసిలేవు గాని బహుశా 25 వచనాలు ప్రకారం అవి దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో తెలుసుకుని ఆయన సంతోషపడే పనులు మాత్రమే చెయ్యాలి గాని మానవులు సంతోషపడే పనులు చేయకూడదు! అనగా మనము ఏమి చేసినా అది దేవుణ్ణి సంతోషపెట్టే క్రియనా కాదా అని ఆలోచించాలి!

 

రెండవది: దేవుని చిత్తము తెలుసుకుని ఆయన చిత్తమును మాత్రమే చెయ్యాలి! దేవుని చిత్తమేమిటో క్రింది వచనాలలో వివరించారు!

 

మూడు: మీ ఘటమును అనగా శీలాన్ని పరిశుద్ధత యందు కాపాడుకోవాలి అనగా ఇహలోక మాలిన్యము మన హృదయాలకు గాని శరీరానికి గాని ఆత్మకు గాని అంటకుండా జాగ్రత్త పడాలి!

 

ఇవే యేసుక్రీస్తుప్రభులవారి నుండి పౌలుగారు పొందుకున్న ఆజ్ఞలు! ఆయనిచ్చిన అధికారంతో ఆజ్ఞలను పౌలుగారు థెస్సలోనికయులకు మరియు ఇతర సంఘాలకు కూడా చెప్పడం జరిగింది!

 

     ఇక రెండో వచనం చూసుకుంటే మీరేలాగు నడచుకొని దేవుని సంతోషపెట్టాలో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడచుకొనుచున్నారు!

ఒకసారి ఆగుదాం! ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీరేలాగు నడుచుకోవాలో దేవుని సంతోషపరచాలో మా వలన విన్నారు అనడం లేదుగాని మావలన నేర్చుకొనిన ప్రకారముగా అంటున్నారు! అనగా మొదట పౌలుగారి త్రయం దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో వారి జీవితాలలో చూపిస్తూ మాదిరిగా జీవిస్తూ అప్పుడు చెప్పారు అన్నమాట ఇంకా అంటున్నారు మా వలన మీరు నేర్చుకున్నారు! కేవలం ప్రసంగాలు చేసి వదిలెయ్యడమే కాదు ముందు వారు బోధించేది తమ జీవితాలలో అన్వయించి, చేసి చూపించి అప్పుడు మీరుకూడా ఇలాగే చెయ్యాలి అని చెప్పారు! అందుకే పౌలుగారు తన పత్రికలలో అనేకసార్లు నేను క్రీస్తుని పోలి నడుచుకొన్నాను కాబట్టి మీరుకూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు! ....

1కొరింథీ 4:16; 11:1; ఫిలిప్పీ 3:17; 1థెస్స 1:6; 2 థెస్సలోనికయులకు 3:9;

 

ఇక ఇదే పత్రికలో నేను/ మేము మీకు మాదిరిగా ఉండాలనే ఇలా చేశాము అంటున్నారు. 2థెస్స :9

 

పేతురు గారు అంటున్నారు క్రీస్తుకూడా మీరు అనగా మనము తన అడుగుజాడలయందు నడుచుకోవాలని మీకు మాదిరియుంచి పోయెను అంటున్నారు 1పేతురు 2:21

 

అపో 20:35 లో పౌలుగారు చెబుతున్నారు మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి....... అంటూ అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అంటున్నారు!

 

కాబట్టి బోధకుడా! కాపరి! సేవకుడా! ప్రసంగీకుడా! ముందు నీవు చేసి చూపించి అప్పుడు చెప్పాలి సంఘానికి ఇలా నడవాలి క్రీస్తులో అంటూ! కేవలం ప్రసంగాలు మాత్రమే చేస్తూ, మాదిరిలేని జీవితం జీవిస్తే మ్రోగెడు కంచును గణగణలాడు తాళం అని మరచిపోవద్దు!

 

   గమనించాలి ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు: దేవుణ్ణి సంతోషపరడానికి ప్రయత్నించాలి గాని మనుష్యులను కాదు! నేడు అనేకమంది మనుష్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరికొంతమంది తమ కుటుంబాన్ని సంతోషపెట్టాలని చూస్తున్నారు, మరికొంతమంది తమ భార్యను సంతోషపెట్టాలని సుఖపెట్టాలని చూస్తున్నారు, మరికొంతమంది తమ బాస్ ని లేక అధికారిని సంతోషపెట్టాలని చూస్తున్నారు గాని దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎంతమంది నేడు తాపత్రయ పడుతున్నారు?

 

 పౌలుగారి ద్వారా సార్వత్రిక సంఘం ఆజ్ఞాపించబడింది ఏమిటంటే మనమంతా దేవుణ్ణి సంతోషపెట్టే క్రియలు చెయ్యాలి! అనగా ఒకపని చేసేముందు పని దేవుణ్ణి సంతోషపెడుతుండా లేక దుఖపరుస్తుందా అనేది ఆలోచించి చెయ్యాలి! మాట దేవునికి ఘనత తెస్తుందా లేక ఆయన నామమునకు అవమానం తెస్తుందా అని ఆలోచించి చేస్తే నీవు జీవితంలో తప్పు చెయ్యనే చెయ్యవు! అందుకే ఫిలిప్పీయులకు పత్రికరాస్తూ పౌలుగారు ఇంతవరకు బాగానే చేశారు అయితే మీరు చెయ్యవలసింది పరుగెత్తవలసింది వేటికోసమంటే ఏవి న్యాయమైనవి ఏవి మాన్యమైనవి ఏవి పవిత్రమైనవో చూసి వాటికోసం తాపత్రయ పడండి అంటున్నారు......

ఫిలిప్పీయులకు 4: 8

మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

ఫిలిప్పీయులకు 4: 9

మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

 

ప్రియ విశ్వాసి! కాపరి! సేవకుడా! నీ తాపత్రయం దేనికోసం? దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా లేక మనుష్యులనా? నీ ప్రసంగాలు దేవుణ్ణి సంతోషపెట్టేవా లేక నీ పాష్టరేట్ కమిటి మరియు విశ్వాసులను సంతోష పెడుతున్నాయా ? ఒకవేళ నీవు మనుష్యులను సంతోష పెట్టేవాడవు అయితే పౌలుగారి మాటల ప్రకారం *నీవు దేవుని సేవకుడవు కానేకావు* . నీ పొట్టకోసం దేవుని సేవచేస్తున్నావు! నీ కడుపే నీ దేవుడు!  కాబట్టి దేవుణ్ణి మాత్రమే సంతోషపెడదాము!

గలతియులకు 1: 10

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

 అంతేకాకుండా పౌలుగారు అంటున్నారు విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని మిమ్మల్ని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తునందు హెచ్చరిస్తున్నాను అంటున్నారు!

హెచ్చరిక కేవలం థెస్సలోనికయ సంఘానికి మాత్రమే కాదు!

నీకు నాకు! ప్రతీ విశ్వాసికి!

ప్రతీ సేవకునికి/ నాయకునికి/ బోధకునికి! మరి ఆయన హెచ్చరిక విందామా?

దేవుణ్ణి సంతోషపెడదామా?

దైవాశీస్సులు!

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*40 భాగం*

*దేవుని చిత్తము-1*

1థెస్స 4:—5

3. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

4. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

5. పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  గతభాగంలో దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం చూసుకున్నాము!

 

   ఇక రెండవ విషయం ఏమిటంటే మూడు నుండి ఐదు వచనాలలో దేవుని చిత్తము ఏమిటి అనేది పౌలుగారు చెప్పారు- దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మనపట్ల దేవుని చిత్తము అంటున్నారు పౌలుగారు!

 

మొట్టమొదటి దేవుని చిత్తము ఏమిటంటే: *మీరు (మనము) పరిశుద్దులగుటయే దేవుని చిత్తము* అంటున్నారు! గమనించాలి పరిశుద్దులగుట అంటే ఏమిటో కూడా మనం బుర్రలు పాడుచేసుకోకుండా దేవుని దృష్టిలో పరిశుద్దులగుట ఏమిటో చెప్పేశారు- పరిశుద్దులగుట అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అంటున్నారు!

 

రెండవ దేవుని చిత్తము ఏమిటంటే:  *పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము!*

 

మనము దేవుని చిత్తముకోసం ఆలోచిస్తే పౌలుగారు కొలస్సీ పత్రికలో  తన ప్రార్ధనలో ఇలా అంటున్నారు కొలస్సీయులకు 1: 10

*ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు*,. .

 

అయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారై ఉండాలి!

అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్లుగా నడచుకోవాలి అని కొలస్సీయుల యెడల పౌలుగారి ఆకాంక్ష!! అవును దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోలేకపోతే మనం ఆయనను సంతోషపెట్టలేము!! ఆయన చిత్తాన్ని నెరవేర్చలేము! అందుకే పౌలుగారు ఏరికోరి ప్రార్ధిస్తున్నారు! వారు అట్లాంటివారు కావాలని కోరుకుంటున్నారు!

 

   అందుకోసం రోమా 12:1-2 లో చూసుకుంటే: *పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు* . . *మీ మనస్సుమారి రూపాంతరం పొందుడి అంటున్నారు*.  వచనాలలో చాలా లోతైన విషయాలున్నాయి. ఈలోక మర్యాద బట్టి కాక, మొదట ఉత్తమమును, రెండవది అనుకూలమును, మూడవది సంపూర్ణమునైయున్న దేవుని చిత్తము తెలుసుకోవాలి! దేవుని చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది కాబట్టి ఆయన చిత్తమును మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తమును తెలుసుకుంటామో ఆయన చిత్తానుసారముగా మనం నడువగలం! ఇప్పుడు మనం రోడ్డుమీద స్పీడ్ గా వెళ్తున్నామనుకోండి మనదగ్గర రోడ్ మేప్ ఉంటే కన్ప్యూజన్ లేకుండా, ప్రమాదాలు లేకుండా హాయిగా వెల్లగళము. అలాగే దేవుని చిత్తము తెలుసుకుంటే ఆయనను సంతోషపెట్టగలము!

 

    ఆయన చిత్తముకోసం ఆలోచిస్తే: దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడే certify చేస్తున్నారు! కారణం దావీదు గారు రాజు కాకముందు, రాజైన తర్వాత కూడా ఎప్పుడూ దేవునికోసమే పరితపించేవారు. ఆయన ఆలయం, సేవా విధానం, ఆయనను స్తుతించడానికి పాటలు రాయడం లాంటివి చేసేవారు. ఇంతటి బిజీ వ్యక్తీ కూడా దేవునికే ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి దావీదు గారు! అదే సంసోను విషయం చూసుకుంటే, తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక తన కనులకు నచ్చిన పిలిష్తీయుల అమ్మాయిని పెళ్ళిచేసుకొని ఎంతగా నష్టపోయాడో మనందరికీ తెలుసు! నేటిరోజుల్లో యువత బాగా చదువుకుని, తమకున్న పరిమిత జ్ఞానంతో తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్నారు, ప్రేమ గుడ్డిదంటారు కదా ప్రేమ మైకంలో వ్యక్తి ఎలాంటివ్యక్తో తెలుసుకోకుండా, ముఖ్యంగా దేవుని చిత్తమును తెలుసుకోకుండా,  తల్లిదండ్రులను కూడా ఎదిరించి,  వివాహము చేసుకుని,  మోసపోయి, తర్వాత జీవితాంతము బాధపడుచున్నారు! 

ప్రియ యవ్వనస్తుడా/  యవ్వనస్తురాలా!  నీవు నీ జీవిత భాగస్వామిను ఎన్నిక చేసుకోవడంలో సంసోనుగారిని ఆదర్శంగా తీసుకోకుండా, ఇస్సాకుగారిని ఆదర్శంగా తీసుకో! ఎలియాజరు ఇస్సాకుకోసం సంబంధం కోసం వెళితే- ఇస్సాకుగారు కలలు కనకుండా, ప్రార్ధనలో కనిపెట్టారు, రిబ్కాలాంటి మంచి భార్యను పొందుకున్నారు! ఆదికాండం 24:63; 

మీరుకూడా దేవునిచిత్తం కోసం కనిపెట్టి, ఆయన సన్నిధిలో ప్రార్ధించండి! నేనుకూడా అలా కనిపెట్టి, ప్రార్ధించి మంచిభార్యను పొందుకున్నాను! మీరుకూడా కనిపెట్టి ప్రార్ధించండి! దేవుడు మీకుకూడా మంచి జీవిత భాగస్వామిని దయచేస్తారు!

 

     ఇంకా సొలోమోనుగారంటారు: నీ స్వబుద్ధిని ఆధారం చేసికొనక నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము!! సామెతలు 3:5-7; అలా చేస్తే నీ జీవితంలో దేవుని కాపుదల ఉంటుంది. దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటి అని ప్రార్ధించి తెలుసుకో! ఆయన నీపట్ల తనకున్న చిత్తాన్ని తెలియజేస్తారు.

 

      సమూయేలుగారు చిన్నతనములోనే దేవునివాక్కు దర్శించినా అది ఏమిటో తెలియనప్పుడు, దైవజనుడు, యాజకుడైన ఏలీగారు క్రమము నేర్పించారు: చిత్తము ప్రభూ, నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అని; 1 సమూయేలు 3; అప్పటినుండి ప్రారంభమైన ప్రస్థానం సమూయేలుగారు చనిపోయేవరకు దేవుని చిత్తమేదో ఎరిగి ప్రవర్తించారు, అంతేకాకుండా ఇశ్రాయేలీయులు వారిపట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోడానికి, ఇంకా జరగబోయేవి తెలుసుకోడానికి ఆయన దగ్గరకే వచ్చేవారు, దీర్ఘదర్శి అయ్యారు!!

దావీదుగారు: దేవా నీ చిత్తమును నెరవేర్చుటయే నాకు సంతోషము అంటున్నారు. కీర్తన 40:3; ఇంకా అంటున్నారు సర్వసృష్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుతున్నాయి. 103:21;

 

   ఇక యేసుప్రభులవారు కూడా మనకు నేర్పిన పరలోక ప్రార్ధన రెండో పాదములో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమిమీదను నెరవేరును గాక అని నేర్పించారు! మత్తయి 6:10; 

యేసుప్రభులవారే మనకు ఆదర్శం! యోహాను సువార్తలో చూసుకుంటే పదేపదే ఆయన చెప్పేవారు : నాతండ్రి చిత్తమును నెరవేర్చుటకె నేను వచ్చాను/ నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే వచ్చితిని యోహాను 4:34, 6:39, 6:41; ఆయన భూలోకానికి వచ్చి సిలువ మరణం పొంది, మన పాపపరిహారం కోసం యాగమై, బలియాగమైపోవడం తండ్రి చిత్తము. యేసుప్రభులవారు అదే చేసారు. మరి మనం ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? ఇంతకీ మనపట్ల ఆయన చిత్తమేమిటో తెలుసుకొంటున్నామా?

 

    బైబిల్ లో మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమేదో వ్రాయబడియుంది వాటిలో కొన్నింటిని చూద్దాం! 

1) 1 థెస్సలోనిక 4:3:  మీరు పరిశుద్దులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము! జాగ్రత్త ప్రియ దైవజనమా! ఊరకనే నోటిమాటికి ప్రభువా! నీ చిత్తాన్ని బయలుపరచు అని ప్రార్ధనచేస్తూ, జారచోర క్రియలు చేసారా ఖభడ్దార్, దేవుడు ముందే చెప్పారు తన చిత్తమేమిటో! కాబట్టి జారత్వం నుండి దూరముగా ఉందాము!

 

2) 1 థెస్సలోనిక 4:5  తన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము! పాపానికి దూరంగా నీ తనువూ, మనస్సు, ఆత్మను కాపాడుకోవడం, ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడమే దేవుని చిత్తము!

 

3) ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునిచిత్తము!  కష్టమైనా, సుఖమైన ఏదైనా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి మనం. అదే దేవుని చిత్తం! 1 థెస్సలోనిక 5:18;

 

4) దేవునిమాటలు వక్రీకరించి, భోదించేవారి నోరు మూయించడమే దేవునిచిత్తము! 1 పేతురు 2:15; చాలామంది నేడు social media లో దేవునిమీద బురదచల్లుతుంటే చాలామంది జవాబిస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం! ఇది దేవుని చిత్తం!

 

  కాబట్టి ప్రియబిడ్డా! నీ పట్ల దేవుని చిత్తమేదో అడిగి తెలిసికొని అలా జీవించు! అలాగే మనుష్యులందరి పట్ల దేవునిచిత్తమును గ్రహించి రకంగా నడచుకో! చివరిగా యేసుప్రభులవారే తననుతాను తగ్గించుకొని: ఇదిగో పుస్తకము చుట్టలో వ్రాయబడినట్లు నేను వచ్చాను, నీ చిత్తము జరిగించు అన్నారు. హెబ్రీ 10:7,9;  కాబట్టి నీవు కూడా అలాగే తండ్రి! నీ చిత్తము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ చిత్తము నాకు చెప్పు, చేస్తాను అని ప్రార్ధించి, అలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించు!

దేవుడు నిన్ను అత్యధికముగా వాడుకోబోతున్నారు!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*41 భాగం*

*దేవుని చిత్తము-2*

1థెస్స 4:—5

3. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

4. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

5. పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు. ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  గతభాగంలో దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం చూసుకున్నాము!

 

   ఇక రెండవ విషయం ఏమిటంటే మూడు నుండి ఐదు వచనాలలో దేవుని చిత్తము ఏమిటి అనేది పౌలుగారు చెప్పారు- దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మనపట్ల దేవుని చిత్తము అంటున్నారు పౌలుగారు!

 

మొట్టమొదటి దేవుని చిత్తము ఏమిటంటే: *మీరు (మనము) పరిశుద్దులగుటయే దేవుని చిత్తము అంటున్నారు*! గమనించాలి పరిశుద్దులగుట అంటే ఏమిటో కూడా మనం బుర్రలు పాడుచేసుకోకుండా దేవుని దృష్టిలో పరిశుద్దులగుట ఏమిటో చెప్పేశారు- పరిశుద్దులగుట అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అంటున్నారు!

 

రెండవ దేవుని చిత్తము ఏమిటంటే:  *పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎల్టు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము!*

 

               ( గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇంతవరకు మనం దేవుని చిత్తమేమిటో తెలుసుకుని ఆయన చిత్తప్రకారం చెయ్యాలి అనేది నేర్చుకున్నాము! అయితే ఇక్కడ రెండు దేవుని చిత్తముల కోసం ఒకసారి చూసుకుందాము!

 

మొదటిది: *పరిశుద్దులుగా ఉండటమే దేవుని చిత్తము*! అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము! ఎందుకు జారత్వమునకు దూరంగా ఉండమంటున్నారు అంటే బైబిల్ చెబుతుంది మానవులు చేసే పాపములు ఒకడే చేస్తాడు అయితే జారత్వం అనేది ఇద్దరు కలిసి చేస్తారు! అంతేకాకుండా దేహము దేవునివలన మనకు అనుగ్రహించబడింది. దేహము దేవుని దేవాలయం కాబట్టి దేహముతో దేవున్ని మహిమ పరచండి అని చెబుతుంది బైబిల్!  ఇంకా ఎవడు దేవుని ఆలయమును పాడుచేస్తాడో వాణ్ని దేవుడు పాడుచేయును అని కూడా చెబుతుంది!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:13,15,16,17,18,19,20

13. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

15. మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

16. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమైయున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17. అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

 కాబట్టి ఎవడైతే జారత్వము, వ్యభిచారము చేస్తాడో /చేస్తాదో వాణ్ని/ స్త్రీని దేవుడు పాడుచేయ్యడమే కాకుండా పాపం చేసేవాడు పాపానికి సాతానుకి దాసులు కాబట్టి వారికి పరలోకంలో ఎటువంటి పాలుపంపులు ఉండవు!

ఒకసారి చూడండి 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

 

ప్రకటన గ్రంథం 21: 8

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

 

ప్రకటన గ్రంథం 22: 15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

 

ఇంకా శరీరకార్యములు చూడండి...  Galatians(గలతీయులకు) 5:19,20,21

 

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇవి చేసేవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకోలేరు అంటున్నారు చూడండి!

 

కాబట్టి జారత్వము జరిగించే వారు నరకానికి పోతారు కాబట్టి దీనినుండి దూరంగా పోదాము! 

 

ఇక నాలుగు అయిదు వచనాలలో మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలే సమయం దొరికితే కామాభిలాషయందు కాకుండా పరిశుద్దత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తము అంటున్నారు. ఇది రెండో దేవుని చిత్తము!!!

 

చూడండి అన్యజనుల వలే నీవు కూడా కామ సంబంధమైన విషయాలలో ఆసక్తిని చూపించక అనగా కేవలం సంభోగం చెయ్యడమే కాకుండా అటువంటి విషయాలను చూడటం, కావాలనుకోవడం, వాటికి సంబంధించిన విషయాలు చదవడం చూడటం, అనగా మీడియాలో టీవీలో అలాంటి సినిమాలు చూడటం, ఫోన్లో అలాంటి బొమ్మలు చూడటం వీడియోలు చూడటం కూడా తప్పే కాబట్టి వాటిని విసర్జించి పరిశుద్దత విషయంలో నీ ఘటమును అనగా శీలాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము అంటున్నారు! లోకస్తులు ప్రవర్తించినట్లు నీవు చేయక, దేవునికి ఇష్టమైన విధానముగా పరిశుద్ధంగా ఉండమంటున్నారు! ఎందుకు? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము కాబట్టి!

హెబ్రీయులకు 12: 14

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

 పరిశుద్ధమైనదే పరలోకం వెళ్తుంది కాని అపరిశుద్ధమైనది అందులో అనగా పరలోకంలో ప్రవేశించదు అని ప్రకటన గ్రంధంలో వ్రాయబడింది!

ప్రకటన గ్రంథం 21: 27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

అందుకే పరిశుద్ధంగా ఉండాలి! పరిశుద్ధంగా ఉండాలి అంటే జారత్వానికి, కామాభిలాషకు దూరంగా ఉండాలి! అలా దూరంగా ఉంటూ పరిశుద్ధతకు సంబంధించిన విషయముల యందు ఆసక్తిని కలిగి ఉండటమే దేవుని చిత్తము అంటున్నారు!

 

  అయితే ఇది సాధ్యమా? అంటే సాధ్యమని గతభాగాలలో చూసుకున్నాము! పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఆత్మద్వారా నడిపింపబడి ఆత్మద్వారా జీవిస్తే అది సాధ్యమని, ఇంకా నీ ఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీవాక్యమును ఉంచుకొని యున్నాను అని వ్రాయబడిన విధంగా హృదయమంతా వాక్యంతో నిండిపోయి ఉంటే పాపమునకు తావు ఇవ్వలేవు కాబట్టి వాక్యముతో నింపబడి వాక్యానుసారమైన జీవితం జీవిస్తే పరిశుద్ధముగా జీవించగలవని గతభాగాలలో చూసుకున్నాము!

 

    ఇలా పైన చెప్పిన రెండు చిత్తముల ప్రకారం జీవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు కదా: మొట్టమొదట మనకు కనబడే వారు యోసేపు గారు! పాపము వచ్చి ఆయనను కౌగలించు కొంటే విడిచి పెట్టి పారిపోయారు! తన యజమానుడు భార్య తనతో పాపం చేద్దామని బలవంతం చేస్తే బలే చాన్సు దొరికింది అనుకోలేదు! నేను దేవునికి వ్యతిరేఖమైన కార్యం చేయలేను అని చెప్పి తన పైబట్టను వదిలి పారిపోయారు పాపమునకు దూరంగా! అలా పారిపోయినందుకు వెంటనే శిక్ష పడిందిచేయని నేరానికి రాజద్రోహం శిక్ష! చివరకు ఆయన భక్తి ఆయన పరిశుద్ధత ఆయనను ఈజిప్టు దేశానికి గవర్నర్ గా చేసింది! లేని పోస్టు యోసేపు గారికోసం సృష్టించబడింది!  జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తము అంటే నిజంగా *జారత్వానికి దూరంగా పారిపోయారు*! ఇంకా పరిశుద్దత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకున్నారు యోసేపు గారు! ఇదే దేవుని చిత్తాన్ని చేయడం!

 

మరో వ్యక్తి: దేవునిచేతనే నా ఇష్టానుసారుడు అని పిలిపించు కున్న వ్యక్తి: ప్రార్ధన చేసే సమయంలో ప్రార్ధన చేయకుండా మేడమీద షికార్లు చేస్తుంటే పాపం కనిపించింది! * పాపం దగ్గర నిలిచిపోయాడు ఈయన*! స్నానం చేసే స్త్రీని కోరుకుని ఇంటికి పిలిపించుకుని స్త్రీతో పాపం చేశారు! వెంటనే దేవుని శాపాన్ని పొందుకున్నాడు! జీవితాంతము ఒక మచ్చ పొందుకున్నాడు! ఈయన కేవలం దేవునికి ఇష్టుడు కాబట్టి దావీదుగారి మనస్సేమిటో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అతని పాపాన్ని పరిహరించారు లేకపోతే ఈయన కూడా నరకానికి పోయి ఉండేవారు! అందుకోసం తన కన్నీటితో దేవుని పాదాలు కడిగారు! ఎంతగా ఏడ్చారంటే తన పాపములకు పశ్చాతాపంతో తన కన్నీటితో తన పరుపు కొట్టుకుపోయేటంత ! దేవుణ్ణి బ్రతిమిలాడుకొనే పద్దతి ఇదొక్కటే! మరో మార్గం లేదు! ఒకవేళ నీవు కూడా దావీదు గారిలా పాపం దగ్గర నిలిచిపోతే, పాపాన్ని వదుకోలేకపోతే నీవు కూడా ఇలాగే దేవుని పాదాలు పట్టుకోవడమే చెయ్యాలి! కారణం నీకు నీవుగా పాపాన్ని వదలలేవు! నీకు సత్తా లేదు! కారణం ఎప్పుడైతే నీవు పాపం చేశావో అప్పుడే నీవు సాతానుగాడి కబంధహస్తాలలోనికి పోయావు! కాబట్టి కేవలం యేసుక్రీస్తుప్రభులవారి సిలువ మాత్రమే పాప బంధకాలను విడిపించగలదు! కాబట్టి నేడే ఆయన సిలువ దగ్గరకు వస్తావా? వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలవా?

 

    మరోవ్యక్తి: దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి! కొన్నివేల మందిని ఒంటిగా చంపిన వ్యక్తి! గాడిద దవడ ఎముకతో ఒక సైన్యాన్ని చంపి రెండు కుప్పలుగా వేసిన పరిశుద్ధాత్మ పూర్ణుడు! జారత్వంలో పడిపోయాడు! వేశ్య దగ్గర ఆగిపోయాడు! మొదటగా తల్లిదండ్రులు వద్దు అన్న వివాహాన్ని చేసుకున్నాడు! చివరకు వేశ్యా సాంగత్యం తన కళ్ళు పీకించుకోవడానికి, బంధీగా మారడానికి చనిపోవడానికి కారణం అయ్యింది! దేవునిచేత ఏర్పాటు చేయబడిన వ్యక్తే, దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తే, దేవునికోసం బలమైన కార్యాలు చేసిన వ్యక్తే గాని జారత్వం ఆయనను సర్వ నాశనం చేసింది! అంత గొప్ప వ్యక్తే జారత్వం దగ్గర తట్టుకోలేక పోయాడు నీవు నేను ఎంత? అందుకే ఎందరాయన ఆత్మతో నడిపించ బడతారో వారంతా దేవుని కుమారులు అవుతారు అంటున్నారు! ఆయన కుమారుడవు అయితే ఆయన లాగే జీవిస్తావు! పాపాన్ని త్రోసివేసి పాపం నుండి పారిపోతావు! * వ్యక్తి పాపంలో పడిపోయాడు* చనిపోయాడు! అయితే చివర్లో కళ్ళు ఊడబీకించు కున్నాక బుద్ధి వచ్చి కన్నీటితో దేవుని పాదాలు కడిగాడు కాబట్టి పరలోకం వెళ్లి ఉండవచ్చు అని నా ఉద్దేశం కారణం హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఈయన పేరు ఉంది కాబట్టి బహుశా దేవుడు ఈయనకు పరలోకం ఇచ్చి ఉండవచ్చు! అయితే దానికి కూడా కేవలం వ్యక్తి పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్ధన వలననే సాధ్యమయ్యింది!

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! నీవు పాపం నుండి పారిపోతున్నావా? లేక పాపం దగ్గర దావీదు గారిలా నిలిచిపోతున్నావా? లేక సంసోను గారిలా పాపంలో పడిపోతున్నావా? సంసోనులా జారత్వము వ్యభిచారం స్త్రీల కాంక్ష ఉంటే నీవెంత వాడవైనా పాపిగా మారి ఆత్మీయ కళ్లు పీకించుకుని నరకానికి పోతావు జాగ్రత్త!!!

నేడే నిన్నునీవు పరిశీలన చేసుకుని దేవుని పాదాల వద్దకు ఆయన సిలువచెంతకు చేరు!

రకంగా దేవుని చిత్తాన్ని చేద్దాం!

ఆయనకు ఇష్టులుగా జీవించి పరలోకం పోదాము!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*42 భాగం*

*దేవుని చిత్తము-3*

1 థెస్సలోనిక 5:18;

ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవునిచిత్తము!  కష్టమైనా, సుఖమైన ఏదైనా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి మనం. అదే దేవుని చిత్తం!

 

      ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు. ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!   మరియు దేవుని చిత్తము ఏమిటో చూసుకుంటున్నాము! ఈరోజు మరో దేవుని చిత్తము ధ్యానం చేద్దాం!

               ( గతభాగం తరువాయి)

     ప్రియులారా! ఇక మూడవ దేవుని చిత్తము ఏమిటంటే ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము! ప్రతీ విషయములో అంటే

 సుఖాలు కలిగినా

కష్టాలు కలిగినా

ప్రమోషన్ వచ్చినా

ఉన్న ఉద్యోగం పోయినా

రోగం వచ్చినా

రోగం పోయినా

భర్త తిట్టినా

భార్య అలిగి పుట్టింటికి పోయినా

యాబై మంది బాప్తిస్మము పొందినా

సువార్త ప్రకటిస్తుంటే గుండగా తన్నేసినా

ముఖం మీద ఉమ్మి వేసినా

ఎందుకు పనికిరాని వాడవని నిన్ను తిట్టినా

పట్టలేని ఆనందం కలిగినా

ఎనలేని వేదనలు కలిగి ఆపుకోలేనంత దుఖం కలిగినా

సమయమందైనా స్తితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి అంటున్నారు!

 

కేవలం కష్టము నందు స్తుతింతు నష్టము నందు తలంతూ అంటూ పాటలు పాడడమే కాదు, నిజంగా చేసి చూపించాలి స్తుతించాలి!

 

మీరు అనొచ్చు, రాయడం చెప్పడం సులువేగాని అనుభవిస్తే తెలుస్తుంది అంటారేమో! పౌలుగారు ఊరికినే అలా చెప్పలేదుఅనుభవించి- అలా కష్ట నష్టాలలో స్తుతించడం వలన కలిగే అనుభూతులు ఆశీర్వాదాలు పొందుకుని అప్పుడు రాస్తున్నారు ఈమాట!

