యెషయా ప్రవచన గ్రంధము -2

*యెషయా ప్రవచన గ్రంధము*
*212వ భాగము*
యెషయా 29:1--7

1. అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.

2. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.

3. నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.

4. అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.

5. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభ వించును.

6. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

7. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 28వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 29వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! ప్రియులారా 28వ అధ్యాయం ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యమైన ఎఫ్రాయేము లేక ఇజ్రాయిల్ రాజ్యం కోసం చెప్పబడితే, 29వ అధ్యాయం యెరుషలేము మీదకి రాబోయే ఉగ్రతలు కోసం చెప్పబడింది! అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది రెండవ రాకడ సమయంలో యెరుషలేమునకు ఏ విధమైన సంభవాలు జరుగుతాయో అనగా అంత్య దినాలలో యెరుషలేమునకు కలగబోయే సంభవాల కోసం ఈ అధ్యాయము చెప్పడం జరుగుతుంది!!!

మొదటి వచనంలో ఆరీయేలునకు శ్రమ దావీదు దండు దిగిన ఆరీయేలు పట్టణానికి శ్రమ సంవత్సరం వెంబడి సంవత్సరం గడవనీయండి పండుగలు క్రమముగా జరగనీయండి అని చెబుతున్నారు! ఆరీయేలు అంటే ఏమిటి ఆరియేల్ అనగా ఏమిటో కాదు దావీదు పురము అని పిలువబడే యెరుషలేము పట్టణమునే ఆరియేలు అని దేవుడు పిలుస్తున్నారు.

2సమూయేలు 5:6--9 వచనాల్లో దీనికోసం ఉంటుంది! దావీదు గారు యెబూషీయుల పట్టణానికి వెళ్లి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని , నగరం కట్టించి దానికి దావీదు పురము అని పేరు పెట్టారు! అదే యెరుషలేము! దానికి అర్థం దేవుని సింహము అని అర్థం, దావీదుపురం అనగా దేవుని సింహము అని అర్థం!! అయితే ఇప్పుడు ఈ పట్టణానికి శ్రమ అనగా యెరుషలేము పట్టణానికి శ్రమ ఎందుకు శ్రమ?

ఒకటో వచనంలో చూసుకుంటే సంవత్సరం వెంట సంవత్సరం గడవనివ్వండి, మీ పండుగలు క్రమంగా జరగనీయండి అంటున్నారు! అనగా యెరుషలేము వారు దేవుని నిబంధనను త్రోషివేసి దేవుని పండగలు కూడా చేయడం మానేశారు అని ఇక్కడ అర్థం అవుతుంది! ఒకవేళ చేసినా యెషయా 1: 13, 14 వచనాలు ప్రకారం మీ నైవేద్యాలు తేవద్దు మీరు అర్పించే ధూపం నాకు అసహ్యం వేస్తుంది, మీ విశ్రాంతి దినాలు అమావాస్య దినాల్లో జరుగుతున్న అవన్నీ దుష్ట సమావేశాలు నేను ఓర్చుకోను! అవంటే నాకు అసహ్యము నేను విసుగు చెందాను అని దేవుడు చెప్పాడు అక్కడ!

అసలు ఏఏ పండుగలు చేయమన్నారు దేవుడు అంటే లేవి కాండం 23లో ఈ పండుగల కోసం చాలా వివరంగా రాయబడి ఉంది! ముఖ్యమైన పండుగలు ఏమిటంటే

పస్కా పండుగ ప్రారంభమవుతుంది తర్వాత పులియని రొట్టెలు పండుగ! కట్టెల పండుగ, వారాల పండుగ, తర్వాత పంటలు పండేక దేవునికి పంటలకు అర్పణలు తెచ్చే పండుగ! తర్వాత పర్ణశాల పండగ!!! ఇలా ముఖ్యమైన పండుగలు దేవుడు చెప్పారు!! అయితే ఈ పండగలను క్రమంగా జరగనీయండి అంటున్నారు ఎందుకంటే ఈ పండగలు మానేశారు వీళ్ళు!! ఆ పండగలు చేసినా, ఏదో పెదాలతో చేస్తున్నారు గాని దాని భావాన్ని తెలుసుకొని హృదయపూర్వకంగా చేయటం లేదు! ఆ పండగలలో తాగేసి అసహ్యకరంగా చేస్తున్నారు. అందుకే క్రమముగా జరగనీయండి అంటున్నారు!

నేను ఆరీయేలును బాధించగా ఆరీయేలు అంటే యెరుషలేమును బాధించగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా అగ్నిగుండమగును! అసలు ఆరీయేలు అనే పేరు యెరూషలేముకు ఎందుకు పెట్టారో ఇక్కడ దేవుడు చెబుతున్నారు ఆరీయేలు అనే పదానికి హెబ్రీ భాషలోనే అర్థం ఏంటంటే నిప్పు ఉన్న గూడు అనగా అగ్ని ఇల్లు, లేదా పొయ్యి లేదా అగ్నిగుండం అని అర్థం! అనగా ఇప్పుడు దేవుడు యెరుషలేమునే అగ్నిగుండం లాగా తయారు చేస్తున్నారు! అప్పుడు యెరూషలేములో దుఃఖము విలాపం మాత్రమే ఉంటాయి! ఈ విషయాన్ని యెషయా 31: 9 లో కూడా చెప్తున్నారు అక్కడ ఎరుషలేము అగ్ని కొలిమిలో లాగా మారిపోతుంది అంటున్నారు

యెషయా 31:9

వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.

ఇక్కడ రెండు మూడు వచనాల్లో నేను నేను అంటూ మాట్లాడటం చూస్తున్నాం! ఇక్కడ నేను అనగా దేవుడైన యెహోవా అని అర్థం చేసుకోవాలి!!!

ఇక మూడో వచనం చూసుకుంటే నేను నీతో యుద్ధం చేయుచు నీ చుట్టూ శిబిరము వేయదును నీ ఎదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును! నిజానికి ఇది బైబిల్లో చూసుకుంటే చాలాసార్లు జరిగింది, మరి ఇది ఎప్పటి కోసం రాస్తున్నారు అంటే తొందరలో జరగబోయే యెరుషలేము వినాశనం కోసమా లేదా ఎప్పటి కోసమా? ఇది ముందుకు వెళితే ఇది మనకి బాగా అర్థమవుతుంది! అయితే ఒకటి మాత్రం అర్థం అవుతుంది యెరుషలేము పట్టణాన్ని లేదా ఆరీయేలుని శత్రువులు చుట్టుముట్టడం అనేది కేవలం దేవుని వల్లనే జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది!!! అది దేవుని యొక్క చిత్తము నిర్ణయము దేవుని ఉగ్రత అని అర్థమవుతుంది!!!

నాలుగవ వచనంలో అంటున్నారు ఇలా జరిగినప్పుడు అనగా ఇలాగ శత్రువులు మీ చుట్టూ ముట్టడి దిబ్బ వేసినప్పుడు, నీవు అణపబడి నేల నుండి పలుకుతుందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లు ఉండును కర్రపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు దూలిలో నుండి గుసగుసగా వినపడును అంటున్నారు!!! చిన్నప్పుడు మేము ఈ నేల పలుకులాట ఆడుకునే వారము! మా ఏట్లోకి వెళ్ళిపోయి ఆ ఇసుక లోని ఒకరు బుర్రపెట్టి, గాలి ఆడడానికి మాత్రం చిన్న ఒక పైపులాడిది మాత్రం పెట్టి, ఇసుకలో బుర్రంతా కప్పెట్టేసి, అప్పుడు బయట నుంచి ఒకడు ప్రశ్నలు అడుగుతాడు వాడు! మాటలకి జవాబులు చెబుతూ ఉండాలి! మాట ఏదో, ఆ స్వరం ఎవరికీ వినబడేది కాదు! చాలా చిన్న స్వరం! గుసగుసలాడినట్లు ఒక మనిషి రేపో మాపో పోతున్నాడు ఇంకా లేదా ఆ రాత్రికి పోతున్నాడు చనిపోబోతున్నాడు అప్పుడు అతని మాటలు ఎంత నెమ్మదిగా చిన్నగా ఉంటాయో ఓపిక లేక, అలాగా ఉంటాయి, నీవు కూడా ఇప్పుడు మీరు అయాసపడి నేల నుండి మాట్లాడుతావున్నావు! నీవు కూడా ఆ నేల నుండి అలాగే పలుకుతావు గుసగుసలాడినట్లు ఉంటది, దెయ్యం పట్టినోడు ఎలాగా మాట్లాడుతాడు గుసగుసలాడుతాడు నువ్వు కూడా అలా గుసగుసలాడుతావు అంటున్నారు!!!

దీని అర్థం యెరుషలేము పట్టణములో ఉన్న ప్రజలు చాలా బలహీనమైన స్థితికి వచ్చి ధూళితో సమానంగా అణగారిపోతారన్నమాట! నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఉండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును! హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును! దీన్ని మనం తెలుగులో చదువుకుంటే దీని అర్థం మనకు సరిగా అర్థం కాదు! దీనిని మనం ప్రాచీన ప్రతులలో గాని, స్టడీ బైబిల్ లో గాని చదివితే ఇట్లా ఉంటుంది! హఠాత్తుగా ఒక్క క్షణంలోనే నీ శత్రువుల సమూహము దూలిగా మారిపోతుంది ఆ క్రూర మూకలు ఎగిరిపోయే పొట్టు లాగా అవుతాయి! ఇది ఎలా సంభవిస్తుంది అంటే ఆరవ వచనం ఉరుముతో భూకంపంతోనూ మహా శబ్దంతోను సుడిగాలితోనూ తుఫాను తోను నాశనం చేసే మంటలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను సందర్శిస్తాడు! దీనికోసం లోతుగా ఆలోచిస్తే హఠాత్తుగా ఒక్క క్షణంలోనే నీ శత్రువుల సమూహం ధూళిగా మారుతుంది! అనగా యెరుషలేము చుట్టూ శత్రువుల సైన్యాలు ఉంటాయి ముట్టడి దిబ్బ కడతారు! ఇక్కడ శత్రువు అనగా ఒక దేశమే కాదు అనేక దేశాలు! అప్పుడు నీ దేవుడు నీ పక్షంగా ఉరుముతోను భూకంపంతో మహా శబ్దంతో సుడిగాలితో తుఫానుతో మంటలతో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు !

మరి దీని కోసం ఆలోచిస్తే క్రీస్తు పూర్వం 701 లో అష్షూరు వారు, రాజైన ఆహాజు సమయంలో ముట్టడి దిబ్బ కట్టారు! కానీ రెండు విషయాలు గమనించాలి, ఇక్కడ శత్రువులు అందరు కాదు కేవలం అష్షూరువారే కట్టారు! దేవుడు వారిని నాశనం చేయలేదు. ఇక 100 సంవత్సరాలు అయ్యాక సుమారుగా క్రీస్తు పూర్వం 590 నుంచి 570 మధ్యలోని బబులోను రాజు మూడు నాలుగు సార్లు ముట్టడి దిబ్బ కట్టాడు! అప్పుడు కూడా దేవుడు వారిని హఠాత్తుగా నాశనం చేయలేదు. అంటే ఇక్కడ దేవుడు ఈ అస్సూరు వారి ద్వారా బబులోను వారి ద్వారా లేదా రోమా వారి ద్వారా కట్టిన ముట్టడి దిబ్బల కోసం మాట్లాడడం లేదు అని అర్థమవుతుంది!!!

ఇది అంత్య దినాలలో జరిగే హార్మెగిద్దోను యుద్ధము సమయంలో జరిగే సంభవముగా నాకు అర్థం అవుతుంది!

ఇది ఎలా జరుగుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభువుల వారు లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు చూసుకుంటే Luke(లూకా సువార్త) 21:20,21,22,23,24

20. యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.

21. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.

22. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు.

23. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.

24. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును అని లూకా సువార్త 21 లో రాయబడింది. ఇది జరగాలి అనగా శ్రమల కాలం జరిగిన తరువాత మహాశ్రమల కాలం సమయంలో ఇది జరుగుతాది! దానియేలు గ్రంధం చివరి అధ్యాయంలో ఆరోజుల్లో నీ దేశం పుట్టినది మొదలుకొని ఎంతవరకు జరగని మహా శ్రమ మీ మీదకు రాబోతుంది అయితే గ్రంథములో దాఖలైన వారు మాత్రమే తప్పించుకుంటారు

Daniel(దానియేలు) 12:1

1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

అనగా గత భాగాలలో చెప్పుకున్నాం ఇద్దరు సాక్షుల సువార్త ప్రకటన వలన రక్షించబడిన 144000 వేల మంది ఇస్రాయేలీయులు మాత్రమే తప్పించుకుంటారు. మిగిలిన వారు ఈ మహా శ్రమల గుండా ప్రయాణం చేస్తారు. బాధపడుతూ ఉంటారు. అప్పుడు మరల మనం వెంటనే జెకర్యా గ్రంథానికి వచ్చేయాలి. మనకి ఈ యెషయా 29వ అధ్యాయానికి జెకర్యా 12 అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ 29 అధ్యాయంలో జరగబోయే సంభవాన్ని వివరంగా జెకర్యా 12 వ అధ్యాయము మరియు 14వ అధ్యాయంలో వివరంగా దేవుడు చెప్తున్నారు. ఒకసారి వాటిని చూసుకుందాం.

Zechariah(జెకర్యా) 12:2,3,4,5,6,7,8,9

2.నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

3.ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

4.ఇదే యెహోవా వాక్కుఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారి మీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును.

5.అప్పుడు యెరూషలేములోని అధికారులుయెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.

6.ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో నివసించుదురు.

7.మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

8.ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

9.ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

Zechariah(జెకర్యా) 14:2,3,4,5,6

2.​ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3.అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

4.ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

5.కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

6.​యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.

కాబట్టి జెకర్యా గారు రాసిన దాన్ని బట్టి చూస్తే ఈ సంభవాలు తప్పకుండా అంత్యకాలంలో అంత్య దినాలలో యుగాంతంలో అనగా రెండవ రాకడ సమయములో జరుగుతాయి. యెరుషలేము మీదకి ప్రపంచ దేశాలలో అనేక దేశాలు అన్ని జాతులు కలిసి దండెత్తి వస్తాయి. ఎందుకు దండెత్తుతాయి? ఎందుకంటే మొదట వారు క్రీస్తు విరోధి ద్వారా మోసగింపబడి వాడే నిజమైన మెస్సయగా యూదులు అంగీకరిస్తారు! గాని ఎప్పుడైతే వాడు అనుదిన బలిని నిలిపివేసి దేవాలయంలో నాశనకరమైన హేయ వస్తువుని నిలబెడతాడో వెంటనే సత్యాన్ని గ్రహించి యూదులు క్రీస్తు విరోధి మీద అనగా అంత్య క్రీస్తు మీద తిరగబడతారు! వెంటనే మహా శ్రమల కాలం ప్రారంభమైంది! ఈలోగా సూర్యుని ధరించిన స్త్రీ యొక్క సంభవం జరుగుతుంది! అందువల్ల క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతాను గాడు వాడి ఆధీనంలో ఉన్న భూలోకంలో ఉన్న అనేక సైన్యం మొత్తం కలిసి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రకారం హార్మెగిద్దోన్ అనే చోట యెరుషలేము పట్టణానికి ఆపోజిట్ గా యెరుషలేము పట్నం చుట్టూ ముట్టడి దిబ్బ వేస్తారు. అప్పుడు జెకర్యా గ్రంథంలో చెప్పబడినట్లు మరొక్కసారి ఇశ్రాయేలు వారిని ఈ శత్రు సైన్యాలు దోచుకుంటే స్త్రీలను చెరుపుతారు వారి ఆస్తులు లాక్కుంటారు యెరుషలేము అన్యాక్రాంతం అయిపోతాది.

Zechariah(జెకర్యా) 14:2,3,4

2.​ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3.అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

4.ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

అప్పుడు జక్కరియా 12 వ అధ్యాయంలోని చెప్పబడినట్లు వారంతా ఏడుస్తూ ఉంటారు యాజకులు వేరుగాను వారి భార్యలు వేరుగాను దావీదు వంశం వారి వేరుగాను ఇలాగా లేవీయులు వేరుగాను వారి భార్యలు వేరుగాను ఏడుస్తున్నప్పుడు వారి మొర ఆలకించి దేవుడు వారి మీదకు ఆత్మను కుమ్మరిస్తాడు

Zechariah(జెకర్యా) 12:9,10,11,12,13,14

9.ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

10.దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11.మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12.దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13.లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14.మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

ఈ సమయంలోనే ఈ తప్పించబడిన యూదులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి వీరంతా ఏకమై మేము మోసపోయాము క్రీస్తు విరోధినే మెస్సీయగా అనుకున్నాము కానీ నిజమైన మెస్సయ్య మీరే అని ఏసుక్రీస్తు ప్రభువుల వారిని అంగీకరిస్తారు వెంటనే దేవుడు ఇశ్రాయేలు పక్షముగా శత్రు సైన్యాలతో యెరుషలేము చుట్టూ ఉన్న దండులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువుల వారు తన సర్వ దూతలతోనూ పరిశుద్ధులతోనూ భూమి మీద కాలు పెడతారు! అదే ఒలీవల కొండమీద అలా కాలు పెట్టినప్పుడు ఒలీవల కొండ రెండుగా విడిపోతుంది అప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారము దేవుని నోటి నుండి వచ్చిన అగ్ని వారితో యుద్ధం చేస్తాది దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తారు వారంతా హఠాత్తుగా నాశనమైపోతారు

Revelation(ప్రకటన గ్రంథము) 19:15,16,19,20,21

15.జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16.రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

19.మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

20.అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

21.కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

బహుశా నా ఉద్దేశం ప్రకారం అప్పటికే ప్రతి ఒక్కరి దగ్గర ఆటంబాంబ్స్ ఉంటాయి. బయోలాజికల్ బాంబ్స్ ఉంటాయి. ఇంకా కెమికల్ బాంబ్స్ ఉంటాయి. ఇలాంటివి ఏదో బయోలాజికల్ బాంబు గాని ఆటంబాంబు గాని అక్కడ పేలుతుంది. వెంటనే వారు హఠాత్తుగా ఒక్క నిమిషంలో శత్రువులు చనిపోతారు. ఇంకా కొన్ని దగ్గర నోట్లో వారి నాలుక నోట్లో ఉండగానే కుళ్ళిపోతుంది. వారి కళ్ళు ఆ కను తొరలో ఉండగానే కళ్ళు కుళ్ళిపోతాయి. ఇది తప్పకుండా బయోలాజికల్ బాంబు వెపనై ఉంటుంది. ఇలాగా యెరుషలేము చుట్టూ కూడిన సైన్యాలతో యేసు క్రీస్తు ప్రభువుల వారు యుద్ధము చేసి వారిని దండించబోతున్నారు!

ప్రియ సహోదరీ సహోదరుడా ఈ మహా ఘోరమైన విపత్తులో నువ్వు పాల్గొని దేవునితో పాటు మధ్యాకాశము నుండి యెరుషలేము మీద కాలు పెట్టాలి అంటే నువ్వు ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులోనే ఉన్నావా?

అంతటి ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నావా!

లేకపోతే మహా శ్రమలలోను మరియు యెహోవా దినము అని చెప్పబడే ఆ దేవుని ఉగ్రతలోనూ చివరికి నరకంలోనూ నువ్వు పాలు పొందుతావని మర్చిపోకు!!!

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!!

ఆమెన్!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*213వ భాగము*

యెషయా 29:7--13

7. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.

8. ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.

9. జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

10. యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు.

11. దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.

12. మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.

13. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 29వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

ఇక ఇక ఏడవ వచనం నుండి చూసుకుంటే ఆరీయేలుతో అనగా యెరుషలేముతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోట మీదను యుద్ధం చేయువారునూ దానిని అనగా యెరూషలేము ను బాధించిన వారందరూ రాత్రి కన్న కలల వలె ఉంటారట ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేలుకుంటే వారి ప్రాణము తృప్తి పడదు అలాగే దప్పికొన్నవాడు కలలో నీరుత్రాగి మేలుకుంటే ప్రాణానికి ఏమీ ఉపయోగం లేదు అలాగే సీయోను కొండమీద యుద్ధం చేయు జనుల సమూహం అంతటికి సంభవించును అనగా వారి యుద్ధానికి వచ్చారు కానీ వారికి విజయం రాలేదు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు ఈ లోగా వాళ్ళు నాశనం అయిపోయారు అన్నమాట! అంతా కలలో జరిగినట్టు జరిగిపోతుంది. ఆకలి గొన్నవాడు కలలో భోంచేస్తాడు కానీ మేలుకొంటే ఇంకా ఆకలితోనే ఉంటాడు అలాగే దప్పి కొన్నవాడు కలలో నీళ్లు తాగేస్తాడు లేకపోతే మంచి కూల్ డ్రింక్ తాగుతాడు కానీ మేల్కొన్నప్పుడు ఇంకా దాహంతోనే ఉంటాడు; అలాగే సీయోను కొండమీద యుద్ధం చేసే వాళ్ళకి అనగా ఆరీయేలు మీద యుద్ధం చేసే శత్రు సైన్యాలు వారి పరిస్థితి అలాగే ఉంటుంది!

తర్వాత వచనాలు మరల దేవుడు యెరుషలేము ప్రజలతో చెబుతున్నారు: జనులారా! తేరి చూడండి; మీరు విస్మయమొందండి! మీ కళ్ళును చెడగొట్టుకొండి! గుడ్డివారైపోండి! ద్రాక్ష రసం లేక మధ్యం తాగకుండానే మత్తులై ఉన్నారు వారు మద్యపానం చేయకే తూలిపోతున్నారు! ఎందుకంటే యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించియున్నాడు! మీ నేత్రాలుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు! మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘ దర్శులకు ముసుగు వేసి ఉన్నాడు! యెరుషలేము ప్రజలతో దేవుడు చెప్తున్నాడు మీరు ఆత్మసంబంధమైన విషయాలనే తెలుసుకోకుండా మీ కళ్ళకు అందత్వము, మైకము కలుగజేయబడి ఉన్నాయి! వారి అపనమ్మకం అవిశ్వాసం వారి దుష్టత్వం వల్లే దేవుడు యెరుషలేము వారిని ఈ స్థితికి తీసుకొని వచ్చాడు!

యెషయా 6:9--11 వచనాలలో కూడా ఇదే కదా అన్నారు నువ్వు వెళ్లి ప్రజలతో ఇలాగ చెప్పు మీరు వింటారు కానీ దాని అర్థం చేసుకోరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కానీ గ్రహించరు ఈ ప్రజల హృదయాలు మొద్దు పోయేలాగా చెయ్యి వారి చెవులు మందం అయ్యేలా చెయ్యి వారి కళ్ళు మూయించు! ఎంతవరకు అంటే దేశంలో మనుషులు అనేవారు ఎవరూ లేకుండా పోయేవరకు!

Isaiah(యెషయా గ్రంథము) 6:9,10,11

9. ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

10 .వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

11. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

ఇలాగ చేయమని దేవుడే చెప్పారు యెషయా గారితో. అందువల్ల దేవుడు ద్వారా వారికి ఇచ్చిన ప్రవచనాలను యెరుషలేము ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు! కాబట్టే వారికి ఈ స్థితి కలిగింది ఇక దేవుడు గాఢ నిద్ర కుమ్మరించాడు! నీ కనులను మూసివేశాడు! మీ తలలకు ముసుగు వేశాడు! దేవుని ఏడాత్మలు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణ దేవుడు ఎలాగో అలాగే మరో ఆత్మలు కూడా ఉన్నాయి; ఇక్కడ ఒక ఆత్మ ఉంది ఇది గాఢనిద్ర ఆత్మ! ఇంకా అపవిత్ర ఆత్మ ఇలాంటి ఆత్మలు చెడ్డ ఆత్మలు కూడా! వీరి మీద దేవుడు గాఢ నిద్ర ఆత్మను, దేవుని వాక్యాల్ని అర్థము చేసుకొనని ఆత్మను వీరి మీద కుమ్మరించారు దేవుడు. ఇంకా మన సంఘాల్లో కూడా చాలామంది ఇంటిదగ్గర వాళ్లకు నిద్ర రాదండి! మందిరానికి వచ్చినప్పుడు పాటలలోనే కొంతమంది నిద్రపోతారు కొంతమంది వాక్యం మొదలుపెట్టిన వెంటనే పెద్దల్లో కలిసిపోతారు! ఎక్కడి నుంచి నిద్ర వచ్చేస్తుందో తెలియదు! వీరికి సాతాను గాడు గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం వినకుండా వారు బ్రతుకులు బాగవకుండ అక్కడ సాతాను గాడు గాఢనిద్రాత్మను వారి మీద కుమ్మరిస్తున్నాడు!

సహోదరీ సహోదరుడా నీవు కూడా ఇలాగ మందిరానికి వచ్చి నిద్ర పోతున్నావా! జాగ్రత్త నీ మీద సాతాను గాడు గాఢ నిద్రాత్మను కుమ్మరించి నీ మీద ఏలుబడి చేసి నిన్ను నరకానికి పంపుతున్నాడు అని మర్చిపోవద్దు!

ఇంకా ఇదే వచనంలో మీ కండ్లను దేవుడు మూసివేశాడు మీ తలలకు ముసుకు వేశాడు! కండ్లను మూసివేయడం అంటే పౌలు గారు చెప్పిన ఈ యుగ సంబంధమైన దేవత ఈ నశించిపోయే వారికి కళ్లకు అంధత్వము కలగజేశాడు! ఎందుకంటే దేవుని నిజమైన వెలుగును వారు గ్రహించకుండా చేయడానికి ఇక మీ తలలకు ముసుగు వేశాడు అనగా దేవుని మాటలకు దేవుని వెలుగు వారి మీదకు రాకుండా సాతాను గాడు ఒక రకమైన కవర్ చేశాడు! అయితే ఇక్కడ దేవుడే వీరికి తల మీద ముసుకుంది ఎందుకంటే మీరు తప్పకుండా నాశనం అయిపోవాలని దేవుడు అనుకుంటున్నారు! ఇంత ఘోరంగా వీరి పరిస్థితి ఉంది అన్నమాట! ఇంతవరకు హేళన చేశారు వీరు యెషయా గారు మాటల్ని! అందుకే దేవుడు వీరి మీదకి ఉగ్రత తీసుకొని వస్తున్నాడు! మీ మీద గాడనిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రాలుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘ దర్శకులకు ముసుగు వేసి ఉన్నాడు అంటున్నారు చూడండి! మనము ఎలీషా గారి కాలంలో ఆహాబుకాలంలో అనగా ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఆహాబు గారి కాలంలో ప్రవక్తల నోట అబద్దమాడే ఆత్మగా ఒక దూతను పంపించి ఆహాబు నాశనమైపోయేలాగా చేశాడు దేవుడు!

1రాజులు 22:21

అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

1రాజులు 22:22

అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

1రాజులు 22:23

​యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

ఇక్కడ ప్రవక్తలను చెడగొట్టి దీర్ఘ దర్శకులకు అనగా ముందు జరగబోయే విషయాలు ప్రజలకు తెలుపకుండా వారికి ముసుగు వేసి ఉన్నాడు! ఎందుకంటే వీరంతా త్రాగుబోతులుగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా దేవుడు ఎవరికీ తన మాటలు వినిపించడానికి ఇష్టపడటం లేదు. ఇక 11వ వచనం చూసుకుంటే దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములు వలె ఉన్నవి! ఈ వాక్యాన్ని ఒకడు నువ్వు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరాలు తెలిసిన వానికి అనగా చదువుకున్న వాడికి అప్పగిస్తే అది నా వలన కాదు అది గూడార్ధముగా ఉంది అని చెప్తాడు! నీవు దీనిని దయచేసి చదవమని అక్షరములు తెలియని వానికి అనగా చదువుకోని వాడికి చెప్తే ఈ అక్షరాలు నాకు రావు నాకు చదువు రాదు అని చెప్పుతాడు! అంతటి స్థితి కలుగుతుంది అని చెప్తున్నారు; అయితే ఇక్కడ ఇట్లా ఉంది కానీ మనం ప్రాచీన ప్రతులు చూసుకుంటే ఈ 11 వ వచనం ఇలాగ ఉంది :ఒక పుస్తకం ఉంది అది దర్శనం! అంతా ముద్రల చేత ముద్రించిన పుస్తకంలో ఉన్న మాటల లాగా ఉన్నది! ఆ పుస్తకము చదువు వచ్చిన వాడికి ఇచ్చి దయచేసి దీనిని చదవండి అని అడిగితే అతడు అంటాడు కదా దీనిని నేను చదవలేను అది ముద్రలు వేయబడి ఉంది అనగా ఇది సీల్ చేయబడి ఉంది! సీల్ అంటే పూర్వకాలంలో కొన్ని రహస్యాలను రాజు గారి ఆధ్వర్యంలో డైరెక్ట్ ఆ ప్రజలకు తెలియాలంటే సీల్ చేసి ఎవరికి చెందాలో వారికి చెందిన తర్వాత వారే విప్పి చదువుకోవడానికి వీలుగా సీల్ చేసేవారు! ఇంకా చెప్పాలంటే ఒకరు ఏదైనా తప్పు చేస్తే ఒక షాప్ని ఆ బ్యాంక్ ని లేదా ఆ ఇంటిని కోర్టు వారు తాళం వేసి దానిమీద ఒక ముద్ర వేసేస్తారు. సీల్ అలాంటి సీల్ దేవుడు ఈ పుస్తకం మీద వేశారంట అలా కనబడుతుంది. ఆ ముద్రలను విప్పడానికి నాకు అధికారం లేదు నేను దీనిని చదవలేను అని చదువుకున్నవాడు చెప్తున్నాడు అంట! చదువులేని వాడికి ఇచ్చి దయచేసి చదవండి అంటే నాకు చదువు రాదు గిదువు రాదు ఎలా చదవగలను అని వాడు చెప్తున్నాడు! ఇలాగా దేవుని దర్శనము గాని దేవుని వాక్యము గాని ప్రవచనము గాని యెరుషలేము వారికి అర్థము కాని స్థితిలోకి, వాక్యమే కరువయ్య స్థితిలోకి, దేవుని మాట కరువయ్యే స్థితిలోకి, యెరుషలేము పట్టణస్తులు రాబోతున్నారు అని దేవుడు చెబుతున్నారు! మీదనేమో 9:10 వచనాలు వారు ద్రాక్షమధ్యము ద్రాక్షరసం తాగి తందనాలేస్తూ మద్యపానం చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇలా ఎందుకు జరిగింది అంటే 13 వచనంలో మరో మాట చెబుతున్నారు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు గాని పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు! వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే కానీ నేను చెప్పిన మాటలు వారు చేయడం లేదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అందుకే వీళ్ళ మీదకి ఇలాంటి గాఢ నిద్ర ఆత్మ దేవుని వాక్యాన్ని గ్రహించలేనంటే స్థితి చివరికి దేవుని వాక్యమే కరువయ్యే స్థితి యెరూషలేము ప్రజల మీదకి రాబోతుంది!

ఈ 13వ వచనం బైబిల్ లో యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా దీనిని అనేకసార్లు ఉపయోగించారు అపోస్తులుడైన పౌలు గారు ఇంకా కొత్త నిబంధన భక్తులు ఈ మాటను ఉపయోగించారు! మత్తయి సువార్త 15: 8, 9 వచనాల్లో ఏసుప్రభుల వారు పరిసయ్యులను వారి కపట భక్తిని ఖండిస్తూ ఇదే వచనాన్ని పలికారు, ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి వస్తున్నారు గాని తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది! ఇలా వారు నాకు దూరమైపోయారు పెదాలతో మాత్రం నన్ను గౌరవిస్తున్నారు తప్ప వారు చాలా దూరంగా ఉన్నారు! మనుషులు ముందు భక్తిపరులుగా దేవుడు అంటే ఎంతో ఆసక్తి ఉన్నవారుగా ప్రజలు తమను గౌరవించాలి అనుకుంటారు! అందుకే నటన చేస్తారు! అయితే వారి పెదవులు పలికే దానికి వారి హృదయస్థితికి ఎంతో తేడా ఉంది!

ఇదే రాయబడింది భక్తి ఉన్నట్లు నటన చేస్తారు గాని వారి హృదయం ఎంతో దూరంలో ఉందని యిర్మియా 12:1,2 లో కూడా ఇదే అంటున్నారు. చివరికి యెహేజ్కేలు 33వ అధ్యాయంలో కూడా దేవుడు ఇదే చెప్తున్నారు! నా నిజమైన కట్టడలను పాటించకుండా మానవ కల్పితమైన కట్టడలే దేవుని కట్టడాలని బోధిస్తూ వాటిని ఆచరిస్తున్నారు! వారి హృదయము నా నుండి ఎంతో దూరంగా ఉం!ది అందుకే ఈ ప్రజల మీదకి శిక్ష అని దేవుడు చెబుతున్నారు!

ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు కూడా అదే స్థితిలో ఉంటే నీ మీద కూడా దేవుని శిక్ష న్యాయముగా దిగబోతుంది! ప్రజల ముందు పరిసయుల వలె నటన చేస్తున్నావేమో! శాస్త్రులు వలే కపట వేషం వేస్తున్నావేమో! జాగ్రత్త దేవుని నోటి నుండి అగ్ని వచ్చి నిన్ను దహించబోతుంది! దాన్ని తప్పించుకోవాలంటే నేడే మార్పు నొంది మారుమనస్సు పొంది ఆయన పాదాలను పట్టుకో!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*214వ భాగము*

యెషయా 29:14,17----24

14. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

17. ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.

18. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

19. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

20. బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.

21. కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.

22. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

23. అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.

24. చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 29వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ఇక ఇక 14వ వచనం నుండి చూసుకుంటే కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే నేను మరలా ఒక ఆశ్చర్యకార్యము చేస్తాను అంటున్నారు! అది బహు ఆశ్చర్యముగా జరిగిస్తాను! దెబ్బకి జ్ఞానుల యొక్క జ్ఞానము వ్యర్థమైపోతుంది అంటున్నారు! ఇక్కడ దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ చేసే కార్యం ఏమిటో 17వ వచనము నుండి 24వ వచనము వరకూ ఆ చేసే కార్యము మనకు కనిపిస్తుంది! అయితే ఈ విషయాల కోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 17 నుంచి 24 వచనాలు చూసుకుంటే నాకు అనిపిస్తుంది మొట్టమొదట ఆయన సువార్త ద్వారా యొక్క గొప్ప వారి యొక్క జ్ఞానాన్ని వ్యర్థము చేస్తున్నట్లు నాకు అర్థం అవుతుంది ఎందుకంటే జ్ఞానుల జ్ఞానము అంతర్ధానమైపోతుంది ఇది మనకు మొదటి కోరింది పత్రికలో పౌలు గారు చెప్పిన మాటలకు గుర్తుకొస్తున్నాయి.

1కోరింథీయులకు 1:19

ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

1కోరింథీయులకు 1:20

జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు(మూలభాషలో-ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

1కోరింథీయులకు 1:21

దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయెను.

1కోరింథీయులకు 1:22

యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

1కోరింథీయులకు 1:23

అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

1కోరింథీయులకు 1:24

ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

1కోరింథీయులకు 1:25

దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

1కోరింథీయులకు 1:26

సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో- శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

1కోరింథీయులకు 1:27

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

1కోరింథీయులకు 1:28

జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

1కోరింథీయులకు 1:29

ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

ఈ వ్యాఖ్యలన్నీ చూసుకుంటే నిజానికి అద్భుతాలలో కల్లా అత్యద్భుతమైన అద్భుతము మహోన్నతమైన అద్భుతము యేసు క్రీస్తు ప్రభువుల వారి సిలువ! ఆ శిలువే మనకు పాపానికి విమోచన కలిగించింది! ఆ శిలువే పాపిని రక్షించింది! ఆ శిలువే భూమికి ఆకాశానికి నిచ్చినవేసి మానవులను దేవునితో సమాధానపరిచింది! అందుకే నిజమైన గొప్ప మహోన్నతమైన అద్భుతము ఏమైనా ఉందంటే అది యేసు క్రీస్తు ప్రభువు వారి సిలువ మాత్రమే!!!

ప్రియులారా ఈ 15, 16 వచనాలు ధ్యానం చేసే ముందు అసలు ఆ అద్భుతం ఏమిటి అనేది 17 నుంచి 24 వచనాల్లో వ్రాయబడి ఉంది అని చూసుకున్నాం కాబట్టి ముందు దేవుడు చేయబోతున్న అద్భుతాన్ని చూసుకొని ఆ తర్వాత ఈ 15, 16 వచనాలు ధ్యానం చేసుకుందాం!

ఈ 17వ వచనములో దేవుడు అంటున్నారు కదా ఇక కొద్ది కాలమైన తరువాత లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము అది వనము అని ఎంచబడును! జాగ్రత్తగా ఆలోచించాలి కొద్ది కాలం తర్వాత లెబనాన్ ప్రదేశం ఫలవంతమైన ఫలము అవుతుంది ఆ ఫలవంతమైన పొలము వనము అని ఎంచబడుతుంది!

మొదటిది ఆలోచించవలసింది ఏమిటంటే ఈ ప్రవచనం చెప్పబోసరికి లెబనాను ఇశ్రాయేలు దేశంలో ఒక అంతర్భాగము అని గ్రహించాలి. ఈరోజు అనగా ఈరోజు నేను ఇది రాస్తున్నప్పుడు లెబనాను ఇశ్రాయేలీయులు అంతర్భాగము కాదు అది ప్రత్యేకంగా ఒక దేశంగా ఎంచబడుతుంది, దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు ఇదే లెబనాను ఇశ్రాయేలు దేశం మీదికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది! అయితే ఈ ప్రవచనం చెప్పిన ఆ రోజులలో అది ఇజ్రాయిల్ దేశంలో ఒక భాగము! అయితే మరి కొద్ది రోజులలో కూడా లెబానోను అంతర్భాగము తప్పకుండా కాబోతుంది! సరే ఇప్పుడు లెబానోను ప్రదేశం ఫలవంతమైన పొలం అగును ఇక్కడ లెబనాను అనగా యూదా రాజ్యము అని గ్రహించాలి! మొదట అది ఫలవంతమైన పొలం అవుతుంది! ఈ ఫలవంతమైన పొలము వనము అనగా మంచి మొక్కలు మంచి పూలు ఉండే అందరూ చూడాలని ఆశించే ఒక మంచి తోట అని గ్రహించాలి !పొలము - వనం బలవంతమైన పొలము అది వనముగా దేవుడు చేయబోతున్నారు! అందరూ ఆకాంక్షించే ప్రాంతముగా, చూడాలని ఆశించే లాగా దేవుడు ఈ యూదా ప్రాంతాన్ని చేయబోతున్నారు!

ఇక కొంత కాలము అనగా కొద్ది రోజుల్లో దేవుడు చేయబోతున్నారు అని అర్థము!

హెబ్రీ 10:37 లో ఇంకా కొద్ది రోజుల్లో రాబోయే వాడు వస్తాడు ఆలస్యం చేయడు అని బైబిల్ చెప్తుంది!

అయితే పేతురు గారు అంటున్నారు రెండో పత్రికలో 3:8లో అయితే ప్రియ సహోదరులారా ఒక విషయం మర్చిపోవద్దు ప్రభువు దృష్టికి ఒకరోజు వెయ్యి సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక్కరోజు లాగా ఉన్నాయి అంటారు!

కాబట్టి మానవునికి ఈ 1000 సంవత్సరాలు దీర్ఘకాలంగా అనిపించొచ్చు గాని అది దేవునికి దీర్ఘకాలము కాదు దేవుని దృష్టిలో అది చాలా కొద్ది కాలము దీని అర్థం! లెబనాను లో మనుషుల పరిస్థితిలో మార్పు రాబోతుంది ఒకానొకప్పుడు మనుషులు ఇస్రాయిలీయులే కానీ ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు అంటే వ్యతిరేకత కలిగి ఇస్లామీయులుగా ఉన్నారు మనుషుల పరిస్థితుల్లో మార్పులు వచ్చేసాయి!

ఇక 18 వ వచనంలో ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యాలు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు! చూడండి పుస్తకం చదివి వినిపిస్తే ఆ రోజున అనగా దేవుడు లెబనాను ప్రాంతము అనగా యూదాప్రాంతాన్ని దర్శించే బోయే దినాన చూస్తే లెబనాను ఫలవంతం అవుతుంది !ఇది చూస్తే ఇది అంత్య దినాలలో జరిగే సంభవము లా కనిపిస్తుంది! అంతేకాదు ఇక్కడ పుస్తకం చదివి వినిపిస్తే చెవిటివారు ఆ మాటలు వింటారు గ్రుడ్డివారు చీకటిలోంచి గాఢాంధకారంలోంచి చూడగలుగుతారు!

ఇది రెండు విధాలుగా దీనిని నెరవేర్పు ఉంటుంది అని నా ఉద్దేశం!

ఒక నెరవేర్పు ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమిపై ఉన్న రోజుల్లో ప్రారంభమైంది శరీరకంగా గ్రుడ్డిగా ఉన్నవారు చెవిటివారు ఏసుక్రీస్తు ప్రభువుల వారి కాలం నుండి స్వస్థత పొందుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు కూడా అనేకమంది స్వస్థత పొందుకుంటున్నారు!

ఇక ఆధ్యాత్మికంగా నెరవేర్పు చూసుకుంటే ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారిగా చెవిటివారిగా ఉన్నారు! వీరి గ్రుడ్డి తనము, వీరి చెవిటితనము వాక్యం అంటే నిజమైన మెస్సియా ఎవరో చెబితే గ్రుడ్డిగా చెవిటిగా ఉన్నారు! ఈ గ్రుడ్డితనము చెవిటితనం ఈ యుగాంతం వరకు అది పోదు అని అర్థమవుతుంది! చివరి కాలంలో అనగా అంత్య దినాలలో వారి గ్రుడ్డితనము పోయి వారి మనోనేత్రాలు వెలిగి ఏసుక్రీస్తు నిజమైన మెస్సియా అని గ్రహించి మారుమనస్సు పొందుతారు! అప్పుడు వాక్యాన్ని వారు వింటారు పుస్తకం చదివితే వింటారట గుడ్డివారు మహాగాదం చీకటిలో కూడా వారు చూడగలుగుతారు! ఇది దేవుడు చేసే చేయబోయే అద్భుతం!!

ఇక 19వ వచనములో యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు! యెషయా గారి కాలంలో వారి పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతాయి అని ఈ వచనాలు సూచిస్తున్నాయి! నిజమే కదా ఇప్పుడు పరిస్థితిలో తార్మారైపోయాయి కదా! అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను యూదా ప్రజలను సందర్శించే దినాన వినయం గల వారికి పేదలకు ఘనత కలుగుతుంది! ప్రజలలో ఉన్న క్రూరత్వం ద్వేషము తిరస్కారము కీడు అన్యాయం చేసే భావన ప్రజలలోనుండి తొలగిపోతాయి! ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే ఒకసారి కలిగింది ఏసయ్య భూమి మీద వచ్చినప్పుడు; ఇక రెండోసారి కూడా రాబోతుంది అది 1000 ఏండ్ల పరిపాలనలో, యేసయ్య ఈ భూమి మీద పాలన ప్రారంభించిన తర్వాత!!!

Isaiah(యెషయా గ్రంథము) 11:1,2,3,4,5

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

Isaiah(యెషయా గ్రంథము) 26:5,6,7

5. ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తయిన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి యున్నాడు

6 .కాళ్లు, బీదలకాళ్లు, దీనులకాళ్లు, దాని త్రొక్కు చున్నవి.

7. నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

ఇక ఈ వెయ్యి ఏండ్ల పరిపాలనలో ఎలా ఉంటుందంటే 20 ,21 వచనాలు బలత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు కీడు చేయాలని ప్రయత్నించేవారు, వ్యాఖ్యలను బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములలో తమ్మును గద్ధించు వానిని పట్టుకోవాలని ఉరినొడ్డి మాయమాటలు చేత నీతిమంతుని పడద్రోయివారు నరకబడుదురు! చూడండి బలాత్కారులు అనేవాళ్లే లేకుండా పోతారు పరిహాసకులు హేళన చేసేవారు అందరూ నశించి పోతారు! చెడు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు నాశనం అయిపోతారు! ఒక్క మాటతో ఇతరులను అపరాదులుగా చేసేవాళ్లు న్యాయస్థానంలో తప్పుడు వాదన వాదించే వాళ్ళు మాయమాటలు చేత నిర్దోషులకు న్యాయం జరగకుండా చేసేవాళ్లు నాశనం అయిపోతారు అంట! హల్లెలూయ!!

ఇంకా ఏం జరుగుతుందో 22 నుంచి 24 వచనాలు చూసుకుందాం! అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు! ఒకసారి దీనికోసం ఆలోచిద్దాం అబ్రహామును విమోచించిన యెహోవా దేని నుండి విమోచించారు అనేది ఒక ప్రత్యేక భాగముగా వచ్చే భాగాలలో ధ్యానం చేసుకుందాం!

సరే అబ్రహామును విమోచించిన యెహోవా ఇప్పుడు యాకోబు కుటుంబాన్ని గూర్చి ఇలా అంటున్నారు ఏమనంటే ఇకమీదట యాకోబు సిగ్గుపడడు! యాకోబు అనగా ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము అని గ్రహించాలి. ఇకమీదట అతని ముఖము అనగా ఇశ్రాయేలు ప్రజల ముఖము తెల్లబారదు! ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే తప్పకుండా ఇది ఏసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రత్యక్ష పరిపాలన భూమి మీద స్థాపించినప్పుడు! అనగా హార్మెగిద్దోను యుద్ధం తర్వాత ఏసుక్రీస్తు ప్రభువుల వారి రాజ్య పరిపాలన ప్రారంభమవుతుంది! అప్పటినుంచి ఇక ఎప్పటికీ యాకోబు సిగ్గు పడడు ఇశ్రాయేలు ప్రజల ముఖము తెల్లబారదు! అతని సంతానం వారు తమ మధ్య నేను చేయబోవు కార్యమును అనగా దేవుడు చేసే కార్యాన్ని చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు! యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు! ఇశ్రాయేలు దేవునికి సమస్త జనులు భయపడతారు! చంచల బుద్ధి గలవారు కూడా వివేకులు అయిపోతారు! సణుక్కునేవారు ఉపదేశానికి లోబడతారు! ఇది దేవుడు చెబుతున్న మాట!

ఇప్పుడు ఇక దేవుని పరిపాలన ప్రారంభమయ్యాక ఇశ్రాయేలు ప్రజలు సిగ్గుపడరు! వారి ముఖాలు పాలి పోవు! వారెప్పుడు సంతోషంగా ఉంటారు! వారి దేవుడు నుంచి ఇంక దూరం కారు! వారంతా దేవుని పట్ల భయభక్తులతో ఉంటారు! వారిని చూసినవారు వారి శత్రువులు కూడా దేవుడంటే ఎంతో భయభక్తులుతో నడుచుకుంటారు అని ఈ అధ్యాయంలో చెప్తున్నారు!

అదే దేవుని నమ్ముకున్న నీవు దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నావా!! దేవుడంటే యదార్ధంగా ఉంటున్నావా!!

అలాంటి భయము భక్తి యథార్థత నీలో నాలో లేకపోతే మనము కూడా తీర్పు పొందుతాము! కాబట్టి ఆయన యందు నిజమైన భయ భక్తులు కలిగే ఆయన మార్గంలో నడుచుకుందాం!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*215వ భాగము*

యెషయా 29:22

22. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 29వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ఇక 22వ వచనం నుండి చూసుకుంటే ప్రియులారా ఈరోజు 22వ వచనములో ఉన్న అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు! దీనికోసం ధ్యానం చేద్దాం!

అబ్రహాము గారిని దేవుడు దేని నుండి విమోచించారు దేవుడు? దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే సింపుల్ డైరెక్ట్ ఆన్సర్: విగ్రహారాధన నుండి, విగ్రహారాధికుల ప్రాంతం నుండి విడిపించి వాగ్దానదేశానికి తీసుకెళ్లారు!

దీనికోసం వివరంగా చూసుకోవాలంటే మనకి ఆదికాండంలో పూర్తి వివరాలు లేవు గానీ యాషారు గ్రంధంలో అబ్రహాము గారి సంపూర్ణ చరిత్ర కనిపిస్తుంది! ఇప్పుడు దేవుడు అబ్రహం గారిని దేని నుండి విమోచించారు అనేది తెలుసుకోవాలి అంటే ఆయన చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలి! ఇక్కడ అబ్రహాము గారి చరిత్ర బైబిల్లో లేని అబ్రహాము గారి చరిత్ర, నేను చెప్పడంలో నా ఉద్దేశం నాకు చరిత్ర తెలుసు నేను యాషారు గ్రంధము ఇంకా అనేక గ్రంథాలు చదివేను అని చెప్పడం ఎంత మాత్రం కాదు!!! అబ్రాహాము గారి చరిత్ర ఒకసారి చూసుకుంటే దేవుడు ఏ పరిస్థితులలో నుండి అబ్రహాము గారిని పిలుచుకున్నారు, కేవలం అబ్రహాము గారినే ఎందుకు పిలుచుకున్నారు! పిలుచుకొని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇదంతా మనకు అర్థం అవుతుంది! అయితే ఒక విషయం యాషారు గ్రంధాన్ని హనోకు గ్రంధాన్ని బైబిల్లో చేర్చుదాం అని బైబిల్ పండితులు క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండే 19 శతాబ్దం వరకు చాలా ప్రయత్నాలు చేసినా దేవుడు ఈ యాషారు గ్రంధాన్ని గాని, హనోకు గ్రంధాన్ని గాని, ద బుక్ ఆఫ్ క్రానికల్స్ అని చెప్పబడే హనోకు గారు రాసిన మరో గ్రంధము గానీ, ఇంకా అపోస్తులు వ్రాసిన తోమా సువార్త గాని మగ్దలేని మరియ గారు రాసిన మగ్దలేని మరియా సువార్త గాని, ఈ గ్రంథాలని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ లో కలపడానికి ఎందుకో ఒప్పుకోలేదు! కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోని ఈ పుస్తకాల కోసం ఎక్కువగా చదవడం వ్యర్థముగాని మనకు కావలసిన మేటర్ కొద్దిగా లైట్ గా చూసుకొని ముందుకు పోదాం!

ఆదికాండం 11వ అధ్యాయం ప్రకారం అబ్రహాము గారి యొక్క తండ్రి అయిన తెరహు గారు, వారి పూర్వికులు కల్ధీయులు దేశము అనగా ఆ కాలంలో ఇరాక్ ఇది సౌత్ ఇరాక్ ప్రాంతానికి చెందింది! బార్డర్లో ఆల్మోస్ట్ ఇరాన్, ఇరాక్, కువైట్ బోర్డర్ దగ్గరలో వాళ్ళు ఉండేవారు! ఊరి పేరు ఊరు! అయితే యాషారు గ్రంధం ప్రకారము అబ్రహం గారు తన చిన్నప్పటి నుంచి తనకు 50 సంవత్సరాలు వచ్చే వరకు నోవాహు గారి దగ్గరే ఆయన పెరిగారు! జల ప్రళయం తర్వాత నోవాహు గారు 350 సంవత్సరాలు బ్రతికినట్లు మనకు ఆదికాండం 9 వ అధ్యాయంలో అనుకుంటాను చూడగలము! ఈ 350 సంవత్సరాలలో తను చనిపోయే ముందు 50 సంవత్సరాల ముందు అబ్రహాము గారు పుట్టారు! అబ్రహాము గారికి సుమారు 50 సంవత్సరాలు వచ్చేవరకు నోవా గారి దగ్గరే ఆయన పెరిగారు! కాబట్టి అబ్రహం గారు నేర్చుకున్న భక్తి నోవా గారి దగ్గర నేర్చుకున్నారు ! అయితే ఈ 50 సంవత్సరాలు పూర్తిగా అక్కడే ఉండిపోలేదు, మధ్య మధ్యలో తన తండ్రి దగ్గరికి వస్తూ ఉండేవారు! తన తండ్రి పేరు తెరహుగారు‌! ఈయన కోసం ఆలోచిస్తే ఈయన ఒక విగ్రహారాధికుడు! గాని నోవా గారి భక్తి జీవితం ఏమి ఈయనకు రాకుండా కల్ధీయుల భక్తి విగ్రహారాధన అబ్బింది! ఈ కల్దీయులు పక్కన మెసపుటోమియా అనగా నార్త్ ఇరాక్ అస్సీరియా! అప్పుడైతే మూడు మూడు దేశాలుగా ఉండేది అబ్రహం గారి కాలంలో! ఈ కల్దీయులు దేశంలో భయంకరమైన విగ్రహారాధనలో ఉండేవారు! ఆయన వృత్తి విగ్రహాలు చేసి అమ్మడం మరియు ఆ దేవతకు పూజారిగా పనిచేసేవారు! గొప్ప భూస్వామి మరియు వేలాది పశుసంపద! అబ్రహాము గారి తండ్రి గారికి ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది ఉండేది దాని నిండా అనేకమైన దేవతల విగ్రహాలు ఉండేవి! తెరహు గారు ఉదయాన్నే లేచి ఆ గదిలోకి వెళ్లి ప్రతి దేవతకు పూజించి ధూపం పెట్టి వస్తూ ఎంతో విగ్రహారాధన సంబంధమైన భక్తిలో ఉండేవారు! దీనిని అబ్రహం గారు తన చిన్నతనంలో ప్రతిరోజు చూస్తూ ఉండేవారు! అయితే నోవా గారు విగ్రహాలు పూజించకూడదు మనకు ఒక నిజమైన దేవుడున్నాడు ఆయన నిరాకారుడు ప్రతి స్థానంలో ఉండేవాడు నోరు ఉండి మాట్లాడేవాడు నోరు ఉండే తినే దేవుడు కాళ్లు ఉండి నడిచే దేవుడు చెవి నుండి వినే దేవుడు! ఆయన నాతో మాట్లాడారు! మా పూర్వీకులతో మాట్లాడారు! ఆయన సర్వాధికారి సర్వశక్తిమంతుడు అని అబ్రహం గారితో అనేకసార్లు చెప్పడం జరిగింది! నోవా గారి ఇంట్లో ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్లోకి అనేక మంది పిల్లలే కాకుండా ఎంతోమంది దేవుని యందు భయభక్తులు గలవారు వచ్చి దేవుని గూర్చిన విదానము నేర్చుకునేవారు! ఇలా నోవా గారి దగ్గర నేర్చుకున్న ఈ భక్తి వలన అనేకసార్లు తండ్రిని అడిగాడు : ఇవి విగ్రహాలు కదా వీటిని పూజించకూడదట కదా! ఎవరు చెప్పారు అంటే మన ముత్తాత గారి తాతగారు చెప్పారు అని చెప్పేవాడు! అయితే ఒకరోజు తన సొంతూరులో ఉన్నప్పుడు తండ్రి చాలా బిజీగా ఉండి తన పెద్ద కుమారుడైన అబ్రహం గారిని పిలిచి కుమారుడా ఈరోజు నేను బిజీగా ఉన్నాను దయచేసి ఈ ధూపము మన పూజ గదిలో ఉన్న అన్ని విగ్రహాలకు ధూపం వేసి, ఈ నైవేద్యము ఆ విగ్రహాలకు పెట్టు! నేను బిజీగా ఉన్నాను నువ్వు వెళ్ళు అని పంపిస్తే ఇష్టం లేకపోయినా తండ్రి మాటను జవదాట లేక అబ్రహం గారు ఆ ధూపము నైవేద్యము తీసుకొని వెళ్లి విగ్రహాలకు దూపం వేసి తర్వాత నైవేద్యము తినమని ఆ విగ్రహాలు పేరుపేరునా పిలిచి తినమని చెప్పడం జరిగిందట! ఎంతసేపు పిలిచినా ఏ విగ్రహం వచ్చి ఆ నైవేద్యం తినలేదు విగ్రహాలు తినవని తినలేవు అని అబ్రహం గారికి ఆ చిన్న వయసులో తెలిసింది కాదు! అప్పటికి ఆయన వయస్సు సుమారుగా ఏడు నుంచి పది సంవత్సరాలు ఉండొచ్చు! అప్పుడు అబ్రహం గారు ఆ విగ్రహాలను చూచి ఓ దేవతలారా తొందరగా ఈ నైవేద్యం తినేసి ఖాళీ ప్లేట్ నాకు ఇస్తే ఈ కాళీ ప్లేట్ ను మా అమ్మకి ఇవ్వాలి! మా తండ్రిగారు ఈ విగ్రహాలను పలానా ఊర్లో అమ్మి రమ్మన్నారు కాబట్టి నేను విగ్రహాలను అమ్మడానికి వెళ్లిపోవాలి! మీరు త్వరగా తినేసి ఈ ఖాళీ పళ్ళెం నాకు ఇమ్మని బ్రతిమలాడడం, చిరాకు పడడం జరిగింది! ఎంతసేపు జరిగినా ఎంతసేపు అయినా విగ్రహాలు మాట్లాడలేదు! ఇక ఆయనకు కోపం వచ్చి ఆ నైవేద్యం పట్టుకొని బయటకు వచ్చేసి తన తల్లితో చెప్పడం జరిగింది: ఏ దేవత నైవేద్యం తినలేదు బహుశా మన మీద అలిగాయేమో కోప్పడ్డాయేమో!! ఈ విషయం తండ్రి వచ్చేక తండ్రి తో కూడా చెప్పాడు! అప్పుడు తండ్రి ఏమన్నారంటే విగ్రహాలు తినవురా; మనం పెట్టడం మాత్రం చేయాలి అని చెప్పారు! వెంటనే తండ్రికి, అబ్రహం గారికి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది! తినలేని విగ్రహాలకు దేవతలని దేవతలకు పెట్టడం ఎందుకు? నోరు ఉండి కూడా తినలేకపోతే ఇంకెందుకు? నోరు ఉండి కూడా మాట్లాడకపోతే వాటిని పూజించడం ఎందుకు? వాటికి పెట్టడం ఎందుకు? వాటికి ధూపం వేయడం ఎందుకు అని అడిగితే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావని ఆరోజు తెరహు గారు అబ్రహం గారిని కొట్టారు!

వెంటనే మరల ఆయన నోవహు గారి దగ్గరికి వెళ్లిపోయారు! ఇలా నోవహు గారి దగ్గర కొంతకాలము ఉంటూ మరల తండ్రి దగ్గర కొంతకాలం ఉండడం విగ్రహాల కోసం గొడవ పడడం మరల నోవా గారి దగ్గరికి వెళ్లడం జరుగుతూ ఉండేది!!! ఈలోగా తెరహుగారు శారమ్మ గారినిచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన తర్వాత కూడా ఆస్తమాను నోవా గారి దగ్గరే అబ్రహం గారు ఉండేవారు ఈ విధముగా కొంత భక్తి శారమ్మ గారికి కూడా అబ్బింది.

అయితే అబ్రహం గారికి సుమారు 50 సంవత్సరాలప్పుడు నోవా గారు చనిపోయారు! అక్కడున్న ఈ ఆధ్యాత్మిక పాఠశాల కూడా మూతపడింది! ఇక వెంటనే అబ్రాహాము గారు పర్మినెంట్గా తన తండ్రి దగ్గరికి వచ్చేశారు! ఈలోగా అబ్రహం గారి చిన్న తమ్ముడు తెరహుగారి చిన్న కొడుకు లోతు గారి తండ్రి హారాను చనిపోయాడు. ఇది తెలిసి అబ్రహం గారు కూడా అక్కడే ఉండేవారు.

ఈలోగా గ్రామస్తులతో విగ్రహాలు దేవుళ్ళు కాదు నిజమైన దేవుడు ఒకాయన ఉన్నారు! ఆయన నిరాకారుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన యొక్క దేవదూతలు కూడా దేవుని నుండి వర్తమానం తీసుకొస్తారు అంటూ విగ్రహాలను దేవుళ్ళు కావు దేవతలు కావు అంటూ విగ్రహాలను పూజించకూడదు అంటూ నిజమైన దేవుని పూజించాలి అంటూ గ్రామస్తులకు చెప్పడం వల్ల, గ్రామస్తులకు అబ్రహాము గారికి ఎప్పుడు తగువులవుతూ ఉండేవి! ఆ సంవత్సరం ఒక స్త్రీ ఈ అబ్రహం వల్ల మన ఊరు నశించిపోతాది నాశనం అయిపోతాది కాలిపోతుంది అని సోది చెప్పింది! వెంటనే గ్రామస్తులంతా ఏకమైపోయి నీ కొడుకుని చంపేయాలి లేకపోతే మా ఊరు నాశనం అయిపోతుంది అని ఊరంతా అబ్రహాము గారిని చంపడానికి వచ్చారు! అప్పుడు తన కుమారుడిని బ్రతికించుకోవడానికి ఇక ఆ ఊరిలో ఉండలేక అబ్రహాము గారిని చంపకుండా అడ్డుపడి అబ్రహం గారిని అతని కోడలైన శారమ్మగారిని, చనిపోయిన తన తమ్ముడు కుమారుడైన హారాను కొడుకు లోతు గారిని తీసుకొని ఊరు అనేఊరు అనగా సౌత్ ఇరాక్ బోర్డర్, ఇరాన్ మరియు కువైట్ బోర్డర్ నుండి బయలుదేరి, కల్దీయుల దేశము మెసపుటోమియా దేశము, దాటి అస్సీరియాదేశం కూడా అనగా నార్త్ ఇరాక్ కూడా దాటి సిరియా వచ్చి, సిరియా నార్త్ ఇరాక్ బోర్డర్లోకి వచ్చి నివాసం చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఒక పెద్ద ఊరు కట్టారు! పట్టణం కట్టారు ! కట్టి ఆ ఊరికి తన చనిపోయిన కుమారుడు హారాను అని పేరు పెట్టారు. అక్కడనుండి 20 సంవత్సరాల తర్వాత దేవుడు నేను చూపించే దేశానికి నీ తండ్రి ఇంటిని నీ స్వజనాన్ని నీ సమస్తము వదిలి వచ్చే మంటే హారాను కూడా వదిలేసి కనాను దేశం వెళ్లిపోయారు! అబ్రహం గారు కల్దీయుల ఊరు నుండి హారాను సుమారు 900 కిలోమీటర్లు నడిచి వెళ్లారు! ఈ హారానుని కూడా వదిలేసి కనాను దేశం వచ్చి కనాను దేశములో పరవాసిగా బ్రతికారు అబ్రహం గారు!!!

కాబట్టి అబ్రహం గారిని దేవుడు దేని నుండి విమోచించారంటే మొట్టమొదట విగ్రహారాధనకు సంబంధించిన ఆచారము నుండి , విగ్రహాల నుండి దేవుడు విమోచించారు!

రెండు నాశన పురము అని అర్థం ఇచ్చే దేశము నుండి, చంద్రుని పూజించే దేశం నుండి కనాను దేశమునకు దేవుడు తీసుకొచ్చారు అనగా నరకము నుండి పరలోకానికి వాగ్ధానదేశానికి దేవుడు తీసుకొచ్చారు! ఈ లోకపు నరకము నుండి విమోచించి వాగ్దాన దేశము అనగా పరలోకానికి ఉదాహరణగా ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకొని వచ్చారు!

అదేవిధంగా దేవుడు అబ్రహామును విడిపించిన దేవుడు మనలను కూడా నాశనానికి జోగుపడుతున్న ఈ లోకము నుండి విమోచించడానికి పాపమునకు సాతానికి దాసులమై ఉండగా తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువులవారిని ఈ భూలోకానికి పంపించి పాపము నుండి విమోచించి మనలను పరమ కణాల యాత్రలో పెట్టారు! ఈ పరమ కనానుయాత్రలో ఉన్న నీవు పరిశుద్ధమైన జీవితం జీవించాలి! వాక్యానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం జీవించి, ఆ పరమ కనాను చేరుకోవాలి!

కానాను పురము కరుగుదాము ఓనా సోదరులారా! మానితంబౌ విందు నందు మనము కూడా చేరుదాం అనే ఈ పిలుపుని అందుకొని తన అను సాగుదాం!

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆమెన్!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*216వ భాగము*

యెషయా 29:15--16

15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.

16. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చిఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 29వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. గాని 15 16 వచనాలు మధ్యలో వదిలేశారు కదా ఇప్పుడు 15 16 వచనాలు ధ్యానం చేసుకుందాం

(గతభాగం తరువాయి)

ఇక 15వ వచనం నుండి చూసుకుంటే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోలోపుల వాటిని దాచిపెట్టాలని ప్రయత్నం చేసే వాళ్లకు శ్రమ అంటున్నారు ఇంకా మమ్మల్ని ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలుసు అనుకుంటూ చీకట్లో తమ క్రియలు చేసే వాళ్లకు శ్రమ తప్పదు అంటున్నారు! చీకట్లో మమ్మల్ని ఎవరూ చూడటం లేదులే అనుకుని తప్పులు పాపాలు చేసేవారు ముఖ్యంగా మనకు ఇద్దరు కనిపిస్తారు! ఒకటి వ్యభిచారం చేసే స్త్రీ రాత్రిపూట చీకట్లో ఎవరూ నన్ను చూడటం లేదు కదా అని ఈ తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, కానీ మర్చిపోతుంది దేవుని కన్ను, తన సృష్టించిన వాని కన్ను 24 గంటలు తమను చూస్తుంది అని!!! ఇంకా దేవుడు తనకోసం ఒక దూతను కాపలాగా ఉంచేరని ఆ కాపలాదారుడు కూడా చూస్తున్నాడని మర్చిపోతుంది! ఇంకా మనకోసం అస్తమాను దేవుడికి చాడీలు చెప్పే సాతాను గాడు కూడా తనను చూస్తున్నాడు అని ఆ వ్యభిచారం చేసే స్త్రీ గాని పురుషుడు గాని మర్చిపోతూ ఉంటారు! చీకట్లో ఎవరు చూడటం లేదు కదా అనుకుంటారు! అలాగే దొంగ కూడా రాత్రిపూట దొంగతనం చేస్తూ మమ్మల్ని ఎవరూ చూడటం లేదు కదా! ఎవరూ లేరు కదా! మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టడం లేదు కదా! ఈ తప్పు చేసిన పర్వాలేదని దొంగతనాలు చేస్తుంటారు! తప్పుడు పనులు చేస్తూ ఉంటారు! పిల్లి కళ్లుమూసుకుని పాలు త్రాగేస్తూ, ఎవరూ లేరు కదా చూడలేదు కదా నేను నీతిమంతురాలని అనుకుంటదట!! అలాగే వీరు కూడా తమనెవరో చూడలేదు అనుకొని ఏం పరవాలేదు అనుకుంటారు!! అయితే అది దేవుని కళ్ళకు మరుగై ఉండదు అని గ్రహించాలి!! కీర్తనలు 10 :11 లో దేవుడు మర్చిపోయాడులే తన ముఖం మరోవైపు తిప్పుకున్నాడులే ఇటువైపు ఎవడో చూడడు అని అనుకుంటారు!

‌కీర్తనలు 10:11

దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.

ఇక 94:4లో యెహోవా ఇదంతా చూడడం లేదులే యాకోబు దేవుడు ఇదంతా ఏమీ గమనించడులే అని ఈ పాపము చేసే వాళ్ళు అన్యాయం చేసే వాళ్ళు అనుకుంటారు అంటున్నారు.

కీర్తనలు 94:4

వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.

కీర్తనలు 94:5

యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

ఇంకా యెషయా 47:10లో

నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.

యెషయా 47:11

కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును అంటున్నారు!

దేవుడు ఇక 57:12 లో నీ నీతి ఎలాంటిదో నీ నిజాయితీ ఎలాంటిదో నీ క్రియలు ఏమిటో నేను ఒక రోజు బహిరంగంగా వెళ్లడం చేస్తాను అప్పుడు నీ పరువు పోతుంది అంటున్నారు అందుకే పౌలు గారు అంటున్నారు హెబ్రీ పత్రిక 4: 13 లో సృష్టి అంతట్లో దేవునికి కనిపించనిది అంటూ ఏమీ లేదు ఆయన కంటికి సమస్తము తేటగా బట్టబయలుగా కనిపిస్తుంది అలాంటి దేవునికి మనం లెక్క అప్పజెప్పాలి అని మర్చిపోవద్దు అంటున్నారు పౌలు గారు!

హెబ్రీయులకు 4:13

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

ఎవరూ మమ్మల్ని చూడటం లేదు కదా, మా ఆలోచనలు దేవునికి కనబడవు కదా అని దాచి పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళకు కీర్తన 139 లో యెహోవా నేను లేచుట తిరుగుట పడుకోవడం నీకు తెలుసు నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు మాట నా నోటికి రాకముందే నా మనసులో ఏముందో నీకు ముందే తెలిసిపోతుంది నేను ఇంకా పిండముగా ఉన్నప్పుడే నేను నీకు తెలుసు రూపం పంపబడిన ఎముకల్లో ఒకటి కూడా ఇంకా చేయబడక మునుపే నా తల్లి గర్భంలోనే నీవు నన్ను చూసేవు నా ప్రతి ఆలోచన నా ప్రవర్తన నువ్వు కనిపెడుతున్నావు నేను ఎక్కడికి పారిపోతాను? భూమి అగాధలకు పోయినా సముద్రపు లోతుల్లోకి పోయినా ఆకాశం పైకి ఎక్కిపోయిన నేను నీనుండి నేను దాగుకోలేను! నీకు సమస్తము తెలుసు మహాప్రభువు అని రాస్తున్నారు!!

ఇలాగా దేవుడు చూడని చోటు లేదు దాక్కుకుందామని చూసినవారు ప్రయత్నం చేసిన వారు ఇద్దరినీ మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను! మొదటిది సంఘము ఏదెను తోటలో ఉన్న సంఘము ఆదాము గారు అవ్వమ్మ గారు! వీరిద్దరూ దేవుడు తినవద్దు అని మరీ మరీ చెప్పిన పళ్ళు తినేసి (సాతాను ద్వారా మోసగింపబడ్డారు అనుకోండి) కానీ దేవుడు చెప్పిన మాటను జవదాటి, ఎవరూ చూడటం లేదు దేవుడు చూడలేదు అనుకుని పండ్లు తినేసి, చివరికి దిగంబరులుగా ఉన్నామని గ్రహించి, ఆధ్యాత్మిక కళ్ళు మూసుకుపోయి ఆధ్యాత్మికంగా చని పోయి, దేవుడు వచ్చే సమయానికి చెట్లు కింద పొదలు ప్రక్కన దాక్కున్నారు! దేవుడు వచ్చారు, ఆదామా నువ్వు ఎక్కడ అంటూ వెతికి వారిని రక్షించారు! వారు చేసిన అతిక్రమము వారు చేసిన ఆజ్న ఉల్లంఘనను బట్టి వారిని శిక్షించి, మరల ప్రేమ గల దేవుడు తండ్రి కాబట్టి వారికి చర్మపు బట్టలు కుట్టించి, దేవుడు మరలా ఇప్పించారు అప్పుడు కూడా మానవుడు దాక్కున్నాడు! కానీ దేవుడు వెదికి మరి రక్షించారు. ఇప్పుడు కూడా మానవులు పాపపు పనులు చీకటి పనులు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవుని నుండి దాక్కుంటున్నారు! అయితే దేవుడే మానవులను వెతుక్కుంటూ వచ్చి వారిని రక్షిస్తున్నారు! నశించిన దాని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను!

దీనికోసం ఆదాము గారి కోసం యోబు గారు అంటారు ఆదాము చేసినట్టు రొమ్ములో నా పాపాన్ని ఉంచుకొని ద్వారము దాటి బయటికి వెళ్లి ఆ పాపాన్ని ఒప్పుకోకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పకుండా ఉంటే అది పాపము అంటున్నారు కాబట్టి మన పాపాలు కప్పుకోకుండా ఒప్పుకోవాలి దేవుని వెదకాలి !

ఇక రెండవ బ్యాచ్ వీరు కూడా భార్యాభర్తలే! ఇది ఆది అపొస్తలుల సమయంలో జరిగింది! మనకు తెలుసు అపోస్తుల కార్యములలో, దేవుడు పెంతుకోస్తు దినం తర్వాత ఆత్మాభిషేకం తర్వాత వాడుకుంటూ ఉండగా వేలాదిమంది రక్షింపబడుతున్నారు, అప్పుడు అనేకమంది తమకు కలిగినదంతా అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతూ సువార్త వ్యాప్తికి సహకరిస్తూ ఉన్నారు; అప్పుడు ఆ ఉజ్జీవములో ఉద్రేకముగా ఊగిపోయి మేము కూడా మా పొలం అమ్మేసి డబ్బులు తెస్తాము అన్నారు! పేతురు గారు అడగలేదు యోహాను గారు అడగలేదు ఎవరు అడగ లేదు కానీ గొప్ప కోసం మా పొలం అమ్మి ఆ డబ్బులు తెచ్చేస్తాము అన్నారు! వెళ్లారు తెచ్చి ఇచ్చేరు కానీ సగం దాచుకొని సగం తెచ్చి ఇచ్చారు!

మొదటిగా అననీయ డబ్బులు పట్టుకొచ్చి పేతురు గారి దగ్గర పెట్టి అయ్యా మా పొలం అమ్మాను ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పగా, అననీయ ఆ పొలము నీవు అంతకే అమ్మేవా అంటే అంత కే అన్నాడు!! ఎందుకు దేవుని మోసగిస్తావు పొలం అమ్మినప్పుడు ఆ పొలం మీదే అమ్మిన తర్వాత కూడా డబ్బులు మీవే కానీ సగం ఎందుకు దాచుకున్నారు అంటే వెంటనే ప్రాణాలు వదిలేసాడు!! అక్కడ ఇది ఏమీ తెలియక మధ్యాహ్న కాలంలో భాగసింగారించుకొని సప్పీరమ్మ గారు వచ్చారు! సప్పీరతో పేతురు గారు అంటున్నారు: మీరు పొలం అంతకే అమ్మే రా! వెంటనే సప్పీరా జవాబు చెబుతుంది ఇంతకీ అమ్మాము అయ్యగారు అని జవాబు చెప్పింది, ఎందుకు మీరు పరిశుద్ధాత్మ మోసం చేస్తున్నారు నీ భర్తను మోసుకుపోయిన పాదాలు ఇంకా బయటనే ఉన్నాయి. వారు నిన్ను కూడా మోసుకు పోతారు అని చెప్పినట్టే స్పాట్లో చనిపోయింది!! అదే యవనస్తులు ఆమెను కూడా పాతిపెట్టారు!

ఇక మూడవ వ్యక్తి కూడా మీకు తెలుసు నన్నెవరూ చూడటం లేదు కదా అనుకున్నవారు! ధనం కోసం నయమాను గారు కుష్టు రోగం పోగొట్టుకొని తిరిగి వెళ్ళిపోతుంటే, ధనము సంపాదించుకుందాం ఏదైనా సంపాదించుకుందాం అనుకుని,‌ రధము వెనుక పరుగెత్తి, వెండి బంగారం దుస్తులు సంపాదించుకున్నారు. కానీ ఎలీషా అంటున్నారు వెండి బంగారాలు ఆస్తులు దాసులను దాసురాలను సంపాదించుకోవడానికి ఇది సమయమా ?! నయమాను పోగొట్టుకున్న కుష్టు నీకు నీ కుటుంబానికి కలుగుతుంది అని చెప్పగానే వెంటనే కుష్టు వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు!! ఎలీషా గారు నన్ను చూడటం లేదు కదా అనుకున్నాడు కానీ నా ఆత్మ నీ వెనకాల రాలేదా అన్నారు చూడండి !!

ఈ ముగ్గురు నన్ను చూడడం లేదు కదా ఎవరూ నన్ను చూడటం లేదు కదా అనుకున్నారు దేవుని శాపాన్ని పొందుతున్నారు!!

ఆదాము అవ్వగారు దేవుడు నన్ను చూడడం లేదు కదా అనుకోని తినవద్దన్న పండు తిన్నారు శాపం తెచ్చుకోవడమే కాకుండా మన అందరి మీదకి ఆ శాపాన్ని తెచ్చారు! అననీయ సప్పీరా సగం డబ్బులు దాచుకొని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని చూడడం లేదు కదా అనుకున్నారు మందిరంలోనే చచ్చిపోయారు! నన్ను చూడటం లేదు కదా అనుకున్నాడు గేహాజీ, దేవుని శాపం కుష్టు వ్యాధిని కొని తెచ్చుకున్నాడు!

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా నీవు కూడా దేవుడు నన్ను చూడటం లేదు కదా ఇక్కడెవరూ లేరు కదా! నేను చీకట్లో ఉన్నాను కదా అని నీవు పాపము చేస్తే దేవుని శాపము నీ మీదకు వస్తుందని మర్చిపోకు! మరలా చెప్తున్నాను హెబ్రీ పత్రికలో దేవుని కళ్ళకు మరుగైనది ఏదీ లేదు ప్రతి విషయము ఆయన కళ్ళకు తేటగాను స్పష్టముగాను కనిపిస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు కాబట్టి నువ్వు చేసే ప్రతి చెడ్డ పని దేవుడు చూస్తున్నాడు! ఎవరూ చూడటం లేదు కదా అనుకున్నది ఏం చేస్తున్నావ్? ఇక్కడ పీజీలో ఎవరూ లేరు కదా, ఇక్కడ హాస్టల్ లో నేను ఒక్కడినే కదా ఉన్నాను అంటూ ప్రియ యవనస్తుడా యవ్వనస్తురాలా ఏం పని చేస్తున్నారు? మీ బాయ్ ఫ్రెండ్ తో తిరగడం దేవుడికి తెలుసు! నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడం దేనికి తెలుసు! చాటున మందు కొట్టడం దేవుడు తెలుసు! ఎవరు చూడటం లేదు కదా అని నీ సెల్ఫోన్లో ఏమేమి చూస్తున్నావో కూడా దేవుడికి తెలుసు! భర్త ఇంట్లో లేడు కదా ఎవరూ లేరు కదా అమ్మానాన్న దగ్గర లేరు కదా అని నువ్వు ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నావో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అంతా దేవునికి తెలుసు!!! చివరికి నీ వ్యభిచార తలంపులు కూడా దేవునికి తెలుసు!! కాబట్టి దేవుని నుండి నువ్వు దాగ లేవు ఒక రోజు నువ్వు చేసే ప్రతి పనికి విమర్శ దినమందు లెక్క అప్పగించాలి అని మర్చిపోవద్దు అని ఏసుక్రీస్తు ప్రభువుల వారు హెచ్చరిస్తున్నారు జాగ్రత్త.!!!

ఇక 17 వ వచనం చూసుకుంటే మీరంతా మూర్ఖులు అయ్యో కుమ్మరికిని మంటికి భేదం లేదు అని అంటారా!!! చూడండి కుమ్మరి మట్టిని పిసికి కుండలు గాని పాత్రలు గాని చేస్తారు! కానీ రెంటికి బేధం లేదని అనుకుంటున్నారు, దానిని చేసినవానిని చూసి నన్ను చేయలేదు అనొచ్చునా!! రూపింపబడిన వస్తువు రూపించిన వారి గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనొచ్చునా!!! ఇది చెప్పడానికి ఎంతో సాధారణంగా కనిపించిన ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న మూడు రకాలైన పాపాలు కోసం ఇక్కడ చెప్తున్నారు! మీరు ఎంత మూర్ఖులు? కుమ్మరికి మంటికి భేదం లేదని చెబుతారా? అనగా మొదటి తప్పు ఏమిటంటే దేవుడు కూడా తమలాంటి వాడే అనుకోవడం సర్వశక్తివంతుడైన దేవుడు తనలాంటివాడే అని దేవుని శక్తిని తక్కువగా చూడటం, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వకపోవడం, దేవునికి భయపడాల్సిన విధంగా భయపడకపోవడం!! ఇది మొదటి పొరపాటు.!

ఇక రెండవ పొరపాటు దేవుడు చేసిన సృష్టిని చూసి కూడా దేవుడు లేడు అనడం! కుండ తాను చేసిన కుమ్మరిని చూసి నీవు నన్ను చేయలేదు అనడం ఎలా ఉంటుంది? అంటే దేవుడు లేడు, అదేదో బిగ్ బ్యాంగ్ జరిగితే సృష్టి ఏర్పడింది! మనిషి కోతి నుంచి పుట్టాడు! అనడం ఈ పనికిమాలిన లోకంలో దేవుడు లేడు అని అనడం ఫ్యాషన్ అయిపోయింది! కీర్తనల గ్రంథం 14:1; 53 :1 దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేసేవారు అని చెబుతుంది బైబిల్. మీరు కూడా దేవుడు లేడు అని చెప్తున్నారు, కుండ తాను చేసిన కుమ్మరిని చూసి నీవు నన్ను చేయలేదు అని చెప్తుందా, అంటే మరి కుండను కుమ్మరి చేయకపోతే ఎలాగ వచ్చేసింది? దానికి అదే కుండ గా మారిపోయిందా? లేదు కదా!! ఇది ఇశ్రాయేలు ప్రజలే కాకుండా లోకమంతా చేస్తున్న రెండో తప్పు!!!