   ఇంకా గుర్తుకు రాలేదా? అపొ 16 ప్రకారం ఇదే మాసిదోనియా ప్రాంతంలో రోమా కోలనీ అయిన ఫిలిప్పీ పట్టణం లో సువార్త ప్రకటిస్తుండగా పుతోను అనే దయ్యం పట్టి సోదె చెబుతున్న ఒక యవ్వనస్తురాలు కనిపిస్తే త్రయానికి జాలికలిగి యేసునామంలో దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమెను స్వస్తపరుస్తారు! ఆమె యజమానులకు లాభం పోయింది కాబట్టి పౌలుగారిని సీలగారిని పట్టుకుని గుండగా తన్నేసి చెరసాలలో వేసేస్తారు! అయితే గతభాగాలలో చెప్పినట్లు పౌలుగారు ఎందుకిలా జరిగింది, దేవుని సేవ కదా చేస్తున్నాము, దేవుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు, అనుకుంటూ విచారపడలేదు! మమ్మల్ని ఇన్ని భాధలు పెడతారా అంటూ వారికి శాపనార్ధాలు కూడా పెట్టలేదు, సరికదాఅప్పటినుండి అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూ వారికి అనగా మిగతా ఖైదీలకు  సువార్త ప్రకటిస్తూ ఉంటే పరలోక దూతలు కదలివచ్చారు వారి విశ్వాసాన్ని చూసి! ఏమి విశ్వాస వీరులో కదా అంటూ పరలోకం మొత్తం మురిసిపోయారు! దెబ్బకు గొప్ప భూకంపం కలిగి వారి సంకెళ్ళు ఊడిపడ్డాయి! ఇదీ విశ్వాసం! ఇదీ తెగింపు! ఏం జరిగినా గాని దేవుణ్ణి స్తుతించడం మానను! ఆయన సువార్త ప్రకటన మానను అనే తెగింపు! ఇన్ని భాధలు కలిగినా దేవుణ్ణి స్తుతించారు తప్ప ఏం మాయదారి దేవుడువయ్యా నీవు అని అనలేదు! అందుకే ప్రతీ విషయములో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము అని చెబుతున్నారు! ఇలాంటి విశ్వాసము, ఆత్మీయ స్తితి నీకుందా ప్రియ చదువరీ??!!!

 

       మరో వ్యక్తి ఉన్నారు బైబిల్ లో! ఈయనను దేవుడు పిచ్చోడు అనొచ్చు! భార్యా,పిల్లలు, సామ్రాజ్యము ఏదీ వద్దు! దేవుడుఅయన భజనలు చెయ్యడం! పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం! ఇదే పని! అందుకే గొర్రెలు మధ్య నివసించే ఈయనను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారు! జీవితంలో ఎన్నెన్నో కష్టాలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు కలిగాయి గాని ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు! శ్రమలో సంతోషం అంటున్నారు! భక్తుడు జీవితమంతా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు! అభిషేకించి నప్పుడు పాట రాసి పాడారు! మామ తరిమి నప్పుడు పాటలు రాశారు! దోయేగు తనమీద చాడీలు చెప్పినప్పుడు స్తుతించారు! తనసొంత కొడుకు తనమీద తిరుగాబడినప్పుడు స్తుతించారు! మందసాన్ని తనకు దగ్గరకు రప్పించుకుని ఇలా పాటలు పాడండి అంటూ పాటలు రాసి ఇచ్చారు! ఒకవిధంగా చెప్పాలంటే నవరసాల్లలో ఒకరి రెండు వదిలేసి అన్ని రసాలలో, అనుభవించి దానిద్వారా పాటలు పాడారు ఆయన! అందుకే దేవునికి ఇష్టానుసారుడు అయిపోయారు దావీదు గారు! కష్టాలలో స్తుతిస్తూ ఇరుకులో స్తుతిస్తూ అపనిందలు కలిగినా స్తుతిస్తూ అన్నింటిని సహించి అన్నింటిలో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు అందుకే ఒక స్తుతి పాటలు పాడే వ్యక్తి సైన్యానికి నాయకుడు అయ్యారు! నాయకుడు రాజు అయ్యారు! రాజు చక్రవర్తి అయ్యారు! చక్రవర్తి ప్రవక్త అయ్యారు! ప్రవక్త దైవజనుడు అయ్యారు! చూశారో దేవుడు ఎన్ని రకాలుగా వ్యక్తిని వాడుకున్నారో దేవుడు! పౌలుగారు దేవుని చిత్తమెరిగి ప్రవర్తించారు! దావీదు గారు దేవుని చిత్తమెరిగి ప్రవర్తించారు! నీ చిత్తము చేయడమే నాకిష్టము అంటున్నారు! పౌలుగారు ఇంకా ఏమని చెప్పారో చూద్దాం!

హెబ్రీ 13:15

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

 

కొలస్సీ :17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 

ఫిలిప్పీ 4:6

దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

 

ఎఫెసి 5:20

మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

 

కీర్తనాకారుడు అంటున్నారు 50:14

దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

 

కీర్తనలు 115: 18

మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

 

కీర్తనలు 117: 2

కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతిం చుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.

 

 

   ప్రియ దైవజనమా! నీ పరిస్తితి ఎలాగుంది? సమస్య వచ్చినా ఎన్ని కష్టనష్టాలు కలిగినా దేవుని కోసం నిలబడుతూ ఆయనను స్తుతించే స్తితిలో ఉన్నావా? దీనిని మనమంతా అభ్యసించవలసిన అవసరం అనగా మన జీవితాలలో పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది! అలాగయితే నీవు ధన్యడవు!!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*43 భాగం*

1 థెస్సలోనిక 4:6

విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!   

 

           ఇక నాల్గవ వచనంలో ఈవిషయంలో ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై పత్రి దండన చేయువాడు అంటున్నారు!

 

          గమనించాలి విషయంలో ఎవడును అతిక్రమించ కూడదు తన సహోదరునికి మోసం చేయకూడదు అంటున్నారుదేనికోసం పౌలుగారు మాట్లాడుతున్నారు?

5 వచనాలు చూసుకుంటే మీరు పరిశుద్దులగుటయే అనగా జారత్వము నుండి దూరముగా ఉండుటయే దేవునిచిత్తము అంటూ, ఇంకా కామాభిలాష యందు కాక పరిశుద్ధత విషయంలో మీ ఘటమును కాపాడుకోవడం దేవుని చిత్తము అన్నారు! అనగా ఆరవ వచనంలో పౌలుగారు జారత్వం కోసం మాట్లాడుతున్నారు అని అర్ధం అవుతుంది!  ఏమంటున్నారు? విషయంలో ఎవడు అతిక్రమించకూడదు తన సహోదరునికి మోసం చెయ్యకూడదు అంటున్నారు! అనగా సహోదరుని జారత్వం విషయంలో మోసం చెయ్యకూడదు అంటే ఎవడును తన సోదరుని భార్యతో పాపం చెయ్యకూడదు అంటున్నారు! ఎందుకంటే మేము పూర్వము మీతో చెప్పినట్లు ప్రభువు వీటన్నిటి విషయంలో  ప్రతి దండన చేయువాడు అంటున్నారు! ఎవడైనా తన సహోదరుని భార్యతో జారత్వం చేశాడా లేకా తన సోదరి భర్తతో వ్యభిచారం చేసిందా ఖబడ్దార్ దేవుడు వీటి విషయంలో ప్రతిదండన చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు!

 

               గమనించాలి విషయంలో వ్యభిచారం చేసేవారు తమకే కాకుండా వైవాహిక జీవితంలో తమ జీవిత భాగస్వాములకు కూడా అనగా తన భార్యకు లేక భర్తకు కూడా కీడు చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని గమనించాలి!

 

 ఒకసారి ఎఫెసి పత్రిక 5:56 లో పౌలుగారు ఏమని రాస్తున్నారో చూద్దాం!....

5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి (మూలభాషలో- అవిధేయత కుమారుల మీదికి) వచ్చును ...

చూశారా ఇలాంటి పనులు చేస్తే దేవుని రాజ్యంలో వారుకు పాలుపంపులు లేవు అని గ్రహించాలి!

 

ఇంకా మరిన్ని రిఫరెన్సులు చూద్దాం!

1కొరింథీ 6:9—11

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

11. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

 

గలతీ 5:19—21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

కొలస్సీయులకు 3: 5

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను(లోభత్వమును) చంపివేయుడి.

కొలస్సీయులకు 3: 6

వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.

 

హెబ్రీయులకు 13: 4

వివాహము అన్ని విషయములలో (లేక, అందరిలో) ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

 

అయితే ఎందుకు ఎక్కువ ప్రతిదండన కలుగుతుంది అని పౌలుగారు చెబుతున్నారు అంటే హెబ్రీ 10:2627 లో సత్యము తెలుసుకుని సత్యమార్గంలో ప్రయాణం చేస్తున్న నీవు దారి తప్పితే మరలా విషయంలో దేవుని కుమారుని సిలువ వేసి ఆయన గాయం రేపి ఆయన రక్తాన్ని కల్లజూస్తున్నావు అన్నమాట!....

 

26. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని

27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.

29. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

 

ఇక యోహాను భక్తుడు దీనికోసం ఏమంటున్నారు అంటే నిజంగా దేవుని రక్తంలో కడుగబడి దేవుని కుమారా/ కుమార్తెలుగా జీవిస్తున్నవారు ఆయన వాక్యానుసారంగా ఉన్నవారు ఇలాంటి పాపం చెయ్యరు! పేరుకు మాత్రం క్రైస్తవుడుగా జీవిస్తున్న వారు మాత్రమే అలా చెయ్యగలరు అంటున్నారు

 

 1యోహాను :9—10

9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.

10. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

 

ఇదిగో ఇలాంటి పనులు చేశారు ఇశ్రాయేలు ప్రజలుచివరకు ఏమయ్యారు? నాశనమయ్యారు! బానిసలుగా పరదేశానికి కొనిపోయారు! ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి! సహోదరుడు అనగా తన సొంత సోదరుని భార్య మాత్రమే కాదు నీ పొరుగువాడు కూడా నీ సహోదరుడే! వానికి అన్యాయం చేసినా నీ సహోదరునికి అన్యాయం చేసినట్లే దేవుని దృష్టిలో!

 

యిర్మియా 5:8—9

8. బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును

9. అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.

 

యేహెజ్కేలు 22:10-12

10. తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.

11. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపర చును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహో దరిని చెరుపుదురు.

12. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

 

యెహేజ్కేలు 33: 26

మీరు ఖడ్గము నాధారము చేసికొనువారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా....

 

అసలు దేవుని ఆజ్ఞ ఏమిటో చూద్దాం!

 

నిర్గమకాండము 20: 17; ద్వితీ 5:21

నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.

 

లేవీ 18:16,20

16. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.

20. నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.

 

లేవీయకాండము 20: 21

ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.

 

సామెతలు 6: 29

తన పొరుగువాని భార్యను కూడువాడు ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.

 

  కాబట్టి ఇలాంటి జారత్వమునకు దూరంగా పారిపోదాము యోసేపువలె! క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం! పరిశుద్ధమైన జీవితాలు కలిగి పరిశుద్ధుడైన ప్రభువును హత్తుకుందాం! పరిశుద్ధ దూతలతో కూడా ఎత్తబడి ప్రభువును సేవిద్దాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*44 భాగం*

1 థెస్సలోనిక 4:7—8

7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!   

 

    ప్రియులారా! రెండు వచనాలలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు పౌలుగారు! ప్రతీ క్రైస్తవ విశ్వాసికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది! నేను ఇందంతా ఎందుకు చెబుతున్నాను అంటే పరిశుద్దులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి ఆయన మనలను పిలువలేదు అంటున్నారు! ఒకవేళ విషయాన్ని ఎవడైనా ఉపేక్షిస్తే లేదా త్రోసివేస్తే లేక పట్టించుకోకపోతే ఇంగ్లీషులో చెప్పాలంటే ఇగ్నోర్ చేస్తే వాడు మనుష్యులను అనగా తమ సహోదరులను పొరుగు వారిని ఉపేక్షించడం లేదు గాని మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు లేక దేవుణ్ణి త్రోసివేస్తున్నాడు అంటున్నారు పౌలుగారు!

   చూడండి దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నారు అంటే మనము పరిశుద్దులుగా ఉండటానికి పిలిచారు గాని అపవిత్రులుగా ఉండటానికి కానేకాదు! ఎందుకు? నేను పరిశుద్దుడను గనుక మీరును పరిశుద్దులుగా ఉండాలని దేవుని ఖండితమైన ఆజ్ఞ! దానిని మీరారా? ఆజ్ఞాతి క్రమమే పాపము కాబట్టి పాపమునకు వచ్చు జీతం మరణం అనగా నిత్యనరకాగ్ని గుండమని మరచిపోవద్దు! ...

లేవీయకాండము 11: 45

నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

 

1యోహాను 3: 4

పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

 

  ఇంతకీ అపవిత్రము అనగాదేవునికి ఇష్టం లేని పనులు! విగ్రహారాధన లాంటి పాపములు మాత్రమే కాకుండా గలతీ పత్రిక 5లో వివరించిన శరీర కార్యాలన్నీ ఆయనకు అపవిత్రములే!.....

 

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

   అంతేనా చివరికి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు కూడా దేవునికి అసహ్యమే.......

1తిమోతికి 4: 7

అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.

వీటిని చేసినా దేవుని ఉగ్రత వస్తుంది అని మరచిపోవద్దు!

 

  చూడండి దేవుడు మనలను పవిత్రులుగా పరిశుద్దులుగా ఉండటానికే పిలిచారు

రోమా 1:2

దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.

 

1కొరింథీ 1:2

కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

  కాబట్టి మనము పరిశుద్దముగా ఉండటానికే పిలువబడ్డాము కాబట్టి పరిశుద్ధమైన పవిత్రమైన పనులు చేద్దాం!

 

 అయితే ఎఫెసీ సంఘానికి పౌలుగారు ఉత్తరం రాస్తూ అంటున్నారు కొంతమంది అపవిత్రులుగా ఉండిపోయి దానిని అత్యాశక్తితో జరిగిస్తూ మరింత అపవిత్రులుగా మారిపోడానికి కాముకత్వమునకు తమ దేహములను అప్పగిన్చుకొన్నారు!  వారు అంధకార సంబంధమైన వారు అంటున్నారు 4:1819 అయితే మీరు నూతన పరచబడిన వారు కాబట్టి ఇంకా దేవుని సంఘంలో ఒకరికొకరము అవయవాలు కాబట్టి అబద్దాలు మాని పొరుగు వానితో సత్యమే చెప్పాలి అంటూ (2325), కోపపడుడి గాని పాపం చేయవద్దు అంటూ సాతానుకి చోటు ఇవ్వద్దు అంటూ 291 వచనాలలో అంటున్నారు....

29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

 

 ఇంకా అంటున్నారు ఎఫేసి 5:25 లో ఎంతో శ్రేష్టమైన మాటలు రాస్తున్నారు  క్రీస్తు మిమ్మును ప్రేమించి తనకొరకు పరిమళ వాసనగ ఉండటానికి మిమ్మును ఏర్పరచుకుని దానికోసం వెల చెల్లించడానికి తనను తాను దేవునికి అర్పణగా చేసుకున్నారు కాబట్టి మీలో జారత్వము అపవిత్రత ఉండకూడదు ఎందుకంటే ఇదే పరిశుద్దులకు తగినది అంటున్నారు.........

2. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

3.మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక,వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

 

కొలస్సీయులకు 3: 8

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

 

ప్రకటన 21:8, 27

8. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

27. గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

ప్రకటన గ్రంథము 22:15

కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

కాబట్టి పరిశుద్దులుగా ఉందాము!

 

ప్రవక్తయైన యెషయా గారు ఇలా ప్రవచిస్తున్నారు: 35:8

అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

 

ఇకచివరగా ఎందుకు పవిత్రంగా జీవించాలి అంటే మీ దేహము దేవుని ఆలయం, అది దేవుని వలన ఇవ్వబడింది కాబట్టి దేహముతో దేవుని మహిమ పరచండి అంటూ ఎవడైతే దేవుని ఆలయమును పాడుచేయునో వానిని దేవుడు పాడుచేయును ఖబడ్ధార్ అంటున్నారు!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17

16. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆలయమైయున్నారు (లేక-మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:15,19,20

15. మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

   ఇప్పుడు మీరు అనొచ్చు అలా పవిత్రమైన జీవితం జీవించడం సాధ్యమా? అంటే సాధ్యమే! ఎలా సాధ్యమో గత భాగాలలో వివరించడం జరిగింది! వాక్యానుసారమైన జీవితం కలిగి, హృదయం నిండా వాక్యమును నింపుకుని, ఆత్మానుసారమైన జీవితం కలిగి ఆత్మతో నింపబడుతూ ఉంటే ఇది సాధ్యమే!

 

మరి ఎవరైనా అలా జీవించారా?

యోసేపు గారు తన పరిశుద్ధతను కోల్పోలేదు! అలా కోల్పోనందుకు శిక్షను అనుభవించారు కాని దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నారు!

 

సమూయేలు గారు పవిత్రమైన జీవితం జీవించారు!

 

దావీదుగారు పరిశుద్ధమైన జీవితం జీవించి దేవా నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో! నీకు ఆయాసమైన మార్గామేదైన ఉంటే చెప్పు ప్రభువా అంటున్నారు!

 

యోబు గారు కూడా నాలో ఇలాంటి తప్పులేమైనా ఉంటే నిరూపించండి అంటూ సవాలు చేశారు!

 

దానియేలు గారు, షడ్రాక్ మేషాక్ అబెద్నేగో లు పవిత్రమైన జీవితం జీవించారు!

 

ఆది అపోస్తలులు జీవించారు!

 

చివరకు మన ప్రియ రక్షుడైన యేసుక్రీస్తుప్రభులవారు నిందారహితముగా జీవించడమే కాకుండా నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు అంటూ సవాలు విసిరారు!

 

 మరి వీరంతా పరిశుద్దులుగా జీవించారు కాబట్టి నీవుకూడా ప్రయత్నం చేస్తే నీవు కూడా పరిశుద్ధంగా జీవించగలవు! అందుకే వచనాలలో దేవుని చిత్తముకోసం రాస్తూ పౌలుగారు చెబుతున్నారు పరిశుద్ధత విషయంలో తన ఘటమను ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము అంటున్నారు!

 

యాకోబు గారు చెబుతున్నారు భక్తి యొక్క నిర్వచనము చెబుతూ చివరలో ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన ఘటమును కాపాడుకోవడమే భక్తి! (1:27)

 

మరి ఇటువంటి భక్తి పరిశుద్ధత నీకుందా?

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*45 భాగం*

*దేవుడు ఎందుకు పిలుచుకున్నారు*

1 థెస్సలోనిక 4:7—8

7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.

8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!   

 

        (గతభాగం తరువాయి)

 

    ఇక సంధర్బంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను: పౌలుగారు ఇంతకీ మనలను దేవుడు ఎందుకు పిలుచుకున్నారు లేక ఏర్పరచుకున్నారు అనేది చెబుతూ ఆత్మావేశుడై ఒక్కక్క చోట ఒక్కో ప్రత్యక్షత కలిగిన మాట చెబుతున్నారు

ఇక్కడ అనగా 4:7 లో పరిశుద్దులుగా ఉండటానికే దేవుడు మనలను పిలుచుకున్నారు అంటున్నారు

 

మీదన చెప్పిన రోమా 1:2 ప్రకారం, 1కొరింథీ 1:2 ప్రకారం కూడా పరిశుద్దులుగా ఉండటానికే దేవుడు మనలను పిలుచుకున్నారు!

 

ఇక రోమా 1:7 లో *యేసుక్రీస్తు వారుగా ఉండటానికి మనము పిలువబడి యున్నాము* అంటున్నారు!

 

మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

 

ఇక 1కొరింథీ 7:15 లో *సమాధానముగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నారు* గాని గొడవలాడుకోడానికి కానేకాదు

 

అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. *సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను* (అనేక ప్రాచీన ప్రతులలో-మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు.

 

ఇక గలతీ 5:13 లో *మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు* అంటున్నారు అయితే స్వతంత్రము శరీర క్రియలు చేసుకోడానికి కానేకాదు గాని ప్రేమకలిగి ఒకనికొకడు దాసులుగా ఉండండి అన్నారు.

గలతియులకు 5: 13

సహోదరులారా, *మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి*. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

 

 మరొక దగ్గర ప్రేమ విషయం లో తప్ప మరి దేనిలోనూ ఎవరి దగ్గర అచ్చి ఉండొద్దు అనగా అప్పు ఉండవద్దు అంటున్నారు!

రోమీయులకు 13: 8

ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

 

ఎఫెసీ 4:4 లో *ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి* అంటున్నారు

 

శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ప్రకారమే మీ పిలుపు విషయమై *యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.*

 

పేతురు గారు ఏమంటున్నారు:

*శ్రమలను శోధనలను అనుభవించడానికి పిలువబడ్డారు* 1పేతురు 2:21

 

ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

 

*ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు* 1పేతురు :9. కాబట్టి కీదుకు ప్రతి కీడు చేయవద్దు దూషణకు ప్రతి దూషణ చేయవద్దు అంటున్నారు!

 

*ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి* గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

 

అయితే యాకోబు గారు అంటున్నారు మనం *తన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము అంటున్నారు*....

యాకోబు 2: 5

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, *తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా*?

 

  అందుకే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా ఉండమని హెచ్చరిస్తున్నారు భక్తులు!...ఎఫెసి 4:2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,....

కారణం యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు కొద్దిమందే!

మత్తయి 22:14

కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

 

మరి పిలువబడిన వారికి కలిగే మేలులు ఏమిటి?

రోమా 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా *ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము*.

 

హెబ్రీ 9:15

హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, *పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును* పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

ప్రకటన 19:9

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను *గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము*; మరియు మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.

 

   ప్రియ దైవజనమా! నీవు పిలువబడిన పిలుపు ఏమిటో నీవు గుర్తించావా? ఇంత గొప్ప పిలుపును ఏర్పాటును నిర్లక్షం చేసి తిరిగి అపవిత్రతకు బానిసవై పోతావా?  2పేతురు 2: 22

కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

 ఇలా ఉంటావా లేక నమ్మకమైన వానిగా ఉంటావా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్షం చేస్తే ఎలాగు తప్పించుకోగలవు? హెబ్రీ 2:3;

కాబట్టి పిలుకు తగిన జీవితం జీవిద్దాం!

ఆయన రాకడకు సిద్దపడుదాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*46 భాగం*

1 థెస్సలోనిక 4:9—10

9. సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

10. ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు....

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక 9, 10 వచనాలలో పౌలుగారు ఎంతో ప్రాముఖ్యమైన విషయం కోసం చెబుతున్నారు! సహోదర ప్రేమ కోసం మీకు వ్రాయనవసరం లేదు ఎందుకంటే సహోదర ప్రేమను, ఒకనినొకడు ప్రేమించుకోవడం నేను మీకు నేర్పలేదు గాని దేవుడే మీకు నేర్పించారు అంటున్నారు! గతభాగాలలో చెప్పడం జరిగింది ప్రేమకోసం! వీరు రక్షించబడినప్పుడు దేవుని ఆత్మ అక్కడ సాక్షాత్కరించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి అని చూసుకున్నాం! అలా పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ కార్యములలో (ఆత్మఫలములో) మొట్టమొదటి కార్యం ప్రేమ అక్కడ విరివిగా పనిచేసింది! వారిని చూశి పౌలుగారి త్రయం ఎంతో ఆశ్చర్యపడటమే కాకుండా ఆనందపడ్డారు! దానినే ఇక్కడ పౌలుగారు మరోసారి నొక్కివక్కానిస్తున్నారు- సహోదర ప్రేమ కోసం మీకు వ్రాయనక్కరలేదు కారణం దానిని మేము మీకు నేర్పించకపోయినా పరిశుద్ధాత్మ కార్యము వలన మీరు నేర్చుకుని మాదిరిగా జీవించారు కాబట్టి మీరు ఇంకా అదే ప్రేమలో మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచూ ఉండమని ప్రోత్సహిస్తున్నారు! 

ఒక విషయం చెప్పనీయండి: దావీదుగారు ప్రార్ధన చేశారు కీర్తన 25:4—5

4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.

5. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

 

దానికి జవాబు యెషయా 54:13

నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

 

యోహాను 6: 46

వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

 

 1యోహాను 2: 27

అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు భోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).

 

  సరేఇక మూడో అధ్యాయం చివరి వచనంలో కూడా ఇలాంటి మాటనే వాడారు పౌలుగారు! ప్రేమలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రేమలో వర్ధిల్లాలి అని ప్రార్ధించి ఆశీర్వదించారు! దీనికోసం గతంలో చూసుకున్నాము కాబట్టి ముందుకు పోదాం! అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే సహోదర ప్రేమ కేవలం సంఘానికే వారు పరిమితి విధించుకోకుండా మాసిదోనియలో ఉన్న సహోదరులనందరిని మీరు ప్రేమించు చున్నారు అంటున్నారు!

ఆహా ఎంత గొప్ప సాక్ష్యమో కదా! నేడు ఇలాంటి సాక్ష్యము సంఘాలకు ఉందా? ఒక సంఘమంటే మరో సంఘానికి పడటం లేదు! ఒక కాపరి మరో కాపరికి పడటం లేదు అందుకే సంఘం వారు ఆరాధనలు, సభలు పెట్టుకుంటే మీరు వెళ్లొద్దు అని ఆజ్ఞాపిస్తున్నారు! ఇదా క్రీస్తుప్రేమ!? ఇదా క్రీస్తు నేర్పిన ప్రేమ విధానం? ఇందుకేనా క్రీస్తు మీకోసం శ్రమ పడింది? ఇందుకేనా మీ కోసం సిలువను భరించి తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండంటూ క్షమాభిక్ష పెట్టింది?  ఒక సంఘంలో ఒక విశ్వాసికి మరో విశ్వాసికి పడటం లేదు! తన కన్నా బాగా ప్రార్ధన చేస్తే అసూయ! తన కన్నా ముందుగా వస్తే అసూయ! పాష్టర్ గారు తనను పొగడకుండా మరొకరిని పొగిడితే అసూయ! పొరపాటున ఒకరి కాలు మరొకరికి తగిలితే కోపం తాపం! ఇదా క్రీస్తు ప్రేమ? ఈలాంటిదా యేసుప్రేమ? పాష్టర్ గారికి మరో పాష్టర్ గారికి ఏవిధమైన ఆస్తి తగాదాలు లేకపోయినా ఇద్దరు మాట్లాడుకోవడం లేదు సరికదా శత్రువులులా ముఖం తిప్పుకుని వెళ్లి పోతున్నారు! ఏపాపం తెలియని విశ్వాసులు కూడా కాపరుల వలన  మాట్లాడుకోకుండా శత్రువులులా తయారవుతున్నారు!

అసలు ఇక్కడ కలిసి ఉండలేని వారు పరలోకంలో కలిసి ఉండగలరా? ఉండలేరు!!!

 

ప్రియ దేవుని బిడ్డలారా ఇది యేసయ్య చూపిన, చెప్పిన ప్రేమ కానేకాదు!

నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించమన్నారు దేవుడు! లేవీ 19:18;

 ప్రేమలేని వాడు దేవుని చూడలేడు అన్నారు!

1యోహాను 4: 8

దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

 

1యోహాను 3: 14

మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

 

దేవుడే ప్రేమ అని వ్రాయబడింది!

 ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి సహోదరుని ప్రేమించక ద్వేషిస్తే వాడు వేషధారి అని కూడా చెప్పారు! తన సహోదరుని ద్వేషించే వాడు నరహంతకుడు అనే ఘోరమైన పదం వాడబడింది! 1యోహాను 3: 15

తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

నరహంతకుడు పరలోకం వెళ్ళడు అని తెలుసుకదా! కాబట్టి ఇప్పుడు సహోదరుని ప్రేమించక ద్వేషిస్తే వాడు నరహంతకుడు అంటే సహోదరుని ద్వేషించేవాడు పరలోకం పోనేపోడు అని అర్ధం!!!!

1యోహాను 3: 10

దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

1యోహాను 3: 14

మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

 

   అయ్యా! సహోదర ప్రేమ లేకపోయినందు వలననే యోసేపు గారిని అన్నలు ద్వేషించి గుంటలో పడేసి అన్యులకు బానిసలుగా అమ్మేశారు! సహోదర ప్రేమ లేదు కాబట్టి దావీదు గారి అన్నలు దావీదు గారిని ద్వేషించారు! సహోదర ప్రేమ లేనందువలననే యేసుక్రీస్తుప్రభులవారిని తన తమ్ముళ్ళు ఎగతాళి చేశారు!

 

అయితే అదే సహోదర ప్రేమ గల యోసేపు తన అన్నలను సంరక్షించారు! వారిని పోషించారు! దావీదుగారు అన్నీ మర్చిపోయి వారిని ప్రేమించి గోత్ర  పెద్దలను చేసి  అధికారం కట్టబెట్టారు! యేసుక్రీస్తుప్రభులవారు తన సహోదరులను పెంచి పోషించారు!

 

అందుకే దావీదుగారు తన అవసానకాలమందు రాస్తున్నారు: కీర్తనలు 133

 సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు ఎంత మనోహరం! ......

2. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును

3. సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

 

చూడండి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలి అని దేవుడు చెప్పారు అట!!! నీకు ఆశీర్వాదం శాశ్వత జీవం లేదు అంటే నీకు సహోదర ప్రేమ లేదు అన్నమాట! రెండు కావాలంటే తప్పకుండా సహోదర ప్రేమ కావాలి!

రోమీయులకు 12: 10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

1పేతురు 1: 21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,...

 

1పేతురు 3: 8

తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

2పేతురు 1: 7

భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను(ప్రేమను) అమర్చుకొనుడి.

చూశారా! భక్తి ఉంటే సహోదర ప్రేమ తప్పకుండా ఉంటుంది!!

 

దైవజనుడైన యోహాను గారు ఎంతో విస్తారంగా చెబుతున్నారు

 2:911; 3:10; 3:12; 3:15; 4:2021

కాబట్టి సహోదర ప్రేమను అలవరచుకుందాము!  అది లేకపోతే నరహంతకులము అని బైబిల్ నిర్దారించింది అని మరచిపోవద్దు!

దైవాశీస్సులు!!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*47 భాగం*

1 థెస్సలోనిక 4:11—12

11. సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,

12. మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక 9, 10 వచనాలలో పౌలుగారు రెండు ప్రాముఖ్యమైన విషయముల  కోసం చెబుతున్నారు!

 

మొదటిది: సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడచుకొనుడి!!

 

రెండవది: మీకేమి కొదువ లేకుండా ఉండాలి అంటే మీకున్న అవసరతలు తీరాలి అంటే 1. ఇతరుల మీద పడి తినడం కాదు గాని 2. మేము మీకు ఆజ్ఞాపించినట్లు మీ సొంత కార్యాలు జరుపుకోవడం అనగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ చేతులతో పనిచేసి మీ అవసరాలు తీర్చుకోండి అంటున్నారు!