ఇక మూడవ తప్పేమిటంటే దేవుడు చేసిన ఈ మహత్తరమైన సృష్టిని చూసి నీ పని బాగోలేదు అని చెప్పడం! దేవుడికి బుద్ధి లేదు అనడం! నిజంగా దేవుని యొక్క బుద్ధి విశాలతను జ్ఞానమును ఈ సృష్టిని చూస్తే మనకు అర్థం అవుతుంది! మనిషిని చేయడం, మనిషిలో ఉన్న రకరకాలైన వ్యవస్థలు చూసుకుంటే రక్తప్రసరణ గాని, ఈ శ్వాస జరిగే ప్రక్రియ కానీ, ఇలాంటివి చూస్తే ఆశ్చర్యమేస్తుంది! ఎంత చూసినా మానవుడు దేవుడిని నైపుణ్యతను అర్థం చేసుకోకుండా దేవునికి బుద్ధి లేదు అంటున్నారు!! గతంలో అనేకసార్లు ఈ ఉపమానం చెప్పాను, పూర్వకాలంలో ఒక మహా తెలివైన జ్ఞాని ఉన్నాడంట! అతి తెలివైన వాడు అన్న మాట! ఒకరోజు ఒక ఊరి నుంచి మరో ఊరు బయలుదేరి వెళ్తున్నాడు, పూర్వకాలంలో ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు కదా నడిచే వెళ్లేవారు లేదా గాడిదల మీద గొర్రెల మీద వెళ్లేవారు!! వీడు నడుచుకుంటూ పోతున్నాడు! మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా తగులుతుందని ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు! ఆ మరి చెట్టు పక్కనే ఒక పాక ఉంది. ఆ పాక మీద ఒక ఆనప పాదు ఉంది , దానికి ఆనపకాయలు ఉన్నాయి! వాడు పడుకొని మర్రి చెట్టు కింద పండుకొని అనుకుంటున్నాడంట, దేవుడికి బుద్ధి లేదు చూడు మర్రిచెట్టు ఎంత పెద్దదో! ఎంత పెద్ద మర్రిచెట్టుకి ఏమో చిన్ని కాయలు, అంత చిన్న ఆనపపాదుకి ఏమో అంత పెద్ద కాయలు దేవుడు పెట్టాడు! దేవుడికసలు తెలివి ఉందా? నాకే గాని ఈ సృష్టి మీద అధికారం ఉంటే మరి చెట్టుకి అనప కాయంత కాయలు, ఆనప పాదుకి మర్రి పళ్ళు అంత కాయలు పెట్టుదును అనుకున్నాడట! ఈలోగా చిన్న గాలి వేస్తే కొన్ని మర్రి పళ్లు క్రింద పడ్డాయి!అవి రెండు తల మీద మూడు పొట్ట మీద పడ్డాయట! వెంటనే వాడికి జ్ఞానోదయం కలిగింది ! అయ్యో నిజంగా దేవుడు ఎంతో తెలివైనవాడు నిజానికి ఈ మర్రిచెట్టుకే గాని ఆనపకాయ అంత పళ్ళు ఉండి ,అది నా తల మీద పడితే నా తల బద్దలు అయ్యేది, నా పొట్ట మీద పడితే నా పొట్ట పేలిపోను! నిజంగా దేవుడు అనంత జ్నాని! నేనే దేవుని జ్ఞానాన్ని తక్కువగా తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకున్నాడట!!!

కాబట్టి దేవుని జ్ఞానముకి మితి లేదు, అనంత జ్నాని ఆయన! నీవు కూడా సహోదరుడా ఒకవేళ దేవుడు లేడు అనడం గానీ, లేకపోతే దేవుడికి బుద్ధి లేదు అనడం గానీ, దేవుడు కూడా మాలాంటి వాడే, ఆయన శక్తిమంతుడు కాదు అని గాని అనుకున్నావా! జాగ్రత్త నీవే బుద్ధిహీనుడవు!!! ఆయనే అనంతజ్నాని!! అని తప్పు తెలుసుకొని ఆయనకు దాసోహం కమ్ము!

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*217వ భాగము*

యెషయా 30:1--7

1. యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

2. వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు.

3. ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.

4. యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

5. వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.

6. దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

7. ఐగుప్తువలని సహాయము పనికిమాలినది,నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 29వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 30వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! అయితే ఈ అధ్యాయం నుండి చాలా అధ్యాయాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన వచనాలు మాత్రమే ధ్యానం చేసుకుంటూ ముందుకు పోదాం.

ప్రియులారా మొదటి అధ్యాయంలో చూసుకుంటే యెహోవా వాక్కు ఇదే! లోబడనొళ్లని పిల్లలకు శ్రమ! ఎందుకంటే వారు నాతో ఆలోచించకుండా నన్ను అడగకుండా నా ఆత్మ నియమించని సంధులు చేసుకుంటున్నారు! అందుకే వారికి శ్రమ అంటున్నారు! దీనికోసం లోతుగా ధ్యానం చేసుకునే ముందు అసలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పని సంధి ఎక్కడ చేసుకున్నారు అని ఆలోచిస్తే మనం యెషయా ప్రవచన గ్రంథంలో నలుగురు రాజులు కాలంలో జరిగిన సంభవాలు ధ్యానం చేసుకునేటప్పుడు దేవుడు ఆహాజు రాజుతో నేను నీకు తోడుగా ఉన్నాను అస్సూరు రాజుకు భయపడొద్దు నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను అని చెబితే, ప్రవక్త దగ్గర తలూపేసాడు గాని ఆ రాజు సంధి కోసం ఈజిప్టు దేశానికి కబురు పంపడం, వారి సహాయాన్ని ఆర్థించడం జరుగుతుంది. అందుకే దేవుడు ఆహాజు రాజు చేతిని వదిలేశాడు! ఇదే నా ఆత్మ నియమింపని సంధి చేసుకోవడం! అంటే దేవుడు చెప్పిన మాట ఈ రాజు వినలేదు!

అందుకే 2 వచనము నుండి చూసుకుంటే వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును బలపరచుకొని ఐగుప్తునీడను శరణుజొచ్చారు కాబట్టి దానివల్ల మీకు అవమానమే తప్ప మంచి జరగదు అని దేవుడు చెబుతున్నారు!

ఇక ఆరో వచనం దక్షిణ దేశములోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి! సింహములు పాములు తాపకర మిక్కిలి శ్రమ బాధ గల దేశం గుండా వారు తమ ఆస్తిని ఒంటెల మీద ఎక్కించుకొని వెళ్తున్నారు అని ఉంది! అయితే ప్రాచీన ప్రతులలో అయితే దక్షిణ దేశము అని రాయబడకుండా నెగెవ్ ప్రదేశానికి వెళ్తున్న వారికి... నెగవు అనగా ఇది ఈజిప్ట్ దేశంలో ఒక భాగం అన్నమాట నెగువ్ అనేది కనాను యొక్క దక్షిణ భాగంలో ఇది! నిజానికి ఒక ఎడారి ప్రాంతము ఇది ప్రస్తుతం ఈజిప్ట్ లో ఉంది! ఇక్కడికి వారు బయలుదేరి వెళ్తున్నారు!

ఏడవ వచనంలో ఐగుప్తు వలన సహాయము పనికిమాలింది, నిష్ప్రయోజనమైనది అందుచేత ఏమి చేయలేని ఊరకుండు గప్పాల మారి అని ఐగుప్తుకి పేరు పెడుతున్నాను అంటున్నారు!! మొత్తానికి దీని అర్థం ఏంటంటే మీరు నన్ను వదిలేసి ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు గాని అది మీకు దానివల్ల మీకు ఉపయోగం లేదు! మీకు నాశనమే అంటున్నారు! ఇది నిజంగా ఎప్పుడు జరిగిందంటే ఆహాజు గారి కాలంలో కొద్దిగా జరిగింది, అష్షూరురాజులు ముట్టడి దిబ్బ వేసినప్పుడు, ఇక ఫైనల్ గా యిర్మియా గారి కాలంలో జరిగింది! యిర్మియా గారి కాలంలో యెరుషలేము పట్టబడడం కాల్చపడడం, యూదా ప్రజల్లో నూటికి 95 శాతాన్ని చంపేశారు! మిగిలిన వారిని చెరలోకి తీసుకెళ్లిపోయారు కూడా! యిర్మియా గారు చెప్పినా వినకుండా బలవంతంగా లాక్కొని పోయి ఐగుప్తు దేశం పారిపోయారు! అప్పుడు దేవుడు చెప్పారు ఐగుప్తు దేశం వెళ్లిన ఎవరూ తిరిగి మరల వెళ్ళడు! చివరికి యిర్మియా గారు కూడా అక్కడే చనిపోయారు!

ఇది దేవుడు చెప్పిన మాట సరే !!!

ఇప్పుడు లోబడి నల్లని పిల్లలకు శ్రమ అని మొదటి వచనంలో అంటున్నారు కదా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా ఐగుప్తు దేశ సహాయము అర్జించడమే కాకుండా ఐగుప్తు దేశం పరిగెత్తారు! ఇలాంటి వారికి శ్రమ! మనము ఆదికాండం నుండి మలాకీవరకు చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను అనేకసార్లు మీరి పాపమును చేశారు!! అందుకే దేవుడు మాటిమాటికి మీరు లోబడినొల్లని ప్రజలు అంటున్నారు!! ఇంకా ఎక్కడెక్కడ రాయబడింది అంటే

నిర్గమకాండము 32:9

మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

నిర్గమకాండము 33:3

మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడ రాను; త్రోవలో మిమ్మును సంహరించెద నేమో అని మోషేతో చెప్పెను.

నిర్గమకాండము 33:5

కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.

నిర్గమకాండము 34:9

ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించు మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుమనెను.

ద్వితియోపదేశకాండము 9:13

మరియు యెహోవానేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

యెషయా 65:2

తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.

యిర్మియా 7:28

గనుక నీవు వారితో ఈలాగు చెప్పుమువీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.

లేవీయకాండము 26:41

​​నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

సామెతలు 10:17

ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.

సామెతలు 29:1

ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

2థెస్సలొనికయులకు 1:7

దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

2థెస్సలొనికయులకు 1:8

మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

కాబట్టి లోబడనని ప్రజలకు శ్రమ!!

బైబిల్లో యాకోబు గారి ఏకైక కుమార్తె దీనా, తండ్రి వెళ్లవద్దు అని చెప్పినా, షెకెము పట్టణాన్ని చూడ్డానికి వెళ్లి ఆ రాజకుమారుని చేత బలాత్కరించబడి శీలాన్ని కోల్పోయింది!!

సంసోను తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పిలిస్తీయుల పిల్లను పెళ్లి చేసుకున్నాడు! శ్రమలు అనుభవించాడు! బైబిల్ మాట వినకుండా వేశ్యల దగ్గరికి వెళ్ళాడు! కళ్ళు పీకించుకున్నాడు! భయంకరమైన నాశనం తెచ్చుకున్నాడు!!

ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలు కి లోబడక అనేక సార్లు చెరలో నికి పోయారు అనేక ఇబ్బందులు తెచ్చుకున్నారు!

సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని మాట వినకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుందని మర్చిపోవద్దు!!!

కాబట్టి దేవుని మాట విందాము! ఆయన చెప్పింది చేద్దాం!

ఆయన మాట కోసం కనిపెడదాము!!

దైవాశీస్సులు!!!

ఆమెన్!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*218వ భాగము*

యెషయా 30:8--14

8. రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము

9. వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

10. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి

11. అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

12. అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కార మును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

13. ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

14. కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 30వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము.

ఇక ఈ అధ్యాయంలో మరో ముఖ్యమైన వచనాలు ఏంటంటే ఎనిమిదో వచనంలో రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థంగా ఉన్నట్లు నీవు వెళ్లి వారి ఎదుట పలక మీద దీనికి రాసి తర్వాత గ్రంధంలో లిఖించు అంటున్నారు!! ఇంకా వారు తిరుగబడే జనులు అబద్దమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొళ్ళని పిల్లలు!! చూడండి వీరి రకాలు: మొదటగా వీరు వీరు తిరగబడే పిల్లలు, అబద్ధం ఆడే పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు అనగా దాని ప్రకారం చేసే వారు కాదు అని అర్థం! దేవుని విషయంలో అబద్ధాలు ఆడటం, ధర్మశాస్త్రం వినకపోవడం ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు!

ఒకటో అధ్యాయం జాగ్రత్తగా చూసుకుంటే ఒకటో అధ్యాయంలోనే వీరి కోసం దేవుడు బాధపడుతున్నట్టు మనం చూసుకున్నాం! 1:2 ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారుగా చేశాను అయితే ఇప్పుడు నా మీద తిరుగుతున్నారు! అదే అదే ఇక్కడ కూడా చెప్తున్నారు.

కీర్తన 78 :8 లో వీరు తమ పూర్వీకులు వంటి వారే ఆ తరం వారు మొండికెత్తి దేవుని మీద తిరుగుబాటు చేశారు తమ హృదయాలను సరి చేసుకోలేదు వారి అంతరంగం దేవుని విషయంలో నమ్మకమైనది కాదు అని చెప్తున్నారు! ఎడారిలో వాళ్ళు ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారు ఆ పాడు ప్రదేశంలో ఆయనను ఎన్నో సార్లు దుఃఖపెట్టారు! ఎవరూ? ఇశ్రాయేలు ప్రజలు!

కీర్తనలు 78:6

యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు

కీర్తనలు 78:7

మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును

కీర్తనలు 78:8

ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను

యిర్మియా 5: 23లో ఈ ప్రజలు ఈ ప్రజలకి తిరుగుబాటు చేసే హృదయం ఉంది, వారు పక్కకి తిరిగి వెళ్ళిపోయారు అంటే దేవుని మార్గం నుండి పక్కకు తిరిగి వెళ్లిపోయారు!

యిర్మియా 5:23

ఈ జనులు తిరుగు బాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.

ఇక దేవుని ఉపదేశానికి ధర్మశాస్త్రాన్నే విననొల్లని అనగా పెడచెవిని పెట్టే పిల్లలు అంటున్నారు!!

ఇది మాటిమాటికి ఇశ్రాయేలు జీవితంలో జరుగుతోంది! వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన మొదలుకొని వారు చెరలోకి వెళ్లిపోయి, మరలా చెరలోనుండి వచ్చిన తర్వాత కూడా ఇది మాటిమాటికి ఇశ్రాయేలు ప్రజలలో జరిగే ఒక ప్రక్రియ!! మోడస్ ఆపరాండి!!! దేవుడు అదే చెప్తారు ఇక్కడ! మాటిమాటికి తప్పిపోతున్నారని!!!

వారేనా మనం తప్పిపోవడం లేదా? ఎన్నిసార్లు దేవుని మాటను పెడచెవిని పెట్టి, ఎన్నిసార్లు దేవుని మీద, దేవుడి విషయంలో అబద్ధం ఆడారు!!!

ఒకవేళ ప్రియ సహోదరుడా, సహోదరి!! నీవు కూడా అదే స్థితిలో ఉంటే ఇప్పుడే ఆ తప్పులు మానేసి దేవుని యొద్దకు క్షమాపణ వేడుకో!!!

సరే ఇక ముందుకు పోతే అంటే 9వ వచనంలో తిరగబడే జనులు అబద్ధం ఆడే పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు అంటూ పదవ వచనం చూసుకుంటే దర్శనం చూడొద్దని దర్శనం చూచు వారితో చెప్పువారు, ఇంకా యుక్త వాక్యములతో మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలకండి మాయా దర్శనాలు కనండి ! అడ్డము రాకుండుడి! తమ త్రోవ నుండి తొలగుడి! పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో అనగా దీర్గదర్శులతోనూ ప్రవక్తలతోనూ పలుకు వారై ఉన్నారు!!

దర్శనం చూడొద్దని దర్శనం చూసేవారితో, మాతో దేవుని యొక్క యుక్త వాక్యాలను యుక్త మార్గమును మాతో ప్రవచించొద్దు అని ప్రవక్తల తో, మృదువైన మాటలే మాకు అనుకూలమైన మాటలే మాతో పలకండని, మాయా దర్శనాలు కనండి, మేము చేసే పాడు పనులకు అడ్డము రావద్దని, మా దారి నుండి తొలగిపొండని, ఇంకా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సంగతి మా దగ్గర ఎత్తొద్దు అని ప్రవక్తల తోనూ దీర్ఘదర్శులతోనూ చెప్తున్నారట!!! ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా!!!

వీరు సాధారణంగా అందరూ మనుషుల్లాగే వీరు కూడా నిజమైన సత్యాన్ని వినడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే నిజం వీరిని కలవరపరుస్తుంది, గర్జిస్తుంది!! కాబట్టే పరిశుద్ధ దేవుడు గురించి నిజమైన మార్గం బోధిస్తే వారికి ఎంతో విచారం పుట్టిస్తుంది ఇంకా దేవుడంటే భయం పుట్టిస్తుంది అందుకే దేవుడు సంగతులు వాళ్ళ దగ్గర చెప్పొద్దు మేము మా పాత స్వభావాల్లోనే మేము కొనసాగుతాము!! అంటూ దేవుని బిడ్డలకు ప్రవక్తలకు సమాధానం చెబుతున్నారు!!!

అప్పుడేనా మొదటి రాజుల గ్రంథం 22: 8లో ఆహాబు రాజు అంటున్నాడు మరో రాజుతో! ఇంకో ప్రవక్త ఉన్నాడు అతడి ద్వారా విచారణ దొరుగుతుంది కానీ అతను అంటే నాకు ఎంతో ద్వేషం ఉంది ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎప్పుడు ప్రవచిస్తూ ఉంటాడు అందుకే అతను అంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు ప్రవక్త అయిన మీకాయా గారి కోసం!!!!

ఇక యిర్మియాలో 5: 30 నుంచి 31 ఈ దేశంలో జరిగినది ఘోరం, భయంకరం, ప్రవక్తలు అబద్ధాలు పలుకుతున్నారు, యాజకులు సొంత అధికారులమీద పెత్తనం చెలా ఇస్తున్నారు, ఇలా జరగడం నా ప్రజలకు చాలా ఇష్టం అయితే అంతం వచ్చినప్పుడు మీరేం చేయగలరు అంటున్నారు!!!

Jeremiah(యిర్మీయా) 5:30,31

30. ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగు చున్నది.

31. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజ కులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?

ఇంకా 11: 21 లో యిర్మియా గారి తో తన సొంత ఊరువారు అంటున్నారు నీవు యెహోవా మాటలు మా దగ్గర ప్రవచించవద్దు పలికితే మా చేత నువ్వు చస్తావు అన్నారు

యిర్మియా 11:21

కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు!!!

ఆమోసు 2:12 లో వీరు నాజీరులకు ద్రాక్షారసం త్రాగించారు ప్రవక్తలను మీరు ప్రవచించవద్దు అని ఆజ్ఞాపించారు అంట

ఆమోసు 2:11

మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను (వ్రతము పట్టినవారుగాను) నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 2:12

అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.

ఈ ప్రజలు ఇంకా ఆమోస్ 7: 13 ఆమోసు గారితో అంటున్నారు ప్రవక్తా! ఇది బేతేలు, ఈ బేతేల్లోని నువ్వు ప్రవచించవద్దు ఎందుకంటే ఇక్కడ రాజు యొక్క గుడి ఉంది రాజు యొక్క భవనం కూడా ఉంది నువ్వు యెరుషలేములోనే నీవు ప్రవచించు అక్కడ మీ దేవుడు గుడి ఉంది అని దేవుణ్ణి తోసేశారు!!!

ఆమోసు 7:12

మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;

ఆమోసు 7:13

బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమైయున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు.

ఆమోసు 7:14

అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.

ఆమోసు 7:15

నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.

ఇలాగా మీరు దేవుడి మాటలను త్రోసివేశారు.

ఇలాంటి వారిని దేవుడు శిక్షిస్తారు రెండవ రాకడలో అని మనం చూసుకోవచ్చు!!! అప్పుడేనా ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు లేరా?!! అలాంటి వారి కోసం దేవుడు అలాంటి వారు మన ప్రభువైన క్రీస్తుకు సేవ చేయడం లేదు గానే తమ కడుపుకే దాసులు వారు ఇచ్చకపు మాటలు ఉపయోగిస్తూ మధువైన మాటలతో అమాయకులను మోసగిస్తున్నారు!! ఇంకా ఫిలిప్పీ పత్రికలో అంటున్నారు వారు కడుపే వారి దేవుడు!!! ఫిలిప్పీయులకు 3:19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

చూడండి ఆ కాలంలో కూడా వారికి అనుకూల వచనాలు చెప్పాలంట, దేవుని నుంచి ఏదైనా మీ మీదకి శాపం వస్తుంది నాశనం వస్తుంది అని చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఈరోజు కూడా సంఘాలలో గద్దింపు మాటలు చెప్తున్నా, పాపాన్ని ఖండించి గట్టిగా వాక్యం చెప్పినా, నువ్వు తప్పు చేస్తున్నావురా, వ్యభిచారం చేస్తున్నావురా అని చెప్తే అలాంటి ప్రసంగాలు మాతో చెప్పొద్దు అని దైవ సేవకుల్ని ఆపేసే సంఘాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి!! అనుకూల వచనాలే చెప్పాలి!! ఎప్పుడు ఆశీర్వాదం లేదా నవ్వించాలి పిట్టకధలు చెప్పాలి, సైన్స్ చెప్పాలి, అలా చెప్తేనే వీరికి ఇష్టపడుతున్నారు!! ఇలాంటి వారికి అనగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వారిని ఇష్టపడటం లేదు అనుకూల బోధల్ని ఇష్టపడుతున్నారు! అందుకే రెండు తిమోతి పత్రికలో

2 Timothy(రెండవ తిమోతికి) 3:1,2,3,4,5,13,16,17

1.అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

2.ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు

3.అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు

4.ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,

5.పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

13.అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.

16.దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,

17.ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.

2 Timothy(రెండవ తిమోతికి) 4:1,2,3,4,5

1.దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

2.వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.

3.ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,

4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

5.అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.

ఇది పౌలు గారు ముందుగానే చెప్పారు ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే!! కాబట్టి ఇలాంటి వారికి దూరముగా ఉండమంటున్నారు పౌలు గారు!!

ఒకవేళ ఏ సంఘంలో నైనా ప్రియ సహోదరి సహోదరుడా!! ఇలాంటి విషయాలు మీకు కనబడితే ఆ సంఘము నుండి దూరమైపోండి, మార్చడానికి ప్రయత్నం చేయండి వినకపోతే అలాంటి సంఘము నుండి దూరమై వెళ్లిపోవాలని మనవి చేస్తున్నాను!!!

ఎక్కడైతే ఖండింపు, గద్దింపు, బుద్ధి చెప్పే వాక్యము, పాపముల కోసం సరిదిద్దే వాక్యము, రాకడ కు సిద్ధపరిచే వాక్యము ఉంటుందో అక్కడే ఉండండి!!

12వ వచనం చూసుకుంటే అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని వాటిని ఆధారం చేసుకున్నారు కాబట్టి ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవుచున్న గోడవలే అయిపోతుంది! ఒక్క క్షణములో ఆ గోడ పడిపోతుంది, కుమ్మరి కుండ పగలగొట్టినట్లు ఏమి విడిచి పెట్టకుండా ఆగోడను కుండను పగలగొట్టును. ఆ పెంకులు కూడా దేనికి పనికిరావు అంటున్నారు! అనగా మీ ఆశ్రయమును మీరు నమ్ముకున్న ఆశ్రయాన్ని నేను పాడు చేస్తాను తీసివేస్తాను అంటున్నారు!! ఎందుకంటే మీరు మీ అవివేకమైన పాపిష్టి ప్రవర్తన వలన నాకు దుఃఖం కలిగిస్తున్నారు కాబట్టి!

కాబట్టి ఒకవేళ ప్రియ సహోదరుడా నీవు కూడా ఇలాంటి స్థితిలో ఉంటే నీ ఆశ్రయము నువ్వు నమ్ముకున్న నీ ధనము నీవు నమ్ముకున్న నీ స్నేహితులు నీ బంధువులు మీకు దూరమైపోయేలాగా మీ ఆస్తి నీకు దూరమైపోయేలాగా దేవుడు చేస్తారో కాబట్టి పాపమును వదిలి దేవుని దగ్గరికి రా !!!

అందుకే 15వ వచనములో అంటున్నారు ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు! మీరు ఊరుకొని నన్ను నమ్ముకోవడం వల్ల మీకు బలం కలుగుతుంది! యిర్మియా గ్రంధంలో దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా దగ్గరకే రావాలి! సహోదరుడా నీ ఆశ్రయముగా నీ దుర్గముగా దేవునినే చేసుకోవాలి! అప్పుడే దేవుని నిన్ను కనికరించి నిన్ను సరి చేసే దేవుడు! నిన్ను ఆదరించే దేవుడు! నిన్ను పరమునకు చేర్చే దేవుడు! మరి తిరిగి దేవుని దగ్గరకు వస్తావా!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*219వ భాగము*

యెషయా 30:15--23

15. ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.

16. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

17. మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.

18. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

19. సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

20. ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

21. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

22. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 30వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

ఇక మరిన్ని ముఖ్యమైన వచనాలు చూసుకుంటే 15 వచనంలో మీరు మరలి నా దగ్గరికి రండి వచ్చి ఊరుకుంటే మీరు రక్షించబడతారు ఊరుకుని నమ్ముకోవడం వల్ల మీకు బలం కలుగుతుంది అని చెప్పారు. అయితే మీరు సమ్మతించక అట్లు కాదు మేము గుర్రాలకి పారిపోతాం అన్నారు కాబట్టి మీరు పారిపోవాల్సి వచ్చెను అనగా నేనే మిమ్మల్ని పారిపోయేలా చేస్తున్నాను, మేము వడిగల గుర్రంలో ఎక్కిపోతామన్నారు కదా! ఇప్పుడు మిమ్మల్ని తరిమేవారు మీకంటే వడిగా వేగముగా పరిగెత్తే వారు అంటున్నారు! చూడండి కీర్తనాకారుడు దీనికోసమే ఒక మంచి భాగాన్ని రాశారు

33 :16 నుంచి 19 లో రాజు తన సైన్యం వలన రక్షణ తీసుకుని రాలేడు ఏవీరుడు తనకున్న బలం వల్ల విడుదల పొందడు, రక్షించడానికి విజయానికి గుర్రం అక్కరకి రాదు అయితే దేవుని ఎట్ల భయభక్తులు వల్లనే యెహోవా వారిని కాపాడుతూ ఉంటాడు వారి ప్రాణాన్ని మరణం నుంచి తప్పిస్తూ ఉంటారు అని అక్కడ వ్రాయబడి ఉంది!

Psalms(కీర్తనల గ్రంథము) 33:16,17,18,19

16.ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.

17.రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు.

18.వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును

19.యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలుచుచున్నది.

కాబట్టి నీకు ఎంత వేగం ఉన్నా నీ వేగము నీ బలము నీ శక్తి ని రక్షించలేదు రక్షించగలవాడు దేవుడు మాత్రమే!!!

ఇంకా 17 వచనంలో మీరు పర్వతం మీద ఉండి పోయేలాగా కొండ మీద ఉండే జెండా లాగా అయిపోతారు ఒకడు మిమ్మల్ని గద్ధిస్తే 1000 మంది పారిపోతారు, ఐదుగురు గద్ధిస్తే మొత్తం మీ దేశమే ఖాళీ అయిపోతుంది అంటున్నారు! ఇది లేవీ కాండము 26వ అధ్యాయానికి మరియు ద్వితీయ ఉపదేశ కాండం 28 అధ్యాయానికి వ్యతిరేకంగా ఉంటుంది! ఎందుకంటే ఈ రెండు భాగాల్లోని మీరు నా మాట వింటే మీ మీదకి ఎవరైనా ఒక రోడ్లో వస్తే 7 మార్గాలలో వారు పారిపోతారు అని రాయబడితే, దానికి వ్యతిరేకంగా ఉంది మీరే పారిపోతారు ఐదు మంది గద్ధిస్తే మీ దేశమే ఖాళీ అయిపోతుంది ఆ విధంగా మిమ్మల్ని నేను వెల్లగొడతాను అంటున్నారు!

అయితే 18 నుండి చివరి వరకు ఇశ్రాయేలు ప్రజల కోసమే చెర విముక్తి కోసమే వ్రాయబడినట్లు అర్ధమవుతుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 18 నుంచి చివరి వరకు సగభాగం యెహోవా దినమున జరగబోయే సంభవాలు అని, మరి సగభాగం యెహోవా దినము జరిగిన తర్వాత వెయ్యండ్ల పరిపాలనలో జరగబోయే సంభవంగా కనిపిస్తుంది!

సరే 18 వ వచనంలో కావున మీ యందు దయ చూపించాలనే యెహోవా ఆలస్యం చేయుచున్నాడు మిమ్మును కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు అయితే యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో వారు ధన్యులు అంటున్నారు! గత భాగాలలో చూసుకున్నాము లోబడనొళ్ళని ప్రజల కోసం దినమంతా నా చేతులు చాస్తున్నాను అని దేవుడు అన్నారు కదా! ఇక్కడ అలాగే మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నారు! ఏ ఆలస్యం చేయుచున్నాడు? మీ మీదకు రాబోయే ఆ నాశనాన్ని ఆలస్యం చేస్తున్నాడు! ఎందుకంటే ఎవరైనా మారు మనస్సు పొందుతారని! అందుకే పేతురు గారు అంటున్నారు అంతట అందరూ మారుమనస్సు పొందాలని యెహోవా దేవుడు మీకోసం ఆలస్యం చేస్తున్నారు! ఆయన రాకడ ఇంకా రాలేదు అంటున్నారు! కానీ దేవుని దృష్టిలో 1000 దినాలు ఒక రోజు, ఒక రోజు వెయ్యి దినాలని చెబుతూ ఆయన ఇంతవరకు ఎందుకు రావట్లేదు అంటే అంతటా అందరూ మారుమనస్సు పొందాలి అని ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నారు! ఇక్కడ యెహోవా ఆలస్యం చేయడం ఎందుకంటే ఇశ్రాయేలీయులు మరలా దేవుని దగ్గరకు వస్తారు కదా అని వారు మారుమనస్సు పొందుతారు కదా అని దేవుడు ఆలస్యము దీనిని తీర్పుని ఆలస్యము చేస్తున్నారు. వారికి రాబోయే శిక్షను నాశనాన్ని ఆలస్యం చేస్తున్నారు!!!

2 Peter(రెండవ పేతురు) 3:3,4,5,6,7,8,9,10,11,12

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు,

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

5. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

6. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. *కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు*.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు కూడా ఇంకా దేవుని నుంచి దూరంగా ఉంటే, దేవునికి దూరంగా తిరిగి శరీర కార్యాలు చేస్తున్నా, మందిరానికి రాకపోయినా నాకు ఏకీడు రావడం లేదు అంతా బాగానే ఉంది, దేవుని శాపం రాలేదు అని నీవు ఇంకా అనుకుంటున్నావేమో, జాగ్రత్త!! ఆయన దీర్ఘశాంతాన్ని చేతకానితనంగా ఆలోచిస్తున్నావేమో జాగ్రత్త!!! నీవు ఈ నీ దినమందైనా రక్షించబడతావని ఏసుక్రీస్తు ప్రభువుల వారు యెరుషలేము కోసం ఆశించినట్లు నీకోసం నాకోసం ఆశిస్తున్నారు.

లూకా 19:41

ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

లూకా 19:42

నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

లూకా 19:43

(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి,నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి

లూకా 19:44

నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.

ఈ రోజైనా నీ మార్పునొందని జీవితాన్ని మార్చుకో! ఈ రోజైనా ఆయన దగ్గరకు వచ్చి మార్పునొందని నీ జీవితాన్ని మారుమనస్సు పొందుకొని దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నీ యందు జాలి చూపే దేవుడు! మరి దేవుని దగ్గరికి వస్తావా!!!

ఇంకా మనం ముందుకు పోతే, సీయోనులో యెరుషలేము లోనే ఒక జనం కాపురం ఉంటది ఓ జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును నీ మాట వినగానే నీకుత్తరమిచ్చును అంటున్నారు! ఇది తప్పకుండా వెయ్యేళ్ల పరిపాలనలో జరిగే సంభవము! మీరు ఇంకా ఏమాత్రం కన్నీరు విడవరు మీ ప్రతి భాష్పబిందువు ఆయనే తుడుస్తారు! మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి అని దేవుడు చెబుతున్నారు! ఎందుకంటే మీరు ఏడ్చే కారణాలే అన్నిటినీ దేవుడు తొలగించబోతున్నారు! ఇదే యెషయా 25 :8 లో కూడా చెప్పారు చూద్దామా

యెషయా 25:8

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.

ఇంకా 60:20 లో కూడా ఇదే మాట చెబుతున్నారు అక్కడ నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి అంటున్నారు

యెషయా 60:20

నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

యెషయా 60:21

నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

యెషయా 60:22

వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

ఇక 61:3లో బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని కృంగిపోయిన మీ మనసుకు పదులుగా స్తుతి వస్త్రాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు అని దేవుడు చెప్తున్నారు

ఇక మీ ప్రార్థన వినగానే ఆయన మీకు జవాబు ఇస్తారు! కీర్తన 50 :15, 86:7లో, యెషయా 65:4, యిర్మియా 29:12--14, జెకర్యా 13:9లో కూడా ఇదే చెప్తున్నారు!!!

దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తారు. మీ కన్నీరు తుడుస్తారు అని వాగ్దానం చేస్తున్నారు!!

ప్రియ సహోదరి సహోదరుడా! దేవుడు నీ ప్రార్ధన కూడా విని నీ కన్నీరు తప్పకుండా తడవబోతున్నారు! కేవలం ఆయనపై నిరీక్షణ ఉంచుము! ఆయన మీద ఆనుకో! దేవుడు నిన్ను దీవించును గాక!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*220వ భాగము*

యెషయా 30:15--23

20. ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

21. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

22. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.

24. భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

25. గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

28. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

29. రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.

30. యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.

31. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

32. యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును.

33. పూర్వమునుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 30వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ఇక మరిన్ని ముఖ్యమైన వచనాలు చూసుకుంటే

ఇక 20వ వచనం: ప్రభువు నీకు క్లేషాన్న పానములు ఇచ్చును ఇకమీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు! క్లేషాన్న పానములు అనగా కష్టముతో కూడిన అన్నము పానము అది కూడా కొద్దికొద్దిగా అని!! దేవుడు నీకు కష్టంతో కూడిన ఆహారాన్ని ఇంతవరకు ఇస్తున్నారు అయితే ఒక రోజు వస్తుంది ఆ రోజులలో సమృద్ధిగా భోంచేస్తావు! ఇక నీ సేవకులు అనగా ఈ దైవ సేవకులు మాటలను వింటావు వారిని చూస్తావు. ఆ మాటలు వింటావు దానికి లోబడతావు అప్పుడు మీ విగ్రహాలను మీరు తీసి పారేస్తారు అని దేవుడు చెప్తున్నాడు!!!

21 నుంచి ఇదే చెప్తున్నారు. ఇది కాకుండా మీరు కుడితట్టైనా ఎడమ తట్టైనా తిరిగితే ఇదే త్రోవ, దీనిలో నడవండి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినిపిస్తుంది! ఈ వెయ్యేండ్ల పరిపాలనలో నువ్వు దారి చెప్పి తిరుగుదామన్నా ప్రభువు నుండి ఒక స్వరము వినిపిస్తుంది నీకు. త్రోవ ఇదేరా, దారి తప్పకు ఈ మార్గంలోనే నడిచిపో అని దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతూ నిన్ను సరి అయిన దారిలో నడిపిస్తూ ఉంటారు!

చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలు మీరు అపవిత్రపరిచి వాటిని పారవేస్తారు! లేచిపో అని విగ్రహాలతో చెప్తారు అయితే అవిలేచి నిలబడవు అనగా మీ విగ్రహాలను మీరు పాడు చేసి బయట పారేస్తారు! ఇంక వాటిని మొక్కరు అని దేవుడు చెబుతున్నారు!!

23, 24 వచనం చూస్తుంటే నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి భీళ్ళలో మేస్తాయి భూమి సేద్యము చేయు ఎడ్లు లేత గాడిదలు చేటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినును. దీనికోసం ఆలోచిస్తే మీ భూమిలో మీ గింజలకు మీ పంటలకు సరిపోయే వాన కురిపిస్తారు. పంటలు సమృద్ధిగా పండుతాయి ఆ రోజుల్లో అనగా వెయ్యేల పరిపాలనలో మీ పశువులు విశాలమైన పశ్చిక మైదానలో ఉంటాయి! పాడి పంటలకు కొదువుగా ఉండదు అని చెప్తున్నారు! చేటతో చెరిగి పరిచి ఉప్పుతో కలిసిన నీ ఎద్దులు గాడిదలు తింటాయి అనగా పశువులకు కూడా తిండికి లోటు ఉండదు!

25 వ వచనములో గోపురాలు పడే మహా హత్య దినాన, ఉన్నతమైన ప్రతి పర్వతం మీద ఎత్తైన ప్రతి కొండమీద వాగులు, నదులు పారుతాయి! దీనికోసం సింపుల్గా అర్థం చేసుకుంటే అటువంటి గోపురం ఆ మహా హత్య దినం అనగా యెహోవా దినాన్న ఉన్నతమైన ప్రతి పర్వతము ఎత్తైన ప్రతి కొండమీద వాగులు నదులు పారతాయి అంటే ప్రతి పర్వతం మీద ప్రతి కొండమీద రక్తం ఏరులై పారుతుంది ఎందుకంటే దేవుని వదిలి విగ్రహాలను పూజించారు కాబట్టి!!

26 వచనంలో యెహోవా తన జనుల గాయం కట్టి, వారి దెబ్బను బాగు చేయు దినాన్ని చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలే ఉంటుంది సూర్యుడు ప్రకాశం ఏడు దినములు వెలుగు ఒక దినము ప్రకాశించినట్టు ఉండును!

దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే యెహోవా ప్రజలకు గాయం కట్టి ఆ గాయాన్ని దెబ్బను బాగు చేస్తారు దీనికోసం బైబిల్లో అనేక దగ్గరలా వ్రాయబడి ఉంది!

ద్వితీ 32 :39 లో దేవుడు అంటున్నారు గాయం చేసే వాడిని నేనే కట్టేవాన్ని నేనే బ్రతికించే వానిని నేనే, నా చేతిలో నుంచి విడిపించే దేవుడు లేడు అంటున్నారు

ద్వితియోపదేశకాండము 32:39

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

కీర్తన గ్రంథం 107:20లో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను అని ఉంది.

147: 3లో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి దేవుడు వారి గాయాల్ని కట్టే దేవుడు అని చెబుతూ,

ఇక యిర్మియాలో నేను దానికి ఆరోగ్యం చేకూర్చి దాన్ని బాగు చేస్తాను నా ప్రజలను బాగు చేసి వారికి శాంతిని విశ్వసనీయతను సమృద్ధిగా చూపిస్తాను. అని దేవుడు చెబుతున్నారు!!!

యిర్మియా 33:6

నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను.

యిర్మియా 33:7

చెరలో నుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించు చున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించు చున్నాను.

ఇక చంద్రబింబము సూర్యుని గోళం లాగా అయిపోతుంది, సూర్యుడు ఏడు రోజులు ప్రకాశం ఒకే రోజున ప్రకాశిస్తుంది!!!

ఇది తప్పకుండా దేవుడు చేసే శిక్షను చూపిస్తుంది. ఇది తప్పకుండా యెహోవా దినమున, ఆ రోజున జరిగే సంభవము తప్పకుండా జరగబోతుంది. ఆరోజు ఆకాశములో వింతలు జరుగుతాయి మామూలు కంటే ఏడింతలు కాంతివంతమైన సూర్య గోళం అనగా మనుషులు ఆ వేడికి కాలిపోయేటంతగా అవుతుంది. ఈ విషయం మనకి ప్రకటన గ్రంథం 16 :8, 9 వచనాల్లో కనిపిస్తుంది. ఇది నాలుగవదూత బూర ఊదే సంభవము.

Revelation(ప్రకటన గ్రంథము) 16:8,9

8. నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.

9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.

మరి సూర్యుడు వెలిగి పోతాడంటే మరి యూదుల్లో మిగిలిన వారిని ఏం చేస్తాడు? దేవుడు వారిని కాపాడుతాడు అని అని అర్థము!!

ఇక 27 వచనంలో ఇదిగో కోపంతో మండుచు దట్టముగా లేచే పొగమంచు తో కూడింది యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది, ఆయన పెదవులు, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది! ఆయన ఊపిరి కుతికలు లోతు వచ్చు ప్రవాహము నదిలా ఉండి, అడ్డంగా ఉన్న వాటిని చెదరగొట్టే జల్లెడతో అది జనమును గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనులు దవడలో ఉండును.

దీనికోసం ఆలోచిస్తే ఇది కూడా యెహోవా దినమున జరిగే సంభవము!

తీవ్రమైన కోపాకినితో దట్టమైన పొగతో యెహోవా పేరు, నామము దూరం నుంచి వస్తుంది! దీనికోసం ఆలోచిస్తే ఇది భూలోకంలో ఉన్న అన్ని దేశాలకు జాతులకు రాబోతున్న మహా శ్రమకాలము అని అర్థం వుతుంది. ఇది దేవుని కోపము తీవ్రంగా ప్రపంచం ఆయన ఒలికించే రోజులు ఇక యెహోవా నామము దూరం నుంచి వస్తుంది అనగా దేవుని సాక్షాత్కారం జరిగినప్పుడు దేవుని లక్షణాలు అతి స్పష్టముగా అందరికీ వెల్లడై, ఇది మంటలు లాంటి ఆయన పరిశుద్ధత పాపం పట్ల దేవుడు అగ్నిజ్వాల రేగిపోతాడు అని అర్థం!

ఇక 28 అయిన ఊపిరి మెడ వరకు వచ్చే ప్రవాహం లాగా ఉంటుంది. నాశనం అనే జల్లెడతో ఆయన ప్రజలు జల్లిస్తారు అనగా ప్రపంచంలో కొన్ని జాతులు మాత్రమే మిగులుతాయి అని అర్థం! రెండు రాజులు 19: 28 లో కూడా ఇదే చెప్తున్నారు

2రాజులు 19:28

నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

38వ అధ్యాయంలో కూడా ఇదే చెప్తున్నారు

యెహేజ్కేలు 38:3

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగారోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.

యెహేజ్కేలు 38:4

నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.

యెహేజ్కేలు 38:5

నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.

దేవుడు ఎంతటి కిరాతకమైన జాతినైనా లొంగదీసుకో గలరు.

29 రాత్రి పండుగ ఆచరించే విధముగా మీరు పాటలు పాడుతారు. ఎందుకు పాడతారంటే దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి మిమ్మల్ని విమోచన చేశారు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలువారు పాటలు పాడుతున్నారు అన్నమాట. ఇది తప్పకుండా ప్రకటన 19వ అధ్యాయంలో జరిగే సంభవాన్ని సూచిస్తుంది! వెంటనే యెహోవా యొక్క పర్వతానికి యాత్ర చేసేవారు సంతోషిస్తారు అంటున్నారు!

ఇంకా ముందుకుపోతే యెహోవా తన గంభీరమైన స్వరం వినిపిస్తారు యెహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును ప్రచండమైన కోపముతో దహించు జ్వాలతో పెళపెళ అను గాలివాన వడగండ్లతో తన బాహువు వాలుట జనులకు చూపించును. ఇక్కడ ప్రభావం గల స్వరము అనగా తప్పకుండా ఇది ప్రకటన 19: 15 నుంచి జరిగే సంభవములా కనిపిస్తుంది. అక్కడ యెహోవా స్వరము గంభీరమైన స్వరం అంటే ఏమీ కాదు, అది దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభువుల వారినోట నుండి వెలువడే ఆయన మాటలు ఆయన వాక్యమే జనాలను కొట్టడానికి ఆయన నోట నుంచి వాడి గల ఖడ్గము అదే! ఆయన ఇనుప దండముతో జనులను పరిపాలన చేస్తాడు అది తప్పకుండా ఆ స్వరము ఏసు క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరము అదే స్వరముతో ఆయన ప్రజలను దేవునికి దూరముగా ఉన్న వారిని విరోధులను నాశనము చేయబోతున్నారు!

ప్రకటన గ్రంథం 19:11

మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

ప్రకటన గ్రంథం 19:12

ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

ప్రకటన గ్రంథం 19:13

రక్త ములో ముంచబడిన(కొన్ని ప్రాచీన ప్రతులలో-చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

ప్రకటన గ్రంథం 19:14

పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

ప్రకటన గ్రంథం 19:15

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

ప్రకటన గ్రంథం 19:16

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

యెహోవా దండముతో అస్సూరును కొట్టగా అది మహా భయం చెందుతుంది ఇది ఇక్కడ అస్సూరు అనగా కేవలం ఆ దేశమే కాదు దేవుని బిడ్డలను బాధించిన వారంతా భయంతో పారిపోతారు అని అర్థము!

ఇక 33 వచనం చూసుకుంటే పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడియున్నది అది మోలెకు దేవతకు సిద్ధపరిచి ఉన్నది. ఇక్కడ తోపేతు అనగా గమనించవలసింది ఏమిటంటే అది అగ్నిగుండము లేదా అగ్ని యొక్క సరస్సు అనగా అది నరకము అని గమనించాలి. అక్కడ ప్రకటన 19:20లోన హార్మెగిద్దోను యుద్ధం తరువాత ఆ మృగాన్ని అబద్ధ ప్రవక్తలను పట్టుకొని అగ్ని గుండములో వేసినట్లు చూడగలం అంతేకాదు మృగం ముద్ర వేసుకున్న వారిని కూడా అక్కడ సహకరింపబడినట్లు మనం చూడగలం. కాబట్టి ఇది అనగా అగ్రిగుండమని అగ్నిగుండంలో వీరంతా త్రోసి వేయబడబోతున్నారు అని అర్థము!

ప్రకటన గ్రంథం 19:20

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

ప్రకటన గ్రంథం 19:21

కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.

ఇక చివరి వచనం చూసుకుంటే పూర్వకాలం నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది అయితే స్టడీ బైబిల్ లో చూసుకున్నా, కొన్ని ప్రాచీన ప్రతులలో చూసుకున్నా, పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది అది రాజు కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఇక్కడ తోపేతు అనగా అగ్నిసరస్సు అని అర్థం అనగా నరకము అని అర్థము. ఇది దేనికోసం సిద్ధపరచబడి ఉంది? యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేకలు, గొర్రెల కోసం చెప్పినప్పుడు మేకల కోసం నా తండ్రి చేత శపించబడిన వారలారా! అపవాదికినే వాని దూతలు కోసం సిద్ధపరచబడిన ఈ నరకానికి పొమ్మంటారు! నరకము సాతాను గాడి కోసం వాని దూతలు కోసం అది సిద్ధపరచబడి ఉంది. అయితే ఇక్కడ రాజు కొరకు అనగా ఏ రాజు కొరకు? క్రీస్తు విరోధి కొరకు, ఇంతవరకు నేనే రాజును, నేనే దేవున్ని అని చెప్పుకుంటున్న క్రీస్తు విరోధి కోసం ఈ నరకముతో సిద్ధపరచబడి ఉన్నది!!!

మత్తయి 25:41

అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని (అనగా-సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లోనికి పోవుడి.

మీ సహోదరులారా మీరు నిజ దేవుణ్ణి వెంబడిస్తే, ఎత్తబడడానికి సిద్ధపడితే మీరు పరలోకం వెళ్తారు లేదా సాతాను గాడి యొక్క దూతలను సైన్యాన్ని అనుసరిస్తే లోకాశలు, శరీరాసలు మీలో ఉంటే నరకానికి పోయి ఆ మేకలు వలె సాతాను గాడికి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్లిపోతారు!!!

కాబట్టి ఏది కావాలో నిర్ణయం చేసుకోండి!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*221వ భాగము*

యెషయా 31:1--9

1. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యు లనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.

2. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల యింటివారిమీదను కీడుచేయువారికి తోడ్పడువారిమీదను ఆయన లేచును.

3. ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయు వాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.

5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.

6. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి.

7. మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.

8. నరునిది కాని ఖడ్గమువలన అష్షూరీయులు కూలుదురు మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గ మెదుటనుండివారు పారిపోవుదురు

9. వారి పడుచువారు దాసులగుదురు భీతిచేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతినొంది వెనుక దీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 30వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఆరు గుంపుల వారికి శ్రమ అని చూసుకుంటూ, ఈరోజు 31వ అధ్యాయంలో ఐదవ గుంపు దగ్గరకు వచ్చాము. ఇంతవరకు ఎఫ్రాయిము త్రాగుబోతులకు శ్రమ అంటూ, ఆరీయేలు అనగా యెరూషలేము నివాసులకు శ్రమ అంటూ, తమ ఆలోచనలు దేవునికి తెలియకుండా దాచే వారికి శ్రమ, లోబడని పిల్లలుకు శ్రమ అని ధ్యానం చేసుకున్నాము.

ఇక ఐదో గుంపు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్షపెట్టక యెహోవా యొద్ద విచారణ చేయక తిరిగే వారికి శ్రమ. ఇది ఐదవ గుంపు వీరికి శ్రమ అంటున్నారు!

సరే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలులకు అనగా ఇశ్రాయేలు అధిపతులకు రాజుకి శ్రమ అని చెప్తూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా రక్షించబోతున్నారు అస్సూరుని ఏ విధంగా శిక్షించబోతున్నారో చెబుతున్నారు. అదేవిధంగా మధ్యలో మరలా వెయ్యేళ్ల పరిపాలన కోసం కొద్ది కొద్దిగా కనిపిస్తుంది మనకు!

సరే ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొదటి వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్షపెట్టక యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళువారిని, గుర్రాలను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారము లనియు, రౌతులు బలాడ్యులను వారిని అనగా ఐగుప్తీయులను ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నారు! దీని కోసం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది రాజైన ఆహాజుకాలంలో జరిగిన సంభవము! గత భాగాలలో చెప్పినట్లు రాజైన ఆహాజుతో దేవుడు చెప్పారు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, అష్షూరుతో యుద్ధం చేయు అంటే ఐగుప్తు రాజులకి కబురు పంపించాడు కదా అందుకే 30వ అధ్యాయంలో కూడా, మొదటి రెండు వచనాల్లో నేను నియమించని సంధి వారు చేసుకుంటున్నారు నేను చెప్పని పనులు వారు చేసుకుంటున్నారు అందుకే వాళ్లకు శ్రమ అని దేవుడు చెప్పాడు. ఇక ఇక్కడ కూడాను దేవుని ఆజ్ఞ లేకుండా యెహోవా దేవుని లక్షపెట్టకుండా దేవుని అనుమతి తీసుకోకుండా ఐగుప్తు రాజుకు కబురు పెట్టారు కదా మీకు శ్రమ అంటున్నారు దేవుడు! ఎందుకంటే ఐగుప్తీయులు రాజుకి బోలెడు రధాలు ఉన్నాయని, ఐగుప్తు సైన్యము బలాఢ్యులని పెద్ద నేర్పు కలవాలని వారి దగ్గరకు పరిగెత్తుతున్నారు గాని నేను ఐగుప్తునే నాశనం చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు! యిర్మియా 17: 5 లో అంటున్నారు దేవుడు మీరు మనుషుల మీద నమ్మకం పెట్టి శరీరులను తనకు ఆస్పదముగా, బలంగా చేసుకొని, దేవుని నుండి మనసు మళ్లించుకున్న మీరు శాప గ్రస్తులు అంటున్నారు! దేవునిపై మనము నమ్మకం పెట్టుకోవాలని శరీరులపై నమ్మకం పెట్టుకోకూడదు అలా చేస్తే మీరు శాపగ్రస్తులు!! మనం కూడా అనేకసార్లు చిన్న కష్టం వస్తే పోలీస్ స్టేషన్ కి, రాజకీయ నాయకులు దగ్గరకు, ఇక పంచాయతీ ఆఫీస్ కి పరిగెడుతూ ఉంటాం! దేవుడు అంటున్నాడు మీరు మనష్యుల మీద కాదు నమ్మకం పెట్టుకోవడం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి అంటున్నారు.

అయినను ఆయన అనగా దేవుడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు; మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీద, కీడు చేయు వారికి తోడ్పడే వారి మీద ఆయన లేస్తారు అంటున్నారు. దేవుని యొక్క జ్ఞానము గురించి యూదులు చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. 29వ అధ్యాయం 15, 16 వచనాల్లో అదే ఉంది కదా తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయజూచువారికి శ్రమ. ఎవరు చూస్తారు మేము చేసే పని ఎవరికి తెలుస్తుంది అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో వీరంతా మూర్ఖులు. కుమ్మరికిని మంటికి బేధము లేదు అని చెప్పవచ్చా, చేయబడిన వస్తువు దాని చేసినవారి గూర్చి ఇతను నన్ను చేయలేదు అని అనవచ్చునా, రూపింపబడిన వస్తువు తనని రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అని అనవచ్చునా అంటున్నారు!! ఇలాగే యూదులు కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు.

అందుకే మూడో వచనంలో అంటున్నారు: ఒరేయ్ వెర్రి వారలారా ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు కదా, ఐగుప్తీయులు గుర్రాలు కూడా అవి మాంసమయాలే కానీ ఆత్మ కాదు కదా, యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగిపోతాడు సహాయం పొందువాడు కూడా పడిపోతాడు వారందరూ అనగా సహాయం చేయడానికి వచ్చినోళ్ళు సహాయం కావాలని అడిగినోడు ఇద్దరు కూడి నాశనం అయిపోతారు అని మూడవ వచనంలో అంటున్నారు!!!

మనుషులే కానీ వాళ్ళు దేవుడు కాదు వాళ్ళు నిన్ను రక్షించలేరు అని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు వలన మీకు సిగ్గే, నీకు తలవంపులే తప్ప ఉపయోగం లేదు వారంతా ఏ పనికిరాని కర్ర లాగా అయిపోతారు అని చూసుకున్నాం. ఐగుప్తు సహాయము పనికిమాలింది నిష్ప్రయోజనమైనది గనుక ఏమియు చేయని గప్పాల మారి అని దాని పేరు పెడతాను అని కూడా గత భాగంలో చూసుకుందాం. ఇక యెహోవా తన చెయ్యి చాచినప్పుడు వారు తొట్రు పడతారు వాళ్లంతా మానవులే కాబట్టి దేవుని చేయి చాచిన వెంటనే ఐగుప్తీయులు జోగు పడతారు. ఐగుప్తీయులు గుర్రాలు పడిపోతాయి. గమనించాలి యెషయా ప్రవచన గ్రంథం మొదటి నుంచి యెహోవా బాహువు ఇంకా చాప బడి ఉన్నది ఆయన కోపము ఇంకా చల్లారలేదు అని చూసుకుంటూ ఉన్నాము. ఆ చెయ్యి మరల మరోసారి నేను చాపుతాను అంటున్నారు. చూడండి. 5:25 లో వారి ప్రవర్తన కారణంగా దేవుడికి తన ప్రజల మీద మండుతూ ఉంది ఆయన వాళ్ళ మీద చేయిచాచి వెళ్ళ కొట్టాడు. ఇంతగా జరిగినా ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకా చాపబడి ఉంది అంటున్నారు. అదేవిధంగా 9:12 లో ఇశ్రాయేలు వారిని తూర్పున సిరియనులు పడమటి ఫిలిస్తీయులు నోరు బాగా తెరిచి ఇశ్రాయేలను మింగేశారు అయినా యెహోవా కోపం చల్లారలేదు ఆయన బాహువు ఇంకా చాప బడి ఉంది అన్నారు. అదే 17 వ వచనము మరియు 21వ వచనం కూడా అంటున్నారు వారు భక్తి లేని వాళ్ళు దుర్మార్గులు వారిలో అనాధలని గాని వితంతువులని గాని పేదలని కానీ జాలి చూపరు నాశనం చేస్తానని చెప్తూ ఇంకా ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహువు చాప బడి ఉంది అన్నారు. 10:4లో కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు అదే,నేను మరలా చేయి చాపుతాను అప్పుడు ఈ ఐగుప్తీయులు తొట్రుపాటు పడతారు. నాశనం అయిపోతారు అంటున్నారు!

యెహోవా నాకు ఇలా సెలవిచ్చియున్నాడు యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును. ఇది రెండవ రాకడలో జరిగే సంభవము. యెహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకే గొర్రెల కాపరులు కూడి రాగా... ఇక్కడ గొర్రెల కాపరుల సమూహము అనగా గొర్రెలు ఇశ్రాయేలు ప్రజలు, ఇక వారి కాపరులు అక్కడున్న యాజకులు పెద్దలు. వీరంతా జెకర్యా పదవ అధ్యాయం ప్రకారము 12వ అధ్యాయం ప్రకారము వాళ్ళు ఏడుస్తున్నారు, వారి చుట్టూ హార్మెగిద్దోను యుద్ధం చేయడానికి శత్రువులు అనగా ఇస్లామిక్ కంట్రీస్ మరియు తూర్పు దేశాలలో ఉన్న వారంతా దండులతో ఎదురుచూస్తున్నారు. ఎలాగా? సింహాల లాగా ఎదురుచూస్తున్నారు యూదులను చంపేద్దామని. అయితే దేవుడు అదే సమయంలోనే తనవారిపక్షంగా వీరు అనగా శత్రువులు వేసే కేకలకు అధైర్యపడక తానే యూదాగోత్రపు కొదమసింహమై ఇశ్రాయేలు పక్షముగా సీయోను పర్వతం మీదికిని దాని కొండ మీదకి అనగా ఒలీవల కొండమీదకి దేవుడు కాలు పెట్టి ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయబోతున్నారు.

ఇదే గ్రంథము 37 వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు విరోధముగా అస్సూరు రాజు హిజ్కియా గారి టైంలో యుద్ధానికి వస్తే నాకు బలం చాలదు నీవే నాకు దిక్కు అని ఏడిస్తే, దేవుని దూత బయలుదేరి వారి పక్షముగా 1,85,000 మంది సైనికులను చంపేశాడు. అదే విధముగా వీరు ఇప్పుడు వీరు ఏడుస్తుంటే దేవుడు రాబోయే దినాలలో యేసు క్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడ సమయములో ఒలీవల కొండమీద కాలు పెట్టిన తరువాత యుద్ధానికి వచ్చిన ప్రతి సైన్యముతోనూ ఆయన యుద్ధం చేసి వారిని నాశనం చేస్తారు దీనికోసం జెకర్యా 14 రెండు నుంచి నాలుగు వచనాలు కూడా తెలియజేస్తుంది. ఇక్కడ జనాలు అన్నీ అనగా ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా పోగైన సైన్యాలు యెరుషలేము మీదకి యుద్ధం చేయడానికి నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకుంటారు. ఇండ్లను దోచుకుంటారు ఇశ్రాయేలు స్త్రీలను చెరిపేస్తారు నగరవాసులు సగం మంది బందీలుగా తీసుకొని పోబడతారు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అయితే దేవుడు యెహోవా బయలుదేరి యుద్ధ కాలంలో పోరాడే విధముగా ఆయన జనులతో యుద్ధం చేస్తాడు. ఆ రోజున ఆయన యెరుషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవ కొండమీద పాదాలు ఉంచుతారు వెంటనే ఒలీవకొండ తూర్పు దిక్కుకు పడమటి దిక్కుకు నడిమికి చీలిపోతుంది. సగం కొండమీద ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులు జరిగిపోతుంది అని ఆ సంభవాన్ని గూర్చి చెప్తున్నారు. ఇదే ప్రకటన 19వ అధ్యాయంలో కూడా ఆయన తెల్లని గుర్రమెక్కి వచ్చి వారితో యుద్ధం చేసే వారిని సంహరించి, జయం విజయం చేకూరుస్తారని చెప్పడమే కాకుండా అబద్ధ ప్రవక్త మరియు క్రీస్తు విరోధి కూడా పట్టబడి ఈ నరకంలో వేయబడతారు అని మనం చూడగలం!!!

ఇక్కడ దీనినే తెలియజేస్తున్నారన్నమాట సీయోను కొండమీద దిగుతారు మరియు దాని కొండ అనగా ఒలీవల కొండమీదకి ఆయన దిగి రాబోతున్నారు.

ఇక ఐదవ వచనంలో పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దానిని కాపాడుచూ విడిపిస్తూ ఉంటారు దానికి హాని చేయక తప్పిస్తూ ఉంటారు!!! చూడండి పక్షి ఎలా ఎగురుతూ తన పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటాదో అలాగే దేవుడు తన ప్రజలను సంరక్షిస్తూ వస్తున్నారు. అందుకే మత్తయి 23: 37 లో ఓ యెరుషలేమా యెరుషలేమా ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు వచ్చిన దేవుని ప్రవక్తలను రాళ్లు రువ్వి హతమారుస్తూ ఉండేదానా!! కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకునే విధంగా నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నో సార్లు ఇష్టపడ్డాను కానీ నీవైతే నా దగ్గర కూడా రాలేదు అన్నారు!

ఇక కీర్తన 28 లో నేను ఇశ్రాయేలీయులను కాపాడుతూ ఉంటాను యెరుషలేమును రక్షిస్తూ ఉంటాను అంటున్నారు . యెహోవాయే నాకు బలము ఆయన నాకు డాలు వంటి వాడు హృదయపూర్వక నమ్ముకున్నాను అయన చేత నాకు సహాయం లభించింది అని అక్కడ చెప్తున్నారు.

ఇంకా నేను విడిపించే దేవుడును అంటున్నారు.

సరే ఇక ఆరో వచనం చూసుకుంటే ఇశ్రాయేలీయులారా, మీరు ఎవనిమీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయనవైపు తిరుగుడి. తిరుగుబాటు కోసం ఆలోచిస్తే యెషయా 1:2లో ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాను ఇప్పుడు వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ అంటున్నారు మీరు ఎవరి మీద తిరుగుబాటు చేశారు ఆయన వైపే తిరగండి అప్పుడే మీకు ఆదరణ. యిర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా దగ్గరకే రావాలి అంటూ 4:1చెబుతున్నారు.

మూడవ అధ్యాయం 12 -- 14 వచనంలోని దేవుడు చెప్తున్నారు

12.నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

13.నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.

14.భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

మీరు చనిపోవడం వల్ల నాకు ఇష్టం లేదు గానీ వారు మారుమనస్సు పొందాలి ఇశ్రాయేలు ప్రజలారా నా వైపు తిరగండి అయితే తిరిగినప్పుడు ఏం చేయాలి మీ దుర్మార్గాలను వదిలేసి నా వైపు తిరగండి.

హోషేయ 14:1,2 వచనాల్లో కూడా ఇస్రాయేలు ప్రజలారా మీరు దేవుని తిరగండి మీరు చేసిన పాపాల కారణంగానే మీరు కూలిపోయారు మాటలు సిద్ధం చేసుకుని యెహోవా వైపుకు మళ్ళీ తిరగండి. ఆయనతో మీరు చెప్పాల్సింది ఏమిటంటే దయచేసి మా పాపాలన్ని క్షమించు మమ్మల్ని దయతో స్వీకరించు పశువులకు బదులుగా నీకు మా పెదవులను అనగా స్తుతిని సమర్పిస్తాము. నీకు ఇవ్వడానికి అవే మాకు ఉన్నాయి అంటున్నారు..

ప్రియ సహోదరీ సహోదరుడా ఈరోజు నీవు ఆయన వైపు తిరుగుతావా? ప్రభువా నా పాపాలను క్షమించు, ప్రభువా మమ్మల్ని క్షమించు. మాకు సహాయం చేయండి అని అడుగుతావా. అయితే అడిగినప్పుడు ఎలా అడగాలి అంటే ఏడవ వచనం మీకు మీరు పాపము చేసి కలుగజేసుకున్న మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహాలను సువర్ణ విగ్రహాలను ఆ దినమున ప్రతివాడు పారవేయును. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన తప్పులు అపరాదాలు ఒప్పుకోవడమే కాకుండా వాటిని విడిచి పెట్టాలి. విగ్రహారాధనకు సంబ ప్రతి విషయము వదిలివేయాలి. అప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరిస్తారు. నిన్ను రక్షిస్తారు.

ఎనిమిదో వచనంలో నరునిది కాని ఖడ్గం వలన అస్సూరీయులు కూలిపోతారు ఇంకా మనుష్యునిది కాని కత్తిపాలవుతారు. ఖడ్గము దగ్గర నుండి పారి పారిపోతారు. తొమ్మిదవ వచనం వారిలో పడుచు వారు దాసులగుతారు వీరి చేత వారి ఆశ్రయదుర్గము సమసి పోతుంది. సీయోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నది అందుకే వారి పారిపోతున్నారు అంటున్నారు. మిమ్మల్ని చూసి మీ ఎదుటి నుంచి పారిపోతారు. వాళ్లంతా భయం చేత పారిపోతారు. సీయోనులో అగ్ని అనగా ఒకానొక రోజు అనగా వేయేళ్ల పరిపాలనలో దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ముఖ్యదేశముగా చేసుకుని, జెరూసలెం ని ప్రపంచ కేపిటల్ గా ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అప్పుడు సీయోలో నుండి కొలిమి అనగా దేవుని తీర్పులు బయలుదేరి ప్రపంచం అందర్నీ పరిపాలిస్తూ ఉంటుంది!

కాబట్టి సహోదరి సహోదరుడా నువ్వు తిరిగి రానుద్దేశిస్తే ఎక్కడి నుంచి ఏ దేవుని దగ్గరనుండి పారిపోయావో మరలా అదే దేవుడు దగ్గరకు రా!! నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకుని క్షమించమని అడిగి ఆయనతో సమాధానపడు!!

అప్పుడు దేవుడు నిన్ను మరలా తన బిడ్డగా చేసుకొని మరలా నీకు సమాధానం ఇచ్చే దేవుడు!!!

ఆమెన్!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*222వ భాగము*

యెషయా 32:1--7

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

2. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

3. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

4. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

7. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 31వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 32 వ అధ్యాయం ధ్యానం చేసుకుంటే ఈ అధ్యాయము ఏసు క్రీస్తు ప్రభువుల వారి రెండవ రాకడ మొదటి రాకడ ఇంకా వెయ్యేళ్ల పరిపాలన ఈ విషయాల కోసం చెప్పబడి ఉంది.

మొదటి చూసుకుంటే ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే తప్పకుండా వెయ్యేళ్ల పరిపాలనలో జరగబోతుంది. ఇక్కడ రాజు అనగా మరెవరో కాదు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యూదాగోత్రపు సింహముగా రాబోవుచున్న ఏసుక్రీస్తు ప్రభువుల వారే ఆ రాజు!!! ఆయన నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తారు. దీనికోసం అనేకసార్లు రాయబడి ఉంది.

Isaiah(యెషయా గ్రంథము) 2:1,2,3,4

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

Isaiah(యెషయా గ్రంథము) 4:2,3,4,5,6

2. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.

3. సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయు నప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5. సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6. మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

Isaiah(యెషయా గ్రంథము) 9:7

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

Isaiah(యెషయా గ్రంథము) 11:1,2,3,4,5,6,7,8

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును .

యెషయా 24:23

చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.

ఇక నీతిని బట్టి తీర్పు తీర్చడం అనగా

కీర్తనలు 7:8

యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.

కీర్తనలు 35:24

యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.

కీర్తనలు 72:2

నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.

ఇంకా అనేక రిఫరెన్సు లున్నాయి. ఆయన నీతిని బట్టి న్యాయం తీర్చే దేవుడు!

ఇక ఇక్కడ అధికారులు న్యాయమును బట్టి ఏలుతారు!! ఇక్కడ అధికారులు ఎవరూ?

చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అధికారులు ఎవరో కాదు జయించిన విశ్వాసులు. ఎవరైతే జయించిన అనుభవము కలిగి ఉంటారో, ఎత్తబడతారో ,వారే వెయ్యండ్ల పరిపాలనలో పరిపాలన చేస్తారు అని మనం చాలాసార్లు చూసుకున్నాము! దీనికి సంబంధించిన రిఫరెన్స్ మనకి యేసుక్రీస్తు ప్రభువుల వారు లూకా సువార్త లో 19వ అధ్యాయము అక్కడ 12 నుంచి చివరి వరకు చూసుకుంటే ఉపమానము మనకి కనిపిస్తుంది

Luke(లూకా సువార్త) 19:12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27

12. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై

13. తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల (మినా యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.

14. అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి.

15. అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.

16. మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా

17. అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.

18. అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా

19. అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.

20. అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;

21. నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.

22. అందుకతడు చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా

23. నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి

24. వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.

25. వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.

26. అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.

27. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నాశత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.

ఇక్కడ ఈ ఉపమానంలో ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన రాజు! రాజ్యము సంపాదించుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి వారి యొక్క ఎబిలిటీ అనగా వారి యొక్క విశ్వాస పరిమాణం ప్రకారము కొన్ని తలాంతులు లేదా మినాలు ఇచ్చినట్టు చూడగలం! అయితే మొదటివాడు ఒక మినా వలన మరో 10 మినాలు సంపాదించాడు. అనగా వ్యాపారం చేసి సంపాదించాడు. వెంటనే ఏమంటున్నారు భళా నమ్మకమైన మంచిదాసుడా ఇంత కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై ఉండు అని వానితో చెప్పెను!! రెండవ వాడు అయ్యా నీ మినవలన ఐదు మినాలు సంపాదించాను అంటే అయితే నువ్వు ఐదు పట్టణాల మీద అధికారిగా ఉండు అని దేవుడు చెప్పారు! మనం జీవిస్తున్న ఈ విశ్వాస జీవితంలో విశ్వాస పరిమాణం బట్టి దేవుడు ఆ వెయ్యిండ్ల పరిపాలనలో మనలను అధికారులుగా చేయబోతున్నారు! మనము వెయ్యి ఏండ్లు క్రీస్తుతో పాటు రాజ్య పరిపాలన చేయబోతున్నాము! ఇప్పుడు నీవు జీవించే విశ్వాస జీవితం ప్రకారము, నీ ఎబిలిటీ ప్రకారం, వెయ్యేండ్ల పరిపాలనలో నిన్ను ఏ డిఎస్పీగానో ఎస్పీ గానో, కమిషనర్ గానో లేక కలెక్టర్గానో తాసిల్దార్ గానో, సర్పంచ్ గానో, ఎంపీగాను ఏదో ఒక ఘనమైన పోస్ట్ నీకు ఇవ్వబడుతుంది! అయితే ఆ చివరి దాసుడిలా అయ్యా నువ్వు విత్తనిచోట కోసేవాడవు, నువ్వు కఠినుడవు నువ్వు అని నాకు తెలుసు కాబట్టి నీ మీనా నేను భూమిలో దాచేను అని గాని నువ్వు అనే స్తితిలో ఉంటే, సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచి కాలు చేతులు కట్టి నరకంలో తోసి వేస్తాడు నిన్ను కూడా దేవుడు!!! నీకు ఇచ్చిన తలాంతులు నీవు సరియైన విధముగా వాడి, అనేకులను క్రీస్తు కోసము సంపాదించవలసిన అవసరం ఎంతైనా ఉంది!! కాబట్టి ఆ వెయ్యి ఏండ్ల పరిపాలనలో దేవుడు పరిపాలించే నీతి, నీతిని బట్టి పరిపాలించే ఆ నీతి రాజ్యంలో, అధికారిగా న్యాయమును బట్టి నువ్వు పరిపాలించాలి అంటే ఇప్పుడు మీ ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో కాపాడుకొని జయించే అనుభవం కలిగి ఆ రాకడలో ఎత్తబడితే వెయ్యేళ్ల పరిపాలనలో క్రీస్తుతో పాటు నీవు కూడా రాజ్యము చేయబోతున్నావు!!

అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!!

ఆమెన్ ఆమెన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*223వ భాగము*

యెషయా 32:1--7

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

2. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

3. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

4. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

7. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 32వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ప్రియులారా ఇక రెండవ వచనం నుండి చూసుకుంటే మనుషుడు గాలికి మరుగైన చోటు వలె గాలివానకు చాటైన చోటు వలె ఉండును ఎండిన చోట నీళ్ల కాలువవలెను, అలసట పుట్టించు దేశాన గొప్ప బండ నీడవలే ఉండును అంటున్నారు. తెలుగు బైబిల్ లో దీని అర్థం మనుషుడు అనేవాడు గాలికి మరుగైన చోటు వలె గాలివానకు చాటు అయినా చోటు వలె ఉంటాడు ఎండిన చోట్ల నీళ్ల కాలువలే అలసట పుట్టించు దేశాన్ని గొప్ప బండ వలె ఉంటాడు అనగా మనుషుడు ప్రొటెక్టివ్ ఏరియాలో అనగా గాలివాన నుంచి గాని లేకపోతే వరద ప్రవాహానికి గాని, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రొటెక్టువ్ ఏరియాలో ఉంటాడు అని అర్థం వచ్చినా, స్టడీ బైబిల్ లో చూసుకున్నా, పాత ప్రతులలో చూసుకున్నా,ఇంగ్లీష్ బైబిల్ లో చూసుకున్నా మనుషుడు అని లేదు గాని ఒక మనుషుడు గాలికి చాటుగా ఉన్న ఇంకా గాలివానకు ఆశ్రయముగా ఉంటాడు అలసట పుట్టించే దేశంలో గొప్ప నీడగా ఉంటాడు పెద్ద బండ యొక్క నీడలా ఉంటాడు అని ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రాచీన ప్రతులు, స్టడీ బైబిల్ లో ఉన్న అర్థమే తీసుకుందాం. ఒక మనుష్యుడు గాలికి చాటుగా గాలివానకు ఆశ్రయంగా ఉంటాడు. ఇక్కడ ఆ ఒక మనుషుడు ఎవరో కాదు మొదటి వచనంలో చెబుతున్న రాజు అని నాకు అర్థం అవుతుంది. రాజుల రాజైన యేసు క్రీస్తు ప్రభువుల వారే! కాబట్టి ఈ దైవ మానవుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒక రోజు అనగా ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మనిషికి ఎలా ఉంటారంటే గాలికి చాటుగా గాలి తగలకుండా చాటుగా గాలివాన అనగా తుఫానులో ఆశ్రయముగా ఉండబోతున్నారు! ఇంకా మెట్ట ప్రాంతంలో నీటి కాలువ లాగా దాహం తీర్చడానికి ఆయన ఉంటారు! ఇక ఆరిపోయిన ప్రదేశంలో నీటిలా ఉంటారు. గొప్ప బండ నీడలాగా ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఉండబోతున్నారు. ఇది దీని అర్థం! ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువుల వారి మానవ అవతారాన్ని సూచిస్తుంది! దీనికోసం ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి

యెషయా 7:14

కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యోహాను 1:1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1:2

ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,

యోహాను 1:14

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

ఇక ఆశ్రయం కోసం చూసుకుంటే ఇదే 25వ అధ్యాయంలో ఆయన ఆశ్రయముగా ఉంటారు పేదలకు అని చెప్పబడింది.

యెషయా 25:3

భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి.

కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ఇంకెవరు తన ప్రజలకు ఆశ్రయముముగాను నీడగాను ఉండలేరు. ఇక నీళ్ల కాలువ లాగా ఏసుప్రభువు వారు కాక మరెవరు ఉండలేరు.! దీనికోసం ఎన్నో రిఫరెన్స్ లు ఉన్నాయి అవి కూడా చూద్దాం.

కీర్తనలు 91:2

ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.

యోహాను 4:10

అందుకు యేసు: నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.

యోహాను 4:11

అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును?

యోహాను 4:13

అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

యోహాను 4:14

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

యోహాను 7:37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

యోహాను 7:38

నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

యోహాను 7:39

తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

ఇక మూడవ వచనం చూసుకుంటే చూసి వారి కన్నులు మందంగా ఉండవు వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానం గ్రహించును నత్తి వారి నాలుక స్పష్టంగా మాటలాడును అంటున్నారు. ఈ వచనాలు కూడా 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే సంభవము. చూసేవారు కన్నులు మందంగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలులు అనగా తొందరపడి మాట్లాడేవారు అలాంటివారికి కూడా జ్ఞానం అర్థం అవుతుంది! నత్తి వారి నాలుక తేటగా మాట్లాడుతుంది అని చెప్తున్నారు!

దీనికోసం 29వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెప్పడం జరిగింది ఆరోజు నా పుస్తకం చదివి వినిపిస్తే చెవిటి వారు మాటలు వింటారు, గుడ్డివాడు కూడా చూస్తారు అని,

ఇంకా 35 అధ్యాయంలో కూడా గుడ్డివాడు కళ్ళు తెరుస్తారు చెవిటి వారి చెవులు విప్పడం జరుగుతుంది కుంటివాడు జింకలాగా గంతులు వేస్తాడు మూగవాడు నాలుక ఆనంద గీతాలు పాడుతుంది కస్తూరి పూలు పూస్తాయి అంటూ చెబుతున్నారు. నిజానికి ఇది యేసు క్రీస్తు ప్రభువుల వారి మొదటి రాకడ మరియు రెండవ రాకడ అనంతరం వెయ్యేండ్ల పరిపాలనలో జరిగే సంభవాన్ని కూడా సూచిస్తుంది!

చూడండి మనం ఆరవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు యెషయా నువ్వు వెళ్లి వినే వారి చెవులు మందం అయిపోయేలాగా, చూసేవారు కళ్ళు మూతపడేలా చెయ్యు అంటే , ఎంతవరకు అంటే దేశం ఖాళీ అయిపోయే వరకు అని అక్కడ చెప్పడం జరిగింది! కాబట్టి ఇప్పుడు దానికి విరుగుడుగా అసలైన చెర అనగా ఈ అస్సూరు బబులోను చెర అది శరీరక సంబంధమైనదైతే, మనిషికి నిజమైన చెర పాపపు చెర! ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రపు చెర! ఈ చెర నుండి దేవుడు విడిపించాక ఆ నిత్యత్వంలో వారు పొందుకొనే విడుదల, వారు పొందుకునే సాక్ష్యము!! అప్పుడు వారిలో గుడ్డివారు కూడా చాలా చక్కగా చూడబోతున్నారు. ఇక చెవిటి వారు కూడా చక్కగా వినబోతున్నారు. ఇక చంచల మనస్కులు అనగా తొందరపడుతూ ఉండేవాళ్లు వారికి కూడా దేవుని జ్ఞానము అర్థం అవుతుంది. అనగా వెయ్యేళ్ల పరిపాలనలో మానవుల యొక్క శరీరములోనూ వారి మనసులలోనూ హృదయాలలోనూ గొప్ప మార్పు మరియు పరివర్తన కలుగుతుంది అని దీని అర్థము. ఆ రోజున నత్తి వారు కూడా తేలిక మాట్లాడుతారు అని చెబుతున్నారు..

యెషయా 11:9

నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

యెషయా 29:24

చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.

యిర్మియా 31:33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

యిర్మియా 31:34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

ఇక ఐదు ఆరు వచనాలు చూసుకుంటే

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

మూఢుడు లేదా మూడులు అనగా ఈ రెండు వచనాలలో దేవుని యొక్క ఆత్మ మరియు నీతి ఈ విషయాలను గ్రహించలేని వాడు. ఆధ్యాత్మికమైన గ్రహింపులేని వ్యక్తి మూర్ఖుడు లేదా మూర్ఖుడు అనే బైబిల్ గ్రంధంలో వాడబడటం జరిగింది. అయితే ఇలాంటి మూడులు ఇక ఘనుడు అని ఎంచబడుడు. కాబట్టి ఉదారుడు అని ఎంచబడడు. మూడులు మూడు వాక్కులే పలుకుతారు భక్తిహీనంగా ఉంటారు. వారు దేవుని గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొనే వారి జీవనాధారాన్ని తీసుకుంటారు దాహంగా ఉన్నవారి పానీయం లేకుండా ఇవ్వకుండా చేస్తారు అంటున్నారు.

కాని మాటలు ఎలా పలుకుతారు అని మనము ఆలోచన చేస్తే, కీర్తన 14వ అధ్యాయం చూసుకున్నా, 53 వ అధ్యాయం చూసుకున్నా దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఇది ఒక కాని మాట! మరోకాని మాట మనం గత భాగాలలో చూసుకున్నాము! రూపింపబడిన వస్తువు తనను రూపించినవానిని చూసి అతడు నన్ను చేయలేదే అని చెప్పొచ్చా?! సృష్టికర్తకు నీకు బుద్ధి లేదు అని చెప్పవచ్చా?! నీకు జ్ఞానం తక్కువ అని చెప్పొచ్చా ?! అని దేవుడు కుమ్మరి వానిని మంటిని ఉదాహరణగా చెబుతూ చెప్పడం జరిగింది! ఇది మరొక రకమైన మూడుల మాటలు ! కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మికమైన గ్రహింపు లేని వారు ఆ రోజులలో అనగా వెయ్యేళ్ల పాలనలో ఇలాంటి వారికి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు ఉండవు. నిజానికి ఈ రోజులలో ఇలాంటి పొగరు పట్టి మాట్లాడే వారే గొప్పవారుగా చలామణి అవుతున్నారు! రాబోయే క్రీస్తు రాజ్యము అనగా 1000ల పరిపాలనలో ఇలాంటి బుద్ధిహీనులకు అవివేకులకు గౌరవ మర్యాదలు లభించవు అని చెబుతున్నారు! ఎందుకంటే వీళ్లు తెలివి లేకుండా ఆలోచిస్తారు. తెలివి లేకుండా పనులు చేస్తారు! తెలివి లేకుండా మాట్లాడుతారు! ప్రతిదాంట్లోని మూర్ఖతను బయలు పరుస్తారు కాబట్టి ఇలాంటి వారికి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో గౌరవ మర్యాదలు ఉండవు! అలా చెబుతూ, ఏడవ వచనం చూసుకుంటే మోసగాడి సాధనాలు చెడ్డవి నిరుపేదల న్యాయవాదులు చేసిన కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయడానికి ఇలా ఆలోచిస్తారు అంటున్నారు! ఇలాంటి వంచకులు మూర్ఖులు కంటే పెద్ద మూర్ఖులని దేవుని ప్రపంచంలో తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించి దేవుని తీర్పు తప్పించుకోవచ్చులే అని ఊహాగానం చేస్తారు! వీరు తప్పించుకోలేరు ఆరోజు అని చెబుతున్నారు! అయితే ఘనులు ఏం చేస్తారు? వారు చేసిన ఆ ఘణ కార్యములు బట్టే నిలుస్తారు అని చెప్తున్నారు 8వ వచనంలో. అనగా మూర్ఖుడు వంచకుడు తమ మూర్ఖతను వెల్లడిస్తే, ఘనుడు తమ ఆలోచన వలన తమ చేసే పనుల వల్ల మాటల వల్ల ఘనమైన కార్యాలు చేస్తాడు వెయ్యేళ్ల పరిపాలనలో అంటున్నారు! అవును కదా యేసయ్య కూడా మత్తయి ఏడు 16 నుంచి 20 లో ఇదే చెప్తున్నారు

Matthew(మత్తయి సువార్త) 7:16,17,18,19,20

16. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?

17. ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.

18. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.

19. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.

అనగా వారు చేసే పనులు బట్టి వారు ఫలించే ఫలములను బట్టి వారి బ్రతుకు మనకి అర్థమవుతుంది అంటున్నారు.

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! వెయ్యేళ్ల పరిపాలనలో నీవు ఇప్పుడు జ్ఞానము లేని వాడవైనా అప్పుడు జ్ఞానవంతుడిగా, ఇప్పుడు ఏ రకమైన లోపముగలవాడవైనా ఆరోజు లోపం లేనివాడిగా , దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవాడిగా పరిపాలంచేవాడిగా ఉండబోతున్నారు! కాబట్టి సహోదరి సహోదరుడా నీవు ఎలా ఆధ్యాత్మిక స్తితి ఎలా ఉంటుందో, దేవుని కోసం ఘనమైన కార్యాలు చేస్తున్నావా లేక మూడుడిలాగా మోసకారి లాగా నీ కార్యాలు చేస్తున్నావా? ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీర్చబోతున్నారు అని మర్చిపోవద్దు!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*224వ భాగము*

యెషయా 32:9--14

9. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.

10. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.

11. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి! నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.

12. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.

13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు

14. నగరి విడువబడును. జనసమూహముగల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగా నుండును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 32వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనం నుండి చూసుకుంటే

9. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.

10. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.

11. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.

ప్రియులారా ఈ వచనాలలో సుఖాశక్తి గల స్త్రీలారా ,అలాగే సుఖము మీద ఆసక్తి గల స్త్రీలారా, నిశ్చింతగా ఉన్న స్త్రీలారా సుఖాసక్తి గల కన్య లారా!! అనగా లగ్జరీలకు అలవాటు పడ్డ కన్యలారా! ఇక్కడ ఈ స్త్రీలు, కన్యలు, నిశ్చింతగా ఉన్న వాళ్లు వీళ్లంతా ఎవరో కాదు మనం మూడవ అధ్యాయం చూసుకుంటే అక్కడ ఆ రోజున సీయోను కుమార్తెలకున్న గర్వాన్ని నేను తీసేస్తాను, ఎందుకంటే సీయోను కుమార్తెలు విర్రవీగి గర్వించి మెడచాచి ఓర చూపులు చూస్తూ, ఇంకా కాలి గజ్జలు మోగిస్తూ, కులుకుతూ నడుస్తున్నారు అందుచేత నేను వారిని దిగంబరంగా చేసేస్తాను అంటూ వారి పాద కడియాలను తర్వాత చంద్రవంకలను బూషనాలను చెవిపోగులు వారి గాజులు ముసుగులు, కొల్లాయిలు వీటన్నింటినీ తీసేస్తాను అని చెప్పారు కదా దేవుడు! ఏ స్త్రీల కోసం చెప్పారో ఆ స్త్రీలే ఇక్కడ ఉన్న సుఖాసక్తి అనగా సుఖము మీద ఆసక్తి, ఆ సుఖం మీద ఆసక్తి వారిని గర్విష్టులుగా చేసింది! ఆ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి దేవుని మాటను వినకుండా ఏదో మొక్కు పాటు మొక్కుబడి భక్తి చేస్తున్నారు! వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి!! మనలో కూడా చాలా మంది లగ్జరీలకు అలవాటు పడి దేవుని గుడిలోకి రావడం మానేస్తున్నాం! దేవుడంటే ఆసక్తి పోయింది వారు వెళ్లే మందిరాలలో సెంట్రలైజ్డ్ ఏసి ఉందా లేదా! కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా లేవా! కారుకి పార్కింగ్ కి ప్లేస్ ఉందా లేదా? వినసొంపు గల మ్యూజిక్ ఉందా లేదా? ప్రసంగాలు మనకు నచ్చే విధంగా చెవులకు ఇంపుగా చెబుతున్నారా లేదా?! ఇలాంటివి చూస్తున్నారు గాని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి ఉన్నది ఉన్నట్లు బోధించి చెబితే అక్కడ ఎవరూ ఉండటం లేదు! ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నారు! ఫ్యాన్ కిందే కూర్చోవాలి! లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయింది వారి శరీరం! ఇంట్లో టీవీ సీరియల్ అలవాటైపోయాయి. డబుల్ కాట్ మంచం అది కూడా మెత్తగా ఉండే పరుపులు ఇవే అలవాటయ్యాయి గాని ఉపవాస ప్రార్ధన, కన్నీటి ప్రార్ధన, ఏకాంత ప్రార్ధన, గోజాడే ప్రార్ధన, విలపించే ప్రార్థన, సువార్తకు వెళ్లి సువార్త ప్రకటించే అనుభవం, ఈరోజు ఎవరు కోరుకోవడం లేదు!

ప్రియ బిడ్డ నీవు కూడా ఇలాగే ఉంటే జాగ్రత్త! ఇక్కడ అంటున్నారు సుఖాసక్తి గల స్త్రీలారా, నిశ్చింతగల స్త్రీలారా , సుఖాసక్తిగల కన్యలారా! నా మాట వినండి! ఎందుకంటే ఇక ఒక సంవత్సరానికి మీకు తొందరే, తొందర కలుగపోతుంది! ఆరోజు మీ ద్రాక్ష చెట్లు ఫలించవు, ద్రాక్ష పొలాలు ఉండవు కాబట్టి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకోండి! ఆ రోజు మీ రమ్యమైన పొలాల కోసం ఫలభరితమైన ద్రాక్ష వళ్లుల కోసం రొమ్ము కొట్టుకొని ఏడ్వ బోతున్నారు! ద్రాక్ష చెట్లు ఉండే ప్రాంతంలో ముండ్లతో ఉంటాయి! ఆనందగృహాల్లో రమ్యమైన ఇండ్లలో బలురక్కసి చెట్లు పెరిగిపోతాయి! ఎందుకంటే నగరి విడువబడును! జన సమూహము గల పట్టణం విడువబడును! కాపరులకు ఎల్లకాలము గుహలుగా ఉంటాయి!! ఎందుకంటే మనుషులు లేరు కాబట్టి అక్కడ అడవి గాడిదలు ఉంటాయి అడవి గాడిదలు మేస్తాయి అక్కడ పట్టణము అరణ్యముగా మారిపోతుంది ఇలా ఎంతవరకు అంటే పై నుండి మీరు ఆత్మను పై నుండి మన మీద ఆత్మకుమ్మరింపబడే వరకు!!! నగరేఉ విడవబడుతుంది అందుకే ఏడ్వండి అంటున్నారు! అందుకే ఏడ్వండి యిర్మియా గ్రంధంలో రోదన చెయ్యు స్త్రీలను పిలువనంపించుడి! వెతకండి ఎందుకంటే మరణము మన కిటికీలు ఎక్కుతుంది కాబట్టి ఏడ్వండి అంటున్నారు.

Jeremiah(యిర్మీయా) 9:17,18,20,21,22

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

18. మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

20. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

22. యెహోవా వాక్కు ఇదే! నీవీమాట చెప్పుము. చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చ కుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువా డెవడును లేకపోవును.

ఇక యోవేలు గ్రంథంలో ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని వద్దకు రండి అలా చేస్తే ఆయన మన మనవి వినడని ఎలా చెప్పగలరు అంటున్నారు!

Joel(యోవేలు) 1:13,14

13. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.

14. ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

Joel(యోవేలు) 2:12,13,14,15,16

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

16. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

అదే సందర్భాన్ని బట్టి ఇక్కడ కూడా చెబుతున్నారు కొన్ని రోజులకు మీకున్న లగ్జరీ పోబోతుంది! ఆరోజు మీరు గుండెలు బాదుకొని ఏడుస్తారు అందుకే ఇప్పుడే త్వరపడండి. సుఖాసక్తిగల స్త్రీలారా! నిశ్చింతగల స్త్రీలారా! సుఖాసక్తిగల లగ్జరీకి అలవాటపడ్డ కన్యలారా అని దేవుడు పిలుస్తున్నారు. ఇంకా ఇక్కడ ఒక సంవత్సరానికి మీకు తొందరగా కలుగుతుంది దేశం పాడైపోతుంది. దీనికోసం ఆలోచిస్తే క్రీస్తుపూర్వం 701 లో అస్సూరురాజు ఇశ్రాయేలీ దేశాన్ని ముఖ్యంగా యెరుషలేము ప్రాంతాన్ని ఆక్రమించుకొని ప్రజలను కొన్ని సంవత్సరాలు బాధపెట్టాడు. ఇశ్రాయేలీయులు పండించిన పంటను వారు దోచుకుంటూ ఉండేవాళ్ళు. పట్టణం ముట్టడి దిబ్బ వేయబడింది! అప్పుడే కాదు యిర్మియా గారి సమయం లో కూడా పట్టణం ముట్టడి దిబ్బ వేయబడింది బబులోను రాజు చేత! ఈ సందర్భాలను తెలియజేస్తూ ఓ లగ్జరీకి అలవాటు పడ్డ స్త్రీలారా కన్యలారా! మాకు ఏ ప్రమాదము జరగదు అనుకుంటు నిశ్చింతగా ఉన్న స్త్రీలారా!! మీ మీదకు శ్రమ రాబోతుంది! ఏడవండి! గోనెపట్ట కట్టుకోండి! మీకు ఏడ్చి మొత్తుకునేందుకు తగిన కారణం దొరికింది కాబట్టి అంటున్నారు!!

ఇక 14 15 వచనాల్లో మీ నగరు విడిచిపెట్టబడుతుంది, జన సమూహము గల పట్టణము విడువబడుతుంది ,అవి కొండ కాపరుల గోపురం ఎల్లకాలం గుహలుగా ఉంటుంది... ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అనగా ఒకసారి బబులోను రాజైన నెబుకద్నెజరు ద్వారా 70 సంవత్సరాల విశ్రాంతి సంవత్సరాలు అనుభవించింది ఈ యూదా ప్రాంతము యెరుషలేము ప్రాంతము. అప్పుడు విడువబడ్డాది, మరలా క్రీస్తు శకం 70 లో కూడా టైటస్ అనేవాడు యూదులను మోసం చేసి సర్వనాశనం చేసేక కూడా ఇది జరిగింది. అయితే మరోసారి జరగబోతుంది. ఇక్కడ దీనికోసం వ్రాస్త్తున్నారు అన్నమాట! ఇలా ఎంతవరకు? పైనుంచి ఆత్మ కురిసే వరకు,. పైనుంచి ఆత్మ ఎప్పుడు కురవబడింది? పెంతుకోస్తు పండుగ నాడు జరిగింది! ఈ పైనుంచి ఆత్మ కురువ బోతున్నాడు అనే దాని కోసం మనకి 44వ అధ్యాయంలో కూడా చెబుతున్నారు

Isaiah(యెషయా గ్రంథము) 44:3

3. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

ఇదే విషయాన్ని ఎండిపోయిన ఎముకలు దర్శనంలో కూడా యెహెజ్కేలు గ్రంథంలో 37 వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నారు నేను మనుషుల మీద ఆత్మను కుమ్మరించబోతున్నాను చూద్దాం

Ezekiel(యెహెజ్కేలు) 37:14,21,22,26

14. నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

21. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశ ములోనికి తోడుకొనివచ్చి

22. వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద

26.​ నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.

Joel(యోవేలు) 2:28,29,30,31,32

28. తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

29. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.

30. మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

31.​ యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

32.​ యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.

అని చెప్తున్నారు కాబట్టి ఈ అన్నీ వచనాలు చూసుకుంటే ఇక్కడ జనములు విలువబడుట ఎండిపోవుట ఇవన్నీ రెండు రకాలుగా జరగబోతున్నాయని నాకు అర్థం అవుతుంది. మొదటిది లిటరల్గా ప్రజలు లేకుండా పోతారు. మీద చెప్పిన మూడు సందర్భాల్లోనూ ఆ ప్రాంతంలో యెరుషలేములో చుట్టుపక్క ప్రాంతాల్లో మనుషులు లేకుండా పోయారు!

ఇక రెండవది మానవుల హృదయాలలో దేవుడు లేకుండా పోయాడు. ఇది రెండవది. మనిషిలో దేవుడు లేకుండా పోయే రోజులు వచ్చాయి. ఆల్రెడీ అయిపోయింది. పెదాల మీద వారు భక్తి చేస్తున్నారు తప్ప హృదయపూర్వకమైన ఆరాధన, ఆత్మతోను సత్యముతో చేసే ఆరాధన వారిలో లేదు! అందుకే వారి పట్టణాలు అనబడే వారి హృదయాల్లో పై నుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు అవన్నీ మోడుగా ఉండిపోతాయి. పట్టణాల్లో ప్రజలు ఉండరు.

పెంతుకోస్తు పండుగ దినాన వారంతా కూడి ఉండగా అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో చెప్పబడినట్లు అగ్ని జ్వాలల వంటి కన్నులు విభాగింపబడినట్లు వారి మీదగా పరిశుద్ధాత్ముడు వ్రాలగా వారందరూ అన్య భాషలతో మాటలాడ సాగిరి ఆరోజు పొందుకున్నారు అప్పుడు ప్రారంభమైన ఈ సంఘము అపొస్తులల పునాది మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడుతూనే ఉంది అది దేవుని రాకడ వరకు కట్టబడుతూనే ఉంటుంది ఈ విషయమే ఇక్కడ చెబుతున్నారు!

Acts(అపొస్తలుల కార్యములు) 2:1,2,3,4

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

ఇక 16 నుంచి 20 వచనాలు చూసుకుంటే మరల వెయ్యేళ్ల పరిపాలనలో జరగబోయే సంభవమే కనిపిస్తుంది. ఇక్కడ అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగుతుంది. నీతి సమాధానం కలుగజేస్తుంది . నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. అప్పుడు నా జనుల యొక్క విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసిస్తారు. జాగ్రత్తగా గమనిస్తే న్యాయము అరణ్యములో నివసించినప్పుడు, ఫలభరితమైన భూమిలో నీతి దిగుతుంది! ఆ నీతి ఏదీకాదు ఆ నీతి యేసు క్రీస్తు ప్రభువు! వారి నీతి సమాధానము కలుగజేస్తుంది! నీతి వలన సమాధానము కలిగితే, అదే నీతి వలన నిత్యము నిమ్మలము మరియు నిబ్బరము కలుగుతుంది! అనగా దేశంలో శాంతి సమాధానముతో పాటుగా ధైర్యం కూడా కలుగుతుంది! యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ జీవితములో రాజ్యము చేసేటప్పుడు నీకు నిమ్మలంగా ఉంటుంది, నిబ్బరముగా ఉంటుంది, ఇక దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటారు! ఈ ప్రవచనాలు ఇంతవరకు సంభవించలేదు ఇశ్రాయేలీయుల బ్రతుకులలో! ఎందుకంటే నా జనులు తమ స్థలమునందును ఆశ్రయిస్తానముల యందును శుభకరమైన నివాసములు యందును నివాసం చేస్తారు కానీ ఇశ్రాయేలు ప్రజలు బబులోను అస్సూరు చెరల నుండి వచ్చిన తరువాత వారు సుఖముగా జీవించలేకపోయారు. వారిని మరల గ్రీకులు మరియు రోమన్ లు పాలించారు. చివరికి రోమన్లు వారిని చీల్చి చెండాడి భయంకరమైన హింసలకు గురి చేసారు. అందువల్ల దేశాన్ని వదిలి పారిపోయారు. తిరిగి 1948 లో తిరిగి వచ్చారు. ఇప్పటి కూడా వారి శాంతిగా సుఖంగా జీవించడం లేదు! ఎన్నో తొందరలలో జీవిస్తున్నారు. యుద్ధాలతో జీవిస్తున్నారు. మరి ఇది ఎప్పుడు ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరబోతుంది అనగా హార్మెగిద్దోన్ యుద్ధం తర్వాత దేవుడు తన ప్రత్యక్ష పరిపాలన ఏసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా స్థాపించబోతున్నారు. అదే వెయ్యేళ్ల పరిపాలన! తర్వాత నిత్యత్వంలో ఉండబోతున్నాం. అప్పుడు వెయ్యేండ్ల పరిపాలన మరియు నిత్యత్వంలో ఇశ్రాయేలు జనులు శాశ్వతముగా వారి దేశంలో నాటబడి ఇక తమ ఆశ్రయపురములలోనే తమ ఆశ్రయ స్థలములలోనే కలకాలము జీవించబోతున్నారు! అప్పుడే ఈ ప్రవచనము నెరవేరుతుంది అని గ్రహించాలి!

మనుషులలో శాంతి మరియు నీతి విస్తరించేవాడు ఏసుక్రీస్తు ప్రభువులవారే. యెషయా 9:7 లో అదే చెప్తున్నారు

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

ఇక 11 :4 లో కూడా అదే చెప్తున్నారు

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును.

ఇక లోకంలో సమాధానం, మనసులో శాంతి, హృదయంలో నెమ్మది, దేవుని పట్ల నిశ్చలమైన విశ్వాసం, ఇవి మానవుల యొక్క ప్రయత్నాల వల్ల రావు! రాలేవు కూడా! అది దేవుడే ఇవ్వాలి!

అందుకే కీర్తన 88: 10లో కృపా సత్యములు కలుసుకుంటాయి. న్యాయం శాంతి ఒకదానికొకటి ముద్దెట్టుకుంటాయి అంటున్నారు.

119: 165 లో నీ ఉపదేశాన్ని ప్రేమించే వారికి ఎంతో శాంతి సమాధానం ఉంటుంది అంటున్నారు.

ఇక చివరి రెండు వచనాలు చూసుకుంటే అయినను అరణ్యము ధ్వంసం అయిన్నప్పుడు వడగండ్లు పడతాయి. పట్టణము నిశ్చయముగా కూలిపోతుంది. సమస్త జలముల యొద్దను విత్తనాలు చల్లుచూ ఎద్దులను గాడిదలను తిరగనిచ్చే మీరు ధన్యులు. ఇంతటి ఘోర స్తితిలో ఉన్నా సరే అరణ్యము ధ్వంసమైపోతాది వడగళ్ళు పడతాయి. పట్టణం నిశ్చయముగా కూలిపోవును ఈ పట్టణము నిశ్చయముగా కూలిపోవును. ఇది యెరుషలేము పట్టణము కూలిపోవడం కోసం చెబుతున్నది. టైటస్ పట్టణాన్ని కూల్చేశాడు. మందిరం ఇటుక మీద ఇటుక లేకుండా అయిపోయింది. ఇక మరొక్కసారి ఇది జరగబోతుంది అంత్యదినాలలో మరొకసారి జరగబోతుంది అంటున్నారు!

అయితే చివరి వచనం సమస్త జలముల యొద్దను విత్తనాలు చల్లుచూ ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. సమస్త జలముల యొద్దను అనగా జలములు అనేది లోకము! లోకములో అనేక రకాలైన ప్రజలు ఉన్నప్పుడు విత్తనములు చల్లుచూ, విత్తనము దేవుని వాక్యము, విత్తనము చల్లువారు సువార్త ప్రకటించే వారు మరియు దేవుని సేవకులు!!!

ఎద్దులను గాడిదలను తిరగనిచ్చి మీరు ధన్యులు అనగా ఎద్దులు వలె గాడిదలు వలె తగ్గించుకుంటూ అవమానాలు ఎదురైనా తిరస్కారమెదురైనా భరిస్తూ, భారము మోస్తూ , కన్నీటితో సువార్త చేస్తూ, విత్తనములు చల్లుతూ, సువార్త వ్యాప్తికే ప్రయాసపడుచున్న ఓ సేవకులారా!!! మీరు ధన్యులు అంటున్నారు దేవుడు!!! మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్తిరులును కదలనివారై ఉండమని బైబిల్ చెబుతుంది!

కాబట్టి దైవ సేవకుడా! సువార్త ప్రకటించేవాడా!! భయపడకు!! నీవు ధన్యుడవు!!! ఒకరోజు నిన్ను బళా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలవబోతున్నారు!!!

దైవాశీస్సులు!

ఆమెన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*225వ భాగము*

యెషయా 33:1--6

1. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.

2. యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము.

3. మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.

4. చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ బడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు

5. యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.

6. నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 32వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 33వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం కొద్దిగా అస్సూరు రాజు పొందబోయే శిక్ష కోసము మరికొద్దిగా ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయే సంభవాలు, మరికొన్ని రెండవ రాకడలో సంభవించే సంభవాలు చూడగలం.

మొదటి వచనంలో దోచుకొనక బడకపోయినను దోచుకునే నీకు శ్రమ! నిన్ను ఎవరు వంచించకపోయినా వంచించుచుండు నీకు శ్రమ! నువ్వు దోచుకోవడం మానిన తరువాత నువ్వు దోచుకోబడతావు. నీవు వంచించడం ముగించిన తర్వాత జనులు నిన్ను వంచన చేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుడు అస్సూరు రాజుతో చెప్పిన మాటగా కనిపిస్తుంది.

నిన్ను ఎవరు వంచించకపోయినా దోచుకోకపోయినా నీవే సమస్త దేశాలను దోచుకుంటున్నావ్ సమస్త ప్రజలను వంచన చేసి వారి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నావు! అయితే నీ మీద నా తీర్పు ఏమిటంటే నీవు ఇలా దోచుకోవడం ముగించిన తర్వాత నువ్వు అందరి చేత దోచుకోబడతావ్! నువ్వు వంచన చేయడం ముగించిన తర్వాత జనులందరూ నిన్ను వంచించేస్తారు అని దేవుని తీర్పు ఇక్కడ ప్రకటిస్తున్నారు. గమనించవలసింది ఏమిటంటే వీరు భూలోకంలో ఉన్న అనేక దేశాల మీద దండెత్తి వారిని దోచుకోవడం జరిగింది అయితే అందరినీ వంచించిన ఈ అస్సూరు, బబులోను వారి ద్వారా కొల్లగట్టబడింది దోచుకోబడింది వంచన చేయబడింది సర్వనాశనం జరిగింది. ఇది జరిగిన సంవత్సరం అయితే BC 612!

ఇదక జనరల్ గా అందరినీ చూసుకుంటే ఈ రోజుల్లో ఎవరైతే అందరిని దోచుకుంటున్నారో లంచాల పేరుతో గాని, రాజకీయం పేరుతో గాని, మరి ఏదో రూపంగా ఎవరైతే అందరిని దోచుకుంటున్నారో, వంచన చేయడం చేస్తున్నారో మీరు దోచుకోవడం ముగించిన తర్వాత, వీరి బలత్కారం ముగిసిన తర్వాత దేవుడు హఠాత్తుగా వారి మీదకి ఉగ్రత కురిపిస్తాడు. ఆరోజు వీడు దోచుకోబడతాడు ప్రజల చేత వంచించబడతాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను ఎవరైనా దోచుకుంటున్నారా ఒకరోజు దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు లేదా నీవే దోచుకుంటున్నావా నువ్వు దోచుకోబడతావు. నీవు చేసినట్టుగా నీకు జరుగుతుంది నువ్వు ఏం చేసావో అదే విధంగా నీకు జరగబోతుంది అని మర్చిపోకు!!!

ఇక రెండో వచనం చూసుకుంటే ఒక ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఇది ప్రజలందరూ చేయవలసిన ప్రార్థన! యెహోవా నీ కొరకు కనిపెడుతున్నాము దయచేసి మా యందు కనికరం చూపు! ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలంలో మాకు రక్షణగాను ఉండు ప్రభువా అని ప్రార్థిస్తున్నారు!! ఇక్కడ మాయందు కనికరము చూపు అనడమే కాకుండా ఉదయకాలమందు వారికి దయ చూపండి! అంటే ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వారికి సహాయం చేయండి అదే సమయంలో మాకు ఎప్పుడైతే ఆపత్కాలము ఎదురవుతుందో వెంటనే మాకు సహాయం చేయండి అని భక్తుడు ప్రజలందరి తరఫున దేవుని కోరుకుంటున్నారు!! ఇలాంటి ప్రార్థన నీవు నేను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ చేయవలసిన ప్రార్థన ఇది.

ఇక మూడు నాలుగు వచనాలు చూసుకుంటే మహా ఘోషను విని జనములు పారిపోవును నీవు లేచుట తోటే అన్యజనులు చెదిరిపోదురు చీడపురుగులు కొట్టివేనట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపోవునట్లు శత్రువులు దానిమీద పడతారు యెహోవా మహా ఘనత నొంది ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించును న్యాయంతోను నీతితోను సీయోనుని కప్పును.

ఇక్కడ మూడు నాలుగు ఐదు వచనాలు చూసుకుంటే ఇది ఇశ్రాయేలు యొక్క విరోధులకి దేవుడు చేయబోయే శిక్ష. రెండవ వచనంలో వారికి బాహువుగా ఉండి రక్షించు, మాకు ఆపత్కాలంలో సహాయంగా ఉండు అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రజలకు శిక్షిస్తున్న అస్సూరు వారి మీద దేవుడు తీర్పు తీరుస్తున్నారు. మహాఘోష విని జనములు పారిపోతారు అనగా కేవలం అస్సూరు వారు మాత్రమే కాదు ఎంతమంది శత్రువులు ఇశ్రాయేలుని ముట్టడి కట్టి బాధించారో, దేవుడు తీర్పు తీర్చే దినాన్న వారంతా పారిపోతారు అంటున్నారు. 30: 30 ,31 వచనాలు కూడా అదే కదా చెప్పారు దేవుడు. యెహోవా గంభీరమైన తన స్వరాన్ని వినిపిస్తారు ప్రచండ కోపంతో నాశనకరమైన మంటలతో పెలపెల్లమనే గాలి వానతో వడగండ్లతో తన చేయి చాపడం జనాలకు చూపిస్తాడు. యెహోవా స్వరానికి అస్సూరు మహా భయం చెందుతుంది ఆయన దానిని తన దండంతో ముత్తుతాడు అని 30వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది.

Isaiah(యెషయా గ్రంథము) 30:30,31,32

30. యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.

31. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

32. యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును.

సంఖ్యాకాండం 10: 35 లో కూడా అదే చెప్పారు దేవుడు.

సంఖ్యాకాండము 10:35

ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.

కీర్తనలు 46:6

జనములు ఘోషించు చున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.

68: 1,32,33 వచనాలు చూసుకుంటే దేవుడు చేయి చాపగా దేవుని శత్రువులు పారిపోతారు. జనులందరూ పారిపోతారు అంటే కేవలం అస్సూరే కాకుండా ఇతర జనులు కూడా దేవుడు గర్జించినప్పుడు పారిపోతారు.

Psalms(కీర్తనల గ్రంథము) 68:1,32,33

1. దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారి పోవుదురు గాక.

32. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)

33.అనాదిగానున్న ఆకాశాకాశ వాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.

అయితే నాలుగో వచనం బాగా చూసుకుంటే చీడపురుగులు కొట్టినట్లు మీ సొమ్ము దోచపడుతుంది. ఇదే స్టడీ బైబిల్ లో చూసుకుంటే చీడపురుగులు పాడు చేసినట్లు మీరు దోచుకున్న సొమ్ము దోచబడుతుంది. మొదటి వచనంలో ఎవరూ దోచుకోకపోయినా అందరిని దోచుకుంటున్న నీకు శ్రమ అన్నారు కదా ఇప్పుడు ఆ దోచుకున్న సొమ్ము దోచుకోబడుతుంది. అవును నిజానికి బబులోను వారు పూర్వం 612 నుండి 609 వరకు దండెత్తినప్పుడు అస్సూరుని నిలువు దోపిడీ చేసేసారు. వారు దోచుకున్న సొమ్ముతో పాటు అస్సూరువారి సొమ్ము కూడా దోచుకుని పోయారు. నిజానికి ఇది తప్పకుండా జరిగింది.

ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోను సీయోనుని నింపారు. దేవుడు తన బిడ్డలను ఆదరించిన తర్వాత నీతి న్యాయాలతో సీయోనుని కప్పారు. గమనించండి ఇది అంత్యకాలంలో జరగబోయే సంభవం. ఏమండీ ఇది అంత్యకాలంలో జరగబోయే సంభవము అని ఎలా చెప్పగలవు అని అడగొచ్చు ఎందుకంటే ఒకటో అధ్యాయంలోని అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయిపోయింది అది ఒకప్పుడు నీతి న్యాయంతో నిండి ఉండేది ఇప్పుడు దాంట్లో నరహంతకులు కాపురం ఉన్నారు అని దేవుడు ఒకటో అధ్యాయంలో బాధపడ్డారు. అయితే 32 వ అధ్యాయంలో ఒకటో వచనంలో దేవుడు వాగ్దానం చేసారు. రాజు ధర్మసమ్మతంగా న్యాయముగా పరిపాలన చేస్తారు నీతితో పరిపాలిస్తారని కాబట్టి ఇప్పుడు దేవుడు స్థాపించే ఆ నిత్య రాజ్యంలో నీతి మరియు న్యాయము అక్కడ నివాసం చేయబోతుంది. నీతి మరియు నిజాయితీతో న్యాయముతో దేవుడు సీయోను అనగా యెరుషలేమును కప్పబోతున్నాడు. అలాగే సంఘమును నీతి మరియు న్యాయముతో నిజాయితీతో దేవుడు నింపబోతున్నారు. ఇది జరగబోయే విషయం!!!

యెషయా 32:1

ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

ఇక 6వ వచనం చూసుకుంటే నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి యోజన కలుగును. యెహోవా భయమే వారికి ఐశ్వర్యము అంటున్నారు.

దేవుడే మీ కాలానికి అనగా ఆ కాలం అనగా వెయ్యేళ్ల పరిపాలనలో సుస్థిరమైన ఆధారంగా ఉంటాడు దేవుడే రక్షణ మరియు బుద్ధి మరియు జ్ఞానము సమృద్ధిగా ఉంటారు అంటే దేవుడే రక్షణగా దేవుడే మనుషులకు బుద్ధిగా జ్ఞానముగా ఉండబోతున్నారు. ఇక్కడ ఆయన అనగా అభిషక్తుడు భవిష్యత్తులో చేసే పరిపాలనలో జరగబోయే సంభవము. నిజమైన విశ్వాసి తన జీవితానికి పునాదిగా దేవుడు మాత్రమే ఉంటాడు. రక్షణ జ్ఞానం అనిపించుకోవడానికి యోగ్యుడైన వాడు ఆయనే. ఆయననుండే నీతి మరియు విజ్ఞానము కలుగుతుంది. అందుకే 11వ అధ్యాయం రెండవ వచనంలో ఆయన మీద యెహోవా ఆత్మ నిలిచి ఉంటాడు ఆ ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైన ఆత్మ, ఆలోచన మరియు బలం ఇచ్చే ఆత్మ, తెలివి ఇంకా యెహోవా పట్ల భయభక్తులు కలగజేసే ఆత్మ. అతడు ఏసుక్రీస్తు ప్రభువుల వారి మీద ఉండబోతున్నారు. అదే ఆత్మ మనలను కూడా ఆవరించబోతుంది . ఇదే విషయాన్ని 1కొరింథీ 1: 30,31 వచనాల్లో పౌలు గారు చెప్తున్నారు. అయితే మీరు ఆయన ద్వారా క్రీస్తు యేసు లో ఉన్నారు ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానము నిర్దోషత్వము పవిత్రత విమోచన అయ్యాడు ఇందువల్ల రాసి ఉన్న దాని ప్రకారము అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని దృష్టిలో ఐశ్వర్యం అంటే అది దేవుని యందుని భయభక్తులే. అదే ఐశ్వర్యం సామెతలు ఒకటి ఏడులో యెహోవాయందలి భయభక్తులు కలిగియుంటే తెలివికి ప్రారంభము. మురుకులు జ్ఞానాన్ని తప్పించుకుని నిరాకరిస్తారు అని రాయబడి ఉంది.

ఇక 7 నుంచి 14 వచనాల్లో ఒక ప్రత్యేక విషయం కోసం రాస్తున్నారు వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధానపరిచే రాయబారులు ఘోరంగా ఏడుస్తున్నారు రాజ మార్గాలు పాడైపోయాయి త్రోవను నడుచు వారు లేకపోయారు ఎందుకంటే అస్సూర నిబంధన మీరును పట్టణాలను అవమానపరిచెను నరులను త్రుణీకరించిన దేశము దుఃఖించి క్షీణించిపోతుంది సిగ్గుపడి వాడిపోతుంది అంటున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 33:7,8,9,10,11,12,13,14

7. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు.

8. రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన పరచెను నరులను తృణీకరించెను.

9. దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొను చున్నవి.

10. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.

11. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది.

12 .జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.

13. దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.

14. సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివసించును?

ఇది అస్సూరు దండెత్తినప్పుడు లేదా బబులోను వారు దండెత్తినప్పుడు జరిగే సంభవంగా కనిపిస్తుంది. అప్పుడు వారిలో శూరులు అనగా ఇశ్రాయేలు వారి యోధులు వారి శూరులు బయట రోదనం చేస్తారు. సమాధానం చేద్దామనే వాళ్ళు ఘోరంగా నిట్టూరిస్తున్నారు అంటున్నారు. రహదారులు విడిచిపెట్టబడ్డాయి అప్పుడు వారు నడచేటప్పుడు త్రోవలలో బాటసారి అనగా నడిచే వారే లేరు. సంది భంగమైంది అనగా ఇస్రాయేలీయులకు సిరియా దేశానికి, ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశానికి ఉన్న సంధి భంగమైపోయింది ఎవరి వల్ల అస్సూరురాజు వల్ల. ఇక పట్టణాలు తృణీకారానికి గురయ్యాయి. అస్సూరురాజు ఇప్పుడు ఇతరులు అంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అందువల్ల దేశం అంతా దుఃఖిస్తూ ఉంది. క్షీణిస్తూ ఉంది. సమాధానం చేసేవారు సంధి చేసేవారు సిగ్గుపడిపోయారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే లెబానోను సిగ్గుపడి వాడి పోతుంది ఇక్కడ లెబానోను అనగా గతభాగాలలో చెప్పినట్లు ఆ కాలంలో లెబానోను ఇశ్రాయేలీయులో ఒక భాగం .ఇది మంచి బలమైన చెట్లు వ్యవసాయము బాగా ఉండేది అనగా వ్యవసాయము మంచి మంచి చెట్లు అన్ని సిగ్గుపడి పోతుంది. షారోను ఎడారి అయిపోతుంది షారోను అనగా అది ఒక లోయ పంటలు బాగా పండే లోయ. దీంట్లో షారోనులో షారోను పువ్వులు పూసే ఎంతో అందమైన వనములు. ఇవన్నీ ఎడారి అయిపోతుంది. భాషాను కర్మెలు రెండు పర్వతాల మీద చెట్లు వాడిపోతున్నాయి. ఎందుకంటే వారి కాసిన ముట్టడి దెబ్బ వల్ల.

ఇక 10 నుంచి 14 వచనాలు చూసుకుంటే అప్పుడు దేవుని సమాధానం కనపడుతుంది. దేవుడు ఏమంటున్నాడు అంటే నేను ఇప్పుడే లేస్తాను ఇప్పుడే నన్ను గొప్పగా చేసుకుంటాను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకుంటాను. మీరు అనగా శత్రువులు అస్సూరు బబులోను గాని ఏదైనా శత్రువులు ఇశ్రాయేలీయులు ముట్టడి కట్టిన ఈ శత్రువులు , మీరు పొట్టును గర్భం ధరించి కొయ్య కాలు కంటారు . మీ ఊపిరే మీకు అగ్ని అయినట్టు ఉంటుంది. పొట్టు అనగా మన ధాన్యం పట్టు అనుకోవచ్చు గర్భం ధరించి వరిగడ్డిని కంటారు. మీ ఊపిరి మీకు మంటవలే మిమ్మల్ని దహించి వేస్తుంది. ఇంకా జనములు కాలుచున్న సున్నపుబట్టి వలె నరకబడి అగ్నిలో కాల్చబడే ముల్లులాగా అయిపోతారు. కాబట్టి 13,14 వచనాలలో ఏమంటున్నారంటే దూరస్తులు దూరంగా ఉన్న జనులారా ఆలకించండి, ఇలాగ దేవుడు పిలవడం మనం మొదటి అధ్యాయంలో కూడా చూడగలము. ఆకాశమా ఆలకించు భూమి చెవియగుము అని పిలుస్తున్నారు. ఇక 34వ అధ్యాయంలో కూడా దేవుడు పిలుస్తున్నారు దూరములో ఉన్న వారు దగ్గరకు వచ్చి వినండి, లోకంలోని సమస్త జాతుల్లారా ఆలకించండి భూమి మీద ఉన్నదంతా మీరు తప్పకుండా వినండి అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా దూరంగా ఉన్నవారలారా వినండి, ఏంటంటే ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు తెలుసుకోండి సీయోనులో ఉన్న పాపులు హడలిపోతున్నారు భయభక్తులు లేని వారంతా వణికిపోతున్నారు. మనలో ఎవడు దహించే మంటతో, నిత్యము దహించే అగ్నితో నివసించగలడు, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును అంటున్నారు కదా!! అనగా సీయోనులో ఉన్న పాపుల మీదకి దేవుడు లేస్తున్నాడు! అస్సూరు వారి దాడి సమయంలో ఇశ్రాయేలు వారికి రక్షణ అయితే కలిగింది అయితే ఇప్పుడు సీయోనులో ఉన్న పాపులు ఎక్కడి నుంచి వచ్చారు?

ఇది తప్పకుండా ఇది రెండవ రాకడలో జరిగే సంభవమే అనిపిస్తుంది. రెండో రాకడలో సీయోనులో ఉన్న పాపుల మీదకి దేవుడు లేస్తారు. ఈ యుగాంతములో దేవుడు పాపులందరినీ చెదరగొడతారు కాబట్టి ఇది జెకర్యా 14:2,3 వచనాల్లో జరిగే సంభవము లాగా ఉంది

Zechariah(జెకర్యా) 14:2,3

2.​ ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

సీయోనులో పాపులంటే ఏమి కాదు హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులంతా వచ్చి సీయోను అనగా యెరుషలేముని ముట్టడిస్తారు. అప్పుడు నగరాన్ని పట్టుకుంటారు దోచుకుంటారు స్త్రీలను చెరుపుతారు. యెరుషలేములో సగం మందిని బందీలుగా తీసుకొని పోతారు. మిగిలినవారు యెరూషలేములో ఉంటారు. అప్పుడే దేవుడు యుద్ధ కాలంలో లేచి యుద్ధం చేసినట్టు ఆయన నిలుస్తారు ఈ సంభవం కోసమే ఇక్కడ చెప్తున్నారు. పది నుంచి 14 వచనాలు ఇది రెండవ రాకడలో భూమి మీద దేవుడు రెండోసారి కాలు పెట్టే సంభవం కోసమే ఈ వచనాలు వ్రాయబడి ఉన్నాయి అని గ్రహించాలి!!!

ఆ రోజు దేవుడు ఒలివల కొండమీద కాలు పెట్టి శత్రువులతో యుద్ధం చేసి వారిని నాశనము చేయబోతున్నారు దుష్టులకు తీర్పు తీర్చబడబోతుంది!

ప్రియ చదువరీ! ఆయన త్వరలోనే రాబోతున్నారు!

మరి నీవు సిద్దమా?!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*226వ భాగము*

యెషయా 33:14--16

14. సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును?

15. నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.

16. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 33వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

ఇక 15వ వచనం చూసుకుంటే నీతిని అనుసరించి నడుచుచు యదార్ధముగా మాట్లాడుచూ నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుచుకొని, హత్య అనే మాట వినకుండా తన చెవులు మూసుకుని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసిస్తాడు. 16వ వచనం పర్వతములోని శిలలు అతనికి కోటగా ఉంటాయి తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉంటాయి అంటున్నారు. ఇంతకీ ఇలా అనడానికి కారణం ఏమిటంటే 14వ వచనములో ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు భక్తిహీనులకు వణుకు పుట్టింది మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అని అడిగారు కదా! దానికి సమాధానం ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఎవరు నివసిస్తారు అంటే మొదటగా నీతిని అనుసరించి నడిచేవాడు ఎలా నడవాలి అంటే యదార్థముగా నడవాలి, నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షించుకోవాలి. అనగా ఎవరో ఒకరిని చెరపట్టి నిర్బంధించి వచ్చే లాభము అనగా ప్రస్తుతం మన వాడుక భాషలో చెప్పాలంటే ఎవర్నో ఒకరిని కిడ్నాప్ చేసి లేకపోతే బెదిరించి డబ్బులు లాక్కోవడం! ఇలాంటి పనులు చేయకూడదు! లంచము అనేది పుచ్చుకోకుండా తన చేతుల్ని మలుపుకోవాలి! అనగా లంచము లేని చోట్లకు మలుపు కోవాలి! నీతి న్యాయం వైపు మలుపుకోవాలి! ఇక హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకోవాలి అనగా హత్య చేయకూడదు అలాంటి మాటలు కూడా వినకుండా దూరంగా పోవాలి. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు, చెడు వినడమే కాదు చెడు చూడడం కూడా చూడకుండా కన్నులు మూసుకుని ఏదైతే చెడు అని పిలవబడుతుందో దానికి దూరంగా పోవాలి.

ఇలాంటి వాడు ఉన్నత స్థలమున నివసించును! ఇది చదువుతున్నప్పుడు మనకి కీర్తనల గ్రంథంలో రెండు అధ్యాయాలు గుర్తుకొస్తాయి కీర్తన 15వ అధ్యాయము, 24 వ అధ్యాయం! ఈ రెండు అధ్యాయంలోని యెహోవా పర్వతమందు నివసించేవాడు ఎవడు, గుడారమందు అతిధిగా ఉండదగినవాడు ఎవడు? పరిశుద్ధ యధార్థమైన మనసు కలిగి హృదయపూర్వకముగా నిజం పలికే వాడే. ఇవన్నీ మనం చదువుకున్నాం! మరొకసారి చూసుకుందాం!

Psalms(కీర్తనల గ్రంథము) 15:1,2,3,4,5

1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

3. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు

4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

5. తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

24 అధ్యాయంలో యెహోవా కొండపైకి ఎక్కిపోగలవాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థానంలో నిలిచి ఉండగలిగే వాడెవడు నిరపరాధమైన చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి ఉన్నవాడే అని మనకు ఈ రెండు అధ్యాయాలు కనిపిస్తాయి.

Psalms(కీర్తనల గ్రంథము) 24:3,4,5

3. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?

4. వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.

5. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.

కాబట్టి ఇలాంటి వాడే ఆ నిత్య రాజ్యంలో యెహోవా పర్వతము అని పిలువబడే ఆ నిత్య రాజ్యంలో, నిరంతరము ప్రభువుతో పాటు జీవించగలడు! నిత్యము వెలుగుచుండే అగ్ని, నిత్యము దహించు అగ్ని, నిత్యము కాల్చుచున్న అగ్ని ఆ దేవుడే! నీవు ఇవి పాటించినప్పుడు నీవే అగ్నిగా మారుతావు! ఆ అగ్నిగా మారి నిజమైన అగ్నితో కలిసి జీవించగలవు!

నిజమైన విశ్వాసులంతా తమ పవిత్ర దేవుని పవిత్ర సన్నిధానంలో నివసించగలిగేలా దేవుడు తప్పకుండా చేస్తారు. అయితే అటువంటి దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అనే ఆశ నీకు ఉందా?!

ఆశ నీకు ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని తీర్చగలడు ఎందుకంటే ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయం 3 నుంచి 6 వచనాలు, 5:25, 26, 27 వచనాలు దీన్నే చెప్తున్నాయి.

Ephesians(ఎఫెసీయులకు) 1:3,4,5,6

3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

Ephesians(ఎఫెసీయులకు) 5:25,26,27

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

ఇప్పుడు ఎప్పుడైతే అలాగా మనం ఉంటామో, అలాంటి వారికి దేవుని పర్వతం మీద, పరిశుద్ధ పర్వతములలో శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.

అట్టి విధముగా దేవుని సన్నిధిలో మనం నివాసం చేద్దాం!

పవిత్రమైన హృదయము నిర్దోషమైన చేతులు చెడుతనము చూసి కళ్ళు మూసుకుంటూ దూరముగా పారిపోయే స్వభావం కలిగి దేవునితో కలిసి నడుద్దాం!

అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!!

ఆమెన్!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*227వ భాగము*

యెషయా 33:17--21

17. అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.

18. నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?

19. నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.

20. ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.

21. అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 33వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

ఇక 17వ వచనం చూసుకుంటే అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు బహుదూరమునకు వ్యాపించుచున్న దేశం మీకు కనబడును జాగ్రత్తగా పరిశీలన చేస్తే 17 నుంచి 24 వచనాలు వరకు మరల 1000 ఏళ్ల పరిపాలన లేదా ఏసుక్రీస్తు ప్రభువులవారి ప్రత్యక్ష పరిపాలన భూమి మీద కనిపిస్తుంది. అలంకరింపబడిన రాజు అనగా అది ఏసుక్రీస్తు ప్రభువుల వారే! ఆయనను నువ్వు ప్రత్యక్షంగా చూడబోతున్నావు! ఈ భాగంలో కనబరచిన ఈ మాటలు గతంలో ఎక్కడా నెరవేరలేదు. ఇది కేవలం ఇది అంత్య దినాల్లో మాత్రమే నెరవేరుతాయి. యెషయా గారి కాలం నుండి ఇంతవరకు యెరుషలేముకి ప్రశాంతత నెమ్మది అనేది ఇంతవరకు జరగలేదు. ఎన్నోసార్లు యెరుషలేము నేలమట్టం అయిపోయింది. కాబట్టి ఇది అంత్య దినాలలో జరగబోయే సన్నివేశము అని గ్రహించాలి!

ఇక్కడ కనబడే రాజు యేసు క్రీస్తు ప్రభువు వారే!

యెషయా 6:5

నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

Isaiah(యెషయా గ్రంథము) 9:6,7

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

Isaiah(యెషయా గ్రంథము) 11:1,2,3,4,5,6,7,8,9

1. యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

2. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4.వకంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

యెషయా 24:23

చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.

యెషయా 32:1

ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

ఇక 18వ అధ్యాయం 18 వ వచనం చూసుకుంటే నీ హృదయము భయంకరమైన వాటిని ధ్యానించును జనసంఖ్య రాయు వాడు ఎక్కడున్నాడు? తూచువాడు ఎక్కడున్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడున్నాడు? ఈమాట ఎవరికోసం చెప్పబడుతుంది అంటే ఆర్మెగిద్దోన్ యుద్ధంలో యెరూషలేము చుట్టూ ముట్టడి దిబ్బ కట్టిన శత్రు సైన్యాలను ఉద్దేశించి ఈ మాట చెబుతుంది. నీ హృదయంలో భయంకరమైన వాటిని నువ్వు అనుకున్నావు జన సంఖ్య వ్రాయువాడు ఎక్కడున్నాడు, తూచేవాడు ఎక్కడున్నాడు, బురుజులను లెక్కించేవాడు ఎక్కడున్నాడు? మీరంతా ఎక్కువగా ముట్టడిదిబ్బ కట్టి యెరూషలేమును సమూల నాశనం చేయాలని అనుకుంటున్నారు. అయితే దేవుడు వారిని ఇప్పుడు నాశనం చేసేసారు యుద్ధంలో! కాబట్టి ఇప్పుడు జనసంఖ్య వ్రాసే వాడే లేడు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టేవాడు లేడు జనాభా లెక్కించేవాడు కూడా లేడు. అందుకే 19వ వచనంలో నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాష, నీకు తెలియని అన్య భాష పలికే ఆ జనమును నీవికను చూడవు అని దేవుడు చెప్తున్నారు! యుద్ధంలో- యుద్ధానికి వచ్చిన సైన్యమును దేవుడు ఇప్పుడు నాశనం చేసేసారు కాబట్టి ఇక నీ వెరుగని భాష మాట్లాడేవారు గానీ, నాగరికత లేని చదువు లేని ఆ జాతి వారిని ఇంక నీవు ఎప్పటికీ చూడవు అంటున్నారు!

ఇదే మాట, ఇలాంటి మాటే దేవుడు మోషే గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రపు ఆవలి గట్టున చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే గారి నాయకత్వంలో చెర విముక్తి చేసి కానాను యాత్ర చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రపు ఒడ్డు దగ్గరకు రాబోయేసరికి వెనకనుంచి ఐగుప్తు దేశపు సేన వెంటాడుకుంటూ వస్తుంది, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు. వెంటనే దేవుడు ప్రజలతో అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలారా మీరు భయపడొద్దు! ఈరోజు చూస్తున్న ఈ ఐగుప్తీయులు మీకు ఎప్పటికీ కనబడరు!! ఇక ఈ ఐగుప్తీయులు మీరు ఎప్పటికీ చూడరు అని దేవుడు వాగ్దానం చేశారు!!! ఇదే వాగ్దానం యూదా రాజులకు కూడా దేవుడు రెండు సార్లు చేశారు!!!

కాబట్టి 1000 ఏళ్ల పాలనలో ఇశ్రాయేలీ ప్రజలు యూదులు ఎప్పటికీ శత్రువులు అనగా అష్షూరు వారిని గాని బబులోను వారిని చుట్టుపక్కన శత్రువులు గాని దండెత్తడం ఎప్పటికీ జరగదు. ఈ విషయాన్ని దేవుడు చెబుతున్నారు.

ఇక 20 వ వచనం చూసుకుంటే ఉత్సాహకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణాన్ని చూడు. నిమ్మల మైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరుషలేమును చూచును, దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాన్ని తాళ్లలో ఒక్కటైనను తెగిపోదు ఎందుకంటే అక్కడ యెహోవా ప్రభావం గలవాడై మన పక్షాన ఉన్నాడు. కాబట్టి గుడారము ఎప్పటికీ తీయబడదు. గుడారం యొక్క మేకులు ఊడదీయబడదు. దానికి ఎప్పుడూ దేవుడు కాపలాగా ఉంటారు అని ఇక్కడ చూడగలం!!!

ఇంకా అది విశాలమైన నదులు కాలువలు ఉన్న స్థలముగా ఉండును. తెడ్లు వేసి నడిపే ఓడ ఏది అక్కడ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. వెయ్యండ్ల పాలనలో ఇక ఇశ్రాయేలు ప్రజలు ఇక ఎప్పుడు కదల్చబడరు! నిజానికి ఇంతవరకు ఈ ప్రవచనం నెరవేరలేదు! ఈ ప్రవచనం ఇంతవరకు నెరవేరలేదు ! అది హార్మెగిద్దోన్ యుద్ధం తర్వాత నెరవేరిపోతుంది. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధాలు చేయబోతున్నారు. అప్పుడు ఇక ఇశ్రాయేలు ప్రజలు కదిలించబడరు! గుడారము మేకు తీయబడదు అనగా ఇక ఎప్పటికీ వారు కదల్చబడరు అని అర్థము! ఇంకా ఏమంటున్నారంటే తెడ్లు వేసే ఓడ ఒకటి కూడా నీకు కనబడదు! ఓడలలో తెడ్లు వేసే ఓడలు ఇప్పుడు లేవు ఆ కాలంలో తెడ్లతో నడిచే ఓడలు తెరచాపలతో నడిచే ఓడలు ఉండేవి. ఇప్పుడు అన్ని ఇంజిన్ తో నడిచే ఓడలే మనం చూడగలం!!

మిమ్మల్ని దండెత్తడానికి మీతో యుద్ధము చేయడానికి ఎవరూ రారు ఎందుకంటే యెహోవాయే నాయకుడిగా ఉండి తన ప్రజలను కాపాడుతారు.

ఇక నదులు కాలువలు ఉన్న స్థలమై ఉంటుంది. ఏది? యెరుషలేములో ప్రస్తుతానికి నదువులు గాని కాలువలు గాని ఏవి లేవు ఎందుకంటే అది కొండల మీద కట్టబడిన పట్టణము. దానిలో నదులు గాని కాలువలు గాని పారడం లేదు. అయితే ఏసుక్రీస్తు ప్రభువుల వారు తన రెండో రాకడలో యెరుషలేము దగ్గరలో ఉన్న ఒలీవల కొండమీద కాలు పెట్టిన వెంటనే ఒలీవల కొండ రెండుగా చీలిపోయి నదులు ఏర్పడినట్లు మనము జెకర్యా 14 వ అధ్యాయంలో చూడగలము. అంతేకాకుండా యెహే 47 అధ్యాయంలో కూడాను వెయ్యేండ్ల పాలనలో యెరుషలేము నుంచి నది పారునట్లు చూడగలం.

Ezekiel(యెహెజ్కేలు) 47:1,2,3,4,5,6,7,8,9,10,11,12

1.'అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని... వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణ ముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారుచుండెను,

2. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.

3. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.

4.​ ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.

5.​ ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.

6. అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.

7. నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.

8. అప్పుడాయన నాతో ఇట్లనెనుఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశ మునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.

9. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదు కును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

10. మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తార ముగా నుండును.

11. అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.

12. నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.

Zechariah(జెకర్యా) 14:4,5,8,9

4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

5. కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

8. ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.

9.​ యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

ప్రియ సహోదరీ సహోదరుడా! ఇది యేసయ్య రెండవ రాకడలో ఈ భూమిపై కాలు పెట్టినప్పుడు జరగబోయే సంభవం! నీవు ఏ గుంపులో ఉన్నావు? రాకడలో తీర్పుదినాన్న దహించే అగ్నిలో దహించబడే విధముగా ఉన్నావా? రాకడలో ఎత్తబడి దేవుని శత్రువులతో యుద్ధము చేసే గ్రూపులో ఉన్నావా? ఏది కావాలో పరిశీలన చేసుకుని నిర్ణయం చేసుకో!

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*228వ భాగము*

యెషయా 33:22--24

22. యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

23. నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.

24. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 33వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము.

(గతభాగం తరువాయి)

ఇక 22వ వచనం చూసుకుంటే యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

ఈ వచనంలో దేవుడు నాలుగు రకాలుగా వెయ్యేళ్ల పరిపాలనలో తన పాలన కొనసాగిస్తారు!

మొదటిది యెహోవా మనకు న్యాయాధిపతి! రెండు యెహోవా మన శాసనకర్త! మూడు యెహోవా మన రాజు! 4 ఆయన మనలను రక్షించును అనగా రక్షకుడు!!!

మొదటగా యెహోవా దేవుడే న్యాయాధిపతిగా జడ్జిగా ఆయన ఉండబోతున్నారు

యెషయా 2:4

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

యెషయా 11:4

కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

John(యోహాను సువార్త) 5:22,23

22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

అపో.కార్యములు 10:42

ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.

రెండవది యెహోవా మన శాసనకర్త అనగా శాసనాలు చేసే దేవుడు!!!

యెషయా 2:3

ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

యెషయా 51:4

నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ మింతును.

యాకోబు 4:12

ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్వరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

ఇక యెహోవా మన రాజు! దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!!

వ 17; యెషయా 9:7; 24:23; 32:1.

చివరిగా యెహోవా మన రక్షకుడు. దీనికోసం కూడా విస్తారంగా ధ్యానం

చేసుకున్నాము!!

యెషయా 25:9

ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

యెషయా 45:22

భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

యెషయా 45:23

నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

యెషయా 45:24

యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

ఇక 23 వచనంలో నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు అని అందులో నివసించే వారెవరు చెప్పరు జనుల దోషము పరిహరించబడింది ఇది కూడా వెయ్యేళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధము తర్వాత జరిగే సంభవం. నీ ఓడ అనగా బహుశా ఇవి శత్రు సైన్యాలు యొక్క ఓడలు కావచ్చు. అవి యెరూషలేమును జయించలేని ఓడల్లాగా అయిపోతాయన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు వచనంలో యెహోవాయే వారికి రక్షకుడుగాను కాపుకాసేవాడు గాను ఉన్నాడని ప్రజలు నమ్మకాన్ని వెళ్ళబుచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు శత్రువులు వాళ్లను ఓడించడం ద్వారా దీనిని సాధిస్తారు అని అర్థమవుతుంది. తర్వాత దోపుడు సొమ్ము విస్తారమైన దోపుడు సొమ్ము విభాగించబడును. దానిని కుంటివారే పంచుకుంటారు.

ఆ దోపిడు సొమ్ము ఆలోచిస్తే యెరుషలేము మీదకి శత్రువులు దండించినట్లు యెరూషలేము చుట్టూ దండు దండ్లు ముంచిత్తునట్లు మనం చూడగలం గోగుమాగోగు యుద్ధంలో ఇలా వచ్చిన శత్రువులు దేవుడు ఓడించినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు వారికి పుష్కలంగా దోపుడు సొమ్ము దొరుకుతుంది. దాన్ని కొల్లగొట్టడం చాలా తేలిక కాబట్టి కుంటివారే ఏ కష్టము లేకుండా దానిలోదంత సొమ్మును దోచుకుంటారు! యెహేజ్కేలు గ్రంథం 39: 9--10 వచనాలు దీన్నే చెబుతున్నాయి.

Ezekiel(యెహెజ్కేలు) 39:9,10

9. ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.

10. వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్ల పెట్టినవారి సొమ్ము తామే కొల్ల పెట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

ఇక చివరిగా నాకు జబ్బు చేసింది వ్యాధి వచ్చింది దేహంలో బాగోలేదు అని కానీ ఆ వెయ్యేల పరిపాలనలో కూడా ఎవరు అనరు ఎందుకంటే దేవుడు జనులు యొక్క దోషాన్ని పరిహరించేసారు కాబట్టి అక్కడ వ్యాధి బాధ అలాంటివి ఏమి ఉండవు. నిత్యము సంతోషంతో ఆనందంతో ప్రభువును స్తుతించడమే ఉంటుంది ! దీనికోసం ప్రకటన గ్రంధంలో వివరంగా వ్రాయబడింది.

Revelation(ప్రకటన గ్రంథము) 21:3,4,6

3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

6. మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

Revelation(ప్రకటన గ్రంథము) 22:2,3,4

2. ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట (లేక, బయలువెడలుట) ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.

3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

మరి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని ఆశిస్తున్నావా!!! అయితే ఆత్మానుసారమైన జీవితం సాక్షార్థం అయిన జీవితం పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!!

Revelation(ప్రకటన గ్రంథము) 22:17,20,21

17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

20. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

21. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు(కొన్ని ప్రాచీన ప్రతులలో, పరిశుద్ధులకందరికి అని పాఠాంతరము) తోడై యుండును గాక.

ఆమేన్‌.!

*యెషయా ప్రవచన గ్రంధము*

*229వ భాగము*

యెషయా 34:1--3

1. రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.

2. యెహోవా కోపము సమస్త జనములమీదికి వచ్చుచున్నది వారి సర్వ సైన్యములమీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను.

3. వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 33వ అధ్యాయము ధ్యానం చేసుకున్నాము. ఇక 34వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! ఈ 34వ అధ్యాయంలో యెహోవా దినము మరియు హార్మెగిద్దోన్ యుద్ధం తర్వాత జరిగే సన్నివేశాలు మరియు గోగుమాగోగు యుద్ధం తర్వాత జరిగే సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఇంకా దేవుడు ఆ తీర్పు తీర్చే సమయంలో యెహోవా దినములో ఎదోము ప్రాంతంలో జరిగే సన్నివేశాలు కూడా ఈ అధ్యాయంలో కనిపిస్తాయి.

మొదటి వచనంలో రాష్ట్రము లారా నా యొద్దకు వచ్చి వినుడి. జనములారా చెవియొగ్గి ఆలకించుడి! ఇంకా భూమి దాని సంపూర్ణతయు లోకము దానిలో ఉన్నదంతా వినును గాక అంటున్నారు అనగా ఈ మొదటి వచనం దేనికి నేపథ్యంగా ఉందంటే దేవుడు ఏదో తీర్పు చేయబోతున్నారు, అంతా జాగ్రత్తగా వినండి అని చెప్పినట్టు ఉంది! ఇక్కడ గమనించాలి మొదటి అధ్యాయంలోనే ఆకాశమా ఆలకించు భూమి చెవియోగ్గుము అని మొదలుపెట్టి, నేను పిల్లలను పెంచి, గొప్ప వారిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటూ దానికి ఉపోద్ఘాతం చెప్పి, దేశాల మీదకు జరిగే తీర్పు, యూదుల మీద జరిగే తీర్పు, ఇశ్రాయేలుకి జరిగే తీర్పు, యెహోవా దినము, ఇశ్రాయేలు రక్షణ ప్రణాళిక, యేసు క్రీస్తు ప్రభువుల వారి మొదటి రాకడ, రెండో రాకడ, వెయ్యేళ్ల పరిపాలన ఇవన్నీ చెప్పుకుంటూ ఎలాగ వెళ్తున్నారో అలాగే ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా మీరు జాగ్రత్తగా వినండి రాష్ట్రములారా అనగా మొత్తం అన్ని దేశాలు ప్రజలారా వచ్చి వినండి, భూమిని భూమి దానిలో ఉన్న సంపూర్ణత లోకములో పుట్టినదంతా వినండి అంటున్నారు!! దేనికోసం చెప్తున్నారు అనేది రెండు మూడు నాలుగు వచనాల్లో మనకు కనబడుతున్నాయి యెహోవా కోపము సమస్త జనాలు మీదకి వస్తుందంట అదే యెహోవా దినము అని కూడా మనం అనుకోవచ్చు. సమస్త జనముల మీదకు అనగా భూమి మీద ఉన్న ప్రతి జనం మీదకు దేవుని కోపం వస్తుంది. సర్వ సైన్యముల మీదకు ఆయన క్రోధము బహుగా వచ్చుచున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. చివరికి అలా వధకు అప్పగించిన తర్వాత వారిలో చంపబడిన వారు బయట పారవేయబడి వారి శవాలు కంపుకొట్టును. వారి రక్తం వలన కొండలే కరిగిపోతాయి అంటున్నారు. యెహోవా కోపము అనేది ఈ భూలోకంలో ఉన్న సమస్త ప్రజల మీదకి, సమస్త సైన్యముల మీదకి వస్తుంది. ఆయన కోపం వచ్చి వధకు అప్పగించేసాడు. దేవుడు వారిలో చంపబడిన వారు బయట పారవేయబడతారు వారి శవాలు కంపు కొట్టును ఎందుకంటే కప్పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు, వారి రక్తం వల్ల కొండలు కరిగిపోతున్నాయి అంటున్నారు. ఈ సన్నివేశం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది యెహోవా దినమున జరిగే సన్నివేశంగా కనిపిస్తుంది అయితే ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే తర్వాత వారి సేవలు ఏరకంగా కంపబడతాయో, గోగు మాగోగు యుద్ధం తర్వాత వారి శవాల ద్వారా పక్షులను దేవుడి పిలిచి ఏరకంగా విందు చేయించబోతున్నారో ఆ సన్నివేశంలా కనిపిస్తుంది ఇక్కడ!

అయితే నాలుగో వచనం చూసుకుంటే అది ప్రకటన ఆరో అధ్యాయం 12 నుంచి 16 వచనాలు, మత్తయి సువార్త 24:29,30 వచనాల్లో జరిగే సంభవం మరియు ప్రకటన 12 వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో జరిగే సంభవం, యెషయా 63:1--6 లో జరిగే సంభవము గా కనిపిస్తుంది.

సరే ఒక్కొక్క సన్నివేశం కోసం ఇప్పుడు మనం చూసుకుందాం! జనాల మీద కోపంతో ఉన్నాడు అంటే సర్వ జనుల మీద, సర్వ సైన్యం మీద ఆయన ఆగ్రహం క్రోదము కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 24: 29,30లో ఇదే వ్రాయబడి ఉంది

Matthew(మత్తయి సువార్త) 24:29,30

29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే

Revelation(ప్రకటన గ్రంథము) 6:12,13,14

12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

Isaiah(యెషయా గ్రంథము) 26:20,21

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

Isaiah(యెషయా గ్రంథము) 66:15,16

15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

ఇక మూడవ వచనం చూసుకుంటే వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును.

దీనికోసం ఆలోచన చేస్తే ఇది హార్మెగిద్దోన్ యుద్ధం, గోగుమాగోగు యుద్ధం తరువాత ఉండే పరిస్థితులు లా కనిపిస్తుంది.

Isaiah(యెషయా గ్రంథము) 63:1,2,3,4,5,6

1. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

6. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

Ezekiel(యెహెజ్కేలు) 39:11,12,13,14,15

11. ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్ర మునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.

12. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.

13. నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతి పెట్టుదురు; దానివలన వారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.

14.​ దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియ మించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.

15.​ దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టుదురు.

ప్రకటన గ్రంథం లో ఇంకా వివరాలు ఉన్నాయి.

Revelation(ప్రకటన గ్రంథము) 14:17,18,19,20

17. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.

18. మరియొక దూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.

19. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను

20. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

Revelation(ప్రకటన గ్రంథము) 19:18,19,20

18. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

ఈవిధంగా ఇశ్రాయేలు ప్రజలను చుట్టుముట్టిన శత్రుసైన్యాలను దేవుడు శిక్షించిన తర్వాత వారి శవాలకు జరుగుతుంది. ఇలా జరగబోతుంది అని దండోరా వేసి చెబుతున్నారు దేవుడు సమస్త జనములను పిలిచి!

ఇది అంత్య దినాలలో జరిగే సంభవము!

ఆయన రాకడకు నీవు సిద్ధంగా ఉన్నావా?!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*230వ భాగము*

యెషయా 34:4--5

4. ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.

5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 34వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 4,5 వచనాలు చూసుకుంటే ఆకాశ సైన్యమంతా క్షీణించిపోతుంది ఆకాశ వైశాల్యములు చుట్టబడిపోతాయి. ద్రాక్ష వల్లి నుండి ఆకు రాలిపోయినట్లు అంజూరపు చెట్టు నుండి ఆకులు రాలినట్లు, ఇప్పుడు ఆకాశ సైన్యం రాలిపోతుంది అంటున్నారు. అయితే దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన ఆకాశం చుట్టబడటం, ఆకాశ నక్షత్రాలు రాలిపోయే సంభవంలో కనిపిస్తుంది. ప్రకటన ఆరో అధ్యాయం ఆరవ ముద్ర విప్పినప్పుడు జరిగే సందర్భంలో కనిపిస్తుంది. అయితే ఐదో వచనంలో నిజముగా ఆకాశమందున ఖడ్గము మత్తిల్లును అంటున్నారు. ఎందుకంటే వాటి సైన్యం అంతయు రాలిపోవును అని కూడా కనిపిస్తుంది. అనగా ఆకాశంలో సైన్యం అంత క్షీణించిపోతుంది అంటున్నారు. నాలుగో వచనాలు చివర్లో సైన్యం అంత రాలిపోతుంది అంటున్నారు అనగా ఇది మరల ఆకాశంలో జరిగే యుద్ధంలో కనిపిస్తోంది. అదే పరలోకంలో జరిగే యుద్ధంలో కనిపిస్తుంది ఇది మనకి ప్రకటన గ్రంధం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. సరే మొదటగా ఆకాశం అంతా చుట్టబడటం నక్షత్రాలు రాలిపోవడం కోసం ద్యానం చేసుకుందాం. దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే

Isaiah(యెషయా గ్రంథము) 13:9,10,13

9. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలోనుండకుండ నశింపజేయుట కును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపము తోను అది వచ్చును.

10. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

13. సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పు నట్లును నేను చేసెదను.

యోవేలుగారు కూడా ప్రవచిస్తున్నారు

యోవేలు 2:31

​యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

యేసుక్రీస్తు ప్రభులవారు వివరంగా చెబుతున్నారు

Matthew(మత్తయి సువార్త) 24:29,30

29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

అయితే ఇది ఎప్పుడు జరగబోతుంది అనేది ప్రకటన గ్రంథంలో వివరంగా ఉంది. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు జరిగే సంభవము ఇది!

Revelation(ప్రకటన గ్రంథము) 6:12,13,14,15,16,17

12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను

16. బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?

17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.

ఇలా దేవుని ఉగ్రత దినమందు జరగబోతుంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా కనిపిస్తుంది. కారణం ఆకాశంలో యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఆకాశ సైన్యం రాలిపోతుంది ఇక్కడ. ఆకాశంలో ఉన్న సైన్యాలు ఏమిటి?

ఎఫెసీ పత్రికలో పౌలుగారు రాస్తున్నారు

Ephesians(ఎఫెసీయులకు) 6:10,11,12,13

10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

11.మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

అయితే ఇప్పుడు మరో యుద్ధం జరగబోతుంది. అది ఆకాశంలో అనగా పరలోకంలో. దీనికోసం ఆలోచిద్దాం!

*పరలోకంలో యుద్ధము*

ప్రకటన 12:1,2,7—12

1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

2. ఆమె గర్భిణియై ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.

7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

8. ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

9. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

11. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

12. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది (అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

ఈఅధ్యాయంలో మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి! మొదటిది: సూర్యుని ధరించిన స్త్రీ!

రెండు: పరలోకంలో జరిగిన యుద్ధము- సాతానుగాడు శాశ్వతంగా పరమునుండి త్రోసివేయబడుట

ప్రియులారా! మనకు సూర్యుని ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ప్రసవవేదన పడుతూ ఒక సమస్త జనులను ఏలే శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువును మ్రింగివేయాలని ఒక మహా ఘటసర్పం చూస్తుంది. అయితే ఆ శిశువు పరమునకు దేవుని సింహాసనం యొద్దకు కొనిపోబడెను! ఆ స్త్రీ అరణ్యానికి పారిపోతుంది. అక్కడ ఆమె మూడున్నర సంవత్సరాలు దాచబడి పోషించబడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ దాచబడిందో ఈ ఘటసర్పము పరలోకమునకు యుద్ధానికి వెళ్లారు వాడు- వాడి సైన్యము! గాని మిఖాయేలు దేవదూత ఒక్క తాపు తంతే భూమిమీద పడింది- వాడు వాడి సైన్యము! ఇక పరమునకు పోయే అనుమతి శాశ్వతంగా పోగొట్టుకుంది ఘటసర్పము అనబడే సాతాను గాడు! ఎప్పుడైతే పరమునుండి త్రోయబడిందో ఉక్రోషం పట్టలేక- ఆ స్త్రీని హింసించడం మొదలుపెట్టింది. వెంటనే ఆమెకు దేవునిచేత రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆమె దాచబడింది. ఘటసర్పము తననోటనుండి నీరు ప్రవాహముగా పంపి ఆ స్త్రీని చంపాలని చూస్తే భూమి ఆమెకు సహకారిగా మారి ఆ నీటిని మ్రింగి వేస్తుంది. వాడు ఆగ్రహం పట్టలేక ఆ స్త్రీకి ఉన్న మిగిలిన సంతానంతో యుద్ధానికి బయలుదేరారు! ఇదీ ఈ అధ్యాయంలో గల విశేషాలు!

అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంకా ఏడవబూర ఊదకముందే జరిగిన సంగతులు అని గ్రహించాలి! బూరలు తర్వాత జరిగినవి కావు!

ప్రియులారా! ఏడవ వచనంలో అంతట పరలోకంలో యుద్ధము జరిగెను అంటూ మిఖాయేలు అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేశారు అంటున్నారు. అసలు ఘటసర్పము ఏమిటి పరలోకం వెల్లడమేమిటి? అక్కడ యుద్ధము చేయడమేమిటి అనే అనుమానం రావచ్చు! అసలు పరలోకానికి వారిని రానిచ్చింది ఎవరు అనే అనుమానం రావచ్చు! కారణం అపవిత్రమైనదేదీ అందులో ప్రవేశించలేదు కదా పరలోకంలో!

కంగారుపడవద్దు! వాడికి ప్రవేశం ఉంది! వాడు పరమునుండి త్రోయబడిన దేవదూత! లూసీఫర్! దేవుడు ఒకసారి ఏమైనా ఇస్తే వాటిని తిరిగి తీసుకునే వాడు కాదు! సాతానుగాడికి వాడి సైన్యానికి ఇప్పటికీ పరలోక అనుమతి ఉంది! అది మనం యోబు గ్రంధం 1,2 అధ్యాయాలలో చూడవచ్చు! రెండుసార్లు అక్కడ దేవుని సన్నిధికి పరలోకం వెళ్ళాడు వాడు! ... యోబు 1:6—7

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7.​ యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

కాబట్టి ఇప్పుడు కూడా వాడి సైన్యంతో వెళ్ళాడు యుద్ధానికి! వాడి అనుమతి ఎప్పుడు ముగిసిపోతుంది అంటే పరలోకంలో మిఖాయేలు అతని సైన్యంతో యుద్ధం తర్వాత సాతాను గాడు ఇక పరలోక ప్రవేశం శాశ్వతంగా కోల్పోతాడు!

ఇక మిఖాయేలు దేవదూత ఈ మహా ఘటసర్పముతో యుద్ధము చేసినట్లు చూస్తున్నాము! గతభాగంలో చెప్పుకున్నట్లు మిఖాయెల్ దేవదూత ఇశ్రాయేలు తరుపున యుద్ధాలు చేసే దేవదూత! ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుని చేత ఏర్పాటుచేయబడ్డ దూత!

దానియేలు 10:13, 21;

13. పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలుగాక యీ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.

దానియేలు 11:1

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు... మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.

దానియేలు 12:1

1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

యూదా 1: 9

అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో (అనగా-సాతానుతో) వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను.

ఇక ఆయుద్ధంలో మహా ఘటసర్పము వాడి పార్టీ గెలవలేక పోయారు! దేవుని సైన్యంతో సాతాను గాడి సైన్యం యుద్ధం చేసి గెలవడం అసాధ్యం! కేవలం దేవుడు అనుమతి ఇస్తే తప్ప వాడు గెలువలేడు! ఇంతకూ ముందే దేవుడు వాడిని త్రోసి ఉండేవారు గాని అలా చేయాలని ఆయన అనుకోలేదు! ఎందుకో మనకు తెలియదు!

ఇక వాడికి అక్కడ అనగా పరలోకంలో చోటు లేకుండా పోయింది అని వ్రాయబడింది. ఆ యుద్ధం తర్వాత వాడికి అనుమతి కోల్పోవడం జరుగుతుంది. ఇక రాబోయే యుగంలో సాతాను గాడికి పరలోకంలో ప్రవేశం అనేది లేనేలేదు అని గ్రహించాలి!

ఇక తర్వాత వచనంలో చూసుకుంటే వాడు సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను ఇంకా అది భూమిమీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అని వ్రాయబడింది.

ఈ వచనము జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటగా సర్వలోకాన్ని మోసగించేవాడు! రెండవది వాడి పేరు సాతాను మరియు అపవాది! అసలు అది ఏమిటంటే ఆది మహా ఘటసర్పము అంటున్నారు!

ఇదే ఘటసర్పము హవ్వమ్మ గారిని అవునా ఇది నిజమా అంటూ మోసగించి మనకు ఇన్ని ఇబ్బందులు తీసుకుని వచ్చింది! చివరికి యేసుక్రీస్తుప్రభులవారు సిలువను ఎక్కడానికి కారణమైంది!...

ఆదికాండం ౩:1—5

1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడి గెను.

2కోరింథీయులకు 11: 3

సర్పము తనకు యుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.

ఇక వాడిని పడద్రోసాక మరలా పరలోకంలో నుండి గొప్ప స్వరము పలుకుతుంది

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

11. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

12. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది (అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.

ఇక్కడ పదో వచనంలో ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను అంటున్నారు- ఇప్పుడు అనగా వెంటనే అని కాదు- హార్మెగిద్దోను యుద్ధం తర్వాత వెయ్యేండ్ల పాలన నుండి ప్రారంభం అవుతుంది అని గ్రహించాలి!

ఇక 12వ వచనంలో అపవాది వాడికి కొంచెము సమయమే ఇవ్వబడింది అని తెలిసికొని క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చి యున్నాడు అని పరలోకం చెబుతున్నట్లు చూస్తున్నాము! అనగా ఇక్కడ వాడు పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత వాడు భూమిమీద దేవుని ప్రజలను బాధపెట్ట గలిగిన సమయం కేవలం మూడున్నర సంవత్సరాలు అని వాడికి ముందుగానే తెలుసు అన్నమాట! కారణం గతభాగాలలో చెప్పినట్లు ఇలా జరుగుతుంది అని వ్రాయబడిన గ్రంధము ఒకటి ఉంది! ఆ గ్రంధమును వీడు కూడా చదివి ఉంటాడు ఎందుకంటే వీడికి పరలోక ప్రవేశం ఉండేది కదా అప్పుడు!

కాబట్టి వాడు రెచ్చిపోయి దేవుని ప్రజలమీదకి వస్తున్నాడు! అందుకే పేతురు గారు అంటున్నారు నిబ్బరం కలిగి దైర్యంగా ఉండండి మీ అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలే ఎవరిని మ్రింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు అంటున్నారు....

1 పేతురు 5:9

ప్రియ దైవజనమా! వాడు పరమునుండి త్రోయబడ్డాడు! త్రోయబడతాడు మరోసారి! వాడి సైన్యం పరలోకం నుండి ఆకాశం నుండి సంపూర్ణంగా రాలిపోతుంది. అందుకే దేవుని పిల్లలమైన మనలను శోధించడానికి మోసగించడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు! కాబట్టి మనం మెలుకువ కలిగి దేవుడిచ్చిన ఆయుధాలు ధరించి వాడితో పోరాడి విజయం సాధిద్దాం! ఆ పరలోకం సాధిద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*231వ భాగము*

యెషయా 34:5--10

5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

6. యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

7. వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.

8. అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.

9. ఎదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును.

10. అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 34వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 5,6 వచనాలు చూసుకుంటే 5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోముమీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనముమీద తీర్పుతీర్చుటకు అది దిగును

6. యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

ఆకాశముందు నా ఖడ్గం మత్తిల్లును ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగుతాది. యెహోవా ఖడ్గము రక్తం చేత కొవ్వు చేత కప్పబడును గొర్రె పిల్లలు యొక్క మేకపిల్లల యొక్క రక్తము చేత పొట్టేలు మూత్రగంద్రులు మీది కొవ్వు చేత కప్పబడుతుంది. ఇంకా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఏదోము దేశములో ఆయన మహాసంహారం చేయును.

దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే యెహోవా దినము నాడు దేవుడు అనేకులను శిక్షిస్తారు. అనేక దేశాల్ని, అనేక దేశాలలో గల సైన్యాలను అన్నిటికంటే ఎక్కువగా ఎదోములో ఒక దేశంలో దేవుడు తన ఖడ్గాన్ని యెహోవా ఖడ్గాన్ని ఆడించబోతున్నాడు. గమనించాలి ఏదోము అనగా ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఉన్న నార్త్ ఇరాక్, సౌతిరాక్, టర్కీలో కొంచెం భాగం!! నార్త్ ఇరాక్ అనగా అష్షూరు , సౌతిరాక్ అంటే అది బబులోను ఇదే ఎదోము. కనుక ఈ రెండు కలిసి టర్కీలో కొంచెం భాగము కలిపి పూర్వకాలంలో ఏదోము అని పిలిచేవారు! కాబట్టి దేవుడు చేసే నాశనంలో దాంట్లో ఏదోము ముఖ్యపాత్రగా ఉంటుంది దేవునికి! ఎందువల్ల వివరాలు అంతగా తెలియదు కానీ దేవుడు ఎదోము కోసం ప్రత్యేకంగా రాస్తున్నారు!

ఇక దీనికోసం మనకి యిర్మియా 49: 7 నుంచి 27 లో వ్రాయబడి ఉంది.

25 వ అధ్యాయం 12 నుంచి 14, ఆమోసు 1:11--12 , ఓబద్యా గ్రంధం మొత్తం అంతా దీనికోసమే! కాబట్టి రాబోయే ఈ యెహోవా దినములో జరిగే మహా యుద్ధం లో జరగబోయే నాశనంలో చాలా భాగం ఈ ఏదోములో జరుగుతుందేమో అని నా ఉద్దేశం!!