 

మొదటిది: సంఘమునకు వెలపటి వారి యెడల మర్యాదగా నడచుకోండి అంటున్నారు! ఎందుకు అంటున్నారు? పరపక్ష్యమందుండు వాడు మీమీద చెడ్డమాటలు పలుకకుండా ఉండటం కోసం? అసలు పరపక్ష్యమందుండు వాడు నీ మీద చెడ్డమాటలు ఎందుకు పలుకుతాడు? నీ బ్రతుకు బాగోలేనందు వలన గాని, లేక నీ నోరుమాటలు బాగోలేనందు వలన గాని! నోటిని నాలుకను కాచుకుంటే చాలు అంటున్నారు సొలొమోను గారు....సామెతలు 21: 23

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

 

క్రైస్తవుని జీవితంలో మచ్చలేని జీవితం జీవించాలి! తీతు తో పౌలుగారు చెబుతున్నారు పరపక్ష్యమందు ఉన్నవాడు అనగా అన్యుడు ఎవడు నీమీద నిందారోపణ చేయకుండా నిందారహితమైన జీవితం జీవించు అంటున్నారు! తీతుకు 2: 7

పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

 

తిమోతికి ఉత్తరం రాస్తున్నారు నిన్నుగూర్చి నీ బోధ గూర్చి జాగ్రత్తపడు అంటూనే యవ్వనము బట్టి ఎవడూ నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తపడు అంటున్నారు!  ఇక్కడ అంటున్నారు సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడచుకోండి!

కదిపితే కయ్యం దయ్యం అనకుండా దేవుడు బిడ్డలంటే వీరే అని అన్యులతో సెహభాస్ అని పించుకోవాలి! మంచికి మారు పేరండి! నీతిమంతుడు నిజాయితీ పరుడు అనేమాట తెచ్చుకోవాలి! తద్వారా దేవునికి మహిమను తేవాలి! అందరితోను ప్రేమగా వ్యవహరించాలి! చివరికి నిన్ను ద్వేషించే వారియెడల కూడా ప్రేమగా నడచుకుంటూ నీ సత్ప్రవర్తన ద్వారా నీ శత్రువులను కూడా క్రీస్తుకోసం గెలవాలి!

 

  చూడండి పౌలుగారు ఎటువంటి మార్గనిర్దేశకం చేస్తున్నారో విశ్వాసులకు! దేవుడు ప్రతీ ఒక్కరికి చేయడానికి పని ఇచ్చారు! కాబట్టి ఎవరి పనులు వారే చేసుకుంటూ ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మనకు దేవుడు ఇచ్చిన పనిని ఓర్పుతో అది దేవునికి చేస్తున్నట్లు భావించి  ముందుకు పోవాలని హెచ్చరిస్తున్నారు పౌలుగారు!

 

  రెండవది: మీకు కొరత లేదా అక్కర లేకుండా ఉండాలంటే మొదటగా ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరుల మీద పడి తినకుండా మీ చేతులతో మీరే కష్టపడి ధనం సంపాదించుకొని మిమ్మును మీ కుటుంబాన్ని పోషించుకోండి అంటున్నారు!

 

 అసలు మాటను వ్రాయడానికి కారణం మొదటి భాగాలలో వివరించడం జరిగింది. పౌలుగారు వారికి బోధించారు యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ తొందరలో ఉంది కాబట్టి మీరు అన్ని విధాల సిద్దపడి ఉండాలి అంటే సరే అని పనిపాటులు మానేశారు! అంతేకాకుండా రోజులలో ప్రాంతంలో తమ సొంతచేతులతో పనిచేసి సంపాదించుకుంటే పరువుతక్కువ అని మాసిదోనియనులు, ఏథెన్స్ వారు భావించేవారు! అందుకే పౌలుగారు  అలాకాదు మీ పనిపాటులు చేసుకుంటూనే ఆయన రాకడకు సిద్దపడి ఉండాలని బోధించి, అల్లర్లు జరిగినందువలన పౌలుగారి త్రయం థెస్సలోనికయను వదిలివెళ్లారు అయితే కొంతమంది పనిపాటులు లేని బేచ్ యేసయ్య ఎలాను వచ్చేస్తున్నారు కాబట్టి మనం పనిపాటులలో మునిగిపోకుండా కేవలం వాక్యధ్యానం వాక్యపరిచర్య విషయాలలోనే మనపూర్తి సమయాన్ని గడుపుదాము అంటూ వారు పనిచేయకుండా చేసేవారిని చెడగొట్టారు! అందుకే విషయం మరొకసారి మొదటి ఉత్తరం లోనూ, ఇంకా వినకపోతే రెండో ఉత్తరం లోను పౌలుగారు రాస్తున్నారు!

 

 మరో విషయం ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా మీ సొంతపనులు మాత్రమే మీరు చూడండి అంటూ హెచ్చరిస్తున్నారు! మరో విషయం ఏమిటంటే పౌలుగారు కేవలం ఆర్డర్లు పాస్ చెయ్యకుండా మొదటగా తాను పాటించి తనకోసం తనవారికోసం తనచేతులతో పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించి అప్పుడు చెప్పారు సంఘస్తులకు మీరుకూడా ఇలాగే చెయ్యాలి ఎవరిమీద ఆధారపడకుండా మీపోషణ మీరే చూసుకోవాలి అంటూ!

 

1థెస్సలొనికయులకు 2: 9

అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి.

 

 అపో 18:3;

వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.

 

అపో.కార్యములు 20: 34—35

నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

 

   మనం కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనము చేయగలిగిన పనులు చేస్తూ ఉండాలి! యవ్వనస్తులు విద్యాభ్యాసం పూర్తి అయిపోతే సరిపోయిన ఉద్యోగం వచ్చేవరకు ఎదురుచూడకుండా ఏదో ఒక పని చేసుకుంటూ సరియైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప ఒక్కడు కష్టపడితే పదిమంది కూర్చుని తినడం మంచిది కాదు అని పౌలుగారు మనలను కూడా హెచ్చరిస్తున్నారు! విషయం ప్రతీ యవ్వనస్తుడు యవ్వనురాలు మాత్రమే కాకుండా ప్రతీ విశ్వాసి గ్రహించాలి అని మనవిచేస్తున్నాను!

 

   చూడండి ఇతరుల జోలికి పోయి చాలామంది కష్టాలు తెచ్చుకున్నారు......అమజ్యా 2దిన 25;

రాజైన యోషియా 2దిన 35;

 వీరంతా గొప్ప రాజులే! భక్తిగల రాజులే! గాని రాలిపోయే పసుపు రాసుకుని తంటా తెచ్చుకున్నారు! అందుకే తనకు పట్టని విషయాల కోసం తిరిగేవాడట దారంటపోయే కుక్క తోక పట్టుకుని దానితో కరిపించుకుని సరదాగా చేశాను అనే పనికిమాలిన వాడు అంటూ సోలోమోను గారు రాస్తున్నారు! సామెతలు 26: 17

తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.

 

చాలామంది అమ్మలక్కలు ఇంట్లో తిని తిన్నగా ఉండకుండా అది ఇలాగ ఇది ఇలాగా అని కబురులు చెప్పుకుంటూ లేనిపోని తగాదాలు తెచ్చుకుంటున్నారు! ప్రియ సహోదరీ అది కూడదు అని బైబిల్ చెబుతుంది! పనికిమాలిన అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవద్దు అని చెబుతుంది బైబిల్! ఇంటింటా కబుర్లు చెప్పుకుంటూ తిరగొద్దు! మన సొంతపనులు మనం చూసుకుందాం! పొరుగువారి ఇతరుల రక్షణ కోసం మాత్రం ప్రార్ధిస్తూ అవకాశం దొరికినప్పుడెల్లా సువార్త ప్రకటిద్దాం!

దైవాశీస్సులు!

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*48 భాగం*

*ప్రత్యక్షతలు-1- మృతుల పునరుత్థానం*

1 థెస్సలోనిక 4:13—18

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18. కాబట్టి మీరు మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక చివరి రెండు ప్రాముఖ్యమైన సంగతుల కోసం ధ్యానం చేద్దాం!

మూడవది: దేవునియందు చనిపోయిన వారు ఏమవుతారు? చనిపోయిన ఆత్మల సంగతి ఏమిటి?

నాల్గవది: యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ!

 

   ప్రియదైవజనమా! మొదటి భాగాలలో చూసుకున్నాము గ్రంధమందు వ్రాయబడనన్ని ప్రత్యక్షతలు కేవలం థెస్సలోనికయ పత్రికలలోనే ఎందుకు వ్రాయబడ్డాయి అనేది మరియు ఉత్తరాలు వ్రాయడానికి గల నేపధ్యం కోసం చూసుకున్నాము! సందర్భం వచ్చింది కాబట్టి క్లుప్తముగా మరోసారి చూసుకుందాము! థెస్సలోనికయ సంఘములు ఆత్మీయంగా ఎంతో పరిపక్వమైన మరియు సంపూర్ణత కలిగిన సంఘాలు! అందుకే వారు ఎప్పుడూ దేవుని రాకడ, పునరుత్థానం లాంటి విషయాల కోసమే పౌలుగారి త్రయాన్ని అడిగేవారు! వారు ఉన్నప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎల్లప్పుడూ ఇలాంటి విషయాలే త్రయాన్ని అడుగుతూ ఉండేవారు! అందుకే వీరి ఆసక్తిని గమనించిన పౌలుగారు అన్ని సంఘాల ఉత్తరాల కంటే సంఘాల ఉత్తరాల లోనే ఎక్కువగా క్రీస్తుయేసుప్రభులవారి రాకడ విషయాల కోసమైనా ఎక్కువ ప్రత్యక్షతలు వ్రాయడం జరిగింది!

 

    ఇక నేపధ్యం ఏమిటంటే పౌలుగారి త్రయం అక్కడ పరిచర్య చేసేటప్పుడు రాకడ విషయాలకోసం, ఎత్తబడటం కోసం, గొర్రెపిల్ల విందు కోసం ఇలాంటి విషయాలు చెప్పేవారు! ఈలోగా అక్కడ అల్లర్లు జరిగినందు వలన త్రయం వీరిని వదిలి మిగిలిన ప్రాంతాలు సంచరించారు! దీనికోసం మనకు అపోస్తలుల కార్యములు 17, 18 అధ్యాయాలలో చూసుకోవచ్చు! అయితే పౌలుగారు ఏథెన్స్ లో ఉన్నప్పుడు ఒక కబురు తెలిసింది ఏమని అంటే థెస్సలోనికయ సంఘాలు తమ సొంతవారితోను యూదుల తోను అనేక శ్రమలను పొందుతున్నారు అని, వెంటనే పౌలుగారు తిమోతి గారిని వారి దగ్గరకు పంపి వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా వారు శ్రమలలో  విశ్వాసం కోల్పోకుండా స్థిరంగా నిలబడ్డారు అనే విషయం తెలిసి సంతోషించారు! అయితే వారికి అనగా సంఘాలకు ఒక అనుమానం వచ్చింది ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు తొందరలో రాబోతున్నారు అని చెప్పారు అయితే పౌలుగారు వెళ్ళిపోయిన తర్వాత సంఘాలలో కొంతమంది సామాన్య మరణాల వలనను, శ్రమలు శోధనలు వలనను చనిపోయారు! బ్రతికిన వారు ప్రభువైన యేసు వచ్చినప్పుడు మేఘాలమీద ఎత్తబడతారు అని విన్నాము గాని ఇప్పుడు సంఘంలో కొంతమంది చనిపోయారు, ఇంకా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ రాలేదు! ఇప్పుడు చనిపోయిన వారి సంగతి ఏమిటి? ఇదీ వారి అనుమానం! తిమోతి గారిని ప్రశ్న అడిగితే బహుశా ఆయన సరియైన సమాధానం చెప్పి ఉండకపోవచ్చు! నాకంత అనుభవం, ప్రత్యక్షత లేదు- గురువుగారిని అడిగి చెబుతాను అని ఉండవచ్చు! వచ్చిన వెంటనే అనుమానమును తిమోతిగారు పౌలుగారికి చెప్పారు!

 

    పౌలుగారి త్రయం వారి విశ్వాసానికి ఎంతో సంతోషించారు! ఇప్పుడు వారి ప్రశ్నకు సమాధానం వ్రాయాలి అనుకున్నారు! నోటిమాటలు పనికిరాదు! పరిశుద్ధాత్మ నడిపింపు కావాలనుకుని ముగ్గురు ఉపవాసముండి ప్రార్ధన చేసి ప్రత్యక్షతను పొందుకున్నారు! వెంటనే ప్రత్యక్షతలు ఉత్తరం రూపముగా రాసి తిమోతి గారితో పంపించారు! ఇదీ నేపధ్యం!

   ప్రియులారా ఇక వచనం నుండి నాలుగు అధ్యాయాలు పూర్తిగా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసమే వ్రాయబడ్డాయి! వచనాలలో సహోదరులారా! నిరీక్షణ లేని ఇతరులు వలె అనగా పరలోక నిరీక్షణ, మృతుల పునరుత్థానం, శ్రేష్ఠుల/ జ్యేష్ఠుల సమూహం, వాడబారని స్వాస్థ్యములాంటి నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు చనిపోయిన వారి కోసం దుఃఖ పడవద్దు! ప్రభువునందు నిద్రించిన వారి సంగతి చెబుతున్నాము వినండి! యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయి తిరిగిలేచారని నమ్ముచున్నారు కదా అలాగే ఎవరైతే యేసునందు ఉండి నిద్రిస్తారో లేక చనిపోతారో వారిని దేవుడు తన రెండవరాకడలో వచ్చినప్పుడు లేపి తనవెంట పెట్టుకుని వస్తారు అంటున్నారు!

 

      సహోదరులారా! ఇక్కడ కూడా చనిపోయిన వారిని నిద్రించిన వారు అంటున్నారు పౌలుగారు! మాట పౌలుగారు ఎక్కడ నేర్చుకున్నారు అంటే మాట మొదటగా యేసుక్రీస్తుప్రభులవారు లాజరు చనిపోయినప్పుడు యోహాను 11:11 లో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతనిని లేపడానికి వెళ్దాము రండి అంటూ సంభోదిస్తున్నారు! ఎందుకు చనిపోయాడు అనడం లేదు అంటే నిరీక్షణ గలవారికి నిరీక్షణ లేని వారికి తేడా అదే! మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది! ఒకరోజు యేసుక్రీస్తుప్రభులవారు తన రెండో రాకడలో వస్తారు! అప్పుడు క్రీస్తునందు ఉన్న మృతులను, బ్రతికిఉన్న పరిశుద్ధులను ఆయన తనతోపాటు మధ్యాకాశమునకు తీసుకుని వెళ్ళిపోతారు! ఏడేండ్ల విందు, వెయ్యేండ్ల పాలన తర్వాతా క్రీస్తుతోపాటు యుగయుగములు ఆయనతో ఉంటాము అనేది మన నిరీక్షణ! అందుకే చప్పిడి పథ్యం చేస్తున్నాము! అయితే నిరీక్షణ లేనివారు మరణిస్తే చనిపోయాడు అంటారు! ఎందుకంటే వారికి వారు తిరిగిలేస్తారు అనే నిరీక్షణ ఆశ లేవు! నిత్యజీవం అనేమాట వారికి తెలియదు! అందుకే చనిపోయాడు అంటారు! ఐతే మనకైతే ఒక నిరీక్షణ ఉంది! కారణం మన విమోచకుడు సజీవుడు! ఆయన మృతినొంది పునరుత్థానం అయిన వారిలో ఆయనే ప్రధముడు! అందుకే ఇక్కడ పౌలుగారు చెబుతున్నారు యేసుక్రీస్తు మృతినొంది లేచెనని మీరు నమ్ముచున్నారు కదా! అలాగే ఎవరైతే యేసునందు ఉండి మృతులవుతారో వారిని దేవుడు ఆయన రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆయనతోపాటు వెంటబెట్టుకుని వస్తారు అంటున్నారు! దీనికోసం మరిన్ని వివరాలు క్రిందన వచనాలలో ఉన్నాయి! ఎలా లేస్తారో క్రమంలో లేస్తారో అన్నీ క్రింద వచనాలలో పౌలుగారు చెబుతున్నారు!

అందుకే నిరీక్షణ లేని ఇతర అన్యజనుల వలె మీరు ఏడువవద్దు అంటున్నారు!

 

 ఏమండి తమకు కావలసిన వారు చనిపోతే దుఃఖం రాదా మనకు? మరి ఎందుకు దుఃఖపడొద్దు అంటున్నారు?

 

     మనకో నిరీక్షణ ఉంది, ఒకరోజున మృతులు పునరుత్తానులై లేస్తారు అందుకే నిద్రించాడు అంటున్నాము! చనిపోయిన వాడు లేవడని మనకు తెలుసు! అయితే ఇక్కడ వ్యక్తి చనిపోలేదు నిద్రిస్తున్నాడు! ఒకరోజు ఆయన బూర ఊది లేపుతారు అప్పుడు లేచి మన విమోచకుని కలుసుకోవడానికి వెళ్తాడు అందుకే దుఃఖ పడవద్దు అంటున్నారు! అయితే మనం కూడా ఏదో ఒకరోజున చనిపోతాము! మనము కూడా లేస్తాము! అప్పుడు మనము చనిపోయిన పరిశుద్ధులైన మృతులను మన ఆత్మీయులను తప్పకుండా చూస్తాము! వారినే కాదు అబ్రాహాము గారిని మోషేగారిని నోవహు గారిని దావీదు గారిని మరీ ముఖ్యంగా మనవిమోచకుడైన యేసుక్రీస్తుప్రభులవారిని కూడా వేవేల దూతలతో పాటుగా చూస్తాము! అందుకే నిరీక్షణ లేని ఇతరుల దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి జీవించమని థెస్సలోనికయుల సంఘాన్ని హెచ్చరిస్తున్నారు పౌలుగారు! ఈరోజు నిన్నుకూడా పరిశుద్దాత్ముడు చెబుతున్నారు నీవుకూడా నిరీక్షలేని ఇతరుల వలె దుఃఖపడకుండా నీ బ్రతుకును పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయనయందు విశ్వాసంతో జీవిస్తే నీవుకూడా శుభప్రదమైన నిరీక్షణలో ఎత్తబడి ఆయనతో పాటుగా ఉంటావు!

మరి నిరీక్షణ నీకుందా?

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

 

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*49 భాగం*

*ప్రత్యక్షతలు-2- మృతుల పునరుత్థానం*

1 థెస్సలోనిక 4:13—18

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17.  మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18. కాబట్టి మీరు మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక చివరి రెండు ప్రాముఖ్యమైన సంగతుల కోసం ధ్యానం చేద్దాం!

 

మూడవది: దేవునియందు చనిపోయిన వారు ఏమవుతారు? చనిపోయిన ఆత్మల సంగతి ఏమిటి?

నాల్గవది: యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడ!

 

       (గతభాగం తరువాయి)

 

   ప్రియదైవజనమా! గతభాగంలో నిరీక్షణ లేని ఇతరమైన అన్యజనుల వలె మీరు దుఃఖపడవద్దు అనే దానిని ధ్యానం చేసుకున్నాము! ఎందుకంటే మరణమే మనుష్యుల అంతం కాదనీ, మనకో నిరీక్షణ ఉందని, మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు ఒకరోజున రాబోతున్నారు   రోజున మనం తిరిగి సజీవంగా లేపబడతాము ఆరోజున మనకన్నా ముందుగా చనిపోయిన వారిని కలుసుకోవడం జరుగుతుంది అనేది విశ్వాసులు తెలుసుకోవాలి అనేదానికోసం ధ్యానం చేసుకున్నాం!

 

   అయితే మృతుల పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది! యేసుక్రీస్తుప్రభులవారు దీనిని నొక్కివక్కానిస్తున్నారు లూకా సువార్త 20:38 లో....

మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడుకాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను.

 

మాటకోసమే పౌలుగారు అనేక శ్రమలను పొందుకున్నారు సహించారు! దానికోసం విస్తారంగా రాశారు కూడా తన పత్రికలో! 1కొరింథీ 15  అధ్యాయం!.... 15:3,4,5,6,7,8,12,13,14,15,16,17,18,20,21,22,23,26

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6.అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

12. క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు.

14.మరియు క్రీస్తు లేపబడి యుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

15. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

16. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.

17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.

18. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

20. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు.

21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23. *ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు*.

26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

 

అయితే మొట్టమొదటగా లేపబడింది యేసుక్రీస్తుప్రభులవారు అంటూ చెప్పారు! ఆయన చనిపోయి తిరిగి లేచినట్లు బైబిల్ మనకు చెబుతుంది దానిని మనం నమ్మాము నమ్మాలి!( మత్తయి 27:50; 28:6; అపో 1:3; 2:32; రోమా 1:4; 1కొరింథీ 15:38) అలాగే యేసుక్రీస్తుప్రభులవారి వలె ఆయనయందు విశ్వాసముంచిన జనులు కూడా ఒకరోజు లేస్తారు ఇదే శుభప్రదమైన నిరీక్షణ అని చూసుకున్నాము!

 

      ఇక 14 వచనంలో *యేసునందు* నిద్రించిన వారిని  దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అంటున్నారు! దీనికోసం ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయి! యూదా 1:15;  

చనిపోయిన ఆత్మలను మహిమ దేహాలతో దేవుడు వెంటబెట్టుకుని వస్తారు! అయితే ఎప్పుడు? మీదన చెప్పిన 1కొరింథీ 15:23 ప్రకారం క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రతికింపబడుదురు!

ఇక మన 4:16లో కూడా చెబుతున్నారు పౌలుగారు ...

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. . దేవుని బూరతో ప్రభువు దిగివచ్చినప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు అని!

 

   ప్రియదైవజనమా   విషయంలో ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను!  1థెస్సలోనికయ 4:1317 వరకు చెప్పబడింది యేసుక్రీస్తుప్రభులవారి రహస్య రాకడ కోసం! ఇక 1కొరింథీ 15:5054 లో మృతుల పునరుత్థానం కోసం వ్రాయబడిన విషయాలు యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడకోసం వ్రాయబడింది. ఇక మత్తయి సువార్త 24 అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు 114, 24--26 వరకు రాకడ సూచనలు; 1523 వరకు మహాశ్రమల కాలం కోసం; 3141వరకు యేసుక్రీస్తుప్రభులవారి రహస్య రాకడకోసం, 29౩౦ వచనాలు యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ కోసం వ్రాయబడ్డాయి! కనుక అన్ని వచనాలు రిఫరెన్సులు కలిపి చదివి గందరగోళంగా ఉండవద్దు!

ఎందుకు అలా వ్రాయబడ్డాయి అంటే యెషయా భక్తుడు చెబుతున్నారు కొంత అచ్చట కొంత ఇచ్చట వాక్యం బయలు వెళతుంది. అచ్చట ఇచ్చట కలుపుకుంటేనే ముచ్చట అనగా వాక్యం బాగా అర్ధమవుతుంది.

Isaiah(యెషయా గ్రంథము) 28:10,11,12,13

10. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ! సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.!!

అందుకే తిమోతి గారికి పత్రిక రాస్తూ అంటున్నారు పౌలుగారు నీవు వాక్యమును సరిగా విభజించు వానిగా ఉండూ అంటున్నారు!

2తిమోతికి 2: 15

దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, *సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను* (*సరిగా విభజించు వానిగాను*) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*50 భాగం* *ప్రత్యక్షతలు-3- మృతుల పునరుత్థానం-2*

 

1 థెస్సలోనిక 4:1318

 

       (గతభాగం తరువాయి)

 

   సరే ఇక్కడ 14 వచనంలో *యేసునందు* నిద్రించిన వారిని అంటున్నారు, ఇక 16 వచనంలో *క్రీస్తునందుండి* మృతులైన వారు మొదట లేతురు అని వ్రాయబడింది! విషయంలో కొన్ని విభిన్న రకాలైన అభిప్రాయాలున్నాయి! దయచేసి వీటిని గమనించమని మనవిచేస్తున్నాను! ఇక్కడ నా అభిప్రాయం మాత్రమే నేను రాస్తున్నాను. ఇలాగే జరుగుతుంది అని ఎవడైనా చెబితే వాడు అబద్దికుడని గ్రహించండి! కారణం ఒక్కక్కరికి ఒక్కో విధమైన ప్రత్యక్షత కలుగుతుంది దానిని బట్టి ఎవరెవరో ఏమేమో రాస్తారు గాని చివరికి తండ్రి చిత్తమే జరుగుతుంది! ఇక మత్తయి 20లో చెప్పబడిన ద్రాక్ష తోట యజమాని- పనివారు ఉపమానం ప్రకారం దేవుడు తనకిష్టమైనట్లు చేస్తారు! 

యోబు గ్రంధం ప్రకారం నీవెందుకు ఇలా చేసేవు అని దేవుణ్ణి చేయిపట్టుకుని అడిగే అధికారం ధైర్యం ఎవరికీ లేదు!

ఇంకా ఆయన ఏకదృష్టి కలవాడు ఆయనను ఎవరూ మార్చలేరు అంటున్నారు. యోబు 23: 13

అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.

కాబట్టి నాకు అర్ధమయినంత వరకు వాక్యానుసారంగా వీటి అర్ధాలు చెబుతున్నాను! ఇది కేవలం నా అభిప్రాయాలు మాత్రమే! ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము!

 

      సరే, చాలామంది అభిప్రాయము ఏమిటంటే పైన చెప్పబడిన రెండు వచనాలు ప్రకారం: రహస్య రాకడలో కేవలం నూతన నిబంధన సంఘానికి చెందిన మృతులు మాత్రమే లేపబడతారు! పాతనిబంధన భక్తులు అనగా ఆదాము గారినుండి మలాకి గారి వరకు లేక సిలువమరణం ముందటి భక్తులందరూ బహిరంగ రాకడలో మృతుల పునరుత్థానం సమయంలో లేపబడతారు అనేది వారి వాదన! దానికోసం వారు చూపించే రిఫరెన్సులు మొదటగా రెండు వచనాలు అనగా 14 మరియు 16 వచనాలలో క్రీస్తునందు అనియు యేసునందు అనియు వ్రాయబడింది కాబట్టి, వారు అనగా పాత నిబంధన భక్తులు యెహోవా అనే నామంలో విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు గొర్రెపిల్ల రక్తంలో కడుగబడలేదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు, వారికి పరమసీయోను అనుభవం లేనందువలన సంపూర్ణత సాధించలేదు కాబట్టి పాత నిబంధన భక్తులు రహస్య రాకడలో లేపబడరు అంటారు! ఇంకా దానియేలు 12 అధ్యాయం ప్రకారం వారు బహిరంగ రాకడలోనే పునరుత్థానం కలుగుతుంది అని వ్రాయబడింది కాబట్టి వారు బహిరంగ రాకడలోనే లేపబడతారు అంటారు! ఇంకా పైనుదహరిచిన 1కొరింథీ 15 అధ్యాయం ప్రకారం మొదటి పునరుత్థానం లో 5 వరుసలు ఉన్నాయి అంటారు! దానిని నేను కూడా నమ్ముతాను!   ప్రకటన గ్రంధం 20 అధ్యాయంలో మనకు రెండు పునరుత్తానములు కనిపిస్తాయి! అయితే కొరింథీ 15:23లో  వ్రాయబడినట్టు మొదటి పునరుత్తానంలో వరుసలు ఉన్నాయి అంటారు!

 

సరే, అక్కడ మొదటగా క్రీస్తు ప్రధమ ఫలమై ఉన్నారు అంటారు! మంచిది మనం కూడా నమ్ముతాము!

ఇక రెండవ వరుస- క్రీస్తునందు ఉండి మృతులైన వారు థెస్సలోనికయ 4:14 మరియు 16వచనాల ప్రకారం,  వరుసలోనే అదే రెండో వరుసలో వారి తర్వాత నూతన నిబంధనలో గల  పరిశుద్ధులైన సిద్ధపడిన విశ్వాసులు లేస్తారు అంటారు! మంచిది బాగుంది!

ఇక మూడో వరుస మహాశ్రమల కాలంలో విడువబడిన పరిశుద్ధులు పశ్చాత్తాపం పొంది క్రీస్తుకోసం హతస్సాక్షులుగా మారిన వారు! ఇదికూడా బాగుంది!

నాల్గవది: మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటించి హతస్సాక్షులుగా మారి, పునరుత్థానం పొందుకున్న ఇద్దరు సాక్షులు! నమ్ముతున్నాము!

చివరగా 1కొరింథీ 15లో వ్రాయబడిన మృతుల పునరుత్థాన సమయంలో పాతనిబంధన భక్తులు లేపబడతారు అంటారు!

ఇక రెండో పునరుత్థానం- ధవళసింహాసన తీర్పుకోసం భూమి పుట్టినది మొదలుకుని అప్పటివరకు చనిపోయిన వారంతా తీర్పుపునరుత్థానం కోసం లేపబడుట!

 

   1కొరింథీ 15లో వ్రాయబడిన మృతుల పునరుత్థాన సమయంలో పాతనిబంధన భక్తులు లేపబడతారు అంటున్నారు కదా! ఇక్కడే నాకు అభ్యంతరంగా కనిపిస్తుంది!

మొదటగా వారు చెబుతున్న కారణాలు:

పాత నిబంధన భక్తులు యెహోవా అనే నామంలో విశ్వాసం ఉంచారు కాబట్టి, వారు గొర్రెపిల్ల రక్తంలో కడుగబడలేదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు, కాబట్టి వారు గొర్రెపిల్ల జీవగ్రంధమందు వ్రాయబడిన వారు కారు! : కొంత మంది అభిప్రాయం జీవగ్రంధం, గొర్రె పిల్ల జీవగ్రంధం వేరు అంటారు. ఇది మనకు ప్రకటన 13:8లో కనిపిస్తుంది. దీనిలో కేవలం నూతన నిబంధన సంఘములో సభ్యులుగా ఉండి, ఆత్మానుసారమైన సాక్షార్ధమైన జీవితం జీవించి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన, అర్హతపొందిన వారి పేర్లు గల గ్రంథము అంటారు*. 

 

ఇంకా హెబ్రీ 7:11 ప్రకారము వారికి పరమసీయోను అనుభవం లేనందువలన సంపూర్ణత సాధించలేదు;  

హెబ్రీ 12:2224 ప్రకారం సంపూర్ణ సిద్ధి లేక సంపూర్ణత సాధించినది నూతన నిబంధన సంఘము కాబట్టి;  

రోమా 8:23 ప్రకారం ఆత్మయొక్క ప్రధమ ఫలముగా పిలువబడినది నూతన నిబంధన సంఘము కాబట్టి;  

ప్రకటన 14:4 ప్రకారం గొర్రెపిల్ల కొరకు ప్రధమ ఫలముగా కొనబడింది నూతన నిబంధన సంఘము కాబట్టి  పాత నిబంధన భక్తులు రహస్య రాకడలో లేపబడరు క్రొత్త నిబంధన సంఘమునకు చెందిన మృతులు మాత్రమే రహస్య రాకడలో ఎత్తబడతారు అంటారు!

ఇంకా దానియేలు 12:13  ప్రకారం అంత్యము వరకు నమ్మకముగా ఉంటే కాలంతమున నీ వంతులో నిలుస్తావు అనగా మొదటి పునరుత్తానములో చివరి వరుసలో అనగా  వారు బహిరంగ రాకడలోనే పునరుత్థానం కలుగుతుంది అని వ్రాయబడింది కాబట్టి వారు బహిరంగ రాకడలోనే లేపబడతారు అంటారు!

ఏమో మరి ఎలా జరుగుతుందో చెప్పలేము కాని దీనితో నేను ఏకీభవించలేక పోతున్నాను!

 

ఎలాగో ఒకసారి నా అభిప్రాయం కూడా  వినండి! గమనించాలి! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! ఇలాగే జరుగుతుంది అని నేను చెబితే నేను అబద్ధికుడను!

 

ప్రస్తుతం పాత నిబంధన భక్తుల ఆత్మలు  ఎక్కడ ఉన్నాయి?  

పరదైసులో!

పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది?