గత భాగంలో చూసుకున్నాం కదా యెషయా 63 ఒకటి నుంచి ఆరు వచనాలు జరిగే వధ ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది.

Isaiah(యెషయా గ్రంథము) 63:1,2,3,4,5,6

1. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

6. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

మనం ఇంకా ముందుకు పోతే దేవుడు ఇంకా ఏం చేయబోతున్నారంటే యెహోవా ఖడ్గము రక్తం అది కొవ్వు చేత, గొర్రెపిల్లల యొక్క, మేకలు యొక్క రక్తం చేత, వాటి కొవ్వు చేత అది కప్పిఉంటాది.

ఏడవ వచనంలో వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. అది యెహోవా ప్రతి దండన, వారు సీయోను నే కష్టపెట్టారు కాబట్టి దానికోసం అయిన ప్రతీకార సంవత్సరము వారు అనగా బబులోను వారు అస్సూరు వారు ముందు హింసించారు కనుక ప్రతిదండన సంవత్సరం జరగబోతుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు.

ఇంకా చూసుకుంటే ఎక్కడ బొస్రా పట్టణంలో యెహోవా బలి జరిపిస్తాడు అని రాయబడింది. ఇది ఎదోములో ఒక ముఖ్య పట్టణం అన్నమాట. అనగా యెహోవా జరిగించే ఆ మహా వధలో ఎక్కువ భాగం బొస్రాలో ఇంకా ఎదోములో జరగబోతుంది అన్నమాట! దీనికోసం చాలా చోట్ల రాయబడి ఉంది. 35:4; 47:3; 61:2; 63:4; ద్వితీ 32:3; యిర్మీయా 51:56; రోమ్ 12:9; ప్రకటన 16:5-6; 19:2. ఇవన్నీ దీనికోసమే అని గ్రహించాలి! ఇంకా చూసుకుంటే ఈ యెహోవా దినాన వారి రక్తం కాలువలుగా ప్రవహించడం ఇవన్నీ జరుగుతుంది అంటున్నారు

ఇంకా చూసుకుంటే

Isaiah(యెషయా గ్రంథము) 34:11,12,13,14,15,16,17

11.గూడబాతులును ఏదుపందులును దాని ఆక్రమించు కొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలనూలును చాచును శూన్యమను గుండును పట్టును.

12.రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి.

13.ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును

14.అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును

15.చిత్తగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడు కొనును.

16.యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దానియొద్ద ఉండక మానదు నా నోటనుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.

17.అవి రావలెనని ఆయన చీట్లువేసెను ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాని ఆక్రమించుకొనును యుగయుగములు దానిలో నివసించును.

అక్కడ రగులుకున్న ఆ చితి ఆరిపోకుండా రాత్రి గాని పగలు గాని ఆరకుండా అది చితి మండుతాది ఆ దేశాన్ని కాల్చిన పొగ నిత్యములేస్తూ ఉంటుంది. అది ఇక తరతరములు పాడుగా ఉండును ఎన్నడూ ఎవడు దానిలోబడి దాటడు. దీనికోసం అనేకసార్లు మనం చూసుకున్నాం కాబట్టి ముందుకు పోదాం!

ఇక ఆ దేశంలో మనుషులు ఉండరు కాబట్టి దాంట్లో గూడబాతులు ఏదు పందులు ఆక్రమించుకొని, గుడ్లగూబ లాంటి పక్షులు ఇలాంటివి దాంట్లో ఉంటాయి!

ఇంకా రాజ్యం ప్రకటించుటకు ప్రధానులు లేక అధికారులు లేకపోదురు. అధిపతులు ఎవడు అక్కడ ఉండరు. పట్టణాల్లో ముళ్ళ చెట్లు ఉంటాయి దుర్గములు లేదా కోటలు లేవు. లేదా ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అంటున్నారు. ఇంకా అడవిపిల్లులును నక్కలును అచ్చట కలిసికొనును. అచ్చట అడవిమేక తనతోటి జంతువును కనుగొనును అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమస్థలము చూచుకొనును ఇంకా అడవి కుక్కలు నిప్పు కోళ్ళు ఉంటాయి. అడవి పిల్లులు నక్కలు అచ్చట ఉంటాయి. అడవి మేక చువ్వపిట్ట అక్కడే రెస్ట్ తీసుకుంటాయి. చిత్తగూబ గూడు కట్టుకుంటుంది. గుడ్లు పొదిగి కూర్చుంటాది. తెల్ల గద్దలు ఉంటాయి.

16 వచనంలో దేవుని గ్రంథంలో అనగా బైబిల్ గ్రంధంలో ఏవైతే జంతువుల కోసం రాయబడి ఉన్నవో అన్ని జంతువులు అక్కడ ఉంటాయి అన్ని పక్షులు అక్కడ ఉంటాయంట. అక్కడ మనిషి అన్న వాడు లేకుండా ఎదోము దేశాన్ని దేవుడు పాడు చేయబోతున్నారు. అందువల్ల అక్కడ ఈ జంతువులు ఈ పక్షులన్నీ కాపురం ఉంటాయి మనుషులు ఉండరు ఎందుకంటే 17 వ వచనం అవి రావాలని దేవుడే చీట్లు వేశాడు. ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశాన్ని పంచిపెట్టాడు. ఎవరికి? పక్షులకి, జంతువులకి!! ఎలాంటి జంతువులు? మనుషులు లేని చోట్ల ఉండే జంతువులు! మనుషులు లేని చోట ఉండే పక్షులు అక్కడ ఉండేలాగా దేవుడు వాటికి ఆ దేశాన్ని సీట్లు వేసి పంచిపెట్టాడు! అవి నిత్యము దాని ఆక్రమించుకుంటాయి! ఒకరోజు రెండు రోజులు కాదు యుగ యుగములు దానిలో అవి నివాసం చేస్తాయి అని ఇక్కడ రాస్తున్నారు!!

ఈ విధముగా దేవుడు యెహోవా దినము రోజున ఎదోము దేశానికి తీర్పు తీర్చబోతున్నారు!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*232వ భాగము*

యెషయా 35:1--6

1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును

2. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

3. సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.

4. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

5. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

6. కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 34వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 35వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! అయితే ఈ అధ్యాయం కోసం ఇంతకుముందు అభిషక్తుని మొదటి రాకడకోసం ధ్యానించి నప్పుడు ధ్యానం చేసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుందాము!

ప్రియులారా ఈ భాగాన్ని యెషయాగ్రంధంలోని ఇలాంటి ఇతర భాగాలతో (11:6-9; 32:15-16; 49:8-11; 51:3) సంబంధం కలిగి ఉంది.

Isaiah(యెషయా గ్రంథము) 11:6,7,8,9

6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

Isaiah(యెషయా గ్రంథము) 32:15,16,17

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

Isaiah(యెషయా గ్రంథము) 49:8,9,10,11

8. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

9. మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును

10. వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

11. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

యెషయా 51:3

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ అధ్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది బబులోను చెర తరువాత యూదాదేశంలో కనిపించే ఆధ్యాత్మిక పరిస్థితుల వర్ణన అని కొందరు పండితుల అభిప్రాయం. మరికొందరు ఇది యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు చేసిన సువార్త వలన జరిగిన పరివర్తన కోసమైన వర్ణన అన్నారు. అయితే ఈ ప్రవచనాలు అభిషక్తుని మొదటి రాకడలో సంపూర్ణంగా నెరవేరలేదు. ఇక మరికొందరు ఇది ఈ కృపాయుగం అంతటి గురించిన వర్ణన అంటారు. మరికొందరు ఇది క్రీస్తు తిరిగి వచ్చిన వెంటనే వెయ్యేళ్ళ పరిపాలన ఆరంభం స్థితిగతులు అంటారు. మరి కొందరు ఇది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో కలుగబోయే పరిస్థితుల వర్ణన అంటారు. కొందరు ఈ వివరణ ఇజ్రాయేల్ ప్రజలకూ, వారి దేశానికీ సంబంధించినది కాదని గట్టిగా అంటారు. మరి కొందరైతే ఇది వారికి మాత్రమే సంబంధించినది అంటారు. అయితే నాకు అర్ధమైనది ఏమిటంటే , ఈ భాగం అభిషక్తుని మొదటి రాకడలో కొంతభాగం, క్రీస్తు రెండవ రాకడ తర్వాత కనిపించే పరిస్థితులను మరికొంత భాగం వివరిస్తున్నది. ఇది బహుశా వెయ్యేళ్ళ పాలన సమయానికి చెందినది. దీనికీ ఇజ్రాయేల్ కు సంబంధం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న అలంకారికమైన మాటలు కొంతవరకు యేసుక్రీస్తు ప్రభులవారు తన రక్షణ కారణమైన చర్యను మానవ హృదయాల్లో జరిగించినప్పుడెల్లా జరిగే దాన్ని గురించి కూడా వివరిస్తున్నాయి. ఈ ప్రవచనాలు సరిగ్గా అర్థం చేసుకొని వివరణ ఇవ్వాలన్న విషయం ముఖ్యమే గాని దానికంటే దేవునిపట్ల, మనిషి పట్ల ప్రేమ కలిగి పవిత్ర జీవితం గడపడం మరింత ముఖ్యమైన విషయం (1 కొరింతు 13:2). పై వివరణల్లో ఏదో ఒకదాన్ని నమ్మడం వల్ల మనం ఇతరులకంటే మంచివారం కాలేము. లేక వీటిల్లో దేన్నైనా త్రోసిపుచ్చితే చెడ్డవారం కాబోము. భవిష్యత్తు గురించి యెషయా గారు చెప్తున్న మాటలను అర్థం చేసుకోవడంలో మనం ఆచరణలో పెట్టగలిగే ఆధ్యాత్మిక గుణపాఠాలను కూడా నేర్చుకొందాం. అవి దేవునికిష్టమైన రీతిలో మనం ఇప్పుడు జీవించేందుకు ఉపయోగపడతాయి.

మొదటి వచనంలో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును . ఇక్కడ అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది అడవి ఉలసించి కస్తూరి పువ్వు లాగా పూస్తుంది అంటున్నారు. ఇక్కడ అరణ్యము ఎండిన భూమి అనగా ఎండిన భూమి ఇది ఇశ్రాయేలు దేశము, యూదులు అని భావించవచ్చు! వీరి హృదయాలలో దేవుడు లేక, దేవుని నుంచి దూరమై ఆధ్యాత్మికంగా ఎండిపోయిన వీరు, ఇప్పుడు ఉల్లసించి కస్తూరి పూలు వలె పూస్తారు అంటున్నారు!

ఎందుకు అంటే మొదటగా అభిషక్తుని మొదటి రాకడ వలన, రెండవదిగా రెండవ రాకడ రాకడలో క్రీస్తు ఇశ్రాయేలు దేశంలో అడుగుపెట్టడం వలన మరియు వెయ్యేళ్ల పాలనలో క్రీస్తు ఇచ్చే సుభిక్షమైన వాతావరణం సుభిక్షమైన పరిపాలన వలన ఇశ్రాయేలు దేశం కస్తూరి పువ్వు వలె పూస్తుంది!! ఇశ్రాయేలీయుల ప్రజల హృదయాలు ఆనందంతో పులకరిస్తాయి. యెషయా27:3లో అంటున్నారు

యెషయా 27:2

ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.

యెషయా 27:3

యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను.

యెషయా 27:4

నాయందు క్రోధము లేదు గచ్చపొదలును బలురక్కసి చెట్లును ఒకవేళ నుండిన యెడల యుద్ధము చేయువానివలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును.

మీద చెప్పిన 51:3 కూడా అదే చెబుతుంది.

ఇక రెండవ వచనం . అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

ఇక దేవుని రాకడతో బహుగా ఫలిస్తూ ఉల్లసించి సంగీత నాదాలు పాడుతారు దానికి బహు సౌందర్యము కలుగుతుంది యెహోవా యొక్క మహిమ మన దేవుని తేజస్సు అక్కడ వెలుగుతుంది! దీనికోసం మనం మొదటి రాకడలో చూసుకున్న దేవుని యొక్క పాదములు జెబూలూను నఫ్తాలి ప్రదేశాల మీద తాకినప్పుడు అది ఎంతగానో ప్రకాశించింది అని చూసుకున్నాం.

ఇంకా తేజస్సు– 4:5; 6:3; 59:19 కూడా చూడండి (1 వ వచనం నెరవేరినప్పుడు కనిపిస్తుంది).

ఇలా జరిగాక మూడు నాలుగు వచనాల్లో అంటున్నారు సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.

4. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

ఇప్పుడు దేవుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి సడలిపోయిన చేతులను బలపరచండి! వాళ్ళకి ధైర్యం చెప్పండి! తొట్రిల్లిపోయిన మోకాళ్ళను దృఢపరచండి! ఎవరైతే భయంతో ఉంటున్నారో వారికి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇంతవరకు దేవుడు మిమ్మల్ని హింసించిన వారి మీద ప్రతీకారం చేయబోతున్నారు! ఆయన వస్తున్నారు అంటున్నారు!

హెబ్రీ 12:12 లో కూడా ఇదే చెప్తున్నారు

హెబ్రీయులకు 12:12

కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.

హెబ్రీయులకు 12:13

మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.

కాబట్టి మనం ఇప్పుడు భరించవలసిన వాటిని భరించాలి ఏమైనా కష్టము ప్రమాదం వస్తే దేవుడు మన తోడుగా ఉన్నాడు అని గుర్తెరిగి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి! ఇక్కడ దేవుడు వస్తున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన రాబోతున్నారు! మొదటి రాకడలో ఒకసారి వచ్చారు! మరల రెండవ రాకడలో దేవుడు మరల రాబోతున్నారు అని అర్థం!

ఇక ప్రతీకారం కోసం చూసుకుంటే క్రీస్తు వచ్చినప్పుడు దేవుడు చేసే ప్రతీకారము అదే యెహోవా దినములో ఆయన చేసే తీర్పు అని గుర్తు!!! ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువుల వారు మొదటి రాకడలో ఎవరిమీద ప్రతీకారం తీర్చుకోలేదు కాబట్టి ఖచ్చితంగా రెండవ రాకడలో ప్రతీకారం తీర్చుకోబోతున్నారు 2థెస్స 1:5--10 ఇదే చెప్తుంది

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! ఆయన త్వరలో రాబోతున్నారు! ప్రస్తుతం బాధించబడుతున్న హింస పొందుతున్న మనకి దేవుడు ఆదరణ కలిగిస్తాడు! ఆరోజు మనలని హింసిస్తున్న వారికి శ్రమలు కలగబోతున్నాయి! ఇక ఆయన రాకడతో ఈ భూమి మొత్తం వికసిస్తుంది పరవశిస్తుంది! దానిని నువ్వు చూడాలంటే నువ్వు తప్పకుండా ఎత్తబడాలి.

మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*233వ భాగము*

యెషయా 35:5--10

5. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

6. కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

7. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

9. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 35వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గత భాగం తరువాయి)

ఇక ఐదవ వచనం నుండి చూసుకుంటే గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

6. కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

7. ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

ప్రియులారా గుడ్డివారు కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు వినబడును కుంటివాడు గంతులు వేయుచు నడవడం, మూగవాడు పాడడం ఇవన్నీ జరుగుతాయి అని యెషయా ప్రవచన గ్రంథంలో అనేకసార్లు రాయబడ్డాయి! ఇది ఏసుక్రీస్తు ప్రభువులవారి మొదటి రాకడలో జరిగాయి, అయితే మరోసారి వెయ్యేండ్ల పరిపాలనలో కూడా జరగబోతున్నాయి.

కళ్ళను...చెవులను– 29:18; 32:3; 33:24; 42:7.

యెషయా 29:18

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

యెషయా 32:3

చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

యెషయా 32:4

చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

యెషయా 33:24

నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

యెషయా 42:7

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

ఇక 7--8 వచనాలు చూసుకుంటే : ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

ఇక 7 నుంచి 10 వచనాలు 1,000ఏళ్ల పరిపాలనలో జరిగే సంభవాలని గమనించాలి. ఆ పరిపాలనలో ఈ ఎండమావులు మడుగులవుతాయి. ఎండమావులు అనేవి అరణ్యాల్లో ఉంటాయి ఎడారిలో ఉంటాయి. ఈ ఎడారులు నీటిమడుగులు అయిపోతాయి! ఎండిన భూములలో నీటి బుగ్గలు పుడతాయి నక్కలు పడుకునే చోట జమ్ము తుంగగడ్డి దొరుకుతాది! నక్కల పడుకోవడం- ఎక్కడ పడుకుంటాయి? ఎవరూ మనుషులు లేని ప్రాంతాల్లో పడుకుంటాయి! ఒకప్పుడు నగరం ఉండేది కానీ దేవుని ఉగ్రత వలన నక్కలు పడుకుంటున్నాయి అక్కడ వర్షాలు లేవు ఏమి లేవు! ఇప్పుడైతే అవి జమ్ము తుంగగడ్డి పుడతాయంటున్నారు! జమ్మ ఎక్కడ పెరుగుతుంది? జమ్ము అనేది నీరు ఎక్కువగా నిలువ ఉన్న చోట్ల నీటిలో పుడుతుంది! తుంగ గడ్డి ఎక్కడ పుడుతుంది? నీటి వారన! అనగా ఇప్పుడు ఆ ఎండమావులు నీటితో నిండి ఉంటాయి ఇశ్రాయేలీయుల యూదుల హృదయాలు కూడా క్రీస్తు యేసు లేక దేవుడు లేక ఎండమావులుగా ఉన్న వారి హృదయాలు ఇప్పుడు దేవుని వాక్యమనే నీటితో నింపబడిపోయి జమ్ము తుంగ ఇలాంటి మేత పుడుతుంది అని చెప్తున్నారు!

యెషయా 30:25

గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

యెషయా 41:18

జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు

యెషయా 41:19

చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

యెషయా 41:20

నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

యెషయా 43:19

ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.

యెషయా 43:20

నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును

ఇక ఎనిమిదో వచనంలో అక్కడ రాజమార్గము పరిశుద్ధ మార్గము ఏర్పడును దానిలో దుష్టులు గాని అపవిత్రులు గానీ వెళ్ళరు అంటున్నారు! దీనికోసం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంధంలో ఐగుప్తు దేశం నుంచి అస్సూరుకి రాజమార్గం ఉంటదని ఇలాంటి మార్గాలు కోసం ఎన్నో రాయబడ్డాయి. కానీ ఇక్కడ చెబుతున్న మార్గం మాత్రం తప్పకుండా నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభువుల వారి కోసమే చెప్పబడింది! దీనికోసం కూడా ఈ పరిశుద్ధ మార్గం కోసం యెషయా చెప్పారు ఒకసారి చూసుకుందాం!

యెషయా 11:16

కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును.

యెషయా 19:23

ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవిం చెదరు.

యెషయా 40:3

ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

యెషయా 40:4

ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.

యెషయా 40:5

యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా 49:11

నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

యెషయా 49:12

చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.

యెషయా 57:14

ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

యెషయా 62:10

గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

యెషయా 62:11

ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

యెషయా 62:12

పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

గమనించాలి ఈ పరిశుద్ధ మార్గము రాజ మార్గము అనేది కేవలం పరిశుద్ధుల కోసమే అనగా క్రీస్తు రక్తంలో కడగబడి పాపముల నుండి విముక్తి పొందిన వారి కోసమే! ఇశ్రాయేలు ప్రజలు మరియు ఇశ్రాయేలు కాని ఏ ప్రజలైన దేవుని వైపుకు తిరిగి, జీవమునకు దారి తీసే ఇరుకు మార్గం వైపు తిరిగి ఆ ఇరుకు మార్గంలో నడిచే వారికే ఈ పరిశుద్ధ మార్గం! ఏసుక్రీస్తు ప్రభువుల వారి మొదటి రాకడలో చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంలో నడిచారు! మరల అంత్యకాలంలో ఇద్దరు సాక్షుల సాక్షాలు వలన, ఇక తర్వాత జరిగే అనగా మహాశ్రమల కాలం తర్వాత జరిగే సంభవాల వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఇరుకు మార్గంలో ప్రవేశించి క్రీస్తు మార్గంలో నడుస్తారు అప్పుడు ఈ ప్రజలంతా పవిత్రులుగా మార్చబడి ఈ పరిశుద్ధ మార్గంలో నడుస్తూ ప్రభువుతో సమాధానపడతారు ఇదే మత్తయి 7 :14, రోమా 11: 26, 27 , యెషయా 4:3 లో వ్రాయబడి ఉంది!

ఇక 9-10 వచనాలు చూసుకుంటే అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు! యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

చూడండి అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు గాని ఎక్కవు అవి ఎక్కడా కనబడవు విమోచించబడిన వారే అక్కడ ఉంటారు విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోను కి వస్తారు వారి తలల మీద నిత్యానందం ఉంటాది. ఆనంద సంతోషం గలవారుగా ఉంటారు దుఃఖభూమి ఎగిరిపోతుంది అంటున్నారు ఇది 1000 పాలలో జరిగే సంభవాలు అనుగ్రహించాలి ఎప్పుడో చెప్పబడింది ఒకసారి చూసుకుందాం.

Isaiah(యెషయా గ్రంథము) 11:6,7,8,9,10

6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

యెషయా 65:25

తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

Psalms(కీర్తనల గ్రంథము) 126:1,2,3,4,5,6

1. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు

2. మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవావీరి కొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.

3. యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతిమి.

4. దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.

5. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

6. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

యెషయా 25:7

సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును

యెషయా 25:8

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.

ప్రకటన గ్రంథం 7:16

వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,

ప్రకటన గ్రంథం 7:17

ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

Revelation(ప్రకటన గ్రంథము) 14:1,2,3,4,5

1. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.

2. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

3. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.

4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు;వీరు దేవుని కొరకును గొఱ్ఱె పిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

5. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.

ప్రకటన గ్రంథం 21:3

అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన గ్రంథం 21:4

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

గమనించాలి ఎప్పుడైతే ఎవరైనా దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందంగా జీవితాలు గడిపే స్థితిలో ఉన్నారో, ప్రభువు సన్నిధిలో పాటలు పాడుతూ సంతోషించే స్థితిలో ఉంటారో, వారి మార్గము ఎంతో పరిశుద్ధమైనదిగా, విమోచించబడిన మార్గముగా ఉంటుంది! ఇదే పరమ సత్యం శాశ్వత సత్యం!!!

ప్రియ సహోదరీ సహోదరుడా నువ్వు ఇరుకు మార్గమందు పరిశుద్ధ మార్గమందు ప్రయాణం చేస్తున్నావా? ఆ మార్గంలో ఉంటేనే ఎత్తబడి పరమునకు చేరగలవు! వెయ్యెండ్ల పాలనలో పాలించగలరు!

నేడే పరిశీలన చేసుకుని దేవునితో సమాధానపడు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*234వ భాగము*

యెషయా 40:1--8

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

3. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

4. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.

5. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 35వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! 36--39 అధ్యాయాలు హిజ్కియా గారికోసం ధ్యానం చేసేటప్పుడు చూసుకున్నాము గనుక ఇక 40వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం నుండి ఇశ్రాయేలు ప్రజలు యూదుల కోసం తండ్రి అయిన దేవుని ఆదరణకరమైన మాటలు మనం చూడగలం. 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు దీని చూడొచ్చు. అయితే ఈ అధ్యాయంలో దేవుని ఆదరణకరమైన మాటలతో పాటు భక్తుడైన యోహాను గారి కోసమైన మాటలు, ఆయన రాక కోసం కూడా ఈ అధ్యాయంలో కొద్దిగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి దేవుడు చెప్పిన ఆదరణకరమైన మాటలు ధ్యానం చేసుకుందాం! అంతే కాకుండా ఈ అధ్యాయాలలో ఇశ్రాయేలు జనాంగము మరియు యూదులు వారు తిరిగి చెరలో నుండి తమ స్వదేశానికి వస్తారని జెరూసలేం కట్టబడుతుంది అని కూడా మనం చూడగలం!

ఇక ఈ అధ్యాయం లో నాలుగు స్వరాలు వినిపిస్తాయి. మొదటి రెండు వచనాలలో తండ్రి అయిన దేవుని స్వరము వినిపిస్తుంది.

ఇక మొదటి నుండి జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే నా ప్రజలను ఓదార్చుడి ఓదార్చుడి అని దేవుడు చెప్తున్నారు. దేనికోసం ఓదార్చమంటున్నారు అంటే దేవుడు వారిని దర్శించే సమయము ఆసన్నమైంది. వారి చెర కాలము ముగించి దేవుడు వారిని కనికరించే సమయం దగ్గర పడింది! కాబట్టి నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి! ఎందుకంటే ఆమె దోష రుణము తీర్చబడెను ఆమె యుద్ద కాలము సమాప్తం అయ్యెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతల శిక్ష పొందింది. ఆయన చెప్పిన సమాచారము ఆమెకు ప్రకటించుడి అంటున్నారు. ఇక్కడ ఆమె అనగా ఇశ్రాయేలు జాతి అని గ్రహించాలి! ఆమె యుద్ధ కాలము అనగా ఇంతవరకు తాను చేసిన యుద్ధాలు, అనుభవించిన చెర సమాప్తం అయిపోయింది! ఆమె చేసిన దోషాల వల్ల ఆమె పడిన ఇబ్బందులు అనుభవించిన బాధలు రుణము తీర్చేసుకుంది! అది యెహోవా చేతివల్లనే ఆమె చేసిన పాపాలకు శిక్షణ అనుభవించబడింది అని ప్రకటించమని దేవుడు చెబుతున్నారు! ఒక పక్కన ఓదార్చమన్నారు ఓ పక్కన ప్రకటించమంటున్నారు! ఇంకా ఇంతవరకు చేసిన పాపాలను యూదుల పాపాలను ఇశ్రాయేలు పాపాలను దేవుడు ఇంక క్షమించేస్తున్నాడు! క్షమించి అభిషక్తుని పంపించడం వల్ల, వారి పాపాలకు ప్రక్షాళన చేయడం, వారిని తిరిగి చెర నుండి ఇశ్రాయేలు దేశం రప్పించడం వల్ల వారిని ఓదార్చి, తిరిగి వారిని కడుతున్నారు!! ఇక్కడ దేవుడు అంతేకాకుండా యెరుషలేము అనే ఇశ్రాయేలు రాజధాని ఇప్పుడు తిరిగి తన పూర్వ వైభవానికి వస్తుంది అని చెప్తున్నారు!!!

దీనికోసం మనం యెషయా 1: 26, 2 అధ్యాయంలో కూడా చూసుకున్నాము.

యెషయా 1:26

మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

యెషయా 1:27

సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

Isaiah(యెషయా గ్రంథము) 2:1,2,3,4

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

ఇక రెండో వచనం చూసుకుంటే యెరుషలేము లేదా ఇశ్రాయేలు రెండింతలుగా శిక్ష అనుభవించింది అయితే ఇప్పుడు దానికి క్షమాపణ కలుగుతుంది విడుదల కలుగుతుంది అని చూడగలం. ఇప్పుడు దానికి విమోచన పూర్తి అయింది. క్షమాపణ దొరికింది. జెరుసలం పాపానికి సరిపోయిన శిక్ష దానికి పడిందని దేవుడు పరిగణిస్తున్నట్టు దీనికి అర్థం చెప్పుకోవచ్చు (2వ వచనం చివరి భాగం). యెషయా గ్రంథంలో తరచుగా జెరుసలం పొందిన బాధలు, శిక్షలు మనకు కనిపిస్తూవుంటాయి. 3:1-26; 5:3-6, 25-30; 7:18-25; 8:5-8; 22:1-13; 29:1-4. ప్రపంచంలో మరి ఏ ఇతర నగరమూ ఇలా పదే పదే విపత్తులనూ, బాధలనూ, వినాశాలనూ ఎదుర్కోలేదు. యెషయాగారు ఈ మాటలు రాస్తున్న సమయంలో జెరుసలంకు సంభవించవలసిన బాధలు మరి కొన్ని ఉన్నాయి. అంతేగాక, ఈ యుగాంతంలో మరిన్ని బాధలు రానున్నాయి – జెకర్యా 12:2-3; 14:2; మత్తయి 24:15-22. అయితే దానియొక్క భవిష్యత్తులో పొంద బోయే కష్టాలన్నీ కూడా కడతేరిపోయే రోజు రానున్నది.

ఇక మూడవ వచనం నుండి 5 వ వచనం వరకు చూసుకుంటే యోహాను గారి స్వరము వినిపిస్తుంది.

3. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

4. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.

5. యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

ఈ అధ్యాయంలో కనిపించే నాలుగు స్వరాల్లో ఇది రెండవది (వ 3,6,9). ఇది బాప్తిసం ఇచ్చే యోహాను గారి స్వరం (మత్తయి 3:3; మార్కు 1:3; లూకా 3:4; యోహాను 1:23). యెషయా గారు ఈ మాటలు రాసిన కాలానికి 700 సంవత్సరాల తరువాత యోహానుగారు వచ్చారు. జెరుసలంకు గానీ మనకు గానీ నిజమైన, స్థిరమైన ఆదరణ ఎవరిద్వారా కలుగుతుందో ఆయనను యోహాను ప్రకటించారు (మార్కు 1:7-8; యోహాను 1:29). యోహాను గారు యేసుప్రభువుకోసం మార్గం సిద్ధపరుస్తున్నాడంటే దేవుని కోసమే అలా చేస్తున్నాడని గుర్తుంచుకోండి.

మత్తయి 3:1

ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి

మత్తయి 3:2

పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

మత్తయి 3:3

ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.

మార్కు 1:2

ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.

మార్కు 1:3

ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు

మార్కు 1:4

బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను.

మార్కు 1:7

మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;

మార్కు 1:8

నేను నీళ్లలో(లేక, నీళ్ళతో) మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో(లేక, పరిశుద్ధాత్మతో) మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.

యోహాను 1:19

నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.

యోహాను 1:20

అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) కానని ఒప్పుకొనెను.

యోహాను 1:21

కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.

యోహాను 1:22

నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

యోహాను 1:23

అందుకతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.

యోహాను 1:29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

యోహాను 1:30

నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే యీయన.

యోహాను 1:31

నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో ( లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.

యోహాను 1:32

మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

యోహాను 1:33

నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల( లేక, నీళ్ళతో) బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో( లేక, పరిశుద్దాత్మతో) బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.

ఈ రకంగా యోహాను గారు యేసయ్య కంటే ఆరు నెలలు ముందుగా ఈ భూమి మీద కాలు పెట్టడం, ఏసుప్రభు కోసం అయిన మార్గమును సిద్ధపరిచి హేరోదు చేత చంపబడి దేవుని దగ్గరికి వెళ్లడం మనం చూడగలం.

ఇక మూడవ వచనములో యెహోవా మార్గం సిద్ధం చేయండి అని ఎడారిలో పలికే ఒక స్వరము అంటున్నారు! పూర్వకాలంలోనూ ఈ రోజుల్లో కానీ ఎవరైనా ఒక పెద్ద అధికారి గాని రాజు గాని ముఖ్యమైన వ్యక్తి వస్తా ఉంటే అక్కడ ఉన్న అధికారులు సైనికులు అంతా కలిపి ఆ వచ్చే మార్గాన్ని సిద్ధం చేసేవారు ! ఆటంకాలు అన్ని తొలగించి గుంటలు పూడ్చి ఆ వచ్చే దారిని సిద్ధం చేసేవారు. బాగా తుడిచి సిద్ధం చేసేవారు! ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ రాజుకి మార్గం సిద్ధం చేయమని చెప్తున్నారు! ప్రతి పర్వతాన్ని కొండను అణచాలి. మెరకగా ఉన్న స్థలాలు చదును చేయాలి. కనుక ఎత్తైన ప్రదేశాలు మైదానం లాగా అవ్వాలి . అప్పుడే యెహోవా శోభ వెళ్లడవుతుంది అది అందరికీ కనిపిస్తుంది అంటున్నారు! దీనికోసం చూస్తే ప్రతి లోయ అనగా రాజుగారు వచ్చే మార్గంలో ఉన్న ఆటంకాలు అవరోధాలు తొలగించి ఆయనను ఆహ్వానించేందుకు ఏర్పాట్లన్నీ చక్కగా జరగాలి అన్నమాట!

యెషయా 26:7

నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

యెషయా 49:11

నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

పాత నిబంధన కాలంలో దేవుని మహిమా ప్రకాశాన్ని కొందరు కొంతమట్టుకు చూశారు (నిర్గమ 33:18-23; 40:34; ద్వితీ 5:24). దేవుని మహిమ మరింతగా మనుషులకు వెల్లడౌతుందన్న వాగ్దానం ఇక్కడ ఉంది. మనుషులంతా దాన్ని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభులవారు మొదటిసారి వచ్చినప్పుడు ఇది కొంతవరకు నెరవేరింది (యోహాను 1:1, 14; 11:40; 2 కొరింతు 4:6; హీబ్రూ 1:3). అయితే ఆయన రెండవ రాకడ సమయంలో క్రీస్తు ద్వారా దేవుని మహిమా ప్రకాశం మరింత ప్రస్ఫుటంగా వెల్లడి అవుతుంది (మత్తయి 16:27; 24:30; 25:31; ప్రకటన 1:7). అప్పుడు అక్షరాలా ప్రతి కన్నూ ఆయనను చూస్తుంది. 3వ వచనం క్రీస్తు మొదటి రాకను ప్రకటిస్తూ ఉంది. 5వ వచనం పూర్తి నెరవేర్పు ఈ యుగాంతంలో ఉంటుంది.

మరి ఆయన మహిమ ప్రకాశం నీలో ప్రకాశిస్తుందా!!!

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*235వ భాగము*

యెషయా 40:6--8

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా ఇక ఆరు ఏడు ఎనిమిది వచనాలలో మూడవ స్వరము వినబడుతుంది ఈ స్వరము బహుశా దేవుని దూత చెబుతున్నాడు! అది మానవులతో చెప్తున్నాడు! ఏమనంటే ఆలకించండి! ప్రకటించమని ఒకడు ఆదేశిస్తున్నాడు! అది దేవుడే! నేనేమీ ప్రకటించాలి అనే మరొకటి అడుగుతున్నాడు! అప్పుడు ఆ స్వరం ఏమని చెప్తుంది అంటే భూమి మీదనున్న సర్వశరీరులు గడ్డి లాగా ఉన్నారు! వారందమంతా అడిగి పువ్వులా ఉంది దేవుడు తన శ్వాసము అనగా ఊపిరి దాని మీద ఊదితే గడ్డి ఎండిపోతుంది! నిశ్చయముగా ఈ ప్రజలు కూడా గడ్డి లాంటివారే! గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు వాడిపోతుంది! మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది!!

దీనికోసం ఆలోచిస్తే ఇది మూడో స్వరము!!! ఈ స్వరము ప్రకటించేటటువంటి వ్యక్తి దేవుని దూత! సర్వశరీరులు గడ్డి లాగా ఉన్నారు! వారందమంతా అడవి పువ్వులా ఉంది! మనిషికి ఎంత అందం ఉన్నా, ఎంత బలము బలగం ఉన్నా, ఆస్తి ఐశ్వర్యము ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్నవాడెవడైనా సరే, తను యాక్టర్ అయినా- డాక్టర్ అయినా- పాస్టర్ అయినా- మాస్టర్ అయినా, వాడు ఎవరైనా సరే, సామాన్యుడైనా, అందగాడైనా, అంద హీనుడైనా, చిన్నోడైన పెద్దోడైనా, స్త్రీ అయినా పురుషుడైన వారందమంతా ఒకరోజు వాడిపోబోతుంది! ఒకరోజు వాడు చనిపోయి భూమి మీద మట్టిలో కలిసిపోతాడు! కాల్చేవారైతే బుగ్గ అయిపోతాడు! ఈరోజు డబ్బున్నప్పుడు బలం ఉన్నప్పుడు ఎన్నో బడాయికబుర్లు చెప్పిన ఒకరోజు- ల మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళును అని ప్రసంగి 12 అధ్యాయంలో చెప్పబడినట్లు ఈ మట్టి తిరిగి మట్టిలో కలిసిపోతుంది!!!

అందుకే సర్వశరీరులు గడ్డిని పోలియున్నారు అని ఇక్కడ చెబుతున్నారు! గడ్డి కోసం, మనిషిని గడ్డితో పోల్చడం కోసం చూసుకుంటే “గడ్డి”– 37:27; 51:12; యాకోబు 1:10; 1 పేతురు 1:24-25.

యాకోబు 1:10

ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.

యాకోబు 1:11

సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో(నడకలలో) వాడిపోవును.

1 Peter(మొదటి పేతురు) 1:23,24

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

దీనినే ఎలుగెత్తి ప్రకటించమంటున్నారు!!! అంటే ఇక్కడ చెప్పబొయ్యే సత్యాన్ని మనుషులంతా తెలుసుకొనేలా చెయ్యి. ఇంతకు ముందు వచనాలకూ, తరువాతి వచనాలకూ ఈ భాగంలో ఒక వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 5వ వచనంలో దేవుని మహిమా తేజం గురించి ఉంది. మనిషి ఘనత ఎందుకూ కొరగానిది, అశాశ్వతమైనది, మహిమ అని అనిపించుకోవడానికి తగినది కాదు. మనిషి బలహీనుడు, గడ్డిలాగా ఎండిపోయేవాడు. జెరుసలంకు (లేక ఎవరికైనా) రక్షణ, ఆదరణ కల్పించేందుకు అశక్తుడు. కాబట్టి మనిషి చెయ్యలేని దాన్ని చేసేందుకు దేవుడు రావలసిందే.

ఇక 7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

కీర్తనాకారుడు అంటున్నారు Psalms(కీర్తనల గ్రంథము) 103:14,15,16

14.మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.

15.నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

వాడిపోతుంది– మానవ చరిత్ర సారాంశం, అందులో కనిపించిన అహంకారం, ఆడంబరం, శోభ అంతా ఈ మాటల్లో ఇమిడి ఉన్నాయి. అయితే తరాలు గడిచిపోతూ ఉండగా గతించిపోనిది ఒకటుంది – అదే దేవుని వాక్యం (కీర్తన 119:89; మత్తయి 5:18; 24:35; లూకా 16:17; 1 పేతురు 1:25). ఒక మనిషి నమ్మకం పెట్టుకోవడానికి పాత్రమైనదీ ఈ లోకమంతటిలోనూ శాశ్వతంగా నిలిచేదీ బైబిలు సత్యమే.

కీర్తనలు 119:89

(లామెద్‌) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.

మత్తయి 5:18

ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 24:35

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

లూకా 16:17

ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పి పోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము.

1పేతురు 1:24

గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

1పేతురు 1:25

మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

మరి నిత్యం ఉండే వాక్యం మీద నీ ఆశ చూపు మనస్సు నిలుపుతున్నావా లేక లోకాశలమీద ఆశ పెట్టుకుని నీ దృష్టి నిలుపుతున్నావా?

ధనవంతుడు తనకు కలిగిన సమృద్ధి ని చూసి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు, అదే రాత్రి చచ్చాడు.

Luke(లూకా సువార్త) 12:16,17,18,19,20,21,29,30,31,32

16. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.

17. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;

18. నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని

19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.

20. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.

21. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.

అయితే మన దృష్టి దేనిమీద ఉండాలి?

29. ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.

30. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.

31.మీరైతే ఆయన రాజ్యమును(అనేక ప్రాచీన ప్రతులలో-దేవుని రాజ్యమును అని పాఠాంతరము) వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.

32.చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్ర హించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది .

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*236వ భాగము*

యెషయా 40:9--11

9. సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.

10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది.

11. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తొమ్మిదవ వచనంలో నాల్గవ స్వరము వినిపిస్తుంది. ఇది సువార్త కోసమైన స్వరము.

సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.

ప్రియులారా అయితే ఈ సువార్త కోసం మనం గత భాగంలో విస్తారంగా ధ్యానించుకున్నాం! కాబట్టి మనం ముందుకు పోదాం! అయితే సువార్త అనే మాట మనకి మొట్టమొదటిగా బైబిల్ లో కీర్తనల గ్రంథంలో 40:9లో కనిపిస్తుంది! ఆ తర్వాత మనకి ఈ అధ్యాయంలో 40:9 లో కనిపిస్తుంది.!

సువార్త అనగా శుభవార్త లేదా మంచి వార్త. ఇక్కడ ఈ మంచి వార్త ఏమిటి అంటే యూదులకు ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది. చెర నుండి విముక్తి కలిగింది. కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా ప్రకటించమన్నారు! ఇంకా ఎత్తైన కొండమీదకి వెళ్లి గట్టిగా ప్రకటించమంటున్నారు! ఎత్తైన కొండ మీద నుండి ప్రకటించడం అనగా కొండమీద నుంచి గట్టిగా చెబితే అది దూరానికి ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది! అందుకే బైబిలు గ్రంథంలో ఉన్న సర్వ శ్రేష్టమైన ప్రసంగం, ఇప్పటికీ ఎప్పటికీ తిరుగులేని ప్రసంగం మత్తయి సువార్త ఐదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభులవారు చెప్పిన ప్రసంగం! అది కూడా కొండ మీద నుంచి చెప్పారు! అందుకే దీన్ని కొండ మీద ప్రసంగం అని పేరు ఉంది! కొండమీద నుండి చెప్తే అనేకమందికి వినబడుతుంది. అందుకే కొండమీదకి ఎత్తయిన పర్వతం మీదనుండి బలంగా గట్టిగా ప్రకటించమంటున్నారు!

ఏమని ప్రకటించాలి అంటే సీయోనుకి విడుదల దొరికింది. ఇక భయపడకు! ఇంతవరకు జీవితంలో ఎంతో భయం భయంగా జీవించారు! కాబట్టి నువ్వు ప్రకటించే సందేశంలో గంభీరత్వం గొప్పతనం ఉండాలి. కాబట్టి భయపడక ధైర్యంగా ప్రకటించమంటున్నారు! ఏమని ఇదిగో మీ దేవుడు అని!!! జాగ్రత్తగా ఆలోచిస్తే కీర్తన గ్రంథం 42 వ అధ్యాయంలో రెండుసార్లు, మూడో వచనంలోని పదో వచనంలోను నీ దేవుడేడి? నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు! నాకు రాత్రింబగళ్లు నా కన్నీళ్లే నాకు అన్నపానాలు అయ్యాయని అక్కడ భక్తుడు ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు దానికి సమాధానం ఇక్కడ కనిపిస్తుంది ఇదిగో మీ దేవుడు!!! ఇంతవరకు మీ దేవుడు ఏడి అని ఎగతాళి చేశారు కదా ఇదిగో మీ దేవుడు మా దేవుడు. చూడండిరా మా దేవుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మమ్మల్ని విడిపించడానికి ఆదుకోవడానికి మా పక్షాన యుద్ధాలు చేయడానికి మా దేవుడు వస్తున్నారు అంటూ గట్టిగా ప్రకటన చేయమంటున్నారు!

ఇక ఇదే 25వ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా రెండవ రాకడ సమయం లో ఆ రోజున వారు ఇలా ఉంటారు ఇదిగో ఈయన మన దేవుడు మనలను రక్షిస్తారని ఆయన కోసం నమ్మకంతో ఎదురు చూసాము, యెహోవా ఆయనే మనలను రక్షించినందు చేత సంతోషించి ఆనందిద్దాము అని అక్కడ ఉంటుంది. కాబట్టి ఇది క్రీస్తు రెండవ రాకడ కోసము చెప్పబడిన వాక్యము. రెండవ రాకడలో దేవుడు తొందరగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వచ్చి, తన ప్రజల పక్షాన యుద్ధాలు చేయబోతున్నారు!

అయితే దీనిలో మరో ఆత్మీయ అర్థం కూడా ఉంది అదేమిటంటే సువార్తను ప్రకటించే మనము దాన్ని గంభీరంగా ప్రకటించాలి. సిగ్గు పడకుండా ప్రకటించాలి. ఊరూరా ప్రకటించాలి. భయపడకుండా ప్రకటించాలి. నేటి రోజుల్లో క్రీస్తు విరోధులు ప్రపంచమంతా బయలుదేరి ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించే ప్రజలను అవమానిస్తూ, బెదిరిస్తూ, కొడుతూ, తిడుతూ, చెరసాలల పాలు చేస్తూ ఉంటుండగా ఇక్కడ వాక్యం నీకు నాకు సెలవిస్తుంది- భయపడక గంభీరముగా ఎత్తైన చోట్ల బిగ్గరగా ప్రకటించమని వాక్యము చెబుతుంది!! నీవు నేను కూడా అదే సత్య వాక్యాన్ని చేత పట్టుకొని, ధైర్యంగా యేసే నిజమైన దేవుడని, ఇంటింటా ప్రకటించాల్సిన అవసరం ఉంది!

స్టీఫెన్ గారిని పట్టుకొని మహాసభ ఎద్దు నిలబెట్టినా యేసే నిజమైన దేవుడని ప్రకటించారు! తర్వాత ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. అయినా ధైర్యమును వదలలేదు!

షడ్రకు మేషకు అబద్నెగోలను రాజు బంధించి, నా చేతి నుండి తప్పించే దేవుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగినప్పుడు, వారు అన్నారు- నెబుకద్నెజరు ఇందునుగూర్చి ప్రత్యుత్తరం చెప్పాలనే చింత మాకు లేదు. ఈ మండుచున్న అగ్నిగుండం నుండి రక్షించి తప్పించుటకు మా దేవుడు సమర్ధుడు అని అగ్నిగుండంలో కి వెళ్లిపోయారు!! అదే ధైర్యం అదే సంకల్పము అదే విశ్వాసము నేడు సువార్త ప్రకటిస్తున్న మనలో, నీలో, నాలో, అందరిలో ఉండాలి అని దేవుడు చెబుతున్నారు!!

పేతురు గారికి పౌలు గారిని ఆది అపొస్తులను ఎంత భయపించినా వారు భయపడలేదు. అపోస్తులుల కార్యం లో మనం దీన్ని చూడగలము! ధైర్యముగా సువార్త ప్రకటించారు మరణాన్ని లెక్కచేయలేదు! అందుకే ఆ సువార్త మన వరకు వచ్చింది!

మరి నీవు ఆ సువార్తను ప్రకటిస్తున్నావా?

అయితే ముఖ్యమైన విషయం- సువార్త ప్రకటించినప్పుడు కేవలం యేసు క్రీస్తు ప్రభువుల వారి జనన మరణ పునరుత్థానముల కోసం మాత్రమే కాకుండా, ఆయన వస్తున్నాడు మరలా అని ఆయన రాకడ కోసం కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది!

ఇక పదవ వచనం చూసుకుంటే ఇదిగో వినండి. ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వస్తున్నాడు ఆయన ఇచ్చే బహుమానము ఆయన చేతిలో ఉన్నది! చూడండి ప్రభువైన యెహోవా తానే శక్తి సంపన్నుడై ఆయన వస్తున్నాడు. ఆయన ఇచ్చే జీతం ఆయన యొద్ద ఉన్నది. రాకడ సమయం లో ఆయన ఎంతో ప్రభావముతోను మహిమతోను ఆయన రాబోతున్నారు అని మనము మత్తయి సువార్త లోని కొరింది పత్రికలోనూ థెస్సలోనికయ పత్రికలోనూ మనము చూడగలము.

మత్తయి 16:27

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

మత్తయి 24:30

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

మత్తయి 24:31

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:16

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

ప్రకటన గ్రంథం 1:7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

ఇక దేవుడు ఎందుకు వస్తున్నారు అనేది గత భాగాలలో విస్తారంగా చూసుకున్నాము. ఇక్కడ మరో కారణం చెబుతున్నారు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది.

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

యెషయా 62:11

ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

Matthew(మత్తయి సువార్త) 25:19,20,21

19. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.

20. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను.

21. అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో-ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

Matthew(మత్తయి సువార్త) 25:31,32,33,34

31. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

32. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

33. తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన అతి త్వరలో రాబోతున్నారు! ఆయన వచ్చేటప్పుడు ఆయన సిద్ధపరిచిన జీతం అయిన చేతిలో ఉంది! నీకు నాకు జీతం తీసుకుని రాబోతున్నారు! దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన కృపవరాలను బట్టి, మనం ఎంతగా దేవుని పరిచర్యలో, దేవునిలో భక్తిలో నడిచి, ఎంత మందిని ఆయన దగ్గరకు నడిపించేమో చూసి, దాని ప్రకారం నీకు నాకు ఆయన జీతం ఇవ్వబోతున్నారు! ఆరోజు భళా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుంటావా? సోమరి వైన చెడ్డదాసుడా అని పిలిపించుకుంటావా?

ఒకసారి పరిశీలన చేసుకో!

అవసరమైతే సరి చేసుకో!

దేవుడు నిన్ను దీవించును గాక!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*237వ భాగము*

యెషయా 40:11

11. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక పదకొండవ వచనం చూసుకుంటే గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ కాపరివలే ఇశ్రాయేలు/యూదా ప్రజలను నడిపిస్తాను అంటున్నారు. అలా నడిపించే క్రమంలో గొర్రెపిల్లలను రొమ్మున ఆనించుకొని భుజం మీద మోస్తాను. పాలిచ్చే తల్లులను నెమ్మదిగా నడిపిస్తాను అంటున్నారు. కారణం ఇంతకుముందు కాపుకాసిన కాపరులు బలిసిన గొర్రెలను మేకలను తినడమే తప్ప సరిగా కాయలేదు. తిని త్రాగేవారు. మందను పట్టించుకోలేదు. అందుకే ఆ గొర్రెలు తప్పుడు త్రోవలో వెళ్లాయి. శిక్షను అనుభవించారు. అందుకే ఇప్పుడు దేవుడు తానే కాపరిగా ఉండబోతున్నారు. ఆ కాపరి నిజమైన గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభులవారు!!!

Ezekiel(యెహెజ్కేలు) 34:2,3,4,5,6,7,8

2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.

3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,

4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.

5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

6. నా గొఱ్ఱెలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.

7. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి

8. కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

“చేతులతో...గుండెమీద మోయడం”– అనగా వారి బలహీనతనూ ఆయన ప్రేమ, వాత్సల్యతలనూ ఇది సూచిస్తున్నది. విశ్వాసులు ఆయనకు ఎంత ప్రియమైనవారు! ఇక్కడి సందర్భాన్నిబట్టి క్రీస్తు రెండవ రాక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు విషయంలో ఇది నిజం అవుతుందని తెలుస్తున్నది.

ఆయన కాపరిత్వము ప్రతి యుగంలోనూ, అన్ని సమయాలలోనూ, దేవుని ప్రజల విషయంలో మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 48:15

అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

యిర్మియా 31:10

​జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడిఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.

యెహేజ్కేలు గ్రంథం లో ఇంకా వివరంగా చెబుతున్నారు

Ezekiel(యెహెజ్కేలు) 34:10,11,12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31

10. ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగానా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

11. ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

12. తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱె లను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి

13. ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.

14. నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,

15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

17.​ నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్ల కును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.

18. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?

19. మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20.వకాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.

21. మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.

22. నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.

23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.

24. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.

25. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయు దును.

26. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును,

27. ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.

28. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.

29. మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవ మానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.

30. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

31. నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.

ఇప్పుడు నిజమైన గొర్రెలకాపరి యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు

John(యోహాను సువార్త) 10:7,8,9,11,12,13,14,15,16

7. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను .

8. గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.

9. నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

11. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.

12. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చెదరగొట్టును.

13. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

14. నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

16. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.

ఈ విషయం దావీదుగారికి తెలిసింది అందుకే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నారు. గాని బైబిల్ పండితుల ప్రకారం ఆవిషయం దావీదు గారికి వాళ్ల తాతగారు చెప్పారట చిన్నప్పుడే. ఒరేయ్ మనవడా! నీ చిన్న మందకు నీవు కాపరివి గాని నీకు కూడా ఒక కాపరి ఉన్నారు ఆయనే నీ సృష్టి కర్త, నీ దేవుడు! ఆయనను నీ కాపరిగా చేసుకో అన్నాడట తాతగారు ఓబేదు గారు! ఆయన మాటలను పట్టుకుని సాగిపోతూ ఉండగా, ఒక సాయంత్రం అడవిలో తన గొర్రె పిల్ల తప్పిపోయి వెతుకుతుండగా, సాతాను గాడు యెహోవా నా కాపరి అంటూ పాడుతున్నావు కదా. మరి ఇప్పుడు నీ గొర్రెకి నీకు కాపరి ఎవడూ? ఎవడు రక్షిస్తాడు అని చెబితే రాస్తున్నారు 23 వ కీర్తన, నీ దుడ్డుకర్రయు నీదండము నన్ను ఆదరించును... గాడాంధ కారపు లోయలలో సంచరించిన భయపడను..... కీర్తన ముగింపుకు గాడాంధకారము వెలుగుగా మారిపోయింది సాతానుగాడు పటాపంచలయ్యాడు. ఆరోజు నుండి దావీదుగారు చనిపోయే వరకు కేవలము దేవున్ని మాత్రమే తనకు కాపరిగా చేసుకున్నారు!

Psalms(కీర్తనల గ్రంథము) 23:1,2,3,4,5,6

1. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

2. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.

4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.

5. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

6. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

కీర్తనలు 28:9

నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.

కీర్తనలు 78:52

అయితే గొఱ్ఱెలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను

కీర్తనలు 80:1

ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

ప్రియ సహోదరి సహోదరుడా నీ కాపరి ఎవరు? నిజమైన గొర్రెలు కాపరి, నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువులవారిని నీవు కాపరిగా చేసుకున్నావా? ఆయన కాపరత్వంలో నే ఉన్నావా?! లేక ఇహలోక ఆశలను దురాశలను ధనమును నువ్వు కాపరిగా చేసుకున్నావా!!!! లేదా సాతాను గాడి కాపురత్వంలో ఉన్నావా???

పరిశీలన చేసుకో?!

సరి చేసుకో!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*238వ భాగము*

యెషయా 40:12--14

12. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?

13. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

14. ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా! ఇక ఈ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు దేవుని గుణాతిశయాలు, ఆయన గొప్పతనం గురించి కనబడుతుంది. 3:9-10 వచనాల్లో కూడా దేవుని గురించిన వర్ణన ఉంది. రాబోతున్న ఆ దేవుని గొప్పతనం ఇక్కడ వర్ణించబడింది. నిజ దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన గుణాలు, స్వభావం, ప్రభావం మహిమలను గురించి సరైన అభిప్రాయాలను కలిగివుండడం మనకు చాలా అవసరం. ఇది నెరవేరేందుకు ఈ అధ్యాయాన్ని వాడుకొంటే ఇది వెల కట్టేందుకు వీలుకాని భాగం.

ఇక 12 వ వచనం చూసుకుంటే తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? అంటున్నారు!

పుడిసిటి అనగా పిడికిలి లేదా దోసిలి. అనగా పిడికిలితో లేక దోసిలితో జలములను కొలిచారట దేవుడు. ఎంత గొప్ప దేవుడో కదా, ఆయన చేయి మరియు పిడికిలి ఎంత పెద్దవో కదా!

ఇక తన జేనతో ఆకాశముల కొల చూసేరట అనగా ఆకాశములు యొక్క పొడవు జానతో కొలిచేసారట అనగా ఆయన చేయి ఎంత పెద్దదో కదా! ఇక భూమిలోని మన్ను కొలపాత్రతో కొలిచి ఉంచినవాడు ఎవడు? ఒక త్రాసుతో పర్వతాలను తూచాడట! ఎంత గొప్ప దేవుడో కదా! తూనికచేత కొండలను తూచినవాడు ఎవడు అనగా మనము చూస్తున్న ఈ కొండలను త్రాసు పెట్టి పలాన కొండా, నువ్వు ఎంతుండాలి, ఇంతుండాలి అంటూ, ఇంత పరిమాణం ఉందో ఇంత పెద్దగా ఉండు అని దేవుడే చేసి పెట్టాడట! ఎంత గొప్ప దేవుడే కదా! నిజానికి మనం కొలిచిపెట్టడానికి ఈ భూలోకంలో ఉన్న ఏ క్రేను పనిచేయదు కానీ దేవుడే కొండలను వాటి స్థానంలో పెట్టాడు! గొప్ప దేవుడు మన దేవుడు! సర్వ సృష్టికర్త!

అందుకే ఆకాశమున సింహాసనము భూమి నా పాధపీఠము అంటున్నారు! ఆకాశమంతా సింహాసనం, భూమి పాదపీఠం!!! మరొకచోట అంటున్నారు కుడి కాళ్లు సముద్రం మీదను ఎడమకాలు భూమ్మీద నువ్వు పెట్టిన గొప్ప దేవుడు మన దేవుడు!!! ఇంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవడమే గొప్ప. ఆయన్ని రక్షకుడిగా దేవుడిగా మన స్నేహితుడిగా చేసుకుంటే దానంత ధన్యత ఈ లోకంలో మరి ఏదీ లేదు అని నా ఉద్దేశం!!!!

అయితే ప్రియులారా ఇక్కడ ఎలాగా అడిగారో యోబు గ్రంథం మొత్తం దేవుని వర్ణనతోనే నిండి ఉంది! అనేక వచనాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే చూసుకుందాం

Job(యోబు గ్రంథము) 28:24,25,26,27,28

24. ఆయన భూమ్యంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.

25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

26. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచి నప్పుడు

27. ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.

28. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

Job(యోబు గ్రంథము) 38:3,4,5,6,7,8,9,10,11,18,19

3. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.

4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

5. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.

6. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.

7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?

8. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?

9. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?

10. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు

11. నీవు ఇంత వరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?

18. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.

19. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?

సామెతలు 30:4

ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?

ఇక 13. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

ఇక యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రిగా ఆయనకు బోధించిన వాడు ఎవడు? ఎవరి వద్దకు వెళ్లి ఆయన ఆలోచన అడిగారు అని చూసుకుంటున్నావ్?

నిజానికి దేవుడికి బోధించేవాడు ఎవడు? ఆయనకు నేర్పించిన వాడు ఎవడూ?!!! ఆయనే సర్వాధికారి! సర్వాంతర్యామి! ఆయనకు ఉన్న జ్ఞానముతో పోల్చుకుంటే మనకు ఏమీ లేదు! ఆయన అమోఘమైన వాడు! ఆయన చేసిన మానవ శరీరాన్ని చూసుకుంటే ఆ జ్ఞానం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది.

ఇప్పుడు ఆయన ఆత్మకు నేర్పించిన వాడు ఎవడు? అందుకే యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటాది, ఆయన ఆలోచన సభలో నువ్వు ఉన్నావా?! దేవుడు చేసే ఏ నిర్ణయమైనా దేవునికి ఒక ఆలోచన సభ ఉంది, రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంటది అక్కడ, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే దేవుడు తన చేసే ఉద్దేశాలు కోసం తన దూతలతో ఆలోచించి కార్యాలు సఫలం చేస్తా ఉంటారు దేవుడు.

యోబు 15:8

నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

యోబు మొదటి అధ్యాయంలోని రెండవ అధ్యాయంలోని అక్కడ దేవదూతలు కూడిన సమావేశ కూటాలు రెండూ ఇలాంటి దేవుని ఆలోచన సభలో జరిగే సమావేశాలు అని గ్రహించాలి!

ఇక రోమా పత్రికలో పౌలు గారు అంటున్నారు

Romans(రోమీయులకు) 11:33,34,35,36

33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?

36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

1కోరింథీయులకు 2:15

ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

1కోరింథీయులకు 2:16

ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

ఇక తర్వాత వచనం చూసుకుంటే 14. ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?

దేవునికి జ్ఞానము కలుగజేసిన వాడు ఎవడు, న్యాయమార్గాన్ని గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు? ఆయనకి అనగా దేవునికి జ్ఞానాన్ని బోధించినోడెవడో, బుద్ధి మార్గం చెప్పినవాడు ఎవడు? అని ఇక్కడ అడుగుతున్నారు!!!! ఏమండీ సృష్టికర్త జ్ఞానవుగలవాడు దేవుడే కదా, మరి ఆయనకి ఎవడు బోధించగలవాడు ఎవడు? ఈ లోకంలో ఉన్న ఏ ఆత్మ ఏ ఒక్కరికీ ఆయనకు బోధించే సామర్థ్యం లేదు!!! ఆయన నుండి నేర్చుకోదగిన వారు మాత్రమే అని గ్రహించాలి!! అయితే దేవుడు లేడు ఆయనకు బుద్ధి లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు! వాళ్ళు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేసేవారు అని బైబిల్ చెబుతుంది!!! మరల యోబు గ్రంథంలోని ఇలాంటి వాటికి జవాబులు దొరకవచ్చు చూద్దాం ఒకసారి!!!

యోబు 12:13

జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు.

యోబు 12:14

ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

యోబు 12:15

ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచి వేయును.

యోబు 12:16

బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.

యోబు 12:17

ఆలోచన కర్తలను వస్త్ర హీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.

యోబు 12:18

రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.

యోబు 21:22

ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

Job(యోబు గ్రంథము) 36:22,23,24,26,27,28,29,30,31,32,33

22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?

23. ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?

24. మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.

26. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.

27. ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షమువలె అవి పడును

28. మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును.

29. మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?

30. ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.

31. వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు

32. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును

33. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.

కొలస్సీయులకు 2:3

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

Isaiah(యెషయా గ్రంథము) 55:8,9,10,11

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

కాబట్టి ఆయన జ్ఞానమునకు మితి లేదు! అది అమోఘమైనది! ఆయనను ప్రశ్నించకుండా ఆయన చేతి కింద ఆయన జ్ఞానము క్రింద, ఆయన వాక్యము క్రింద బ్రతకడం నేర్చుకుందాం!!! బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి!

కాబట్టి ఆయన చెప్పినట్లు చేసి పరమునకు వెళ్దాం!!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*239వ భాగము*

యెషయా 40:15--21

15. జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.

16. సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు

17. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.

18. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?

19. విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును

20. విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును.

21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా! 15వ వచనం నుండి చూసుకుంటే

15. జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.

16. సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు

17. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును అంటున్నారు.

దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన దృష్టిలో భూగోళం ఇసుకరేణువంత చిన్నగా కనిపిస్తుంది. దేవుని చేతిలో భూమి ఎంత తేలికగా ఉంటుందంటే దానికసలు బరువు ఉన్నట్టే ఉండదు.

అయితే మనిషి యెషయా 2:22లో

తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

కీర్తనలు 62:9

అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు.

చూడండి మనిషి చేద నుండి జారిపోయే నీటి బిందువులను పోలి ఉన్నాడు, త్రాసు మీద ఎగిరిపోయే దూళి లాంటివాడు మనిషి! సమిదలకు లెబనాను చాలకపోవును దహన బలికి దాని పశువులు చాలవు, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టే ఉన్నారు. ఆయన దృష్టికి అభావముగాను శూన్యం గాను ఎంచబడును అంటున్నారు. దీనికోసం చూసుకుంటే మనిషి దేవుని దగ్గర ఏమాత్రం ఎన్నదగినవాడు కాడు! దేవునితో సమానమైన వాడు కాడు అని ఇక్కడ అర్థం అవుతుంది! మనిషి జీవితం నీడ లాంటి జీవితం! ఈరోజు ఉండి రేపు ఎగిరిపోయే జీవితం. పువ్వు లాంటి జీవితం! ఓ ఎండ కాసిన వెంటనే అది వాడిపోతుంది! రాలిపోతుంది! గడ్డి పువ్వు లాంటి జీవితం వారిది! అయితే దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు.!!!!

అయితే తరువాత వచనంలో సమిధలకు లెబనాన్‌ చాలదు అంటున్నారు. లెబానోనులో దేవదారు చెట్లు నిండిన పెద్ద అడవులు ఉన్నాయి. వాటన్నిటినీ వంట చెరుకుగా మార్చి నిప్పు అంటించి ఆ అగ్నిలో లెబానోనులో ఉన్న పశువులన్నిటినీ దేవునికి బలిగా అర్పించినా అది ఆయన ఘనతకు, యోగ్యతకు సరిపోదు ఇదీ అసలు భావము!!!

1రాజులు 8:27

నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

Psalms(కీర్తనల గ్రంథము) 50:7,8,9,10,11,12,13,14,15

7. నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

8. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9. నీ యింట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10. అడవి మృగములన్నియు వేయి కొండల మీది పశువులన్నియు నావేగదా

11. కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14. దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

Acts(అపొస్తలుల కార్యములు) 17:24,25,26,27,28,29,30

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.

26. మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,

27. తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.

28. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

29. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.

30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

ఇక 17వ వచనములో అంటున్నారు ఆయన దృష్టిలో ఇక జనములు ఎందుకు లెక్కలోకి రావు ఎందుకంటే ఆయన మహా ఘనుడు ఆయన మహోన్నతుడు.

లోకములోని జాతులను, జనాలను, సంభవాలను తన ఇష్టం వచ్చినట్టు అదుపులో ఉంచడం దేవునికి సమస్య కాదు. ఆయన ఉద్దేశాలను పడద్రోయగల శక్తి భూమిపై ఏదీ లేదు. యెషయా గ్రంథమంతటిలోనూ దేవుడు తన ఆశయాలను నెరవేర్చడానికి వివిధ జాతులను వాడుకోవడమూ, తన సంకల్పానుసారంగా వాటికి ఏమీ బలం లేనట్టుగా నాశనం చెయ్యడమూ కనిపిస్తూవుంది . ఈ సర్వసృష్టి ఆయన ఆధీనంలో ఉంది. అందుకే తర్వాత వచనాలలో దేవుడు మానవులను ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను నిలదీసి అడుగుతున్నారు 18. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?

19. విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును

20. విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును.

ఇక్కడ మీరు ఎవరితో నన్ను సమానునిగా చేస్తారు అని నిలదీస్తున్నారు!!!

దేవుని ఈ మహా ఘనతను బట్టి ఆలోచిస్తే ఆయనకు ప్రతినిధిగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైనా విగ్రహాన్ని తయారు చెయ్యబూనుకోవడం ఎంత తెలివితక్కువ పనో చూడగలం. దేవునికి ప్రతినిధిగా ఉండడానికి దేవుని పోలికలో ఉన్నవాడొకడు ఉన్నాడు.

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

హెబ్రీయులకు 1:2

ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో-యుగములను) నిర్మించెను.

హెబ్రీయులకు 1:3

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక

హెబ్రీయులకు 1:4

మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.

హెబ్రీయులకు 1:5

ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?

అయితే తర్వాత వచనాల్లోని ఇలాంటి గొప్ప దేవుడిని నిజమైన దేవుని మహోన్నతుడైన దేవుణ్ణి కర్రలు మానులు తీసుకొచ్చి విగ్రహాన్ని చేసి, దేవునితో సమానంగా చేయడం ఎంతో అవివేకమైన పని అని దేవుడు చెప్తున్నారు!!! ఇంక తర్వాత తీసుకుని వచ్చిన ఈ కర్ర రాయి ఇవి అసలు ఇంతకుముందు ఏమిటి? విగ్రహం గా చేసిన తర్వాత అది ఏమిటి? మీరు ఏమైనా దీనికోసం ఆలోచిస్తున్నారా? మీకు ఏమైనా ఈ విషయంలో మీ బుర్ర పనిచేస్తుందా అని దేవుడు అడుగుతున్నారు.

ఇంకా విగ్రహాలు తయారు చేసే విధానం కోసం ఇదే యెషయా గ్రంథంలో రాబోయే అధ్యాయాలలో ఈ విధంగా మనం చూడగలం! సగం చెక్క తోటి విగ్రహం చేసి, మిగతా దానితోటి చలికాచుకొని, ఆ చలికాచుకున్న ముక్కలో సగం ముక్కనే నువ్వే నా దేవుడవు అంటూ ఘోరమైన విగ్రహారాధన జరిగిస్తున్న ఈ ప్రజలకు తెలివి లేదు అని దేవుడు ఎద్దేవా చేస్తున్నారు ఇక్కడ.

యెషయా 41:7

అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.

Isaiah(యెషయా గ్రంథము) 42:17,18

17. చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.

18. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి.

ఎందుకు సిగ్గుపడుతున్నారు అంటే

Isaiah(యెషయా గ్రంథము) 44:9,10,11,12,13,14,15,16,17,18,19,20

9. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

10. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?

11. ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

13. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.

14. ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

15. ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

16. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు

17. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

18. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.

19. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

20. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.

ఇప్పుడు ఇలా తీసి చేసిన ఈ బొమ్మను దేవునితో సమానం చేస్తున్నారు! నిన్ను నన్ను పుట్టించిన దేవాది దేవునితో సృష్టికర్తతో ఈ జీవములేని బొమ్మను ,విగ్రహాన్ని, దేవునితో సమానం చేస్తూ దేవునికి ఆయాసం కలిగిస్తున్నారు.

ప్రియ దైవజనుమా నీవు ఏమనుకుంటున్నావ్! నీ దేవుడు మాట్లాడే దేవుడని, నిన్ను నన్ను సృష్టించిన వాడు అనేది నీకు తెలియదా? నీవు కూడా ఇంకా ఈ బొమ్మలలో శక్తి ఉందని అనుకుంటున్నావా! ఒకవేళ నీవు ఇలాంటి స్థితిలో ఉంటే సిగ్గుపడు! ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి పని చేసి, వారిని ఐగుప్తు దేశము నుండి దాస్యము నుండి తీసుకొచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఓ ఇశ్రాయేలు నీవే మా దేవుడు అని మ్రొక్కారు అరణ్యంలో మరియు ఇశ్రాయేలు దేశం వచ్చేక కూడా!!! అందుకే దేవుడు వారిని చెరపాలు చెరలపాలు చేసేసారు దేవుడు.

కాబట్టి మార్పు నుండి సిగ్గు నొంది దేవుని చేతిని పట్టుకో!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*240వ భాగము*

యెషయా 40:21--26

21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

22. ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

23. రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును.

24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

26. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా! 21వ వచనం నుండి చూసుకుంటే మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

ఇక్కడ మీకు తెలీదా మీరు వినలేదా మొదటినుంచి ఎవరూ మీతో చెప్పలేదా? మీరు గ్రహించలేకున్నారా? ఎవరు మీతో చెప్పలేదా! ఇంతవరకు నేను చేసిన మహా గొప్ప కార్యాలు, భూమిని స్థాపించడానికి మీరు దాన్ని గ్రహించలేకపోయారా? అని దేవుడు అడుగుతున్నారు ఇక్కడ!!!

కీర్తనలు 19:1

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

కీర్తనలు 19:2

పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

పౌలుగారు బర్నబా గారు ఏమంటున్నారో చూద్దాం

Acts(అపొస్తలుల కార్యములు) 14:15,16,17

15. అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.

16. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను.

17. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.

Romans(రోమీయులకు) 1:18,19,20,21,22,23

18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.

20. *ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు*.

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

22. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23. వారు *అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి*.

ఇక తరువాత వచనంలో ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

ఈ వచనం ధ్యానం చేసే ముందు ఇక్కడ భూ మండలము అని దేవుడు చెప్తున్నారు! మండలము అనగా ఇంగ్లీషులో సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అనగా భూమి గుండ్రముగా ఉన్నది అయితే ఒక క్రైస్తవ విరోధి ఒక పనికిమాలినోడు అనేకసార్లు సోషల్ మీడియాలో ఇలా ఏడుస్తున్నాడు: మన దేవుడు భూమి బల్లపరుపుగా ఉన్నది అని చెప్పాడని సైన్స్ ఏమో భూమి గుండ్రంగా ఉంది అని చెబుతూ ఉంటే యేసు క్రీస్తు భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్తున్నాడు అన్న ఈ పనికిమాలిన వాడు చెప్తున్నాడు. వీడెప్పుడైనా ఎప్పుడైనా బైబిల్ చదివాడా?!! వాళ్లకి జవాబు ఇచ్చే వాళ్ళు కూడా బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోలేక సరియైన జవాబు ఇవ్వట్లేదు వాడికి!!! భూమి గుండ్రంగా ఉంది భూమండలము అని బైబిల్ లో అనేకసార్లు ఉంది!

మండలము అనగా గుండ్రముగా ఉన్నది! మనుషులకు నివాసయోగ్యమైన భూగోళము మీద ఆయన చేసిన మేఘాలు వచ్చి వర్షం కురిపించి వెళ్లిపోతాయని యోబు గ్రంథం 37వ అధ్యాయంలో క్లియర్ గా ఉంది! ఈ పనికిమాలినోడు ఎప్పుడైనా బైబిల్ చదివాడా కాబట్టి ఇలాంటి క్రీస్తు విరోధుల మాటల లక్ష పెట్టొద్దు! క్రీస్తు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంది భూగోళము అని బైబిల్ చెబుతోంది!

యెషయా 40:22

ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

It is he that sitteth upon the *circle of the earth*, and the inhabitants thereof are as grasshoppers; that stretcheth out the heavens as a curtain, and spreadeth them out as a tent to dwell in:

యోబు 37:12

ఆయన వలన నడిపింపబడినవై *నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద* మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును.

సరే ఇక్కడ ఆయన భూ మండలం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇంకా నరులందరూ ఆయనకి మిడతలు లాగా కనిపిస్తున్నారు. ఆయన ఆకాశాన్ని విశాల పరిచాను అని చెప్తున్నారు. దీనికోసం ఆలోచిస్తే ఆలోచిస్తే

యెషయా 66:1

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?

యెషయా 66:2

అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

కీర్తనలు 2:4

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు.

Psalms(కీర్తనల గ్రంథము) 47:2,7,8

2. యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.

7. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.

8. దేవుడు అన్యజనులకు రాజైయున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై యున్నాడు.

ఇక భూమి మీద మనుషులు దేవునికి మిడతల లాగా కనిపిస్తున్నారు! మనకి కూడా విమానంలో వెళ్తూ క్రింది కి చూస్తే ఈ కొండలు గాని ఇక ఈ చెట్లు ఇల్లు అన్ని చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి. కొంచెం భూమికి దగ్గరలో విమానం వెళ్తున్నప్పుడు మనుషులంతా చిన్న చిన్న పురుగుల్లా కనిపిస్తా ఉంటారు మనకి! మరి అంత పెద్ద దేవుడు అంత దూరం నుంచి చూస్తూ ఉంటే మనం కూడా దేవునికి అలాగే కనిపిస్తా ఉంటాము!

ఇక ఆకాశ విశాలమును విస్తరించుట కోసం చూసుకుంటే

యెషయా 42:5

ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

యెషయా 44:24

గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను.

యెషయా 51:13

బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

కీర్తనలు 104:2

వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచియున్నావు.

కీర్తనలు 104:3

జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు.

ఇక ఇదే వచనములో ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. దేనిని నివాస స్థలముగా ఏర్పరిచారు? భూమిని! మీద యోబు గ్రంథం రిఫరెన్స్ చూసాము కదా యోబు 37:12

ఆయన వలన నడిపింపబడినవై *నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద* మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును.

ఈ లోకంలో అనేక గ్రహాలు ఉన్న ఈ సూర్యగోళంలో భూమి తప్ప మరే గ్రహము నివాసయోగ్యమైనది కాదు అలాగే మిగతా గోళములలో సూర్యుడు ఉన్నాడో లేదో తెలియదు గాని అక్కడ కూడా మరి దేవుడు నివాసయోగ్యంగా భూమిలాంటి గ్రహాన్ని చేశారో లేదో మనకు తెలియదు గాని ప్రస్తుతానికి కేవలం భూమి కోసమే చెప్తున్నారు! నివాసయోగ్యముగా మానవులకు నివాసయోగ్యంగా దేవుడు భూమిని చేసి ఆ తర్వాత మనిషిని చేశారు! దేవుడు అంత గొప్ప దేవుడు అంతటి ప్రేమ దయగల దేవుడు మన దేవుడు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*241వ భాగము*

యెషయా 40:23--26

23. రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.

24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

26. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా! 23వ వచనం నుండి చూసుకుంటే రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.

24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

ఈ లోకంలో గొప్ప గొప్ప రాజులు రాజ్యాలు లేకుండా దేవుడు చేసేసారు! రాజులు వచ్చారు వారి సామ్రాజ్యం వచ్చింది! పోయింది! అస్సూరు సామ్రాజ్యం వచ్చింది బబులోని వారి ద్వారా దేవుడు వారిని ఎగరగొట్టేసాడు! తర్వాత బబులోని సామ్రాజ్యం, నెబుకద్నెజరు రాజు వచ్చారు, మాదియపారశీక అలియన్స్ సామ్రాజ్యం ద్వారా మాదీయ పారసీక రాజుల ద్వారా ఆ సామ్రాజ్యాలను ఎగరగొట్టేసాడు దేవుడు. మాదీయ ఫారసీక రాజ్యాల్ని గ్రీకు సామ్రాజ్యం ద్వారా ఎగరగొట్టేసాడు దేవుడు. గ్రీకు రాజ్యాన్ని రోమా సామ్రాజ్యం ద్వారా తీసి పారేశాడు దేవుడు! రోమా సామ్రాజ్యాన్ని ప్రజాస్వామ్యం ద్వారా తీసి పారేశాడు దేవుడు. కాబట్టి ఇలా రాజులను తీసి పారేస్తూ ఉంటాడు! మంత్రులను అధికారులను తన కిష్టము వచ్చినట్లుగా తీసిపారేసే దేవుడు మన దేవుడు! కేవలం దేవుని ఉద్దేశ్యం ద్వారా దేవునికి ఇష్టమైన వారినే రాజులుగా ఉంచుతాడు! ఆయన అధికారులుగా నాయకులుగా ఉంచుతారు ఇదే ఈ వచనం చెబుతుంది!

యెషయా 34:12

రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు దాని అధిపతులందరు గతమైపోయిరి.

యెషయా 41:2

తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.

యెషయా 43:13

ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

సామెతలు 21:1

యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

సామెతలు 21:2

ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.

దానియేలు 4:32

తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

దానియేలు 4:35

భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

ఇంకా ఈలోక అధికారులు రాజులకోసం ఏం చెబుతున్నారు అంటే 24. వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

కీర్తనలు 1:4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

అందుకే మరలా 25,26 వచనాలలో అంటున్నారు దేవుడు

25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

26. మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.

18వ వచనంలో అడిగిన ప్రశ్న మరోసారి రెట్టిస్తూ అడుగుచున్నారు దేవుడు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? ఈలోకంలో ఉన్న ఎవరితోనూ మనము దేవునికి సాటిచేయలేము!

ఇక 26వ వచనంలో తాను చేసిన సృష్టి ని చూపిస్తూ మీరు చేసుకున్న ఆ విగ్రహాలు వీటిని చేయగలిగాయా అంటున్నారు. దేవుని సృష్టిని మానవులు ఆలోచనా పూర్వకంగా చూచి అది చెప్పే సందేశాన్ని వినాలని దేవుడు కోరుతున్నాడు. వారు అలా చేస్తే జీవితం పట్ల వారి మనస్తత్వమంతటినీ అది మార్చివేసి దేవుని చెంతకు వెళ్ళేదారిలో వారిని పెట్టగలదు. కీర్తన 19:1-4 చూడండి.

Psalms(కీర్తనల గ్రంథము) 19:1,2,3,4

1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

2 .పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

3. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.

4. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లు చున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

మనందరితోనూ దేవుడీమాటలు చెప్తున్నాడు: నక్షత్రాలకేసి చూడండి, మనసు పెట్టి ఆలోచించండి! “ప్రతి దానికీ”– మన నక్షత్ర వీధిలో కంటికి కనిపించే నక్షత్రాలు కొన్ని వేలు మాత్రమే ఉన్నా, అందులో అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్ర వీధులు అనేక కోట్లకొద్దీ ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడే చేశాడు. అవన్నీ ఆయనకు తెలుసు. వాటన్నిటినీ నిలిపి ఉంచేది ఆయనే.

ఇదంతా చెప్పాక మరల అంటున్నాడు దేవుడు యాకోబు అసలు ఈ సృష్టిని పరిశీలించేవా నువ్వు. ఇంత గొప్ప దేవుడైన నన్ను వదిలేసి విగ్రహాల వెనకాల తిరుగుతావా యాకోబు అని దేవుడు బాధపడతున్నాడు. యాకోబు అనగా యూదులు ఇశ్రాయేలీయులు అని అర్థం

Isaiah(యెషయా గ్రంథము) 40:27,28,29

27. యాకోబూ నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?

28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

29. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

చూడండి నా మార్గము దేవునికి కనబడలేదు నేను ఏం చేస్తున్నానో దేవుడు చూడటం లేదు. నేను చీకట్లో ఏం చేసినా దేవుడే పట్టించుకోవటం లేదు అనుకుంటున్నారు. భూదిగంతములను సృజించిన యెహోవా ఆయన అలయడు ఆయన జ్ఞానాన్ని నువ్వు శోధించలేవు రా అని బైబిల్ చెబుతుంది.

కాబట్టి మనము కూడా మన మార్గాలు సరి చేసుకుందాం! దేవునియందు నిజానికి ఆయన ఎవరో, ఆయన ఎంత భయంకరుడు, ఆయన ఎంత గొప్పవాడో ఆయనను గ్రహించి ఆయన కరుణను ఆయన జాలిని అర్థం చేసుకొని ఆయనకు ఇవ్వాల్సిన భక్తి ఆయనకు ఇవ్వాల్సిన భయము ఆయనకు ఇద్దాం!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*242వ భాగము*

యెషయా 40:27--31

28. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

29. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

30. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

31. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా! 28వ వచనం నుండి చూసుకుంటే నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

“యెహోవా”– ఇది ఎవరికి తెలిసినా, తెలియకపోయినా యూదులకు మాత్రం తప్పక తెలిసి ఉండాలి. ఇజ్రాయేల్ వారి దేవుడు యెహోవా ఏకైక దేవుడు

నేను తప్ప వేరొక దేవుడు లేనేలేడు అంటున్నారు దేవుడైన యెహోవా!!!

యెషయా 43:10

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

యెషయా 43:11

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.

యెషయా 43:12

ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

యెషయా 44:8

మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.

యెషయా 45:5

నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

కీర్తనలు 18:31

యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

ఇక మన దేవునికి అలసట గాని బడలిక గాని లేదు. అనగా ఈ వచనంలో రాసివున్నదాన్ని చేయగల దేవుడు భూమిపై తన ప్రజలమధ్య తాను చేస్తున్న పనులవల్ల అలసిపోడు. కాబట్టి ఆయనకున్న జ్ఞానాన్ని పరిశోధించి

తెలుసుకోవడం అసాధ్యం.

Isaiah(యెషయా గ్రంథము) 55:8,9

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

కీర్తనలు 147:5

మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.

రోమీయులకు 11:33

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

రోమీయులకు 11:34

ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

కాబట్టి ఆయన గొప్ప తనం గ్రహించి ఆయనకు భయపడి ఆయనను పూజించి సేవించాలి!

ఇక తర్వాత మూడు వచనాలలో ఆయన మంచితనం గొప్ప తనం కనిపిస్తుంది

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

30. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

31. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

క్రింద ఇవ్వబడిన రిఫరెన్స్ లలో ఆయన బలముకోసం చూసుకోవచ్చు

నిర్గమ 15:2; కీర్తన 18:1, 32-36; 68:35; 73:26; 119:28; 2 కొరింతు 12:9-10; ఎఫెసు 1:18-19; 3:16.

ఇక యవ్వనస్తుల కోసం 6-8 లోని వివరణలో యువతరం కూడా ఉంది. ఆది 8:21 లో కూడా ఇంతే. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా యువకులకు సుదీర్ఘమైన పందెం, కష్టమైన జీవన పోరాటం కోసం సొంత బలం చాలదు. దేవునిలో వారు బలాన్నికనుగొంటే తప్ప, పరీక్షకు తట్టుకొని నిలవలేరు. అయితే నేటి దినాలలో అనేక మంది యవ్వనస్తులు విపరీతంగా వాదించేది ఏమిటంటే యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు అనగా యవ్వనస్తులు తప్పకుండా పాపం చేస్తారు. అదేం పర్వాలేదు. దేవుడు దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు దానిని అంటూ విపరీతంగా వాదిస్తున్నారు!! అది కానే కాదు!! యవ్వనస్తులకు కూడా శ్రమలు శోధనలు వస్తాయి అయితే వారు దేవుని ఆశ్రయిస్తే వాక్యము మీద ఆనుకుంటే తప్పకుండా వాళ్లు సోలిపోయిన తప్పిపోయిన తిరిగి లేస్తారు అనేదే ఇక్కడ భావన!!!

అయితే చివరి వచనంలో అంటున్నారు! ఇలా తప్పక సొమ్మ సిల్లిపోయిన వారు యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తే ఓ యవ్వనస్తుడా, దేవుని కోసం ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొంది మరలా నీవు లేచి ఆలయక క్రీస్తు కోసం పరిగెత్తగలవు! అనేక ఆత్మలను గెలవ గలవు అనేది దీని ఉద్దేశం.!

ఈ అపవిత్ర లోకంలో పవిత్రంగా నడుచుకోవాలంటే, జీవిత యాత్ర ఆనందంగా ముగించాలంటే, దేవునికిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యం కావాలంటే మన బలం చాలదు. మన అల్ప బలానికి మారుగా దేవుని అమిత బలాన్ని పొందడం నేర్చుకోవాలి (వ 28,29. ఎఫెసు 1:18-21 చూడండి – విశ్వాసులకు క్రీస్తులో దొరకగల బలం ఎలాంటిదో తెలుస్తుంది). విశ్వాసంతో దేవునివైపు చూస్తేనే ఇది దొరుకుతుంది. మనలో మనకోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. మత్తయి 11:28-30 యువకులైనా, వృద్ధులైనా అలసిపోయినవారికి మరి కొన్ని ఆదరణ వాక్కులున్నాయి.

Matthew(మత్తయి సువార్త) 11:28,29,30

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

మరి ఆయన వద్దకు నేడే పరుగిడి రాగలవా ప్రియ యవ్వనస్తుడా! ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను ముద్దాడి నీ శ్రమ తీర్చి నిన్ను నీ పరుగులో నిలబెట్టి చివరికి ఆ పరమునకు నిన్ను తీసుకొని వెళ్ళగలరు!!!

ఆయన పాదాలు పట్టుకుని పరలోకం పట్టుకో!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*243వ భాగము*

యెషయా 41:1--5

1. ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

2. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.

3. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.

4. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.

5. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 40వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 41వ అధ్యాయం చూసుకుందాం! ఈ అధ్యాయం లో కూడా విగ్రహాలు ఎంత జీవము లేనివి వాటిని పూజించేవారు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అనే విషయం చెబుతున్నారు. అయితే ఈ అధ్యాయం మొదట్లో కోరేషు తూర్పు నుండి వచ్చి, తన ప్రజలను ఎలా విమోచిస్తారు, ఈ బబులోను వారు ఇశ్రాయేలీయులు ఇక అస్సూరు వారు చేసిన, చేసుకున్న విగ్రహాలకి కోరేషు ఏ విధముగా తీర్పు తీర్చబోతున్నాడు అనేది మొదటి ఐదు వచనాలు మనకు కనిపిస్తుంది.

యెహోవాదేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దీనికి అర్థం – ఇతర జనాలు లేదా అన్యజనులు తమ విగ్రహాలతో, దేవుళ్ళతో ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ 40వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నదాన్ని తప్పకుండా వినాలి. తమకు చేతనైన రీతిలో బలం పుంజుకొని వచ్చి ఇష్టముంటే దేవునితో వాదించాలి. వారు లేదా వారి విగ్రహాలైనా దేవునితో వాదించాలి. చాలెంజ్ కి పిలుస్తున్నారు ఇక్కడ!!! నీకు దమ్ముంటే వాదించండి లేకపోతే నోరు మూసుకొని మౌనంగా కూర్చోండి అంటున్నారు దేవుడు ఇక్కడ!

మా దేవుడు ఇంత మా దేవత అంతా అని విగ్రహాల కోసం పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా, ఇప్పుడు దేవుడు చేస్తున్న చాలెంజ్ కి జవాబు ఇమ్మని దేవుడు అడుగుతున్నారు ఇక్కడ!

రెండో వచనం చూసుకుంటే రెండో వచనంలో తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు! ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు! రాజులను లోపరచుచున్నాడు! ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు! ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు.

ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి ఈ రేపి పిలిచిన వాడు ఎవడు? దేవుడు తూర్పు నుండి ఎవరినో రేపి దేవుని ప్రవర్తన దేవుని ఆలోచన చొప్పున జరిగించే వాడిని దేవుడు తీసుకొస్తున్నాడు! తూర్పు నుండి వచ్చేవాడు ఎవరూ అని ఆలోచిస్తే ఆ వ్యక్తి తప్పకుండా పారసీక లేదా పర్షియా రాజు కోరెషురాజు అని అర్థమవుతుంది! గతంలో అనేక సార్లు చెప్పిన విధంగా ఈ బబులోను వారి ఆధిక్యము ఎక్కువైపోతుంది, ఒంటరిగా వారిని గెలవలేము అని గ్రహించి నెబుకద్నెజరు రాజు సమయములో ఆయన చనిపోయే ముందు మాదీయ పారసీక అలయన్స్ ఒకటి ఏర్పడింది. ట్రీటీ ప్రకారము మొదటగా ఒక దేశానికి వెళ్తారు వీళ్ళు ఆ ప్రాంతాన్ని గెలుచుకుంటారు. ఆ ప్రాంతంలో దొరికిన సమస్తము రెండుగా పంచుకుంటారు. ఆ తర్వాత మొదట గెలిచిన రాజ్యానికి పర్షియా లేదా పారసీకులు రాజుగా ఉంటారు! తర్వాత గెలిచిన దానికి మాదీయులు మిడియా వాళ్ళు రాజుగా ఉంటారు! ఇలాగా వారు అలయన్స్ గా ఏర్పడి ట్రీటీగా ఏర్పడి ఆ ట్రీటీ ప్రకారము బబులోని సామ్రాజ్యాన్ని గెలవడమే కాకుండా అనేక దేశాలను వెళ్ళి గెలుచుకున్నారు!

అయితే ఇప్పుడు ఈ నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు దేవుడే! ఆ తూర్పు నుండి వచ్చేవాడు పర్షియా రాజైనా లేదా పారశీక రాజైన కోరేసు అని గ్రహించాలి! ఇక ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు అనగా ఆయన అనగా దేవుడు, అతనికి అనగా కోరెషురాజు కి జనములను అనగా అనేక దేశాల ప్రజలను అప్పగిస్తున్నాడు! రాజులను లోపరుస్తున్నాడు! రాజులను ఎవరికి లోపరుస్తున్నాడు అంటే కోరేసుకు లోపరుస్తున్నాడు!

ఇక ఇతర జనులను ధూళి వలే వారిని అతడు ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోయే పొట్టు వలే అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు. ఇది దేవుడు చెబుతున్నారు!!

ఇక ఈ కోరెషురాజు కోసం చూసుకుంటే

తూర్పు”– అంటే ఇజ్రాయేల్ కి తూర్పు దిశ. తూర్పు నుండి వచ్చేవాడు కోరెషురాజు!!

యెషయా 44:26

నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

యెషయా 44:27

నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను

యెషయా 44:28

కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పు చున్నాను.

యెషయా 45:1

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

యెషయా 45:13

నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును.

యెషయా 46:11

తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.

యెషయా 46:12

కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి.

జాగ్రత్తగా గమనిస్తే రాజులు న్యాయవంతులైనా కాకపోయినా, ఆ విషయం వారికి తెలిసినా తెలియకపోయినా, దేవుడు తన న్యాయకరమైన ఆశయాలు నెరవేర్చేందుకు వారిని వాడుకొంటాడు. ఈ వచనం ప్రకారం కోరెషును అనేక దేశాలపై పాలకుణ్ణిగా చేయడం దేవుని ఉద్దేశం. అంతేకాక బబులోను ప్రవాసంనుండి తన ప్రజలను ఇస్రాయేల్‌కు తిరిగి పంపేందుకు దేవుడు కోరెషును వాడుకున్నాడు (ఎజ్రా 1:1-4; 6:3-5).

ఇక మూడవ వచనం చూసుకుంటే అతడు వారిని తరుముచున్నాడు! తాను ఇంతకుముందు వెళ్ళనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు. ఇక్కడ వారిని తరుపుచున్నాడు అనగా అన్య దేశస్తులను ప్రతి జనాలను తరుముతున్నాడు ఇంతకుముందు అతడు వెళ్లని త్రోవను కూడా చాలా సురక్షితముగా దాటి పోతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు!

చరిత్ర ప్రకారం క్రీ.పూ. 546లో కోరెషు పర్షియా (ఇరాన్‌) నుండి నేటి టర్కీదేశం పశ్చిమ సరిహద్దు వరకు స్వాధీనం చేసుకున్నాడు. చాలా సునాయాసంగా ఈదేశాలన్నీ గెలవడం జరిగింది. ఇలా గెలవడానికి దేవుడే సహాయం చేశారు కోరేషుకి!

ఇక 4,5 వచనాలు చూసుకుంటే 4. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.

5. ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు

ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆది నుండి మానవ వంశాలను చేసింది నేనే వారిని పిలిచింది కూడా నేనే అంటున్నారు ఇంకా నేనే మొదటి వాడను కడపటి వాడను కడపటి వారితో కూడా ఉండు వాడను ద్వీపాలు దీనిని చూసి దిగులు పడుతున్నాయి భూమి దిగంతముల వరకు వణుకు చున్నవి. ప్రజలు వచ్చి చేరుతున్నారు. కోరెషు విజయాల వెనుక ఈ లోకంలోని సంభవాలు తన ఆధీనంలో ఉంచుకునేవాని హస్తం ఉంది. అందుకే ద్వీపములు కోరెషురాజు ని చూసి వణకిపోతున్నాయి అంటున్నారు!!!

కోరెషు, అతని సైన్యాలు సమీపిస్తూ ఉంటే అతడి దారిలో ఉన్న దేశాలన్నీ గడగడా వణికిపోతాయి. వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. సహాయంకోసం తమ దేవుళ్ళ వైపుకూ విగ్రహాల వైపుకూ తిరుగుతారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

ఇక మొదటి వాడను కడపటి వాడను కోసం ఆలోచిస్తే దేవుడు ఈ మాట అనేక సార్లు అనేక చోట్ల చెప్పారు!!! యెషయా 48:12

యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను.

ప్రకటన గ్రంథం 1:8

అల్ఫాయు ఓమెగయు నేనే (అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ప్రకటన గ్రంథం 1:17

నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను-భయపడకుము;

ప్రకటన గ్రంథం 1:18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

ప్రకటన గ్రంథం 22:13

నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

Isaiah(యెషయా గ్రంథము) 44:6,7

6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.

7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

ఇక మన దేవుడు మొదటి వాడు కడపటి వారు! ఆది మరియు అంతమైయున్నవాడు.

Isaiah(యెషయా గ్రంథము) 46:3,4

3. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

4. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

కాబట్టి ఆ దేవున్ని మన దేవుడిగా చేసుకుందాం!

ఆయన పాదాల పట్టుకుందాం!

ఆయన చేతులు పట్టుకుందాం!

పరలోకానికి వెళ్దాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*244వ భాగము*

యెషయా 41:6--13

6. వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు.

7. అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.

8 .నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12 .నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

6 ,7 వచనాల కోసం 40వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం కాబట్టి 8వ వచనంనకు పోదాం!

ఎనిమిదో వచనం నుండి తర్చాత 4, 5 అధ్యాయాలు వరకు నా సేవకుడు, ఇశ్రాయేలు నా కుమారుడా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహం సంతానమా! పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అంటూ వ్రాయబడుతుంది.

8 .నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

ఇక్కడ నా అనుభవాల నుండి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను! ఈ అధ్యాయం నుండి వచ్చే ఐదు ఆరు అధ్యాయాలు వరకు ఎక్కడైతే యాకోబు లేదా నా సేవకుడైన ఇశ్రాయేలు అని వచ్చిందో, వినపడుతుందో అక్కడ, మన ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఓదార్పు కావాలన్నా, నీ ఆత్మ బలపడాలన్నా, నీకు హెచ్చరిక కావాలన్నా, నా సేవకుడు ఇశ్రాయేలు అనే మాట దగ్గర నీ పేరు పెట్టుకో! ఉదాహరణకి నా కుమారుడు అయిన రాజకుమార్! ఎప్పుడైతే నీ పేరు అక్కడ పెట్టుకొని అక్కడ నువ్వు ధ్యానిస్తూ ఉంటే దేవుడే తండ్రి స్థానంలో ఉండి నీతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది! అది నిన్ను ఓదారుస్తున్నట్టు ఉంటుంది. తద్వారా నీ విశ్వాస జీవితము, నీ ఆధ్యాత్మిక జీవితము మెరుగుపరచబడి బలపరచబడుతుంది అని నా ఉద్దేశం!!

ఇక నీవు నా సేవకుడివి అనేదాని కోసం ఆలోచిస్తే– ఇతర జాతులన్నిటికీ, ఇస్రాయేల్‌కూ ఉన్న తేడా ఇక్కడ రాసివుంది. ఇతర దేశాల్లో అక్కడక్కడ కొందరు వ్యక్తులు దేవుని సేవకులు అయి ఉండవచ్చు. అయితే ఒక్క జాతి మాత్రమే మొత్తంగా దేవుని సేవకుడుగా, ఆయన ఎన్నుకొన్నవాడుగా ఇక్కడ కనబడుతుంది!

యెషయా 42:19

నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

యెషయా 43:1

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

యెషయా 43:10

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

యెషయా 44:1

అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

యెషయా 44:21

యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

కీర్తనలు 135:4

యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.

కీర్తనలు 136:22

తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.

ద్వితియోపదేశకాండము 4:20

యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.

ప్రియ దైవజనమా! యాకోబునే కాదు ఇశ్రాయేలీయులనే కాదు నిన్ను నన్ను కూడా దేవుడు తన సేవకుడిగా తన పరిచారకుడుగా ఏర్పాటు చేసుకున్నాడు! ఈ వాక్యాన్ని నమ్మితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి యందు విశ్వాసం ఉంచితే, ఆయన చెప్పినట్లు చేస్తే, నీవు నేను కూడా ఆయన పరిచారకులు! అప్పుడు ఆయన చేసిన ప్రతి వాగ్దానమునకు మనము కూడా హక్కుదారులము అనుగ్రహించాలి.

ఇక తరువాత మాట నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా!

2దినవృత్తాంతములు 20:7

నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.

యాకోబు 2:23

కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.

అయితే యేసుక్రీస్తు ప్రభులవారు మనకోసం ఏమంటున్నారు అంటే మనము ఆయన స్నేహితులము!

యోహాను 15:13

తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.

యోహాను 15:14

నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.

యోహాను 15:15

దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! ఏసు క్రీస్తు ప్రభువుల వారు నిన్ను నన్ను స్నేహితుడు స్నేహితులారా అని పిలుచుండగా, నీవు స్నేహితుడిగా ఉండగలవా?! ఆయన కుమారుడిగా ఉండగలవా?!

లేక నమ్మకములేని పనివాడిగా ఉంటావా?!

ఏ విధముగా ఉంటావో పరిశీలన చేసుకో! నువ్వు స్నేహితుడు అయితే నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు! స్నేహితుడు ఇంట్లోకి తిన్నగా వెళ్లిపోతాడు! స్నేహితుని బాధల్లో పాలుపంచుకుంటాడు!

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు! మరి నీవు దేవునికి స్నేహితుడిగా ఉండగలవా!

ఏసుక్రీస్తు ప్రభువుల వారిని నీ స్నేహితుడిగా నీవు చేసుకున్నావా!!

ఒకసారి పరిశీలన చేసుకో!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*245వ భాగము*

యెషయా 41:8--13

8 .నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12 .నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక తొమ్మిదవ వచనం చూసుకుంటే 9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, ... భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని పనుల నుండి పిలుచుకున్న వాడా దీనికోసం ఆలోచిస్తే నాకు దీనిలో రెండు అర్థాలు కనిపిస్తున్నాయండి!

మొదటిది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తనకు స్వకీయ జనముగా చేసుకోవడానికి మొదటిగా ఆదికాండం 11వ అధ్యాయం నుండి చూసుకుంటే, అబ్రహం గారిని తన తండ్రి తో పాటు మెసపటోమియా అనగా ఇరాక్ పక్కన ఎక్కడో చివరన అక్కడున్న ప్రాంతం నుంచి కల్దీయులు ప్రాంతం నుండి దేవుడు తెరహు గారిని అబ్రాహాము గారిని మొదటగా సిరియా బోర్డర్ కి తీసుకొచ్చారు! సిరియా బోర్డర్ నుండి అబ్రహం గారిని పిలిచి నేను చూపించే దేశానికి వచ్చేయని ఇప్పుడు సిరియా నుండి కనాను దేశం తీసుకొచ్చారు! ప్రస్తుతం ఉన్న ఇజ్రాయిల్ దేశం తీసుకొచ్చారు! అనగా సుమారు నాలుగు ఐదు దేశాలు దాటించి తీసుకొచ్చాడు దేవుడు! తనకు స్వకీయ జనముగా ఇస్రాయేలు ప్రజలు ఏర్పరుచుకోవాలని! అందుకే ఏమంటున్నారు భూమి నుండి దాని కొనల నుండి పిలుచుకున్న వాడా .......

ఇక రెండవ అర్థం ఏమిటంటే అతి త్వరలోనే ఇశ్రాయేలు ప్రజలు అనగా యెషయా గారి ప్రవచన కాలం గతించాక ఇశ్రాయేలు ప్రజలు యూదులు వరకు చెరలోనికి వెళ్ళిపోతారు. అనేక దేశాలు చెదిరిపోతారు! అయితే అక్కడే నుండి కూడా దేవుడు వారిని పిలుచుకొని చేయి పట్టుకొని మరల స్వదేశానికి తీసుకొని రాబోతున్నారు!! అందుకే భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా ......

ఇక దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నారు! ఈ భూలోకంలో మనం ఏ దేశానికి చెందినా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఎలాంటి వారమైనా, అందరినీ దేవుడు పిలుచుకొని ఒకే సంఘం సార్వత్రిక సంఘముగా తన శరీరమందు ఏకముగా చేసుకుని, ఇప్పుడు పిలుస్తున్నారు భూదిగంతముల నుండి నేను పట్టుకొని నేను పిలుచుకున్న వాడా! భయపడకు నేను నీకు తోడైయున్నాను! నేను నిన్ను బలపరస్తున్నాను నీకు సహాయము చేయబోతున్నాను! నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకుంటాను. భయపడకు నా కుమారుడా అని దేవుడు నీతో నాతో చెబుతున్నారు! హల్లెలూయ!!!

ఇక ఈ వచనంలో నిన్ను నేను ఉపేక్షించక అనగ నిరాకరించలేదు”– వారు బబులోను చెరకు వెళ్ళే సమయంలోనూ (39:5-7), కోరెషు తన జైత్రయాత్ర ఆరంభించిన సమయంలోనూ ఇది వారికి గొప్ప ఆదరణ అయి ఉంటుంది (40:1).

ఇక నేను నీతో ఉన్నాను భయపడకు!...

యెషయా 43:1

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

యెషయా 43:2

నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

యెషయా 43:3

యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

దేవుడు అబ్రాహాము గారితో, ఇంకా ఆయన సంతానముతో అనేకసార్లు చెప్పారు భయపడకుము!

ఆదికాండం 15:1, 21:17; 26:24, 46:3, సంఖ్యా 21:34.........

దేవుడు యెహోషువ గారితో అంటున్నారు యెహోషువ 1:9

నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

కీర్తనలు 27:1

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

కీర్తనలు 56:4

దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?

మత్తయి 1:22

ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

మత్తయి 1:23

అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

హెబ్రీయులకు 13:5

ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.

హెబ్రీయులకు 13:6

కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

యెషయా 40:29

సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.

యెషయా 40:30

బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు

యెషయా 40:31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

“భయం”– ఈ వాగ్దానం ఇస్రాయేల్‌లోని దుర్మార్గులకూ, నమ్మకం లేనివారికీ కాదు. తిరుగుబాటు జనం మధ్య ఉన్న నిజమైన ఇజ్రాయేల్ వారికే (రోమ్ 2:28-29; 9:6 పోల్చి చూడండి). భయపడకండని దుర్మార్గులకు, అవిశ్వాసులకు దేవుడు ఎన్నటికీ చెప్పడు. విశ్వాసులు దేవునికి చెందినవారు కాబట్టి వారు భయపడరాదు. జాతి పాపాన్ని బట్టి త్వరలోనే బబులోనువారు వచ్చి జెరుసలంనూ ఆలయాన్నీ ధ్వంసం చేసి ప్రజలను చెరగొని పోతారు. అయితే దేవుడు వారితో ఉండి వారిని కాపాడతాడు. ఇప్పుడు దేవునిలో నమ్మకం పెట్టుకున్న వారంతా తమకు అన్వయించుకోగల సత్యం ఇక్కడ ఉంది.

ఇక దక్షిణ హస్తము అనగా కుడిచేయి. దేవుడు మనలని తన కుడిచేతి తో రక్షిస్తాను అంటున్నారు.

కీర్తనలు 16:11

జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

కీర్తనలు 80:17

నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక.

కీర్తనలు 108:6

నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.

యెషయా 45:1

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

కాబట్టి సహోదరి సహోదరుడా! దేవుడు తన కుడి చేతన నిన్ను పట్టుకున్నాడు. మనకు సహాయం చేస్తున్నారు దేవుడు. సంఘమా! భయపడుతున్నావా! నీకు కష్టాలు శ్రమలు అనుభవిస్తున్నా, దేవుడు నీ చేయి వదలలేదని, తన కుడి చేత నిన్ను పట్టుకుని ఉన్నాడని మర్చిపోకు!!!

ఎన్ని బాధలు వచ్చినా బాధలు అన్నిటినీ శ్రమలన్నిటిని తప్పించి నిన్ను పరలోకం చేర్చగలే శక్తి గల దేవుడు మన దేవుడు!!!

ఆ దేవుని నమ్ముకుందాం!

ముందుకు పోదాం!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*246వ భాగము*

యెషయా 41:11--13

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12 .నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 11 వచనం చూసుకుంటే 11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12 .నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

దీనికోసం ఆలోచిస్తే ఏ జాతీ, ఏ జనమూ ఇజ్రాయేల్ ని నాశనం చెయ్యలేరు. అలాంటి ప్రయత్నం చేసే వారంతా తామే నాశనమౌతారు నేటి రోజుల్లో జరుగుతున్నట్లు!! (17:14; 29:5-8; 60:12; మొ।।). అదేవిధంగా క్రీస్తు సంఘం సంగతి కూడా అంతే. మత్తయి 16:18.

యెషయా 17:14

సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే.

Isaiah(యెషయా గ్రంథము) 29:5,6

5. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.

6. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

యెషయా 60:12

నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ద్వితియోపదేశకాండము 28:7

నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.

Psalms(కీర్తనల గ్రంథము) 70:2,3,4

2. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమాన మొందుదురు గాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

3. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక

4. నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.

ఆదికాండము 27:29

జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక.

ఇక నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

యోబు 20:9

వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు.

Exodus(నిర్గమకాండము) 14:13,14

13. అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

కీర్తనలు 37:10

ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

కీర్తనలు 37:35

భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.

కీర్తనలు 37:36

అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

ఇక తర్వాత వచనం: 13. నీ దేవుడనైన యెహోవానగు నేను: భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. దీనికోసం గత భాగాలలో చూసుకున్నాము గనుక ముందుకు పోదాం.

Isaiah(యెషయా గ్రంథము) 41:14,15

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు

ఇక్కడ ఈ వచనంలో యాకోబుని పురుగుతో పోలుస్తున్నారు. పురుగు– ఆ ప్రజ అందగాళ్ళనీ, బలిష్ఠులనీ, ధీరోదాత్తులనీ, యోగ్యులనీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. అసలు పైన చెప్పిన లక్షణాలన్నిటికీ వ్యతిరేకమైనవారు ఆ ప్రజలు. మనందరం కూడా అంతే గదా. అయిన దేవుడు మనల్ని ఎన్నుకున్నారు.

పౌలుగారు రాస్తున్నారు 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:26,27,28,29,30,31

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో-శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

కాబట్టి మనం పిలవబడిన రీతిని జ్ఞాపకం చేసుకొని క్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉండాలి.

ఇక తరువాత స్వల్ప జనులగు ఇశ్రాయేలు....

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 7:6,7,8,9

6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.

7. మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కు వేగదా.

8. అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబల ముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

ఇక మీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. యోబుగారు నా విమోచకుడు సజీవుడు అంటున్నారు!

యోబు 19:25

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.

యోబు 19:26

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

సామెతలు 23:11

వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

యెషయా 43:14

ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.

యెషయా 48:17

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

యెషయా 49:7

ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

యెషయా 54:5

నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

యెషయా 59:20

సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 50:34

వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.

రోమీయులకు 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

రోమీయులకు 11:27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

మరి ఆ గొప్ప దేవుణ్ణి నీకు విమోచకుడిగా చేసుకున్నావా! ఆయన నీకోసం ప్రాణం పెట్టారు! మీ పాపము నుండి విమోచించారు! మీ శాపం నుండి విడిపించేరు! నీవు పొందవలసిన శిక్ష నీకు బదులుగా ఆయన భరించేరు! చివరికి నిన్ను విడిపించేరు! మరి ఆ విమోచకుడిని మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో సేవిస్తున్నావా!

సరిచూసుకో! సరి చేసుకో!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*247వ భాగము*

యెషయా 41:15--20

15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు

16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.

17. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

18. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించు నట్లుఇక

19. చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 15 వచనం చూసుకుంటే కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు .

కక్కుల పెట్టబడిన నూర్చే యంత్రాలుగా నిన్ను నియమించాను అంటున్నారు. చూడండి పురుగువంటి యాకోబు అని పిలిచి ఒక పురుగును తీసుకుని దేవుడు ఎలాంటి పనులు చేయగలడో చూడండి. ఇది కేవలం తన ప్రజలను కాపాడడం మాత్రమే కాదు. వారు ఆయన చేతిలో (వ 10,13) వారి శత్రువులను నలగ్గొట్టే శక్తివంతమైన ఆయుధంలాగా అవుతారు. బలహీనులు దేవునిలో తమ బలాన్ని కనుక్కోవడం అన్న విషయానికి ఇది ఉదాహరణ (40:31). యెషయా 40:31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

ఇస్రాయేల్‌వారు దీన్ని గుర్తించి దేవునిలో ఉప్పొంగిపోతారు. ఇదంతా ఇంతకు ముందు జరిగిందా? పూర్తిగా నెరవేరలేదు. ఇది నెరవేరే సమయం అంత్య దినాలలో జరుగుతుంది 11:12-14; 14:2; 49:23 ఇవి కూడా చూడండి .

Isaiah(యెషయా గ్రంథము) 11:12,13,14

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు

14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు

యెషయా 14:2

జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి....

యెషయా 49:23

రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

ఇక 16వ వచనం చూసుకుంటే 16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.

చూడండి శత్రువులు ఎలా ఉంటారు అంటే ఆకాలంలో నీవు వారిని వెతుకుతావు గాని గాలి వారిని కొనిపోతుంది. సుడిగాలి వారిని చెదరగొడుతుంది. అప్పుడు నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు. దేవునిబట్టి ఆనందిస్తావు.

కీర్తనలు 1:4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

Isaiah(యెషయా గ్రంథము) 45:23,24,25

23. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

24. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

25. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.

కీర్తనలు 34:2

యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.

యెషయా 65:13

కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె దరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

యెషయా 65:14

నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

యిర్మియా 31:13

వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

యిర్మియా 31:14

క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకార ములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.

ఇక అప్పుడు 17. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

18. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు...

ఇక్కడ నీరు అనగా ఏమిటి? మామూలు నీరు అయితే కాదని నా ఉద్దేశం.

యెషయా 30:19

సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

యెషయా 35:7

ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

యెషయా 43:20

నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును

యెషయా 44:3

నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

కీర్తనలు 42:1

దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

కీర్తనలు 42:2

నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

యోహాను 7:37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

యోహాను 7:38

నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

ఇక ఆ తర్వాత 18. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు ఇక

19. చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటించెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

చూడండి దేవుడిచ్చే ఆశీర్వాదములు!

చెట్లులేని మెరకలమీద నదులు పారేలా చేస్తాను. లోయలలో ఊటలు పెల్లుబికేలా చేస్తాను. ఎడారిని మడుగుగా, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాను అంటున్నారు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు...

దేవుడు అక్షరాలా మంచి నేలలను ఎడారులుగాను, ఎడారులను సారవంతంగాను మార్చేస్తాడు (కీర్తన 107:33-35). మరోసారి యూదాలో ఇలా చెయ్యవచ్చు. అయితే బైబిల్లో కొన్నిసార్లు భౌతికమైన మార్పులు ఆధ్యాత్మికమైన మార్పులకు కూడా సూచనలు.

కీర్తనలు 107:33

దేశనివాసుల చెడుతనమును బట్టి

కీర్తనలు 107:34

ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.

కీర్తనలు 107:35

అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి

కీర్తనలు 107:36

వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి

కీర్తనలు 107:37

వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనిన వారిని అచ్చట కాపురముంచెను

కీర్తనలు 107:38

మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు

Isaiah(యెషయా గ్రంథము) 32:15,16,17

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

Isaiah(యెషయా గ్రంథము) 35:1,2

1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును

2. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెషయా 51:3

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును

యెషయా 55:12

మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

యెషయా 55:13

ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

ఇస్రాయేల్‌లో (అంటే దేశంలోనైనా, ప్రజల్లోనైనా లేక రెంటిలోనైనా) దేవుని కార్యాలు ప్రపంచంలోని ఇతర జనాలకు బోధను కలిగిస్తాయి.

ప్రియ సహోదరుడా! దేవుడు నీ బ్రతుకును కూడా ఇలా మార్చగలరు. నీవు చేయవలసింది కేవలము ఆయన మీద ఆనుకుని ఆయన కోసం ఓపికగా కనిపెట్టడమే!

మరి నీవు సిద్దమా!!!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*248వ భాగము*

యెషయా 41:21--29

21. వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు.

22. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

24. మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు.

25. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

26. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడుమీ మాటలు వినువాడెవడును లేడు.

27. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.

28. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.

29. వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 21వ వచనం చూసుకుంటే వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు.

22. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి అంటున్నారు!

ప్రియులారా! మరల ఇక్కడ నాతో మీరు ఎవరిని సమానం చేస్తారు అనే విషయాన్ని మరల ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు! మీరు చూపించండి అని మీ రుజువు చూపించండి! తగువాడండి! ఇలా చేసేటప్పుడు జరగబోయే వాటిని మీరు చెప్పాలని అంటున్నారు! పూర్వకాలంలో జరిగిన వాటిని క్లియర్గా వివరించమంటున్నారు! లేకపోతే రాబోయే సంగతులైన మాకు చెప్పండి! అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాం! మేము ఒకరితో ఒకటి సాటి చేసుకొని కనుగొనే లాగా మేలైన కీడు అయిన చేయండి అని యాకోబు రాజు అంటున్నారు ఇక్కడ.

21-23 ఈ వచనాలు 41:1తో సంబంధం గలవి. జనాలు తమ విగ్రహాలు ఉపయోగకరమైనవేనని భావిస్తే, భూత భవిష్యత్కాలాలను తెలియజెప్పే సామర్థ్యం వాటికుంటే వారు ముందుకు వచ్చి ఈ సంగతిని నిరూపించాలి (43:9 కూడా చూడండి). ఇది వారి చేతగాని పని అని దేవునికి తెలుసు. 42:9; 46:10లో విగ్రహాలు చెయ్యలేని వాటిని తాను చేస్తానంటున్నాడు దేవుడు. వ 23,24లో దేవుడు నేరుగా ప్రజల విగ్రహాలతో మాట్లాడుతున్నట్టుంది.

యెషయా 42:9

మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

యెషయా 46:9

చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.

యెషయా 46:10

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

అవును మన దేవుడు జరిగేది జరగబోయేది ముందుగానే మనతో చెప్పే దేవుడు. ఎవరు ఏ విధమైన కీడు చేస్తున్నారో అది కూడా మనతో చెప్పే దేవుడు! కొన్ని కొన్ని సార్లు సీసీటీవీ కెమెరాల వలె జరుగుతున్నట్టు క్లియర్ గా లైవ్ చూపించే దేవుడు. అవును మా శ్రమల కాలంలో మా అమ్మగారికి అనేకసార్లు శత్రువులు ఏమేమి చేస్తున్నారు క్లియర్ గా దేవుడు దర్శనంలో చూపించేవారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది! మన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరంగా జరగబోయే వాటిని మనకు చూపించే దేవుడు!

Micah(మీకా) 6:1,2,3

1. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము.

2. తన జనులమీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యెమాడుచున్నాడు; నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి.

3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మునేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి.

యెషయా 45:20

కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

యెషయా 45:21

మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

Isaiah(యెషయా గ్రంథము) 43:9,10,11,12,13

9. సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

10. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.

12. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

యెషయా 44:7

ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

యెషయా 48:14

మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

యెషయా 48:15

నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

యెషయా 48:16

ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను

యోహాను 13:19

జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను.

యోహాను 16:13

అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

యోహాను 16:14

ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

ఇక ముందుకుపోతే 24. మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు.

25. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

దీనికోసం ఆలోచిస్తే

యెషయా 37:19

​వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

1సమూయేలు 12:21

ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే.

Psalms(కీర్తనల గ్రంథము) 115:4,5,6,7,8,9

4. వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

5.వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

6. చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

7. చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

8. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

9. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

Jeremiah(యిర్మీయా) 10:3,4,5,8,9,10,14,15

3. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.

4. వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.

5. అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయ నేరవు మేలుచేయుట వాటివలనకాదు.

8. జనులు కేవలము పశు ప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.

9.​ తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.

10.​ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

14. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

15. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును,

1కోరింథీయులకు 8:4

కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

ఇక మిమ్మును కోరుకొనువారు హేయులు. దీనికోసం ఆలోచిస్తే

యిర్మియా 16:18

వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్ర పరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంత లుగా వారికి ప్రతికారము చేసెదను.

యెహేజ్కేలు 7:20

శృంగార మైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధార ముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను,

మలాకీ 2:11

యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.

కాబట్టి నిజ దేవుడైన ఏసుక్రీస్తు ప్రభువుల వారిని మనం అనుసరించాలి! అన్యుల దేవతలు వ్యర్థమైనవి విగ్రహాలు కళ్ళుండి చూడవు నోరు ఉండే మాట్లాడవు! కాబట్టి కల్లుండి చూసే, నోరు ఉండే మాట్లాడే, అద్భుతాలు చేసే దేవుని, చెవిలుండి వినే దేవుడు మన దేవుడు!

ఆ దేవుని మనం ఆరాధిద్దాం! ఆయననే పూజిద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*249వ భాగము*

యెషయా 41:25--29

25. ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

26. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు.

27. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.

28. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.

29. వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 25వ వచనం చూసుకుంటే ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కు నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.

ప్రియ దైవ జనమా! మరలా 25వ వచనములో కోరేసు రాజు కోసం చెబుతున్నారు దేవుడు! ఉత్తర దిక్కు నుండి నేను ఒక్కడిని రేపు చున్నాను. ఉత్తర దిక్కు నుంచి వచ్చేవాడు కోరెషు రాజే. నా నామమున ప్రార్థించువాడు సూర్యోదయ దిక్కు నుండి అనగా తూర్పు నుండి వస్తున్నాడు ఆ వ్యక్తి కూడా కోరేసురాజే! ఒకడు బురద తొక్కునట్లు కుమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగ ద్రొక్కును. అనగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల సైన్యాలను ఈ కోరేసురాజు కుమ్మరి మన్ను తొక్కినట్లు తొక్కబోతున్నాడు.

కోరెషు ఇస్రాయేల్ తూర్పు దిక్కునున్న ప్రాంతాలకు చెందినవాడు. కాని ఉత్తరంగా ఉన్న ప్రదేశాలను కూడా అతడు జయించాడు. అతణ్ణి పురిగొలిపి రప్పించినది ఇస్రాయేల్‌వారి దేవుడే. అతని దారిలో ఉన్న దేశాల దేవుళ్ళు ఇలాంటి పనిని చేయలేవు. జరగబోతున్నదాన్ని తెలియ జేయలేవు, దాన్ని ఆపలేవు.

ఇక ఇక తర్వాత వచనం నుండి చివరి వరకు మరల ఇంతవరకు మనం గత భాగాలలో ధ్యానం చేసినదే మరల దేవుడు చెబుతున్నారు. నాతో మీరు ఎవరిని సమానం చేస్తారు!? ఆది నుండి చెప్పిన వాడు ఎవడు? జరిగేది జరగబోయేది చెప్పగలిగే దమ్ము సత్తా ఉన్నవాడు ఎవడు? జరిగేది జరగబోయేది చెప్పే వాడిని నేనే కదా. మిగిలినవి మాయ స్వరూపులు అవన్నీ పోత విగ్రహాలు అవి శూన్యములు వట్టిగాలి అని చెబుతున్నారు దేవుడు

26. మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వ కాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు వినుపించు వా డెవడును లేడు మీ మాటలు వినువాడెవడును లేడు.

27. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని.

28. నేను చూడగా ఎవడును లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను.

29. వారందరు మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.

కోరెషు అధికారంలోకి వస్తాడని ముందుగా చెప్పినది ఎవరు? ఇతర దేశాల విగ్రహాలేవీ కావు. నిజమైన దేవుడు, ఇజ్రాయేల్ వారి దేవుడే.

యెషయా 45:1

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

యెషయా 45:13

నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

27వ వచనంలో అని సీయోనుతో మొదట చెప్పినవాణ్ణి నేనే. జెరుసలంకు శుభవార్త ప్రకటించే వాణ్ణి నేను పంపాను. ఇక తరువాత వచనంలో  నేను చూస్తే ఎవడూ లేడు – వాళ్ళలో సలహా చెప్పడానికి ఎవడూ లేడు, నేను వాళ్ళను అడిగినదానికి జవాబివ్వగల వాడెవడూ లేడు అంటున్నారు. అందుకే వారి దేవతలు వట్టి మాయయే అంటున్నారు చివరి వచనంలో! వాళ్ళంతా మిథ్య. వాళ్ళ పనులు శూన్యం,

వాళ్ళ విగ్రహాలు వ్యర్ధం, వట్టి గాలి.

వాళ్ళంతా”– అంటే 21-23 వచనాల్లోని విగ్రహారాధకులు.

కాబట్టి వాటి విగ్రహారాధన వదిలేసి నిజమైన దేవుని మాట్లాడే దేవుణ్ణి పూజిద్దాం!!!

ప్రియులారా! విగ్రహారాధన అంటే ఇదేనా మరో విగ్రహారాధన ఏమైనా ఉందా?!

*విగ్రహారాధన అంటే?

విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం. 

అదేనా? 

నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని. 

కాని, ఒక్క విషయం!

విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు. 

•దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

•నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? 

నీ హృదయం దేనితో నిండిపోయింది? 

•గాళ్ ఫ్రెండా? 

•బాయ్ ఫ్రెండా? 

•మోటార్ బైక్సా? 

•వస్త్రాలా?

•సెల్ ఫోన్సా?

•బంగారమా? 

•ధనమా? 

•ఆస్థులా? 

•అంతస్తులా? 

•నీ పిల్లలా? 

•అసూయా? 

•ద్వేషమా? ఏది? 

ఇవన్నీ విగ్రహాలే. 

ఇప్పుడు చెప్పగలవా? 

నేను విగ్రహారాధికుడను కాదని. 

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? 

ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా? 

అందుకే కదా! 

సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది. 

నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా? 

*లేకపోతే ఏమవుతుందో తెలుసా? 

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

                ప్రకటన 21:8

వద్దు! 

ఇది వినడానికే భయంకరం. 

సరి చేసుకుందాం. 

సాగిపోదాం. 

గమ్యం చేరేవరకు. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

దైవాశీస్సులు

*యెషయా ప్రవచన గ్రంధము*

*250వ భాగము*

యెషయా 42:9--12

9. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

10. సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.

11. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.

12. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనం 41వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! 42వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! అయితే ఈ అధ్యాయము లో మొదటి ఎనిమిది వచనాలు అభిషక్తుని మొదటి రాకడ కోసం ధ్యానం చేసేటప్పుడు చూసుకున్నాము గనుక తొమ్మిదవ వచనం నుండి ధ్యానం చేసుకుందాం!!!

తొమ్మిదవ వచనం లో 9. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. చూడండి సంగతి జరుగక మునుపే నేను జరగబోయే వాటిని చెబుతాను అంటున్నారు దేవుడు! ఈ శీర్షిక ప్రారంభం నుండి చూసుకుంటున్నాము మనం జరగబోయే వాటిని వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టక ముందే ఆయన ఎలాంటి వారో 700 సంవత్సరాల క్రితమే చెప్పారు.

జరిగిపోయిన విషయాలు ఎంత బాగా గుర్తున్నాయో జరగబోయే వాటిని కూడా అంత బాగా తెలుసుకునే దేవునికి వాటిని ప్రకటించడంలో ఏ సమస్యా లేదు (46:10). యెషయా, ఇతర ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నది చాలా మట్టుకు ఇదే (2 పేతురు 1:21). దేవుడు విగ్రహాలతో పంచుకోని మహిమలో ఇదీ ఒక భాగం (41:21-23).

యెషయా 46:10

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

2పేతురు 1:21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

Isaiah(యెషయా గ్రంథము) 41:22,23

22. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

ఇక తరువాత వచనంలో 10. సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి.

ఈ వచనంలో దేవుడు సముద్ర ప్రయాణం చేసేవారిని, సముద్రములో ఉన్న సమస్తాన్ని, ద్వీపములను అందులో ఉన్నవారిని స్తుతించమంటున్నారు. దేవునికి ఎందుకో సముద్ర ప్రయాణం చేసే వారిపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. (నేను ఓడలలో పనిచేస్తున్నందుకు ఇలా చెప్పడం లేదండోయ్).

ఒకసారి చూద్దామా సముద్ర ప్రయాణం చేసేవారిని ఎందుకు స్తుతించమంటున్నారో!!!

Psalms(కీర్తనల గ్రంథము) 107:23,24,25,26,27,28,29,30,31,32

23. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయు వారు

24. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.

25. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

26.వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

27. మత్తులైన వారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.

28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను.

29. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

30. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.

31. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

32. జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

ఇక ద్వీపముల కోసం చూసుకుంటే ఈ గ్రంథంలో

యెషయా 41:1

ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

యెషయా 49:1

ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

ఇలా ద్వీపముల కోసం చెప్పారు!

ఇక తరువాత వచనంలో 11. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక అంటున్నారు!

అరణ్యాలలో ఉన్నవారు గ్రామాలలో ఉన్నవారిని పర్వతాలమీద ఉన్నవారిని కూడా స్తుతించమంటున్నారు! కారణం దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాల కోసం!!!

కేదారు”, “సెల”– 21:16; 16:1. ఇవి ఎదోము, అరేబియాలోని ప్రదేశాలు.

యెషయా 21:16

ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు కూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.

యెషయా 16:1

అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱెపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి.

చూడండి ఎదోము అరేబియా దేశాల వారిని కూడా స్తుతించమంటున్నారు ఎందుకంటే గతభాగాలలో చూసుకున్నాము. ఎదోము వారు అనగా అస్సూరు వారిని ఐగుప్తువారిని దేవుడు కరుణించి తన స్వకీయులుగా చేసుకోబోతున్నారు అంత్యదినాలలో!!!

అందుకే తరువాత వచనంలో అంటున్నారు 12. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక .

గతభాగాలలో చూసుకున్నాము జెబూలూను నఫ్తాలి వారు చీకటిలో సంచరించే వారు గొప్ప వెలుగు చూసిరి ఎలా?! యేసుక్రీస్తు ప్రభులవారి సువార్త ప్రబోధం వలన! అందుకే ఇక్కడ ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక అంటున్నారు!

మరి ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవుని స్తుతిని ప్రచురం చేస్తున్నావా?! ఆయనను ఆత్మతోను సత్యముతోను స్తుతిస్తున్నావా!!!

స్తుతి చేయుట యధార్థవంతులకు శోభష్కరమని మరచిపోవద్దు (కీర్తనలు 33:1)!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*251వ భాగము*

యెషయా 42:13--15

13. యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

14. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.

15. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 42వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

13వ వచనంలో అంటున్నారు యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

చూడండి శూరుని వలె బయలుదేరి యోధునివలె ఆసక్తి తో హుంకరించి శత్రువులతో పోరాడుతారట!

శత్రువులు”– 66:14; ద్వితీ 32:40-41. దేవుణ్ణి వ్యతిరేకించే వారంతా అని దీని అర్థం. అదృశ్యమైన ఆత్మల లోకంలోనే గాక, భూమిపై మనుషుల మధ్య కూడా ఇలాంటి వారెంతో మంది ఉన్నారు.

యెషయా 66:14

మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

యెషయా 66:15

ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

యెషయా 66:16

అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

ద్వితియోపదేశకాండము 32:40

నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను

ద్వితియోపదేశకాండము 32:41

నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.

ద్వితియోపదేశకాండము 32:42

చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

ఇక యోధుని వలె లేక యుద్ద వీరునిలా పోరాడుట కోసం చూసుకుంటే

నిర్గమకాండము 14:14

యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

నిర్గమకాండము 15:3

యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.

నిర్గమకాండము 15:4

ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి.

Psalms(కీర్తనల గ్రంథము) 18:34,35

34.నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.

35.నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

కీర్తనలు 144:1

నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

ఎఫెసీయులకు 6:10

తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

ఎఫెసీయులకు 6:11

మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.

ఎఫెసీయులకు 6:12

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

ఎఫెసీయులకు 6:13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు(దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి

ఈవిధంగా ఆయన యుద్ధం చేస్తారు. మనకు కూడా యుద్ధం చేయడం నేర్పుతారు!

ఇక తరువాత వచనంలో 14. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.

15. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.

దేవుడు ఇతర పద్ధతుల్లో మనుషులకేదన్నా వెల్లడించడం కుదరని పక్షంలో మనుషులు మాట్లాడే భాషలో చెప్పడం ద్వారా అలా తెలియజేస్తారు. ఇక్కడ ఈ వచనంలో చాలా కాలం అణిచిపెట్టుకున్న కోపం ఒక్క సారిగా పెల్లుబికినట్టు ఇక్కడ అర్థమౌతున్నది 63:3-4 ఇదే చెబుతుంది!

Isaiah(యెషయా గ్రంథము) 63:1,2,3,4,5,6

1. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట లన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

6. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

ఈ భాగం ఖచ్చితంగా అంత్య దినాలలో జరుగబోయే సంభవమే! ఇది హార్మెగిద్దోన్ యుద్ధం సమయంలో మరియు గోగు మాగోగు యుద్ధం సమయంలో కూడా జరుగుతుంది! ఆయన కోపగించి శత్రు సైన్యాలను అంతం చేస్తారు.

హార్మెగిద్దోన్ యుద్ధం సమయంలో ఎందుకు చేస్తారంటే శత్రువులు అప్పటికే జెరూసలేం ను దోచుకున్నారు స్త్రీల ను చెరిపారు.

Zechariah(జెకర్యా) 14:2,3

2.​ ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

ఇక గోగుమాగోగు సమయంలో ఎందుకు నాశనం చేస్తారంటే

Revelation(ప్రకటన గ్రంథము) 20:7,8,9,10

7. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి (కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుని యొద్దనుండి, అని కూర్చబడియున్నది)అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

ఈవిధంగా ఆయన శత్రు సైన్యాలను అంతం చేస్తారు! చివరకు 15 వ వచనంలో చెప్పినట్లు పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.

Isaiah(యెషయా గ్రంథము) 24:1,2,3,4,5,6,7

1. ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.

2. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు గును.

3. దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు

4. దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.

5. లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.

6. శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

7. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను

ఇదీ అంత్యకాలంలో జరుగబోయేవి. దానిని తప్పించుకోవాలంటే నీవు ఎత్తబడాలి! మరి నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావా?! విడువబడే గుంపులో నున్నావా?!

సరిచూసుకో!

సరిదిద్దుకో!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*252వ భాగము*

యెషయా 42:15--20

16. వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

17. చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.

18. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి.

19. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 42వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 15వ వచనం చూసుకుంటే వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

ఇక్కడ గుడ్డివారు ఎవరో 19వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. వీరు ఇజ్రాయేల్ జాతే.

యేసుక్రీస్తు ప్రభులవారి రాకడవలన వారి జీవితాలలో కలిగే ఆధ్యాత్మిక వెలుగు కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు దేవుడు! వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.

19. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

ఇక వెలుగు అనగా యెషయా 9:2

చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.

ఇక తరువాత వచనంలో 17. చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.

18. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి.

కీర్తనాకారుడు అంటున్నారు Psalms(కీర్తనల గ్రంథము) 97:7

7. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.

యిర్మియా గారు అంటున్నారు

Jeremiah(యిర్మీయా) 10:10,11,14,15,16

10.​ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

11.​ మీరు వారితో ఈలాగు చెప్పవలెనుఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండ కుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.

14. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.

15. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును,

16. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

ఇస్రాయేల్ గుడ్డి సేవకుడు (6:10; 29:9-10; 41:8-9; 43:8). ఇప్పుడు ఇశ్రాయేలు జాతి కళ్ళు తెరిచే సమయం వస్తుంది (29:18; 35:5).

యెషయా 6:10

వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

యెషయా 6:11

ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

Isaiah(యెషయా గ్రంథము) 29:9,10

9. జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

10. యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు.

Isaiah(యెషయా గ్రంథము) 41:8,9,10,11,12,13,14

8. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

యెషయా 43:7

నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

యెషయా 43:8

కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి

యెషయా 43:9

సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

యెషయా 43:10

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

యెషయా 43:11

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.

యెషయా 43:12

ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

యెషయా 29:18

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

యెషయా 29:19

యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

యెషయా 29:20

బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.

యెషయా 35:5

గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

యెషయా 35:6

కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

యెషయా 35:7

ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

ఇది అంత్యకాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దర్శించే సమయంలో జరిగే సంభవము! వారిని దర్శించే దేవుడు నిన్ను కూడా దర్శించి ఆదరించగలరు!

మరి నీవు వస్తావా ఆయన దగ్గరకు!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*253వ భాగము*

యెషయా 42:21--25

21. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.

22. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.

23. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

25. కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 42వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 21నుండి చూసుకుంటే 21. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.

22. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.

ఇక్కడ ఉపదేశ క్రమము అనగా కొన్ని సంఘాలలో అనుసరించే ఆరాధన క్రమము కాదండి.

అది నిజానికి ధర్మశాస్త్రం. అయితే వారు దానిని సరిగా పాటించక పాటించలేక తొట్రిల్లిపోయారు. అందుకే దేవుడు మరో ఉపదేశ క్రమము ఇచ్చారు. అది క్రొత్త నిబంధన! మెల్కీసెదకు క్రమము ఇచ్చారు.

Hebrews(హెబ్రీయులకు) 6:17,18,19,20

17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,

18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.

19. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.

20. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

Hebrews(హెబ్రీయులకు) 7:15,16,17,18,19,20,21,24,25,26,27,28

15. మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,

16. మెల్కీ సెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.

17. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

18. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది;

19. అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.

20. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.

21. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;

24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.

25. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.(లేక, తగినవాడు)

27. ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,

28. ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.

అయితే తర్వాత వచనాలలో చెబుతున్నారు ప్రవక్త! దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చిన గాని మనము అపహరించబడి దాసులుగా అమ్మబడటానికి కారణం మన అపనమ్మకం మరియు అవిశ్వాస్యత మరియు విగ్రహారాధన!

23. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

25. కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

23వ వచనంలో దానికి అనగా కేవలం పై వచనం ఒక్కదాన్నే కాదు. ఈ అధ్యాయాల్లో దేవుడు వారికి అందిస్తూ ఉన్న సందేశం అంతటినీ వినాలని ఉద్దేశం.

ఇక 24వ వచనంలో దేవుడే వారిని అప్పగించారు.

Isaiah(యెషయా గ్రంథము) 47:5,6,7,8,9

5. కల్దీయుల కుమారీ, మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.

6. నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

7. నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.

8. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము

9. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార ముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.

Jeremiah(యిర్మీయా) 1:14,15,16

14. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెనుఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును.

15. ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారము లన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు.

16. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.

ఇక 25వ వచనంలో “నేర్చుకోలేదు”– 1:3-9; 6:10-12. మన పాపాల కారణంగా దేవుడు మనలను శిక్షిస్తూ ఉంటే ఆయన చేస్నున్నదేమిటో, ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం (విలాప 3:39-40).

Lamentations(విలాపవాక్యములు) 3:39,40,41,42,43

39. సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?

40.మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.

41. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.

42. మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.

43. కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.

యెషయా 5:25

దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

Jeremiah(యిర్మీయా) 9:12,13,14,15,16,17,20,21

12.​ ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?

13. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడువారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

14. తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.

15.​ సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.

16.​ తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గ మును పంపుదును.

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

20. స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తె లకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

21. వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

యెషయా 51:17

యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

2రాజులు 22:13

మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.

కాబట్టి దేవుని మాటలు విందాం! ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలు వినక తంటాలు పడ్డారు. మనము విని ఆయన రాజ్యం చేరుదాము!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*254వ భాగము*

యెషయా 43:1--3

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 42వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 43వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! ఈ అధ్యాయం నాకు నచ్చిన అధ్యాయం. దేవుడు నాతో ఎన్నో సార్లు మాట్లాడిన అధ్యాయం! ఈ అధ్యాయం ధ్యానం చేయకముందు నా సాక్ష్యం కొద్దిగా చెప్పనీయండి.

నా ఇంటర్మీడియట్ అయిపోయాక నేను దేవున్ని అడగటం మొదలుపెట్టాను ప్రభువా దీని తరువాత ఏమి చెయ్యాలి దయచేసి నాతో మాట్లాడండి అంటూ! దేవుడు అస్తమాను యెషయా 43వ అధ్యాయం చూపించేవారు. నాకు దేవుని సేవ చేయాలని ఆశ! గాని మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ సేవ చేయు! నేను పడిన కష్టాలు నీవు పడకూడదు అనేవారు. నీవు బాగు పడాలంటే నీ తల్లిదండ్రులు మాట వినమని బైబిల్ చెబుతుంది. అందుకే చాలా సంగ్దిద్వములో ఉండేవాడిని. ఒకవేళ సేవచేయక పోతే నాకు రైల్వే కి వెళ్లాలని ఆశ! అయితే దేవుడు నీవు జలములపై వెళ్లేటప్పుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నారు! చివరకు కొన్ని నెలలకు విజయవాడ మీటింగ్ లకు వెళ్లాను. అక్కడ ఆఫ్రికా నుండి వచ్చిన ఒక గొప్ప దైవజనుడు జెకర్యా టానీ ఫోమమ్ అనే ఆయన వచ్చారు. అయితే ఆయనతో మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటే ఆయనను కలవనీయలేదు నిర్వాహకులు! చివరి రోజు రాత్రి తెగించి ఆయనను కలసి నా బాధ మొత్తం చెబితే ఆయన ప్రార్థన చేసి ప్రవచనం చెప్పారు. నీవు దేవుని సేవ చేస్తావు గాని ఇప్పుడు కాదు. నీ తండ్రి ఆశించినట్లు ఉద్యోగం చేస్తావు. ఉద్యోగం చేస్తూ ప్రత్యేకమైన రీతిలో సేవ చేస్తావు. అయితే దినములు గడిచిన తర్వాత సంపూర్ణ సేవకు వస్తావు. అంతేకాకుండా నీవు సముద్రం లో ఉద్యోగం చేస్తావు అని చెప్పారు.

చివరకు షిప్పింగ్ లైన్ ఎంచుకుని దానికి సంబంధించిన చదువు చదివి షిప్ లో ఉద్యోగం చేయడం మొదలుపెట్టి మా సంఘాలను సేవను బలపరుస్తూ, అవకాశం దొరకినప్పుడు సువార్త కేంపులకు వెళ్లేవాడను. ఇలా నా జీవిత లక్ష్యం, జీవనశైలి దేవుడు ఈ అధ్యాయం ద్వారా నిర్దేశించారు.

ఇలా కొన్ని సంవత్సరాలు జరిగాక ఒకరోజు ఆశ్చర్య రీతిలో దైవజనులు కోన సుధాకర్ బాబు గారితో పరిచయం జరిగింది. ఆయన ద్వారా దేవుడు నాలో ఎప్పుడో ఆపివేసిన రచనా భారము మరలా మొదలుపెట్టడానికి ఎంతో పురిగొల్పారు. అప్పటి నుండి దేవుడు నన్ను ప్రత్యేకమైన రీతిలో రచనల ద్వారా ఫేస్‌బుక్ లోను వాట్సప్ లోను, వెబ్‌సైట్ ద్వారా సేవ చేయడం జరుగుతుంది. అనేక లక్షల మందికి నేను మరియు సుధాకర్ బాబు గారు రాసే వర్తమానాలు అందుతున్నాయి.

అయితే గత సంవత్సరం దేవుడు చెప్పారు నీవు సిద్ధంగా ఉండు, కొద్ది రోజుల్లో సంపూర్ణ సేవకు రావాలి. నేను సరే అన్నాను.

అంతేకాకుండా అనేకసార్లు నేను శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు ఇదే అధ్యాయం ద్వారా మాట్లాడారు. భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ!!!

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ఇక్కడ యాకోబు స్థానంలో మీ పేరు పెట్టుకుని చూడండి. ఈ అధ్యాయం ఎంత ఆదరణ ఇస్తుందో!!!

ఇజ్రాయేల్ ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తున్నది. ఆయన వారి సృష్టికర్త (వ 1), వారి విమోచకుడు (వ 1,14), వారి రక్షకుడు (వ 3), రాజు (వ 15), సంరక్షకుడు (వ 2), వారిని ప్రేమించేవాడు (వ 4), వారికి వారి పూర్వ క్షేమస్థితిని మళ్ళీ కలిగించేవాడు (వ 5,6), క్షమించేవాడు (వ 25). ఇజ్రాయేల్ వారు తాము చేయవలసినది చేయలేదు (వ 22-24). అందువల్ల దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది (వ 28). అయితే దేవుడు తాను చెయ్యవలసినది చేస్తారు (వ 25). దేవునితో ఈ సంబంధం విషయంలో ఇస్రాయేల్ వారి విధి ఏమిటంటే సాక్షులుగాను (వ 10,12), దేవుణ్ణి మహిమ పరచేవారుగాను (వ 21) ఉండాలి. ఇజ్రాయేల్ దేవుణ్ణి తమ దేవుడుగా, రక్షకుడుగా నమ్మినవారికి ఈ అధ్యాయంలో మధురమైన సత్యం ఉంది.

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*255వ భాగము*

యెషయా 43:1--3

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక మనం వాక్య ధ్యానము నకు వచ్చేద్దాము! మొదటి వచనంలో అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు అంటూ మొదలుపెట్టారు! కానీ 41వ అధ్యాయం లో యెషయా 41:8

నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా అన్నారు. 41,43 మధ్య ఏం జరిగింది?!!

41లో నా సేవకుడవైన ఇశ్రాయేలు అన్న దేవుడు, 43లో యాకోబు అంటున్నారు. యాకోబు అనగా అర్థం మనందరికీ తెలుసు! మడిమెను పట్టుకొన్న వాడు. అనగా ఎవడైనా ఎదుగుతుంటే వాడి కాలు వెనుకనుండి లాగేసేవాడు. అందుకే మోసగాడు అని పిలుస్తారు. గాని యాకోబుగారు- ఇశ్రాయేలుగా ఎప్పుడు మారారు? యబ్బోకు రేవు దగ్గర దేవునితో ముఖాముఖిలో ప్రార్థనా పోరాటం తరువాత! అనగా యబ్బోకు అనుభవం వరకు మోసపూరిత మైన బ్రతుకు బ్రతికారు యాకోబు గారు! అనగా తల్లిదండ్రులు దగ్గర 40 ఏళ్ళు మోసగాడిగా బ్రతికారు. జ్యేష్టత్వం విషయంలో అన్నను మోసగించారు. తండ్రి ఆశీర్వాదము విషయంలో తండ్రిని అన్నను మోసగించారు 40 సంవత్సరాలు. ఇక సిరియా దేశంలో 40 సంవత్సరాల కాలంలో మోసగాడైన యాకోబు గారు మామ ద్వారా భార్య విషయంలో మొదటి 20 సంవత్సరాల కాలంలో మోసపోతే, తనకు రావలసిన వాటా విషయంలో రెండవ 20 సంవత్సరాల కాలంలో పది సార్లు మోసగించ బడ్డారు. ఈ యెషయా గ్రంథంలో 33:1లో చెప్పబడనట్లు మోసగాడైన యాకోబు మోసగించడం ముగించిన తర్వాత పదకొండు సార్లు మోసగించబడ్డారు! ఇక మామ గారు తనను పదకొండు సార్లు మోసం చేశాడని, 12వ సారి తానే మోసం చేసి పారిపోయారు. అనగా అన్నను, తండ్రిని మోసం చేసిన యాకోబు గారు, మామగారిని కూడా మోసం చేశారు. అనగా తన 81వ సంవత్సరం వరకూ మోసగాడు గానే బ్రతికారు! యబ్బోకు రేవు దగ్గర దేవుని ముఖాముఖిలో తన రహస్య పాపాలు ఒప్పుకుని యాకోబు- ఇశ్రాయేలు గా మారిపోయారు. సరే ఇంతవరకూ చాలా బాగుంది.

అయితే అవసరం తీరాక తెప్ప తగలేసే చందం మనది. యాకోబు గారు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా, అన్నను చూసిన వెంటనే అన్నని దేవునితో పోల్చుతూ దేవునితో సమానం చేసేశారు. ఇశ్రాయేలుగా మారిన తరువాత దేవునికివ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా మనుష్యులను పొగడుతున్నారు! ఫలితంగా యాకోబు కొడుకులు చెడిపోయారు. పెద్ద కొడుకు రూబేను తల్లి సమానురాలైన పినతల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన ఏకైక ముద్దుల కుమార్తె, 11మంది అన్నల ముద్దుల చెల్లి చెరపబడింది. షిమ్యోను లేవీలు హంతకులుగా మారిపోయారు. షెకెములో కొనుక్కున్న పొలాలు, ఇల్లులు వదిలిపెట్టి పారిపోవలసి వచ్చింది. ఇశ్రాయేలే అనగా దేవునితో పోరాడి గెల్చిన ఆశీర్వాదాలు పొందుకున్న విశ్వాసి- శ్రమల సంకెల్లలో లోకపు పోకడలో లోకస్తుల వలె ప్రవర్తించారు. దేవునితో నాలుగు సార్లు కంటే ఎక్కువగా ముఖాముఖిగా మాట్లాడిన అత్యుత్తమమైన అనుభవం, దేవునిని అడిగి పొందుకునే అనుభవమున్న యాకోబు గారు దేవునికి దూరంగా బ్రతికి శ్రమలపాలు అయ్యారు. చివరకు బేతేలుకు వెళ్లాక, అన్య దేవతలను విసర్జించి, స్త్రీలు పురుషులు తమ నగలను ఆభరణాలను చివరికి చెవిపోగులు తీసి పారవేశాక తిరిగి దేవునితో సమాధాన పడ్డారు. అనగా బేతేలులో సంపూర్ణంగా సమర్పించు కున్నాక, తిరిగి దేవునితో సమాధానపడ్డారు! ఇదీ యాకోబు ఇశ్రాయేలుగా మారి- లోకంలో కలిసిపోయి మరలా యాకోబుగా మారిపోయారు. మరలా అతి కష్టం మీద యాకోబు ఇశ్రాయేలుగా మారారు.

విశ్వాసి కూడా బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన కాదు. పవిత్రమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. ఆత్మాభిషేకం పొందుకుని ఆత్మచేత నడిపించ బడాలి లేకపోతే లోకంలో మరలా కలిసి పోయే అవకాశం ఉంది. అన్యుడు విశ్వాసి కావాలి. విశ్వాసి ఆత్మానుసారి కావాలి.

ఇదే ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా జరిగింది. యాకోబు అనుభవం లో ఉన్న ప్రజలు- దేవుని మహా కృపవలన ఇశ్రాయేలుగా మారారు. గాని మాటిమాటికీ తప్పిపోయి యాకోబుగా మారిపోయారు. ఇదే 42వ అధ్యాయం చివరి మూడు వచనాలు చెబుతున్నాయి.

Isaiah(యెషయా గ్రంథము) 42:23,24,25

23. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

25. కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.

ఇందుకే 41వ అధ్యాయంలో నా సేవకుడవైన ఇశ్రాయేలు అన్న దేవుడు ఈ అధ్యాయంలో అయితే యాకోబు అంటున్నారు. మరో అధ్యాయం లో పురుగు వంటి యాకోబు అన్నారు.

ప్రియ సహోదరుడా సహోదరి! నిన్ను కూడా దేవుడు నా ప్రియ కుమార్తె కుమారుడా అని అనేకసార్లు పిలిచారు కదా! మరి ఇప్పుడు కూడా అలా పిలుస్తున్నారా?! దేవుని పిలుపు విని, దేవుని స్వరము విని ఎన్ని రోజులైంది?! దేవునితో మాట్లాడి ఎన్ని రోజులైంది?! నీ కనుల నుండి కన్నీరు కారి ఎన్ని రోజులయ్యింది!! ఎందుకు దేవుని స్వరము వినలేకపోతున్నావు!!!?

నీపాపము నీకును దేవునికి అడ్డంగా వస్తుంది గనుక!

యెషయా 59:1

రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

యెషయా 59:2

మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

యెషయా 59:3

మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

ఆ పాపమును ఒప్పుకుని విడిచి పెడతావా?! సామెతలు గ్రంథం లో అంటున్నారు సామెతలు 28:13

అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

నీవు కూడా కనికరం పొంది, దేవునితో సమాధాన పడాలి అంటే దేవునికి వ్యతిరేకంగా నీలో ఉన్నవి, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేవి ఏమైనా ఉంటే ఇప్పుడే ఒప్పుకుని విడిచిపెట్టు!

మరలా ఆ పాపము చేయవద్దు!

గమనించాలి ఈ అధ్యాయంలో ఇంతగా పాపముచేసి దేవునికి దూరంగా పోయినా గాని ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు దేవుడు: అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

ఆయన నిన్ను ఆ పాపముల నుండి పాప దాస్యం నుంచి విమోచించి యున్నారు. భయపడవద్దు ఎందుకంటే నిన్ను పేరు పెట్టి పిలిచారు. నీవు నాసొత్తు అంటున్నారు. మరి నీవు ఒప్పుకుని విడిచి పెడతావా!? దేవునితో సమాధాన పడతావా!!!

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*256వ భాగము*

యెషయా 43:1--3

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా ఈరోజు మొదటి వచనం కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. కారణం ఈ వచనం ఎంతో ఆదరణ కరమైన వచనం! అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

గతభాగం లో చెప్పడం జరిగింది ఈ అధ్యాయం లో దేవుడు అనేక రీతులలో ఆదరిస్తూ ఎన్నో మాటలు చెబుతున్నారు.

ఇజ్రాయేల్ ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తున్నది. ఆయన వారి సృష్టికర్త (వ 1) అనియు, వారి విమోచకుడు అనియు (వ 1,14), వారి రక్షకుడు అనియు (వ 3), రాజు అనియు (వ 15), సంరక్షకుడు అనియు (వ 2), వారిని ప్రేమించేవాడు అనియు(వ 4), వారికి వారి పూర్వ క్షేమస్థితిని మళ్ళీ కలిగించేవాడు అనియు (వ 5,6), వారిని క్షమించేవాడు అనియు(వ 25) ఇక్కడ చెబుతున్నారు. ఇంకా ఇలా చేయడానికి ఇజ్రాయేల్ వారు తాము చేయవలసినది చేయలేదు (వ 22-24). అందువల్ల దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది (వ 28). అయితే దేవుడు తాను చెయ్యవలసినది చేస్తాడు (వ 25). దేవునితో ఈ సంబంధం విషయంలో ఇజ్రాయేల్ వారి విధి ఏమిటంటే సాక్షులుగాను (వ 10,12), దేవుణ్ణి మహిమ పరచేవారుగాను (వ 21) ఉండాలి. ఇస్రాయేల్ దేవుణ్ణి తమ దేవుడుగా, రక్షకుడుగా నమ్మినవారికి ఈ అధ్యాయంలో మధురమైన సత్యం ఉంది.

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా..... దీనికోసం ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన ప్రయోజనం నిమిత్తం దేవుడు ఇజ్రాయేల్ జాతిని ప్రత్యేకంగా సృష్టించి ఏర్పరచుకున్నారు (వ 7, 21).

కీర్తనాకారుడు అంటున్నారు కీర్తనలు 100:3

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

యెషయా 43:7

నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

యెషయా 43:21

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

యెషయా 44:2

నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

వారినే కాదు మనలను కూడా ప్రత్యేకమైన జనంగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నారు!

1 Peter(మొదటి పేతురు) 2:9,10

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

ఇంకా నేను నిన్ను విమోచించి యున్నాను. దేని నుండి? దాస్యము నుండి. పాప దాస్యం నుండి. సాతాను చెర నుండి.

కీర్తనలు 78:35

దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.

విడిపించినవాడు– ఇక్కడ ఇలా తర్జుమా చేయబడ్డ హీబ్రూ పదం (గోయేల్‌) హీబ్రూ పాత నిబంధనలో 46 సార్లు కనిపిస్తూవుంది. కొన్ని సార్లు దేవుణ్ణి, కొన్ని సార్లు మనిషిని ఉద్దేశించి ఈ పదం వాడబడింది. దీనికి వివిధ అర్థాలు ఉన్నాయి – కష్టాలనుంచీ బానిసత్వం నుంచీ విడిపించిన విమోచకుడు (ఆది 48:16; ద్వితీ 13:5) ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆస్తిని వెలకు కొని అతనికి తిరిగి అప్పగించే సమీప బంధువు (లేవీ 25:25) హత్యకు గురి అయిన రక్తసంబంధి విషయంలో ప్రతీకారం చేసేవాడు (సంఖ్యా 35:12) తన కుటుంబం సభ్యుని మరణం తరువాత అతని భార్యను వివాహమాడి అతనికోసం సంతానాన్ని కనడమే కాక ఆమె కోల్పోయిన ఆస్తిని కొని తిరిగి ఆమెకు అప్పగించే సమీప బంధువు (రూతు 2:20) తన ప్రజలు వేధింపులకు గురౌతూ ఉంటే వారి పక్షాన నిలబడేవాడు (సామెత 23:11) దేవుడు విమోచకుడుగా తన ప్రజలను దాస్యంనుంచి తప్పించాడు, వారిని వారి దేశంలోకి తిరిగి రప్పించాడు, వారి శత్రువులను శిక్షించాడు (యెషయా 49:25-26; యిర్మీయా 50:33-34).

క్రొత్త నిబంధనలో దీని అర్థం మరింత ఆధ్యాత్మికమైనది. అక్కడ విమోచకుడు యేసుప్రభువు. పాపదాస్యంనుంచి మనల్ని విడిపించేందుకు అవసరమైన వెలను చెల్లించారు. ఆ వెల ఆయన రక్తమే. ఆ రక్తం మూలంగా విశ్వాసులకు పాపక్షమాపణ, విముక్తి, పరలోకంలో ఉన్న శాశ్వతమైన వారసత్వం లభించాయి. యేసు తన విశ్వాసుల పక్షంగా వారి శత్రువైన సైతానుని ఎదిరించి మానవజాతిమీదికి మరణాన్ని తెచ్చి పెట్టిన ఈ పిశాచాన్ని ఆయన నాశనం చేసి, సైతాను చేతుల్లో పడడం మూలంగా మనిషి జారవిడుచుకొన్న దానంతటినీ తిరిగి మనిషికి సమకూరుస్తారు. దేవుని కోసం ఫలించేందుకు తన ప్రజలంతా ఉమ్మడిగా తనకు ఆత్మ సంబంధమైన పవిత్ర వధువు కావాలని యేసుప్రభువు వారిని విమోచించారు. మత్తయి 20:28; 26:28; రోమ్ 3:24; 7:1-4; గలతీ 3:13-14; ఎఫెసు 1:7, 14; 4:30; 5:33; కొలస్సయి 1:14; హీబ్రూ 9:12; 1 పేతురు 1:4, 18, 19; ప్రకటన 1:5; 5:9-10; 19:6-9 చూడండి

మనము కూడా విమోచించబడ్డాము. 1 Peter(మొదటి పేతురు) 1:18,19

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

యిర్మియా 50:34

వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.

ఇక తరువాత భయపడకుము! ఈ మాట బైబిల్ లో 366సార్లు ఉంది. అనగా సంవత్సరంలో ప్రతీరోజూ దేవుడు చెబుతున్నారు నాబిడ్డా! భయపడకుము!!! కాబట్టి ఈ రోజు నీవు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు! నీకు తోడుగా నీ దేవుడైన యెహోవా ఉన్నారు..

యెషయా 41:10

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

యెషయా 41:14

పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

యెషయా 42:7

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

Isaiah(యెషయా గ్రంథము) 44:1,2,3,4

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

3. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

4. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

ఇక పేరు పెట్టి నిన్ను పిలిచాను: నిర్గమకాండము 33:17

కాగా యెహోవా నీవు చెప్పినమాటచొప్పున చేసెదను; నీమీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా

యెషయా 42:7

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

ఇంకా అనేకమైన మాటలతో దేవుడు ఆదరిస్తున్నారు! నీవు నాసొత్తు!

ఈరోజు నీవు నేను కూడా దేవునిద్వారా పిలువబడ్డాము. బాప్తిస్మము ద్వారా ఆయన సొత్తుగా ఆయన ప్రజలుగా ఆయన కుమార కుమార్తెలుగా మార్చబడ్డాము. ఇక మన పక్ష్యంగా ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనము భయపడక చింతపడక పరమ కనాను యాత్రలో ధైర్యంగా ముందుకు పోదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*257వ భాగము*

యెషయా 43:1--3

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక రెండవ వచనం చూసుకుంటే నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుండును నదులలో బడి వెళ్లినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, ఇంకా ముందుకు పోతే నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు

దీనికోసం ఆలోచించుకుంటే దేవుని ప్రజల విషయంలో ఇది కొన్నిసార్లు అక్షరాలా నిజమైంది (నిర్గమ 14:21-22; యెహో 3:14-17; దాని 3:19-27).

ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మరియు యెరికో నది దగ్గర ఇశ్రాయేలీయులు జలముల మధ్య నడిచి వెళ్లేరు. అలాగే దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషకు అబెద్నెగో అనగా హనన్య మిసాయిలు అజర్యా ఈ ముగ్గురు భక్తుల్ని పట్టుకొని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారి చనిపోకుండా కాపాడారు

Exodus(నిర్గమకాండము) 14:21,22,29,30

21. మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి.

Joshua(యెహొషువ) 3:13,14,15,16,17

13. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.

14. కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందసమును మోయు యాజ కులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.

15.​ అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే

16.​​ పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

17. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

ఇక అగ్ని కోసం చూసుకుంటే

Daniel(దానియేలు) 3:20,21,22,23,24,25,26,28

20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.

22.​ రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

23.​ షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా

24.​ రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగ లేచి -మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదాయని తన మంత్రుల నడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.

25.​ అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

28.​ నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

అయితే జలములు అనగా మరో అర్థం కూడా ఉంది. అది ఆధ్యాత్మిక జీవిత యాత్ర లో ఎదురయ్యే శ్రమలు శోధనలు. ఎక్కువ సార్లు ఆధ్యాత్మిక పరీక్షా సమయాల్లో, ఆధ్యాత్మికమైన ప్రమాదాలనుంచి తప్పించిన సందర్భాల్లో ఈ మాట నెరవేరింది (కీర్తన 66:10-12). దేవుడే గనుక మనతో ఉంటే ఏదీ మనకు హాని చెయ్యలేదు. సరిగా అర్థం చేసుకోలేక అలా హాని జరుగుతున్నదని మనము అనుకొంటాం.

Psalms(కీర్తనల గ్రంథము) 66:10,11,12

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

కీర్తనలు 46:3

వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)

కీర్తనలు 69:1

దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.

కీర్తనలు 69:2

నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.

కీర్తనలు 77:16

దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.

కీర్తనలు 124:1

మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

కీర్తనలు 124:2

వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

కీర్తనలు 124:3

యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

కీర్తనలు 124:4

జలములు మనలను ముంచి వేసి యుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి యుండును

కీర్తనలు 124:5

ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

కీర్తనలు 124:6

వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.

ఇక మూడో వచనంలో ఎందుకు భయపడవద్దు చెప్తున్నారు ఎందుకంటే యెహోవానగు నేను నీకు దేవుడును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించు వాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను మీకు బదులుగా కూసును షెబాను ఇచ్చి ఉన్నాను అంటున్నారు. దేవుని ప్రేమ ఎంతో లోతైనది ఆయన ప్రేమ అంత బలిష్టంగా ఉంది కాబట్టి దేవుడు తన్ను ప్రేమించే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని ప్రేమ అలాంటిదే ఇక్కడ ఈజిప్టు ఇంకా తదితర దేశాలు ఇశ్రాయేలు వారికోసం బలిగా ఇచ్చేసాడు అంటే దీని భావం ఎంతో గొప్పది. ఇలా ఎందుకు అంటున్నారు అంటే నాలుగో వచనంలో దీనికి వివరణ ఉంది ఎందుకంటే నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడవైతివి నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక నీకు బదులుగా నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకు అంటున్నారు. చూడండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారిని రక్షించడం కోసం వారికి రావలసిన శిక్ష ఈజిప్ట్ మీదకి కూసు అనగా ప్రస్తుతం ఇతియోపియా మీదకి వీరి మీదకి పంపించేశారు. అలాగే నీవు నేను దేవునికి ఇష్టులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన మీదకు వచ్చే ఉగ్రతను శ్రమను తప్పించి మనకు బదులుగా మరొకరు ఆ బాధ అనుభవించేలా చేస్తారు.