 పౌలుగారి దర్శనం ప్రకారం 2కొరింథీ 12 ప్రకారము మూడో ఆకాశంలో ఉంది!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 12:2,3,4

2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట *మూడవ ఆకాశమునకు కొనిపోబడెను*; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు *పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను*;  మాటలు మనుష్యుడు పలుకకూడదు.

4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

 

దీనిని కాదు అనగలిగిన వాడు ఎవడూ లేడు! మొదట పరదైసు ఎక్కడ ఉండేది! భూమిక్రింద! భూమిక్రింద మొదట భాగము పాతాళము దీనినే హెడేస్ అంటారు! ఎవరి కోసం ఇది? చనిపోయిన ఆత్మలు, అనగా పాపాత్ములై చనిపోయిన ఆత్మలు ఉండేది, తీర్పు వరకు!

యోబు 24: 19

అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసిన వారిని పట్టుకొనును.

 

దానిక్రింద అగాధము! ఇది ఎవరి కోసం సాతాను గాడి సైన్యం కోసం! దేవునిమీద తిరుగబడ్డ దూతలు కోసం అగాధం ఉంది!

ప్రకటన గ్రంథం 9 మరియు, 20:3ప్రకారం!

 

దానిక్రింద పరదైసు ఉండేది! లాజరు- ధనవంతుడు ఉపమానం ప్రకారం! లూకా 16; లాజరు అబ్రాహాము రొమ్ము అనబడే పరదైసులోను, ధనవంతుడు పాతాళములోను ఉన్నాడు.

అందుకే తండ్రియైన అబ్రాహాము గారు మాకును మీకును మధ్యన మహా అగాధం ఉంచబడింది అన్నారు! ఇది దేవునియందు భయభక్తులు కలిగి భక్తి కలిగిన విశ్వాసుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడింది!

 

      సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయారో   మూడురోజులలో మరణాన్ని సాతానుని జయించి చెరను చెరగా పట్టుకుని పోయారు అని వ్రాయబడింది! .ఎఫెసీయులకు 4: 8

అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.

.. అనగా పరదైసునే దాని అడ్రస్ మార్చివేశారు యేసయ్య! భూమిక్రింద మూడో భాగంలో ఉన్న పరదైసును దానిలో ఉన్న ఆత్మలతో అనగా పాతనిబంధన భక్తుల ఆత్మలతో పాటుగా మూడో ఆకాశంలోనికి తీసుకుని పోయారు!

మొదటి ఆకాశం అంతరిక్షం! రెండో ఆకాశంలో అంధకార సంబంధమైన లోకనాధులు, సాతాను శక్తులు ఉన్నారు! యేసుక్రీస్తుప్రభులవారి రెండో రాకడలో మొదటి ప్రస్తానమైన రహస్యరాకడ లో వచ్చేది మధ్యాకాశమునకే! ఆయనరాకడతో అంధకార సంబంధమైన లోకనాధులు సైతాను సమూహం క్రిందకు త్రోయబడతారు! అప్పుడు పరిశుద్ధులకు ఏడేండ్లు మధ్యాకాశంలో విందు! భూమిమీద ఏడేండ్లు మహాశ్రమలు! 

సరే పైన ఉన్న ఆకాశములోనే ఇప్పుడు పరదైసు ఉంది అని 2కొరింథీ 12 అధ్యాయం చెబుతుంది!

 

   సరే, ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే *యేసుక్రీస్తుప్రభులవారు తన రహస్యరాకడలో క్రీస్తునందు ఉండి మృతులైన ఆత్మలను పరదైసునుండి వెంటబెట్టుకుని వచ్చేటప్పుడు నా ప్రియ పాతనిబంధన భక్తులారా మీరు దయచేసి తర్వాత రండి, మొదటగా నా క్రొత్తనిబంధన భక్తులను తీసుకుని పోతాను, ఏడేండ్లు తర్వాత మిమ్మును కూడా తీసుకుని వెళ్తాను అని చెబుతారా?*

యేసుక్రీస్తుప్రభులవారికి ఇలాంటి తారతమ్యాలు ఉంటాయా? వారేం పాపం చేశారు?

 

1). 1యోహాను 5:7 ప్రకారం తండ్రి కుమారా పరిశుద్దాత్ములు ఏకీభవించియున్నారు....

1యోహాను 5: 7

సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును,రక్తమును, ముగ్గురు ఏకీభవించియున్నారు.

 

1 John 5: 7

For there are three that bear record in heaven, the *Father, the Word, and the Holy Ghost*: and *these three are one.*

తండ్రి కుమారా పరిశుద్ధాత్మలు ముగ్గురు దేవుళ్ళు కారు! దేవుడొక్కరే గాని సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి మూడు వ్యక్తిత్వాలు కలిగి కార్యాలు చేశారు! కాబట్టి ఇటువంటి తారతమ్యాలు భేధాలు దేవునిలో లేవు! ఇది నా దృఢమైన అభిప్రాయము!

 

2. ఎఫెసీ 2:1119 ప్రకారం దేవుడు మనలను ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులు గాను సమాన వారసులుగాను చేయడమే కాకుండా ఉభయులను ఏకముగా చేశారు అంటూ ఇద్దరినీ తనయందు ఒక్క నూతన పురుషునిగా చేశారు అంటున్నారు! ఇంకా ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము అంటూ ఏక పట్టనస్తులు దేవుని ఇంటివారు అయ్యారు అని చెప్పిన దేవుడు ఇలా వేరుగా వేర్పాటు చేస్తారు అని నేను అనుకోవడం లేదు!

Ephesians(ఎఫెసీయులకు) 2:11,12,13,14,15,16,17,18,19

11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

12. కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా *విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.*

15. ఇట్లు సంధిచేయుచు, * యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి*,

16. తన సిలువ వలన ద్వేషమును సంహరించి, *దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి*, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. *ఆయన ద్వారానే* *మనము ఉభయులము* ఒక్క *ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము*.

19. *కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.*

 

3. 1పేతురు 3:20 ప్రకారం:

దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

చెర అనగా రెండు అర్ధాలు మొదటిది: ధర్మశాస్త్రమనే చెర,

రెండు: ఎఫెసీ పత్రిక 4:8 ప్రకారం చెరను చెరగా పట్టుకుపోయారు అనే సందర్భంలో ఇక్కడ చెర అనగా పరదైసు అని నూతన నిబంధన భక్తుల మైన మనమంతా నమ్ముతాము కదా, వచనంలో చెరలో ఉన్న ఆత్మలయొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగా వెళ్లి వారికి ప్రకటించెను అనగా సువార్త ప్రకటించెను అంటున్నారు! ఎప్పుడు ప్రకటించెను చెరను చెరగా పట్టుకుని పోయే క్రమంలో మొదట వారి మెస్సీయ ఎవరో వారికి చెప్పి గొర్రెపిల్లగా వచ్చినది నేనే అని చెప్పి, అప్పుడు సాతాను/మరణపు చెరనుండి విమోచించారు కాబట్టి ఇప్పుడు పాత నిబంధన భక్తులు గొర్రెపిల్ల రక్తములో కడుగబడలేదు, అత్మాభిషేకంపొందుకోలేదు  గాని గొర్రెపిల్లను నమ్మారు కాబట్టి  మీద చెప్పిన రిఫరెన్సులు ప్రకారం వారుకూడా అనగా పాత నిబంధన భక్తులు కూడా క్రొత్త నిబంధన భక్తులతోనే ఎత్తబడతారు అని నమ్ముతాను!

 

కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రహస్యరాకడలోనే  పాత నిబంధన భక్తులను క్రొత్త నిబంధన భక్తులను తనతోపాటుగా పరదైసునుండి విడిపించి మధ్యాకాశంలోనికి తీసుకుని  వస్తారు! అప్పుడు పరదైసు ఖాళీ అయిపోతుంది.

 

గమనించాలి- ఇది నా అభిప్రాయం మాత్రమే! దీనితో మీరు ఏకీభవించవలసిన అవసరం లేదు! ఇష్టమైతే వాక్యానుసారంగా ఉంటే ఏకీభవించండి లేదంటే వదిలెయ్యండి! అయితే ఒకటి మాత్రం నిజం! చనిపోయిన ఆత్మలు అన్నీ ఒకరోజున లేస్తాయి! అది మొదటి పునరుత్తానమందు గాని రెండో పునరుత్థానమందు గాని!  క్రైస్తవుడు విశ్వాసి నమ్మవలసింది ఏమిటంటే మృతులైన పరిశుద్ధులు తప్పకుండా రహస్యరాకడలో బ్రతికి ఉన్నవారి కంటే ముందుగా లేస్తారు!

 

  ప్రియ సహోదరుడా! వివాదాలు అన్నీ వదిలేసి నీకు ఒకరోజు నీ ప్రియ రక్షకుడైన క్రీస్తుయేసు ప్రభులవారిని కలుసుకుంటాను అనే నిరీక్షణ విశ్వాసం ఉందా? అసలు అలా ఎత్తబడటానికి ఎత్తబడే గుంపులో ఉండేటంత అర్హత సిద్ధపాటు నీకుందా? లేకపోతే నేడే నీ బ్రతుకును మార్చుకుని ఆయన రాకడకు సిద్దపడు! లేకపోతే విడువబడుట బహుఘోరమని మర్చిపోవద్దు! నేడే సిద్దపడదాం! ఎత్తబడదాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*51 భాగం*

*ప్రత్యక్షతలు-4- సజీవుల పునరుత్థానం*

1 థెస్సలోనిక 4:13—18

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18. కాబట్టి మీరు మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక చివరి సంగతి మరియు యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ విషయం ధ్యానం చేద్దాం! గతభాగాలలో పరిశుద్ధ మృతుల పునరుత్థానం కోసం ధ్యానం చేసుకున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! 15 వచనంలోను 17 వచనంలోను ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి యొక్క పునరుత్థానం కోసం చెప్పబడింది! మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అంటున్నారు!

ఒకసారి జాగ్రత్తగా మాటలు గమనిస్తే మేము ప్రభువుమాటను బట్టి మీకు చెప్పునదేమనగా అంటున్నారు... అనగా సజీవంగా ఉన్న పరిశుద్ధుల కోసమైన విషయాలు పౌలుగారికి దేవుడే చెప్పారట! ఇక్కడ మనకు రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి! ప్రభువు మాటను బట్టి అంటున్నారు కాబట్టి ప్రభువు బ్రతికి ఉన్నప్పుడు బహుశా తన శిష్యులతో చెప్పి ఉండవచ్చు గాని అది సువార్తలలో రికార్డ్ చేయబడలేదు! లేదా గలతీ పత్రిక 1:1112 లో పౌలుగారు చెప్పినట్లు దేవుడే పౌలుగారికి బయలుపరచి ఉండవచ్చు! .....

 

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 ఒకసారి పౌలుగారి చరిత్ర ఆలోచిస్తే ఆయన రక్షించబడిన తర్వాత సువార్త పరిచర్య ప్రారంభించక ముందు మూడు సంవత్సరాలు అరేబియాలో గడిపినట్లు గలతీ పత్రికలో చూడగలము!

 Galatians(గలతీయులకు) 1:17,18

17. నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

18. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడ పదునయిదు దినములుంటిని.

అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం మూడు సంవత్సరాలు అరేబియా దేశంలో సువార్త కోసమైనా సిద్దపాటుగా ప్రార్ధనలోను వాక్యపఠనంలోను గడిపారు అంటారు! కాబట్టి మూడు సంవత్సరాలు కాలంలో ప్రత్యక్షతలు బయలుపరచి ఉండవచ్చు దేవుడు పౌలుగారికి!

లేదా పౌలుగారి మిషనరీ పర్యటనలలో అనేకసార్లు ఆయన మరణానికి దగ్గరగా వెళ్లి వచ్చారు! ఒకసారి లుస్త్ర లో రాళ్ళతో కొట్టగా  ఆయన చనిపోయాడని భావించారు కాని ఆయన లేచి మరో ప్రాంతంలో సువార్తకు వెళ్ళిపోయారు! (అపో.కార్యములు 14: 19

అంతియొకయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.)

 అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే అలా అపస్మారక స్తితిలో ఉన్నప్పుడే కొన్ని గంటలు పౌలుగారు పరదైసుకి వెళ్లి ప్రత్యక్షతలు పొందుకుని వచ్చారు అంటారు! అందుకే పౌలుగారు నాలో దేవుడు ఒక ముళ్ళుని పెట్టి ఆమోదించారు ఎందుకంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకము! వాటివలన నేను గర్వించి దేవునికి దూరంగా ఉండకుండా ఉండేందుకు ఆయన నాలో ఒక ముళ్ళును పెట్టారు అన్నారు! 2కోరింథీయులకు 12: 7

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

.... కాబట్టి విషయాలు కేవలం దేవుడే పౌలుగారికి బయలుపరిచారు అన్నమాట!

 

      ఇక తర్వాత మాట ప్రభువురాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అంటున్నారు... అనగా ఇక్కడ రెండు విషయాలు గమనించాలి! మొదటగా మనము అనగా ప్రభువు రాకడవరకు బ్రతికి ఉన్న లేక రెండవరాకడ సమయంలో సజీవంగా ఉన్న పరిశుద్ధులు అని గమనించాలి! రెండవది మరి పౌలుగారు మనము అంటున్నారు అంటే పౌలుగారు తాను రెండవరాకడ వరకు చనిపోను అని తలంచి రాశారా అని అడగొచ్చు! పౌలుగారి ఉద్దేశం క్రీస్తు రాకడ వరకు తాను బ్రతికి ఉంటానని ఎంతమాత్రమూ కాదు! ఇక్కడ మనము అనగా యుగము అంతటిలో అనగా సంఘ యుగము అంతటిలో ఉన్న పరిశుద్ధులు అని అర్ధం! ఒకవేళ రాకడకు ముందుగా చనిపోతే వారు రెండవ రాకడలో బ్రతికి ఉన్నవారికంటే ముందుగా లేస్తారు! లేదా బ్రతికి ఉంటే పరిశుద్ధ మృతులు  లేపబడిన వెంటనే సజీవ పరిశుద్దులు కూడా లేపబడతారు అని అర్ధం!  దానినే 17 వచనంలో రాశారు!

అయితే ఒకమాట! ప్రభువు రాకడ ఎప్పుడు అనేది పౌలుగారు వ్రాయడం లేదు కారణం ఆయనకు కూడా తెలియదు మనలాగే! అందుకే 5:12 లో అంటున్నారు .

 

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. .

ఇక్కడ మీకు తెలియనక్కరలేదు అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రియ రక్షకుడైన యేసయ్యకు కూడా తెలియదు... మత్తయి 24:36!

అయితే దినమును గూర్చియు గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

కాబట్టి ఆయన ఎప్పుడొచ్చినా ఇప్పుడే వచ్చినా ఎత్తబడటానికి సిద్ధంగా ఉండాలి!

 

    ఇక తర్వాత మాట మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము అంటున్నారు అనగా మొదటగా ప్రభువునందు నిద్రించిన పరిశుద్దులు లేపబడతారు అని అర్ధము! దీనినే 16 వచనంలో రాస్తున్నారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్ధముతోను దేవుని బూరతోను ప్రభువు పరలోకమునుండి దిగివచ్చును వెంటనే దేవుని బూరకు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇక 17 వచనంలో మీదట సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అంటున్నారు! అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో ఉంటాము అంటున్నారు!

 

  17 వచనం జాగ్రత్తగా గమనిస్తే మృతులు లేచిన తర్వాత సజీవులమై నిలిచి యుండు మనము కూడా *వారితో కూడా* అనేమాట గమనించాలి! వారితో కూడా ప్రభువును ఎదుర్కోడానికి ఆకాశమండలము నకు మేఘముల మీద కొనిపోబడుదుము! జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే మనకంటే అనగా సజీవులుగా ఉన్న మనకంటే ముందుగా  పరిశుద్ధులైన మృతులు గతభాగంలో చెప్పిన విధముగా  రెండో వరుసలో  లేపబడినా గాని సజీవులమై ఉన్న పరిశుద్దులమైన మనము--  వారు కూడా ఏకముగా ఒకేసారి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము అని గ్రహించాలి! రెండు ప్రక్రియలకు అనగా మృతుల పునరుత్థానం మరియు సజీవుల పునరుత్థానము మధ్య గల గడువు లేక సమయం కొన్ని క్షణాలు మాత్రమే! నిమిషాలు గంటలు రోజులు కాదు! వారును మనమును ఏకముగా ఎత్తబడతాము అని గ్రహించాలి!!!

 

ఇక తర్వాత గమనించవలసిన విషయం ఏమిటంటే: ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము  అంటున్నారు. వచనం ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే రెండవ రాకడలో మొదటి మెట్టు అయిన రహస్యరాకడలో యేసుక్రీస్తుప్రభువులవారు భూమిమీదకు రావడం లేదు! ఆకాశమండలమునకు వస్తున్నారు! వివరంగా చెప్పాలంటే మధ్యాకాశంలోనికి వస్తున్నారు! అక్కడే ఏడేండ్ల పరిశుద్ధులకు  విందు జరుగబోతుంది! 16 వచనం ప్రకారం పరలోకంనుండి యేసుక్రీస్తుప్రభులవారు, ... పరదైసు నుండి పాతనిబంధన పరిశుద్ధులైన మృతులు, క్రొత్త నిబంధన మృతులు మధ్యాకాశంలోనికి వెళ్తారు వారితోపాటుగా (లేదా మరికొందరు తలస్తున్నట్లు నూతన నిబంధన మృతులు మాత్రమే వెళ్తారు) 17 వచనం ప్రకారం సజీవులమై ఉన్న మనము కూడా మార్పునొంది మధ్యాకాశంలోనికి వెళ్తాము! ఇదీ జరుగబోయే విషయం!

 

    చనిపోయిన వారు మహిమ శరీరంతో వెళ్తారు మరి బ్రతికి ఉన్న మనము ఎలా వెళ్తాము అంటే దానికి కూడా మనం 1కొరింథీ 15:51--54 లో వివరించిన విధముగానే మనము కూడా మృతులు ఏవిధముగా అక్షయులుగా లేపబడతారో అదేవిధముగా క్షయమైన శరీరమును వదిలి అక్షయమైన దేహమును ధరించుకుని మేఘముల మీద కొనిబడతాము!

 

  ఇక చివరగా మేఘముల మీద కొనిపోబడతాము అంటున్నారు! ఏం మేఘముల మీదనే ఎందుకు వెళ్ళాలి? ఏలియా గారిలాగా అగ్ని గుర్రాలు అగ్ని రధముల మీద వెళ్ళవచ్చు కదా! అంటే కానేకాదు! యేసుక్రీస్తుప్రభులవారి రెండోరాకడలో ఆయన మేఘముల మీదనే రాబోతున్నారు.

మత్తయి 24: 30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

 

మత్తయి 26:64..

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా

ప్రకటన 1:7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

దానియేలు 7: 13

రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.

 

    కాబట్టి పైన చెప్పిన అన్ని రిఫరెన్సులు ప్రకారం యేసుక్రీస్తుప్రభులవారు మేఘముల మీదనే రాబోతున్నారు! ఆయనతో పాటుగా ఆయనతో సమానంగా మనలను చేసిన మనము కూడా ఆయనలాగానే మేఘముల మీదనే వెళ్తాము తప్ప అగ్ని రధాల మీదనో లేక మరో మోడ్ లో వెళ్ళము! ఏలియా గారు బ్రతికి ఉండగానే తిన్నగా పరలోకం వెళ్ళారు (పరదైసుకు కాదు) కాబట్టి అగ్ని రధాల మీద అగ్ని గుర్రాలతో వెళ్లారు! మనము వెంటనే  వెళ్ళేది పరలోకము కాదు మరియు మనము ప్రాణాలతో కూడా వెళ్ళడం లేదు! అంతేకాదు మనము వెళ్ళేది మహిమ దేహములు అనగా అక్షయమైన శరీరంతో వెళ్తాము కాబట్టి మేఘముల మీదనే ప్రభువును ఎదుర్కోడానికి వెళ్తాము! ఎందుకు ఎదుర్కోడానికి అంటున్నారు అంటే ప్రభువు పరలోకము నుండి క్రిందకు వస్తున్నారు మూడో ఆకాశం నుండి పరిశుద్ధులను తీసుకుని, మనము భూలోకము నుండి మధ్యాకాశం లోనికి వెళ్తున్నాము అందుకే ఆయనను ఎదుర్కోడానికి కొనిపోబడతాము అంటున్నారు!

 

   ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధపాటు, ఆత్మానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం ప్రార్ధనాపూర్వకమైన పరిశుద్ధ  జీవితం కలిగి జీవిస్తున్నావా? లేకపోతే విడువబడతావు సుమా!!

 

విడువబడుట బహు ఘోరమని మరచిపోవద్దు!

సిద్ధపడి మేఘములమీద ఎగిరిపోదాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*52 భాగం*

*ప్రత్యక్షతలు-5- బూరలు*

1 థెస్సలోనిక 4:13—18

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

18. కాబట్టి మీరు మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! మనం  నాల్గవ అధ్యాయం నుండి నాలుగు ప్రాముఖ్యమైన విషయాల గురుంచి ధ్యానం చేస్తున్నాము!  

 

     ప్రియులారా! ఇక చివరి సంగతి మరియు యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ విషయం ధ్యానం చేద్దాం! గతభాగాలలో పరిశుద్ధ మృతుల పునరుత్థానం కోసం ధ్యానం చేసుకున్నాము!

            (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక 16 వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్ధముతోను దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును అంటున్నారు!

 

ఇక్కడ జాగ్రత్తగా గమినిస్తే మనకు ఆర్భాటము , ప్రధానదూత, దేవునిబూర, పరలోకమునుండి ప్రభువు దిగివచ్చుట కనపిస్తుంది!

 

*ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటముగా రావడానికి కారణం ఏమిటి*?

జవాబు సింపుల్! ఆయన మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చారు!

 యోహాను 1: 29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

 

ఆయన మానవుల పాపముల నిమిత్తం వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చారు కాబట్టి ఏవిధమైన ఆర్భాటాలు లేకుండా చాలా పేదవాడై పశువుల పాకలో జన్మించవలసి వచ్చింది! అయితే ఇప్పుడు రెండవ రాకడలో రాజుగా రారాజుగా వస్తున్నారు కాబట్టి రాజుల ఆర్భాటము కనిపిస్తుంది.

 

ప్రకటన గ్రంథం 3: 21

నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

 

దానియేలు 2: 47

మరియు రాజు మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; *నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును* మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

 

1తిమోతికి 6: 15

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ప్రత్యక్షతను కనుపరచును. * సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు*.

 

ప్రకటన గ్రంథం 17: 14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, *గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను*, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన రాజులను జయించును.

 

ప్రకటన గ్రంథం 19: 16

*రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును* అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

 

 ఇక మరీ ముఖ్యముగా యూదా గోత్రపు సింహముగా రాబోతున్నారు!

ప్రకటన గ్రంథం 5: 5

పెద్దలలో ఒకడు ఏడువకుము; *ఇదిగో దావీదుకు చిగురైన (లేక, వేరైన)యూదా గోత్రపు సింహము* ఏడు ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.

 

సింహము వచ్చేటప్పుడు ఒక రకమైన భీకరమైన గాండ్రింపు వినిపిస్తుంది! కాబట్టి యూదా గోత్రపు సింహముగాను రారాజుగాను వస్తూ జయించడానికి వస్తున్నారు కాబట్టి ఆర్భాటముతో వస్తున్నారు!

 

ఇక *ప్రధానదూత శబ్ధముతోను* అంటున్నారు!

ప్రధాన దూత ఎవరు? యూదా పత్రిక 1:9 ప్రకారం మిఖాయెల్! ...

అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో (అనగా-సాతానుతో) వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను.

 

గబ్రియేలు దూత దానియేలు గారికి వర్తమానం తెస్తే దానిని చెప్పకుండా పారశీక దేశానికి దురాత్మల అధిపతియైన వాడు అడ్డగిస్తే మిఖాయెల్ దేవదూతనే గబ్రియేలు దూతకు సహాయం చేసాడు!

దానియేలు 10: 13

పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

 

గమనించాలి యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడలో కేవలం ప్రధాన దూతయైన మిఖాయిల్ మాత్రమే కాకుండా వేవేల దూతలు వస్తారని గతభాగాలలో చూసుకున్నాము!

మత్తయి 16:27; 25:31

 

ఇక మూడవదిగా *దేవునిబూరతో* ప్రభువు పరలోకం నుండి వస్తారు అంటున్నారు! *దేవునిబూర అంటే ఏమిటి*?

 

సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! నాకు అర్ధమైనది మాత్రమే చెబుతున్నాను! మీరు ఏకీభవిస్తే ఏకీభవించండి లేకపోతే వదిలెయ్యండి! *దేవునిబూర, కడబూర, ప్రకటన గ్రంధంలో గల ఏడవ బూర ఒకటి కాదు! దేవునిబూర కడబూర కాదు! దేవునిబూర ఏడవబూర కాదు! అలాగే ఏడవబూర కడబూర కాదు! మూడు బూరలు వేరు వేరు! బూరలు ఊదిన కాలాలు వేరు! ఊడిన ఉద్దేశాలు కూడా వేరు వేరు!* ముందుగా మనము బూరలు సంగతి అర్ధము చేసుకుంటే దేవుని రాకడను బాగా అర్ధము చేసుకోవచ్చు!

 

*దేవునిబూర*:

*ఇది ఎప్పుడు మ్రోగుతుంది* అంటే యేసుక్రీస్తుప్రభులవారి రహస్యరాకడ సమయంలో! 1థెస్స 4:16; మరియు మహాశ్రమల కాలమునకు ముందుగా!

 

*ఎందుకు మ్రోగుతుంది*?

మొదటగా ప్రభువునందు లేక క్రీస్తునందుండి మృతులైన వారిని లేపడానికి మరియు సజీవులమైన పరిశుద్దులను పిలవడానికి!

 

*ఎప్పుడు*?  

రహస్యరాకడ సమయంలో!

 

*ఎక్కడనుండి మ్రోగుతుంది లేక ఊదడం జరుగుతుంది?*

 మధ్యాకాశం నుండి!

 

*ఎవరు ఊదుతారు?*

 ప్రధాన దూతయైన మిఖాయేలు కావచ్చు!

 

*దేవునిబూర మ్రోగిన వెంటనే లేక ఊదిన వెంటనే ఏమి జరుగుతుంది?*

*పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు!

* క్రీస్తునందుండి మృతులైన పరిశుద్ధులు మొదట లేస్తారు!

*ఎక్కడనుండి లేస్తారు*? పరదైసునుండి!

 *లేవడం ఏమిటి*? ఎందుకంటే వారు ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్నారు కాబట్టి!

 

* తర్వాత సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు! అనగా సంఘం ఎత్తబడుతుంది!!!

అన్ని ప్రక్రియలు కనురెప్ప పాటులో జరిగిపోతాయి!

*ఇంకా ఏమి జరుగుతాయి*?

*క్రీస్తు విరోధి బయలు పరచబడతాడు!

* ప్రకటన 6 అధ్యాయం ప్రకారం ఏడు ముద్రలు విప్పబడటం ప్రారంభమవుతాయి!

* పరిశుద్ధాత్ముడు సంఘము ఎత్తబడ్డారు కాబట్టి వాక్యము భూమిమీద నుండి తీసివేయబడుతుంది!

* ప్రకటన 6ప్రకారం మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది!

*ప్రకటన 11 ప్రకారం ఇద్దరు సాక్షులు భూమిమీదకు వస్తారు!

* ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభమవుతుంది!

* చివరగా అనేకమైన బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు గ్రంధములో చెప్పబడిన 70 వారాలలో చివరిదైన  70 వారం ప్రారంభమవుతుంది!

 

*బూర ముఖ్య ఉద్దేశం*: *సంఘము ఎత్తబడుట!!!*

 *పునరుత్థానం*: మృతులు, సజీవులు (పరిశుద్ధులు మాత్రమే)

 

 

*ఏడవబూర*:

*ఎప్పుడు మ్రోగుతుంది*?  

ప్రకటన గ్రంధం 11:15 ప్రకారం రెండు శ్రమలు గతించిన పిమ్మట, ఇద్దరు సాక్షుల పునరుత్థానం తర్వాత , ఇంకా చెప్పాలంటే మహాశ్రమల కాలంలో సగం అయ్యాక అనగా మధ్యలో, మూడున్నర సంవత్సరాలు గడిచాక!

 

*ఎందుకు మ్రోగుతుంది*?

రెండు శ్రమలు గతించాయి! ఇక మూడో శ్రమ మాత్రమే ఉంది! అది జరిగాక ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యము క్రీస్తు రాజ్యమవ్వబోతుంది అని చెప్పడానికి! (*ప్రకటన 8:13 లో అయ్యో అయ్యో అయ్యో  అనే స్వరము మూడుసార్లు పలకడంతో  మొదటి శ్రమ మొదలయ్యింది! మొదటి శ్రమ ప్రకటన 9:112 వరకు; రెండవ శ్రమ 9:1311:14 వరకు; 11:15 లో మూడవ శ్రమ ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో ఏడవ బూర మ్రోగుతుంది)*

 

*ఎవరు ఊదుతారు*?

ఏడవ దూత! (ప్రకటన 11:15)

*ఏడవ దూత బూర ఊదిన తర్వాత ఏమి జరుతుంది?*

 

*పరలోకములో యుద్ధం జరుగుతుంది, ఘటసర్పము, అపవాది పరలోకములో నుండి క్రిందకు త్రోయబడతారు! (ప్రకటన 12)

*ఎనిమిదవ నియంతగా క్రూరమృగమునకు సంపూర్ణ అధికారం కలుగుతుంది! (ప్రకటన 13)

 *యేరూషలేము దేవాలయంలో తానే దేవుడుగా ప్రతిష్టించుకుని బలిని సర్వమును ఆపి నాశనకరమైన హేయవస్తువు బలిపీఠం మీద అర్పిస్తాడు! (దానియేలు 9:27;  మత్తయి 24:15) *ఇశ్రాయేలు ప్రజలు వాడి అసలు రంగు తెలుసుకుంటారు!

*666 ముద్ర తప్పనిసరి అవుతుంది! (ప్రకటన 13:16--18)

*ఏడు తెగుళ్ళు గల ఏడు పాత్రలు కుమ్మరించబడటానికి సిద్ధంగా ఉంటాయి! (ప్రకటన 14,15)

 

*ముఖ్య ఉద్దేశం:  దేవుని ఉగ్రత భూమిపై క్రుమ్మరించబడుట!!!*

 *పునరుత్థానం: జరుగదు!*

 

*కడబూర:*

*ఎందుకు మ్రోగుతుంది:* మత్తయి 24:౩౦31 ప్రకారం , యెషయా 27:12,13; 11:1112 ప్రకారం భూమి నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచు కొనిన వారిని పోగుచేయుటకు! (ఏర్పరచుకొనిన వారు అనగామొదటగా ఇశ్రాయేలు ప్రజలను, ఇంకా మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల ఆత్మలు అని నా అభిప్రాయం)

*ఎప్పుడు మ్రోగుతుంది*: యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ సమయంలో! సమయానికి యేసుక్రీస్తుప్రభులవారు భూమిపైన ఒలీవల కొండపైన కాలుపెట్టారు తనప్రజల పక్ష్యంగా హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను సంహరించడానికి!  కాబట్టి పరిశుద్ధులు ఎదుర్కోడానికి వెళ్ళరు, కేవలం పోగుచెయ్యడమే లక్ష్యం!