దీనికి మరో అర్థం కూడా ఉంది దేవుడు తన ప్రజలను ఐగుప్తు బయటకు తీసుకు రావడానికి ఐగుప్తు ప్రజలు పెట్టిన కష్టాలకు దేవుడు మొత్తం ఐగుప్తు దేశాన్ని భాదించాడు. 10 రకాలైన తెగులుతో ఐగుప్తు దేశాన్ని పాడు చేశారు. అందుకే నీకు బదులుగా నేను ఐగుప్తుని లేదా ఈజిప్ట్ ని ఇచ్చాను అంటున్నారు. కూషు సెభా అనేవారికో రెండవ దిన వృత్తాంతాల గ్రంథంలో 14వ అధ్యాయంలో చూసుకుంటే ఆసా గారి కాలంలో ఈ కూసువారు వేలకొలది సైన్యంతో వచ్చినప్పుడు, ఆసా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన దేవా నీవే మాకు దిక్కు ఈ సైన్యాన్ని గెలవడానికి మాకు దమ్ము ధైర్యం లేదు అని ప్రార్థన చేస్తే, దేవుడు ఆ రాత్రి వారిని మొత్తారు. కాబట్టి వారు పారిపోయారు. కాబట్టి దేవుడు తన ప్రజలను రక్షించడానికి వారికి బదులుగా మరొకరిని బలిచేస్తారు. కాబట్టి ఆయన మనతో ఉన్నారు. నీవు ఆయన దృష్టికి ప్రియుడుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి!

ఆయనకి ఇష్టమైనది చేద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*258వ భాగము*

యెషయా 43:5--8

5. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

6. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

7. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

8. కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 5,6 వచనాలు చూసుకుంటే 5. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

6. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

ప్రియులారా ఇక్కడ ఈ ఐదు నుంచి ఎనిమిది వచనాలు చూసుకుంటే భయపడకు నీకు తోడుగా ఉన్నాను తూర్పు నుండి మీ సంతానాన్ని తెప్పిస్తాను పడమటి నుంచి సమకూరుస్తాను ఇంకా ఉత్తరదిక్కున ఆజ్ఞ ఇస్తాను దక్షిణ దిక్కున ఆజ్ఞ ఇస్తాను, దూరం నుండి నా కుమారులను భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పిస్తాను అంటున్నారు. దీని అర్థం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించడం శిక్షించి వారిని శత్రువులకు పాలు చేసి, వాళ్ళు ప్రవాసాలకి అనగా చెరకు వెళ్లిపోవడం ఖాయం!!! వారు ప్రవాసాలకు వెళ్లిపోవడం ఎంతవరకు ఖాయమో, అయితే వారు విడుదల పొందడం మరలా తిరిగి తమ స్వదేశానికి రావడం కూడా అంతే ఖాయం! ఒకసారి మనం 39 వ అధ్యాయం చూసుకుంటే హిజ్కియాగారితో దేవుడేమంటున్నారు

Isaiah(యెషయా గ్రంథము) 39:6,7

6. రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

7. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.

Isaiah(యెషయా గ్రంథము) 7:17,18,19,24

17.​ యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రా యిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

19. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

24. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్క డికి పోవుదురు.

Jeremiah(యిర్మీయా) 25:1,3,8,9,10,11,12

1. యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

3. ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.

8.​సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువ నంపించుచున్నాను;

9.​ ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.

10.​ సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వర మును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండ కుండ చేసెదను.

11.​ ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు.

12. యెహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.

కాబట్టి ఈ ప్రవచనాలు అన్ని తప్పకుండా నెరవేరుతాయి అని దేవుడు చెప్పారు. అలాగే నెరవేరాయి కూడా! అదే విధముగా మీరు చెరలోకి వెళ్ళిపోతారు దిగంతముల వరకు వెళ్లిపోతారు కానీ అక్కడ నుండి నేను మిమ్మల్ని రప్పిస్తాను అని దేవుడు చెప్పారు! అవి కూడా తప్పకుండా జరిగాయి!! జరుగుతాయి!!! ఒకసారి పారశీక రాజైన కోరేసు ఆజ్ఞ వలన తిరిగి రప్పించబడ్డారు. అదే విధంగా మరల క్రీస్తుశకం 70 తర్వాత యెరుషలేము కూల్చబడి ఇశ్రాయేలు ప్రజలు అనేక దేశాలమ్మట చెదిరిపోయిన తరువాత మరలా 1947- 48 నుంచి తిరిగి రప్పించబడుతున్నారు కాబట్టి రెండుసార్లు నెరవేరింది. నెరవేరుతుంది. తప్పకుండా ఇస్రాయేలు ప్రజలంతా మరల తిరిగి రప్పించబడతారు! ఇవి కూడా తప్పకుండా నెరవేరుతాయి

Isaiah(యెషయా గ్రంథము) 11:11,12

11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

Isaiah(యెషయా గ్రంథము) 27:12,13

12. ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.

13. ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.

యెషయా 49:22

ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

యెషయా 56:8

ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.

యెషయా 60:1

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

యెషయా 60:4

కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

యెషయా 60:8

మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

యెషయా 60:10

అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

యెషయా 60:14

నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.

యెషయా 60:17

నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగానునీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

యెషయా 60:19

ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

యెషయా 60:21

నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

యెషయా 60:22

వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

కాబట్టి దేవుడు తన బిడ్డలను ఏ విధముగా చెరలపాలు చేశారో, అదే విధముగా వారిని సమకూర్చిన దేవుడైయున్నారు. అందుకే భయపడొద్దు! అప్పగించమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ వేస్తాను, నా ప్రజలను దక్షిణ దిక్కున ఉన్న దేశస్థులకు నా కుమారులను కుమార్తెలను దిగంతములను రప్పిస్తాను ఎందుకంటే అది నీ కోసం కాదు ఏడో వచనం చూసుకుంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నా నామము పెట్టబడిన వారు అనగా మొదటగా ఇశ్రాయేలీయులు, రెండవది ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులమైన మనము అనగా ఇశ్రాయేలీ ప్రజలతో అంటుకట్టబడిన వారమైన క్రొత్త నిబంధన సంఘము, మనందరికీ ఆయన నామము యేసు నామము పెట్టబడింది! ఎందుకంటే నేనే వారిని కలుగజేశాను, వారిని పుట్టించిన వాడను నేనే!!! మనల్ని పుట్టించిన వాడు ఆయనే కాబట్టి, దేవుని మహిమ నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలను రప్పించబోతున్నారు తిరిగి చెరలోనుండి, అలాగే మనము కూడా పాప దాస్యం నుండి విడిపించి తన ప్రజలుగా చేసుకున్న తర్వాత మనలను కూడా దేవుడు కాపరిగా కాపాడబోతున్నారు! చెదిరిపోయిన మనల్ని సమకూర్చబోతున్నారు! మనకు ఆయనే కాపరిగా మేపరిగా ఉండి, మనలను రక్షిస్తున్నారు!

మరి ఆయన కాపరత్వము కిందకు ఉంటావా!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*259వ భాగము*

యెషయా 43:8--13

8. కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి

9. సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

10. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.

12. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక ఎనిమిదో వచనంలో 8. కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి . ప్రియులారా 42వ అధ్యాయంలో చెప్పిన అంశాన్ని మరోసారి ఎత్తుతున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 42:16,18,19,20,23,24

16. వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును

18. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి.

19. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

23. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?

24. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?

కన్నులుండి అంధులైన వారు అనగా ఆధ్యాత్మిక గ్రుడ్డివారు. నిజమైన సత్యము గ్రహించక విగ్రహాలు వెనుక, లోకపు పోకడలు వెనుక తిరిగేవారు!!!

ఇక 9--13 వచనాలు చూసుకుంటే 9. సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.

10. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.

12. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?

9-13 వచనాలలో భూమి ఒక కోర్టు అయినట్టూ, నిజమైన సత్యము కోసం విచారణ జరుగుతున్నట్టూ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 41:1, 21-23 చూసుకుంటే

Isaiah(యెషయా గ్రంథము) 41:1,22,23

1.ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.

22.జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

23.ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

వివాదంలో ఉన్న అంశం ఇది: భవిష్యత్తును గురించి ముందుగా తెలియజేయడం, సంభవాలను తన వశంలో ఉంచుకోవడం అనే రుజువులను చూపుతూ తానే నిజ దేవుణ్ణని నిరూపించినదెవరు? విగ్రహారాధన చేసే జాతులవారు వారి సాక్షులను తేవాలి (వ 9). దేవునికి సాక్షులుగా ఆయన ప్రజలైన ఇజ్రాయేల్ వారిని చూపిస్తున్నారు ఇక్కడ (వ 10,12). వారి మూలంగా తానే ఏకైక దేవుడు, తాను తప్ప వేరే దేవుడు లేడన్న సత్యం స్థాపించబడాలి.

అలానే ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా క్రీస్తు విశ్వాసులు ఆయనకు సాక్షులు (లూకా 24:48; అపొ కా 1:8; 2:32; 4:20; 5:32; 13:31).

లూకా 24:46

క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

లూకా 24:47

యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

లూకా 24:48

ఈ సంగతులకు మీరే సాక్షులు!!

అపో.కార్యములు 1:8

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

అపో.కార్యములు 4:19

అందుకు పేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

అపో.కార్యములు 4:20

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

అపో.కార్యములు 5:32

మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

అపో.కార్యములు 13:31

ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.

అపో.కార్యములు 13:32

దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.

ప్రియులారా 10వ వచనం చూసుకుంటే మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను అనగా నిజమైన దేవుడు అని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నారు! మీరును అనగా ఇశ్రాయేలు ప్రజలు, నా సేవకుడు అనగా యెషయా ప్రవక్త గారు నాకు సాక్షులు అని దేవుడు చెప్తున్నారు. ఏం చెబుతున్నారు నాకు ముందుగా ఏ దేవుడు లేడు నిర్మింపబడలేదు నా తర్వాత కూడా మరొక ఏ దేవుడు ఉండడు అని కరాకండిగా చెప్తున్నారు!

11 ,12 వచనాల్లో నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేనే లేడు! ప్రకటించిన వాడను నేనే, రక్షించినవాడును నేనే! దానిని మీకు గ్రహింపచేయువాడును కూడా నేనే అంటున్నారు! అందుకే ఏసు క్రీస్తు ప్రభులవారు అంటున్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు అనగా పరలోకం చేరలేడు అంటున్నారు!

తండ్రియైన దేవుడు అంటున్నాడు ఏ అన్య దేవత మీలో ఉండలేదు నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యెహోవా వాక్కు !

13 వచనంలో ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయు వాడు కూడా ఎవడు లేడు అంటున్నారు అనగా నిజమైన సర్వశక్తుడు దేవుడే ఆయన తప్ప మరొక దైవము లేదు విగ్రహాలలో ఏమి లేదు అని తెలుసుకో అంటున్నారు ఈ వచనాలలో!!! ఒకసారి యెషయా 14:27; ద్వితీ 32:39; యోబు 9:12 వచనాలు చదవమని మనవిచేస్తున్నాను!

మరి నిజమైన సత్యాన్ని గ్రహిస్తావా ఆయనే దేవుడని ఆయనే రక్షకుడని గ్రహించి ఆయన మార్గంలో నడుస్తావా!!!

దైవాశీస్సులు

*యెషయా ప్రవచన గ్రంధము*

*260వ భాగము*

యెషయా 43:14--20

14. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.

15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.

16. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

17. రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.

18. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.

19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.

20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 14వ వచనం చూసుకుంటే 14. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.

ఇక్కడ మీ నిమిత్తం అనగా – 3,4 వచనాల్లోని సత్యానికి మరొక ఉదాహరణ. దేవుని ప్రజలను బందీలుగా తీసుకుపోయిన బబులోనువారు తామే తమ శత్రువులను చూచి పారిపోతారు. ఈ విధంగా దేవుడు తన ప్రజలను బబులోను చెరనుండి విడిపించబోతున్నారు. ఇంతవరకు ఇశ్రాయేలీయులు ప్రజలు బబులోను వారి చెరలో ఉన్నారు అయితే ఇప్పుడు తమను శ్రమ పెట్టిన బబులోను వారు, తామే సిగ్గుపడి పారిపోయే కాలం సమీపిస్తుంది అని ఈ వచనాలలో దేవుడు చెబుతున్నారు.

సరే ఇక ఈ విషయం జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు అంటున్నారు మీకోసం నేను బబులోను మీదికి సైన్యాన్ని పంపుతాను అప్పుడు కల్ధీయులు పతనం అయిపోయి తమకు ఇంతవరకు గర్వకారణంగా అనుకుంటున్న తమ ఓడలలో పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే తమకు గర్వకారణంగా అని ఇంతవరకు భావించారో తమ ఓడలు ఆ ఓడల్లోనే పారిపోయేలాగా నేను చేస్తాను! ఎందుకంటే వారి మీదకి నేను సైన్యాన్ని పంపుతున్నాను ఆ సైన్యము ఎవరో కాదు మాదీయ పారశీక అలయన్స్ సైన్యము! ఆ సైన్యము బబులోన మీదకు వచ్చి బబులోనుని చుట్టుముట్టిన తర్వాత బబులోను వారు పారిపోయేలాగా ఓడల మీద పారిపోయేలాగా నేను చేస్తాను అంటున్నారు!

ఇక 15వ వచనం చూసుకుంటే ఎందుకంటే యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును ఇశ్రాయేలీయులు సృష్టికర్తనకు నేనే మీకు రాజును!! నేనే సృష్టికర్తను నేనే రాజును అనేది ఈ గత అధ్యాయాల్లో నేను సృష్టికర్తను నేను రాజును అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ అధ్యాయంలో కూడా మరోసారి నేనే రాజుని నేనే సృష్టికర్తను పరిశుద్ధ దేవుని అని దేవుడు చెబుతున్నారు

యెషయా 6:5

నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

యెషయా 41:21

వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు.

యెషయా 44:6

ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.

యెషయా 44:7

ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

కీర్తనలు 44:4

దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.

ఇక తరువాత వచనంలో 16. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

17. రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.

ప్రియులారా ఈ వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే సముద్రంలో త్రోవ కలుగజేసేవాడు వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును అయిన నేను వాటి మధ్య రధమును గుర్రమును సేనను శూరులను నడిపించే వాడనగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అంటున్నారు! ఇక్కడ సముద్రంలో త్రోవ కలుగజేయువాడు అనగా... ఇది ఎప్పుడు కలిగింది? ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాటి మధ్య ఇశ్రాయేలు ప్రజలను దాట చేశాడు.

ఇక వడిగల జలములలో మార్గము కలుగజేయువాడు అనగా యోర్దాను నది చాలా వేగంగా పారుతుంది. ఎందుకు పారుతుంది అంటే దాని వైశాల్యం తక్కువ, దాని వెడల్పు తక్కువ, కానీ వచ్చే నీటి యొక్క ఉధృతి ఎక్కువ. అందువల్ల చాలా తొందరగా వేగంగా పారుతుంది యోర్ధాను నది. యెహోషువ గారి కాలంలో యెహోషువ గారి నాయకత్వంలో అదే ఇశ్రాయేలీ జనాంగము వడిగల వేగము గల యోర్దాను నదిని పాయలు చేసి దానిని దాటిపోయినట్లు మనం యెహోషువా గ్రంథములో చూడగలం!!!

Exodus(నిర్గమకాండము) 14:16,17,18,21,22,23

16. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

17. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.

18. నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.

21. మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

23. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

Joshua(యెహొషువ) 3:13,14,15,16,17

13. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.

14. కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందసమును మోయు యాజ కులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.

15.​ అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే

16.​​ పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

17. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుదముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

కాబట్టి సముద్రంలో త్రోవ కలుగజేయడం, వడిగల జలములలో మార్గము కలగజేయడం వాటి మధ్య రధమును గుర్రమును సేనను ఇంకా శూరులను నడిపించువాడు నేనే అంటున్నాడు దేవుడు. ఇది నిజముగా బైబిల్ లో జరిగిన సంఘటనలు! అయితే ప్రియులారా నిజానికి ఇప్పుడు దేవుడు సముద్రాలలో మార్గము కలుగజేశారు! నేటిరోజుల్లో మనము చూసుకుంటే ఒక దేశానికి మరో దేశానికి, దేశంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య సముద్రంలో బ్రిడ్జి కట్టడం కష్టం కాబట్టి, ఎందుకంటే దాని లోతు చాలా ఎక్కువ కాబట్టి ప్రపంచంలో ఇంతవరకు 200 కంటే ఎక్కువ సొరంగాలు సముద్రంలో తవ్వి, రహదారులు ఏర్పాటు చేశారు. మరి ఇవి సముద్రంలో మార్గము కలుగజేయడం కాదా! అన్నిటి కంటే పెద్ద సముద్ర టన్నెల్ జపాన్లో ఉంది. దాని పేరు సికానా అనుకుంటాను 53 కిలోమీటర్ల పొడవైన టన్నెలది. కాబట్టి సముద్రంలో మార్గం కలుగజేశారు!!!

అదేనా మరి నేటి రోజుల్లో సముద్రయానం చేసేవారు ప్రయాణించే మార్గాలు, మరి సముద్రపు రోడ్లు లేవా? దేశాలకు దేశాలకు, ఖండాలకు అవి కనబడని రోడ్లు! నీటి మీదనే నడిచే సముద్రపు దారులు మార్గాలు దేవుడు ఏర్పాటు చేశారు! ఈ విధముగా రవాణా అనేది సముద్ర యానంలో షిప్పుల ద్వారా అతి చౌకగా జరిగిపోతుంది! ఇది కూడా దేవుడు కలుగజేసింది కదా! మరి వాటి ద్వారా నౌకలేమిటి వాటి ద్వారా శూరులు ఖడ్గములు మిస్సైల్లు సేనలు వెళ్తున్నాయి కదా!! కాబట్టి ఇవన్నీ దేవుడు సముద్రంలో మార్గం కలుగజేసి నడిపిస్తున్న విధానము అని గమనించాలి.

ఇక శత్రువులు జనపనార లాగా తిరిగి లేకుండా నాశనం అయిపోయి నాశనమైపోతారు అని అనడం- కారణం ఏంటంటే ఆరోజు ఎర్ర సముద్రంలో ఐగుప్తు సైన్యము కూడా ఎర్ర సముద్రాన్ని దాటేద్దామని ఇశ్రాయేలీ ప్రజల వెనకాల వచ్చినప్పుడు వారంతా ఎర్ర సముద్రం లో మునిగిపోయారు! దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏకము చేసినప్పుడు వారంతా చనిపోయి నాశనం అయిపోయారు ఈ విషయాన్ని ఇక్కడ భక్తుడు చెబుతున్నారు.

Exodus(నిర్గమకాండము) 14:23,24,25,26,27,28,29,30,31

23. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

25. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

26. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.

27. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.

28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి.

31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్య మును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునియందు మోషేయందు ఏ విధముగా నమ్మకముంచారో మనము కూడా దేవుని నమ్ముదాం!

మన దైవ సేవకుని వెంబడించి వాక్యపు వెలుగులో సాగిపోదాం!

దైవాశీస్సులు!

ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*261వ భాగము*

యెషయా 43:18--21

18. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.

19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.

20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్య ములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును

21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక పద్దెనిమిదవ వచనం నుండి చూసుకుంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలం జరిగిన సంగతులు తలచుకోవద్దు. ఎందుకంటే వాటివలన మీకు అవమానం కలిగింది. అయితే ఇప్పుడు నేనొక నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మొదలవుతుంది దానికోసం మీరు ఆలోచించరా! నేను అరణ్యంలో త్రోవ కలుగ చేస్తున్నాను ఎడారిలో నదులు పారజేస్తున్నాను అంటున్నారు. గతంలో జరిగిన అవమాన క్రియలు కాకుండా ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోండి అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఏమేమి గొప్ప కార్యాలు చేశారు ఐగుప్తు రాజుని సైన్యాన్ని ఓడించడం, 10 రకాలైన తెగుల్లుతో ఐగుప్తి కి బుద్ధి చెప్పి, ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడం, ఎర్ర సముద్రం పాయలు చేయడం, సుమారు 30 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించడం, బండ నుండి నీరు ఇవ్వడం, యోర్దాను నదిని పాయలు చేయడం, సుమారు 30 మంది రాజులను హతము చేసి ఆ ప్రాంతాన్ని ఇస్రాయేలీయులకు ఇవ్వడం ఇదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నారు దేవుడు. ఎన్నెన్ని కార్యాలు వారి జీవితంలో చేశారో దేవుడు. వారే కాదు మనము కూడా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి.

103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నారు! కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఆయన చేసిన మేలులను మరిచిపోయిన వాడు కృతగ్ఞుడు అయితే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును మరిచిపోయెను అని ఆదికాండం 42వ అధ్యాయంలో ఉంది. యోసేపు చేసిన మేలును మరిచిపోయాడు పానదాయకుల అధిపతి! మనము కూడా అలాగా మర్చిపోకుండా దేవుడు చేసిన మేలు అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించ బద్ధులమై ఉన్నాము.

ఇక తరువాత నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అరణ్యములో త్రోవ కలుగజేయువాడును ఎడారిలో నదులు పార చేయుచున్నాను అంటున్నారు! దీనికోసం ఆలోచిస్తే అరణ్యంలో త్రోవ-- మీద వచనాలలో సముద్రంలో త్రోవ కలుగజేస్తున్నాను అని చెబితే ఈ వచనంలో సముద్రాలలోనే కాదు అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నారు! నేడు మనం కొండలలో అడవులలో ఎన్నో రకాలైన రోడ్లు ఈ కాలంలో చూడగలం, ఘాట్ రోడ్స్ అంటారు వాటిని. ఈ ఘాట్ రోడ్లు చూస్తే భయంకరమైన అరణ్యంలో అడవులలో బడి ఉంటాయి. దేవుని మహా కృప ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన తెలివి ద్వారా కొండలలో అరణ్యాలలో అడవులలో దేవుడు రోడ్లు దారులు ఏర్పాటు చేశారు!

అలాగే ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఏవండీ ఐగుప్తు దేశం మొత్తం ఎడారి కాదా? మరి దానిలో దేవుడు నైలునదిని పార జేయలేదా!? నేటి రోజుల్లో నదుల అనుసంధానం ద్వారా ఎడారి దారిలో కూడా నదులను తీసుకొని పోవడం లేదా?! కాబట్టి ఇదంతా దేవుడు చేసే మహా గొప్ప ప్రక్రియ అని మర్చిపోకూడదు!

నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను! అప్పుడు అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పు కోళ్ళు నన్ను ఘనపరుస్తూ నన్ను ఘనపరుస్తాయి! నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు! చూడండి నేను ఏర్పరచుకునిన ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను! అవును కదా ఇశ్రాయేలు జనాలను ఎర్ర సముద్రం దాటాక ఇంకా సీనాయి అరణ్యంలోనే వారికి నీరు లేనప్పుడు మోషే గారి మీద సనుక్కున్నప్పుడు దేవుడు అరణ్యంలో అనేకసార్లు నీళ్లు వారికి ఇచ్చారు! బండతో మాట్లాడినప్పుడు/ బండను కొట్టినప్పుడు కూడా నీళ్లు ఉబికి పొర్లి పారినట్లు మనము చూడగలము

Exodus(నిర్గమకాండము) 17:1,2,3,5,6,7

1. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున

2. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.

3. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.

5. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము

6. ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

Numbers(సంఖ్యాకాండము) 20:1,2,3,4,8,9,10,11

1. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

2. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.

3. జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

4. అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?

8. నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.

9. యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.

10. తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసి నప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.

11. అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.

యెషయా 30:25

గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

యెషయా 35:7

ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

యెషయా 41:17

దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.

యెషయా 41:18

జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు

యెషయా 41:19

చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను.

యెషయా 41:20

నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.

సరే ఇక్కడ దేవుడు అంటున్నారు నేను ఈ మధ్యన నూతన కార్యము చేసెదను. మరి ఆ నూతన కార్యము ఏమిటి

యెషయా 42:9

మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.

ఈ నూతన కార్యము యిర్మియా గ్రంథం లో కనిపిస్తుంది మనకు!

Jeremiah(యిర్మీయా) 16:14,15,16,17,21

14. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలోఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట

15. అనక ఉత్తరదేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీ యులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.

16. ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలి పించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.

17. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.

21.​ కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్య మును ఎంతటివో వారికి తెలియజేతును.

Jeremiah(యిర్మీయా) 23:3,4,5,6,7,8

3. మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.

4. నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.

5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

6. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

7. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక

8. ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34,35

31.​ ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32.​ అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

35.​ పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

ప్రకటన గ్రంథం 21:1

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

ప్రకటన గ్రంథం 21:5

అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.

ఇక తరువాత వచనంలో అంటున్నారు 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

10వ వచనంలో లాగానే దేవుడు ఇజ్రాయేల్ ను ఒక ప్రత్యేకమైన జాతిగా సృష్టించడంలో ఒక కారణం తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజ ఈ ఉద్దేశాన్ని అత్యంత సమర్థవంతంగా సాధించిన కాలంలో (దావీదు పాలన సమయంలో లాగా) కీర్తనల గ్రంథం ఉనికిలోకి వచ్చింది. ఈ యుగంలో దేవుని స్తుతిని చాటడం సంఘానికున్న ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి (1 పేతురు 2:9). ఇజ్రాయేల్ జాతీ, క్రీస్తు సంఘమూ ఈ రెండూ దేవుని మహిమకోసం ఏర్పడినవే.

మనము కూడా నూతన నిబంధన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి దినము ఆయన నీతిని ఆయన విశ్వాస్యతను ఆయన చేసిన గొప్ప మేలులను తలచుకుంటూ ఆయన కీర్తిని ప్రచురము చేస్తూ ఉండాలి! ఆయనను పొగుడుతూ ఉండాలి! ఆయన స్తుతిస్తూ ఉండాలి! ఇక ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తూ సాగిపోవాలి!

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!!

ఆమెన్!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*262వ భాగము*

యెషయా 43:22

22. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

23. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.

24. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

26. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

27. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

28. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 22--24 వచనాలు చూసుకుంటే 22. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

23. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.

24. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

చూడండి నువ్వు నాకు మొరపెట్టడం లేదు ఇశ్రాయేలు నన్ను గూర్చిన విసిగిపోయావు నాకు దహనబలులుగా మేకపిల్లలు నా ఎదుటకు తేలేదు, నీ బలుల చేత నన్ను తృప్తి పరచలేదు, నా కోసం విలువైనవి కొని నాకు అర్పించలేదు అంటూ, సరి కదా నీవు నీ పాపాల చేత నన్ను విసిగించేసావు కానీ నాకు ఇవి చేయమని నేను విసిగించలేదు అంటున్నారు!

22-24 మొత్తంమీద ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి సాక్షులుగానూ ఆయనను స్తుతించేవారుగానూ కూడా విఫలులయ్యారు. ప్రార్థించవలసిన రీతిలో వారు ప్రార్థించలేదు. వారిది పైపై ఆరాధనే. దేవునిపట్ల వారే విధమైన ప్రేమ చూపించడం లేదు. దేవుడు తమను పిలవడం అనే అద్భుతాన్నీ ఘనతనూ వారు గ్రహించినట్టు లేదు. వారి చరిత్రలో నైవేద్యాలు వేటినీ ఆయనకు తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా నాసిరకం వాటిని అయోగ్యమైన రీతిలో తెచ్చి అర్పించారు

యెషయా 1:11-17;

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

యెషయా 29:13

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.

ఆమోసు 5:25-26;

25. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?

26. మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.

మలాకీ 1:6-13

6.​ కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

7.​ నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా

8.​ గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

9.​ దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.

10.​ మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11.​​ తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12. అయితే­యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు

13. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు; ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.

14. నేను ఘనమైన మహారాజునైయున్నాను; అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మ్రొక్కుబడిచేసి చెడిపోయినదానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.

ఏమండీ- కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఇలా చేశారా!? నేటి రోజుల్లో మనం కూడా అలాగే లేమా!!! దేవుడిని హృదయపూర్వకంగా ఎంత మంది ఆరాధన చేస్తున్నారు? ఆత్మతోను సత్యముతోను ఆరాధన ఎంతమంది చేస్తున్నారు? గుడిలోకి ఏదో మందిరానికి రావాలని మాత్రమే వస్తున్నారు తప్ప యదార్ధమైన హృదయంతో దేవుడు మన మధ్య ఉన్నాడు అనే ఉద్దేశంతో భయముతో భక్తితో ఆరాధన చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇక దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వడం లేదు! ప్రార్థించే సమయంలో సెల్ ఫోన్ చూసుకుంటూ కొందరు, సీరియల్ చూసుకుంటూ కొందరు, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసుకుంటూ కొందరు లేదా సినిమాలు షికార్లు తిరిగే వాళ్ళు కొందరు, బీచ్లు తిరిగే వాళ్ళు కొందరు ఈ రకంగా తయారవుతున్నారు! దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవుని ఇవ్వడం లేదు. దేవునికి ఇవ్వాల్సిన ధనం దేవునికి ఇవ్వడం లేదు. ప్రతి దాంట్లో దొంగతనం చేస్తున్నాం! పైకి భక్తి గలవారైయుండే దాని శక్తిని గ్రహించలేని వారమే ఉంటున్నాం! దేవునికి కానుకలు ఇస్తున్నా చిరిగిపోయిన నోట్లు వేసే వారు కొంతమంది, టంగుమని అందరికీ వినబడేలాగా కాసులు వేసే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. కాబట్టి ఇశ్రాయేలీయులే కాదు మనము కూడా ఈ రోజుల్లో అలాగే ఉన్నాం! దేవుని ఆరాధించే విధంగా ఆరాధన చేయట్లేదు! ఉపవాసం చేసే విధముగా ఉపవాసం చేయడం లేదు! ప్రార్థించే విధముగా ప్రార్థన చేయడం లేదు! మోకరించే విధముగా మోకరించడం లేదు! కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు యూదుల మీదకు వచ్చిన ఆ శ్రమ మన మీద కూడా రాబోతుంది అని మర్చిపోవద్దు!!!

అయితే చివరిగా అంటున్నారు చూడండి నన్ను సరైన విధంగా ఆరాధించలేదు సరి కదా నీ పాపములు చేత నీవు నన్ను విసిగించేవు నీ దోషములు చేత నన్ను ఆయాసపెట్టారు అంటున్నారు! అసలే సరిగా దేవునికి అర్పించాల్సినవి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు సరి కదా దేవున్ని మన పాపముల ద్వారా మన కాని నడతలు ద్వారా, దేవుని మనస్సును గాయపరుస్తున్నాము! పాపానికి పాపం కలుపుకుంటున్నాము అని దేవుడు అంటున్నాడు!

ప్రియమైన దేవుని బిడ్డా! ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోమని మనవి చేస్తున్నాను. నీ స్థితి కూడా ఇలాగే ఉందా? నీవు కూడా సరియైన విధంగా ప్రార్థన చేయడం లేదు సరి కదా దేవున్ని ఆయాసపెట్టే కార్యాలు చేస్తున్నావ్ కదా! ఇప్పుడే దేవునితో సమాధానం పడు! దేవుని పాదాలు పట్టుకుని క్షమించమని అడుగు! ఆయనతో సమాధాన పడి ఆయన రాజ్యములోనికి చేరమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను!!!

దైవాశీస్సులు

*యెషయా ప్రవచన గ్రంధము*

*263వ భాగము*

యెషయా 43:22

22. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

23. దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.

24. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

26. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

27. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

28. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియ దైవజనమా! 25వ వచనంలో అంటున్నారు నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

చూడండి ప్రియులారా! 22 నుంచి 24 వచనాల్లో యాకోబు నువ్వు నాకు మొర పెట్టడం లేదు, ఇశ్రాయేలు నువ్వు నా కోసం విసికిపోయావు నువ్వు నాకోసం దహన బలులుగా గొర్రెలు, మేకలు తేవడం లేదు, నీ బలులు ఇచ్చి నన్ను ఘనపరచడంలేదు. అయినా నేను కూడా నీకు నైవేద్యాలు నాకు చేయమని నిన్ను బలవంతం పెట్టలేదు ధూపం వేయమని నిన్ను విసిగించలేదు, నా నిమిత్తం నువ్వు సువాసన గల లవంగపు చెట్ట చెక్క నువ్వు కొనలేదు అనగా నన్ను ఆరాధించే విధంగా నువ్వు నన్ను ఆరాధించలేదు ప్రార్థించే విధముగా ప్రార్థించలేదు! నా కోసం గొప్ప కానుకలు ఇవ్వలేదు! సరే కదా నీ పాపములు చేత నన్ను విసిగించావు నన్ను ఎంతో ఆయాశపెట్టావు అని బాధపడిన దేవుడు 25వ వచనంలో అంటున్నారు: అయినా సరే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు అన్ని తుడిచి వేస్తున్నాను! నీ పాపాలని ఎక్కడ నేను జ్ఞాపకం చేసుకోను అని సెలవిస్తున్నారు! దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు క్షమించి తన హక్కును చేర్చు కుంటున్నారు ఇక్కడ. తండ్రి ప్రేమను చూపిస్తున్నారు దేవుడు. ఇంతగా నువ్వు చేసినా నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలను తుడిచేస్తున్నాను. మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నారు! దీనినే కృప అంటారు అనగా అర్హత లేని వారికి క్షమించి ఆదుకోవడం చేర్చుకోవడం ఇదే కృప! ఎంత కృపగల దేవుడో కదా. మనం కూడా మన జీవితాల్లో అనేకసార్లు పాపము చేసి దేవుని నుండి దూరం అయిపోతున్నాం! నిజానికి మనం శిక్షార్హులం! ఆయన శాపానికి కోపానికి హక్కుదారులం మనం న్యాయంగా! కానీ ఇంత చేసినా దినమెల్ల మనకోసం లోబడని పిల్లల కోసం దినమెల్ల నా చేతులు చాపి పిలుస్తున్నాను అంటున్నారు దేవుడు. యెషయా 65:2;

నీవు నేను పాపములో ఉన్నా దేవుడు మనలను క్షమిస్తున్నారు మనలను హక్కున చేర్చుకుంటాను అంటున్నారు మరి నీవు ఆయన చేతులలోకి వస్తావా?!!

దేవుని ప్రేమ, ఆయన మహిమ తన ప్రజలైన ఇజ్రాయేల్ తో ముడిపడి ఉన్నాయి. వారి పాపాల మూలంగా వారు శాశ్వతంగా నాశనం కావడం దేవుని ఉద్దేశం కాదు. ఆయన అలా జరగనియ్యడు. 21 వచనాన్ని వారు పూర్తిగా నెరవేర్చే కాలం ముందుంది.

యెషయా 40:2

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 44:22

మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

యెషయా 44:23

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

యిర్మియా 31:33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

యిర్మియా 31:34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

ఇక 26--27 వచనాలలో అంటున్నారు 26. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

27. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

చూడండి ఇక్కడ ఏమంటున్నారు నాకు జ్ఞాపకం చేయు మనం వాదిద్దాము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యెము వివరించి చెప్పు అంటున్నారు. నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, ఈ మధ్యవర్తులు కూడా నా మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన వారే అంటున్నారు చూడండి. ఇక్కడ నీవు అనగా యాకోబు మాత్రం కాదండి ఇశ్రాయేలు జనాంగము అని అర్థం! ఇక్కడ ఇస్రాయేలు జనాంగం అంతటితోనే మాట్లాడుతున్నారు గమనించాలి!

తొమ్మిది నుంచి 12 వచనాల్లో మనం చూసుకున్నాం అక్కడ ఒక కోర్టు జరుగుతుంది సమస్త జనులను పిలిపించి వారు చేస్తున్న విగ్రహారాధన కోసం దేవుడు ఆరోపిస్తూ తాను చేసిన గొప్ప కార్యాలకు ఇశ్రాయేలు ప్రజలను సాక్షిగా చూపిస్తూ నేను జరిగేది జరగబోయేది చెప్పే వాడను అంటూ అక్కడ ఇశ్రాయే ప్రజలను సాక్షులుగా చూపించి అక్కడ కోర్టు నడిపిస్తున్నారు! ఇక్కడైతే సాక్ష్యిస్థానంలో లేరు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ముద్దాయి స్థానంలో ఉన్నారు!!!

యెషయా 1:18

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.

యెషయా 1:2

యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

యెషయా 1:3

ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

యెషయా 1:4

పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

యెషయా 1:5

నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

యెషయా 1:6

అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

యెషయా 1:7

మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయు చున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.

హెబ్రీ పత్రికలో అంటున్నారు హెబ్రీయులకు 10:16

ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత

హెబ్రీయులకు 10:17

వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 10:18

వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.

ఇక తర్వాత వచనములు నువ్వు ఇలా చేయటానికి కారణం మీ ఆది పురుషుడైన ఆదాము, అలాగే ఇశ్రాయేలు జాతికి మూలపురుషుడు అబ్రహాము ఇద్దరూ పాపులే! మీరు పాపములో పుట్టారు కాబట్టి మీరు పాపం చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ దేవుడు!

ఆదికాండము 3:5

ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

ఆదికాండము 3:6

స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

ఆదికాండము 3:7

అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

రోమీయులకు 5:12

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.( మూలభాషలో-అందరి ద్వారా వ్యాపించెను)

Genesis(ఆదికాండము) 12:10,11,12,13,14,15,16

10. అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశ ములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.

11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితోఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.

12. ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు.

13. నీవలన నాకు మేలుకలుగు నట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.

14. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి

15. ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

16. అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.

ఇక్కడ అబద్దమాడి పాపము చేశారు అబ్రాహాము గారు!

Genesis(ఆదికాండము) 20:1,2,3,4,5,6,9

1. అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.

2. అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

3. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చినీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.

4. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?

5. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.

6. అందుకు దేవుడు అవును, యధార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.

9. అబీమెలెకు అబ్రాహామును పిలిపించినీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.

రోమీయులకు 3:9

ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

రోమీయులకు 3:23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

కాబట్టి అందరూ పాపులే! అందుకే అందరినీ శిక్షిస్తున్నాను అంటున్నారు.

ఇక మధ్యవర్తులు అనగా ప్రవక్తలు రాజులు అధికారులు యాజకులు నాయకులు! వీరంతా మధ్యవర్తులు అన్నమాట వారు కూడా పాపం చేసిన వారు అంటున్నారు దేవుడు.

అందుకే తర్వాత వచనంలో కావున నేను నీ ప్రతిష్ఠులకు ప్రధానులను అపవిత్రపరిచాను యాకోబును శపించాను ఇశ్రాయేలుని దూషణ పాలు చేశాను. ఇప్పుడు నేను క్షమిస్తున్నాను అంటున్నారు దేవుడు. ఇక మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటున్నారు. మరి ఆయన దగ్గరికి వస్తావా?!

నిజానికి దేవుడు మానవులు చేసిన పాపాలకు అపరాధలకు వారిని చంపేయాలని అనుకోవట్లేదు. వాళ్ళని శిక్షించి మరల తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు! పాపము చేసిన వారిని శిక్షించాలి అనే ఆయన నిర్ణయం అయితే మారలేదు అయితే కొద్దిగా శిక్షించి క్షమాపణకు ఒక అవకాశం ఇచ్చారు అన్నమాట! అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అప్పుడు దేవుడు తన అక్కున చేర్చుకుంటారు మరల అదే మార్గంలో ఉంటే ఇక నిత్య నాశనమే అని మర్చిపోవద్దు!!!

కాబట్టి ఏది కావాలో తేల్చుకో!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*264వ భాగము*

యెషయా 44:1--4

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

3. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

4. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 43వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 44వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం! ఇది కూడా 42,43 అధ్యాయాలకు కొనసాగింపు అని గ్రహించాలి. అనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలపై ప్రేమ చూపించడం, వారు ఎంతటి పాపాత్ములైన క్షమించి వారిని చెరలోనుండి తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం, అదే సమయంలో విగ్రహాలు ఎంత చేతకానివో వాటిని చేసేవారు పూజించేవారు ఎంత తెలివితక్కువ వారో చెబుతున్నారు!!!

ఇక మొదటి వచనంలో అంటున్నారు అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము .

ఇక్కడ అయిననూ అయినప్పటికీ అంటూ మొదలుపెట్టారు కాబట్టి ఇది 43వ అధ్యాయం లో చెప్పిన దానికి కొనసాగింపు అని గ్రహించాలి. 43వ అధ్యాయం దేనితో ముగించారు?

Isaiah(యెషయా గ్రంథము) 43:24,25,26,27,28

24. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

26. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

27. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

28. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.

చూడండి నా నిమిత్తము నువ్వు సువాసన గల లవంగపు చెక్క రూకలిచ్చి కొనలేదు అనగా నన్ను ఆరాధించే విధంగా నన్ను ఆరాధించడం లేదు నాకు రావలసిన ఘనమైన కానుకులు నాకు ఇవ్వడం లేదు సరి కదా నీవు నీ పాపాలు చేత నన్ను విసిగించేవు. అయినా సరే నేను నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలను నీ అతిక్రమములను తుడిచి వేశాను. ఇంక నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అంటూ నీ మూల పురుషుడు అనగా ఆదాము పాపం చేసినోడే, నీ మధ్యవర్తులు పాపం చేసినవారే, అందుకే నేను నీ ప్రతిష్ఠులను ప్రధానులను నేను అపవిత్ర పరిచాను యాకోబును శపించాను, ఇశ్రాయేలీయులని దూషణపాలు చేశాను అంటూ, ఇప్పుడు మొదటి వచనంలో అయినా సరే నా సేవకుడైన యాకోబూ, నేను ఏర్పరచు కొన్న ఇశ్రాయేలు విను! ఏంటంటే నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయు వాడైన యెహోవా ఇలాగూ సెలవుచున్నాడు... మరలా అంటున్నారు నా సేవకుడవు యాకోబు నేను ఏర్పాటుచుకొనిన యెషూరునూ భయపడకు అంటున్నారు!

ఈ రెండు వచనాల్లోనే రెండుసార్లు నా సేవకుడైన యాకోబు అంటూ దేవుడు పిలిచారు. మీద వచనములో నేను ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు విను అంటే ఈ రెండవ వచనములో నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరూనూ భయపడొద్దు అంటున్నారు! యెషూరూనూ అనేది కావ్య నామం ఇశ్రాయేలు ప్రజలకు! కావ్యము అనగా పద్యాలలో చెప్పుకునే పేరు. దీని అర్థం ఏంటంటే నీతి నిజాయితీ గలవాడు!!!

ఓ యెషూరూను! నీతి నిజాయితీ గల యాకోబు! నేను నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు నేను సహాయం చేస్తున్నాను! నువ్వు భయపడొద్దు నేను దప్పికగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవావ జలాన్ని కుమ్మరిస్తాను. నువ్వు భయపడొద్దు అంటున్నారు దేవుడు!!!

Isaiah(యెషయా గ్రంథము) 41:8,9,10,11,12,13,14

8. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

11. నీమీద కోపపడిన వారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

Isaiah(యెషయా గ్రంథము) 43:1,5,6,7

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

5. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

6. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

7. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

ఇక దప్పిక గొనిన వారిమీద నీళ్లను ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను కోసం చూసుకుంటే

యెషయా 30:25

గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

యెషయా 32:2

మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

యెషయా 35:6

కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

యెషయా 35:7

ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.

అయితే ఇక్కడ నీరు అనగా అర్థం సామాన్య నీరు కాదు అని ఇదే వచనంలో తరువాత పాదము జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధమవుతుంది.

నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

అనగా ఇక్కడ నీరు అనగా పరిశుద్ధాత్మ అని అర్థమవుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాలు నుండి ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మిక దాహంతో వారు బాధపడుతున్నారు. ఆధ్యాత్మిక దాహం -దేవుడు వారి హృదయాన్ని వెలిగించి చాలా రోజులు అవుతుంది! కాబట్టి ఇక్కడ నేను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని చెబుతున్నారు! అనగా ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని ఆత్మ కుమ్మరించబోతున్నారు!

గమనించాలి పెంతుకోస్తు సమయంలో పెంతుకోస్తు పండుగ సమయంలో ఇది కొంత మట్టుకు నెరవేరింది. అన్యజనులు అందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించడం కుమ్మరించబడటం అపొస్తలులందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడం ఇక్కడ మనకు చూడగలుగుతున్నాము. అయితే ఇప్పటివరకు ఇశ్రాయేలు జనాంగం మీద ఆయన ఆత్మ కుమ్మరించబడలేదు! కాబట్టి అంత్య దినాలలో ఈ యుగాంతంలో జెకర్యా 12 వ అధ్యాయం ప్రకారం దగ్గర 12: 10 నుంచి 14 ప్రకారం మరొక్కసారి దేవుడు ఇశ్రాయేలు జనాల మీద తన ఆత్మను కుమ్మరించబోతున్నారు! తప్పకుండా ఇశ్రాయేలీయులందరూ దేవుని ఆత్మను పొందుకుంటారు!

ఈ కాలంలో నూతన నిబంధన సంఘంలో క్రీస్తు యేసు శిలువను చేరిన ప్రతి ఒక్కరూ మారుమనస్సు పశ్చాత్తాపం పొందిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మము పొందుకున్న తర్వాత దేవుని ఆత్మను ఎలా పొందుకుంటున్నారో ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఆత్మను పొందుకోబోతున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 32:15,16,17

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

Joel(యోవేలు) 2:28,29,30,31,32

28. తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

29. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.

30. మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

31.​ యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

32.​ యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేము లోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.

Joel(యోవేలు) 3:1,2

1. ఆ దినములలో, అనగా యూదావారిని యెరూష లేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున

2. అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.

యెహేజ్కేలు 39:29

అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

Acts(అపొస్తలుల కార్యములు) 2:1,2,3,4,5,14,16,17,18,19,20,21

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

5. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

14. అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెనుయూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.

16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

17. అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.

18. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

21. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.

ఇక ఇశ్రాయేలు ప్రజలకి నెరవేరబోయే ప్రవచనం

Zechariah(జెకర్యా) 12:10,11,12,13,14

10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12. దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

ప్రియ దేవుని బిడ్డా! దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద త్వరలో తన ఆత్మను కుమ్మరించబోతున్నారు! ఇప్పటికే ఆత్మను పొందుకున్న మరి నీవు, నీ స్థితి ఎలా ఉంది? ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్ముడు నీలో ప్రతిరోజు పనిచేస్తున్నాడా? ఆయన సన్నిధిని ప్రతిరోజు అనుభవించ గలుగుతున్నావా?!!! ఆత్మానుసారమైన జీవితం జీవించగలుగుతున్నావా??!!! అలాగైతేనే నువ్వు ఎత్తబడగలవు!!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*265వ భాగము*

యెషయా 44:4--8

4. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

5. ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.

6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.

7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

8. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 44వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక నాలుగో వచనంలో నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అంటున్నారు.

గమనించాలి 4-5 వచనాలు ఆత్మ కుమ్మరించబడినందువల్ల ఇజ్రాయేల్ లో కనిపించబోయే కొన్ని ఫలితాలు అని గ్రహించాలి.

ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే మనకి మొదటి కీర్తనలో అతడు అనగా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి పాటించేవాడు చదివేవాడు నీటి కాలువల వద్ద నాటబడిన మొక్కలా ఉంటాడు అని చెబితే, ఇక్కడ ఇంకా వివరంగా నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు అంటున్నారు! ఎవరు?!!! దేవుని మాట ఆలకించిన వాడు! దేవుని చేత ప్రేమించబడ్డవాడు!!!

సరే ఇప్పుడు ఒకసారి మనం అసలు నిరవంజి చెట్టు కోసం ఆలోచిస్తే ఈ వచనములో ఈ చెట్టు గడ్డిలో గడ్డితో పాటు ఎదుగుతుంది అని మనకు అర్థమవుతుంది! ఇంగ్లీషులో ఏమంటారు అంటే విల్లోస్, విల్లో ట్రీ అంటారు, ఇంకొక పేరు సాలోస్ అంటారు, ఇంకా ఓసియర్ అంటారు. దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది నీరు ఎక్కువగా ఉన్న దగ్గర మరియు ఆ నీటి దగ్గర గడ్డి ఎక్కువగా పెరిగే ప్రాంతంలో పెరుగుతుంది. దీని లక్షణాలు ఏమిటంటే చాలా గుబురుగా ఎదుగుతుంది, ఎదిగాక మంచి పువ్వులు పూస్తుంది! వీటిలో చాలా రకాలైన చెట్లు ఉన్నాయి. ఈ విల్లోస్ మంచి పూలు పూస్తాది! అంతేకాకుండా దీని ఆకులు గానీ దీని పువ్వులు గాని ఎన్నో రకాలైన రోగాలకు ఔషధముగా అనగా మందులుగా వాడుతారు! అంతే కాకుండా దీని బెరడుతో బుట్టలు తట్టలు తయారు చేస్తారు అనగా మనకు తడపలతో, వెదురులతో ఏ రకంగా బుట్టలు తట్టలు చేస్తారో అలాగే దీనితో కూడా దీని బెరడు తోటి బుట్టలు తట్టలు చేయడమే కాకుండా, దేనినైనా కట్టడానికి ఉపయోగిస్తారు. చాలా గట్టిగా ఉంటుంది. బలంగా ఉంటుంది. ఇక దీని కర్ర చూసుకుంటే ఎంతో బలంగా ఉంటుంది అందుకే ప్రపంచంలో అనేక దేశాలలో క్రికెట్ బ్యాట్ ల కోసం ఈ విల్లోస్ లేక నిరవంజి చెట్టు కర్ర వాడుతారు! అరణ్యంలో మీకు లైటర్ లేకపోతే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టి లేకపోతే ఈ రెండు కలపల్ని చేత్తో పట్టుకొని గట్టిగా కొడితే దీని నుంచి నిప్పు రవ్వలు వస్తాయి!!! ఆ విధంగా కూడా ఈ నిరవంజి చెట్లు వాడుతారు! అనగా ఇది గుబురుగా ఉంటది నీటి వారన మొలుస్తుంది, ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, ఇంకా ఇది అనేక జబ్బులకు మందుగా పని చేస్తుంది. దీని బెరడు తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీని కలప కూడా చాలా గట్టిది అనగా ఆకుతో, ఆకు మొగ్గలు, పువ్వులు తో పాటుగా దీని బెరడు చెక్క కూడా ఎన్నో అవసరాలకు పనికొస్తుంది!

ఇప్పుడు దేవుని మాట వినిన వారు కూడా ఈ నిరవంజి చెట్లు లాగే ఎదుగుతారు! ఇక్కడ వాక్యపు నీటిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో నిరంతరము ఉండేలాగా గట్టిగా బలంగా దృఢంగా ఎదుగుతారు ప్రయోజనకరమైనదిగా !!!

ఇక ఈ నిరవంజి చెట్టు కోసం బైబిల్లో ఎక్కడ రాయబడి ఉందంటే లేవికాండములో ఇశ్రాయేలీ ప్రజలు ఆచరించాల్సిన పండగలలో ఒక పండగ పర్ణశాల పండుగ. ఇది లేవీ కాండం 23: 40 లో ఉంటుంది

ఆ పర్ణశాల కట్టడానికి దబ్బ పండ్లు ఈతమట్టలు గొంజి చెట్లు అంతేకాకుండా కాలువల యొద్ద వుండు నిరవంజి చెట్లను పట్టుకుని ఏడు దినాలు మీరు పండుగ చేయండి అని మనం చూడొచ్చు పర్ణశాల పండుగలో!! అంతేకాదు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ని బంధిద్దామని ఒక వేశ్య నిన్ను ఎలా బంధించాలి అంటే సంసోను గారు ఒకసారి చెప్పారు న్యాయాధిపతులు 16లో నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే నేను బలహీనమైపోతాను!

అలాగే ఇంకా యోబు గ్రంథంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది 40: 22లో

అయితే ముఖ్యమైన వచనం ఏమిటంటే కీర్తన గ్రంథంలోని ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశం చెరలోనికి వెళ్ళినప్పుడు వ్రాయబడిన కీర్తన 137, బబులోను నదుల దగ్గర మనం కూర్చున్నప్పుడు మనం సీయోను కోసం మనం ఏడుస్తున్నప్పుడు వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించేము అయితే మనలను చెర తీసుకొని పోయిన బబులోను వారు సీయోను కీర్తనలు ఒక దాన్ని మాకు పాడండి అంటే మా సితారాలు నిరవంజి చెట్లకు తగిలించేసాము, మేము ఎలా పాడగలము అని అక్కడ అనినట్లు మనం 137వ కీర్తనలు చూడగలం!

కాబట్టి నిరవంజి చెట్లు బైబిల్ లో ఎంతో ప్రాముఖ్యమైనవి!

నీవు యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క వాక్యము అనే నీటి దగ్గర, కాలవల దగ్గర ధర్మశాస్త్రము పక్కన నువ్వు నాటబడినవాడివైతే ఆ వాక్యమనే నీరు పాలుతో నువ్వు తడుస్తూ ఉంటే, క్రీస్తులో బలముగా ఎదుగుతూ బలమైన కార్యాలు చేయగలవు! క్రీస్తు కోసం ఫలించ గలవు ! ఎంతోమందికి ఆశీర్వాదకరముగా నువ్వు ఉండగలవు.

ఇక్కడ దేవుడు చెప్తున్నారు: యాకోబు నీవే గాని నా మాట వింటే నిన్ను నిరవంజి చెట్టు లాగా నిన్ను వాడుకోబోతున్నాను అంటున్నారు!!

ప్రియమైన సహోదరి సహోదరుడా మరి నీవు ఆ విధముగా నిరవంజి చెట్టు లాగా ప్రభువు కోసం వాడబడటానికి సిద్ధంగా ఉన్నావా!!!!

ఇక తర్వాత వచనంలో ఎప్పుడైతే ఇలాగ నిరవంజి చెట్టు లాగా వాడబడతాడో వాడు ఒకడు నేను యెహోవా వాడను అంటాడు మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును మరియొకడు యెహోవా వాడను అని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలు అను మారుపేరు పెట్టుకొనును ఎందుకంటే ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నారు.

యెషయా 41:21

వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు.

యెషయా 41:22

జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి.

యెషయా 43:1

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

యెషయా 43:15

యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.

ప్రియులారా! ఇక ఏడవ వచనం నుంచి 20వ వచనం వరకు ఇంతకుముందు మనం ధ్యానించిన విషయాలు కనిపిస్తాయి! నేనే దేవున్ని రాబోయే సంగతుల్ని చెప్పేవాడని నేనే! అలాంటివాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి అని దేవుడు సవాల్ చేస్తున్నాడు! అందుకే మీరు వెరువ వద్దు, భయపడొద్దు చాలా కాలం క్రిందట నేను మీకు తెలియజేసిన సంగతులు నేను చెప్పింది జరిగాయి కదా. దానికి మీరే నాకు సాక్షులు! నేను తప్ప వేరే దేవుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి!... ఇంకా విగ్రహాలు చేసే వాళ్ళు కూడా అలాంటి విగ్రహాలు వంటి వారే, వాటి తరఫున వాటిని చేసేవారు వాటి తరుపున మాట్లాడే వాళ్ళు గుడ్డోళ్లు. వారికి తెలివి లేదు.... ఇంకా కుమ్మరి ఇనుప పనిముట్లు తీసుకొని అంటే మట్టి బొమ్మలు నిప్పు కణాలతో కాల్చి దాన్ని బొమ్మలు చేస్తాడు, ఇక చెక్కతో చేసిన బొమ్మలు గాని లేకపోతే ఈ లోహంతో చేసిన విగ్రహాలు గానీ కమ్మరి దాన్ని బలంగా అగ్ని లో ఊది దానిని ఆ రూపం ఏర్పరుస్తాడు. వడ్రంగి దానికి రూపం ఏర్పరుస్తాడు, దాంట్లో కొంచెం పొయ్యిలోకి వాడుతాడు వంట చేసుకోవడానికి , మరి కొంత విగ్రహం చేస్తారు ఈ విషయం కోసం మనమంతా ధ్యానం చేసుకున్నాం కాబట్టి ముందుకు పోదాం!!!

ఇంకా 18 నుంచి 20 వచనాలు వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు వాళ్లకు కళ్ళకు బురద అలికినట్టు ఉంటుంది. వారు కళ్లు ఉండి చూడలేకపోతున్నారు, వారి హృదయాలు అన్ని మూయి బడ్డాయి. అందుకే వారు గ్రహించలేకపోతున్నారు. ఎవడు ఆలోచించడం లేదు. వాడు బూడిదైనా తింటున్నాడు అని దేవుడు అంటున్నారు!!

కాబట్టి నీలో ఎటువంటి విగ్రహం నీలో పనిచేస్తుంది! మన దేవుడు నిజమైన వాడు మాట్లాడే దేవుడు అటువంటి మాట్లాడే దేవుడు కలిగి ఉన్న నీవు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి!

అటువంటి కృప మనకు కలుగును గాక!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*266వ భాగము*

యెషయా 44:21--28

21. యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

22. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

23. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

24. గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

25. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.

26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

27. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను

28. కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 44వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 21వ వచనంలో అంటున్నారు యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

ఇప్పుడు నిజ దేవునికి సాక్షులుగా ఇజ్రాయేల్ వారుండవలసి ఉంది. వారు పైన చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకుని జ్ఞాపకముంచు కోవడం ఎంతైనా అవసరం. ఇక్కడ అంటున్నారు చూడండి నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను నిర్మించాను కాబట్టి పై విషయాలు జ్ఞాపకం చేసుకొని నాకు నమ్మకముగా ఉండమన్నారు దేవుడు.

అలా చేస్తే 22వ వచనం మంచును విడగొట్టినట్టు మబ్బును తొలగించినట్లు నీ అతిక్రమాలు పాపాలను నేను తుడిచేస్తాను. ఎందుకంటే నేను వెల ఇచ్చి నిన్ను విడిపించాను! గనుక నా దగ్గరికి రా అంటున్నారు!!!

గమనించాలి యిర్మియా గ్రంధంలో ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా దగ్గరకే రావాలి అంటున్నారు నాలుగో అధ్యాయంలో!!! ఇక్కడ కూడా నిన్ను నేను వెలయిచ్చి విడిపించాను కాబట్టి తిరిగి నా దగ్గరికి రా! విగ్రహాల వెనకాలకు పరిగెత్తొద్దు. నేను నీ అతిక్రమములను పాపాలను తుడిచేసాను అంటున్నారు!

22 వచనంలో అలా చేస్తే యెహోవా ఆ కార్యం చేశారు ఆకాశములారా ఆనంద ధ్వని చేయండి భూమి అగాధ స్థలములారా కేకలు వేయండి పర్వతములారా అరణ్యమా దానిలోని ప్రతి వృక్షము సంగీత నాదం చేయండి ఎందుకంటే దేవుడు వెలయిచ్చి యాకోబును విడిపించాడు ఎందుకంటే ఇస్రాయేలు తన ఘనతను ప్రదర్శిస్తాడు

కీర్తనలు 78:34

వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి.

కీర్తనలు 78:35

దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.

ఇంకా నేను నిన్ను విడువను. భయపడవద్దు అంటున్నారు.

యెహోషువ గారితో కూడా అంటున్నారు

Joshua(యెహొషువ) 1:1,2,3,4,5,6,7,8,9

1. యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెనునా సేవకుడైన మోషే మృతినొందెను.

2. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.

3.​ నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను.

4. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశ మంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.

5. నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.

6. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.

7. అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.

8. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.

9. నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

ఇక 23వ వచనంలో దేవుడు యాకోబు విమోచన కార్యం చేసి ముగించారు కనుక సంతోషంగా కేకలు వేయండి అంటున్నారు.

ఇజ్రాయేల్ వారికి క్షమాపణ, విడుదల దొరికితే దేవుని హృదయానికి గొప్ప ఉల్లాసం కలుగుతుంది. ప్రకృతి అంతా ఈ ఆనందంలో పాలుపంచుకోవాలని ఆయన కోరిక. అలా జరుగుతుంది కూడా.

Isaiah(యెషయా గ్రంథము) 35:1,2

1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును

2. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెషయా 49:13

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

Isaiah(యెషయా గ్రంథము) 55:12,13

12. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

Romans(రోమీయులకు) 8:18,19,20,21,22

18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,

21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.

22.సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.

ఇక 24వ వచనంలో అంటున్నారు గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

చూడండి మనకు గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా!! మనల్ని గర్భంలో నిర్మించిన వాడు! మనకు కన్ను ఎలా ఉండాలి, కాలు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి అనేది, మన నిర్మించిన వాడు మన దేవుడే !!

అందుకే 49 వ అధ్యాయంలో స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరునించకుండా మరచునా! వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అంటున్నారు! ఆ తర్వాత అధ్యాయంలో అంటున్నారు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే!!! కాబట్టి మన దేవుడు అంత గొప్ప దేవుడు! సమస్తాన్ని జరిగించేవాడు! ఆకాశాన్ని విశాలపరిచిన వాడు భూమిని పరిచినవాడు దేవుడే!!

యెషయా 40:22

ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

యెషయా 51:13

బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

25, 26 వచనాల్లో అంటున్నారు నేను అబద్ధ ప్రవక్తలు చెప్పే సూచనలను పాడు చేసి, వారిని అనగా సోదిచెప్పే వాళ్లను పిచ్చోళ్ళుగా చేసే వాడిని, జ్ఞానులను వెనక్కి తిప్పి వాళ్ళ విద్యను అవిధ్యగా చేసే వాడని నేనే అంటున్నారు!! అయితే నా సేవకుడు మాటలను నేను స్థిరపరుస్తాను నా వార్తావాహులు అనగా ప్రవక్తలు దైవ సేవకులు మాటలు మాత్రమే నేను నెరవేరుస్తాను అంటూ యెరుషలేము కట్టబడుతుంది అంటే తప్పకుండా కట్టబడుతుంది, వాటి శిధిలాలను బాగు చేస్తాను అంటే నేను తప్పకుండా బాగు చేస్తాను. లోతైన జలాలను ఇంకిపో అని చెబితే ఇంకిపోచేస్తాను అంటున్నారు!!

చాలామంది అబద్ధ ప్రవక్తలు తమను తాము నిజమైన ప్రవక్తలుగా ఎంచుకొంటారు. ఇతరులు కూడా వాళ్ళను నిజమైన ప్రవక్తలుగా పరిగణిస్తూ ఉండవచ్చు. వీరు సూచన కొసమైన అద్భుతాలు చేసి అనేకమందిని మోసగిస్తూ ఉండవచ్చు. అబద్ధ ప్రవక్తలు”– ద్వితీ 13:1-4; 18:10-14, 21, 22; యిర్మీయా 14:14.

యేసుక్రీస్తు ప్రభులవారు కూడా చెబుతున్నారు మత్తయి 24:11, 24లో

Matthew(మత్తయి సువార్త) 24:11,23,24,25,26

11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి.

24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

26. కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడిఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి

అయితే దేవుడు తగిన కాలంలో తగిన రీతిలో ఎవరు నిజమైన ప్రవక్తలో ఎవరు కపటం గలవారో చూపుతారు.

కాబట్టి ఆయన మాటలు నమ్ముదాం! ఆయన యందు విశ్వాసం ఉంచుదాం!

ఆయన బాటలో సాగిపోదాం! వాక్యమైన కాలువ ప్రక్కన నాటబడి నిరవంజి చెట్టు వలె ఎదిగి ఫలములు ఫలిద్దాము!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*267వ భాగము*

యెషయా 44:28

28. కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.

Isaiah(యెషయా గ్రంథము) 45:1,2,3,4,5,6

1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

2. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

6. తూర్పుదిక్కునుండి పడమటి దిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 44వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ చివరి వచనం నుండి 45వ అధ్యాయం 7వ వచనం వరకూ కోరెషు రాజు కోసం వ్రాయబడింది కనుక రెండు కలిపి ధ్యానం చేసుకుందాం!!!

ఇక 28వ వచనంలో అంటున్నారు కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.

కోరెషు ఎవరూ? యిర్మియా గ్రంథం చివరి వచనాలు, ఎజ్రా గ్రంథం 1:1-4, 6:3--5 వచనాలలో ఈయన కోసం వ్రాయబడింది. చెర లోనికి పోయిన యూదావారు ఇశ్రాయేలు వారిని తిరిగి స్వదేశానికి తీసుకుని రావడానికి, కూల్చబడి, కాల్చబడిన జెరూసలేం దేవాలయము తిరిగి కట్టబడటానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం!

నిజానికి ఈ వచనం యొక్క అర్ధం ప్రవాసంలోకి వెళ్ళిన యూదావారు తిరిగి రావడం, దేవాలయాన్ని తిరిగి కట్టడం అంటే జెరుసలం తిరిగి నిర్మించడం జరిగి యూదా ప్రదేశంలో ఆ ప్రజలు మళ్ళీ నివసిస్తారని అర్థం.

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పబడింది? క్రీ.పూ 720 లో! కోరెషు బబులోను మీద ఎప్పుడు దండెత్తి గెలిచారు? క్రీ.పూ 539 సెప్టెంబరు 28న మొదలుపెట్టి అక్టోబర్ 12కి సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ఏమి అర్థమవుతుంది అంటే దేవుడు కోరేషు అనే వ్యక్తి పుట్టకముందే, ఇంకా చెప్పాలంటే యెరుషలేము యూదా పట్టబడక ముందే ఈ సంగతులు జరగబోతున్నాయి, యూదులు చెరలోకి పోతారని, యెరుషలేము పట్టబడి కాల్చబడి నాశనం అవుతుందని, అయితే కోరెషు అనే వ్యక్తిని దేవుడు లేపుకొని తిరిగి వారు స్వదేశానికి వస్తారని, యెరుషలేము దేవాలయం ఇంకా యెరూషలేము గోడలు తిరిగి కట్టబడతాయని, ఈ సంగతులు జరగక ముందే, 181 సంవత్సరాలు ముందే దేవుడు తన భక్తుడైన యెషయా గారికి తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు! అవును కదా ఏసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితమే ఆయన జననం ఎలా ఉండబోతుంది అనేది తొమ్మిదవ అధ్యాయంలో, ఆయన మరణం ఎలా ఉండబోతుంది అనేది 53వ అధ్యాయంలో, ఇక ఆయన రాజ్య పరిపాలన చేస్తారు భూలోకాన్ని పరిపాలిస్తారని ఈ యెషయా గ్రంథం మొత్తం మీద చెబుతున్నారు. అనగా కొన్ని వేల సంవత్సరాలు జరిగిన తర్వాత జరగబోయే విషయాలు కూడా ముందుగానే చెప్పేశాడు. జరిగేది జరగబోయేది చెప్పే దేవుడు. అందుకే ఆయన మీద విశ్వాసం ఉంచాలి.

సరే ఈ వచనం చూసుకుంటే కోరేసుతో నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పే వాడిని నేనే, యెరూషలేము తిరిగి కట్టబడుతుంది అని చెప్పే వాడిని కూడా నేనే అంటున్నారు! ఇక 45 అధ్యాయము మొదటి వచనం చూసుకుంటే నేను కోరేషు పక్షాన జనులను జయించడానికి అతని ఎదుట ద్వారాలు వేయబడకుండా తలుపులు తీయడానికి అతడి కుడి చెయ్యి పట్టుకున్నాను అంటున్నారు.

జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా! జనులను జయించడానికి రాజుల నడికట్లు విప్పడానికి... రాజుల నడికట్లు విప్పడం అనగా రాజులు యొక్క రాజరికం పడద్రోసి రాజ్యహీనులుగా చేయడం రాజుల నడికట్టు విప్పడం! ఇది ఎప్పుడు జరిగిందంటే కోరేషు అనగా పారశీక రాజు ఈ పారశీక రాజు కోరేషు అనగా మనం చరిత్రలో మనకి ముగ్గురు కోరెషులు కనిపిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సైరస్ ది గ్రేట్ అనగా కోరేసు 2 కోసం మనం మాట్లాడుకుంటున్నాము. ఇతడు క్రీస్తు పూర్వం 559 నుంచి క్రీస్తుపూర్వం 530 వరకు ఆయన పరిపాలించారు. దీన్నే ఆకియమినేడ్ ఎంపైర్ స్థాపించిన వ్యక్తి ఇతనే. ఇతను పర్షియాకి అనగా మోడ్రన్ ఇరాన్కి చెందిన వ్యక్తి. తండ్రి పేరు కంబాసిస్ 1. అయితే బబులోను సామ్రాజ్యం పెరిగిపోతుంది, నెబుకద్నెజరు రాజు భూలోక అంతటినీ ఆక్రమించుకొని ప్రజలను చిత్రహింసలు చేస్తున్నాడు అని చూసిన ఈ పారశీకరాజు ఒంటరిగా బబులోను వారిని ఎదుర్కొన్నాడు, కానీ బబులోను యొక్క సైన్యం ఎక్కువ కాబట్టి వారిని గెలవలేకపోయాడు. అందుచేత మాదీయ దేశంతో కూడా అలయన్స్ పెట్టుకున్నాడు, అప్పుడు మాదీయ పారసీక అలయన్స్ ఈ సైన్యాలు ఒక ఒప్పందానికి అనగా ట్రీటి కి వచ్చి బబులోను వారి రాజ్యాలను ఒక్కొక్కటి గెలవడం మొదలుపెట్టారు. ఈ రకంగా ఒక్కొక్క రాజ్యాన్ని వీరు ఆక్రమించుకొని బబులోను వారిని కూలదోసి, ట్రీటీ ప్రకారంగా మొదటి దేశానికి పారశీక రాజు రాజ్యము చేస్తే తర్వాత గెలిచిన రాజ్యానికి మాదీయ రాజు రాజ్య పరిపాలన చేసేవాడు. ఇలాగే క్రీస్తుపూర్వం 539లో పారశీక రాజైన ఈ సైరస్ ది గ్రేట్ బబులోను మీద యుద్ధం చేసి గెలిచి, మాదీయుడైన దర్యావేషు2 ని బబులోనును పరిపాలించమని అప్పగించాడు.

ఇక తర్వాత పాదంలో అతని ఎదుట ద్వారాలు వేయబడకుండా తలుపులు తీయబడడానికి అతని కుడి చెయ్యి పట్టుకున్నాను. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే దేని ద్వారాలు వేయబడకుండా తలుపులు తీయడానికి దేవుడు కోరేషు చెయ్యి పట్టుకున్నాడు? అనగా దీనికి పెద్ద చరిత్ర ఉందని గ్రహించాలి బబులోను రాజైన నెబుకద్నెజరు తను రాజు అయ్యాక మరే దేశము తనను తన సామ్రాజ్యాన్ని గెలవకుండా కోటను పటిష్టపరిచాడు. బబులోను పట్టణాన్ని కట్టాడు. ఆ బబులోను యొక్క గోడ సుమారుగా 30 అడుగులు రాతిగోడ 30 అడుగుల వెడల్పు గల రాతిగోడ‌. అంతేకాకుండా సుమారు 50 అడుగుల ఎత్తుగా ఉండే గోడ. అంతేకాకుండా శత్రువులు వచ్చినప్పుడు లోపలికి రాకుండా ముందు కందకము ఉంది. గోడలు పడగొట్టే యంత్రాలు, ద్వారాలు పడగొట్టే యంత్రాలు కూడా పడగొట్టలేనంత పటిష్టంగా ఈ గోడలు కట్టడం జరిగింది. అయితే రోడ్డు మార్గం ద్వారా బబులోను పట్టణాన్ని ఏ ఒక్కడు జయించలేని దుర్భేద్యమైన కోటలు కట్టారు. ఇక బబులోని ఆక్రమించుకోవాలంటే ఒకే దారి. అది బబులోను పక్కనుంచి పారే యూఫ్రటీస్ నది ఈ మార్గంలో జయించడానికి అవకాశం ఉంది. అయితే ఈ యూఫ్రటీస్ నది మీద కూడా గేట్లు పెట్టాడు రాజు. ఈ గేట్లు చీకటి పడేటప్పుడు ఈ గేట్లు మూసేసే వారు. గేట్లు మూసేక కనీసం చేపలు పట్టే వారు కూడా ఈ గేట్లు ద్వారా బయటికి వెళ్లడానికి అవకాశం ఉండేది కాదు. అంత పటిష్టంగా ఈ గేట్లు ఏర్పాటు చేశారు. మరలా వేకువ జామున సూర్యుని వెలుగు వచ్చాక ఈ గేట్లు ఎత్తేవారు. ఈ యూఫ్రటిస్ నది గేట్లు కూడా 24 గంటలు పహారా కాస్తూ ఉండేవారు. అయితే మరి ఈ సైరస్ ది గ్రేట్ ఏ రకంగా దాన్ని ఆక్రమించుకోగలిగాడంటే కేవలం ఈ 45 వ అధ్యాయము మొదటి ఆరు వచనాలు నెరవేర్చడానికి దేవుడు ఆరోజు ద్వారపాలకులకి గాఢ నిద్ర కలుగజేశారు ఆరోజు గేట్లు వేయడం మర్చిపోయారు. దానికి మరో కారణం ఉంది అదే రోజు రాజైన బెల్సెజర్ యెరూషలేము దేవాలయ సంబంధమైన దేవుని పాత్రలలో ద్రాక్ష రసం మధ్యము పోసుకొని తాను తన ఉపపత్నులు తన రాణులు అధికారులు త్రాగడం మొదలుపెట్టారు. అప్పుడే దానియేలు గ్రంథంలో వ్రాయబడిన మెనే మెనే టేకిల్ ఉఫార్సిన్ అనే దేవుని రాత రాయడం జరిగింది .వెంటనే రాజు కలవరపడడం దానియేలు గారు వచ్చి చదవడం జరిగింది. అదే రాత్రి సైరస్ ద గ్రేట్ ఈ బబులోను పట్టణాన్ని చుట్టుముట్టడం, దేవుడు వారికి గాఢనిద్ర కలగజేసి యూఫ్రటీస్ గేట్లు వేయకుండా చేయడం ద్వారా, మాదీయ పారశీక అలియాంజ్ సైన్యము బబులోని ఆక్రమించుకోవడం, రాజైన బెల్ససర్ ని చంపి మాదీయుడైన దర్యావేసు రాజుని బబులోనకు రాజుగా చేయడం జరిగింది. దీనినే దేవుడు అతని ఎదుట ద్వారాలు వేయబడకుండా తలుపులు తీయడానికి అతని కుడి చెయ్యి పట్టుకున్నాను అంటున్నారు. ఇదంతా కేవలం దేవుని ద్వారా మాత్రమే జరిగింది . ఎందుకంటే దేవుడు చెప్పిన 70 సంవత్సరాలు గడిచిన వెంటనే యూదులు ఇశ్రాయేలీయులు తిరిగి తమ దేశానికి రావాలి. అంతేకాకుండా బబులోను వారికి తీర్పు చేయడం జరగాలి అంటే కోరేషు రావాలి. ఈ ప్రవచనము బహుశా సైరస్ ది గ్రేట్ కి తెలిసే ఉంటుంది అందుకే రాజైన మరుసటి రోజే ఒక డిక్రీ ఇష్యూ చేశాడు అది మనకి ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలోనూ, యిర్మియా చివరి అధ్యాయంలో కూడా మనము చూడగలము. బబులోనుకి వచ్చిన వెంటనే యూదులను తమ స్వదేశానికి వెళ్ళమని మరి యెరూషలేము కట్టమని ఆజ్ఞాపించాడు ఇదంతా దేవుడు చేసిన కార్యము అని గ్రహించాలి.

1-7 వచనాలు చూసుకుంటే ఇవి అనేక ప్రాంతాలనూ, నగరాలనూ జయించి కొల్లగొట్టేందుకు దేవుడు కోరెషుకు బలమిస్తాడని వెల్లడిస్తూ ఉన్న భవిష్యద్వాక్కులు. అతని ద్వారా దేవుడు కొన్ని దేశాలపైకి (బబులోను మొ।।) విపత్తును పంపుతాడు, మరికొన్ని దేశాలను సుసంపన్నం చేస్తాడు. (మాదీయ, పారసీక దేశాలు) – వ 7 ఇలా చెయ్యడంలో దేవునికి మూడు ఉద్దేశాలు ఉన్నాయి. అతని సైనిక విజయాల వెనుక ఉన్నది ఇజ్రాయేల్ వారి దేవుడే అని కోరెషు తెలుసుకోవాలి (వ 3). రెండోది ఇజ్రాయేల్ వారికి ఒక సహాయకుణ్ణి తేవాలి (వ 4). మూడోది అంతటా అందరూ తానే ఏకైక నిజ దేవుడని తెలుసుకోవాలి (వ 6).

ఇక తరువాత వచనాలలో 2.నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3.పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4.నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

దేవుడు కోరెషుతో చెబుతున్నారు నేను నీకు ముందుగా వెళ్తాను కొండలను చదును చేస్తాను ఇత్తడి తలుపులను పగలగొట్టేస్తాను ఎందుకంటే నెబుకద్నెజరు రాజు ఇత్తడి తలుపులు ఇత్తడి ద్వారబంధాలు పెట్టాడు. దానికి ఇనుప ఘడియలు వేశాడు. అందుకే ఇత్తడి తలుపులు పగలగొడతాను ఇనుప ఘడియలు ముక్కలు చేస్తాను. చీకటి చోట్లలో మరుగైన నిధులను రహస్య స్థలాలలో కూడా పెట్టిన ధనాన్ని నీకు ఇస్తాను. ఆ రాజు చీకటి గల స్థలాలలో తను ఆక్రమించుకున్న రాజ్యాల యొక్క ధనమును దాచాడు. దాన్ని నీకు కోరేషు నీకు ఇస్తాను అంటున్నారు. ఎందుకంటే నిన్ను పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాని నీవు తెలుసుకోవాలని నా ఉద్దేశం. ఇదంతా నేను ఎందుకు చేస్తానంటే నేనే దేవున్ని నేనే నీ ద్వారా ఇదంతా చేయిస్తున్నాను అని నీవు తెలుసుకోవాలి అని దేవుడు చెబుతున్నారు. నేను నీకు ముందుగా వెళ్తాను మార్గం సరాళం చేస్తాను అంటున్నారు. ఆ రోజు కోరెషుతో చెప్పిన దేవుడు నీతో నాతోను ఇదే మాట చెబుతున్నారు. మనం ఆయనను నమ్ముకుంటే మన మార్గాన్ని ఆయన సరాళం చేయబోతున్నారు. మనకు బదులుగా ఆయన కార్యం చేయబోతున్నారు.

నీవు నన్ను ఎరుగకపోయినా నా సేవకుడైన యాకోబు కోసం అనగా నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజల కోసం నేనే నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీకు బిరుదులు కూడా ఇచ్చాను సైరస్ ది గ్రేట్ అని బిరుదు ఇచ్చిన వాడు దేవుడే. నేను యెహోవాను వేరే దేవుడు లేడు. నేను తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. తూర్పు నుంచి పడమటి వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు అని నీవు మరియు సమస్త దేశాల ప్రజలు తెలుసుకునే లాగా నీవు నన్ను ఎరుగకపోయినా నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. నిన్ను వాడుకుంటున్నాను. నేనే యెహోవాను నేను తప్ప దేవుడు లేడు నేనే వెలుగుని చీకటిగా చేసేవాడిని, నేనే క్షేమాన్ని నాశనాన్ని కూడా తీసుకొచ్చేవాడిని అని దేవుడు అంటున్నాడు.

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుచుకున్నారు! ఆయన చెప్పినట్లు మనం చేయాలి! ఆయన చేతుల్లోకి మనం రావాలి! కోరేసు పుట్టకముందే దేవుడు ఆయనను ఏర్పరచుకున్నారు. అలాగే యోషియా రాజు పుట్టకముందే దేవుడు 400 సంవత్సరాల తర్వాత జరిగే కార్యక్రమం కోసం యోషియా రాజు కోసం ముందే చెప్పాడు దేవుడు. మనం కూడా దేవుని చేతుల్లోకి వెళ్దాం! ఆయన చెప్పినట్లు చేద్దాం!

ఆయన రాజ్యానికి వారసులుగా వెళ్దాం!

దేవుడు మనల్ని దీవించును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*268వ భాగము*

యెషయా 44:28

28. కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.

Isaiah(యెషయా గ్రంథము) 45:1,2,3,4,5,6

1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

2. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

6. తూర్పుదిక్కునుండి పడమటి దిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 45వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఈ 45వ అధ్యాయము మనము కొనసాగించే ముందుగా గత రెండు భాగాలు మనము ఇంతవరకు ఇశ్రాయేలీయుల కోణంలో చూసుకున్నాము. అయితే ఈరోజు నూతన నిబంధన సంఘ కోణంలో కూడా కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా యాకోబు నీవు నా సేవకుడు నేను నిన్ను నిర్మించితిని నేను నిన్ను మర్చిపోజాలను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మరలిరా అంటున్నారు. యాకోబు అనగా మోసగాడు చూసుకున్నాం! మోసపు బ్రతుకు జీవిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప చేత యాకోబు ఇశ్రాయేలుగా మారి, నూతన నిబంధన సంఘంలో చేరిన మనము మనతో దేవుడు అంటున్నాడు నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను నేను నిన్ను విమోచించి యున్నాను నా యొద్దకు మల్లుకో ఇంకా మీద భాగంలో నేను వెల చెల్లించాను అంటున్నారు. ఆ వెల ఏమిటి?! యేసు క్రీస్తు ప్రభువుల వారి రక్తమే ఆ వెల!! వెల చెల్లించి సిలువ రక్తము చిందించి నిన్ను నన్ను విమోచించి అన్నారు యేసయ్య నేను నిన్ను మర్చిపోను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ చేయి నేను విడువను నిన్ను ఎడబాయను అంటున్నారు దేవుడు.