 

*ఎప్పుడు జరుగబోతుంది*?

మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత, హార్మెగిద్దోను యుద్ధము కోసం సర్వదేశాల ప్రజలు ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టినప్పుడు!

 

*ఎవరు ఊదుతారు?*

 ఒకదూత కావచ్చు లేక నలుగురు దేవదూతలు భూమి నాలుగు దిక్కులనుండి ఒకేసారి ఊదవచ్చు!

 

*ముఖ్య ఉద్దేశం: యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ సందర్భంగా తన భక్తులను నలుదిక్కులనుండి పోగుచెయ్యడానికి!*

*పునరుత్థానం: మృతుల పునరుత్థానం జరుగుతుంది (మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల పునరుత్థానం, ఇంకా ఇశ్రాయేలు ప్రజల శాశ్వత విడుదల!)

 

(పైన చెప్పినది నా అభిప్రాయం మాత్రమే! అలాగైనా జరగావచ్చు, లేదా కొంతమంది భావించినట్లు కడబూర మ్రోగిన తర్వాత పాతనిబంధన భక్తులు అనగా ఆదాము నుండి యేసయ్య సిలువమరణం వరకు గల భక్తులు అక్షయులై లేపబడవచ్చు! ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము కారణం అది తండ్రి చిత్తము! కొన్ని విషయాలు మరుగుగా ఉండాలని దేవుడు నిర్ణయించారు కాబట్టి ఇంతకంటే లోతుగా వెళ్ళవద్దు! అయితే మనం మాత్రం సిద్ధంగా ఉందాము!)

 

*కడబూర మోగిన తర్వాత ఏమి జరుగబోతుంది?*

*మృతులు అక్షయులుగా లేపబడతారు, (1కొరింథీ 15:52,53)

*హార్మెగిద్దోను యుద్ధంలో శత్రుసైన్యాలు సంహరించబడి వారి రక్తం సుమారు 200 కి.మీ వరకు ప్రవహిస్తుంది!

*క్రూరమృగము అబద్ద ప్రవక్త ప్రాణములతో అగ్ని గుండములో వేయబడతారు (ప్రకటన 19:2021)

*ఆది సర్పము మరియు అపవాది అనే సాతాను అగాధములో బంధించడం జరుగుతుంది! (ప్రకటన 20:13)

*క్రీస్తు న్యాయపీటపు తీర్పు –  బహుమానాల తీర్పు లేక ప్రతి పరిశుద్దునికి వాని క్రియల చొప్పున దేవుడిచ్చే ప్రతిఫలం లేక ఫలములు! 20:4

*వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది , మొదటి పునరుత్థానం జరుగుతుంది (ప్రకటన 20:57)

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! కడబూర దేవుని బూర ఏడవ బూర అన్నీ ఒకటే అనుకోవద్దు అని మనవిచేస్తున్నాను!

 

ఇక నాల్గవది: *పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును*!

*అసలు ప్రభువు పరలోకం నుండి ప్రభువు ఎందుకు దిగి వస్తున్నారు?*

మొదటగా: తన బిడ్డలకు వాగ్దానం చేశారు కదా నేనుండు ప్రదేశమునకు మిమ్మును తీసుకుని పోతాను అని, అందుకే మనలను తీసుకుని పోడానికి వస్తున్నారు!

యోహాను 14: 3

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

 

ఇక్కడ బాగుంది కదా మరి అక్కడకు ఎందుకు తీసుకుని పోవడం?

కారణం భూమి ఆకాశం మానవుల పాపముల కారణంగా అగ్నిచేత కాల్చబడబోతున్నాయి!

2పేతురు 3: 7

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

2 Peter(రెండవ పేతురు) 3:10,11,12

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

 మరి భూమి ఆకాశం కాలిపోతే వాటితోపాటు తన బిడ్డలు కూడా కాలిపోతారు కాబట్టి తన బిడ్డలను తప్పించడానికే మనలను తీసుకుని పోబోతున్నారు!

 ఇక ప్రకటన 3:10 లో వాగ్దానం చేసిన విధముగా మానవుల పాపం వలన భూలోకమంతటి మీదికి రాబోయే ఉగ్రత లేక మహాశ్రమలు  నుండి తన పిల్లలను తప్పించడానికి పెండ్లి సంఘాన్ని మధ్యాకాశము లోనికి తీసుకుని పోబోతున్నారు!

 

 ఇక రెండవ విషయం ఏమిటంటే: యూదులకు వ్యతిరేఖంగా ప్రపంచ దేశాలన్నీ హార్మెగిద్దోను అనేప్రాంతము లో (యేరూషలేముకి సుమారు 17 కి.మీ దూరంలో ఉంది) ఏకమై యుద్ధానికి వస్తారు! (ప్రకటన 16:14,15; జెకర్యా 14) యేరూషలేము చుట్టూ దండ్లు ఉంటాయి! (లూకా 21:20) ఇశ్రాయేలు దేశం అనేది లేకుండా చేయాలనేది వారి కామన్ ఎజెండాతో ఒక ట్రీటీ ఏర్పడి కూడుకుంటారు!! (యెషయా, జెకర్యా గ్రంథాలు) (జెకర్యా 14: 2

ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.)

 

 అప్పుడు తాను వాగ్ధానం చేసిన విధంగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధము చేయడానికి పరలోకంనుండి ప్రభువు తన వేవేల పరిశుద్ధులను వేవేల దూతలను వెంటబెట్టుకుని ఒలీవల కొండమీదికి వస్తారు!

జెకర్యా 14: 3

అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును.

జెకర్యా 14: 4

దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

 

ఒలీవల కొండమీదకే ఎందుకు వస్తారు అంటే తను ఆరోహణమైనప్పుడు దూతలు ఒలీవల కొండమీద ఏమని చెప్పారు? మీరెందుకు అలా చూస్తున్నారు? ఏవిధంగా మనుష్యకుమారుడు పరలోకానికి ఆరోహణ మయ్యారో అదేవిధంగా మరలా వస్తారు! అపో.కార్యములు 1: 11

గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

 

కాబట్టి ఒలీవల కొండమీదనుండే ఆరోహణమయ్యారు కాబట్టి ఒలీవల కొండమీదకే అవరోహణమౌతారు! దిగివస్తారు! వెంటనే ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది! హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను హతం చేస్తారు! వారి రక్తం సుమారు 200 కి.మీ. దూరం పారుతుంది! 

తర్వాత వెయ్యేండ్ల పాలన జరుగుతుంది! (ప్రకటన 20) అందుకే ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నారు అని గమనించాలి!

 

  ఇక చివరగా 17 వచనం చివరి పాదంలో కాగా మనం సదాకాలము ప్రభువుతో ఉందుము అంటున్నారు! అనగా ఎప్పుడైతే దేవునిబూర మిఖాయేలు ఊదుతాడో వెంటనే మనము ఎత్తబడతాము! ఎత్తబడి మధ్యాకాశంలో ఏడేండ్లు విందులో ప్రభువుతో ఉంటాము! తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో ప్రభువుతో ఉంటాము! తర్వాత యుగయుగాలు ప్రభువుతో ఉంటాము! అందుకే పౌలుగారు సదాకాలము అనగా ఎత్తబడిన తర్వాత సదాకాలము ప్రభువుతో ఉంటాము!

 

అందుకే 18 వచనంలో మాటలుచేత ఒకనినొకడు ఆదరించుకొనండి అంటున్నారు! మనం ఆదరణ తెచ్చుకోవలసింది మాటల ద్వారానే! ఈరోజు కష్టాలు పడుతున్నా, పొందబోయే ఐశ్వర్యము కోసం చప్పిడి పథ్యం చేస్తున్నా గాని ధైర్యంగా ఉందాము! ఒకరోజు ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు సదాకాలం ఉంటాము!

 

ఒకవేళ ఎత్తబడకపోతే??!!!!! జాగ్రత్త మహాశ్రమలు!!! అగ్నిగుండము! విడువబడితే కేవలం దేవునికోసం మరణిస్తేనే గాని పరము లేదు! భాధలు నీవు పడలేవు జాగ్రత్త!

అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందాము! ఆయన ఎప్పుడొచ్చినా అనగా మహాశ్రమలకు ముందుగా వచ్చినా, మహాశ్రమలలో వచ్చినా, తర్వాత వచ్చినా మనము సిద్దముగా ఉంటే చాలు! ఎత్తబడి ప్రభువుతో సదాకాలం ఉంటాము! విడువబడితే సదాకాలం నరకములో ఆరని అగ్నిగుండములో ఉంటావు జాగ్రత్త! నేను సిద్ధముగా ఉన్నాను!

నీవు సిద్ధమా?

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*53 భాగం*

*ప్రత్యక్షతలు-6- రాకడసమయం- గుర్తులు*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ఇంతవరకు 4 అధ్యాయలనుండి ఎన్నో విషయాలు ధ్యానం చేసుకున్నాము! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 5 అధ్యాయం లోను ఇక రెండవ పత్రిక మొదటి రెండు అధ్యాయలలోను విషయాన్నే కొనసాగిస్తున్నారు పౌలుగారు! గతభాగాలలో మృతుల పునరుత్థానం, రెండవ రాకడ విధివిధానాలు చూసుకున్నాము!

 

   ప్రియులారా ఐదవ అధ్యాయం రాకడ సమయం ఏమిటి? మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము! అనగా పౌలుగారు సీలగారు, తిమోతి గారు!

 

   మొదటి వచనంలో సహోదరులారా! కాలములను గూర్చి సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు!  ఇక్కడ కాలములు సమయములు అనడానికి కారణం రహస్యరాకడ, బహిరంగ రాకడ ఒకేసారి జరుగదు అనే ఉద్దేశ్యంతో కావచ్చు! ఇక్కడ కాలములు అనగా యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ మరియు మృతుల పునరుత్థానం మరియు సజీవుల పునరుత్థానం జరిగే కాలములు సమయములు అన్నమాట! కాలములు సమయములు గూర్చి మీకు వ్రాయనక్కరలేదు అనగా పౌలుగారి ఉద్దేశం వారికి అనగా థెస్సలోనికయుల సంఘానికి కాలములు సమయములు ఖచ్చితమైన తారీకులు తెలుసు అన్న అర్ధమా? కానేకాదు!

 

   దీనికి జవాబు కావాలంటే క్రింది రెండు రిఫరెన్సులు చూడాలి!

 

శిష్యులు అడుగుతారు యేసుక్రీస్తుప్రభులవారిని నీ రాకడకు మరియు యుగాంతము ఎప్పుడు జరుగుతుంది అని!

మత్తయి 24:3, 36

3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా

36. *అయితే దినమును గూర్చియు గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు*.

 

మరోసారి ఆయన పునరుత్తానుడైన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో మరోసారి అడుగుతారుఅయ్యా మీరు వచ్చిన పని అయిపోయింది కదా మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మరలా రాజ్యమును అప్పగిస్తావా? దానికి ఆయన జవాబు:.....అపో 1:68

 

6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడుప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన

7. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.

8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

కాబట్టి రెండు రిఫరెన్సులు మరియు వచనంలో చెప్పిన విధముగా మనకు అర్ధం అయ్యేదేమిటంటే రాకడ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది అనేది రోజులు గడియలు సంవత్సరాలు కాదు తెలుసుకోవలసినది! అది మన పని కాదు అని దేవుడు అంత స్పష్టముగా చెప్పినప్పుడు ఇంకా దానికోసం అడుగకూడదు! దాని అర్ధం రాకడ విషయం మరచిపోవాలా? కాదు సిద్ధముగా ఉండాలి ఎప్పుడొచ్చినా ఎత్తబడటానికి!

 

మరి ఏమి తెలుసుకోవాలి? ఏమి  పొందుకోవాలంటే *పైనుండి శక్తి*! అనగా పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి! 

శక్తి వస్తే లేక పొందుకొంటే ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రంగా ఉంచుతాడు! నీవు ఎటువంటి పాపపు క్రియలవెంబడి మరలినా, పాపపు ఆలోచనలు వచ్చినా నీలో ఉన్న పరిశుద్దాత్ముడు నిన్ను గద్దించి సరిచేసి నిన్ను పశ్చాత్తాప పడేలా చేస్తాడు! తద్వారా నిన్ను దేవునితో సమాధాన పడేలా చేసి నీవు పరలోకం వెళ్ళేలా ఎత్తబదేలా చేస్తాడు! 1:8

8.అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

  దీనిద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే రాకడ ఎప్పుడొస్తుంది లాంటి విషయాలు కాకుండా ఆత్మీయ సంబంధమైన విషయాలు తెలుసుకుని పొందుకుని వాటికోసం తాపత్రయ పడాలి!

 

 ఇక రెండో వచనంలోను నాలుగో వచనంలోను ప్రభువు రాకడ దొంగవలె వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అంటున్నారు! అనగా దొంగ ఏవిధంగా ఎవరికీ చెప్పకుండా ఏవిధమైన ముందస్తు ప్రకటన లేకుండా వస్తాడో అలాగే యేసుక్రీస్తుప్రభులవారి రాకడ కూడా మనము ఊహించని రోజున, తలంచని విధంగా వస్తుంది!

 

      మరి మనం ఏం చెయ్యాలి? రోజు సమయం తెలుసుకోనక్కరలేదు అంటున్నారు దొంగవలె వస్తుంది అంటున్నారు! ఇంతకీ ఆయన వస్తారా లేదా? లేక ఇంకా చాలా సమయం పడుతుందా? అని అడిగితే:

 

ఆయన తప్పకుండా వస్తారు! దూతలు బూరలు ఊదుతకు సిద్ధంగా ఉన్నారు! మీకెలా తెలుసు? బూరలు ఊదుటకు సిద్దంగా ఉన్నారు అని చెబుతున్నారు? మీరు చూసొచ్చారా అని అడగవచ్చు!

ఎలా చెబుతున్నాము అంటే ఆయన రాకడ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి!

మత్తయి సువార్త 24లో ఆయన రాకడ సూచనలు యేసుక్రీస్తుప్రభులవారు ముందుగానే చెప్పారు! సూచనలు జరుగుతున్నాయి!

 

కాబట్టి సిద్ధపడి రాకడకొరకు ఎదురుచూస్తూ ఇంకా విశ్వాసంలో బలంగా ఉండాలి!

ప్రకటన గ్రంథం 16: 16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

ఆమెన్!

(ఇంకాఉంది)

  

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*54 భాగం*

*ప్రత్యక్షతలు-7- రాకడసమయం- గుర్తులు*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనే దానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

   మొదటి వచనంలో సహోదరులారా! కాలములను గూర్చి సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు అంటున్నారు! సరే రోజు రాకడ గుర్తులు మత్తయి 24 నుండి చూసుకుందాము!

 

 *సంఘం ఎత్తబడానికి (లేదా) క్రీస్తు రెండవ రాకడకు సూచనలు:* 💥

 

1 *మోసము విస్తరించుట*: (అబద్ద క్రీస్తులు వెలుగులోనికి వచ్చుట)

 

ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.         (మత్తయి 24:4,5)

 

ఇప్పటికే నేనే క్రీస్తును అంటూ  వరకూ లోకంలో ప్రకటించుకున్నారు చాలా మంది!  అట్లాంటి వారు కోకొల్లలుగా వస్తూనే వున్నారు. మనదేశంలో ఇద్దరు అలాగే  అల్లాను నేనే యేసుక్రీస్తును నేనే మరొకరిని నేనే అంటూ ఎంతోమందిని మోసం చేశారు! వారి మందిరాలు వారి ఆరాధనలు అన్నీ మనలాగే ఉంటాయి!  ఇంకా అనేకమంది వస్తారు. ఇది యుగసమాప్తికి సూచన అనే విషయం ఎంత మాత్రం మరచిపోకూడదు.

 

2 *యుద్ధములు, కరవులు, భూకంపములు:*

 

జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.      (మత్తయి 24:7,8)

 

ప్రపంచంలో శాంతి, సమాధానం లోపించింది. ఎక్కడ చూచినా *యుద్ధవాతావరణమే* తాండవమాడుతుంది. పోయిన నెలలో ఇశ్రాయేలు- పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం జరిగింది! ఇక మన దేశానికి, ప్రక్కనున్న పాకిస్థాన్ కి ఎప్పుడూ ఇదేపరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఇంకనూ తీవ్రతరం కాబోతున్నాయి. ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకు సూచనలు.

సోమాలియా లాంటి  ఆఫ్రికా దేశాలలో *భయంకరమైన కరువు* పరిస్తితులలో తినడానికి లేక మట్టి తింటున్నారు ! ఇట్లాంటి పరిస్థితులే రాబోయే దినాల్లో ఇంకనూ ప్రపంచమంతటనూ రాజ్యమేలబోతున్నాయి.

ఇక *భూకంపాలు, సునామీలు* ఎన్నో వస్తున్నాయి!   వీటన్నిటిని చూచి ఆశర్య పోవలసినపనిలేదు గాని, యుగసమాప్తికి సూచనలని గ్రహించగలగాలి.

 

3. *విశ్వాసులు సకల జనులచేత ద్వేషించబడుట: *

మీరు నా నామము నిమిత్తము  సకల జనములచేత ద్వేషింపబడుదురు        (మత్తయి 24:9)

 ఒక్క వేటుతో తల మొండెం వేరయిపోతుంది. సజీవ దహనాలు, మానభంగాలు, వెలివేతలు ... ఇట్లా అనేకం. కారణం ఒక్కటే!  మన దేశంలో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి! బైబిల్లు కాల్చేస్తున్నారు! దేవాలయాలను పడగొట్టి కాల్చివేస్తున్నారు! దైవజనులను దైవసేవకురాళ్ళను హింసిస్తున్నారు! తల్లిదండ్రులు చూస్తుండగానే అమ్మాయిలను బలాత్కారం చేస్తున్నారు! భర్త ఎదుటనే భార్యను మానభంగము చేస్తున్నారు! కారణం వారు యేసునామం కలిగి ఉన్నారు! . ఇవన్నీ జరుగుతున్నాయి.  ఇంకా జరిగితీరుతాయి.

 

4. *అబద్ద బోధలు:*

అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;   (మత్తయి 24:11)

 

నేటి దినాల్లో దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు.

* యెహోవా సాక్షులు

* మొర్మాన్స్

* బ్రెన్హ మైట్స్

* జాంగిల్ జా

* సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.

* సున్నతి లేకుండా గమ్యం లేదు.

* శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.

ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.

 

5. *అనేకుల ప్రేమ చల్లారిపోతుంది: *

అక్రమము విస్తరించుటచేత అనేకుల  ప్రేమ చల్లారును.     (మత్తయి 24:12)

 

ప్రేమకే అర్ధాన్ని చెప్పిన క్రీస్తుప్రేమను మర్చిపోయి సమాజంలోనూ,  సంఘాలలోను అక్రమం విస్తరించడం వలన, ప్రేమ స్థానంలో ద్వేషం,  కక్షలు,  కార్పణ్యాలు వచ్చి చేరాయి. సంఘాలకు తాళాలు వేయబడి సంఘపెద్దలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు!

 

6.. *సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి. *

రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.           (మత్తయి 24:14)

 

ప్రపంచ వ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది. బహిరంగ సభలు, దండయాత్రలు, కర పత్రికలు, రేడియో, టీవి, ఫేస్ బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ ఇట్లా అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది. అనేకులు కొండలు, లోయలు వేటిని లెక్కచేయక, ప్రాణాలకు తెగించి, నరమాంస భక్షకులకు దగ్గరకు సహితం సువార్తను మోసుకుపోతున్నారు.

లెక్కలేనన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడుతుంది.

 

వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా గాని, వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషివరకూ చేరాలి.

వర్తమానాలు నీదగ్గరకు వస్తున్నాయంటే? మాకు పనీ పాటు లేక చేసే పనులుగా భావించొద్దు. సువార్త ద్వారాలు మూయబడే సమయం ఆసన్నమౌతుందని గుర్తుంచుకో!

 

*ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన రాకడ దగ్గర పడుతుంది! ఆయన రాకడ సూచనలు నేరవేరతున్నాయి!*  * కృపాకాలం ముగించబడబోతుంది.  దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా?*  సరిచేసుకుందాం!  

విడువబడితే బాధలు పడలేవు కాబట్టి సిద్దపడి ఆయన రాకడలో ఎత్తబడదాం!

మా పల్లెటూర్లలో ఒక నాటు సామెత ఉంది! అడిగిన పిల్ల, కడిగిన ముఖం దేనికైనా పనికొస్తుంది అట! ఉదయాన్నే బ్రష్ చేసుకుని ఉంటే ఎప్పుడైనా టీ కాఫీలు తాగొచ్చు! టిఫిన్ తినొచ్చు! అలాగే సంబంధం అడిగిన పిల్ల ఉంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు! పిల్లకోసం ఊరూరా తిరగాల్సిన అవసరం లేదు! అలాగే నీవు అయన రాకడ కోసం అన్ని విధాల సిద్ధంగా ఉంటే చాలు! ఆయన ఎప్పుడైనా రానీయ్! లేకపోతే ఇప్పుడే రానీయ్! ఎత్తబడతావ్!

నేను సిద్ధంగా ఉన్నాను! నీవు సిద్దమా?

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*55 భాగం*

*ప్రత్యక్షతలు-8- రాకడసమయం- గుర్తులు*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా!    ఐదవ అధ్యాయం రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

  ఇక రెండవ వచనంలో రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము కూడా వస్తుంది అంటున్నారు! ఇక నాలుగో వచనంలో దినము దొంగ వలె మీమీదకు వచ్చుటకయ మీరు చీకటిలో ఉన్నవారు కారు, వెలుగు సంబంధులు కాబట్టి మీకు ఆనవాలు తెలిసిపోతుంది అంటున్నారు!

అనగా దీని అర్ధము ఏమిటంటే ప్రభువు దినము అనబడే దేవుని రాకడ (రహస్య రాకడ) దొంగ ఎలా చెప్పకుండా అనగా ఏవిధమైన ప్రకటన చేయకుండా వస్తాడో అలాగే మీరెరుగని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు అంటున్నారు! దీనికోసం యేసుక్రీస్తుప్రభులవారు కూడా చెప్పారు!

మత్తయి 24: 44

మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

మత్తయి 24: 50

దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును.

లూకా 12: 40

మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

మత్తయి 24: 42

కావున దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

 

ఇక దొంగ వచ్చినట్లు అనేమాట కోసం చూసుకుంటే

మత్తయి 24:43—44

43. జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

 

లూకా 12:39—40

39. దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.

40. మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

 

సువార్తలలోనే కాదు ప్రకటన గ్రంధంలో కూడా రెండు సార్లు దేవుడు చెప్పారు ప్రకటన 3:3

నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

 

ప్రకటన గ్రంథం 16: 16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

ఇక పేతురు గారు కూడా రాస్తున్నారు 2పేతురు 3:10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

 

కాబట్టి ఆయన ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు! సమయం కోసం మనం తెలుసుకోనక్కర లేదు అని మొదటి వచనంలో రాస్తున్నారు!

 

ఇక నాలుగో వచనంలో దినం దొంగవలె వచ్చుటకు మీరు వెలుగు సంబంధులు చీకటి సంబంధులు కారు అంటున్నారు! పౌలుగారు మాట పలకడానికి కారణం ఏమిటి?

ఆలోచిద్దాం! ఒకవేళ దొంగ రాత్రికి రాబోతున్నాడు అని ముందుగా తెలిసింది అనుకుందాం! లేక మీ వీధిలో ప్రతీరోజు ఏదో ఒక గృహంలో దొంగతనం జరుగుతుంది అనుకుందాం! అప్పుడు రాత్రులు మీరు పడుకుంటారా? ఏమాత్రం అశ్రద్ధ ఏమరుపాటు లేకుండా రాత్రంతా ఎవరో ఒకరు కాపలాకాస్తూ సిద్ధంగా ఉంటారు దొంగను ఎదుర్కోడానికి!

అలాగే విశ్వాసి కూడా చీకటిలో లేడు వెలుగులో ఉన్నాడు గాబట్టి పరలోకం నుండి దేవుడు వచ్చే సమయం కోసం విశ్వాసి కూడా ఏమరపాటు లేకుండా ఎంతో సిద్ధపాటుతో ఎంతో జాగ్రత్తగా ఎదురుచూస్తూ ఉండాలి!

బుద్ధిలేని కన్యకల ఉపమానం ప్రకారం సిద్ధపాటు లేకపోతే బుద్ధిలేని కన్యకలను దేవుడు వదిలివెల్లిపోయినట్లు నిన్ను కూడా వదిలిపెట్టేస్తారు జాగ్రత్త!... తర్వాత నీ పేరిట నేను ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా! నీకు కోటిరూపాయలు కానుక ఇవ్వలేదా అంటే అక్రమము చేసేవారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటారు జాగ్రత్త!

Matthew(మత్తయి సువార్త) 25:3,4,10,11,12,13

3. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసికొనిపోలేదు.

4. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.

10. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;

11. అంతట తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా

12. అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

13. దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

 

అందుకే తీతు పత్రికలో పౌలుగారు చెబుతున్నారు.. 2:13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

కాబట్టి సిద్దపడిన విశ్వాసులు ప్రభువు దినం జరిగేటప్పుడు ఏవిధంగాను ఆశ్చర్యపోరు! ఆయన రాకడ మరియు యుగాంతానికి గల గుర్తులు నెరవేరుతూ ఉంటే విశ్వాసులు మరింత సిద్ధపాటులో ఉండాలి! ఆయన చెప్పిన మరిన్ని గుర్తులు చూసుకుందాము!

 

 థెస్సలొనీకయులకు 2:3,4

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

 

అపో 2:20

ప్రభువు ప్రత్యక్షమగు మహాదినము రాకమునుపుసూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

 

మత్తయి 24 మొత్తము

 

కాబట్టి ఆయన రాకడకు సిద్దపదదాము!

హెబ్రీయులకు 10: 25

దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము.

 

మన జీవితాలు సరిచేసుకుని ఆయనతో సమాధాన పడదాము!

ఆయనకు ఆయాసం కలిగించే పనులు మానేద్దాం!

ఆత్మపూర్ణుల మవుదాం!

ఎత్తబడదాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*56 భాగం*

*ప్రత్యక్షతలు-9- - పభువుదినము*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనే దానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

   ఇక వచనాలలో గమనించవలసిన మరో విషయం : రాత్రివేళ దొంగ వచ్చినట్లు ప్రభువు దినము వచ్చును అంటున్నారు! ఇక్కడ ఈరోజు ధ్యానం చేసుకొనే అంశం ప్రభువుదినము!!

ప్రభువుదినము అనగా ఏమిటో వివరంగా చూసుకుందాము!

 

యోవేలు 1: 15

ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.

 

     వచనంలో యెహోవా దినం ఆసన్నమైంది అయితే అది మంచి రోజు కాదు భయంకరమైన దినం! అది ప్రళయం లాగ దేవునిదగ్గర నుండి వస్తుంది అంటున్నారు. ఉపవాసము ఎందుకు ఉండమంటున్నారో ఇది మరో కారణం! కారణం యెహోవా దినం వస్తుంది గనుక చెయ్యాలి అంటున్నారు.

 

   యెహోవా దినం కోసం ఆలోచిస్తే ఇదే యెహోవా దినం కోసం ఇదే యోవేలు గ్రంధంలో నాలుగుసార్లు వ్రాయబడింది.

 యోవేలు 2: 1

సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.

 యోవేలు 2: 11

యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?

 

యోవేలు 2: 31

యెహోవాయొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

 

యోవేలు 3: 14

తీర్పుతీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.

 

అయితే అన్నిచోట్లా ఒకే అర్ధం రాదు. కొంచెం ఇటు అటుగా ఉంటుంది అర్ధం!  ముందు ఇంకా ఘోరమైన సంఘటనలు జరుగబోతున్నాయి కాబట్టే ఉపవాసముండి ప్రార్ధన చేయమంటున్నారు భక్తుడు!

 

   యెహోవా దినము అనే మాట కోసం బైబిల్ లో ఇంకా చాలామంది ప్రవచించారు.

యెషయా గారు చెబుతున్నారు: 13:6--12

6. యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.

7. అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

8. జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును.

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

11. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

12. బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండ జేసెదను.

 

యేహెజ్కేలు గారు చెబుతున్నారు: 13:5

యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.

 

యెహేజ్కేలు 30: 3

యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.

 

ఆమోసు గారు చెబుతున్నారు: 5:18

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

 

ఓబధ్యా గారు చెబుతున్నారు: 1:15

యెహోవాదినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.

 

జెఫన్యా గారు అంటున్నారు: 1:7, 14

7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.

14. యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.

 

మలాకి గారు ప్రవచిస్తున్నారు 4:5

యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.

 

ఇదీ పాత నిబంధనలో యెహోవా దినం గూర్చి వ్రాయబడింది.

 

ఇక క్రొత్త నిబంధనలో చూసుకుంటే యెహోవా దినము అనేమాట *ప్రభువు దినము* అని వ్రాయబడింది.

1థెస్సలొనికయులకు 5: 2

రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

 

Thessalonians (రెండవ థెస్సలొనీకయులకు) 2:1,2,3

1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల

2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు (నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని దినము రాదు.

 

2పేతురు 3: 10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును.  దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

 

గమనించండి  అన్ని రిఫరెన్సుల ప్రకారం యెహోవా దినము అనగా  అంత్యదినాలలో యేసుక్రీస్తుప్రభులవారు  లోకానికి తిరిగి వచ్చే దినాలలో జరగబోయే సంభవాలు అని అర్ధం! అవి మంచివైతే కావు! లోకానికి శ్రమ దినాలు! తీర్పు దినాలు!  భక్తిహీనులకు ప్రతిదండన దినాలు!

 

ఇక ఇదే వచనంలో మరో మాట: *యెహోవా దినము వచ్చెనే* కొన్ని ప్రతులలో ఆసన్నమైంది అని ఉంది. అయితే దీనికోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎప్పటినుండో భక్తులు యెహోవా దినం ఆసన్నమైంది, దగ్గరపడింది అని చెబుతున్నారు. అయితే దీని అర్ధం బైబిల్ పండితుల బాష ప్రకారం యెహోవా దినం త్వరలో రాబోతుంది అని కాదు-  *యెహోవా దినం సిద్ధంగా ఉంది!* అయితే అది ఎప్పుడో తెలియదు! కాలం పరిపక్వమైనప్పుడు అది జరుగబోతుంది. ఇంకా రక్షించబడవలసిన అన్యజనుల సంఖ్య పూర్తి అయినప్పుడు, క్రీస్తుకోసం హతస్సాక్షులు కావలసిన సంఖ్య పూర్తి అయినప్పుడు దేవుని రాకడ లేక యెహోవా దినం వస్తుంది!

 

2పేతురు 3: 9

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

 

ప్రకటన గ్రంథం 6: 10

వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

ప్రకటన గ్రంథం 6: 11

తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు వారివలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

 

యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా అంటున్నారు  దినము గూర్చి గడియ గూర్చి ఎవరికీ తెలియదు. చివరకు నాకు కూడా తెలియదు! అది తండ్రికి మాత్రమే తెలుసును అంటున్నారు. మత్తయి 24:36; మార్కు 13:32;

 

అయితే మనలను మాత్రం సిద్దంగా ఉండండి. మెలుకువగా ఉండి ప్రార్ధన చెయ్యండి దివిటీలలో నూనెను నింపుకోండి అంటున్నారు. మత్తయి 25.

మత్తయి 24: 42

కావున దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

 

ఇంకా రోమా 13:11—12

11. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము.

ప్రకటన 1:

సమయము సమీపించినది గనుక ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

 

అయితే మీదన చెప్పినట్లు పేతురు గారు అంటున్నారు 2పేతురు :8--9లో  దినాన్ని ఖచ్చితంగా లెక్క కట్టి చెప్పలేము

 

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

కాబట్టి కోణంలో చూస్తే యెహోవా దినం చాలా దగ్గరపడింది.

 

హబక్కూకు 2: 3

దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

 

అంతేకాకుండా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఆయన చెపిన రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. కాబట్టి మనం సిద్దంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

ఇక తర్వాత అంశం: అది ఎంతో భయంకరమైన దినం అంటున్నారు. దీనికోసం మీద వచనాలలో చూసుకున్నాం. ఇంకా వివరంగా కావాలంటే దీనికోసం యెషయా 2:10--21 వచనాలు చదవండి.

ఇంకా 24:1--13 చదవండి.

ఇంకా ప్రకటన 15 మరియు 16 అధ్యాయాలు చదవండి.

ప్రియ స్నేహితుడా! ఆయన రాకడ సిద్దంగా ఉంది. మరినీవు సిద్ధంగా ఉన్నావా?  నీ దివిటీలో పరిశుద్ధాత్ముడు అనే నూనెను నింపుకుని ఉన్నావా? లేకపోతే బుద్ధిలేని కన్యకలు విడువబడినట్లు విడవబడతావు జాగ్రత్త! తలుపు వేయబడిన తర్వాత , సంఘం ఎత్తబడిన   తర్వాత వచ్చి తలుపుకొట్టినా అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు అంటారు!

నేడే మారుమనస్సు పొంది సిద్దపడు!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*57 భాగం*

*ప్రత్యక్షతలు-10- పభువుదినము-2*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనే దానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

   ఇక వచనాలలో గమనించవలసిన మరో విషయం : రాత్రివేళ దొంగ వచ్చినట్లు ప్రభువు దినము వచ్చును అంటున్నారు! ఇక్కడ ఈరోజు ధ్యానం చేసుకొనే అంశం ప్రభువుదినము!!

    

       (గతభాగం తరువాయి)

  యోవేలు 2:1—5   

1. సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.

2.  దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

3. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.

4. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.

5. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.

           

       రెండవ అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే సీయోను కొండమీద బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీదన హెచ్చరిక నాదము చెయ్యండి అంటున్నారు. హెచ్చరిక నాదము ఎప్పుడు చేస్తారు అంటే ఏదైనా ఆపద / ప్రమాదం వస్తుంది అప్రమత్తంగా ఉండండి. యుద్దానికి సిద్దంగా ఉండండి అంటూ హెచ్చరిక నాదం చేస్తారు. ఇక్కడ దేనికోసం హెచ్చరిక నాదం చెయ్యాలి అంటే యెహోవా దినం వస్తుంది కాబట్టి హెచ్చరిక నాదం చెయ్యమంటున్నారు.

ఏం? ఎందుకు చెయ్యాలి? అంటే జవాబు రెండవ వచనంలో ఉంది. యెహోవా దినం మంచిరోజు కాదు! చీకటి మహాంధకారం గలదినం అంటున్నారు.

 

   ఒకసారి ఆగి ఆలోచన చేస్తే-సీయోను కొండమీద బాకా ఊదండి అంటున్నారు. మొదటగా సీయోను కొండ అనగా ఏమిటి? అనేక శీర్షికలలో వివరించినట్లు కీర్తన 2:6 ప్రకారం సీయోను అనగా యేరూషలేము.

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.

 ఇంకా దేవుని పట్టణము! మహారాజు పట్టణము! పరిశుద్ధ పట్టణము!

నూతన నిబంధన సంఘము పరమ సీయోనుగా కట్టబడుతుంది.

 

  ఇక బాకా కోసం ఆలోచిస్తే సంఖ్యా కాండంలో మనము బాకా నాదం కోసం చాల వివరంగా రాయబడింది. 10 అధ్యాయంలో దేవుడు మోషేగారికి చెప్పారు రెండు బూరలు వెండితో చేయించు! అవి ఎప్పుడూ ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఒక సారి ఊదితే కేవలం ఇశ్రాయేలు నాయకులు మాత్రమే రావాలి. ఎక్కువ సార్లు మాటిమాటికి ఊదితే ఏదో అపాయం అని గ్రహించాలి. అది ప్రమాదానికి ఆపదకు సూచనగా ఉంటుంది. అప్పుడు ప్రజలందరూ రావాలి. మొదట ఆపద సూచనగా ఊదితే తూర్పు దిక్కున ఉన్నవారు రావాలి, రెండోసారి అలాగే ఊదితే దక్షిణ దిక్కున వారు రావాలి. ఇలా రకరకాలైన పరిస్తితులు కోసం వ్రాయబడింది. అంతేకాకుండా దేవుని ప్రతిష్ట దినాలలో ఇంకా పండుగ రోజులలో కూడా భూరలు ఊదాలి అని దేవుడు చెప్పారు.  లేవీ 23:24; 25:9; హోషేయ 5:8; 8:1;

 

అయితే గమనించాలి ఇక్కడ  వచనం ప్రకారం మరి  రకమైన బూర ఊదమంటున్నారు దేవుడు ఇక్కడ? హెచ్చరికనాదము లేక ఆపదను సూచించే బూర! అనగా ఎక్కువ సార్లు ఊదాలి బూరను! ఎందుకు ఊదాలి అంటే యెహోవా దినము రాబోతుంది.  అది మంచిరోజు కానేకాదు! అది సమీపమాయెను అని చెప్పమంటున్నారు. గతభాగం లో చెప్పిన విధముగా సమీపముగా ఉంది అంటే వెంటనే/ తొందరలో రాబోతుంది అని కాదు! యెహోవా దినము సిద్దముగా ఉంది అని గ్రహించాలి!  అయితే దాని ETA అనగా Estimated Time of Arrival ఎవరికీ తెలియదు! గాని ఒక్కటి మాత్రం నిజం అది వచ్చిందాదేశానివాసులంతా వణుకుదురు అంటున్నారు.

  ఇక ఆరోజు మంచిరోజు కాదు అనేది గతభాగంలో ధ్యానం చేసుకున్నాము! 

ఆమోసు 5:18

యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.

 

జెఫన్యా 1:15

దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.

 

అయితే యెహోవా దినము చీకటి దినము అంటున్నారు. దానినే ఇదే అధ్యాయంలో రెండుసార్లు నొక్కివక్కానిస్తున్నారు.

2:10; 31.

10. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.

31. యెహోవాయొక్క భయం కరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

 

యెషయా గ్రంధంలో కూడా అదే రాయబడింది యెషయా గ్రంథము 13:9,10

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

 

మీదన వివరించిన వచనాలలో కూడా ఇదే వ్రాయబడింది.

రెండో వచనంలో కూడా అదే అంటున్నారు.....

 దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును  దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

 

దీనినే ప్రకటన 9 అధ్యాయంలో కూడా చెబుతున్నారు. మొదటగా పొగ వస్తుంది.  పొగలోనుండి మిడుతలు రాబోతున్నాయి.

దీనినే మహా సమూహాలు/ సైన్యాలు వస్తున్నాయి అని కూడి ఇదే వచనంలో చెబుతున్నారు.  ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మిడుతల కోసం మాట్లాడుచున్నారా లేక నిజంగా శత్రుసైన్యాలు రాబోతున్నాయా అంటే రెండూ అనుకోవచ్చు మనం! ప్రకటన 16 అధ్యాయం ప్రకారం, ప్రకటన 19 అధ్యాయం ప్రకారం గోగుమాగోగు యుద్ధంలోను, హార్మేగిద్దోను యుద్ధంలోను ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేఖంగా భూమిమీదనున్న సైన్యాలన్నీ కూడి యేరూషలేము మీదకు దండెత్తి వస్తాయి అని గ్రంధం చెబుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తుప్రభులవారు చెప్పారు- ఎప్పుడైతే ఇశ్రాయేలు లేక యేరూషలేము చుట్టూ దండ్లు లేక సైన్యాలు యుద్ధానికి వస్తాయో అప్పుడే అంతం రాబోతుంది ఆయన రాకడ లేక యెహోవా దినము రాబోతుంది అని గ్రహించమని చెబుతున్నారు. కాబట్టి ఆరోజు తప్పకుండా మానవ సైన్యాలు యేరూషలేము మీదకు రాబోతున్నాయి. జెకర్యా గ్రంధంలో దీనికోసం చాలాసార్లు వివరంగా రాశారు.  12:; 9; Zechariah(జెకర్యా) 12:3,9

3.  దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

9.  కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

 

అయితే  యోవేలు 1,2 అధ్యాయాలు ప్రకారం, ఇంకా ప్రకటన 9 అధ్యాయం ప్రకారం మిడుతలు కూడా యేరూషలేము మీదకు దండెత్తబోతున్నాయి అని గ్రహించాలి!

 

ప్రియ సహోదరి/ సహోదరుడా!  రోజు చాలా సిద్దంగా ఉంది! మరి నీవు సిద్ధంగా ఉన్నావా?

లేకపోతే  శ్రమలు నీవు పడలేవు గనుక మారుమనస్సు పొంది సిద్దపడు!

దైవాశీస్సులు!

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*58 భాగం*

*ప్రత్యక్షతలు-11- - పభువుదినము-3*

1 థెస్సలోనిక 5:1—4

1. సహోదరులారా, కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

2. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

3. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

4. సహోదరులారా, దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

      ఇక ఇంతవరకు ప్రభువుదినము అనగా ఏమిటి అనేది తెలుసుకున్నాముప్రభువుదినము ఎప్పుడొస్తుంది అనగా దొంగ వచ్చినట్లు చెప్పకుండా వస్తుంది అని ధ్యానం చేసుకున్నాము! అదే సమయంలో దొంగలా వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు వెలుగు సంబంధులు గనుక ఆయన వచ్చేముందు ఆయన రాకడ సూచనలు నెరవేరుతూ ఉంటాయి కాబట్టి మనకు ఆయన రాకడ సమయం మనకు అర్ధమవుతుంది అని కూడా మనం ధ్యానం చేసుకున్నాము!

 

   ఇక మూడవ వచనంలో లోకులు లోకమంతా నెమ్మదిగా ఉంది భయమేమియులేదని చెప్పుకొనుచుండగా గర్భిణీస్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం వస్తుంది అప్పుడు వారెంత మాత్రము తప్పించుకోలేరు అంటున్నారు! ఇప్పుడు కూడా అందరూ అనుకుంటున్నారు అంతా బాగుంది! భయమేమి లేదు అని! అయితే ఇలాంటి సమయంలోనే ప్రభువురాకడ ఉంటుంది! మరికొందరు అనుకుంటున్నారు రాకడ వస్తుంది వస్తుంది అంటున్నారు, మా తాతలు చెప్పారు రాకడ వస్తుందని, మా తాతలు చనిపోయారు గాని రాకడ రాలేదు! మా తల్లిదండ్రులు చెబుతున్నారు మాకాపరి చెబుతున్నారు కాని రాలేదు! వీళ్ళు ఇలాగే అంటుంటారు! గాని రాకడ రాదు అని అనుకుంటున్నారు! దానికోసం పేతురు గారు రాస్తున్నారు 2పేతురు 3:312 వచనాలలో దీనికోసము రాస్తూ అంటున్నారు:..

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

5. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

6. నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

  అందుకే పౌలుగారు ఆత్మావేశుడై అంటున్నారు లోకులంతా లోకం నెమ్మదిగా ఉంది భయాలు ఏమీ లేవు అని చెప్పుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ఎలా చెప్పకుండా నెప్పులు ప్రారంభమవుతాయో అలాగే ప్రజలకు నాశనం వస్తుంది అంటున్నారు! ప్రజలకు ఎంతచెప్పినా వినడం లేదు! పాపము మానడం లేదు! పాపములో నడవడం అలవాటు అయిపోయింది! అది ఎంతో రుచిగా కంటికి ఇంపుగా మనస్సుకి శరీరానికి హాయిగా ఉంటుంది! అందుకే దానినుండి బయట పడలేక పోతున్నారు! బయటపడటానికి ఇష్టపడటం లేదు! ఒకరోజు వస్తుంది ఆరోజు నీవు తప్పించుకోలేవు! ఆహాబురాజు తప్పించుకోలేక పోయాడు! సౌలురాజు తప్పించుకోలేక పోయాడు! ఇశ్రాయేలు ప్రజలను ఏలిన రాజులు తప్పించుకోలేక పోయారు! నీవు కూడా తప్పించుకోలేవు జాగ్రత్త! సామెతలు 29:1 ఎన్నిమారులు గద్దించినా వినని వానికి మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమవును ...

దేవుని గద్దింపును దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి తిరుగుతున్నావు కదా! రోజు నీకు వారింగ్ లేకుండా తప్పించుకొనే చాయిస్ లేకుండా మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతావు జాగ్రత్త! అప్పుడు వారెంతమాత్రము తప్పించుకోలేరు అని బైబిల్ స్పష్టముగా చెబుతుంది!

 

                   ఇశ్రాయేలు దేశంలో రోజులలో   మరికొంతమంది ప్రవక్తలు క్షేమము లేకపోయినా క్షేమం క్షేమం అంటూ వారిని దారి తప్పించారు!

 యిర్మియా 6: 14

సమాధానములేని సమయమునసమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయు దురు.

 

యెహేజ్కేలు 13: 10

సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.

 

అయితే దేవుడు ఇలా తప్పుడు ప్రవచనాలను చెప్పి తన ప్రజలను మోసగించిన ప్రవక్తలకు భయంకరమైన తీర్పు తీర్చారు! నేటి దినాలలో కూడా ఆయన రాకడ సిద్దముగా ఉంటే ప్రజలను రాకడకోసం సిద్దపరచకుండా ఎప్పుడూ దేవుడు మిమ్మును దీవిస్తాడు, మిమ్ములను ఆశీర్వదిస్తాడు, మిమ్మును ఓదార్చబోతున్నారు, మిమ్మును స్వస్థత పరుస్తారు అంటూ ప్రసంగాలు చేసి ప్రజలను సోమరులను చేస్తున్నారు! రాకడకు  ఆయత్తపరచకుండా ఖండించి  గద్దించి బుద్ధిచెప్పకుండా ప్రజలు మెచ్చే ప్రసంగాలు చేస్తున్నారు! భోధకులు కూడా ఎవరూ తప్పించుకోలేరు!

 

ఇలా సిద్దపాటు లేనివారికి హటాత్తుగా నాశనం వస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది

సామెతలు 6: 15

కాబట్టి ఆపద వానిమీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండ క్షణమందే నలుగగొట్టబడును.

 

యెషయా 10: 25

వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

 

యెషయా 47: 11

కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును.

 

యెషయా 48: 3

పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.

 

కీర్తనలు 145: 20

యెహోవా తన్ను ప్రేమించు వారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును

 

కాబట్టి మార్పుచెంది ప్రవర్తనను సరిదిద్దుకుని దేవునితో సమాధానపడి ఆయన రాకడకు సిద్ధపడుదాము!

దైవాశీస్సులు!

  

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*59 భాగం*

1 థెస్సలోనిక 5:6—8

6. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.

7. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.

8. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

  ఇక 6,7 వచనాలలో మనము వెలుగు సంబంధులము కాబట్టి ఇతరుల వలె నిద్రపోకుండా మెలుకువగా ఉంటూ మత్తులము కాకుండా ఉందాము అంటున్నారు. ఇంకా నిద్రపోయే వారు మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా నిద్రపోతారు అయితే మనము పగటికి సంబంధించిన వారము కాబట్టి మెలుకువగా ఉందాము అంటున్నారు!

 

  ఇక్కడ ఇతరుల వలె నిద్రపోవద్దు అంటున్నారు! అనగా మనము ఎప్పుడూ నిద్రపోకుండా మెలకువగా ఉండమంటున్నారా పౌలుగారు? కానేకాదు! ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండమంటే ఇతరుల వలె అనగా అన్యజనుల వలె తిని త్రాగుచూ తాగుబోతుల విందులలో పాల్గొంటూ ఉండక ఆత్మయందు మెలుకువ కలిగి జాగరూకుడవై ఉండమని చెబుతున్నారు! ఇంకా వివరంగా చెప్పాలంటే నిద్రపోయిన వానికి బయట ఏమి జరుగుతుందో తెలియదు! తనకు ఆపద వచ్చినా తెలియదు! కారణం నిద్రపోయాడు! అలాగే త్రాగుబోతుకి ఏమి జరుగుతుందో తెలియదు! అయితే త్రాగడం లేకపోతే నిద్రపోవడమే తెలుసు! అందుకే ఇలాంటి వారిమీదికి లేమి ఆయుధ దారుడు వచ్చినట్లు వచ్చి సర్వము దోచుకుపోయినట్లు ఉంటుంది అంటున్నారు!

సామెతలు 24: 34

వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

 

అందుకే ఏడవ వచనంలో నిద్రపోయిన వాడు త్రాగుబోతు రాత్రి పూట నిద్రపోతారు లేక మత్తులై ఉంటారు! అయితే మనము పగటి వారము అనగా మెలుకువగా ఉండేవారము! త్రాగుబోతులం కాదు నిద్రబోతులం కాదు! కాబట్టి మెలుకువ కలిగి ఆయన రాకడకు కనిపెట్టుకుని ఉందాము అంటున్నారు!

 

ఇంకా వివరంగా చూసుకోవాలంటే పౌలుగారు రోమీయులకు రాస్తున్నారు 13:1214 లో....

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

 

గమనించాలి అన్యులు నడచినట్లు మనం అల్లరిచిల్లరగా తిరగరాదు పోకిరి పనులు లాంటివి చేయకూడదు దానికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని శరీరక్రియలు వదిలి దేవునికోసం బ్రతకండి అంటున్నారు!

 

2పేతురు 2:13

ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంక ములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.

 

ఇక మెలుకువగా ఉండటం కోసం యేసుక్రీస్తుప్రభులవారు ఎన్నోసార్లు చెప్పారు

మత్తయి 24:42--44

42. కావున దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

43. జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

 

Matthew(మత్తయి సువార్త) 25:13

13. దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

 

మార్కు 13: 36

ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.

 

లూకా 12:37,38,39

 

 లూకా 21: 36

కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు (కొన్ని ప్రాచీన ప్రతులలో- పాత్రులనియెంచబడునట్లు అని పాఠాంతరము) ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.

 

ఇక అపోస్తలులు కూడా రాస్తున్నారు

1కొరింథీ 16:13

మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

 

ఎఫెసీ 6:18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

ఎఫెసీయులకు 6: 20

దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

కొలస్సీయులకు 4: 2

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 4: 7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 5: 8

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

 

చివరగా ప్రకటన గ్రంధం 16:16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

కాబట్టి మెలుకువగా ఉందాము! త్రాగుడు, పొగత్రాగుట, మాదక ద్రవ్యాలు తీసుకొనుట లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉందాము! వాటికి గంతించిన కాలమే చాలును అంటున్నారు భక్తులు! 1పేతురు 4:3

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

 

వాటిని వదిలిపెట్టి ఆయన రాకడకు సిద్దపడదాము!

మత్తయి 26: 41

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి;

ఆమెన్!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*60 భాగం*

1 థెస్సలోనిక 5:8—9

8. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.

9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా! ప్రస్తుతం యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటున్నాము!   ప్రియులారా ఐదవ అధ్యాయంలో  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం రాస్తున్నారు పౌలుగారి త్రయము!

 

     ప్రియులారా! ఇక 8,9 వచనాలలో అంటున్నారు మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండొద్దు అంటూ పగటి సంబంధులు లేక వెలుగు సంబంధులు వలె ప్రవర్తించేలా విశ్వాస ప్రేమలు అనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము అంటున్నారు. తొమ్మిదో వచనంలో ఎందుకంటే దేవుడు మనలను రక్షణ పొందడానికే పిలిచారు గాని ఉగ్రత పొందటానికి కాదు అంటున్నారు! రెండు వచనాల సారాంశము జోడించి అర్ధము చేసుకుంటే మనం రక్షణలో కొనసాగాలి అంటే మొదటగా మత్తులమై ఉండకూడదు అంటూ విశ్వాసము మరియు ప్రేమ అనే కవచం ధరించుకోవాలి ఇంకా రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి అన్నమాట! అప్పుడే మనం రక్షణలో కొనసాగగలము అన్నమాట!

 

    సరే, ఇక్కడ పౌలుగారు విశ్వాస ప్రేమలు అనే కవచము అన్నారు, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము అన్నారు మరి ఎఫెసీ 6:1318 వరకు చూసుకుంటే మరోలా ఉంది కదా! నీతి అనే మైమరువు, రక్షణ అనే శిరస్త్రాణము!   మరి ఎందుకు ఇలా తేడాగా రాశారు! ఇంతవరకు మొత్తం బైబిల్ నలబైమంది వ్యక్తులు రాసినా అందరిని వ్రాయడానికి ప్రేరేపించి వ్రాయించిన అసలు రచయిత పరిశుద్ధాత్ముడు అన్నారు కదా మరి ఎందుకు ఇలా తేడాగా రాశారు అని కూడా అడగొచ్చు మీరు! అవును దీనిని పరిశుద్ధాత్ముడే వ్రాయించాడు అనడంలో ఎంతమాత్రము సందేహము లేదు! మరి ఎందుకు ఇలా వ్రాయాల్సివచ్చింది?

 

ప్రాముఖ్యంగా రెండు కారణాలు కావచ్చు!

 

మొదటిది: మొదటి భాగము నుండి చెబుతూ వచ్చాను థెస్సలోనికయ సంఘాలు ఆత్మీయంగా ఎంతో బలమైన స్తిరమైన పునాది కలిగి సంపూర్ణత సాధించిన సంఘాలు! వారి ఆత్మీయ పోరాటంలో (Spiritual Warfare)  జయజీవితం సాధించిన సంఘాలు!  కేవలం క్రీస్తుయేసు ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు అన్నివిధాల సిద్ధపడి ఎదురుచూస్తున్న సంఘాలు! అందుకే ఇప్పుడు ఆత్మీయత కొనసాగాలి అంటే ఇక్కడ 8వవచనంలో ఉదాహరించినవి చాలు! అనగా విశ్వాసము ప్రేమ అనే కవచము రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము చాలు! అయితే ఎఫెసీ సంఘము తమ ఆత్మీయ పోరాటంలో (Spiritual Warfare) ఎన్నెన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న (Still Struggling a lot)  సంఘము! అందుకే సంఘ ప్రజలకు వారి ఆత్మీయ పోరాటంలో  (Spiritual Warfare) సాతానును ఎదుర్కొని స్థిరంగా నిలబడాలి అంటే ఎఫెసీ 6:1318 వరకు ఉదాహరించిన అన్ని ఆయుధాలు కావాలి! అనగా........Ephesians(ఎఫెసీయులకు) 6:11,12,13,14,15,16,17,18

 

11. మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని

15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.

16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

17. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

అంటే ఎఫెసీ సంఘానికి పైన చెప్పిన అన్ని ఆయుధాలు కావాలి గాని థెస్సలోనికయ సంఘాలకు కేవలం విశ్వాస ప్రేమలు అనే కవచం లేక మైమరువు, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము మాత్రమే కావాలి! ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే మన తెలుగు బైబిల్ లో రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము అని వ్రాయబడినా ప్రాచీన ప్రతులలోను ఇంగ్లీసు తర్జుమా లోను మరో విధంగా ఉంది Hope Of Salvation అనగా రక్షణ పొందుకున్నాము/ పొందుకుంటాము అనే నిరీక్షణ!

 1థెస్సలొనికయులకు 5: 8

మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.

 

1 Thessalonians 5: 8

But let us, who are of the day, be sober, putting on the breastplate of faith and love; and for an helmet, *the hope of salvation*.

 

ఎఫెసీ వారికి నీతి అనే మైమరువు లేక కవచము తొడుగుకోండి అని రాశారు గాని వీరికి విశ్వాసం ప్రేమ అనే కవచము ఉంటే చాలు అన్నారు!   అనగా విశ్వాసము లోను ప్రేమలోనూ ఎదిగినప్పుడు ఆత్మీయ పోరాటంలో ఎదురీతలు రావు ఎందుకంటే మొదటగా ఏమి జరిగినా నాతో దేవుడున్నాడు పరిశుద్దాత్ముడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు అనే ధైర్యం ఉంటుంది! ఇక ప్రేమలో విస్తరించినప్పుడు అసూయ ద్వేషాలు కాముకత్వం లాంటి శరీర క్రియలు వారికి అంటవు! ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి! దేవుడు ప్రేమయై ఉన్నారు కాబట్టి క్రీస్తుప్రేమ వారిని ఇలాంటి పాపపు తలంపుల నుండి దూరంగా నెట్టుతుంది! 

ఇక ఎఫెసీ పత్రికలో  రక్షణ అనే శిరస్త్రాణము  అన్నారు ఇక్కడ రక్షణ నిరీక్షణ అన్నారు! రక్షణ పొందుకున్నాము అనే నిరీక్షణ కలిగి ఉండమంటున్నారు ఇక్కడ పౌలుగారు సంఘానికి! అనగా దేవుని రక్షణను నేను పొందుకున్నాను కాబట్టి నా ఆత్మ తనువూ అన్ని దేవునిలో భద్రముగా ఉండటమే కాకుండా ఈరోజు నేను చనిపోయినా నా ప్రభువుతో ఉండటానికే వెళ్తున్నాను అనే భరోశా వలన నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో సాధించగలవు! అందుకే సంఘానికి రక్షణ పొందుకున్నాను అనే నిరీక్షణతో ఉండమంటున్నారు!

 

ఇక రెండవది:  లక్షణాలు లేక ఆయుధాలు కోసం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ క్రైస్తవులకు లేక విశ్వాసులకు ఉండవలసిన మంచి లక్షణాలు! అనగా విశ్వాసం ప్రేమ, నిరీక్షణ ఇవన్నీ దేవుడు కోరుకుంటున్న విశ్వాసిలో ఉండవలసిన మంచి లక్షణాలు! వీటన్నిటికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి! అనగా లక్షణాలు విశ్వాసి కలిగి ఉంటాడో వ్యక్తి క్రీస్తుని ధరించుకున్నాడు అన్నమాట! ఇంకా చెప్పాలంటే క్రీస్తుని ధరించుకున్నందు వలన మంచి లక్షణాలు అన్ని ధరించుకుంటాము అన్నమాట!

 

రోమీయులకు 13: 14

మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

 

ఎఫెసీయులకు 4: 24

నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును (మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.

 

ఎఫెసీయులకు 6: 13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

 

కాబట్ట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా! ఆత్మ ఫలము పొందుకోండి! తద్వారా శరీర క్రియలు వదిలివేసి క్రీస్తును ధరించుకుని క్రీస్తు రూపములోనికి మనం మార్చబడ గలము!

 

నేడే మన బ్రతుకులు సరిచేసుకుని ఆయన రూపమును ధరించుకుని ఆయనతో పాటుగా ఎత్తబడదాము!

దైవాశీస్సులు! 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*61 భాగం*

1 థెస్సలోనిక 5:10—11

10. మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించు నిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.

11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము  యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ కోసం ధ్యానం చేసుకుంటూ  రాకడ సమయం ఏమిటి మనము ఏవిధంగా సిద్ధపడాలి అనేదానికోసం ధ్యానం చేసుకున్నాము!

 

  ఇక తర్వాత మాటలలో క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం రాస్తున్నారు! 10,11 వచనాలలో మనము మేలుకొని ఉన్నా గాని నిద్రపోవుచున్నా గాని మనము తనతోకూడా అనగా యేసుక్రీస్తుప్రభులవారితో కూడా జీవించు నిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను అంటున్నారు.

 

  గమనించాలి మనం నిద్రపోతున్నా మెలుకువగా ఉన్నా గాని మనము ఆయనతోపాటుగా జీవించాలి అంటున్నారు కదా! దీని అర్ధం ఏమిటి? అనగా మనము స్థితిలో ఉన్నాగాని ఆయనకు మహిమకరంగా జీవించాలి అన్నమాట! ఇప్పుడు మెలుకువగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండగలము ఆయనకు మహిమ తెచ్చేపనులు చేయగలము! మరి నిద్రపోతూ ఎలా జీవించగలము అనగా ఆయనకు మహిమకరంగా ఎలా జీవించగలము?

 

  విషయం కోసం అనేకసార్లు మీకు వ్రాయడం జరిగింది! పడుకున్నా లేచి ఉన్నా ఏమి చేసినా చేస్తున్నా దేవునికి నీవు ఎలా మహిమ తేగలవు లేక దేవునికి మహిమకరంగా ఆయనను స్తుతిస్తూ ఎలా ఉండగలవు అనగా నీవు దేవునితో ఐక్యమైపోవాలి! నీ తనువూ మనస్సు ఆత్మ దేవునితో Synchronize అయిపోవాలి! లేచినా స్తుతి, పడుకున్నా నీ ఆత్మ స్తుతి స్తుతి అంటుంది. బియ్యం ఏరుతున్నా స్తుతి స్తుతి అంటావు! వంటచేస్తున్నా స్తుతి నీ నోట్లో ఉంటుంది. నీవు పని చేస్తున్నా నీ మనస్సు ఆత్మ దేవునిని స్తుతిస్తూ ఆయనను తలస్తూ ఉంటాయన్న మాట! ఇలాంటి జీవితం కలిగి ఉండాలనే పౌలుగారు అభిప్రాయపడి మనము మేలుకుని ఉన్నా నిద్రపోవుచున్నా గాని మనము తనతోకూడా జీవించాలి అంటున్నారు!  అలా ఉండాలనే దేవుడు మనకోసం మృతిపొందారు అంటున్నారు!

 

 విశ్వాసులు అనగా బ్రతికి ఉన్న విశ్వాసులు క్రీస్తుయేసు జీవము కలిగి ఆయన సహవాసంలో ఉండాలి సహవాసంలో వర్ధిల్లాలి అనేది దేవుని చిత్తము! రోమా పత్రికలో దీనికోసం పౌలుగారు ఏమి చెబుతున్నారో చూద్దాం! 6:49

4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము (మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

 

చూడండి ఆయనతో పాటు చనిపోతే మనము ఆయనతో కూడా లేస్తాము లేక లేచి ఉన్నాము అన్నమాట! మన పాప స్వభావం పోడానికి బాప్తిస్మం సమయంలో మన పాత స్వభావం సిలువవేయబడింది చనిపోయింది!  కాబట్టి మనము ఇక మన పాత పాపపు ఆలోచనలు క్రియలు అన్నీ కూడా వదిలివేయాలి! మనస్సుమారి రూపాంతరం చెందాలి! అదే నూతన స్వభావము నూతన జీవము! అప్పుడు నీ దేహం మీద పాపానికి, లోకానికి, సాతానుకి ఎటువంటి అధికారం ఉండదు! ఒకవేళ నీవు బాప్తిస్మం తీసుకున్నా నీ పాత రోత జీవితం మారలేదు అంటే అనగా నీ వ్యభిచారం, అబద్దాలు, లంచగొండితనం బూతులు సరసాలు, నీ పేకాట, జూదము, అసూయ కక్ష్యలు కోపతాపాలు మారలేదు అంటే నీవు పూర్తిగా చావలేదు అన్నమాట! నీవు పూర్తిగా చావలేదు అంటే నీవింకా సాతాను గాడి పార్టీలోనే ఉన్నావన్నమాట! అనగా నాశనానికి, నరకానికి పోయే బాచ్ లో ఉన్నావన్నమాట! జాగ్రత్త- పాతరోత జీవితం మారకపోతే పరలోకం దరికి కూడా చేరలేవు నీవు!