కాబట్టి నూతన నిబంధన సంఘములో అంగమైన ఓ విశ్వాసి శ్రమలు రావడం ఖాయం అయితే ఆ శ్రమలలో దేవుడు నిన్ను తన చేయి పట్టుకొని నడిపించడం కూడా అంతే కాయం! కాబట్టి ఓలిపోక సోలిపోక ఆయన మార్గంలో నడిచిపోవాలి నువ్వు అలా నడిచిపోయినప్పుడు నువ్వు సంగీత నాదము చేయగలవు! ఎందుకంటే యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలీయులు తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును, ఇంకా 24 వచనం చూసుకుంటే గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు అగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు! దీని కోసం మనం గత భాగంలో చూసుకున్నావో గర్భములోని మనల్ని నిర్మించిన వాడు మన ఎముకలను చేసినవాడు మన దేవుడైన యెహోవా అని139 వ కీర్తనలలో దీనికోసం చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది

Psalms(కీర్తనల గ్రంథము) 139:13,14,15,16

13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు

16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

ఇక దేవుడు మనలని ఎలా విమోచించారు?!

అపో.కార్యములు 20:28

దేవుడు (అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

1పేతురు 1:18

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

1పేతురు 1:19

అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

ఇక ప్రియులారా ఇక విమోచన గీతము జయోత్సాహం గానము సంగీత నాదము నూతన నిబంధన విశ్వాసి ఎప్పుడు చేస్తాడంటే ఈ లోకమును విడిచి వెళ్ళాక గొర్రె పిల్ల పెండ్లి విందులో పరిశుద్ధుల ప్రేమ విందులో పాల్గొన్నప్పుడు జయించిన విశ్వాసి జయోత్సాహము చేస్తాడు కాబట్టి నూతన నిబంధన విశ్వాసి జయించే అనుభవము కలిగి ఉండాలి అప్పుడు ఆ పెండ్లి విందులో జయోత్సాహము చేయగలవు.

ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 28వ వచనంలోనే కోరెష్తో నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా! నూతన నిబంధన సంఘములో కోరేషు ఏసుక్రీస్తు ప్రభువుల వారికి మరియు సంఘ కాపరులకు ఆయన సాదృశ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి కోరెషు వచ్చి ఏం చేశారు? దేవుని చిత్తమంతా నెరవేర్చలేదు. ఇశ్రాయేలీయులు విడిపించబడడం, మందిరం కట్టబడే విధంగా చేశారు! కానీ దేవుని సంకల్పం మొత్తం కోరెషు నెరవేర్చలేదు! నిజానికి దేవుడు కోరెసును ఏర్పరచుకోవడం ఇశ్రాయేలీయులు విడుదల, మందిరం తిరిగి కట్టబడుట కోసమే అనుకోండి. కానీ ఇక్కడ ఏమంటున్నారో నా చిత్తమంతా నెరవేర్చువాడా! చిత్తమంతా ఎవరు నెరవేరుస్తారు? దేవుని చిత్తమంతా నెరవేర్చినది ఏసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే! ఆయన వచ్చేరు చిత్తమును నెరవేర్చి, సమస్తము అప్పటికి నెరవేరినదని తెలుసుకొని సమాప్తమైనది అని చెప్పి కేక వేసి ఆత్మను అప్పగించినట్లు మనం చూడగలం.

యోహాను 19:28

అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను.

యోహాను 19:30

యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

ఇక నూతన నిబంధన విశ్వాసులమైన మనము ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చబద్ధులమై ఉన్నాము. అంతే కాకుండా సంఘ కాపరులు తప్పకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత సంఘ కాపరుల మీద ఉన్నది. ఇక్కడ చూడండి నా మంద కాపరి నా చిత్త మంతా నెరవేర్చువాడా అని చెప్పి, జెరూసలేం తో నీవు కట్టబడును దేవాలయానికి పునాది వేయబడునని అంటున్నారు. ఇక్కడ యెరుషలేము కట్టబడటం అనగా నూతన నిబంధన సంఘం కట్టబడుట, నూతన నిబంధన సంఘము పరమ యెరుషలేముగా కట్టబడడానికి అపొస్తలుల బోధ, సంఘకాపరుల పాత్ర ఎంతైనా ఉంది! అయితే పునాది వేయబడును ఏ పునాది అది? అపోస్తుల బోధ అనే పునాది మీద ఈ సంఘం సార్వత్రిక సంఘము కట్టబడుతుంది!!! నూతన నిబంధన సంఘము అపోస్తులల బోధ అనే పునాది మీద కట్టబడుతుంది. అలా కట్టవలసిన అవసరం ప్రతి సంఘ కాపరికీ ఉన్నది అని మర్చిపోకూడదు! నీవు మెల్కీసెదకు క్రమంలో ఎప్పుడైతే అపోస్తుల పునాది మీద నీవు సంఘమును కట్టడానికి ప్రయత్నిస్తూ నువ్వు ముందుకు సాగిపోతుంటావో ఆయన రాజ్య వ్యాప్తికి పరిగెడుతుంటావో వెంటనే కోరేషుతో దేవుడు అంటున్నాడు అతని పక్షమున జనములను జయించుటకు అతని కుడిచేతిని పట్టుకొని యున్నాను, రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడి ఉంటే తీస్తాను. ఎప్పుడైతే నీవు దేవుని పనిలో ముందుకు వీరుడుగా సాగిపోతూ ఉంటావో దేవుడు కూడా సాతాను గాడు బంధించిన కట్లు ఆ తలుపులు అన్ని తీసి పాపపు బంధకాల నుండి ప్రజలను విమోచించి నూతన ఇశ్రాయేలీయులగా కట్టబడడానికి దేవుడు సహాయం చేస్తారు.

ఇంకా అంటున్నారు నేను నీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తాను ఇత్తడి తలుపులు పగలగొడతాను ఇనుప గడియలు విడగొడతాను. ఇత్తడి తలుపులు అంత గట్టిగా ఉన్న సమస్యలు, ఇనుప గడియలు అంతా దృఢంగా ఉన్న సమస్యలు కూడా నీ ముందు ఇట్టే పగలగొట్టి ఆయన వ్యాప్తిని సువార్త వ్యాప్తిని జరిపించగలడు యేసయ్యా!! అందుకే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయని నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులు రహస్య స్థలములోని మరిగిన ధనము నీకు ఇస్తాను! యాకోబు కోసం నేను నీకు పేరు పెట్టి పిలిచాను ఎరుగకపోయినా బిరుదులు ఇచ్చాను అంటున్నాను!

కాబట్టి ప్రియ సంఘమా దైవజనుడా ఆయన బాటలో నడిచి పోతున్నావా?! సాగిపోతున్నావా! ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడే దేవుడు నిన్ను బళా నమ్మకమైన మంచి దాసుడా అని అనగలరు ఏసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చి ఆయన చిత్తమంత నెరవేర్చారు నీవు నేను కూడా ఆయన చిత్తమంతా నెరవేర్చడానికి ప్రయత్నం అనగలరు! నూతన నిబంధన సంఘమును కట్టడానికి ప్రయత్నించేద్దాం!

నూతన నిబంధన సంఘములో అంగమైన ఓ విశ్వాసి సేవకుడా ఆయన చెప్పినట్లు చేద్దాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*269వ భాగము*

యెషయా గ్రంథము 45:8--13

8. ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

9. మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

11. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?

12. భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని.

13. నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గములన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 45వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఎప్పుడైతే విశ్వాసి దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతాడో వెంటనే ఆకాశం మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షము మహా వర్షము వర్షించుము మహా వర్షము ఏది కురుస్తుంది ఎందుకంటే ఆకాశ మండలము మొత్తం నీతిని కురిపిస్తే మహా వర్షం కూడా నీతియే వర్షముగా కురుస్తుంది. ఇక భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని బిడ్డలు తన మాట విన్నప్పుడు ఆకాశం మండలము నీతిని కురిపించడమే కాకుండా అది వర్షము లాగా నీతిని కురిపిస్తే భూమి నెరలు విడిచి రక్షణ ఫలిస్తాది. భూమి నీతి అనే మొక్కలు మొలుస్తుంది. దాన్ని యెహోవా నాకు నేను దాని కలుగజేసాను అంటున్నారు.

ఇశ్రాయేలు కోణంలో ఇది కూడా ఒకరకంగా కోరేషుని వాడుకుని దేవుడు చేసే పనిగా కనిపిస్తుంది. “న్యాయాన్ని”– వ 13; 41:2. ఇజ్రాయేల్ పట్ల తన న్యాయవంతమైన ఉద్దేశాలను సాధించేందుకు దేవుడు కోరెషును తన చేతిలో ఒక పరికరంగా వాడుకొన్నాడు. కోరెషు ద్వారా ఆయన ఇజ్రాయేల్ ను బబులోను చెరనుండి విడిపించాడు.

యెషయా 41:2

తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.

ఇక తరువాత వచనాలలో అంటున్నారు 9. మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

10. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.

9-13 వచనాలలో దేవుని విధానాలను ప్రశ్నించే మనుషులు ఎప్పుడూ ఉంటారు. ఆ రోజుల్లో కొందరు ఇలాంటిప్రశ్నలు అడిగి ఉండవచ్చు: ఇస్రాయేల్‌ను శిక్షించేందుకు దేవుడు భ్రష్ట రాజ్యమైన బబులోనును ఎందుకు వాడుకోవాలి? ఇది చాలక మరొక భ్రష్ట రాజ్యమైన పారసీక రాజ్యాన్ని ఇజ్రాయేల్ విడుదల కోసం ఎందుకు ఉపయోగించుకోవాలి? మనుషులు ఈ విధంగా కన్నుమిన్ను గానక అడిగే ప్రశ్నలకు ఇది దేవుని జవాబు: మానవాళినీ, ఇస్రాయేల్ జాతినీ చేసినవాడు ఆయనే (వ 9,11). ఆయన పవిత్రత పరిపూర్ణమైనది (వ 11). నక్షత్ర సమూహాలతో ప్రకాశించే ఆకాశాలను చేసింది ఆయనే (వ 12). కాబట్టి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న సంగతులు పగిలిపోయిన కుండ పెంకులాంటి మనిషి కన్నా (వ 9) దేవునికే బాగా తెలిసివుండాలన్న విషయంలో సందేహం లేదు గదా. 29:16; యిర్మీయా 18:5-9; రోమ్ 9:20-21

యెషయా 29:16

అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చిఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

Jeremiah(యిర్మీయా) 18:5,6,7,8,9

5. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

6. ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.

7. దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదు ననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

8. ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.

9. మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

Romans(రోమీయులకు) 9:19,20,21,22

19. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు.

20. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?

21. ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా?

22. ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?

అప్పుడేనా ఇప్పుడు కూడా అనేక మంది యవ్వనస్తులు ఈ ప్రశ్న వేయడం లేదా? తల్లిదండ్రులను చూసి కనీసం ఐఫోన్ కొనలేని నీవు నన్ను ఎందుకు కన్నావు?! నీ కోరికలు ఆపుకోలేక పోయావా అని అడిగే వారు కొంతమంది!, ఒక మంచి చుడీదార్లు గాని లేకపోతే మంచి బండి కొనలేని నీవు ఎందుకు కన్నావు అంటూ తల్లిదండ్రులని నిందించే వారు ఉన్నారు! ఇది ఎందుకు! అలా ఇది కావాలి! అది కావాలి! ఆ మాత్రం కొనలేకపోయే కొనలేని వాడవు నన్నెందుకు కనాలి అంటూ అడుగుతున్నారు!!! ఇలాంటి కళ్ళు మూసుకు పోయిన నేటి యువతకి దేవుడు ఇచ్చే జవాబు ఎవడైతే అలాగా అడుగుతాడో వాడి మీదకి దేవుని శాపం రాబోతుందని మర్చిపోవద్దు!!! యవ్వన చెల్లి యవ్వన తమ్ముడా! నీవు కూడా అలా అడుగుతా ఉంటే నేడే నీ తల్లికి నీ తండ్రిని క్షమాపణ వేడుకో!! తర్వాత దేవుని దగ్గర క్షమాపణ వేడుకో!!! లేకపోతే దేవుని ఉగ్రతను తట్టుకోలేవు జాగ్రత్త!!!

తర్వాత వచనంలో నువ్వు కన్నది ఏమిటి అని అడిగేవాడికి బాధ తప్పదు. నువ్వు గర్భం ధరించినది ఏమిటి అని తల్లిని అడిగేవాడికి బాధ తప్పదు!!! చూడండి ఇలా తల్లిదండ్రులను ప్రశ్నలు అడిగే వారికి తప్పకుండా దేవుని ఉగ్రత తప్పదు అంటున్నారు!!!

ఇశ్రాయేలీయుల ప్రజల పవిత్రుడు సృష్టికర్త అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రాగలవాటి విషయంలో నా పిల్లల గురించి నన్నే అడుగుతారా? నా చేతులు చేసే పనులు గురించి నాకే ఆజ్ఞ జారీ చేస్తారా ??!! ఇక్కడ కూడా ఒకసారి ఆగుదాం!

ఈరోజు చాలామంది దేవునికి ప్రార్థించడం మానేసి దేవునికే సలహాలు ఇవ్వడం, దేవునికి ఆజ్ఞ జారీ చేయడం ఎక్కువైపోయింది !!! అడగడం తప్పులేదు కానీ దేవునికే ఐడియా ఇచ్చి ప్రభువా ఎలాగైతే అలా చేసేయ్! నన్ను ఇలా చేసేయ్! నన్ను ప్రసంగీకుని చేసెయ్! నేను సింగర్ని అయిపోవాలా!!! నేను మరో వ్యక్తిని అయిపోవాలా! నాకు ఈ వరం ఇచ్చేయ్! ఆ వరమిచ్చేయ్! అంటూ దేవునికే ఐడియాలు ఇచ్చి దేవునికే ఆజ్ఞ జారీ చేసేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు!!! దేవునికి మనం ఆజ్ఞ జారీ చేయకూడదు! ప్రభువా ఎంత చిన్న పని ఇచ్చినా పరవాలేదు నన్ను వాడుకో ప్రభువా నన్ను వాడుకో అంటూ మనం దేవుని అడగాలి, తప్ప దేవునికి సలహాలు ఇవ్వకూడదు!! దేవునికి ఇది చెయ్యు అది చెయ్యని ఆజ్ఞ జారి చేయకూడదు. అలా చేయకూడని ప్రార్థనలు చేసి బొక్క బోర్లా పడుతున్న వారు అనేకమంది నేటి దినాల్లో కనిపిస్తున్నారు. మనం కూడా ఆ తప్పు చేయొద్దు దేవుని అడుక్కుందాం ప్రభువా నన్ను వాడుకో ఏ పని ఇచ్చినా పర్వాలేదు కానీ నన్ను వాడుకో ప్రభువా అని అడిగితే, ఆయన మన సీఈవో మనల్ని చేసిన కంపెనీ వాడు, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి, మనం దేవునికి సలహాలు ఇవ్వకుండా ఆయన హస్తాలలోకి మనం వచ్చేస్తే, ఆయన చెప్పినట్లు మనం చేస్తే మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు. ఇక్కడ 12- 19 వచనాలు చూసుకుంటే భూమిని చేసింది నేనే దానిమీద మానవజాతినే సృజించింది కూడా నేనే ఆకాశాల్లో పరిచినది నా చేతులే!!! వాటిలో ఉన్న సమూహాన్ని నియమించింది కూడా నేనే! కాబట్టి రాగల వాటి విషయంలో నా చేతులు చేసిన పనులు కోసం నాకే మీరు అజ్ఞాపించేటంత అయిపోతారా అని అడుగుతున్నారు. ఇలాంటి తప్పులు మనం చేయవద్దు

ఇక తరువాత వచనంలో నీతిని అనుసరించి నేను కోరెషుని పురి కొలుపుతాను అతని త్రోవలను తిన్నగా చేస్తాను. అతడు నా నగరాన్ని మళ్లీ కట్టిస్తాడు. విడుదల కోసమైన వెలగాని బహుమానం గాని తీసుకోకుండా అతడు బందీలుగా నా ప్రజలు విడిపిస్తాడు. చూడండి కోరెషుని నేను ఎందుకు పిలుచుకున్నాను అంటే మొట్టమొదటిగా న్యాయాన్ని అనుసరించి అతను నీతిని అనుసరించి తీర్పులు తీరుస్తాడు అందువల్ల అతని మార్గం సరాళం చేశ్తాను. నా యెరుషలేము నగరాన్ని మళ్లీ కట్టిస్తాడు విడుదల కోసమని వెలగాని బహుమానం గాని తీసుకోకుండా ఫ్రీగా నా ప్రజలను విడిపిస్తాడు. అందుకే ఇర్మియా గ్రంధంలోని యెహెజ్కేలు గ్రంథంలోని దేవుడు అంటున్నాడు కోరెషు నా ప్రజలను విడిపించేవు కాబట్టి అప్పుడు కోరెషు కి ఏమి దొరకలేదు కాబట్టి ఐగుప్తుని నేను ఐగుప్తు యొక్క ధనాన్ని నేను కానుకగా ఇస్తున్నాను.

ఈ తర్వాత వచనాల్లో కూడాను అతడు ఉచితంగా నా ప్రజలను విడుదల చేశాడు కాబట్టి ఐగుప్తు వాళ్ళ కష్టార్జితం కూషు అనగా ఇథియోపియో వాళ్ళ వర్తక లాభం ఇవన్నీ కోరేసికిస్తానంటున్నాడు దేవుడు. వీరంతా నీ ఎదుట సాష్టాంగ పడి నిజంగా దేవుడు నీతో ఉన్నాడు వేరే దేవుడు లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని నిన్ను ప్రాధేయపడతారు అని దేవుడు సెలవిస్తున్నారు!

ఒక అన్య రాజుకు న్యాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా ఆయన న్యాయం చేయగలడు! ఆయన తీర్పులకు ఆయన ఆజ్ఞలకు లోబడు ! ఎందుకు ఏమిటి ఎలా అని అడగద్దు. ఆయన అడుగుజాడల్లో నడిచిపోదాం!

వాక్యానుసారమైన జీవితం జీవిద్దాం!!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*270వ భాగము*

యెషయా గ్రంథము 45:15--20

15. ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.

16. విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు.

18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

19. అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

20. కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 45వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఈ 15 16 17 వచనాలు భక్తుడైన యెషయా గారు పరవశించి పలుకుతున్న మాటలు. ఇశ్రాయేలు దేవా రక్షకా నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకునే దేవుడివై ఉన్నావు! దేవుడు మన జీవితంలో ఎన్నో పనులు చేశారు ఎన్నో కార్యాలు చేశారు కానీ డప్పు కొట్టుకునే దేవుడు కాదు! ప్రచారం చేసుకునే దేవుడు కాదు! యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా గుడ్డి వారికి కళ్లిచ్చి ఇది ఎవరికీ చెప్పొద్దు అన్నారు! చనిపోయిన పాపను లేపి దీని ఎవరితోనూ చెప్పొద్దు అన్నారు! కుష్టి రోగిని స్వస్థపరచి నీవు ఎవరికీ చెప్పొద్దు కానీ వెళ్లి యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకో అన్నారు! అనగా మన దేవుడు మరుగు చేసుకునే దేవుడు! అద్భుతాలు చేసే దేవుడు కానీ నేను చేశానని డప్పు కొట్టుకునే దేవుడు కాదు! ప్రచారం చేసుకునే దేవుడు కాదు! మనిషిని ముందు పెడతారు తాను వెనుకుంటారు దేవుడు ఒక మనిషి మనస్ఫూర్తిగా ఆయన చేతుల్లోకి ఆయన హస్తాల్లోకి వచ్చేస్తే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుని అసాధారణమైన అద్భుతాలు చేసే దేవుడు!

దేవుడు అస్తమానమూ తన సంకల్పాలను నెరవేర్చుకొనేందుకు ఈ భూమిపై పనిచేస్తూనే ఉంటాడు. అయితే అదంతా మనిషికి అగమ్యగోచరం (55:8-9; కీర్తన 139:6; 145:3; ప్రసంగి 8:17; రోమ్ 11:33). ముఖ్యంగా పాపులకూ, అవిధేయులకూ, నమ్మకంలేని వారికీ ఆయన కనిపించడు – 1:15; 57:17; 59:2; ద్వితీ 31:17.

Isaiah(యెషయా గ్రంథము) 55:8,9,10,11,12

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

12. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

కీర్తనలు 139:5

వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.

కీర్తనలు 139:6

ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.

కీర్తనలు 145:3

యెహోవా మహాత్మ్యముగల వాడు ఆయన అధికస్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది

ప్రసంగి 8:17

దేవుడు జరిగించునదంతయు నేను కనుగొంటిని; మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలిసికొనవలెనని జ్ఞానులు పూను కొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలిసి కొంటిని.

రోమీయులకు 11:33

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

రోమీయులకు 11:34

ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

రోమీయులకు 11:35

ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?

రోమీయులకు 11:36

ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

ఇక తరువాత వచనాలలో 16. విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.

గత భాగాలలో చూసుకున్నాము విగ్రహాలు చేసేవారు పూజించేవారు సిగ్గుపడతారు అని. యెషయా 45:16 42:17; 44:9-11.

తరువాత వచనం 17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు.

యిర్మియా గారు అంటున్నారు యిర్మియా 23:6

అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

రోమీయులకు 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

రోమీయులకు 11:27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

ప్రియులారా యెహోవా వలననే ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందినది అవును దేవుని వలన మనకు రక్షణ కలుగుతుంది ఆయన నమ్మిన వారు ఎన్నడు సిగ్గుపడరు విస్మయ పడరు. గమనించాలి షడ్రకు మేషకు అభెద్నెగోలను అగ్నిలో వేస్తానంటే చావడానికి సిద్ధపడ్డారు దేవుడు వారిని సిగ్గుపడనివ్వలేదు! దానియేలు గారిని సింహాల గుహలో వేశారు! దేవుడు సిగ్గుపడనివ్వలేదు! అలాగే తన భక్తులని ఎప్పుడూ ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదు! ఎస్తేరు గారి కాలంలో యూదుల్ని చంపుతామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు హామాను. కానీ దేవుడు మొర్దెకైని గాని యూదులను గాని సిగ్గుపడనివ్వ లేదు! కాబట్టి అప్పుడు సిగ్గుపడలేదు దేవుడు ఇప్పుడు కూడా మనల్ని సిగ్గుపడనివ్వరు! కాబట్టి ఆయనను నమ్ముకుని ముందుకు సాగిపోదాం!

తరువాత వచనం ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.

ఈ వచనాలు చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది దేవుడు అంటున్నారు ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను దేనికోసం సిద్ధపరిచారు? ఇంకా ముందుకు పోతే నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజంపలేదు గాని నివాస స్థలముగా ఉండేలాగా దాని సృజించెను!! దీని అర్థం ఏమిటంటే దేవుడు మనిషి కోసమే భూమిని సిద్ధపరిచారు! మనిషి దేవుణ్ణి స్తుతించాలి అందుకే మొదట భూమిని ఆకాశాన్ని భూమి మీద ఉన్న జంతువులను పక్షులను జల జనాలని అన్నిటినీ సృష్టించి, చివరిగా మానవుని చేశాడు దేవుడు తన పోలికలో!!! అనగా ముందు సిద్ధపరిచి తర్వాత మనిషిని చేశాడు దేవుడు! మనిషి బాధపడకూడదు అని! అదేవిధంగా నిరాకారంగా ఉండటానికి చేయలేదు అయినా ఆకారంలో ఉండాలి అందంగా ఉండాలి సౌందర్యంగా ఉండాలి దేవుడు చేసిన ప్రకృతి చూసి మనిషి పరవశించి దేవుని స్తుతించాలి, దేవుని రచన దేవుని సృష్టి కార్యక్రమం చూసి దేవుని గుణగణములను మనిషి స్తుతించాలి అనుకుని దీన్నంతా చేశారు! సిద్ధపరిచారు దేవుడు అని ఈ వచనము చెబుతుంది మనకి!

Isaiah(యెషయా గ్రంథము) 40:21,22

21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

22. ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

Psalms(కీర్తనల గ్రంథము) 19:1,2,3,4

1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

2. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.

3. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.

4. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోక దిగంతములవరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లు చున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.

అందుకే తర్వాత వచనంలో అంటున్నారు 19. అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

20. కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

చూడండి నన్ను వ్యర్ధంగా ఆరాదించమని చెప్పడం లేదు. ఆయన చేసిన మహోన్నతమైన కార్యాలు చూసి ఆరాధించమంటున్నారు.

తన సేవకుల ద్వారా దేవుడు తన సత్యాన్ని బాహాటంగా ప్రకటించాడు – 48:16; యోహాను 18:19-21. సత్యానికి దాక్కోవలసిన పనిలేదు.

యెషయా 48:16

ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను

John(యోహాను సువార్త) 18:19,20,21

19. ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా

20. యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.

21. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.

ఆయన చెప్పినవి అందరికీ అర్ధమయ్యేలా సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా చెప్పారు. అర్థం కాని మరోభాషలో కాదు. మంత్రాలు అసలే కాదు.

కాబట్టి ఆయన ఘనకార్యాలు స్తుతిద్దాం! కొనియాడదాం!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*271వ భాగము*

యెషయా గ్రంథము 45:21--25

21. మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

23. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

24. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

25. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 45వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 22వ వచనంలో అంటున్నారు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తారు (వ 17,25). కానీ అది కేవలం వారికే పరిమితం కాదు, ఆయన రక్షణ భూమి పైని జాతులన్నిటికీ అందుబాటులో ఉంది. ఆ దేశాల దేవుళ్ళు, విగ్రహాలు వాళ్ళను రక్షించలేవు (వ 20). వారి ఆశాభావానికి ఉన్న ఏకైక ఆస్కారం ఇజ్రాయేల్ వారి యెహోవా దేవుడే. ఆయనే ఏకైక దేవుడు. ఈ వచనంలోని మాటలు కేవలం ఆహ్వాన వచనాలే కాదు. ఇవి భవిష్యద్వాక్కులు (2:2-4; మొ।।).

తర్వాత వచనంలో ఇంకా అంటున్నారు నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.

చూడండి ప్రతీ మోకాలు ఆయన యెదుట సాగిలపడాలి.

రోమీయులకు 14:11

నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

రోమీయులకు 14:12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8,9,10,11,12

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.

ఈరోజు ఆయన నామమునకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా ఒకరోజు ఆయన ముందు సాగిలపడాల్సిందే. దీనికోసం ఇంకా వివరణ మనకు ప్రకటన గ్రంథం లో కనిపిస్తుంది.

Revelation(ప్రకటన గ్రంథము) 5:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14

1. మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.

2. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.

3. అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.

4. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా

5. ఆ పెద్దలలో ఒకడుఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన(లేక, వేరైన)యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.

6. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

7. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

8. ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

9. ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

10. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.

12. వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

13. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.

14. ఆ నాలుగు జీవులు - ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారముచేసిరి.

మరి ఆయన ముందు నీవు సాగిలపడి ప్రార్థన చేస్తున్నావా?! మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావా?! లేక లార్డ్ లాగ మంచం మీద , కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా! ముసలి వారికి కాలుసేతులు వంగవు. నీకు వంగుతున్నాయి కదా- నీతోనే మాట్లాడుతున్నాను. ఆయన ఎదుట సాగిలపడదాం! మోకరిద్దాం!

తర్వాత వచనం 24. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు

25. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరు నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు.

మనుషులు తాము దేవుడని పిలిచిన వారందరిలోకీ సంపూర్ణంగా న్యాయవంతుడు, శక్తిమంతుడు యెహోవా ఒక్కడే అని ఒప్పుకొంటారు.

ప్రియులారా! చివరి వచనం అంత్యకాలంలో నెరవేరుతుంది. కొంతమంది 1,44,000 ఇశ్రాయేలు వారు మాత్రమే రక్షంచబడతారు అంటారు గాని నా ఉద్దేశం ప్రకారం ముద్ర వేయించుకోకుండా ప్రభువుకోసం ఎదురుచూసే ప్రతీ ఒక్కరూ రక్షణ పొందుతారు అని నా ఉద్దేశం!

Romans(రోమీయులకు) 11:25,26,27,28,29

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.

29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

Zechariah(జెకర్యా) 12:8,9,10,11,12,13,14

8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.

9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12. దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

ఇలా ఏడ్చి ప్రలాపించే ఇశ్రాయేలు వారంతా ఆరోజు రక్షణ పొందుతారు!

మరి ఇప్పటికే రక్షణ పొందిన నీవు రక్షణ కు తగిన జీవితం జీవిస్తున్నావా!! రక్షణ కాపాడుకుంటున్నావా !! ఆత్మానుసారమైన జీవితంలో సాక్షార్థమైన జీవితం పరిశుద్ధమైన జీవితంలో నీలో ఉందా?!! లేకపోతే నీవు కూడా కాల్చివేయబడతావు పారవేయబడతావని మర్చిపోవద్దు! అందుకే దేవుడు అంటున్నాడు నీవు పొందిన దానిని గట్టిగా పట్టుకో!! నీవు పొందింది రక్షణ! ఆ రక్షణ గట్టిగా పట్టుకో!!

దాన్ని వెంటాడు!

పరలోకం కోసం పోరాడు!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*272వ భాగము*

యెషయా గ్రంథము 46:1--5

1. బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

2. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

3. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

4. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

5. మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 45వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 46వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ఈ అధ్యాయంలో కూడా బబులోను నాశనం మరియు విగ్రహాలు ఎంత పనికిమాలినవో చెబుతున్నారు దేవుడు!

మొదటి రెండు వచనాలు చూసుకుంటే 1. బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

2. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

బేల్, నెబో బబులోను దేవుళ్ళు. “బేల్” అంటే ప్రభువు అని అర్థం. హెబ్రూ భాషలో ఏల్ అంటే యెహోవా మరియు దేవుడు అని ఎలా అర్ధమో బబులోను వారి భాషలో బేల్ అంటే ప్రభువు లేదా దేవుడు అని అర్థం! ఇజ్రాయేల్ ఇరుగుపొరుగు రాజ్యాల్లోనూ కొన్ని సమయాల్లో ఇస్రాయేల్‌లో కూడా పూజలందుకున్న బయల్ దేవుడిలాంటి వాడే ఈ “బేల్” కూడా. ఈ మొదటి రెండు వచనాలు సారం ఏమిటంటే బబులోనువారు బందీలుగా ప్రవాసానికి వెళ్తారని చెప్పడం. వారి దేవుళ్ళు వారిని రక్షించలేవు అని అర్థం!!

ఇక మూడు నాలుగు వచనాలు ఇశ్రాయేలు కే కాకుండా సార్వత్రిక సంఘానికి ఎంతో ఆదరణ కరమైన మాటలు!!

3. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

4. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

చూడండి దేవుడు ఏమంటున్నారో యాకోబు ఇంటివారలారా ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా! శేషించిన వారలారా అంటున్నారు ఎందుకంటే ఇశ్రాయేలు చెరలోనికి వెళ్లి తిరిగి వస్తున్న వారితో దేవుడు పలుకుతున్న మాటలు అనగా ఇశ్రాయేలు వారిలోను, ఇశ్రాయేలు వారు అష్షూరు చేతిలోనే చెరగ వెళ్లిపోతారు ఇంకా యూదుల్లో కూడాను చాలామంది పోతారు, వెళ్లి వచ్చిన తర్వాత యూదులలోనూ ఇశ్రాయేలీయుల్లోనూ ఎవరైతే శేసించి ఉన్నారో వారితో దేవుడు అంటున్నారు: గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించిన/ భరించబడిన వారలారా! తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకపెట్టుకునేవారలారా!!! ఈ మాట చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి! గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా! గర్భం నుండి తల్లి భరిస్తాది అనుకుంటాం, తల్లి కడుపులో 9 నెలలు తల్లి భరిస్తుంది, తర్వాత చాలాకాలం చంకన పంటుకుని మోస్తా ఉంటది తల్లి! అయితే దేవుడు అంటున్నారు నీ తల్లి కాదు రా నువ్వు నా చేత భరించబడ్డావు! తల్లి ఒడిలోనూ కూర్చుంటున్నది మొదలుకొని చంకలో పెట్టుకుని మోసింది నీ తల్లి కాదు నేను రా అంటున్నారు దేవుడు. అయితే నీ తల్లి నిన్ను ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మోస్తుంది భూమిమీద. అయితే నీకు ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నీ తల వెంట్రుకలన్నీ తెల్లగా మెరిసిపోయే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నిన్ను మోసుకొనే వాడిని నేనే. నేను చంక పెట్టుకునే వాడిని కూడా! నేనే నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించు వాడను కూడా నేనే ! ఎందుకంటే నేనే నిన్ను చేసి ఉన్నాను అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. మనల్ని ఎత్తుకున్నవాడు! నిన్ను నన్ను పోషిస్తున్న వాడు నన్ను చంకబెట్టుకున్నవాడు!!

ఇప్పుడు మరో డౌట్ రావచ్చు మరి దేవుడు మనలను ఎత్తుకొని మోసుకుంటూ చంక పెట్టుకుంటే మనకు వస్తున్న ఈ ఇబ్బందులు బాధలు శ్రమలు ఎందుకు వస్తున్నాయి?!! ఎందుకంటే భక్తిగా ఉన్నవారికి అయితే శ్రమలు అన్ని వస్తున్నాయి కానీ దేవుడు నిన్ను ఎత్తుకొని నీకు బదులుగా నీ శ్రమలో ఆయన మోస్తున్నారు, ఆ శ్రమలు యొక్క సెగ మాత్రమే నీకు తగులుతుంది అసలు శ్రమ అంతా ఆయనే భరిస్తున్నారని మర్చిపోవద్దు. దేవుని నుండి దూరమైపోయిన వారికి నువ్వు దేవుని వదిలేసావు కాబట్టి సాతాను నీ మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాడు అందుకే ఈ శ్రమలు అని గ్రహించమని మనవి చేస్తున్నాను!

యెషయా 44:2

నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

యెషయా 44:24

గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను.

ఇక ఎత్తుకున్నాను” అనగా– తండ్రి తన చంటి పిల్లవాణ్ణి ఎత్తుకున్నట్టు ఆయన మనలను ఎత్తుకొని మోస్తున్నారు అని గ్రహించాలి!!!

దేవుడు తమను విడిచి పెట్టేస్తాడని గానీ బబులోను దేవుళ్ళ మాదిరిగా ఆయన కూడా బలహీనుడు, పనికిరానివాడు అని గానీ వారు భయపడకూడదు. ఆయన మనలను ముదిమితనము వరకు, మనం చనిపోయే వరకు విడువడు ఎడబాయడని గ్రహించాలి!!

ఇంకా అంటున్నారు యెషయా 49:14

అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

యెషయా 49:15

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

యెషయా 49:16

చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి.

చూశారా మన పరమ తండ్రి మన రాజు మనతో ఏమంటున్నారో! స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోయినా మర్చిపోవచ్చు కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. నా అరచేతులు మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు ఎప్పుడూ నా ఎదుట ఉన్నాయి కాబట్టి అంటున్నారు దేవుడు! కాబట్టి ప్రియ దేవుని బిడ్డా! దేవుడి నిన్ను వదిలేశాడు మర్చిపోయాడని ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోవద్దు. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారు నిన్ను ఆదరిస్తూనే ఉంటారు.

ఇక తరువాత వచనాలలో దేవుడు అంటున్నారు మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?

ఈ వచనాల్లో దేవుడు అంటున్నారు మనుషులు చేసిన దేవున్ని కాదు నేను. బబులోను వారు వదిలేసినట్టు నేను వదిలేసి వాడిని కాదు. నేను నిత్యము ఉండే దేవుణ్ణి. కాబట్టి నాతో సమానంగా మీరు ఎవర్ని చేస్తారు అంటున్నారు. దీనికోసం మనం విస్తారంగా మిగిలిన అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాము కాబట్టి ముందుకు పోదాం!

ఇక ఎనిమిదో వచనంలో అక్రమకారులారా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి మీ మనసులో గట్టిగా నాటండి బాగా ఆలోచించండి ఏంటంటే చాలా క్రిందట, చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం తెచ్చుకోండి, దేనికంటే నేనే దేవున్ని ఇంకా ఏ దేవుడు లేడు అంటూ, ఆది నేనే అంతాన్ని నేనే ! ఇంకా జరగబోయే వాటిని చెప్పేవాడను కూడా నేనే! కేవలం నా సంకల్పం మాత్రమే నిలుస్తుంది ! నాకు ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం నాకుంది అంటున్నారు!... అంటూ అంటూ

11 వచనంలో తూర్పు నుండి క్రూరప్రక్షిని రప్పిస్తున్నాను నా సంకల్పాన్ని నెరవేర్చడానికి దూరదేశం నుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనుషుడు నేను ఏం చెప్తానో అదే జరిగిస్తాడు అంటున్నారు. ఆ పక్షి ఎవరో కాదు అది కోరెషు యొక్క సైన్యము అని గ్రహించాలి. దీని కోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము మనం ఆ వ్యక్తి ఎవరో కాదు కోరెసు.

యెషయా 41:2

తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.

యెషయా 41:3

అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళనిత్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు.

యెషయా 45:1

అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

ఇక 12వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట అంటున్నారు

Isaiah(యెషయా గ్రంథము) 46:11,12,13

11. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.

12. కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి

13.నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను.

కఠిన హృదయంతో నీతికి దూరంగా ఉన్నవాళ్లు మొండిపెట్టి దేవుని నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరో కాదు వారి ఇశ్రాయేలు ప్రజలు! ఒరేయ్ మంకుపట్టు/ మొండిపట్టు పట్టి దూరంగా వెళ్లిపోయిన ఓ ఇశ్రాయేలీయులారా! నేను నా నీతిని మీ దగ్గరికి నేను రప్పిస్తున్నాను! ఎందుకంటే బబులోను వారు ఓడిపోతున్నప్పుడు వారు చెరలోకి వెళ్ళిపోతారు. అయితే సీయోను ప్రజలైన మీరు, మీకు సీయోనులో రక్షణను ఉండ నియమించుచున్నాను ఇక ఇశ్రాయేలీయులకు నా మహిమను అనుగ్రహిస్తున్నాను అంటున్నారు దేవుడు.

Isaiah(యెషయా గ్రంథము) 1:4,15

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

యెషయా 29:13

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.

Isaiah(యెషయా గ్రంథము) 64:5,6,7,8,9,10

5. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

6. మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

7 .నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

8. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

9. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

10. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

అయితే ఇప్పుడు దేవుడు సీయోను కరుణించబోతున్నారు దానికి పూర్వస్థితి కలిగించబోతున్నారు దానిమీద ఆత్మను కుమ్మరించబోతున్నారు

యెషయా 45:8

ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను.

సీయోను మీద ఆత్మను కుమ్మరించిన దేవుడు, పరమసీయోనుగా కట్టబడుతున్న నీవు నేను ఆయన బాటలో నడిస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయనను వేడుకుంటే నిన్ను కూడా కట్టడానికి నిన్ను కూడా పునర్నిర్మించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు!

మరి ఆయన దగ్గరికి వస్తావా !!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*273వ భాగము*

యెషయా గ్రంథము 48:1--5

1. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

2. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టు కొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను.

4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

5. నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 46వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 48వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా 47 అధ్యాయము ఇంతకుముందు మనం చూసుకున్నాము. బబులోనికి అన్య దేశాలకు కలగబోయే తీర్పు కోసం ధ్యానం చేసేటప్పుడు బబులోనికి దేవుడు ఇచ్చే తీర్పు కోసం మందు భాగాల్లో మనం ధ్యానం చేసాము కాబట్టి 47 ధ్యానం చేయట్లేదు. ఇక్కడ కూడాను ఈ 47 వ అధ్యాయం బబులోను కన్యకా దుమ్ములో కూర్చో ఎందుకంటే ఇంతవరకు నువ్వు అందర్నీ శ్రమ పెట్టావు, ఇప్పుడు నువ్వు శ్రమ పడతావు. మీ తిరగలి నువ్వే తిప్పుకోవాలి. నీ ముసుగు తీసేసుకుని నువ్వు దిగంబర కాళ్లతో నదులు దాటిపోవాలి. నేను ఎప్పటికీ ఇలాగే యజమానురాలు గానే ఉంటాను నాకు వైధవ్యం రాదు అనుకున్నావు. అయితే నేను ఒక్కరోజులో నిన్ను విధవురాలుగాను పిల్లలు లేని దానిగాను నేను చేస్తాను. వితంతువు అవుతావు సంతాన హీనురాలవు కూడా అయిపోతావు. ఎందుకంటే నీకు అన్నీ ఇచ్చిన దేవుణ్ణి నీవు స్తుతించకుండా నీ సొంత దేవుళ్లను మంత్రాలను తంత్రాలను నువ్వు అనుసరించేవు. కాబట్టి ఇంతవరకు నువ్వు అందర్నీ ఊడిగం చేయించుకున్నావు ఇప్పుడు నీవు అందరికీ ఊడిగం చేస్తావు అని 47వ అధ్యాయంలో చెబుతున్నారు.

ఇక 48 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తూర్పారబడుతున్నారు ఎండారు కడుతున్నారు పేరుకు మాత్రం ఇస్రాయేలను పేరుంది గాని నువ్వు ఇంకా యాకోబు సంతతి లాగానే ప్రవర్తిస్తున్నావి. పవిత్రమైన నగర వాసులు అంటున్నారు కానీ పెదాలతోనే నువ్వు నన్ను అనుసరిస్తున్నావు. నువ్వు మూర్ఖుడివి మెడ వంచని తరం నీది‌ జరిగేది జరగబోయేది నేను చెప్తున్నా ఇంకా జరిగేది జరగబోయేది చెప్పలేని విగ్రహాల వెనకాల నీవు వెళ్తున్నావు. ఇక నేను నీకోసం నేను అవమానం పాలు అవను. అంటూ విగ్రహాలకు కలుగబోయే శిక్ష కోసం చెబుతూ నేను నిన్ను శిక్షించబోతున్నాను అని ముందు చెప్పి తర్వాత ఇంకా చివరికి రాబోయే సరికి బబులోని విడిచి వెళ్లిపోండి ఎందుకంటే నేను బబులోని మీదకి ఉగ్రత కురిపిస్తాను, మీరు పాడవకూడదు మీరు పడిన కష్టాలు చాలు. బబులోనుని విడిచి పారిపోండి అంటూ ముగిస్తున్నారు ఈ అధ్యాయం.

ఇక మొదటి వచనంలో అంటున్నారు 1. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

వారు విగ్రహాలను వెంబడిస్తూ కూడా, వారి ఆధ్యాత్మిక స్థితి 1:2-17లో వర్ణించిన రీతిలో ఉండి కూడా తమ మత సంబంధమైన కర్మకాండలను కొనసాగించడం వారికిష్టం.

Isaiah(యెషయా గ్రంథము) 1:2,3,4,5,11,12,13,14,15,16,17

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

యెషయా 29:13

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.

ఇలాంటి స్థితిలో హృదయము దేవునికి దూరముగా ఉండి పెదాలతో మాత్రం ప్రభువా ప్రభువా అంటున్నారు నేడు రోజుల్లో మనం కూడా ప్రభువా ప్రభువా అని ఎలా అంటున్నామో వారు కూడా అలాగే అంటున్నారు

మత్తయి 7:21

ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

మత్తయి 7:22

ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

మత్తయి 7:23

అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.

లూకా 6:46

నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?

యోహాను 4:24

దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

ఇక రెండో వచనంలో 2. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

“పరిశుద్ద పట్టణం”– జెరుసలం (52:1).

యెషయా 52:1

సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

ఇక్కడ అపవిత్రుడైన వాడు ఒకడు నీ లోపలికి రాడు అనగా అర్థం ఏంటంటే సీయోను పురము అనే మన పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే అపవిత్రత గాని పాపము గాని అపనమ్మకం గాని మనలో ఏమైనా ఉంటే పరలోకం దరి కూడా చేరలేము అని గ్రహించమని మనవి చేస్తున్నాను!

కాబట్టి ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో దేవునితో సమాధానంగా ఉన్నావా! నీలో పరిశుద్ధత ఉందా ?!

పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే విషయాలు నీలో ఏమైనా ఉన్నాయా?!

అయితే ఇప్పుడే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు!

పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు! పరలోక రాజ్య దరి కూడా చేరలేవు అని తెలుసుకో!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*274వ భాగము*

యెషయా గ్రంథము 48:3--9

3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను.

4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

5. నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమా చారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని

6. నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో చించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను

7. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ లేదు.

8. అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

9. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 48వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక మూడు నాలుగు వచనాలలో అంటున్నారు 3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాల కాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభ వించెను.

4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి

5. నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని

ప్రియులారా ఈ వచనాలలో మనకు రెండు విషయాలు కనిపిస్తాయి.

మొదటిది ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి మెడవంచని తరమువారో దేవుడు చెబుతున్నారు

రెండు దేవునికి అన్యదేవతలకి మద్య తేడా!!!

మొదటిది: ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి మెడవంచని తరమువారో చూసుకుందాం! ఈ వచనంలో దేవుడు అంటున్నారు నీవు మూర్ఖుడవనియు నీ మెడ యినుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుండి ...

నిర్గమకాండము 32:9

మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

అపో.కార్యములు 7:51

ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, (మూలభాషలో-వంచని మెడగలవారలారా, హృదయములయందును చెవులయందు సున్నతి పొందినవారలారా) మీ పితరులవలెమీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.

యెషయా 3:16

మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

యిర్మియా 6:28

వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.

యిర్మియా 6:30

యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.

యిర్మియా 7:26

వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.

సంఖ్యాకాండము 32:13

అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.

సంఖ్యాకాండము 32:14

ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతాన మైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.

యెహేజ్కేలు 3:7

​అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పినమాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.

కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికీ తప్పిపోతూ కష్టం కలిగిన వెంటనే క్షమించమని అడుగుతూ, క్షేమం కలిగిన వెంటనే తప్పిపోయే ప్రజలు!!! నీవు అలాంటి వాడవని నాకు తెలుసు కాబట్టే నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని అంటున్నారు!!!

రెండవ విషయం: దేవునికి అన్యదేవతలకి మద్య తేడా!!! మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, విగ్రహారాధకులు చేయలేనిదేదో దాన్ని దేవుడు చెయ్యగలడు. 41–48 అధ్యాయాల్లోని ముఖ్యాంశాల్లో ఇదొకటి (41:21-29; 42:8-9; 43:9-13; 44:6-9; 44:28; 45:19-21; 46:8-10; 47:13). ఈ అన్ని రిఫరెన్స్ లలో దేవుడు సవాలు చేస్తున్నారు నేను కార్యాలు జరుగక ముందే తెలిపి చేశాను. ఈ విగ్రహాలు అలా చేయగలవా?!! జరిగేవి జరుగబోయేవి చెప్పే సత్తా ఉందా అని అడుగుతున్నారు!!! ఇలా చేసినా ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి లేక సత్తాలేని జీవములేని విగ్రహాలు వెనుక వెళ్తున్నారు మాటిమాటికీ తప్పిపోతూ కష్టం కలిగిన వెంటనే క్షమించమని అడుగుతూ, క్షేమం కలిగిన వెంటనే తప్పిపోయే ప్రజలు!!! నీవు అలాంటి వాడవని నాకు తెలుసు కాబట్టే నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరుగకమునుపే దానిని నీకు ప్రకటించితిని అంటున్నారు!!!

ఇక తరువాత వచనాలలో 6. నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను

7. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండ లేదు అంటున్నారు.

చూడండి ఏమంటున్నారో నీవు ఆ సంగతులు విన్నావు. వాటన్నిటిని గురించి ఆలోచించు. నేను చెప్పినది నిజమని నీవు ఒప్పుకోవా? “ఇకనుంచి నీకు క్రొత్త సంగతులను తెలియజేస్తాను. ఆ సంగతులు గూఢమైనవి, నీకు తెలియనివి. అవి ఇప్పుడే కలిగినవి. చాలా కాలంక్రిందట ఇవి కలిగినవి కావు. ఈ రోజుకు ముందుగా నీవు వాటిని గురించి వినలేదు, గనుక ‘ఇవి నాకు తెలిసినవే’ అని నీవు చెప్పలేవు అంటున్నారు.

ఇంకా తరువాత వచనాలలో 8. అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

9. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.

చూడండి మరలా ఎనిమిదో వచనంలో కూడా అంటున్నారు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

Isaiah(యెషయా గ్రంథము) 6:9,10,11,12

9. ఆయన నీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

10 .వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

11. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

12. యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.

యెషయా 1:2

యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

యెషయా 1:3

ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

యెషయా 1:4

పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

అయినా గాని తొమ్మిదవ వచనంలో అంటున్నారు నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.

ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిజానికి నాశనానికి పాత్రులు గాని దేవుడు ఎందుకోసం వారిని చంపడం లేదు అంటే నా నామమునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.

దేవుడే గనుక తన కోపాన్ని అణుచుకోకపోతే ఎవరు నిలిచి ఉండగలరు?

1సమూయేలు 12:22

​యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

కీర్తనలు 78:38

అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు.తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

కీర్తనలు 78:39

కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

యెషయా 37:35

నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

దేవుని కోపాగ్ని గురించి బైబిల్లో కొన్ని వందల సార్లు రాసి ఉంది. ఏకైక నిజ దేవునికి మంచితనం, సత్యం, నీతిన్యాయాలు, పవిత్రత పట్ల అపారమైన ఆసక్తి ఉంది. అందువల్ల ఈ గుణాలకు వ్యతిరేకమైనవి ఆయన కోపాగ్ని రేకెత్తిస్తాయి. ఆయన కోపం చెడుతనాన్ని అసహ్యించుకునే లోపరహితమైన ఆయన పవిత్ర స్వభావం మూలంగా పుట్టేది. నిర్మలమైన వాటిపట్ల ఆయన ఆసక్తి, తన సృష్టి అయిన విశ్వానికి అత్యంత క్షేమం కలగాలన్న ఆయన ఆకాంక్ష – వీటిల్లోనుంచే ఆయన కోపం కలుగుతుంది. పాపం, చెడుతనం విషయంలో ఆయనకేమీ కోపం లేకపోతే ఆయన దేవుడే కాదు. మనుషుల్లో చూచినా న్యాయం కోసం ఆసక్తి ఉండే వారెవరైనా అన్యాయాన్ని చూచి కోపం తెచ్చుకోకుండా ఉండరు. దయను ప్రేమించే ఎవరైనా క్రూరత్వాన్ని చూచి కోపగించకుండా ఉండరు. సత్యమంటే ప్రీతి ఉన్న ఎవరైనా అసత్యాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు. న్యాయాన్ని, దయను, సత్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటే అతడు లేక ఆమె వీటికి వ్యతిరేక లక్షణాలను అంతగా అసహ్యించుకుంటారు. పవిత్రతపట్ల దేవుని ఆసక్తి అంతులేనిది గనుక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిది. బైబిలు చెప్పేదాని ప్రకారం మనందరం దేవుని కోపానికి పాత్రులమే. తనకు కోపం తెప్పిస్తాయని దేవుడు చెప్పిన కొన్ని విషయాల జాబితా కోసం ద్వితీ 4:25 చూడండి. దేవుని కోపం గురించి కొన్ని ముఖ్యమైన రిఫరెన్సులు – 1:53; 11:1; నిర్గమ 32:10; లేవీ 26:28; ద్వితీ 32:22; యెహో 7:1; న్యాయాధి 2:12; 2 రాజులు 17:18; 24:20; కీర్తన 2:12; 7:11; 78:38, 49, 50; 90:7-11; యెషయా 5:25; 10:5; 13:9; 66:15; నహూము 1:2, 5; మత్తయి 3:7; యోహాను 3:36; రోమ్ 1:18; 2:5, 8; 5:9; 9:22; ఎఫెసు 2:3; 5:6; 1 తెస్స 1:10; ప్రకటన 6:16; 14:19; 15:1, 7; 19:15.

కాబట్టి నీవు నేను కూడా శిక్షకు పాత్రులము కానీ దేవుడు తన కృప చొప్పున తన కనికరం చేత మనలను క్షమించి వదిలేస్తున్నారు. కానీ మాటిమాటికీ ఆయన గాయాలు రేపకు! ఆయన శిక్షకు పాత్రుడవు కావద్దు! ఆయన చెప్పినట్లు చేద్దాం! ఆయన దయగల దేవుడు కృపగల దేవుడు! కేవలం ఆయన నామము నిమిత్తమే మనలను కాపాడుతున్నారని గ్రహించి బుద్ధి కలిగి నడుచుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*275వ భాగము*

యెషయా గ్రంథము 48:10--15

10. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

12. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

13. నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

14. మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

15. నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 48వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక పదో వచనంలో అంటున్నారు నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని .

దేవుడు వారినే కాదు మనలను కూడా ఇబ్బందుల కొలిమిలో వేసి పరీక్షించి ఆధ్యాత్మికముగా ఒక్కో మెట్టు ఎక్కిస్తారు. ఇదీ దేవుడు దీవించే విధానం! దేవుడు ఎప్పుడూ రోజు మధ్యాహ్నం లో నిన్ను అందలమెక్కించరు. విశ్వాసులకు లాటరీ టిక్కెట్టులు తగలవు. దేవుడు క్రమక్రమంగా నిన్ను ఆశీర్వదిస్తారు!!

ఎన్నో శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎంతో మంది ఈ అగ్నికొలిమిలో పరీక్షకు గురి అయ్యారు

యిర్మియా 9:7

కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?

Ezekiel(యెహెజ్కేలు) 22:17,18,19,20,21,22

17. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.

19. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టు వంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

20. నా కోపము చేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.

21. మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.

22.​ కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.

Psalms(కీర్తనల గ్రంథము) 66:10,11,12

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

1 Peter(మొదటి పేతురు) 1:6,7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

1 Peter(మొదటి పేతురు) 4:1,2,12,13

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో(శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

కాబట్టి ప్రియ సహోదరుడా! నీవు ఇప్పుడు శ్రమలలో ఉన్నావా! ఇబ్బందుల్లో ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించే అవకాశం తీరు ఇదే అని మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఆధ్యాత్మికంగా ఉతికంగా నిన్ను ఆశీర్వదించే తీరు అదే కాబట్టి ఓలిపోక సోలిపోక ఆయన మార్గంలో సాగిపో!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*276వ భాగము*

యెషయా గ్రంథము 48:10--15

10. నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని

11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

12. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

13. నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

14. మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

15. నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 48వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక పదకొండవ వచనంలో 11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను అంటున్నారు.

దేవుడు ఇజ్రాయేల్ జాతిని పూర్తిగా నాశనం చేసేస్తే, వారు తిరిగి తనవద్దకు వచ్చేలా చేసి, వారు ఎలా ఉండాలో ఆ స్థితికి తెచ్చేందుకు వారిలో చర్య జరిగించకపోతే, వారి విషయంలో తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే, ఆయన నామం ఆపకీర్తి పాలౌతుంది. అందుకే పూర్తిగా నాశనం చేయడం లేదు.

మోషేగారి సమయంలో ఒకసారి ఇలాగే జరిగింది అప్పుడు మోషే గారు వ్యవహరించిన తీరు సేవకులందరికీ ఆదర్శప్రాయమైనది.

Exodus(నిర్గమకాండము) 32:7,8,9,10,11,12,13,14

7. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

8. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.

9. మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

10. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా

11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?

12. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము.

13. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.

14. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడునుగూర్చి సంతాపపడెను.

చూడండి మోషే గారి మొర విని దేవుడు సంతాపపడెను.

ఇక ఈ వచనంలో మరో ముఖ్య విషయం నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

యెషయా 42:8

యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

యెహేజ్కేలు 20:9

అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని.

యెహేజ్కేలు 20:14

అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

యెహేజ్కేలు 20:22

అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.

యెహేజ్కేలు 20:44

ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీ కీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

ఇక తరువాత వచనంలో అంటున్నారు 11. నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను.

12. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

13. నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.

14. మీరందరు కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది యీ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

ప్రియులారా వీటికోసం గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాం!

తరువాత వచనంలో నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి .

ఇక్కడ అతడు అనగా కోరెషు అని అర్థం. నేనే కోరెషుని పిలిచాను. అతడు వచ్చి బబులోనుని శిక్షించి నా ప్రజలను విడిపిస్తాడు. ఇదంతా నేనే చేయిస్తున్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చి వినండి అంటున్నారు!

తరువాత వచనాలలో Isaiah(యెషయా గ్రంథము) 48:16,17,18,19

16. ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను

17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

19. నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

16వచనం చివరి మాటను పలికినది యెషయా గారు. తనను ప్రవక్తగా నియమించి బలప్రభావాలను ఇచ్చిన విషయాన్ని చెప్తున్నాడు (6:9; 2 పేతురు 1:21).

ఇక 17వ వచనంలో “ఉపదేశం చేసేవాణ్ణి”– అనగా దేవుడు గొప్ప ఉపదేశకుడు! ఇంత గొప్ప ఉపదేశకుని దగ్గర ఏమీ నేర్చుకోలేని మనుషుల భ్రష్ట స్వభావం, మొండితనం, ఆత్మ సంబంధమైన అజ్ఞానం ఎంత ఘోరమైనవి!

Psalms(కీర్తనల గ్రంథము) 25:4,5,6

4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.

5. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

6. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.

ఇక తరువాత వచనాలలో దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నారు

18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

19. నీ సంతానము ఇసుకవలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువులవలె విస్తరించును వారి నామము నా సన్నిధినుండి కొట్టివేయబడదు మరువబడదు

నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేవాణ్ణి.

చూడండి నీవు నా ఆజ్ఞలను పాటించాలని ఎంతో కోరేవాణ్ణి , వాటిని పాటించి ఉంటే నీ శాంతి నదిలాగా, నీ న్యాయం సముద్రం అలలలాగా ఉండి ఉండేవి. నీ సంతానం ఇసుకంత విస్తారంగా, నీ పిల్లలు లెక్కకు ఇసుకరేణువుల లాగా ఉండి ఉండేవారు.

అలాంటప్పుడు వారి పేరును నా సముఖంనుంచి కొట్టివేయడం జరిగేది కాదు, నాశనం అయ్యేది కాదు అంటున్నారు.

శాంతి, న్యాయం”– తన ప్రజలు దేన్నైతే అనుభవించాలని దేవుడు వాంఛిస్తున్నాడో క్లుప్తంగా వర్ణించే రెండు పదాలు (రోమ్ 14:17). దేవుని పట్ల విధేయతకు ఇవి ఫలితాలు (కీర్తన 119:9, 165; మొ।।). అవిధేయతవల్ల నెమ్మది లేకపోవడం, కీడు సంప్రాప్తిస్తాయి. అలలు”– అనడానికి కారణం నదులు, అలలు నిరంతరం సాగిపోతూనే ఉంటాయి. అవి ఆగవు. అలాగే దేవుని నీతి న్యాయం దేవుని కరుణ అనేవి మనము ఆయన కరుణకు పాత్రులమై ఉన్నంతవరకు మనయెడల ఆగిపోవు.

ఇసుకంత”– ఆది 15:5; ద్వితీ 1:10. దేవునికి ఇజ్రాయేల్ విధేయత చూపివుంటే సంఖ్యలో మరింత అధికంగా ఉండేవారు. దేవుని తీర్పు వారిలో చాలామందిని సంహరించింది. మరింతమందికి అదే గతి పట్టబోతున్నది.

ఆదికాండము 15:5

మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

ద్వితియోపదేశకాండము 1:10

మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.

ఇక తరువాత వచనాలలో అంటున్నారు Isaiah(యెషయా గ్రంథము) 48:20,21,22

20. బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.

21. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.

22. దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.

బబులోను నుండి పారిపోమనడానికి మరో కారణం దేవుడు మాదీయ పారశీక సైన్యమును కోరెషుని బబులోను మీద పంపుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా మీ విడుదల సమీపించింది కాబట్టి బయలు వెడలిపోవుడి ఉత్సాహ ధ్వని చేయండి అంటున్నారు.

మిగిలిన ప్రజలతో దేవుడు వారు అప్పటికే బబులోనులో ఉన్నట్టూ, బబులోను నాశనమైపోయినట్టూ మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒక విషయాన్ని మొదటినుంచి చివరి స్థితి వరకు తెలిసినవాడే ఇలా మాట్లాడగలడు (46:10). ఇజ్రాయేల్ వారు చెరనుండి విడుదల కావడం, తద్వారా వారిలో వెల్లివిరిసే ఆనందం ఇక్కడ కన్పిస్తున్నాయి మనకు!!!

ఇక 21వ వచననం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.

ఇక్కడ బబులోను నుండి తిరిగి ఇశ్రాయేలు దేశం వచ్చేటప్పుడు దేవుడు వారిని పోషించి సంరక్షించే విధానం కనిపిస్తుంది. ఇది ఎడారి ప్రాంతాల్లో ఇంతకుముందు కాలంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేయడం (నిర్గమ 17:6; సంఖ్యా 20:11; ద్వితీ 8:15; కీర్తన 78:15-16). బబులోను నుండి తిరిగి వచ్చేవేళ దేవుడు వారి అవసరాలను తీరుస్తాడని ఇస్రాయేల్‌వారికి దైర్యం చెప్పేందుకే ఈ విధంగా గుర్తు చేయడం. 32:2; 35:6; 43:19; 49:10 .

ఇక్కడ నూతన నిబంధన సంఘం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవలసిన సత్యం కూడా ఉంది. ఇప్పటి విశ్వాసులు ఈ లోకమనే ఎడారి దారిన పరలోకం సీయోను కొండకు వెళ్తుండగా వీరికి కావలసిన ప్రోత్సాహం కూడా ఇక్కడ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.

అయితే దుర్మార్గులు మాత్రం వర్ధిల్లరు అంటున్నారు చివరి వచనంలో!

యెషయా 3:11; 57:20-21. 48:20లోని విముక్తి, ఆనందాల్లో ఇజ్రాయేల్ లోని దుర్మార్గులు భాగం పంచుకోరు. దేవుడు సకలమైన దుష్టత్వంనుండి తన ముఖం తిప్పేసుకుంటే, ప్రతీకారం తీర్చుకొనేందుకు సంసిద్ధుడైతే వారికి ఇక శాంతి ఎక్కడిది? అయితే తాము శాంతి అని భ్రమపడేది కొంతకాలానికి ఉండవచ్చు (కీర్తన 73:3-12, 16-20; రోమ్ 2:4-6).

కాబట్టి ఆయన బాటలో నడుచుకోవడం ఆయన మాటలు విందాం! ఆయన మాటలు ఆయన మార్గంలో నడిచి పోతూ ఉంటే మన నీతి కాలువలు వలె ప్రవహిస్తుంది. ఆయన నీటి కాలువ వారన మనం నాటబడిన చెట్టు వలె ఉంటూ ఆయన రాజ్యంలో విలువైన వారిగా పరిగణించబడగలరు!!

మరి ఆయన మాట విందామా!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*277వ భాగము*

యెషయా గ్రంథము 49:1--5

1. ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

3. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను.

4. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయ పరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.

5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో బును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 48వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 49వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయంలో దేవుడు యాకోబును పిలిచిన విధానము మరియు దేవుడు యాకోబుతో ధైర్యంగా ఉండు, ఇంకా నేను నిన్ను చెరలో నుండి విడిపించి నీ జనాంగాన్ని అత్యధికంగా చేస్తాను అని వాగ్దానం కనిపిస్తుంది. మరియు ఈ లోకంలో ఎవరు నిన్ను వదిలిన విడిచిన నేను నిన్ను విడువను అని ధైర్యం చెప్పడం కూడా ఈ అధ్యాయంలో కనిపిస్తుంది.

ఇక మొదటి వచనంలో అంటున్నారు ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

ఇక్కడ ద్వీపముల జనులను పిలుస్తున్నారు, దూరంలో ఉన్న జనాలను పిలుస్తు అంటున్నారు.... నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుంది మొదలుకొని ఆయన నా పేరు జ్ఞాపకం చేసుకున్నారు. నిజానికి ఇది ప్రవక్త గారు చెబుతున్న మాటలా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు గారు!! దేవుడు యాకోబును పిలిచిన విధానం ఇక్కడ కనిపిస్తుంది!! నీడలో అనగా తన కాపుదల్లో నన్ను పెట్టి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా అనగా శత్రువులకు బాణము లాగా నన్ను దేవుడు చేశాడు అంటున్నారు.

1-7 వచనాలలో దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ఇస్రాయేల్‌ను ఎన్నుకొన్నానని లోకానికి చెప్తున్నాడు (2:3). అయితే వారు ఆ ఉద్దేశాల విషయంలో విఫలులయ్యారు (వ 4). దేవునినుండి దూరంగా వెళ్ళిపోయారు (వ 5). అయితే ఇస్రాయేల్‌వారిలో నుంచే ఒకరు వచ్చి ఇజ్రాయేల్ ను తిరిగి దేవుని చెంతకు తెస్తాడనీ, అంతేగాక లోకమంతటికీ విముక్తి మూలాధారంగా ఉంటాడనీ చెప్తున్నాడు (వ 5,6). ఈయన అభిషిక్తుడు, యేసుప్రభువు.

యెషయా 41:1

ద్వీపాల్లారా! నా ఎదుట ఊరుకోండి. జనాలు క్రొత్త బలం పుంజుకోవాలి. వారు నా సన్నిధానానికి వచ్చి మాట్లాడాలి. తీర్పు తీర్చే స్థలంలో మనం సమకూడుదాం రండి.

పుట్టుక”– ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తూవుంటే గనుక ఆ వ్యక్తి యాకోబు. ఇస్రాయేల్ జాతికంతటికీ ఇతడు ప్రతినిధి (ఆది 25:21-26). ఒకవేళ పుట్టుక అంటే ఒక వ్యక్తిని గురించి కాక 44:1-2లో లాగా ఒక జాతి పుట్టుకను గురించి అయి ఉండడానికి అవకాశం ఉంది.

Genesis(ఆదికాండము) 25:21,22,23,24,25

21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.

22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను

23. రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

24. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.

Isaiah(యెషయా గ్రంథము) 44:1,2

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

యిర్మియా 1:5

గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

గలతియులకు 1:15

అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని....

Psalms(కీర్తనల గ్రంథము) 71:5,6,7

5. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే.

6. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భము నుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.

7. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.

ఇక రెండవ వచనంలో పదునైన కత్తిగా నానోరు చేశారు అనగా ఇస్రాయేల్‌కు దేవుడు తన వాక్కు ఇచ్చాడు. వారి ప్రవక్తలు కత్తి వంటి ఆ దైవ వాక్కును ప్రకటించారు (ఎఫెసు 6:17; హీబ్రూ 4:12; ప్రకటన 2:12, 16; 19:15).

ఎఫెసీయులకు 6:17

మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

హెబ్రీయులకు 4:12

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.

ప్రకటన గ్రంథం 2:12

పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా

ప్రకటన గ్రంథం 2:16

కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.

ప్రకటన గ్రంథం 19:15

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

ప్రియ దైవజనమా! దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నారు, తన వాక్యమును మన నోట్లో ఉంచారు. మనం ఈ వాక్య ఖడ్గమును ఉపయోగించుకొని శత్రువైన సాతాను కోటలను బద్దలు కొట్టి, వాడి కబంధహస్తాలలో ఉన్న నశించిపోతున్న మన పొరుగు వారిని రక్షించే బాధ్యత మన మీద పెట్టారు! కాబట్టి ఆ పదునైన ఖడ్గమైన వాక్యమును ఉపయోగిస్తున్నావా లేక నీ నాలుకనే పదునైన కత్తిలా చేసి కత్తిపోటు వంటి మాటలు పలికి, ప్రజలను గాయపరుస్తున్నావా తేల్చుకో !!! నీ నాలుక కత్తిపోటు వంటి మాటలు పలికితే నీ మీద దేవుని ఉగ్రత అనే అంబులు వేయబోతున్నారు దేవుడు మర్చిపోవద్దు. అదే వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని వాడి అనేకులను రక్షిస్తే ఒక రోజు దేవుడు బళా నమ్మకమైన మంచి దాసుడా! బళా నమ్మకమైన మంచి దాసురాలా! నా కుమార్తె అని పిలవబోతున్నాడు!!!

ఏది కావాలో తేల్చుకో!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*278వ భాగము*

యెషయా గ్రంథము 49:1--5

1. ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.

2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

3. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను.

4. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయ పరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.

5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో బును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక మూడవ వచనంలో అంటున్నారు ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. గాని ఇశ్రాయేలు అంటున్నాడు అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని ఫలమేమియు లేకుండ నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే యున్నది.

5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకో బును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

ఇజ్రాయేల్ జాతి అంతా ఈ లోకంలో దేవుణ్ణి సేవిస్తూ ఆయన సంకల్పం చొప్పున చెయ్యాలి.

Isaiah(యెషయా గ్రంథము) 41:8,9,10,11,12,13,14,15,16

8. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

15. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు

16. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.

అయితే నీవు దేవుని మీద నిష్ఠూరాలు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. కేవలం ఇశ్రాయేలు వారే కాదు మనము కూడా అనేకసార్లు దేవుని మీద నిష్ఠూరాలు వేస్తున్నాం! ఓరి మాయదారి దేవుడా! నేనే దొరికేనా? లోకంలో లేకపోతే ఊర్లో ఎంతోమంది ఉన్నారు వారికి రావచ్చు కదా నాకేనా ఈ కష్టాలు?! నాకేనా ఈ ఈ సమస్యలు అంటూ!!! దేవుని మీద నిష్టూరాలు వేసి దేవుని మీద విసుక్కుంటున్నాం! ఇది మంచిది కాదు! దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడువను,, ఎడబాయను, నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటే... దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం మోడస్ ఆపరాండి ని అర్థం చేసుకోక, శ్రమల ద్వారా నిన్ను ఆశీర్వదించే ప్రక్రియను అర్థం చేసుకోలేక, దేవున్ని అనరాని మాటలు అంటూ ఆశీర్వాదాలు నీకు నువ్వే ఆపేసుకుంటున్నావ్.

ఘనత”– ఇది దేవుడు ఇస్రాయేల్‌ను పిలవడంలో ఉన్న అత్యంత ఉదాత్తమైన ఉద్దేశం. దేవుడీ ఉద్దేశాన్ని సఫలం చేసుకుంటాడు. 43:21 కూడా చూడండి. ఆయన స్వభావం, గుణగణాలు, చర్యల్లోని మహిమా ప్రభావాలు ఆ జాతిలో వ్యక్తమయ్యే కాలం వస్తుంది.

యెషయా 43:21

నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.

యెషయా 43:22

యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

అయితే నేను అన్నాను, “వ్యర్థంగా కష్టపడ్డాను. నిష్ఫలంగా, వృథాగా నా బలం ప్రయోగించాను. అయినా నాకు రావలసినది యెహోవాదగ్గర ఉంది, నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది.”

దేవుని ఉద్దేశాలను నెరవేర్చేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకూ కొరగాకుండా పోయాయని ఆ జాతి అంగీకరిస్తుంది. అయితే ఆశాభావంతో లేదా నిరీక్షణతో తమ భవిష్యత్తును దేవునికే విడిచిపెడుతున్నారు.

నిజానికి మన బహుమానం దేవుని దగ్గర ఉంది. ప్రకటన గ్రంథం 2:23

దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

ప్రకటన గ్రంథం 2:25

నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

యెహోవా దృష్టిలో గౌరవనీయుణ్ణి. నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు....

ఇస్రాయేల్‌వారి ఆశాభావమూ (నిరీక్షణ), దేవుడు వారిని పిలిచిన పిలుపులో గల ఉద్దేశమూ తప్పక నెరవేరుతాయి. ఇక్కడ ఒక వ్యక్తి అంటే అభిషిక్తుడు కనిపిస్తున్నాడు. ఈయన ఇస్రాయేల్‌కు ప్రతినిధిగా ఉండి వారి తరఫున వారు దేన్ని చెయ్యలేకపోయారో దాన్ని చేస్తాడు.

గౌరవనీయుణ్ణి...బలంగా”–అనగా యేసుప్రభువు గౌరవం, బలం అంతా తండ్రి అయిన దేవునినుండి వచ్చినదే (యోహాను 5:19, 30 మొ।।; యోహాను 8:50, 54; 17:1, 5).

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*279వ భాగము*

యెషయా గ్రంథము 49:6--7

6. నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

7. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తరువాత వచనాలలో 49:6,7

6. నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

7. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

ఈ వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు వారి నిజమైన విమోచకుడు ఏసు క్రీస్తు ప్రభువుల వారిని పరిచయం చేస్తున్నారు. ఈయనే నిజంగా ఇశ్రాయేలు వారిని విడిపిస్తాడు. యాకోబు వారిని తిరిగి రప్పిస్తాడు. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేసే రక్షణకు సాధనం ఒకటే! అన్నిజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించియున్నాను; అనగా ఇశ్రాయేలు జనాంగము నుండి యూదా గోత్రం నుండి దేవుడు యేసు క్రీస్తు ప్రభువుల వారిని తీసుకొచ్చే విధానాన్ని ముందుగానే చెప్తున్నారు ఇక్కడ. ఈ విషయాన్ని సమస్త దేశములు అంగీకరిస్తాయి, రాజులు నీకు నమస్కారం చేస్తారు అంటున్నారు.

ఇక్కడ సేవకుడు అనగా యేసుక్రీస్తు ప్రభులవారు.

Isaiah(యెషయా గ్రంథము) 42:1,2,3,4,5,6,7,8

1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు

3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.

4. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును

7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

8. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.

యేసుప్రభువు దీన్ని చేస్తాడు అయితే ఏవిధముగా అంటే క్రింద చూడండి (జెకర్యా 12:9-14; రోమ్ 11:25-29; ప్రకటన 17:1-8).

Zechariah(జెకర్యా) 12:9,10,11,12,13,14

9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.

10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.

12. దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,

14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.

Romans(రోమీయులకు) 11:25,26,27,28,29

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.

29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

ఇక భూమిమీద”– కృప సంబంధమైన దేవుని ఉద్దేశాలు కేవలం ఇస్రాయేల్ జాతికే గాక ప్రపంచం మొత్తానికి వర్తిస్తాయి (లూకా 2:30-32; అపొ కా 3:19-21; రోమ్ 15:8-10).

నా రక్షణ భూమి కొనలకు వ్యాపించేలా నిన్ను ఇతర జనాలకు వెలుగుగా చేస్తాను.

మనుషుల తృణీకారానికీ ఈ ప్రజల ద్వేషానికీ గురి అయి, పరిపాలకులకు సేవకుడుగా ఉన్నవానితో ఇజ్రాయేల్ ప్రజల విముక్తిదాతా, పవిత్రుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నమ్మకంగా ఉన్న యెహోవా కారణంగా, నిన్ను ఎన్నుకొన్న ఇస్రాయేల్ ప్రజల పవిత్రుని కారణంగా రాజులు నిన్ను చూచి నిలబడుతారు, అధికారులు నీ ఎదుట వంగుతారు.”

తృణీకారానికి” అనగా – 53:3లో చెబుతున్న విషయం.

యెషయా 53:3

అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.

యెషయా 53:4

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

యెషయా 53:5

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

యెషయా 53:6

మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

యెషయా 53:7

అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

ఆ జాతి మొత్తంగా తమకు దేవుని వైపుకు తిప్పగల ఏకైక వ్యక్తిని తృణీకరించారు (53:3; మత్తయి 27:22; యోహాను 15:24; అపొ కా 7:52).

అయితే ఈ సేవకుడు – యేసుప్రభువు అందరికీ సేవకుడు. హేరోదు, పిలాతు ఆయన్ను అలానే చూశారు. అయితే ఆయన ఎదుట రాజులంతా మోకాళ్ళూని మ్రొక్కే సమయం రాబోతూ ఉంది (కీర్తన 72:8-11).

Psalms(కీర్తనల గ్రంథము) 72:2,4,5,6,7,8,9,10,11,12,13,14,15,17,18

2. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.

4. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును.

5. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.

6. గడ్డికోసిన బీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును.

7. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును.

8. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును.

9. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.

10. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.

11. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.

12. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

13. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును

14. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.

15. అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు.

17. అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.

18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు.

ఈయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు యేసు క్రీస్తు ప్రభువుల వారు!!! మరి ఇంత గొప్ప రక్షకుని నీవు దేవుడిగా కలిగి ఉన్నావు కదా, ఆయన నీ హృదయానికి నీ జీవితానికి రాజుగా ఉన్నారా!!! మీ సమస్త నిర్ణయాలు ఆయన అంగీకారంతో కూడి ఉన్నావా? ఆయన వాక్యము చెప్పినట్లు చేస్తున్నావా?! నీ జీవితానికి ఆయనే రాజుగా అధికారిగా ఉన్నాడా?! మీ కుటుంబమునకు ఆయనే రాజుగా ఉన్నాడా?!

ఆయనకు నిజంగా భయపడుతున్నావా?!!

సరిచేసుకో! సరిచూసుకో!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*280వ భాగము*

యెషయా గ్రంథము 49:8--13

8. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

9. మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును

10. వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

11. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

12. చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.

13. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 8వ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

చూడండి అనుకూల సమయములో నీ మొరను లేక ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరమిచ్చాను అంటున్నారు. దేవుని పని దేవుని సమయంలో దేవుని విధానంలో జరుగుతుంది. మనం ఆశించే సమయంలో మనం ఆశించే విధంగా కాదు. దానికి అనుకూల సమయం రావాలి. మనం ఆశించినట్టుగా జరిగితే అవి టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే. దేవుని విధానంలో దేవుని సమయంలో జరిగితే అవి పర్మినెంట్!!!

అయితే ఇక్కడ చెబుతుంది రక్షణ దినం కోసం– ఈ క్రొత్త నిబంధన కాలం గురించిన విషయం 2 కొరింతు 6:2లో కనిపిస్తుంది.

2కోరింథీయులకు 6:2

అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!

2కోరింథీయులకు 6:3

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

నీవు బందీలతో ‘బయలుదేరండి’ అనీ, చీకటిలో ఉన్న వారితో ‘బయటికి రండి’ అనీ చెప్పేలా, ఈ దేశాన్ని సరి చేసి పాడైన వారసత్వాలను మళ్ళీ పంచిపెట్టేలా నిన్ను కాపాడుతాను, ప్రజకు ఒడంబడికగా చేస్తాను అంటున్నారు.

దేశాన్ని”– 44:26. ఈ క్రొత్త నిబంధన యుగం అంతానికి ఇది సూచన. ఒక భవిష్యద్వాక్కు ఇప్పటికే కొంతవరకు నెరవేరిందంటే అది పూర్తిగా నెరవేరిందని అనుకోరాదు.

యెషయా 44:26

నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

యెషయా 42:6

నేను – యెహోవాను – నీతి నిజాయితీ విషయంలో నిన్ను పిలిచాను. నేను నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడతాను.

యిర్మియా 31:31

​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 31:32

​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

యిర్మియా 31:33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

యిర్మియా 31:34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

యిర్మియా 31:35

​పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

ఇక తొమ్మిదవ వచనంలో మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును ....

యెషయా 42:7

యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

యెషయా 42:8

యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.

యెషయా 61:1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

యెషయా 61:2

యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

యెషయా 61:3

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

ఇక తరువాత వచనంలో వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

11. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

యెషయా 48:21

ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.

కీర్తనలు 121:6

పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.

కీర్తనలు 121:7

ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును

ప్రకటన గ్రంథం 7:16

వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,

ప్రకటన గ్రంథం 7:17

ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

ఈ చివరి భాగం వెయ్యేళ్ల పాలనలోను, నిత్యత్వంలోను జరగబోయే సంభవాలు!

తరువాత వచనంలో నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

యెషయా 11:16

కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

యెషయా 26:7

నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని

యెషయా 35:8

అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

యెషయా 62:10

గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

యెషయా 62:11

ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

ఇక తరువాత వచనంలో 12. చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.

13. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

ఇక్కడ వీరు అనగా చెరనుండి విడుదల కాబడి తిరిగి వచ్చుచున్న ఇశ్రాయేలు ప్రజలు మరియు యూదులు!!

సీనీం ఈజిప్ట్‌కు దక్షిణాన ఉంది.

యెషయా 11:11

ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

యెషయా 11:12

జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

యెషయా 43:5

భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.

యెషయా 43:6

అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

యెషయా 43:7

నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

యెషయా 60:4

కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

యెషయా 44:23

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

Isaiah(యెషయా గ్రంథము) 54:7,8,9,10,11,12,13

7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

9. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.

10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

12. మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును.

13. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

ఈరీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చి ఆదరించబోతున్నారు!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*281వ భాగము*

యెషయా గ్రంథము 49:14--21

14. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

16. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి

17. నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.

18. కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

20. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

21. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 14వ వచనంలో అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

చూడండి ఇక్కడ సీయోను అనగా ఇశ్రాయేలు కుమారి ఏమంటుందో... యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచియున్నాడు అనుకుంటుంది. వారికి వచ్చిన కష్టాలు శ్రమలు బాధలు చూసి దేవుడు నన్ను వదిలేశాడు, మరిచిపోయాడు అని అనుకుంటుంది. మనము కూడా మనకు వచ్చిన శ్రమలు చూచి దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను వదిలేశాడు ఇంక నా బ్రతుకు ఇంతే! నాకు దిక్కు లేదు అని అనుకుంటాం మనం! అయితే దేవుడు అంటున్నారు స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచునా?! వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకున్నాను అంటున్నారు దేవుడు. దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము. దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోరు, తన అరచేతుల మీద మనల చెక్కుకున్నాడు! మన కోసం నిరంతరం చింతించుచున్నాడు దేవుడు. ఈ విషయం మర్చిపోవద్దు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు, నా ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదు? నేను ప్రార్థనా చేసిన జవాబు ఇవ్వటం లేదు అని అనుకొని దేవుడు నన్ను మర్చిపోయాడు కదా అనుకుంటాము! అయితే దేవుడు అంటున్నారు రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మంధం కాలేదు! అయితే మీ పాపములు మీకు దేవుడికి మధ్య అడ్డగా వచ్చి యున్నవి. కాబట్టి మన పాపములు తొలగించుకుంటే, అడ్డంకి తొలగించుకుంటే మన ప్రార్థన దేవునికి వినపడుతుంది దేవుడిచ్చే జవాబు కూడా మనకు కనబడుతుంది అని గ్రహించాలి.

దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు కొన్నిసార్లు వారి మనసులో ముసురుకునే నిరుత్సాహం ఇలా ఉంటుంది .

కీర్తనలు 13:1

యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

కీర్తనలు 13:2

ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

కీర్తనలు 44:24

నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?

విలాపవాక్యములు 5:22

నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.

దేవుని జవాబు 15-16వచనాలు ఇక్కడినుండి అధ్యాయం చివరి వరకు దేవుడు జెరుసలం నగరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దేవుడు ఇజ్రాయేల్ జాతిపట్ల తన వాగ్దానాలను నెరవేర్చుకోడని మనం కలలోనైనా భావించకూడదు. ఈ వచనాల సందర్భాన్ని బట్టి చూస్తే అక్షరార్థంగా సీయోను విషయమే ఇక్కడ మాట్లాడుతున్నది అని అర్థమౌతుంది (వ 5,16,19,22). అయితే ఇందులోని ఆధ్యాత్మిక సత్యం అన్ని యుగాల్లోనూ విశ్వాసులందరికీ వర్తిస్తుంది.

స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డమీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? ఒకవేళ అలాంటివారు మరవవచ్చు. గాని, నేను నిన్ను మరవను!

 చూడు! నా అరచేతుల మీద నిన్ను చెక్కాను .నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

చెక్కాను”– నిర్గమ 28:9-12 చూడండి. దేవుని చేతులపై చెక్కిన పేర్లను ఎవరు తుడిచివేయగలరు?

Exodus(నిర్గమకాండము) 28:9,10,11,12

9. మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున

10. ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.

11. ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

12. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.

ద్వితియోపదేశకాండము 11:12

​అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.

ఇంకా 17--21 వచనాలలో ఆయన జవాబు ఎంతో సుదీర్ఘమైనది, ఆదరణకరమైనది, ఆశ్చర్యకరమైనది.

17. నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనముచేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్లుచున్నారు.

18. కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

20. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

21. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.

చూడండి నీ కుమారులు త్వరపరచు వస్తున్నారు! నిన్ను నాశనం చేసి నిన్ను పాడుచేసిన వారు నీలో నుండి బయటకు వెళ్ళిపోతున్నారు! ఒకసారి కనులెత్తి చూడు నీ బిడ్డలంతా నీ దగ్గరకు వస్తున్నారు! అప్పుడు నీ పిల్లలందరినీ నీవు ఆభరణంలా ధరించుకుంటావు. పెండ్లి కుమార్తె తన నడుం చుట్టూ వడ్డానం ధరించుకున్నట్లు మీ పిల్లలందరినీ నీ చుట్టూ అలంకారంగా ధరించుకుంటావు. ఇది నా జీవం తోడని యెహోవా ప్రమాణం చేస్తున్నారు! ఇంకా ఎంతగా అంటే నివాసులు విస్తరించినందున పాడైపోయిన నీ చోట్లు పాడైపోయిన ఇల్లు, నాశనం చేయబడిన నీ భూమి నీ పిల్లలకు ఇరుకుగా ఉన్నందువల్ల ఈ ప్లేస్ చాలక, ఈ స్థలము చాలదు నాకు ఇంకా కావాలి అంటారు! నీవు సంతాన హీనురాలైనప్పుడు నీకు పుట్టిన కుమారులు మాకు ఈ స్థలం ఇరుకుగా ఉంది! ఇంకా విశాలమైన స్థలం మాకు కావాలి అని నీతో చెప్తారు! అప్పుడు నువ్వు అనుకుంటావు... నేను నా పిల్లల్ని పోగొట్టుకొని సంతానహీనురాలను అయిపోయాను కదా, ఒంటరినైపోయాను కదా, మరి వీరినందరినీ నాకు కనిన వారెవరు?! వీరిని పెంచిన వాడు ఎవడు ? నేను ఒంటరి కత్తినై విడువబడ్డాను కదా వీరంతా ఎక్కడ ఉన్నారు అని నీవు మనసులో అనుకుంటావు ఆశ్చర్యపోతావు అంటున్నారు దేవుడు.

నీ కొడుకులు”–అనగా జెరుసలంనుండి దేశాంతరం వెళ్ళినవారు తిరిగి వస్తారు.

ఆభరణం”– అనగా తన ప్రజలంతా చెరనుండి తిరిగి వచ్చినప్పుడు సీయోనుకు కలిగే ఆనందం, గర్వం ఇక్కడ కనిపిస్తున్నది.

19-20 వచనాలలో చెప్పబడింది ఆలోచిస్తే బబులోనునుండి యూదులు తిరిగి వచ్చినప్పుడు ఈ వచనాలు నెరవేరలేదు. అప్పుడు తిరిగి వచ్చినది కొద్దిమందే. ఎజ్రా 2:64 చూడండి. లెక్కకు అంత విస్తారంగా ఉండడం ఇంతవరకు జరగలేదు.

ఎజ్రా 2:64

సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.

ఇక్కడ మొత్తమందరూ రాలేదు.

21-22 వచనాలు: సేనలప్రభువు యెహోవా అంటున్నాడు: “ఇదిగో విను. నేను జనాలకు చేతితో సైగ చేస్తాను. జనాలవైపు నా పతాకమెత్తుతాను. వారు నీ కొడుకులను తమ చేతులతో తీసుకువస్తారు, నీ కూతుళ్ళను తమ భుజాల మీద మోసుకువస్తారు.....

తిరిగి వస్తున్న తన కుమారులను చూచి జెరుసలం తానే ఆశ్చర్యపోతుంది. 22వ వచనంలో సీయోను కుమారులకూ ఇతర జనాలకూ తేడా చెప్తున్నది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నది అక్షరార్థంగా యూదుల గురించేనని స్పష్టమైనట్టుంది. 14:2; 43:6; 60:9లో ఇతర జనాలు ఇస్రాయేల్‌ను తీసుకువస్తారని రాసి ఉంది.

యెషయా 14:2

జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

యెషయా 14:3

తమ్మును బాధించినవారిని ఏలుదురు.

యెషయా 43:6

అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.

యెషయా 60:9

నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

యెషయా 60:10

అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

యెషయా 60:11

నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

యెషయా 60:12

నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ఈవిధంగా ఇస్రాయేలీయులంతా తిరిగి వస్తారు అప్పుడు యెరుషలేములో ఆనందం కలుగుతుంది. నూతన నిబంధన సంఘమైన నీవు కూడా దేవుని మాట వింటే దేవుడు చెప్పినట్లు చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది!! పోగొట్టుకున్న ఆశీర్వాదం రెట్టింపు ఆశీర్వాదం నీవు కూడా పొందుకోగలవు!!!

మరి దేవుని మాట వింటావా!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*282వ భాగము*

యెషయా గ్రంథము 49:22--26

22. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

24. బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా?

25. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

26. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి తిరిగివచ్చేక యెరుషలేము ఏవిధంగా ఆశ్చర్యపోతుంది, దేవుడు వారిని ఏ రకంగా సమకూర్చబోతున్నారు అనేది ద్యానం చేసుకుంటున్నాం!

23వ వచనంలో రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలు ఇచ్చే దాదులుగాను ఉంటారు! వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు! వారు నీ పాదాల ధూళి నాకుతారు! అప్పుడు నీవు నేను యెహోవానై ఉన్నానని నా కొరకు కనిపెట్టు వారు అవమానము నొందరని నువ్వు తెలుసుకుంటావు అంటున్నారు.

జెరుసలం ప్రియ నగరం అవుతుంది, దేశాలన్నిటికీ ప్రీతి పాత్రమౌతుంది – 2:2-4.

Isaiah(యెషయా గ్రంథము) 2:2,3,4,5

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

5. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.

ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది యెహోవా కొరకు కనిపెట్టు వారు అవమానం కొందరు పొందరు

జాగ్రత్తగా పరిశీలిస్తే షడ్రక్ మేషకు అభెద్నెగోలు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు రాజు అవమానించిన దేవుడు అవమానించలేదు. అగ్నిగుండంలోకి ఈ ముగ్గురితో దేవుడు కూడా దూకేసాడు! వారికి ఘనత తీసుకొచ్చాడు! ఈ విధముగా రక్షించే దేవుడు ఏ దేవుడు లేడు అన్నాడు రాజు! అంతకుముందు నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎవడైనా ఉన్నాడా అని గర్వించి పలికిన రాజు, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు రండి అంటూ, ఈ ముగ్గురి దేవుణ్ణి ఎవడు దూషిస్తాడో వాడి ఇల్లు పెంటకుప్పై పోతుందని శాసనం కూడా చేశాడు! అలాగే దానియేలు గారు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు వదల్లేదు, రాజు కల మర్చిపోయినప్పుడు చెప్పడం విషయంలో ఏమిటి, ఇంకా సింహాల బోనులో పడవేసినప్పుడు ఏమిటి, దేవుని కోసం కనిపెట్టినప్పుడు దానియేలు గారిని దేవుడు వదిలేయలేదు! అవమానం పాలు చెందనీయలేదు! దావీదు గారిని అవమానపడనీయలేదు! తన భక్తుల్ని ఎప్పుడూ తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడూ దేవుడు అవమానం పొందనీయడు అని మనం గ్రహించాలి.

ఇక తరువాత వచనాలలో బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొన గలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా?

25. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

ఇక్కడ బలాఢ్యుడు అనగా బబులోను రాజు అని గ్రహించాలి. 24-25 దేవుడు బందీలైన ఇస్రాయేల్‌వారిని విడిపించి వారి దేశానికి చేరుస్తాడు. శత్రువులు కొల్లగొట్టిన వారి సంపదను కూడా తిరిగి సమకూరుస్తాడు – 14:2 మొ।।.

యెషయా 14:2

జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

యెషయా 14:3

తమ్మును బాధించినవారిని ఏలుదురు.

యెషయా 14:4

నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

ఇక మరో ఆదరణ మాట: నీ పిల్లలను నేను రక్షించెదను...

కీర్తనలు 115:14

యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

కీర్తనలు 147:13

ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.

కీర్తనలు 147:14

నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే.

తరువాత నీతో పోరాడేవారితో నేనే పోరాడుతాను:

యెషయా 51:22

నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.

యెషయా 51:23

నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

ఆదికాండము 12:3

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

సంఖ్యాకాండము 23:7

అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

సంఖ్యాకాండము 23:8

ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

సంఖ్యాకాండము 23:11

అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.

ఇక చివరి వచనంలో అంటున్నారు నిన్ను బాధించేవాళ్ళను తమ శరీరాలను

తామే తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు వారి రక్తంతో వారు మత్తుగా ఉంటారు. అప్పుడు నేను యెహోవాను యాకోబు బలవంతుణ్ణి నీ రక్షకుణ్ణనీ నీ ముక్తిప్రదాతననీ మనుషులంతా తెలుసుకొంటారు.

ఇస్రాయేల్‌వారి శత్రువులు ఇస్రాయేల్‌ను ఎలా చేశారో దేవుడు ఆ శత్రువులకు అదే గతి పట్టిస్తాడు (విలాప 4:10).

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! దేవుని మీద అనుకో ! ఆయన మీద విశ్వాసం ఉంచు! ఆయనకు విధేయత చూపు! అప్పుడు నీకు సంపూర్ణ విజయం, నీ శత్రువులపై సంపూర్ణ విజయం కలుగుతుంది! అయితే ఆ విజయం నీకు కావాలా అయితే ఆయనపై ఆనుకోవడం నేర్చుకో!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*283వ భాగము*

యెషయా గ్రంథము 50:1--3, 10--11

1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

2. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

3. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను

10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

11. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 49వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 50వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో కూడా 4--9 వచనాలు అభిషక్తుని మొదటి రాకడ ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేసుకున్నాము కనుక మొదటి మూడు వచనాలు, చివరి రెండు వచనాలు ధ్యానం చేసుకుందాం!!!

మొదటి వచనంలో అంటున్నారు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

ప్రియులారా గత 49:15-26లో సీయోను ఒక తల్లి అయినట్టుగా దేవుడు ఆ నగరంతో మాట్లాడాడు. వ 17,18,20; 51:17-18 కూడా చూడండి. అయితే ఈ అధ్యాయంలో మొదటి మూడు వచనాలు, చివరి రెండు వచనాలలో దాని కొడుకులతో అనగా జెరూసలేం ప్రజలు, పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కొడుకులతో అంటే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెషయా కాలాన్ని దాటి వారు ప్రవాసం వెళ్ళే సమయాన్ని వర్తిస్తున్నాయి ఈ మాటలు. జెరుసలం, యూదా ప్రజలు దేశాంతరం వెళ్ళవలసి రావడం వారి దోషాల కారణంగానే గాని తాను కాదని దేవుడు చెప్తున్నాడు. తాను వారి తల్లి సీయోనుకు విడాకులు ఇవ్వలేదు (49:15-16 పోల్చి చూడండి). అయితే ఇస్రాయేల్‌వారి అనేక పాపాల కారణంగా తాత్కాలిక వియోగం మాత్రం ఏర్పడింది అంటున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 49:15,16

15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

16. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి

అయితే ఇక్కడ మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను అంటున్నారు. నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? అని అడుగుతున్నారు దేవుడు. మీ తల్లి చేసిన విగ్రహారాధన అనే జారత్వం వలననే మీ పరిత్యాగం అనగా విడాకులు తీసుకుంది. నేనైతే విడాకులు ఇవ్వలేదని అంటున్నారు.

ఇక రెండవ వచనంలో అంటున్నారు నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

వచ్చినప్పుడు” అనగా– ఆయన పదే పదే ఆ ప్రజల దగ్గరికి వచ్చాడు గాని ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదు.

యెషయా 64:7

నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

యిర్మియా 7:13

​నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

యిర్మియా 7:25

మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

యిర్మియా 25:3

ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.

యిర్మియా 25:4

మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయు టయు మాని,

యిర్మియా 25:5

మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీ పితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై,

యిర్మియా 25:6

​యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.

యిర్మియా 25:7

అయితేమీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

కాబట్టి నేను పిలిచినప్పుడు మీరు వినలేదు. నా దగ్గరకు రాలేదు.

జెకర్యా 7:13

కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను.

ఈ వచనంలో మరో ముఖ్యమైన మాట నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?!....

Isaiah(యెషయా గ్రంథము) 59:1,2,3,4,5,7

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

4. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

5. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.

7. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి ..

ఇక మూడవ వచనంలో నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

3. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను అంటున్నారు.

యెషయా 13:10

ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు.

యెషయా 13:11

లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

యోవేలు 2:10

వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.

యోవేలు 2:31

​యెహోవాయొక్క భయం కరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.

ప్రకటన గ్రంథం 6:12

ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,

ప్రకటన గ్రంథం 6:13

పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.

ప్రకటన గ్రంథం 6:14

మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

బైబిల్లో గోనెపట్ట దుఃఖానికి చిహ్నం (ఆది 37:34; ఎస్తేరు 4:1; కీర్తన 35:13).

ఇక చివరి వచనాలలో 10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

11. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.

ఇక్కడ ఆయన సేవకుడు అనగా యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన మాటలు విని ఆయనను ఆశ్రయించక తప్పదు అంటున్నారు.

నిప్పు లేదా అగ్ని అనగా”– దీనికి ఈ క్రింది రెండింటిలో ఏదో ఒక అర్థం ఉంది. అగ్నిలాగా మండే దుష్ట కార్యాలను తలపెట్టేవారికి ఇది సూచన కావచ్చు (9:18). లేక యేసుప్రభువు ఇచ్చే వెలుగును నిరాకరించి (42:6) తమ స్వంత వెలుగును కల్పించుకునేందుకు ప్రయత్నించేవారిని సూచించవచ్చు. ఇలా చేసేవారు చాలామంది. ఇలాంటివారిని ఆ పనికి దేవుడు వదిలిపెడతారు. ఏవిధంగా చూచుకున్నా ఇలాంటివారి అంతం ఆరిపోని మంటల్లో నరక యాతనే – మత్తయి 25:41; మార్కు 9:43; లూకా 16:24; ప్రకటన 20:15.

ప్రియ దేవుని జనమా! దేవుని మాటలు నిరాకరిస్తే అగ్ని గుండము తప్పదని జ్ఞాపకం చేసుకుని ఆయనమాటలు వాక్యం విని అవలంబించమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*284వ భాగము*

యెషయా గ్రంథము 51:1--4

1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి

2. మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.

3. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును

4. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియ మింతును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 50వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 51వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

మొదటి వచనంలో అంటున్నారు నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి.

రాబోయే బబులోను చెరను ఈ భాగం సూచిస్తున్నది. దేవుణ్ణి వెదికి (వ 1), జెరుసలంకు తిరిగి వచ్చేవారితో దేవుడు మాట్లాడుతున్నాడు (యిర్మీయా 29:10-14 పోల్చి చూడండి). వారు లెక్కకు కొద్దిమందే గాని, వారి జాతి మూలపురుషుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకొమ్మని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అతణ్ణి పిలిచినప్పుడు అతనికి సంతతి లేదు. అయితే తరువాతి కాలంలో ఇజ్రాయేల్ గొప్ప జనాంగం అయింది (ఆది 22:7; నిర్గమ 1:7). దేవుడు సీయోనును స్వర్గసీమగా మారుస్తానని మాట ఇచ్చాడు. అక్కడ అనేకులకు ఆనంద కారణం ఉంటుంది.

Jeremiah(యిర్మీయా) 29:10,11,12,13,14

10.​ యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సర ములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించు నట్లు నేను మిమ్మును దర్శింతును.

11.​ నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.

12.​ మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

13.​​ మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,

14.​ నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.

అయితే ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో అసలు మీ మూలం ఏంటో మర్చిపోవద్దు అంటున్నారు దేవుడు. ఈరోజు వాక్యం నేర్చుకున్నాక ప్రార్థన నేర్చుకున్నాక దైవ సేవకుడు పాతగిలిపోతున్నాడు. మా పాస్టర్ కి వాక్యం చెప్పడం రాదు, అదిగో ఆ సంఘంలో వర్షిప్ బాగా చేస్తారు, ఆ సంఘంలో పాస్టర్ పిట్టకదలు బాగా చెప్తారు. ఆ పాస్టర్ సైన్స్ బాగా చెప్తారు, వాక్యం బాగా చెప్తారు అంటూ ఈ సంఘం వదిలి ఆ సంఘం మారిపోతున్నారు. ఏ తండ్రి కన్నీరు కార్చి నీకోసం కష్టపడ్డారో ఆ తండ్రిని వదిలేసి ఇక్కడికి అక్కడికి వెళ్తున్నారు ప్రజలు! ఎక్కడ రక్షించబడ్డారో మర్చిపోతున్నారు! ఇదే వద్దు అంటున్నారు దేవుడు! అబ్రహాము గారి రక్షించుకొని, ఇస్సాకుగారు అక్కడినుండి యాకోబు గారిని ఏర్పరచుకుంటే వారిద్వారా ఇశ్రాయేలు జనాంగమును తనకు స్వాస్త్యముగా చేసుకున్నాక, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యెహోవాను వదిలేసి విగ్రహాలు వెనకాల బయలుదేవత వెనకాల అమ్మోనీయుల దేవత వెనకాల మోయాబీయుల దేవత వెనకాల తిరిగారు. అందుకే మీరు ఎక్కడి నుండి చెక్కబడ్డారో దాన్ని మర్చిపోవద్దు అంటున్నారు దేవుడు.

దీనిలో మరో అర్థం కూడా ఉంది ప్రియులారా! ఈరోజు యవ్వనస్తులు వారికి ఉద్యోగం వచ్చేక అసలు వాళ్ళు రక్షించబడకముందు వాళ్ళ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉండేవారు, వాళ్ళు ఏ స్థితిలో ఉండేవారో మర్చిపోయి, మనుషుల్ని మనుషులుగా చూడకుండా చాలా తక్కువగా చూస్తున్నారు! కాబట్టి మన మూలాలు ఎప్పుడూ మర్చిపోకూడదు! ప్రస్తుత రక్షించబడక ముందు మనస్థితి ఏమిటి, రక్షించబడిన తర్వాత ప్రస్తుతం స్థితి ఏమిటి? ఇలా మారడానికి ఇప్పటి ఆశీర్వాదానికి కారణం నీవు రక్షించబడ్డావు దేవుని రక్తంలో కడగబడ్డారు అని మర్చిపోయి కళ్ళు నెత్తి మీదకు వచ్చి ప్రవర్తిస్తున్నారు ప్రజలు!! ప్రియులారా మన మూలాలు మనం మర్చిపోకూడదని మనవి చేస్తున్నాను.

ఇంకా అంటున్నారు మీ పూర్వీకుడు అబ్రాహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కన్న శారాను ఆలోచించండి. నేను అబ్రాహామును పిలిచినప్పుడు అతడు ఒక్కడే.

అతణ్ణి దీవించి, అతణ్ణి అనేకులనుగా చేశాను. యెహోవా సీయోనును ఆదరించి తీరుతాడు. దాని పాడైన స్థలాలన్నిటినీ ఆదుకొంటాడు. దాని ఎడారి ప్రదేశాన్ని ఏదెను తోటలాగా చేస్తాడు. దాని ఎండిపోయిన ప్రాంతాన్ని ఆయన యెహోవా వనంలాగా చేస్తాడు. దానిలో ఆనందం, సంతోషం ఉంటాయి. కృతజ్ఞతావాక్కులు, సంగీతనాదం వినబడుతాయి. హల్లెలూయ! ఇదీ దేవుడు ఆశీర్వదిస్తే కలిగే ఫలితాలు!!!

ఇక నాలుగో వచనంలో అంటున్నారు నా ప్రజలారా, నేను చెప్పేది ఆలకించండి.

నా జనమా, నాకు చెవియొగ్గి వినండి. ఉపదేశం నానుంచి బయలుదేరుతుంది.

నా న్యాయం జనాలకు వెలుగుగా ఉండేలా చేస్తాను.

కేవలం జెరుసలంకు దీవెనే గాక మరింకేదో ఉద్దేశం దేవుని మనస్సులో ఉంది.

Isaiah(యెషయా గ్రంథము) 2:2,3,4

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

Isaiah(యెషయా గ్రంథము) 42:1,4

1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

4. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.

ఇక 5వ వచనంలో నా నీతి నిజాయితీ సమీపిస్తూ ఉన్నాయి. నా రక్షణ బయలుదేరివుంది. నా చేయి జనాలకు న్యాయం జరిగిస్తుంది. ద్వీపవాసులు నావైపు చూస్తూ నా చేతికోసం నమ్మకంతో ఎదురుచూస్తారు.

అవును ఆయనను నమ్ముకుని ఆయనమీద ఆనుకుని సాగిపోతే దేవుని నీతి మనకు పుష్కలంగా అబ్బుతుంది. అది నిన్ను పరలోకం చేరుస్తుంది. మరి ఆయన మీద అనుకుని ఆయన నీతిని పొందుకుందామా!!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*285వ భాగము*

యెషయా గ్రంథము 51:6--11

6. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

7. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

8. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును.

9. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

10. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

11. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఆరవ వచనం నుండి చూసుకుంటే ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు అంటున్నారు!!

చూడండి ఇక్కడ ఏమంటున్నారో దేవుడు ఆకాశాలవైపు తలెత్తి చూడండి.

క్రింద భూమిని చూడండి. ఆకాశాలు పొగలాగా అంతర్థానమౌతాయి. భూమి బట్టలాగా పాతగిలిపోతుంది. దాని నివాసులు అటు అనగా దోమలలాగా చచ్చిపోతారు. అయితే నా రక్షణ శాశ్వతంగా ఉంటుంది. నా నీతినిజాయితీకి అంతం అంటూ ఉండదు.

మరి ఇవి ఎప్పుడు జరుగబోతున్నాయి?!! అంత్య కాలంలో!

యెషయా 34:4

ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును.

Hebrews(హెబ్రీయులకు) 1:10,11,12

10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి

11. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

12. ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.

Hebrews(హెబ్రీయులకు) 12:25,26,27,28,29

25. మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.

26. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

27. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.

28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.

ఇక ప్రకటన గ్రంధంలో అంటున్నారు భూమి ఆకాశం నిలువనీడ లేక దేవుని సన్నిధి పారిపోబోతున్నాయి.

ఇక తరువాత వచనంలో అంటున్నారు: నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

చూడండి నీతినిజాయితీ అంటే ఏమిటో తెలిసినవారలారా, నేను చెప్పేది వినండి. నా ధర్మశాస్త్రం హృదయాలలో ఉంచుకొన్న మీరు ఆలకించండి. మనుషులు వేసే నిందలకు భయపడకండి. వాళ్ళ దూషణకు హడలిపోకండి.

నీతిని అనుసరించడం కోసం మొదటి వచనం ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాము!

ఇక హృదయంలో ధర్మశాస్త్రం ఉంచుకోవడం కోసం చూసుకుంటే ద్వితియోపదేశకాండము 6:6

నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.

ద్వితియోపదేశకాండము 6:7

నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.

కీర్తనలు 119:11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

కాబట్టి మీరు మనుషులు వేసే నిందలకు భయపడవద్దు అంటున్నారు.

– యజమానుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని వారు ద్వేషించి దూషించినప్పుడు (49:7; 50:6) సేవకులకు కూడా అదే గతి పట్టక తప్పుతుందా (మత్తయి 10:25; యోహాను 15:18-20).

యెషయా 49:7

ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

యెషయా 50:6

కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.

మత్తయి 5:10

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

మత్తయి 5:11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5:12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

మత్తయి 10:25

శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.

John(యోహాను సువార్త) 15:18,19,20,21

18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

20. దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల

21. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.

అయితే విశ్వాసులు భయపడేందుకు బదులు ఆనందంతో ఉప్పొంగిపోవచ్చు (వ 12; రోమ్ 5:3; 2 కొరింతు 12:10; 1 పేతురు 4:12-16).

12. నేను – నేనే – మిమ్మల్ని ఓదార్చేవాణ్ణి చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడుతున్నారు?

రోమీయులకు 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

రోమీయులకు 5:3

అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి

రోమీయులకు 5:4

శ్రమలయందును అతిశయపడుదము.

రోమీయులకు 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

2కోరింథీయులకు 12:10

నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

1 Peter(మొదటి పేతురు) 4:12,13,14,15,16

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగా నిందలు అవమానాలు శ్రమలు బాధలు సహించారు భరించారు. మనం కూడా ప్రభువు కోసం శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఊరికినే అపనిందలు కలిగినా, ఎన్ని వచ్చినా, దేవునిపై అనుకుని దానిని సంతోషంగా తీసుకుని భరిద్దాం! పరలోకమందు మన ఫలమును అధికం చేసుకుందాం!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*286వ భాగము*

యెషయా గ్రంథము 51:6--11

6. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

7. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

8. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును.

9. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

10. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

11. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఎనిమిదో వచనం చూసుకుంటే వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును అంటున్నారు.

చిమ్మట అనగా చెద. చెద వస్త్రాలను కొరికి తినేసేటట్లు, బొద్దింక గొర్రెబొచ్చును తినేసేటట్లు నాశనం దుష్టులను, దేవుని ప్రజలను బాధించేవారిని తినేస్తుంది అంటున్నారు. అయితే దేవుని నీతి న్యాయాలు నిత్యము నిలిచి ఉంటాయి అంటున్నారు.

యెషయా 50:9

ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.

కీర్తనలు 1:4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

మార్కు 9:48

నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.

ఇక 9--10 వచనాలలో యెషయా గారు ఆత్మావేషుడై దేవునికార్యాలను ఎత్తి చెబుతున్నారు

యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము! రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

10. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

ఇక్కడ దేవుని ఆత్మ వశుడై యెషయా గారు ఇప్పుడు న్యాయవంతుల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. దేవుడు గొప్ప దీవెనలిస్తానని మాట ఇచ్చారు. యెషయా గారు దాని నెరవేర్పు కోసం ప్రార్థిస్తూన్నారు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన ప్రజల తరఫున ఘనకార్యాలు చేసిన విధంగానే ఇప్పుడూ చెయ్యాలి (నిర్గమ 14:21-31).

Exodus(నిర్గమకాండము) 14:21,22,23,24,25,26,27,28,29,30,31

21. మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

23. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

25. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

26. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీది కిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.

27. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.

28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి.

31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్య మును ఇశ్రాయేలీ యులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

ఇక్కడ మరో వింతైన మాట కనిపిస్తుంది: రాహాబుని తుత్తినీయులుగా నరికినవాడవు నీవే!

ఇక్కడ రాహాబు అనగా యెహోషువ గ్రంథం లో కనబడే రాహాబు అనే వేశ్య కాదండి. మిగతా చోట్ల ఇదే పదాన్ని రహబు అని వాడారు. హెబ్రీలో రాఖాబ్ అని పలుకుతారు. రహబు అనగా ఈజిప్టు కి వాడిన విశేషణం, సర్వనామం!. నైలునదిలో పడుకున్న మకరము కూడా ఇదే!

యోబు 9:13

దేవుని కోపము చల్లారదు రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

రాహాబు అనేమాట హీబ్రూ బైబిల్లో ఆరుసార్లు కన్పిస్తుంది. ఈ మాటకు మూలార్థం “గర్వం”. కొన్ని సార్లు ఈ మాటను ఈజిప్ట్‌కు సూచనగా వాడడం జరిగింది (కీర్తన 87:4). ఇక్కడ యోబుగారు ఈజిప్ట్‌ను గురించే మాట్లాడుతూవుండి ఉండవచ్చు. అలా కాని పక్షంలో దీని అర్థమేమిటో అంత స్పష్టంగా లేదు. కొందరు పండితులు ఊహించినట్టుగా ఇక్కడ సముద్రం ఒక గర్విష్ఠి అయిన సముద్ర జంతువులాగా చెలరేగడం గురించి యోబు మాట్లాడుతున్నాడేమో. అయితే ఈ మాటకూ యెహోషువ గ్రంథంలో కనిపించే వేశ్య రాహాబు పేరుకూ ఏ సంబంధమూ లేదు. హీబ్రూలో ఆమె పేరు ఉచ్చారణ వేరుగా ఉంటుంది. దాదాపు “రాఖాబ్” అని ఉచ్చరిస్తారు.

సరే ఈజిప్ట్ ని, గర్విష్టులను ఏవిధంగా అనిచావో ప్రభువా ఇప్పుడు అలా లేచి మా విరోధులను అణచమంటున్నారు దేవున్ని యెషయా గారు!!!

ఇక అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

ఇది కూడా మీదన చెప్పిన రిఫరెన్స్ లో ఎర్ర సముద్రమును దేవుడు పాయలుచేసి ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు దేవుడు. అంతేకాకుండా యెహోషువ గారి కాలంలో యోర్దాను నదిని కూడా ఆపి ఆరిన నేలను నడిపించారు.

Joshua(యెహొషువ) 3:13,14,15,16,17

13. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.

14. కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందస మును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.

15.​ అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే

16.​​ పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

17. జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిర ముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

ఇక తరువాత వచనంలో అంటున్నారు యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

35వ అధ్యాయంలో అంటున్నారు

Isaiah(యెషయా గ్రంథము) 35:8,9,10

8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

9. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

చూడండి పరిశుద్ధులు యెహోవా విమోచించిన వారు మాత్రమే అందులో అనగా పరలోకములో మరియు వెయ్యేళ్ల పాలనలో పాలు పొందగలరు. మరి నీవు అందుకు సిద్దంగా ఉన్నావా?! పవిత్ర మైన పరిశుద్ధ జీవితం, సాక్షార్ధమైన వాక్యానుసారమైన జీవితం ఉందా?!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*287వ భాగము*

యెషయా గ్రంథము 51:6--11

6. ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.

7. నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

8. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును.

9. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

10. అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

11. యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇంకా ముందుకు వెళ్లే ముందు ఈ 51 వ అధ్యాయము ఇంతవరకు ఇశ్రాయేలీయుల కోణంలో చూసుకున్నాము. ఇక ఈరోజు ఒకటి నుంచి 11 వచనాల వరకు నూతన నిబంధన సంఘపు కోణంలో కూడా కొద్దిగా ధ్యానం చేసుకుందాం!

మొదటి వచనములో నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ వుండు వారలారా! నా మాట వినండి! మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించండి! ఏ గుంట నుండి తవ్వబడితిరో ఆలోచించండి !

ఇక్కడ నీతిని అనుసరించి యెహోవాను వెతుకుతూ ఉండేవారు నూతన నిబంధన సంఘములో రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధాత్మను పొందుకున్న విశ్వాసులు, నిత్యము యెహోవాను అనగా దేవుని వెతుకుతూ ఆయన సన్నిధిని అనుభవించేవారు! నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో ఆలోచించండి! ఆ బండ క్రీస్తు అనే బండమీద కట్టబడుచున్న నూతన నిబంధన సంఘము అపొస్తలుల పునాది మీద అది కట్టబడుతుంది! అయితే మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో ఆలోచించండి! ఇది మరొక రకంగా చూసుకుంటే నూతన నిబంధన సంఘము లో ఉన్న ప్రతి ఒక్కరూ గుంట అనగా పాపపు గుంట, నాశనకరమైన పాతాలపు గుంటలో పడి నరకానికి పోతున్నారు, అయితే క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి వారు పాపపు గుంట నుండి, బండమీద అనగా క్రీస్తు అనే బండ మీదకు వచ్చారు!

మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి! మీ తల్లి శారాను ఆలోచించండి! అబ్రహాము సంగతి అబ్రహాము ఒకానొకప్పుడు విగ్రహారాధికుడు కానీ దేవుడు ఆ వ్యక్తిని లేపుకొని విశ్వాసులకే తండ్రిగా చేశారు దేవుడు! మిమ్మును కన్న శారా ఆలోచించండి ! ఆమె కూడా గొడ్రాలు, దేవుడు రాజకుమారిగా చేశారు!

అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు జనాంగాన్ని వారి ద్వారా చేశారు! అలాగే ఈ లోకంలో ఒంటరిగా ఉన్న మనల్ని దేవుడు అబ్రహాము ఇస్సాకులకున్న విశ్వాసం ద్వారా మనల్ని పిలుచుకుని విశ్వాసానికి వారసులుగా చేసి పరలోకానికి వారసులుగా చేశారు! నాశనకరమైన గుంటలో మగ్గిపోతున్న మనల్ని పైకి లేపి క్రీస్తు అనే బండమీద కట్టారు!

యెహోవా సీయోను పాడైన స్థలాన్ని కడుతున్నాడు ఆదరిస్తున్నాడు అలాగే పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేసి మన విశ్వాస జీవితాన్ని ఆయన కడుతున్నారు! తిరిగి కట్టి వాక్యముతో ఉదక స్నానం చేసి అపోస్తుల బోధతో మెల్కీసెదకు క్రమంలో తిరిగి తనతో సమాధానపరుచుకున్నాడు ఆయన! చివరికి తన ఆత్మతో నింపి సీయోను అనుభవానికి తీసుకెళ్లాడు! ఉన్నతమైన ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్లి ఆధ్యాత్మిక ఫలములను అనుభవించే యోగ్యత దేవుడు మనకి దయ చేశారు!

ఇక అరణ్య స్థలాలను ఏదెను వనంగా చేస్తున్నారు అనగా ఏదేను తోట దేవుని చేత చేయబడింది మహిమ కరమైనది! ఆ మహిమగల అనుభవాన్ని ఆధ్యాత్మిక స్థితిని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆదాము గారు అవ్వమ్మ గారు కోల్పోయారు! మనం కోల్పోయాము! అయితే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మనము సీయోను అనుభవానికి వచ్చిన తర్వాత, తిరిగి ఆ మహిమను పొందుకోవడానికి అర్హులు చేసింది కృప! మెల్కీసెదకు క్రమము అపోస్తుల బోధ! కాబట్టి వాటిని తిరిగి పొందుకొని కృప వెంబడి కృప పొందుకొనే అర్హత దేవుడు మనకు ఇచ్చారు!

ఎడారి వంటి జీవితం అనగా నీరు లేని జీవితము దేవుడు అంటే తెలియని జీవితము నుండి ఏదేను లాంటి మహిమగల జీవితముగా ఆయన మార్చారు నూతన నిబంధన సంఘములో! ఇది కేవలం సీయోను అనుభవం కలిగిన వారికి మాత్రమే సాధ్యం. నూతన నిబంధన సంఘంలో సీయోను అనుభవం ఎవరైతే కలిగా ఉన్నారో వారికి దేవుడు ఏదెన్ తోటలో ఆదాము అవ్వగారు పోగొట్టుకున్న ఏ మహిమ పోగొట్టుకున్నారో తిరిగి ఆ సీయోను అనుభవాన్ని దేవుడు నూతన నిబంధన సంఘములో విశ్వాసికి దేవుడు ఇచ్చారు!

ఇక ఆనంద సంతోషములు కృతజ్ఞతా స్తుతి సంగీత నాదము దాన్లో కనపడుతుంది. నా ప్రజలారా నా బోధ వినండి! జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిస్తాను నా నీతి సమీపముగా ఉన్నది! అనగా ఆ నీతి ఆయన వాక్యమే! ఆయన బోధన వినినప్పుడు ప్రజలు యొక్క జీవితాలు వెలుగుతో నింపబడి వెలుగు కలుగుతాయి! పాపపు అంధకారంలో ఉన్న జీవితాలు వాక్యపు వెలుగులో వచ్చినప్పుడు వారి బ్రతుకులు మారి, జీవితములో నిజమైన వెలుగుతో ప్రకాశిస్తారు! నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆ వాక్యపు వెలుగులో ప్రజలు నడపగలరు!

ఉపదేశం కోసం చూసుకుంటే నూతన నిబంధన సంఘంలో ఉన్నవారికి అపొస్తలుల బోధనా క్రమమే ఆ ఉపదేశము అని అర్థమవుతుంది! మెల్కీసెదకు క్రమంలో వారు సాగుతున్నప్పుడు నిజమైన ఉపదేశము నిజమైన బోధను గ్రహించి మన ఏకైక ప్రధాన యాజకుడైన క్రీస్తుని అనుసరిస్తూ పరలోకము చేరడం జరుగుతుంది!

ఇక ఆరో వచనంలో ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి, క్రింద భూమిని చూడు అంతరిక్షం పొగవలె అంతర్దానమగును. భూమి వస్త్రం వలె పాతగిలిపోవును. అందరినివాసులు అటువలె అనగా దోమలు వలె చనిపోతారు. నా రక్షణ నిత్యము ఉంటుంది.

దీనికోసం ఆలోచిస్తే నూతన నిబంధన సంఘము మహా శ్రమల కాలంలో ఉండకుండా ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో ఆకాశం వైపు కన్నులెత్తితే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధి కనిపిస్తుంది! కింద భూమిని చూస్తే అది ఎంతో భయంకరంగా ఉంటుంది! అంతరిక్షం పొగమంచు లా అంతర్ధానమైపోతుంది. దేవుని సువార్త మాయమైపోతుంది. భూమి పాతగిలిపోయి మహాశ్రమల కాలంలో తర్వాత యెహోవా దినముకి భూమి సంపూర్ణంగా పాడైపోతుంది. కాలిపోబోతుంది భూమి! పేతురు గారు చెప్తున్నారు. భూమి ఆకాశాలు లయమై పోబోతున్నాయి! పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయము అయిపోతాయి. కాలిపోతాయి! దాన్నే చెప్తున్నారు అయితే సంఘం అయితే మధ్యాకాశంలో పెండ్లి కుమారుడైన క్రీస్తుతో విందును అనుభవిస్తుంది!

కాబట్టి ఏడవ వచనం నా నీతిని అనుసరించి వారలారా నా బోధన హృదయమందు ఉంచుకున్న వారలారా! అనగా దేవుని నీతిని సీయోను అనుభవం గల వారలారా నా బోధ అనగా అపొస్తలుల బోధనను హృదయమందు ఉంచుకున్న వారలారా! దాని పాటిస్తున్న వారలారా! ఆలకించండి! మీరు ఎప్పుడైతే ఈ బోధ అపోస్తుల బోధలో ఉంటే మనుషులు పెట్టే శ్రమలకు భయపడొద్దు! వారి మాటలకు దూషణలకు దిగులు పడొద్దు! వారైతే నాశనం అయిపోతారు! ఎలాగంటే బొద్దింక గొర్రె బొచ్చుని కొరుకున్నట్లు వస్త్రము చెదవలన పాడైపోయినట్లు వాళ్ళు పాడైపోతారు! అయితే నా నీతి చిరకాలం ఉంటుంది అంటున్నారు!

ఇక యెహోవా బాహువు రహాబును తుత్తునియలుగా నరికి వేసిన వాడవు నీవే! ఎటువంటి కష్టములు వచ్చినా నూతన నిబంధన సంఘంను పాడు చేయలేవు! ఎన్ని కష్టాలు వచ్చినా ఐగుప్తుని దేవుడు సర్వనాశనం చేసినట్లు అసాధారణ అద్భుతాలు చేసి ఐగుప్తును నాశనము చేసినట్లు, నూతన నిబంధన సంఘమునకు వ్యతిరేకంగా వచ్చిన ఎవరైనా సరే వారు నిత్య నాశనం అయిపోతారు!

యెహోవా విమోచించిన వారు అయితే అనగా నూతన నిబంధన సంఘపు వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వస్తారు! పరలోకాన్ని చేరుకుంటారు! నిత్య సంతోషం వారి తలల మీద ఆశీర్వాదము అభిషేకము ఉంటుంది! వారు సంతోషా ఆనందముగలవారవుతారు! దుఃఖము నిట్టూర్పు ఉండదు, పరలోకంలో అక్కడ దుఃఖమైనను నిట్టూరుపైనను ఆకలైనను ఉండదు! ఎందుకంటే నేనే 12 వ వచనం నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను! కాబట్టి చనిపోయే నరుడికి భయపడొద్దు ఓ సంఘమా! నామీద ఆనుకో అంటున్నారు దేవుడు నూతన నిబంధన సంఘముతో!

నూతన నిబంధన సంఘములో అంగమైన విశ్వాసి! ఓ దైవ సేవకుడా! మెల్కీసెదెకు క్రమంలో అపొస్తలుల బోధ మీద కట్టబడుతున్న ఓ సంఘమా! అదే క్రమంలో సాగిపో ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని శ్రమలైన బాధలైనా! దేవుడు ఒకరోజు నీ మీద నిత్యానందం ఉండేలాగా ఆయన అభిషేకిస్తున్నారు!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*288వ భాగము*

యెషయా గ్రంథము 51:12--16

12. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

13. బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

14. క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.

15. నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

16. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 12వ వచనం నుండి అంటున్నారు 12. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

13. బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

పన్నెండవ వచనం నుండి చివరి వరకు దేవుడు మరలా మాట్లాడుతున్నారు. నేను – నేనే – మిమ్మల్ని ఓదార్చేవాణ్ణి చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడుతున్నారు?

యెషయా 40:2

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 49:13

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

ఇక తరువాత ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన నీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న హింసకుల కోపానికి ఎడతెగకుండా ప్రతిరోజూ మీరెందుకు భయపడుతున్నారు? హింసకుల కోపం ఏమయింది? అని అడుగుతున్నారు.

దేవుని ప్రజలు మనుషులకు భయపడ్డారంటే వారు దేవుడిచ్చే ఓదార్పునూ, ఆయన బలప్రభావాలనూ మరచిపోవచ్చు. ఇంకా దేవుని బలాన్ని నిజానికి వారు పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం!! కాబట్టి ప్రజలకు భయపడవద్దు అంటున్నారు. నూతన నిబంధన సంఘమా నీవుకూడా ప్రజలకు భయపడవద్దు. మరి ఎవరికి భయపడాలి?

మత్తయి 10:26

కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

మత్తయి 10:28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

ఇక తరువాత వచనంలో క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు.

రాబోయే బబులోను చెరను ఈ భాగం సూచిస్తున్నది. దేవుణ్ణి వెదికి (వ 1), జెరుసలంకు తిరిగి వచ్చేవారితో దేవుడు మాట్లాడుతున్నాడు (యిర్మీయా 29:10-14 పోల్చి చూడండి). వారు లెక్కకు కొద్దిమందే గాని, వారి జాతి మూలపురుషుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకొమ్మని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అతణ్ణి పిలిచినప్పుడు అతనికి సంతతి లేదు. అయితే తరువాతి కాలంలో ఇస్రాయేల్ గొప్ప ప్రజ అయింది (ఆది 22:7; నిర్గమ 1:7). దేవుడు సీయోనును స్వర్గసీమగా మారుస్తానని మాట ఇచ్చాడు. అక్కడ అనేకులకు ఆనంద కారణం ఉంటుంది.

తరువాత వచనంలో 15. నేను నీ దేవుడనైన యెహోవాను సముద్రముయొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

16. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను.

నేను యెహోవాను, నీ దేవుణ్ణి. దాని అలలు ఘోషించేలా సముద్రాన్ని రేపేవాణ్ణి నేనే.

నా పేరు సేనలప్రభువు యెహోవా. నేను ఆకాశాలను సుస్థిరం చేసినవాణ్ణి. భూమి పునాదులు వేసినవాణ్ణి. నా ప్రజలు నీవేయని సీయోనుతో చెప్పాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను అంటున్నారు!!

సముద్రం కోసం చూసుకుంటే..... యోబు 26:12; కీర్తన 107:24-25; యిర్మీయా 31:35.

యోబు 26:12

తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.

Psalms(కీర్తనల గ్రంథము) 107:24,25,26,27,28,29,30,31

24. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.

25. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

26. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

27. మత్తులైన వారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.

28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను.

29. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

30. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.

31 .ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

యిర్మియా 31:35

​పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

ఇంతగొప్ప దేవుడు తన బలముతో సముద్రాన్ని రేపుతున్నారు అలాగైతే బబులోను గాని, దేవుని ప్రజల శత్రువులెవరైనా గాని ఆయనకు ఎదురు నిలవగలరా?

ఇక తరువాత వచనంలో నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను అంటున్నారు!

Isaiah(యెషయా గ్రంథము) 41:8,9,10,11,12,13,14

8. నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9. భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా,

10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

11. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందె దరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు

12. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

13. నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.

14. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

Isaiah(యెషయా గ్రంథము) 43:1,2,14,15,16,17

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

14. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.

15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.

16. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

17. రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.

Isaiah(యెషయా గ్రంథము) 44:1,2,21,22

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

21. యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

22. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

ఇక నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పాను.”

మన నోట దేవుని మాటలు పెట్టేది దేవుడే!

Exodus(నిర్గమకాండము) 4:11,12

11. యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

12. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

యిర్మియా 1:9

అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను.

యిర్మియా 1:10

పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్య ములమీదను నిన్ను నియమించియున్నాను.

ఇక చేతినీడలో భద్రత ఉన్నదన్నమాట ఖాయం.

యెషయా 49:2

నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

Psalms(కీర్తనల గ్రంథము) 91:1,2,3,4,5,6,7

1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

2. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.

3. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

5. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను

6. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.

7. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.

ఈ విధంగా ఇస్రాయేలీయులని కట్టి ఇస్రాయిలీల ఆదరిస్తున్నాడు దేవుడు నూతన నిబంధన సంఘమా నిన్ను కూడా కట్టి నిన్ను ఆదరించబోతున్నాడు దేవుడు. మరి ఆయన మాటలు వింటావా ఆయన మీద అనుకుంటావా!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*289వ భాగము*

యెషయా గ్రంథము 51:17--23

17. యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

18. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయిపట్టుకొనువాడెవడును లేకపోయెను.

19. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.

20. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

21.ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము.

22. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.

23. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17వ వచనంలో అంటున్నారు యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము!!!

17-23 వచనాలు: ఈ వచనాలు యెషయా గారి జీవిత కాలాన్ని దాటిపోయి ఉన్నాయి. జెరుసలం దాని దుర్మార్గత మూలంగా దేవుని కోపమనే పాత్రలోనిది త్రాగాలి. ఈ పాత్ర ధ్వంసం, నాశనం, కరవు, ఖడ్గం (వ 19). వీటికి శత్రు సైన్యాలు కారణం. జెరుసలం అనుభవించిన శిక్ష అంతవరకు చాలు అని దేవుడు నిర్ణయించాక ఆయన దానిని ఓదార్చి, దాని శత్రువులు ఆ కోప పాత్రలోనిది త్రాగేలా చేస్తాడు.

“క్రోధపాత్ర” అనగా దేవుని శిక్ష-- గురించి

యిర్మీయా 25:15-29;

15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.

16. వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.

17. అంతట యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.

18. నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.

19.​ మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును

20.​ సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజాయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును

21. ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును

22. తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును

23. దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొను వారందరును

24. అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును

25. జిమీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును

26. సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.

27. నీవు వారితో ఈలాగు చెప్పుము ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడుదురు.

28. మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

29. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

యెహె 23:31-34;

31. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను.

32. అందులో పానము చేయవలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.

33. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.

34. అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

ఇక తరువాత వచనంలో

జెకర్యా 12:2

నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

యోహాను 18:11

ఆ దాసునిపేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

ప్రకటన గ్రంథం 14:10

ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

ఇక తరువాత వచనంలో ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయి పట్టుకొనువాడెవడును లేకపోయెను.

ఆమె కన్న కొడుకులందరిలో ఆమెకు దారిచూపేవాడు ఎవ్వడూ లేడు

యెషయా 64:7

నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొను వాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

యిర్మియా 5:1

యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.

యెహేజ్కేలు 22:30

నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

యెహేజ్కేలు 22:31

కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

తరువాత వచనంలో ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 40:1,2

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

ఇంకా అంటున్నారు  నీ కొడుకులు మూర్ఛపోయారు. అన్ని వీధుల చివరలలో వారు పడి ఉన్నారు. వలలో చిక్కుపడ్డ జింకలలాగా ఉన్నారు. యెహోవా కోపంతో, నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు. అందుచేత, ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడేదానా, ఈ మాట విను అంటున్నారు!

ఇక్కడ బాధపడేదానా– అంటే జెరుసలం అని అర్థం!! ఇక నీవు బాధపడకు అంటున్నారు!

తరువాత వచనంలో 22. నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు.

23. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

చూడండి ఏమంటున్నారో నీ ప్రభువైన యెహోవా, తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు చెప్పేదేమిటంటే, “ఇదిగో, నిన్ను తూలేందుకు చేసే పాత్రను, నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. దానిలోది నీవింకా ఎన్నడూ త్రాగవు.

 నిన్ను బాధించేవాళ్ళ చేతిలోనే దానిని ఉంచుతాను. ‘మేము నీమీద నడిచిపోతాం – సాష్టాంగపడు’ అని వాళ్ళు చెప్పారు. నీవు వాళ్ళకు నీ వీపును నేలకు వంచి వీధిలాగా

దానిమీద వారిని దాటిపోనిచ్చావు. నేను వాళ్ళే ఆ పాత్రలోది త్రాగేలా చేస్తాను.”

ప్రజల పక్షాన వాదించే వాడు–

యెషయా 49:25

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

యెషయా 49:26

యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

జెకర్యా 14:3

అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

ఈ చివరి వాక్యాన్ని చూడండి. జెరుసలంను బబులోనువారు ఆక్రమించుకునే సమయాన్ని దాటిపోయి ఏదో తరువాతి కాలాన్ని ఈ భాగం సూచిస్తున్నదని భావించేందుకు ఇది రుజువు. ఎందుకంటే ఆ తరువాత కూడా మరోసారి జెరుసలం దేవుని కోప పాత్రలోనిది త్రాగవలసి వచ్చింది (లూకా 19:41-44; 1 తెస్స 2:16). అంతేగాక దాన్ని శత్రువులు త్రాగవలసిన ఒక పాత్రలాగా అది దేవుని చేతిలో ఉంటుంది (జెకర్యా 12:2).

తరువాత ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్ను బాధించేవాళ్ళ చేతిలోనే దానిని ఉంచుతాను.

‘మేము నీమీద నడిచిపోతాం – సాష్టాంగపడు’ అని వాళ్ళు చెప్పారు.

నీవు వాళ్ళకు నీ వీపును నేలకు వంచి వీధిలాగా దానిమీద వారిని దాటిపోనిచ్చావు.

నేను వాళ్ళే ఆ పాత్రలోది త్రాగేలా చేస్తాను.”

ఇక్కడ మేము నీమీద నడిచిపోతాం – సాష్టాంగపడు’ అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఎవరూ?! వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు, జెరూసలేం ప్రజలు, తిరుగుబాటు చేసిన వారు, పాపము చేసిన వారు!!!

నీవు వాళ్ళకు నీ వీపును నేలకు వంచి వీధిలాగా దానిమీద వారిని దాటిపోనిచ్చావు. ఇక్కడ నీవు అనగా ఎవరు?! ఇశ్రాయేలు ప్రజలు కాదు ప్రియులారా!!!

ఇక్కడ నీవు అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రియులారా!!!

దేనిని దాటిపోయారు?! నూతన నిబంధన సంఘములో చేరిన ప్రతివారికోసం ఇంకా సమస్త జనుల కోసం వారు పాపకూపం లేక సాతాను బంధకాలలో ఉండగా యేసుక్రీస్తు ప్రభులవారు పాపిష్టి ప్రజలకు పరలోకానికి అనగా మానవులకు దేవునికి మధ్యవర్తిగా మన పాపములకు ప్రాయశ్చితము తానే చెల్లించి మనకు బదులుగా తానే బలైపోయి తన వీపు మీదుగా ప్రజలను పాపకూపమనే నరకమును దాటించే బ్రిడ్జ్ గా మారిపోయారాయన!!!

మరి ఆయన నీకోసం తన రక్తమును కార్చి తనవీపును నరకాన్ని తప్పించే బ్రిడ్జ్ గా చేశారు కదా మరి నీవు ప్రభువుకోసం ఏమి చేశావు?! కనీసం నీవు పొందుకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేక కేవలం ఒక సిగరెట్ కోసం, త్రాగుడు కోసం, అబద్దాలు కోసం, వ్యభిచారం కోసం, సినిమా సీరియల్స్ కోసం ఆ రక్షణను అమ్ముకుంటున్నావా లేదా తాకట్టు పెట్టేస్తున్నావా!!!

సరిచూసుకో!

సరిచేసుకో!

లేకపోతే శిక్షను తప్పించుకోలేవని తెలుసుకో!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*290వ భాగము*

యెషయా గ్రంథము 52:1--6

1. సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

2. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.

3. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

4. దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.

5. నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

6. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన మున తెలిసికొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 51వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 52వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!!

మొదటి వచనంలో సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

2. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.

1-2 వచనాలు: శత్రువుల చేజిక్కి, బానిసత్వంలో మ్రగ్గుతూ, ధూళిలో పడివున్న జెరుసలంకు తిరిగి స్వతంత్రత లభిస్తుంది. అది తిరిగి లేస్తుంది.

యెషయా 2:2

అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

Isaiah(యెషయా గ్రంథము) 49:13,14,15,22,23

13. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

14. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

22. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయి యెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

అందుకే సీయోనూ! మేల్కో! నీ బలం తొడుక్కో! జెరుసలం! పవిత్ర నగరమా! నీ అందమైన వస్త్రాలను ధరించుకో అంటున్నారు.

ఇక తరువాత వచనంలో దుమ్ము దులుపుకో, జెరుసలం! లేచి కూర్చో. బందీవైన సీయోను కుమారీ! నీ మెడకట్లు విప్పివేసుకో అంటున్నారు!

ధూళి దులుపుకోవడం అనగా అనేక రోజులనుండి తన బట్టలను ఉదుకుకోలేదు. దులుపుకోలేదు. ఇప్పుడు విడుదల వచ్చింది కాబట్టి ధూళి దులుపుకో అంటున్నారు! ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలి!

ఇక మెడకట్లు అనగా బంధకాలు ఇంతవరకు బంధకారలో ఉండి నిన్ను తిరిగి స్వదేశానికి వెళ్లకుండా నీ మెడలో వేసిన ఆ బంధకము ఆ గొలుసు ఇప్పుడు విప్పేసుకో నీకు విడుదల వచ్చింది కాబట్టి బయలుదేరి వెళ్ళమంటున్నారు ఇక్కడ!

ఇంకా నీ అందమైన వస్త్రాలను ధరించుకో అంటున్నారు

యెషయా 4:4

తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

యెషయా 4:5

సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

యెషయా 49:18

కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 61:10

శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది

ఇక నూతన నిబంధన సంఘము కోణంలో చూసుకుంటే నీ వస్త్రములు ధరించుకో అనగానే రక్షణ వస్త్రాన్ని ధరించి ఇంతవరకు రక్షణ లేకుండా పాపంలో బంధకాల్లో సాతాను కూపంలో ఉన్నావు, దేవుడు నిన్ను విడుదల చేశాడు కాబట్టి నీ రక్షణ వస్త్రము ధరించుకో అంటున్నారు! ఇంకా ప్రకటన గ్రంథం ప్రకారం అయితే ఆ వస్త్రాలు ఏమిటంటే పరిశుద్ధుల నీతి క్రియలు! పరిశుద్ధమైన నీతి క్రియలనే వస్త్రముగా ధరించుకో అంటున్నాడు ఇక్కడ!

సున్నతి పొందనివాడు అనగా బాప్తిస్మము పొందనివాడు. మనస్సులో సున్నతిలేనివాడు. దూళి దులుపుకోవడం అనగా శుధ్దీకరణ చేసుకోమని వాక్యం ద్వారా, ప్రార్థన పశ్చాత్తాపం ద్వారా పాపములను కడుగుకోవడం!!

ఇక తరువాత వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

తన యెరూషలేము నగరాన్ని వశపరచుకొనేందుకు శత్రు సైన్యాలను రప్పించడం ద్వారా దేవునికి ఏమీ లాభం కలగలేదు. పైగా అది దుఃఖాన్నీ, బాధనూ మాత్రమే ఆయనకు కలిగించింది. తన ప్రజలను చెరనుంచి విడిపించి తిరిగి జెరుసలంకు తెచ్చేందుకు ఆయనకేమీ డబ్బు ఖర్చు కాదు. దీనికి ఆధ్యాత్మిక వివరణ ఒకటి – తన ప్రజలను పాపంనుండి విముక్తుల్ని చేసి తన దగ్గరికి తిరిగి రప్పించుకొనేందుకు దేవుడు చెల్లించవలసివచ్చిన వెల ఎలాంటిదో తరువాతి అధ్యాయంలో అనగా 53వ అధ్యాయంలో చూడగలం.

1 పేతురు 1:18-19

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

తరువాత వచనాలలో దేవుడైన యెహోవా అనుకొనుచున్న దేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను.

5. నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

చూడండి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మొదట నా ప్రజలు ఈజిప్ట్కు కొంతకాలం కాపురముండడానికి వెళ్ళారు. ఇటీవల అష్షూరు నిష్కారణంగా వారిని బాధించింది. నా ప్రజలను ఊరకే తీసుకుపోవడం జరిగింది. వారిమీద అధికారం చేసేవాళ్ళు విజయ ధ్వనులు చేస్తున్నారు. ఇది యెహోవా వాక్కు. రోజంతా ఎడతెరపి లేకుండా నా పేరును అవమానించడం జరుగుతూ ఉంది.

ఆదికాండము 46:6

వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.

ఆదికాండము 46:7

అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.

Exodus(నిర్గమకాండము) 1:7,8,9,10,11,12,13,14

7. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.

8. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.

9. అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.

10. వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.

11. కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.

13. ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;

14. వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

ఈవిధంగా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల ను బాధపెట్టారు

ఇక అష్షూరు వారు Isaiah(యెషయా గ్రంథము) 8:5,6,7,8

5. మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను

6. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.

Isaiah(యెషయా గ్రంథము) 10:5,6,7,11,12

5. అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

6. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.

7. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.

11. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను.

12. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.

ఇక తరువాత నా ప్రజలను ఊరకే తీసుకుపోవడం జరిగింది. వారిమీద అధికారం చేసేవాళ్ళు విజయ ధ్వనులు చేస్తున్నారు. ఇది యెహోవా వాక్కు. రోజంతా ఎడతెరపి లేకుండా నా పేరును అవమానించడం జరుగుతూ ఉంది. 6 గనుక ఇక్కడ నాకు ఏముంది? ఇది యెహోవా వాక్కు. నా ప్రజలు నా పేరును తెలుసుకొంటారు. ‘నేను ఇక్కడే ఉన్నాను’ అని చెప్పేది నేనే అని ఆ రోజున వారు తెలుసుకొంటారు.”

దేవుడు బబులోను చెర గురించో లేక అటు తరువాత చాలా కాలానికి రాబోయే చెర గురించో మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు.

అనుమానించడం” అనగా– రోమ్ 2:24. ఇస్రాయేల్‌వారి శత్రువులు ఇస్రాయేల్‌ను ఓడించి అణగద్రొక్కగలిగారు గనుక ఇస్రాయేల్‌వారి దేవుడు దుర్బలుడని, తన ప్రజలను ఆదుకోలేని వాడనీ వారు భావించారు యెషయా 37:23-24 ప్రకారం. యెహె 36:20-23 కూడా చూడండి. నిజ దేవుని ఆరాధకులం అని చెప్పుకుంటూ పాపిష్టి జీవితం గడిపేవారు దేవుని పేరుకు అవమానం తెస్తున్నారని మనం నేర్చుకోవాలి!!!

తెలుసుకొంటారు అనగా”– దేవుని పేరును తెలుసుకోవడమంటే ఆయన స్వభావాన్నీ, లక్షణాలనూ అంటే దేవుణ్ణే తెలుసుకోవడం. ఇస్రాయేల్ ఒకనాటికి తెలుసుకుంటారు!

కాబట్టి నిజ దేవుని ఆరాధకులం అని చెప్పుకుంటూ పాపిష్టి జీవితం గడిపుతున్నావా?! అయితే నీవు దేవుని పేరుకు అవమానం తెస్తున్నావని మర్చిపోకు! తద్వారా నీమీదికి నీవే శాపం తెచ్చుకుంటున్నావని మర్చిపోవద్దు!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*291వ భాగము*

యెషయా గ్రంథము 52:7--12

7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

8. ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

9. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను.

10. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

11. పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 52వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 7వ వచనంలో అంటున్నారు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

ప్రియులారా సువార్త కోసం ఇదే శీర్షికలో చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం కాబట్టి ముందుకు పోదాం! అయితే ఈ వచనంలో చెప్పే సువార్త ఏమిటంటే దేవుడు యెరుషలేమును మరియు ఇశ్రాయేలు ప్రజలను అనగా సీయోను దాని శత్రువులు చేతిలో నుండి, చెర నుండి విముక్తి చేసి వారి మధ్య దేవుడే పరిపాలన చేయబోతున్నారు! దేవుడే తన సర్వాధిపత్యాన్ని బల ప్రభావాన్ని వెల్లడి చేయబోతున్నారు అనేదే ఇక్కడ సువార్త! చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారి స్వదేశానికి వస్తున్నారు అని చెప్పడమే సువార్త!

ఇదే ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటే నూతన నిబంధన సంఘ ప్రకారము ఇంతవరకు సైతాను చెరలో ఉన్న ప్రజలు క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి దేవునితో సమాధానపడ్డారు! దేవునితో సమాధానపడాలంటే వారిలో ఉన్న పాపం పోవాలి, పాపం పోవాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. దానికోసం యేసయ్య ఈ భూలోకానికి వచ్చారు! ఎంతోమందిని స్వస్థపరిచారు, చివరికి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టారు! చనిపోయి తిరిగి లేచారు! తిరిగి లేచి పరలోకానికి వెళ్లిపోయారు! తిరిగి రాబోతున్నారు! వెళ్లే ముందు తన రాజ్యాన్ని మనుషుల మధ్య దేవుని రాజ్యాన్ని స్థాపించి వెళ్లిపోయారు! ఇదే సువార్త!!! ఈ సువార్త మనం అందరికీ బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సువార్త లోకానికి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ప్రతి విశ్వాసి మీద నూతన నిబంధన సంఘంలో అంగమైన ప్రతి విశ్వాసి మీద ఉన్నది. ఇదే సువార్త!!

యెషయా 40:9

సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.

యెషయా 40:10

ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది.

యెషయా 9:6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 32:1

ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

రోమీయులకు 10:4

విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.

రోమీయులకు 10:5

ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.

రోమీయులకు 10:6

అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;

రోమీయులకు 10:7

లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.

రోమీయులకు 10:8

అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.

రోమీయులకు 10:9

అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

రోమీయులకు 10:10

ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

రోమీయులకు 10:11

ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

ఎఫెసీయులకు 6:15

పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువ బడుడి.

ఇక తరువాత వచనంలో ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు అంటున్నారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను! యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు అంటున్నారు. అనగా సీయోను ప్రజలు మరలా యెరూషలేముకి తిరిగి రావడం అందరూ చూసి సంతోషిస్తారు అని అర్థం.

నిజానికి తిరిగి రావడం అనగా చెరనుండి కాదండి యేసుక్రీస్తు ప్రభులవారు రెండవసారి ఈ భూమిమీదకి రాబోతున్నారు అని అర్ధం!! ఎలాగంటే తెలుగులో మరియు ఇంగ్లీషులో ఇలా ఉంది గాని ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది.

విను! నీ కావలివారు స్వరమెత్తుతున్నారు. ఏకంగా ఆనంద ధ్వనులు చేస్తున్నారు.

యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.

ప్రకటన గ్రంథం 1:7

ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

యెహె 10:18-19; 11:22-23లో యెహోవా మహిమా ప్రకాశం వెళ్ళిపోవడం చూడగలం. యెహె 39:25-29లో ఆయన తిరిగి రావడం గురించి ఉంది. మరొక సారి వెళ్ళిపోవడం, తిరిగి రావడం గురించి మత్తయి 23:37-39; జెకర్యా 14:4లో చూడండి.

Matthew(మత్తయి సువార్త) 23:37,38,39

37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.

38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది

39. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతోచెప్పుచున్నాను.

జెకర్యా 14:4

ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

ప్రియులారా ! ఏసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి రాబోతున్నారు! ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్ష రాజ్యం భూమి మీద స్థాపించబోతున్నారు! మనుషుల హృదయాలలో ఉన్న దేవుని రాజ్యం ఆరోజు ప్రపంచం అంతటి మీద దేవుడు ప్రత్యక్షంగా రాజ్యం చేయబోతున్నారు!!! మరి ఆ రాజ్యంలో ఉండాలి అంటే ఎత్తబడే యోగ్యత, సిద్దపడిన జీవితం నీకుందా?!

సరిచూసుకో!

సరిచేసుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*292వ భాగము*

యెషయా గ్రంథము 52:7--12

7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

8. ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

9. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను.

10. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

11. పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 52వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక తొమ్మిదవ వచనంలో యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూష లేమును విమోచించెను అంటున్నారు.

యెషయా 40:1

మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

యెషయా 40:2

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 44:23

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

యెషయా 48:20

బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.

యెషయా 48:21

ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను.

యెషయా 49:13

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

ఇక తరువాత వచనంలో సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

ఇది చూడటానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడం ప్రజలంతా చూస్తారు అని అర్థం వచ్చినా ఇక్కడ దేవుని రక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభులవారు అని అర్థం!!

యెషయా 51:5

5. నా నీతి నిజాయితీ సమీపిస్తూ ఉన్నాయి. నా రక్షణ బయలుదేరివుంది. నా చేయి జనాలకు న్యాయం జరిగిస్తుంది. ద్వీపవాసులు నావైపు చూస్తూ నా చేతికోసం నమ్మకంతో ఎదురుచూస్తారు.

లూకా 2:28

అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

లూకా 2:29

నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31

నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన

లూకా 2:32

నీ రక్షణ నేను కన్నులార చూచితిని.

అయితే తరువాత వచనంలో చాలా అర్థం దాగి ఉంది ప్రియులారా!!!

11 ఆ స్థలాన్ని విడిచివెళ్ళండి! విడిచివెళ్ళండి. అక్కడనుంచి వెళ్ళిపోండి! అశుద్ధమైన దేనినీ తాకవద్దు. యెహోవా సేవాపాత్రలను మోసేవారలారా! దానిలోనుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి.

52:11-12 వచనాలు: బబులోను చెరలో ఉన్న ఇస్రాయేల్‌వారికి! దీని అర్థమేమంటే, ఆలయం పాత్రలను చేతపట్టుకొని బబులోను విడిచిపోవాలి అని (ఎజ్రా 1:7-11). అవి తప్పించి ఆ నగరంలోని దాని విగ్రహాలను గానీ అపవిత్రమైన మరే వస్తువును గానీ తీసుకువెళ్ళకూడదు.

Ezra(ఎజ్రా) 1:7,8,9,10,11

7. మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.

8. పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.

9. వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

10. ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.

11. బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

ఇక నూతన నిబంధన సంఘానికి అర్థం ఏమిటంటే: యుగాంతంలో సాదృశ్యరూపమైన “బబులోను”లో ఉన్నవారికి వర్తించే అంతరార్థం ఇక్కడ ఉంది (ప్రకటన 18:4). అంతేగాక క్రొత్త నిబంధన సంఘానికి ఆధ్యాత్మిక అంతరార్థం ఉండనే ఉంది (2 కొరింతు 6:14-18).

ప్రకటన గ్రంథం 18:2

అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెను - మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.

ప్రకటన గ్రంథం 18:4

మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.

ప్రకటన గ్రంథం 18:5

దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:14,15,16,17,18

14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.

ఇక నూతన నిబంధన సంఘకోణంలో యెహోవా సేవోపకరణాలు మోసేవారలారా అనగా యాజకులు అనగా దైవసేవకులు, పాష్టర్లు, అపొస్యలులు. వీరు అపవిత్రమైనవి ఏమీ ముట్టకూడదు! మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకోండి. పరిశుద్ధంగా ఉండండి అంటున్నారు.

ఇక తరువాత వచనంలో మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును

ఈవచనానికి అర్థం రెండు రకాలుగా ఉంది ప్రియులారా! అయితే మీరు త్వరపడి బయలుదేరరు. పారిపోయే విధంగా వెళ్ళరు. ఎందుకంటే, యెహోవా మీ ముందర నడుస్తాడు. ఇస్రాయేల్ ప్రజల దేవుడు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు.

ఇక్కడ తొందరగా వెళ్లరు ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దొంగచాటుగా పారిపోరు. అఫీషియల్ డిక్రీ ద్వారా ధైర్యంగా బయటకు వెళ్తారు. ఈ డిక్రీ మనకు రెండు దినవృత్తాంతాలు చివరి అధ్యాయం చివరి వచనాలలోను, పైన చెప్పిన ఎజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనాలలోను కనిపిస్తుంది!

ఇక రెండవ అర్థం వీరు ఇక్కడ సువార్త ప్రకటిస్తూ మెల్లమెల్లగా ప్రపంచదేశాలు సువార్తతో నింపుకుంటూ సాగిపోతారు! వారికి యెహోవా ముందర నడుస్తారు. ఇస్రాయేల్ ప్రజల దేవుడు వారితో ఇంకా వారి వెనుక కావలివాడుగా ఉంటారు.

మరి నీవు సువార్తకు సిద్ధమా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*293వ భాగము*

యెషయా గ్రంథము 54:1--3

1. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

3. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 52వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! చివరి మూడు వచనాలు మరియు 53వ అధ్యాయం అభిషక్తుని మొదటి రాకడకోసం ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభులవారి మరణం కోసం ధ్యానం చేసినప్పుడు విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక 54వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

మొదటి వచనంలో అంటున్నారు: గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

దీనికోసం చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించవలిసిన అవసరం ఉంది ప్రియులారా!!!

ఈ అధ్యాయానికి సరైన వివరణ ఇవ్వదలచుకుంటే ఈ మొదటి వచనం వల్ల ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు ముందు జవాబు చెప్పాలి.

మొదటగా ఈ “గొడ్రాలు”, ఈ “విడవబడ్డది” ఎవరు?

భర్త ఉన్న స్త్రీ ఎవరు?

గలతీ 4:27లో ఈ వచనాన్ని ఎత్తిరాయడం ద్వారా పౌలు చెప్పదలచుకొన్నది ఏమిటి?

గలతియులకు 4:27

ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగల దాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.

ఈ ప్రశ్నలకు జవాబులు అర్థం చేసుకోవడం కొంచెం చిక్కుతో కూడినది.

మొదటగా గొడ్రాలు లేక విడవబడినది ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న జెరుసలం లేక సీయోను అని 49 – 52 అధ్యాయాల సందర్భాన్ని బట్టి అర్ధమవుతుంది (ఇంకా 49:14, 19-21; 51:17; 52:1),

Isaiah(యెషయా గ్రంథము) 49:14,15,18,19,20,21,22,23

14. అయితే సీయోనుయెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.

18. కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

20. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

21. అప్పుడు నీవునేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.

22. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

యెషయా 51:17

యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

యెషయా 51:18

ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయిపట్టుకొనువాడెవడును లేకపోయెను.

యెషయా 52:1

సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

ఇంకా ఈ అధ్యాయం 6-8 వచనాలను బట్టీ ఇలా భావిస్తున్నాం.

Isaiah(యెషయా గ్రంథము) 54:6,7,8

6. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.

7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

40–66 అధ్యాయాల్లో కనిపించే ఎక్కువ భాగం ప్రవచనాల్లాగానే ఈ “గొడ్రాలు” గురించిన భవిష్యద్వాక్కు కూడా యెషయా కాలాన్ని దాటి ఎప్పుడో నెరవేరబోయేది.

ఇక రెండవది “భర్త ఉన్న స్త్రీ”. ఇది కూడా ఇజ్రాయేల్ జాతికి ప్రతినిధిగా ఉన్న జెరుసలం నగరమే. భర్త అంటే సాక్షాత్తు యెహోవాదేవుడే (వ 5; 50:1; యిర్మీయా 3:14).

యెషయా 54:5

నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

యెషయా 50:1

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

యిర్మియా 3:14

భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

ఇక్కడ ఒకమాట చెప్పనీయండి. మన సృష్టి కర్త మనకు భర్త ఏమిటి చండాలంగా అనుకోవద్దు. ఇక్కడ చెప్పబడిన భర్తకు అర్థం భరించువాడు లేదా యజమాని అని అర్థం. మన భారములు భరించేవాడు మన వ్యసనాలను శ్రమలను సహించిన వాడు మనలను పోషిస్తున్న వాడు మన భర్త- స్త్రీకి గాని పురుషులకి గాని అది దేవుడే! భర్త అనగా శారీరక కోరికలు తీర్చే (sexual desires) భర్త కానేకాదు అని గ్రహించాలి!!!

ఇంకా ఈ ప్రవచనం యొక్క అర్థం ఇజ్రాయేల్ కొంత కాలం విడిచిపెట్టబడి, విముక్తి పొంది నూతనమై పాత ఇజ్రాయేల్ కంటే అత్యధికంగా ఫలవంతమౌతుంది.

మూడు: ఈ వచనాన్ని ఎత్తి రాయడం ద్వారా పౌలుగారు ధర్మశాస్త్రానికీ కృపకూ గల తేడా చూపెడుతున్నారు. ఇజ్రాయేల్ ధర్మశాస్త్రం క్రింద ఉండడమంటే దాస్యం, నిరాకరణ పాలైంది అని అర్థం. కృప క్రింద ఉన్న ఇస్రాయేల్‌కు స్వేచ్ఛ, స్వీకరణ, సఫలత ఉంటాయి. ఈ తేడా మోషేద్వారా ఇచ్చిన పాత నిబంధన, క్రీస్తుద్వారా వచ్చిన క్రొత్త నిబంధన. సంఘమే క్రొత్త ఇజ్రాయేల్ అని పౌలుగారు నేర్పడం లేదు. ఇప్పుడు మనం యూదులమైనా, అన్యులమైనా ఒకే విధానంలో పాపవిముక్తి పొందాలనీ, పరలోకంలోని నిజమైన జెరుసలం విశ్వాసులందరికీ తల్లి అనీ నేర్పుతున్నారు.

ఈ 54వ అధ్యాయంలోనూ, మొత్తంగా యెషయా గ్రంథంలోనూ ఇజ్రాయేల్ జాతి చివరికి దేవుని దగ్గరకు తిరిగి వస్తుందనీ, క్రొత్త నిబంధన దీవెనలలోకి ప్రవేశిస్తుందనీ అది తిరిగి తన భర్తను చేరిన భార్యలాగా ఉంటుందనీ, పాత నిబంధన క్రింద గడిపిన సుదీర్ఘ కాలంలో కంటే అత్యధికంగా ఫలవంతమౌతుందనీ మనం తెలుసుకుంటాము.

ఇక జయగీత మెత్తుము , జయకీర్తన నెత్తి ఆనంద పడుము అనగా రాబోయే కాలంలో ఉండబోయే క్రొత్త ఇజ్రాయేల్ యెషయాగారి రోజులలో ఇంకా పిల్లలను కనలేదు. అప్పటికి ఇంకా ఆ క్రొత్త ఇజ్రాయేల్ ఉనికిలో లేదు. దానికోసమే ఈ ప్రవచనం. పాడమని ఇస్రాయేల్‌కు వచ్చిన వాక్కు 53 అధ్యాయం వెనువెంటనే రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. యేసుక్రీస్తుప్రభులవారు ఆ సిలువపై చేసిన దానిలోనే క్రొత్త ఇస్రాయేల్‌కు పునాది ఉంది. 54:2-3 రాబోయే రోజుల్లో ఉండే క్రొత్త ఇజ్రాయేల్ ఇంతకు ముందెన్నడూ లేనంత విశాలంగా, మరింత బలప్రభావాలతో ఉంటుంది.

యెషయా 26:1

ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.

యెషయా 26:15

యెహోవా, నీవు జనమును వృద్ధిచేసితివి జనమును వృద్ధిచేసితివి. దేశముయొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి.

Isaiah(యెషయా గ్రంథము) 33:20,21,22,23,24

20. ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.

21. అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.

22. యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

23. నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.

24. నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

2:1-3 మొ।।Isaiah(యెషయా గ్రంథము) 2:1,2,3

1. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

ఇందులో క్రొత్త నిబంధన సంఘానికి వర్తించే ఆధ్యాత్మిక భావం ఏమీ లేదా? ఉంది. మత్తయి 18:19-20;

Matthew(మత్తయి సువార్త) 18:18,19,20

18. భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.

20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

మార్కు 16:15;

Mark(మార్కు సువార్త) 16:15,16,17,18

15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

17. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు,

18. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.

లూకా 24:45-48;

Luke(లూకా సువార్త) 24:45,46,47,48,49,50

45. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48. ఈ సంగతులకు మీరే సాక్షులు

49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

50. ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.

అపొ కా 1:8లో ఆ భావంలాంటిది ఉంది.

అపో.కార్యములు 1:8

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

ప్రియులారా విడివబడిన స్థితిలో పాపపు చీకటిలో ఉన్న మనలను దేవుడు విడిపించి బాప్తిసం ద్వారా ప్రధానం చేసుకొని నిన్ను నన్ను పవిత్రమైన కన్యకగా చేశారు. కాబట్టి మనం ఆయన స్తుతిని ఆయన సువార్తను ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసినప్పుడే అనేకమంది దేవుని దగ్గరకు రాగలరు! ప్రపంచమంతా సువార్తతో నిండగలదు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*294వ భాగము*

యెషయా గ్రంథము 54:1--8

1. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

3. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

4. భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.

5. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

6. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.

7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 54వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక రెండు మూడు వచనాలలో ఇశ్రాయేలు జనాంగము చెరవిముక్తి తరువాత ఎంతగా విస్తరించి ఆశీర్వదించబడతారో కనిపిస్తుంది.

. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

3. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

చూడండి  నీ గుడారమున్న స్థలాన్ని పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. వెనక్కు పట్టి ఉంచకు. నీ త్రాళ్