 

కాబట్టి నీవు బ్రతికి ఉంటే ఆయనకు మహిమ కరంగా జీవించాలి! శరీరం నుండి  వెడలిపోయినా క్రీస్తుకోసం మహిమకరంగా జీవించాలి అంటే ఇప్పటినుండే లేక ఇక్కడే నీవు దానికోసం ప్రయత్నం చేసి సాధించుకోవాలి నీ క్రియల ద్వారా! అందుకే పౌలుగారు రాస్తున్నారు 2కొరింథీ 5:810

8. ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.

9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.

10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

ఫిలిప్పీ 1:22—25

22. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.

23. రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.

24. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.

25. మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసియుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. ...

 

ప్రియులారా! ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి- మనము మన పాపములనుండి విడుదల పొందాలనే పాపములేని వ్యక్తి మనకోసం పాపమై చనిపోయారు! దేవుని ఆత్మచేత మరలా బ్రతికారు! కాబట్టి సిలువ యాగానికి ఇవ్వాల్సిన విలువ భయభక్తులు మనము కలిగిఉండాలి! ఆశ్రద్ధచేస్తే తప్పించుకోలేవు జాగ్రత్త!

2పేతురు 3:18,19

18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

19. ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

 

   ఇక 11 వచనంలో అందుచేత మీరు ఇప్పుడు చేస్తున్న విధంగానే ఒకరికొకరు ఆదరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ మీకు మీరు అభివృద్ధి పొందండి అంటున్నారు! ఇక్కడ పౌలుగారు సర్టిఫికెట్ ఇస్తున్నారు మీరిప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే ఇంకా ప్రోత్సాహం కలిగించు కుంటూ ఒకరికొకరు సహాయ పడుతూ దేవునిలో ముందుకు సాగుతూ మీకు మీరు అభివృద్ధి పొందండి అంటున్నారు! గమనించాలి ఇది ప్రతి విశ్వాసి బాధ్యత, పొరుగు వారిని ప్రేమించి ప్రోత్సహించే విశేష అవకాశం ఇది! అందుకే 4:18 లో కాబట్టి మాటలచేత ఒకరినొకరు ఆదరించుకోండి అంటున్నారు ఇక్కడ ఒకరికొకరు ఆదరించుకుంటూ ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి అంటున్నారు! ఎక్కడినుండో కాదు మీకుమీరే, మీ ప్రవర్తన ద్వారా క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి అంటున్నారు! పౌలుగారు మాటలు అనేక సందర్భాలలో అనేకసారులు చెప్పారు

రోమా 14:19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో-వెంటాడుదము) .

 

రోమీయులకు 15: 2

తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

 

ఎఫెసీయులకు 4: 29

వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.

 

   కాబట్టి ప్రియదైవజనమా మనము బ్రతికి ఉన్నంతకాలము లేచి ఉన్నా నిద్రపోతున్నా మనము ఆయనతో జీవిస్తూ అనగా మన మనస్సు ఆత్మ శరీరం అన్నీ ఆయనతో  Synchronize అయ్యి ఆయనకు మన మాటద్వారా ప్రవర్తన ద్వారా నడవడి ద్వారా మహిమ తెద్దాము!

అంతేకాకుండా సహోదరులమైన మనము ఒకరినొకరు ఆదరించుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాలు పంచుకుంటూ ప్రోత్సహించుకుంటూ మనకు మనమే క్షేమాభివృద్ధి కలుగజేసుకుందాం!

దేవుడు మిమ్మును దీవించును గాక!

ఆమెన్!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*62 భాగం*

1 థెస్సలోనిక 5:12—13

12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి

13. వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము  క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

          ప్రియులారా! రెండు వచనాలలో మీకోసం ప్రయాసపడుతూ దేవుని సేవచేస్తున్న మీ పెద్దలను అనగా మీ సంఘకాపరులను నాయకులను సేవకులను మన్ననచేస్తూ వారిని ఘనపరచమని నేను మిమ్మును వేడుకుంటున్నాను అంటున్నారు! దేవునిసేవ చేస్తున్న దైవజనులను పెద్దలను ఎలా గౌరవించాలో ఇక్కడ చెబుతున్నారు పౌలుగారు! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే థెస్సలోనికయ సంఘాలు దైవజనులను పెద్దలను గౌరవం చేయడం లేదా అందుకేనా ఇలా రాయవలసి వచ్చింది అని అడగొచ్చు! సంఘమంతా భక్తిశ్రద్దలు కలవారు అని చూసుకున్నాము గాని ప్రతీ సంఘంలో కొంతమంది ఉంటారు ఎవరైనా ఏదైనా చేస్తే ఎలా విమర్శించాలా ఏమాట అనాలా అని ఉంటారు! బహుశా సంఘంలో కూడా ఉండే వుంటారు బహుశా వారిని ఉద్దేశంచి వ్రాసి ఉండవచ్చు! కారణం వీరు చెయ్యరు ఎవరైనా చేస్తే కుళ్ళిపోతూ ఉంటారు వీరు!

లేదా ఇంకా వీరు తమ పెద్దలను మన్నన చెయ్యాలి అని చెప్పడానికి మాట చెప్పి ఉంటారు!

 

     ఇక్కడ చూడండి - మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి అనగా మీ సంఘంలో మీకు పెద్దలుగా ఉన్నవారు, ఇంకా  కాపరులుగా ఉన్న మీ నాయకులను మీకు బుద్ధిచెప్పుచున్నవారిని మన్నన చేయమంటున్నారు ఎందుకు? వారు చేసే పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని మీకు ఆజ్ఞాపిస్తున్నాను అనడం లేదు! ఏం ఆజ్ఞాపించే అధికారం లేదా పౌలుగారికి? ఉంది గాని తన అధికారం చూపించకుండా మొదటినుండి వారిని సహోదరులుగా భావించి వారికి మార్ఘనిర్దేశం చేస్తూ వచ్చారు పౌలుగారు! అందుకే సంఘము ఇంత శోభాయమానంగా వర్ధిల్లింది! అందుకే మీ పెద్దలను గౌరవించమని మిమ్మును వేడుకుంటున్నాను అని వారికి చెప్పి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన ముఖమైన మాట ఏమిటంటే మీకు బుద్ధిచెప్పుచున్న వారిని మన్నన చేయమంటున్నారు ఇది గమనించాలి! ప్రజలు మెచ్చ్చుకునే బోధలు చేసినవారిని కాదు! తప్పుచేస్తే బుద్ధిచెప్పే వారిని మన్నన చేసి గౌరవించమంటున్నారు !

 

ఇక గమనించాలి పౌలుగారు ఒకసారి చెప్పారు కలిగి ఉన్న అధికారం ఏదైనా ఉంటే అది ప్రభువునుండే కలిగింది కాబట్టి అధికారులకు పెద్దలకు లోబడి ఉండమని!....రోమీయులకు 13: 1

ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.

రోమీయులకు 13: 3

ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.

 

అలాగే ఇక్కడ అధికారం కూడా సంఘనాయకులకు ప్రభువునుండే కలిగింది! కాబట్టి ప్రతి విశ్వాసి దీనిని గమనించి మీ సంఘకాపరులను పెద్దలను గౌరవించాలి! ఇది అంతే! సంఘములో ఒక పద్దతి క్రమశిక్షణ అనేది ఉండాలి అని ప్రభువు చిత్తము!  అదే సమయంలో అధికారాన్ని సంఘనాయకులు ప్రభువుకోసమే వాడాలి తప్ప తమ ఇగో కోసం తమ అవసరాలు కోసం తమ కోరికలు కోసం వాడకూడదు! అందుకే పేతురు గారు పత్రిక రాస్తూ పెద్దలను హెచ్చరిస్తున్నారు! మీరు మీ అధికారం వాడకుండా మీ అధికారం బలవంతంగా చూపించవద్దు మీరు మీ సంఘానికి ప్రభువులుగా ఉండొద్దు గాని మందకు ఆదర్శంగా మాదిరిగా ఉండమంటున్నారు 1పేతురు 5:1—3

1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.

2. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

3. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;

 

దీనికోసం చూసుకుంటే పెద్దలను ఎలా గౌరవించాలి అంటే

1తిమోతి 5:17

బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.

 

హెబ్రీయులకు 13: 17

మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

 

చూసారా అపోస్తలుల కార్యములు ప్రకారం తప్పకుండా సంఘానికి నాయకులు పెద్దలు ఉండాలి! వారికి అధికారం కూడా ఉండాలి!   అధికారం దేవుడు ఇచ్చిందే! కాబట్టి నాయకులు కూడా మంచివారిగా సంఘానికి నాయకులుగా ఆదర్శంగా ఉండాలి!ఇక సంఘ నాయకులు కూడా తమ సంఘ సభ్యులకు కాపరులుగా ఉండాలి

అపో 20:28

దేవుడు (అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

 

1పేతురు 5:14

 

ఫిలిప్పీ సంఘంలో ఎఫఫ్రోదితు అనే సంఘపెద్ద ఎంతో దేవునికోసం కష్టపడ్డారు! చివరకు ప్రాణాపాయం కలిగింది! గాని అందరిప్రార్ధన వలన బ్రతికారు! అప్పుడు పౌలుగారు రాస్తున్నారు- వ్యక్తి మీకోసం తన ప్రాణం పోగొట్టుకోడానికి కూడా సిద్దపడ్డాడు కాబట్టి ఇలాంటి వారిని గౌరవించండి అంటున్నారు!

ఫిలిప్పీ 2:29--౩౦

29. నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క (అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు యొక్క అని పాఠాంతరము) పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను

30. గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.

 

1తిమోతికి 3: 7

మరియు అతడు నిందపాలై అపవాది(సాతానుకు) ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.

 

ఇక్కడ గమనించాలి గౌరవం లేని వారు తగనివారు సంఘంలో ఎలాంటి పదవికి తగరు!

 

1పేతురు 2:17

అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.

1పేతురు 2: 18

పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

ఇక్కడ సంఘపెద్దలు అందరి పట్ల ఒకేలాగా ఉండాలి! పెద్ద గొప్ప బీద అనే తారతమ్యము ఉండకూడదు! దురభిమానం ఉండకూడదు! తామే అధికారులం అన్న భావం ఉండకూడదు! వారి కులాన్ని బట్టిగాని వారి వంశం బట్టి గాని హేళన చెయ్యకూడదు! చిన్నచూపు చూడకూడదు!

యాకోబు 2:1—4,

1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి.

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

 

1కొరింథీ 12:14—26,

రోమీయులకు 12: 10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

యేసుక్రీస్తుప్రభులవారు ఏమన్నారో చూద్దాం!

యోహాను 12:26

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

 

గమనించాలి ఒక కార్యాన్ని తమ సొంత విధానాల్లో పని చేసేవారు క్రీస్తుని సేవించడం లేదు! తన సొంత విషయాన్ని తన సొంత విధానంలో చేసేవారెవరూ క్రీస్తును సేవించడం లేదు. క్రీస్తును అనుసరించేవారు లోకంలో ఆయనెక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు. ఎందుకంటే ఆయన వారి కాపరి. వారెక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు. ఇలా చెయ్యడంలో పరీక్షలు, ప్రమాదాలు, అపాయాలు, బాధలు, క్రీస్తుకోసం చనిపోవడం సంభవించినా దానంతటిలో ఆయన వారితో, వారు ఆయనతో ఉంటారు. ఆయన్ను అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా అనంత కాలం ఆయనతో ఉంటారు. వారి గురించి ఆయన చేసిన ప్రార్థన ఇదే (17:24) గనుక వారికి చేకూరబోయేది ఇదే!

క్రీస్తు సేవకులకు లోకంలో ఎంతో అన్యాయం, హింస, అవమానం, అప్రతిష్ఠ ఎదురు కావచ్చు. వారి ప్రభువును చేసినట్టు వారిని కూడా మనుషులు తృణీకరించి నిరాకరించ వచ్చు. వారికి కలగవలసిన గౌరవాలు ముందున్నాయి. శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తు సేవకులను హెచ్చించి, మెచ్చుకుని, గౌరవించి, బహుమతులిస్తాడు (5:44; మత్తయి 25:21; రోమ్ 2:6-10; 8:18; హీబ్రూ 6:10; 1 పేతురు 5:1, 4; ప్రకటన 22:12). వారికిక్కడ జరిగిన నష్టమేదైనా ఉంటే దానంతటికీ ఆయన పుష్కలంగా పరిహారం చెల్లిస్తాడు. అందువల్ల గౌరవాన్ని మనం ఆశించాలి, ఎవరి మెప్పును కోరాలి మనుషులవల్ల కలిగేదాన్నా లేక దేవునినుంచి వచ్చేదాన్నా అని ఎన్నుకోవాలి!

కాబట్టి క్రీస్తుకోసం ఇన్ని హింసలు పడుచున్నవారిని గౌరవించాలి మన్నన చెయ్యాలి!

ప్రియ సహోదరి సహోదరుడా! నీ కాపరిని సేవకున్ని పెద్దలను గౌరవిస్తున్నావా? వారిని మన్నన చేస్తున్నావా? లేక తిరస్కరిస్తున్నావా? కరోనా సమయంలో నీ కాపరికి ఒకసారైనా ఫోన్ చేసి తన బాగోగులు కనుక్కున్నావా? వారి అవసరాలు తీర్చావా? దయచేసి కష్టకాలంలో మీ కాపరులను వదలివెయ్యవద్దు! వారిని ఘనపరుద్దాం!

మత్తయి 10: 40

మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.

 

దైవాశీస్సులు!

    

 

 

 

 

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*63 భాగం*

1 థెస్సలోనిక 5:14—15

14. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.

15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి (మేలైన దానిని వెంటాడుడి).

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము  క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ఇక 14, 15 వచనాలలో కూడా సంఘంలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలి లేక ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అనే దానినే తెలుపుతున్నారు పరిశుద్దాత్ముడు! సహోదరులారా అక్రమముగా నడచుకొను వారికి బుద్ధి చెప్పండి ధైర్యము చెడినవారికి ధైర్యపరచండి! బలహీనులకు ఊతనియ్యండి! అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి అంటున్నారు! వచనం స్టడీ బైబిల్ లో ఇలా తర్జుమా చేయబడింది! సోదరులారా అక్రమంగా ప్రవర్తించేవారిని హెచ్చరించండి. క్రుంగిపోయిన వారిని ప్రోత్సహించండి. దుర్బలులకు సహాయం చెయ్యండి అందరిపట్ల ఓర్పుతో ఉండండి...

 

   వచనాలలో పౌలుగారు ఒక క్రైస్తవుడు ఎలా నడవాలో చెబుతున్నారు! ఎవరైనా అక్రమముగా ప్రవర్తిస్తే వారికి బుద్ధిచెప్పండి అంటున్నారు. లేదా హెచ్చరించండి అంటున్నారు! ఎందుకు హెచ్చరించాలి లేక బుద్ధిచెప్పాలి అంటే ఎవరో ఎలా పోతే మనకు అనవసరం గాని వ్యక్తి క్రీస్తుయేసు రక్తముతో కడుగబడిన వ్యక్తి మరియు వాక్యము తెలిసిన వ్యక్తి కనుక వ్యక్తికి తప్పకుండా బుద్ధిచెప్పి మరలా దారిలోనికి తీసుకుని రావాలి! అందుకే పౌలుగారు ఇలా తప్పిపోయిన వారిని తీసుకుని రమ్మని చెబుతున్నారు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇదే చెప్పారు! మత్తయి 18:1518

15. మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

16. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.

17. అతడు వారి మాటయు విననియెడల సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

18. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

   ఇంకా అక్రమము చేయువారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటున్నారు...

మత్తయి 7: 23

అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

 

     ఒకసారి కొరింథీ సంఘములో ఒకవ్యక్తి చాలా అక్రమముగా ప్రవర్తిస్తే వెంటనే వ్యక్తిని వేలివేయమని చెప్పారు! తర్వాత పత్రికలో ఇప్పుడు మరలా అతనిని చేర్చుకుని ఆదరించి సంఘములో కలపమన్నారు! కాబట్టి తప్పుచేస్తే చూసి చూడనట్లు ఊరుకోకూడదు పెద్దలు! తెలిసిన వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు చెప్పినవిధముగాను పౌలు మహాశయుడు చెప్పిన విధముగానూ మనము వారికి బుద్ధిచెప్పాలి! వినకపోతే వెలివేయాలి! విధముగా సంఘంలో క్రమశిక్షణ ను అమలుచెయ్యాలి! 1కొరింథీ 5:2—7...

2. ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారుకారు.

3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతో కూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానిని గూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.

4. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై (మూలభాషలో-శరీరము నశించుటకై) మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,

5. నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.

6. మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?

7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను .

 

 2కొరింథీ 2: 5—8

5. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వాని మీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.

6. అట్టివానికి మీలో ఎక్కువమంది వలన కలిగిన యీ శిక్షయే చాలును

7. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.

8. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

 

అందుకే 2 తిమోతి 4:2 లో అంటున్నారు వాక్యమును ప్రకటించుము అంటూ చెబుతూ ఖండించుము గడ్డించుము బుద్ధి చెప్పుము అంటున్నారు

సంఘములో ఏది జరిగినా క్రమముగా మర్యాదగా జరగాలి గాని అక్రమము ఉండకూడదు! 1కొరింథీ 14:40

సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.

 

      ఇక తర్వాత అంశం: ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి లేక కృంగిన వారిని ప్రోత్సహించుడి! విశ్వాసి సంఘపెద్ద ఎవరైనా సంఘములో ధైర్యము చెడిపోయి జీవితంలో ఓడిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్నవారిని ఆదరించి వారికి వాక్యధారముగా దైర్య పరచవలెను! గమనించాలి ఇలాంటి పనులు విశ్వాసులు సంఘపెద్దలు చెయ్యాలి! ప్రతీ విషయం మీ కాపరి చూడలేరు! అన్ని సమయములలోనూ మీ సంఘకాపరి లభ్యముగా ఉండలేరు! కాబట్టి దగ్గరలో ఉన్న విశ్వాసులు ఇలాంటి తోటివిశ్వాసులను ఆదరిస్తూ ఉండాలి! బైబిల్ మొత్తం ఇలాంటి వారిని లేవనెత్తే దేవుడను నేను చెబుతుంది ముఖ్యంగా కీర్తనలు గ్రంధంలో అనేకచోట్ల మాట రాసి ఉంది కాబట్టి వాక్యములు నలిగిన, కృంగిన విశ్వాసికి చూపించి మంచి సాక్ష్యములు చెప్పి ఇలాంటి వారిని విశ్వసములో బలపరచాలి! కీర్తన 113:8; 145:14; 146:8; 147:6;

 

  ఇక తర్వాత అంశము: బలహీనులకు ఊతమియ్యుడి అనగా నిజంగా శారీరకంగా బలహీనులకు ఊతమియ్యండి వారికి ఆదుకోండి అని చెప్పడమే కాకుండా ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారికి కూడా సహాయం చెయ్యండి అని అర్ధమిస్తుంది! ఇంకా ఆత్మలో లేక ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని కూడా బలపరచవలసిన అవసరం ఉంది!

ఒక విషయం గమనించాలి! ఒక సంఘమంటే విభిన్న మనుషులు విభిన్న పరిస్తితులు కలవారు వస్తారు! కాబట్టి ఎలాంటి వారు వచ్చినా కూడా త్రోసివేయకూడదు! శారీరకంగా బలహీనులను రోగులను ప్రేమించాలి! ఆర్ధికంగా చితికిపోయిన వారిని నిరాశ్రయులను ప్రేమించడమే కాకుండా వారికి సహాయం చెయ్యాలి! ఇంకా ఎవరూ లేని అనాధలను ప్రేమించాలి! సహాయం చెయ్యాలి! ఇంకా ప్రజలతో వెలివేయబడిన ద్వేషించబడుతున్న జాతులు వారిని చేర్చుకుని వారిని బలపరచాలి! *ప్రతీ క్రైస్తవుడు విశ్వాసి సంఘపెద్ద ఒకమాట మరచిపోకూడదు! ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు!* ఆయన పెద్ద కులము వారికి ప్రభువే నిమ్నజాతి వారికి కూడా ప్రభువే! ధనవంతులకు విద్యావంతులకు ప్రభువే- అలాగే అనాదలకు బీదలకు విధ్యాహీనులకు కూడా ప్రభువే! ఆయన పంపించిన గాలి వీరందరి మీదకు సమానంగా వీస్తుంది ఆయన పంపిస్తున్న సూర్యరశ్మి వీరందరి మీదకు సమానంగా వెళుతుంది! కాబట్టి దేవునికి ప్రకృతికి లేని తేడా నీకెందుకు? వారిని చేసిన దేవుడే నిన్ను కూడా చేసినప్పుడు నీకెందుకు తారతమ్యాలు??!!! క్రైస్తవుడు అన్నవానికి కుల మత భేదాలు అంతస్తు బేదములు ఉండనే కూడదు! ఒకవేళ ఉంటే వాడు క్రైస్తవుడు కానేకాదు! వాడు పూర్తిగా చావలేదు అన్నమాట! కాబట్టి స్థానిక సంఘాలలో ఇలాంటి బలహీనులను అశ్రద్ధ చేయకూడదు! తక్కువగా చూడకూడదు! నిర్లక్ష్యం చేయకూడదు!

రోమా 14:1

విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

 

యాకోబు 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

సామెతలు 19: 17

బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

 

     ఇక తర్వాత అంశం: అందరిపట్ల ఓర్పు కలిగి ఉండండి: లేదా అందరి యెడల దీర్ఘశాంతం కలిగ ఉండండి అంటున్నారు! అవును సంఘంలో కూడా అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు వస్తారు! కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండవలసిన అవసరం ఉంది! కొంతమందికి ఇట్టే కోపమొస్తుంది. కొంతమంది ప్రతీదానికి వంక పెడుతుంటారు! కాబట్టి ఇలాంటి మనస్తత్వాలు ఉన్న ప్రతీవారిని కలుపుకుని పోవాలి! ఎవరు ఏమన్నా దీర్ఘశాంతం కలిగి పోతుండాలి! అంతెందుకు యేసుక్రీస్తుప్రభులవారు కలుపుకుని పోలేదా? పేతురు గారు దుడుకు వ్యక్తి! కోపమెక్కువ! తోమా అనుమానపు వ్యక్తి! ఇష్కరియోతు యూదా దొంగ, డబ్బు సంచి దగ్గరపెట్టుకుని దొంగతనం చేసేవాడు! ఇలా ఎన్నో రకాలైన మనస్తత్వాలు కలిగిన శిష్యులను కలుపుకుని మూడున్నర సంవత్సరాలు సేవచేశారు! గాని ఎప్పుడు ఎవరిని గద్ధించలేదు! కాబట్టి చిన్న సంఘమంతా (యేసయ్య శిష్యులు) కష్టపడి సేవచేసి ప్రపంచానికి సువార్త ప్రకటించారు! కాబట్టి ఎలాంటి మనస్తత్వాలు గల మనుషులు వచ్చినా అందరినీ కలుపుకుని పోతూ వెంటనే కోప పడకుండా చిరాకు పడకుండా ముందుకు పోతుండాలి!

 

    రకంగా పౌలుగారు చెప్పిన విధముగా సంఘములో ప్రవర్తిస్తూ అందరిని కలుపుకుంటూ ముందుకుపోదాము!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*64 భాగం*

1 థెస్సలోనిక 5:14—16

14. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.

15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి (మేలైన దానిని వెంటాడుడి).

16.ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;

 

          ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము  క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

      ఇక 15 వచనంలో ఎవడును క్రీడునకు ప్రతికీడు చేయవద్దు అంటున్నారు! తర్వాత ఒకని ఎడల ఒకడు ఇంకా మనుష్యులందరి యెడల ఎల్లప్పుడు మేలైనదే చెయ్యండి అంటున్నారు!

 

   విషయంలో యేసుక్రీస్తుప్రభువులవారు చెప్పిన బోధనలను ఆదర్శంగా తీసుకోవాలి! ఎవరికీ కీడుకి ప్రతికీడు చెయ్యవద్దు అంటున్నారు! గమనించాలి ఇది ధర్మశాస్త్రమునకు వ్యతిరేఖంగా ఉంది! ధర్మశాస్త్రం కంటికి కన్ను! పంటికి పన్ను అని చెప్పి ఉండగా యేసుక్రీస్తుప్రభువులవారు కీడుచేసిన వ్యక్తిని కూడా క్షమించమని చెప్పడమే కాదు నీ శత్రువును కూడా ప్రేమించమని చెప్పారు! 

మత్తయి 5:38—41

38. కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

39. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

40. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

 

    గమనించాలి విశ్వాసులు లోకంలో క్రీస్తుయేసుకి ప్రతినిధులు! కాబట్టి వారి ప్రవర్తనతో క్రీస్తుయేసుని చూపించాలి! వారిమంచి ప్రవర్తనతో యేసయ్యకు మహిమ తేవడమే కాకుండా ఏవిధంగా అనేకులకు క్రీస్తుయేసు దగ్గరకు రప్పించాలి! మనలను బట్టి దేవుని నామమునకు అవమానం కలిగించకూడదు!

రోమా 2:24;

 

కారణం మీ పిలుపు ఏర్పాటు ఎంతో ఘనమైనది!

 

1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ఎఫెసీయులకు 4: 32

ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

 

కొలస్సీ 3:13

ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

 

లేవీ 19:18

కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

 

సామెతలు 20:22

కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

 

యేసయ్య చెప్పినది విందాము

మార్కు 11:25

మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.

 

లూకా 6: 38

క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు కొలతతో కొలుతురో కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

 

      ఇక చివరగా ఒకనియెడల మరొకడు, తర్వాత సమస్త మనుష్యులందరి యెడల కూడా ఎల్లప్పుడు మేలైనదే చెయ్యండి అంటున్నారు! ఇక్కడ కేవలం విశ్వాసుల ఎడల మాత్రము దయకలిగి మేలైనది చేయండి అనడం లేదు! మనుష్యులందరి యెడల అంటున్నారు! అనగా చివరికి నీ శత్రువుకు కూడా మంచిది మేలైనది మాత్రమే చెయ్యాలి! నీ సువార్తకు అడ్డుపడుచున్న వారికి కూడా మేలైనదే చెయ్యాలి! అందుకే ఒకసారి పౌలుగారు మరియు సోలోమోను గారు  చెబుతున్నారు నీ శత్రువు దప్పిగొంటే దాహమివ్వు .....

 

Proverbs(సామెతలు) 25:21,22

21. నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము

22. అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.

 

రోమీయులకు 12: 20

కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

 

    మరి ఇలాంటి శత్రువులను ప్రేమించే గుణం నీకుందా! సమస్త మనుష్యుల యెడల మంచి పనులు చేస్తున్నావా? లేక సమస్త జనులతో తగవులు యుద్ధాలు కోర్టులు కక్షలతో ఉన్నావా? నీ మాటలతో నీ చేతలతో క్రీస్తుకి మహిమను తెస్తున్నావా లేక అవమానం తెస్తున్నావా?  పౌలుగారు చెబుతున్నారు మీరు విలువపెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి అవమానం తేవద్దు! 1కొరింథీ 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

కాబట్టి ఆయనకు మహిమ తెచ్చే పనులు మాత్రమే చేద్దాం! అనేకులను క్రీస్తుకోసం గెలుద్దాం!

 

ఇక తర్వాత అంశము: 16 వచనం: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి! కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్లు విచారంగా ఉంటూ ఉంటారు! అయితే బైబిల్ చెబుతుంది ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండమని! విశ్వాసి అన్ని విషయాలలో ఆనందిస్తూ దేవునిలో సంతోషిస్తూ ఉండాలి!

ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ అంటున్నారు పౌలుగారు ఆనందించుడి మరలా చెబుతున్నాను ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియనియ్యుడి అంటున్నారు!

 

ఫిలిప్పీయులకు 3: 1

మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.

 

ఫిలిప్పీయులకు 4: 4

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును ఆనందించుడి.

 

  ఇక్కడ మీ సహనమును సకలజనులకు తెలియనియ్యుడి అని ఎందుకు అంటున్నారు అంటే మీ శత్రువులు మిమ్ములను కష్టపెడుతున్నా సరే, సహిస్తూ దీర్ఘశాంతం కలిగి మనం కీడుకు ప్రతికీడు చేయకుండా మంచిపనులు చేస్తుంటే అప్పుడు మన సహనం మరియు దీర్ఘశాంతము అందరికీ తెలియజేయబడి అనేకులను క్రీస్తుయేసు కోసం గెలవగలం!

 

రోమా 12:12

నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

 

చివరకు ఎలాంటి ఆనందం సహనం ఉండాలి అంటే హబక్కూకు గారిలాంటి సంతోషం సహనం ఆనందం కలిగిఉండాలి! హబక్కూకు గారు పెద్ద భూస్వామి! దానితోపాటు యేరూషలేము దేవాలయంలో ఆస్థానగాయకుడు వాద్యకారుడు! గాని బబులోను సామ్రాజ్యపు వారు దండెత్తినప్పుడు అన్నీ పోగొట్టుకున్నారు! బాధపడే వారు! చివరకు దేవుని దర్శనం పొంది రాస్తున్నారు

3:17—18

17. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను

18. నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను.

అటువంటి సహనం సంతోషం ఆనందం కలిగి ఉందాము!

 

      కష్టాలలో నష్టాలలో కూడా ప్రభువునందు ఆనందంగా ఉందాము! అన్ని విషయాలలో కూడా దేవునిని స్తుతిద్దాము! పౌలుగారు సీలగారు చెరశాలలో ఉన్నప్పుడు కూడా పాటలుపాడి స్తుతించగా భూకంపం కలిగింది! అట్టి విశ్వాసం ఆనందం సంతోషం కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉందాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*65 భాగం*

1 థెస్సలోనిక 5:17

యెడతెగక ప్రార్థనచేయుడి;

 

         ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

  ఇక వచనంలో ఎడతెగక ప్రార్ధన చేయండి అంటూ ప్రార్ధన కోసం చెబుతున్నారు! గమనించాలి ప్రార్ధన అనేది ఎడతెగకుండా చెయ్యాలి! ఎడతెగకుండా ఎలా చెయ్యాలి? జవాబు గతభాగాలలో చెప్పడం జరిగింది. ప్రార్ధన అంటే కేవలం మోకరించి గట్టిగా ప్రార్ధన చెయ్యడమే కాదు, నీవు నీ మనస్సు హృదయం అన్నీ దేవునితో synchronize అవ్వాలి అప్పుడు అనుక్షణం ఆయన స్మరణే ఆయన మాటలే ఆయన పాటలే ఉంటాయి! ఇది కూడా ప్రార్దనే! మరొక మాట మీరు ఆరాధనకు వెళ్ళినప్పుడు అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమంటారు? ప్రార్ధనకి  అంటారు! అంటే ఇక్కడ ప్రార్ధన అనగా ప్రార్ధనతో పాటు పాటలు, స్తుతిఆరాధన వాక్య పఠనం వాక్యధ్యానం అన్నీ కలిపే ప్రార్ధన అవుతుంది! ఎప్పుడైతే నీవు ఆయనతో ఐక్యమైపోతావో synchronize అప్పుడు నీవు ఎడతెగకుండా ప్రార్ధన చేస్తున్నట్లు లెక్క!

 

  *ఒకసారి ప్రార్ధన అంటే ఏమిటి? దాని అవసరత ఏమిటి? దానితో ఏమి సాధించవచ్చు అనేది చూసుకొందాము!*

 

* ప్రార్ధన దేవుని సహాయాన్ని అభ్యర్దించే సమయం!

* ప్రార్ధన దేవునితో సంభాషించే సమయం!

* ప్రార్ధన దేవుని కృపను బట్టి ఆనందించే సమయం!

* ప్రార్ధన మనము మాట్లాడుతుంటే ఆయన వినే సమయం!

* ప్రార్ధన ఆయన ఏమైయున్నాడో గుర్తెరిగి ఆరాధించే సమయం!

* ప్రార్ధన మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం!

* ప్రార్ధన దేవుని మార్ధదర్శకం లేక డైరెక్షన్ కోసం ఎదురుచూసే సమయం!

* ప్రార్దన మన పాపముల నిమిత్తం క్షమాపణ అడుగుకొనే సమయం!

* ప్రార్ధన మన అవసరాలు దేవునికి తెలియజేసే సమయం!

* ప్రార్ధన ఇతరుల కోసం ప్రార్ధించే సమయం

ప్రార్ధన దేవునితో నిబంధన చేసే సమయం!

* ప్రార్ధన దేవునితో సాన్నిహిత్యము పెంచే సమయం!

* ప్రార్ధన సాతాను వాడిగల బాణములను ఎదుర్కోడానికి శక్తిని పొందుకునే సమయం!

 

*ప్రార్ధనతో సాధించ గలిగినవి*:

 

*ప్రార్ధన అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తుంది!

* మనకు జ్ఞానమిచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధం  బలపడేలా చేస్తుంది!

* పాపపు బంధకాలను విడిపిస్తుంది!

* శత్రువులను మిత్రువులుగా చేయగలుగుతుంది!

* పరలోకపు తాళపు చెవిని కలిగినది!

* బలహీనులకు శక్తినిస్తుంది!

* నెమ్మదిలేని వారికి నెమ్మదినిస్తుంది!

* సింహాల్ల నోళ్లను మూస్తుంది!

* సృష్టిని శాస్తిస్తుంది!

* సంకెళ్ళను త్రెంచుతుంది!

* చట్టాలను మార్చుతుంది!

* కటినమైన ప్రశ్నలకు జవాబునిస్తుంది!

* సమస్యలకు పరిష్కారమిస్తుంది!

* కన్నీటి ప్రార్ధన కన్నీటిని తుడుస్తుంది!

* పాపపు గోడలను పగులగొట్టి పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది!

* నిత్యరాజ్య వారసులుగా చేస్తుంది.!

 

అందుకే జాన్ బన్యన్ గారు ఒక్కమాట అన్నారు!

 *ప్రార్ధన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. అలాగే పాపం నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆపుతుంది.*

 

అందుకే పౌలుగారు ఎడతెగక ప్రార్ధన చెయ్యమన్నారు! పౌలుగారు కేవలం ప్రార్ధన చెయ్యమని డైలాగ్ లు కొట్టడం కాకుండా మొదటగా తాను ప్రార్ధించి అప్పుడు మన అందరిని ప్రార్ధించమన్నారు!

థెస్సలోనికయులకు 1:; 2:13; రోమా 1:910; ఎఫెసి 6:18; కొలస్సీ 1:; 1తిమోతి 1:

 

పౌలుగారికి ప్రార్ధన యొక్క ప్రభావం శక్తి ఆధిక్యత బాగా తెలుసు! తాను పని మొదలుపెట్టినా ఏపని చేస్తున్నా ముందుగా తన హృదయాన్ని ఎప్పుడూ ప్రార్ధనలో ప్రభువుకు చెప్పేవారు! మనం కూడా ఏపని చేస్తున్న ఎప్పుడూ ప్రార్ధన చెయ్యడం అవసరం! ప్రార్ధన అంటే కేవలం బిగ్గరగా ప్రార్ధన చెయ్యడమే కాదు, అది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు! ప్రార్ధన పెదవులతో మాటలు పలుకకుండా హృదయంలో ప్రార్ధన చెయ్యడం కూడా ప్రార్దనే!

 

కొంతమంది అడుగుతుంటారుఅయ్యా నాకు ప్రార్ధన నడిపింపు రావడం లేదు! నాకు ప్రార్ధించాలని ఉంది గాని నడిపింపు రావడం లేదు అంటారు! దానికి జవాబు: నీ నోరు బాగుగా తెరువుము! దానిని నేను నింపెడను (కీర్తనలు 81:10) నీవు నోరు తెరచి గట్టిగ స్తుతించడం మొదలుపెట్టు! అప్పుడు ప్రార్దన దానికదే వస్తుంది!

 

సరే ప్రార్ధన కోసం బైబిల్ లో ఏమి వ్రాయబడిందో కొన్ని రిఫరెన్సులు చూద్దాం!

 

మత్తయి 6:5—13:

5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

6. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

7. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

8. మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును

9. కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,

10. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

11. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

12. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

13. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి (లేక-కీడునుండి) మమ్మును తప్పించుము. (కొన్ని ప్రాచీన ప్రతులలో-రాజ్యము, బలము, మహిమయు నీవైయున్నవి, ఆమేన్, అని కూర్చబడియున్నది)

 

Matthew(మత్తయి సువార్త) 7:7,8,9,10,11

7.అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

8.అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును.

9.మీలో మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?

10.మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా

11.పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.

 

మార్కు 11: 24

అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

 

లూకా 11:1—13; 18:1—8

రోమా 8:26—27

26. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.

 

ఎఫేసి 1:17, 6:18

ఫిలిప్పీ 4:6—7

6. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.

7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

కొలస్సీ 1:9

యాకోబు 1:58; 5:1415

 

కాబట్టి ప్రార్ధన చేద్దాం! ఎడతెగకుండా చేద్దాం!

ప్రార్ధనాత్మను పొందుకుందాము!

ఆయనను కలుసుకుందాం!

 ఆయనతో గడుపుదాము!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*66 భాగం*

1 థెస్సలోనిక 5:18—20

18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

19. *ఆత్మను ఆర్పకుడి*.

20 *ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి*

 

         ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ప్రియులారా ఇక 18 వచనంలో  ప్రతి విషయమందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి ఇలాగు చెయ్యడం మీ విషయంలో దేవుని చ్తిత్తము అంటున్నారు దీనికోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము! కష్టమొచ్చినా నష్టమోచ్చినా బాధకలిగినా సంతోషం కలిగినా దేవునికి కృతజ్ఞతలు చెబుతుండాలి అని పౌలుగారు అనుభవించి చెబుతున్నారు!

 

  ఇక 19 వచనంలో ఆత్మను ఆర్పకుడి అంటున్నారు. 20 వచనంలో ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు అంటున్నారు! ప్రాచీన ప్రతులలో దేవుని ఆత్మను ఆర్పకుడి అని తర్జుమా చేయబడింది! ఆత్మకోసం పరిశీలిస్తే పెంతుకోస్తు పండుగ దినము నాడు యేసుక్రీస్తుప్రభులవారు వాగ్దానం చేసిన పైనుండి వచ్చే శక్తిని అనగా పరిశుద్దాత్మ శక్తిని అపోస్తలులు, అపోస్తులులతో పాటుగా 120మంది కూడా పొందుకున్నారు! అపో 2:14 ఆరోజు పొందుకున్న పరిశుద్ధాత్మ వలన ఉజ్జీవం కలిగి ఆరోజు మూడువేల మంది రక్షించబడ్డారు! రకంగా భూలోకమంతటికీ సువార్త విప్లవము వలన పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించింది! ఆరోజు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింప బడినట్లు వచ్చిన అగ్ని ఇప్పటికీ నిజ విశ్వాసుల హృదయాలను ఆత్మలను మండిస్తూ వెలిగిస్తూ సువార్త పట్ల ఆసక్తిని ఆధ్యాత్మిక సంగతుల కోసమైనా ఆత్రుత కలిగిస్తూ పాపపు ఆలోచనలను ఆసక్తిని కాల్చివేస్తూ, మనలను అనుక్షణం దేవుని బిడ్డలమని హెచ్చరిస్తూ పాపం చెయ్యకుండా ఆపుతుంది! అయితే ఇప్పుడు పౌలుగారు పరిశుద్ధాత్మను ఆర్పవద్దు అంటున్నారు!

 

   జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారు ఆత్మను ఆర్పవద్దు అంటున్నారు! అనగా ఆర్పుట అనేది కేవలం మంటకు లేక అగ్నికి వాడుతారు అనగా పరిశుద్ధాత్మ అగ్ని అని అర్ధమవుతుంది! అగ్నిని నిరంతరం మండనివ్వాలి! ఎక్కడ హృదయమనే దేవాలయంలో గల ప్రార్ధన అనే బలిపీటము మీదన! అందుకే లేవీ కాండంలో బలిపీటం మీద నిత్యమూ మంట వెలగనివ్వాలి మంట ఆరిపోకూడదు అంటున్నారు! లేవీయకాండము 6:12,13

12. *బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు*. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.

13. *బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు*

  అలాగే నీ హృదయమనే దేవాలయంలో ప్రార్దనే అనే బలిపీటం మీదన కూడా పరిశుద్ధాత్మ అనే అగ్ని /మంట వెలుగుచూ ఉండాలి! మంటలో నీ రహస్య పాపాలు పాపపు ఆలోచనలు సాతాను క్రియలు కాలిపోతూ ఉంటాయి! అసలు నీకు మంటే లేకపోతే? నీ దేవాలయంలో అగ్ని ఎప్పుడో ఆరిపోయి ఉంటే? అసలు ప్రార్ధనా బలిపీటమే లేకపోతే? జాగ్రత్త నీవు విడువబడిన వారి లెక్కలో పాపాత్ముల లెక్కలో నులివెచ్చని స్తితిలో ఉండి దేవునిచేత ఉమ్మి వేయించుకొనే వారి లెక్కలో ఉండి నరకానికి పోడానికి సిద్దముగా ఉన్నావని అర్ధము!

అంతేకాదు నీ సిద్దెలలో నూనె అనగా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి.

 

   ఇంతకీ నీ పరిశుద్ధాత్మ అగ్ని లేక మంట ఎందుకు ఆరిపోయింది లేక ఆరిపోతుంది అంటే పాపపు ఆలోచనలు రేగడం,  దేవుడు చెయ్యకూడదు అని ఆజ్ఞాపించిన వాటి వెనుక పరుగెత్తడం అనగా గలతీ 5లో వివరించిన శరీర క్రియలు అంటే ఆసక్తిని చూపిస్తూ ఆత్మఫలమును నిర్లక్షము చేసినందువలన నీ పరిశుద్ధాత్మ శక్తి ఆరిపోయింది! ప్రార్ధనను నిర్లక్షం చేసినందు వలన! దేవుని సన్నిధిని  ఆరాధనను నిర్లక్షం చేసినందువలన ఆరిపోయింది! దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పకుండా లోకాశలలో మునిగినందువలన ఆరిపోయింది! ఆరిపోయిన తర్వాత సమయముండగానే మారుమనస్సు పొందకుండా ఆరిపోయిన దీపము మాలో వెలిగుంచుము దేవా ధర నర జ్యోతివి నీవే  అని ప్రార్ధించిన ఉపయోగం ఉండదు!

 

  అందుకే ఎఫేసి 4:30 లో అంటున్నారు దేవుని పరిశుద్దఆత్మను దుఃఖపెట్టకండి ...

దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

 

 పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడు? నీవు కాని మాటలు పలుకుతున్నందు వలన, కానిచోట్లకు వెల్లుచున్నందు వలన, కానిపనులు చేస్తున్నందువలన! దేవునికి వ్యతిరేఖమైన పనులు చేస్తున్నందువలన నీకోసం పరిశుద్ధాత్ముడు దుఃఖపడుచున్నాడు!

 

ఇక ఎందుకు ఆరిపోతుంది అంటే: జనాలకు జడిసి, సిగ్గుపడి కూడా ఆత్మ ఆరిపోతుంది!! ఎలా ? మధ్య అంటున్నారు చాలామంది పెంతుకోస్తు వాళ్ళు గట్టిగా అరుస్తుంటారు, దేవుడు అల్లరికి కర్తకాడు! ఇలా అరవకూడదు అంటున్నారు! మరి దేవుడు నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ హృదయముతోను నీదేవుడైన ప్రభువును సేవించాలి ఆరాదించాలి అని ఎందుకు చెప్పారు! ద్వితియోపదేశకాండము 10: 12

కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,

 

లూకా 10: 27

అతడునీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు, వ్రాయబడియున్నదని చెప్పెను.....

 నీ పూర్ణ బలము నీ పూర్ణ శక్తి అంటే నోట్లో నోట్లో ప్రార్ధన గొనుక్కోవడమా? కాదు కదా! అందుకే భక్తులు అనేకసార్లు చెబుతున్నారు నేను ఎలుగెత్తి దేవునికి మొరలిడితిని! ఆయన నా ప్రార్ధన ఆలకించేను అంటున్నారు! కీర్తనలు 3: 4

ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తర మిచ్చును.

 

యెషయా 58: 1

తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము

 

 కాబట్టి పూర్ణబలముతో శక్తితో దేవుణ్ణి ఆరాదించాలి! భాషల తోను ఆరాదించాలి మనస్సుతోను ఆరాదించాలి అని పౌలుగారు చెబుతున్నారు!1కోరింథీయులకు 14: 15

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

 అదే సమయంలో అన్నీ కూడా క్రమంగా జరగనివ్వాలి అంటున్నారు! అనగా బాషలు మాట్లాడుచున్నప్పుడు ఎవరికైనా ప్రవచనం కలిగినా దర్శనము కలిగినా వెంటనే భాషలు మాట్లాడువారు నెమ్మదిగా ఉండి దేవుని మాటకోసం కనిపెట్టాలి! ఇదీ క్రమం! అంటే బాషలు మాట్లాడేవారు ప్రవచించే వారు కూడా క్రమాన్ని పాటించాలి! 1కోరింథీయులకు 14: 39

కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,

1కోరింథీయులకు 14: 40

సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.

 

అదే సమయంలో ఎక్కడున్నావు? ఎక్కడ ప్రార్ధన చేస్తున్నావు అనే దానిని కూడా గమనించి ప్రార్థించి ఆత్మలో ఆనందించాలి! హాస్పిటల్ ICU లోకి వెళ్లి గట్టిగా భాషలతో ప్రార్ధన చేస్తే ధ్వనికి అక్కడున్న వారు వెంటనే పోతారు లేక నర్సులు బయటకు వెళ్ళగొడతారు! కాబట్టి సమయం సందర్భం ఎరిగి ఆరాధించాలి ప్రార్ధించాలి!

 

  నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ఇష్ట ప్రకారం గట్టిగా ఆరాధన చేసుకోవచ్చు! ఆత్మలో ఆనందించవచ్చు! గాని ప్రసంగం చేసినప్పుడు ప్రవచిస్తునప్పుడు తప్పకుండా నెమ్మదిగా ఉండాలి!

 

మరో విషయం: కేవలం ఆరాధనలో డ్రమ్ముకొట్టినప్పుడో, స్తుతి ఆరాధన చేసినప్పుడో ఆత్మలో ఊగిపోవడం కాదు, ఎల్లప్పుడూ అనగా నీవు ప్రత్యేకంగా నీ ఇంట్లో ప్రార్ధన చేసినప్పుడే గాని, అందరితో ప్రార్ధన చేసినప్పుడే గాని, అనుదినం అనుక్షణం ఆయన ఆత్మతో నింపబడుతూ అయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి! కేవలం డ్రమ్ము కొట్టినప్పుడే ఆత్మను పొందుకుంటే అది డ్రమ్ము ఆత్మ లేదా ఉద్రేక ఆత్మనే గాని పరిశుద్ధాత్మ కానేకాదు!

 

  ఇక 20 వచనంలో ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు అంటున్నారు! ఇది ఆత్మతో నింపబడిన వారు దైవాత్మ పూర్ణులై పలికే మాటలు అన్నమాట! జరుగబోయేవి, మనము దేవుని చిత్తముకోసం ఎదురుచూసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడే విధానం! మనం ఎన్నో ప్రవచనాలు క్రొత్త నిబంధన గ్రంధంలో కూడా చూసుకోవచ్చు! అపో.కార్యములు 11: 28

వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.

 

గమనించాలి కొంతమంది పౌలుగారి విషయంలో కూడా ప్రవచనాలు చెప్పారుపౌలుగారిని యేరూషలేము వెళ్తే అక్కడ బంధించబడి చనిపోతారనిఅపో.కార్యములు 21: 11

అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొనియెరూషలేములోని యూదులు నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.

.. కొంతమంది అతి తెలివైన వారు భాషలు ప్రవచనాలు ప్రవక్తలు ఆగిపోయారు! అప్పుడు బైబిల్ సంపూర్ణంగా వ్రాయబడలేదు కాబట్టి ప్రవక్తలు ఉన్నారు ప్రవచనాలు ఉన్నాయి! ఇప్పుడు బైబిల్ సంపూర్ణంగా వ్రాయబడింది కాబట్టి ప్రవక్తలు ప్రవచనాలు లేవు అంటున్నారు! అమాయకులు మరిచిపోయే విషయం ఏమిటంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు! హెబ్రీయులకు 13: 8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

అప్పుడు పనిచేసిన ఆయనాత్మ ఇప్పుడు కూడా పనిచేస్తుంది! అప్పుడు ప్రవహించిన ఆయన రక్తము ఇప్పటికీ సజీవంగా ప్రవహిస్తుంది! కాబట్టి అప్పుడు జరిగిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అందుకే ఇప్పుడు కూడా ప్రవక్తలు ప్రవచనాలు ఉన్నాయి!

రోమా 12:6--8

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:2,3,4,5,39,40

2. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

39. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,

40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.

 

   కాబట్టి దేవుని కృపావరంలో ఒక భాగమైన ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు! ఏదో కారణం వలన ప్రజలకు జడిసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం మానవద్దు! నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పివేయవద్దు! ఇవి నిరంతరమూ జరిగే ప్రక్రియలు!! పరిశుద్దాత్మకు చోటిద్దాం! పరిశుద్ధాత్మ క్రియను జరుగనిద్దాం ! ఆత్మతో నిరంతరమూ నింపబడదాము!

దైవాశీస్సులు!  

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*67 భాగం*

1 థెస్సలోనిక 5:21—22

21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

22. ప్రతి విధమైన కీడునకును (కీడుగా కనబడు ప్రతిదానికి) దూరముగా ఉండుడి.

 

         ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

   ప్రియులారా ఇక 21  వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయండి లేక చేపట్టండి అంటున్నారు! పౌలుగారు దేనికోసం ఇలా అంటున్నారు? గమనించాలి 19 వచనం నుండి ఆత్మను ఆర్పవద్దు ప్రవచించుట నిర్లక్షం చేయవద్దు అంటూ మాట అంటున్నారు కాబట్టి దేనిని పరీక్షించమంటున్నారు అంటే ప్రతీ ఆత్మను నమ్మక పరీక్షించండి అంటున్నారు అని అర్ధం చేసుకోవాలి! గమనించాలి 1యోహాను 4:1లో   అబద్ద బోధకులు కపటబోధకులు ఉన్నారు కాబట్టి అందరిని నమ్మవద్దు అంటున్నారు! ప్రతీ ఆత్మను నమ్మవద్దు అంటున్నారు! .....

1యోహాను 4: 1

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

 

మనకు అనుమానం రావచ్చు అది దేవుని ఆత్మనో దయ్యముల ఆత్మనో మనకు ఎలా తెలుస్తుంది?  అది తెలిసిపోతుంది కారణం పరిశుద్ధాత్మ యొక్క వరములలో వివేచనా అనేది కూడా ఉంది దానిద్వారా అది నిజమైన ఆత్మనో బ్రమపరచు ఆత్మనో యిట్టె తెలిసిపోతుంది!

 

   అంతేకాదు ఇదే యెహోవా వాక్కు అని పలికే ప్రతీ ప్రవక్త దేవుని ప్రవక్త కాదు అనేకమంది అబద్ద ప్రవక్తలు రోజులలోను ఉన్నారు రోజుల లోనుకూడా ఉన్నారు! కాబట్టి ప్రతీ ఆత్మను ప్రతీ ప్రవక్తను నమ్మకుండా వారిని బాగుగా పరీక్షించి అప్పుడు మేలైన దానిని చెప్పట్టాలి అంటున్నారు! కొంతమంది తోటి ప్రవక్తల దగ్గరనుండి మాటలు దొంగలించి చెప్పేవారు కూడా ఉన్నారు! పొట్టపోషణ కోసం ఇదే యెహోవా వాక్కు అని చెప్పేవారు కూడా ఉన్నారు!

Jeremiah(యిర్మీయా) 23:1,21,25,28,30,31

1. యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.

21. నేను ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

28. కలకనిన ప్రవక్త కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

31.స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

 

మత్తయి 7: 15

అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.

మత్తయి 7: 16

వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?

 

2పేతురు 2: 1

మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

 

యిర్మియా 14: 14

యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

 

     సరే కేవలం ఆత్మలనేనా పరీక్షించవలసినది?   అత్మలనే కాదు ప్రవక్తలను పరీక్షించాలి! బోధకులను వారి బోధలను కూడా పరీక్షించాలి బెరయ సంఘస్తుల వలెనే!....

టీవీలో చాలా చాలా బాగా వాక్యం చెప్పేస్తున్నాడు అద్భుతాలు జరిగిపోతున్నాయి అని నమ్మావా జాగ్రత్త!  మోసపోతావు! రోజుల్లో టీవీల్లో అనేకరకాలైన బిన్నమైన బోధలు వస్తూ ప్రజలను కలవరం పెట్టిస్తున్నారు! అందుకే వారు బోధించేది అలాగా ఉందా లేదా అంటూ బెరయ సంఘస్తులు వాలే పరీక్షిస్తూ సాగిపోవాలి!

అపో.కార్యములు 17: 11

వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

 

అలా వాటిలో మంచి బోధను వాక్యాను సారమైన బోధను బోధకున్ని ఎంచుకోవాలి!

 

   ఇక తర్వాత వచనంలో ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండండి అంటున్నారు! ప్రాచీన ప్రతులలో కీడుగా కనబడే ప్రతీదానికి దూరంగా ఉండండి అంటూ తర్జుమా చేయబడింది! అది బోధయైనా గాని, ఆత్మయైనా గాని, లేక అలవాటైనా గాని కీడుగా కనిపిస్తే దానినుండి దూరంగా ఉండాలి! ఉదాహరణకు త్రాగుడు, జూదము వ్యభిచారం ఇలాంటివి అన్నీ పాపములు కీడులు! వాటికి దూరంగా ఉండాలి! కారణం కొందరు తమకు ఇష్టం లేకపోయినా దుర్మార్గాన్ని వదలలేరు వదిలేద్దామన్నా వదలకుండా అదే కీడు మార్గంలో తప్పుడు మార్గంలో ఉంటారు! ఇంకా దురభిమాన పాపంలో పడిపోతూ ఉంటారు! విశ్వాసిలో ఇవి కనబడకూడదు! వీటికి దూరంగా ఉండాలని పరిశుద్దాత్మ పూర్ణుడై పౌలుగారు రాస్తున్నారు! కారణం దేవుడు దుష్టత్వమును చూసి సంతోషించే దేవుడు కాదు..కీర్తనలు 5: 4

నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు

.. కీర్తనలు 34:14

కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

 

కీర్తనలు 37: 27

కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు

 

సామెతలు 14: 22

కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.

 

యోహాను 5: 29

మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

 

కాబట్టి కీడునుండి చెడు మార్గము నుండి దూరంగా పోదాం! ప్రతీ ఆత్మను ప్రతీ ప్రవచనాన్ని ప్రవక్తను పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పరీక్షిద్దాం!

దైవాశీస్సులు!

*థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు*

*68 భాగం*

1 థెస్సలోనిక 5:23—28

23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.

24. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

25. సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.

26. పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

27. సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.

28. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

 

         ప్రియ దైవజనమా! మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాము! ప్రియులారా మనము క్రైస్తవ విశ్వాసి ఎలా బ్రతకాలి అనే అంశం కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

  ప్రియులారా ఇక 23 వచనంలో సమాధాన కర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక అంటున్నారు ఇంకా మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏసుక్రీస్తు రాకడ యందు నిందా రహితముగా సంపూర్ణముగా ఉండును గాక కాపాడబడును గాక అంటున్నారు

గమనించాలి మూడో అధ్యాయంలో పౌలుగారి ప్రార్దన అనే అంశమును ధ్యానం చేసినప్పుడు విషయం ధ్యానం చేసాము! మూడూ అధ్యాయం ఇదే విషయం వారికోసం ప్రార్ధన చేశారు పౌలు గారు!....1థెస్సలొనికయులకు 3: 12

మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

 

  ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రెండు సార్లు ఆయన సంపూర్ణముగా అంటూ రాశారు! కారణం  విశ్వాసి సేవకుడు పరిపూర్ణత సాధించాలి అనేదే పౌలుగారి రాతలలో ముఖ్య ఉద్దేశం! అయితే సంపూర్ణత అనేది శ్రమల ద్వారానే సాధించాలి అని కూడా గతభాగాలలో చూసుకున్నాము! ఎవరైతే సంపూర్ణత సాదిస్తారో వారే పరమ సీయోను అనుభవం లోనికి వెళ్ళగలరు! ఇంకా నూతన యెరూషలేము అనుభవమునకు వెళ్లగలరు! వారియొక్క అభిషేకం వారియొక్క ఆధిక్యత వేరు! పౌలుగారు రక్షించబడిన ప్రతీ ఒక్కరు అనుభవములోనికి వెళ్ళాలి అనేదే పౌలుగారి ఆకాంక్ష!

 

ఇక 24 వచనంలో మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక తప్పకుండా అలాగుచేయును అంటున్నారు! ఆలాగు చేయును అనగా తప్పకుండా మిమ్మును నిందా రహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు చేయును గాక అని అర్ధము! ఎందుకంటే మనలను పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక! అబ్రహాము గారు తనను పిలిచినవాడు వాగ్ధానము చేసినవాడు నమ్మదగినవాడు దానిని నెరవేర్చుటకు శక్తిగలవాడు అని విశ్వాసముంచారు కనుకనే అన్ని గొప్ప కార్యాలు దేవునికోసం చేయగలిగారు! ....

రోమీయులకు 4: 21

దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

.హెబ్రీయులకు 11: 11

విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

 

ద్వితీ 7:9

కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

 

ద్వితియోపదేశకాండము 32: 4

ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

 

1కొరింథీ 10:13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 

2 తిమోతి 2:13

మనము నమ్మదగని వారమైనను(నమ్మకపోయినను), ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు(ఆయన తన్ను తానెరుగననలేడు).

 

1 యోహాను 1 :9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

    ఇక తర్వాత వచనంలో సహోదరులారా మాకొరకు ప్రార్ధన చేయండి అంటున్నారు! పౌలుగారి పత్రికలలో ఇది మామూలుగా ఉంటుంది! మీకోసం ప్రార్ధన చేస్తున్నాను మాకోసం ప్రార్ధన చేయండి అంటారు! అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పౌలుగారి పత్రికలలో సంఘాలకు ఉత్తరాలు రాసేటప్పుడు సంఘంలో ప్రతీ సంఘపెద్ద పేరు ప్రస్తావిస్తూ వందనములు చెప్పడం అలవాటు! అయితే పత్రికలో పలకరింపులు లేవు! కారణం ఉత్తరం పౌలుగారు రాసిన ప్రధమ ఉత్తరం లేక పత్రిక! అందుకే పత్రికలో ఎటువంటి పలకరింపులు ఉండవు!

కేవలం మాకోసం ప్రార్ధన చెయ్యండి అంటున్నారు! మా దగ్గర డబ్బులు లేవు పంపించమని చెప్పలేదు ఎప్పుడూ ఆయనకు అడుక్కోవడం అలవాటు లేదు! కేవలం ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనకోసం ప్రార్ధన చేస్తే చాలు! విశ్వాసి తప్పకుండా తమ కాపరి కోసం ప్రార్ధన చెయ్యాలి! అలాగే ప్రతీ సంఘకాపరి కూడా తమ విశ్వాసుల కోసం ప్రార్దన చెయ్యాలి! ఇదీ పద్దతి! రోమా 15:32 లో కూడా రాస్తున్నారు ఇలాగే...

మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

 ఎఫెసీయులకు 6: 20

దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

ఇక తర్వాత వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికి వందనములు చెప్పండి అంటున్నారు! ఇక్కడ మరో క్రమమును నేర్పిస్తున్నారు సంఘానికి కాపరిగా తండ్రిగా! వారికి క్రమము నేర్పించాల్సిన బాధ్యతా ఆయనది కాబట్టి! క్రైస్తవ క్రమం చెబుతున్నారు ఇక్కడ! నేటిరోజులలో అనేకమంది తోటి విశ్వాసులుకు కనీసం వందనం చెప్పడం లేదు నమస్కారం చెప్పడం లేదు! కరచాలనము చెయ్యడం లేదు! చివరకి  Praise the Lord కూడా చెప్పడం లేదు! ఇది పద్దతా? సంఘమా బుద్ధి తెచ్చుకోవాలి! ఇక్కడ కలసి ఉండలేని వాడవు/దానవు పరలోకంలో ఎలా కలసి ఉండగలవు?

రోమీయులకు కూడా ఇలాగే ఆజ్ఞాపించారు పౌలుగారు రోమా 16:16

పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

 

కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి! గమనించాలి ముద్దు పవిత్రమైనదిగా ఉండాలి గాని సినీ తరహాలో ఏవేవో కోరికలు పుట్టించే విధముగా ఉండకూడదు! మరీ ముఖ్యంగా ఇష్కరియోతు యూదాలా ముద్దుపెట్టుకుని మీ కాపరిని సంఘపెద్దను అప్పగించ కూడదు! మోసం చెయ్యకూడదు! అనగా ప్రేమపూర్వకమైన పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని పౌలుగారు చెబుతున్నారు!

 

ఇక 27 వచనంలో ఉత్తరం అందరికీ చదివి వినిపించమంటున్నారు. ఇంకా మిగతా సంఘాలకు కూడా చూపించమంటున్నారు!

 

చివరగా 28 వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక! అంటూ ముగించారు మొదటి పత్రిక! పౌలుగారు తన పత్రికలను ముగించే విధానము ఇదే! అన్ని పత్రికలలో ఇలాగే ఉంటుంది! దేవుని కృప ప్రతీ విశ్వాసికి తోడుగా ఉండాలని పౌలుగారు కాంక్ష! కారణం మనం కేవలం కృపచేతనే బ్రతుకుతున్నాము! అందుకే పౌలుగారు నేనైమైయున్నానో అది కేవలం ఆయన కృపయై ఉన్నది అంటున్నారు! అవును మనము ఆయన కృప వలననే మన ఉనికిని కలిగి ఉన్నాము! మనము మాటిమాటికి తప్పిపోతున్నా ఆయన కృప ద్వారా మనలను క్షమించి తన దరికి చేర్చుతున్నారు గనుక ఆయన కృప కోసమే మనము ఎదురుచూడాలి! ఆయన కృపలో ఉండాలి కృపలో ఎదగాలి! అట్టి కృప ధన్యత మనము కలిగి ఉందాము!

 

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము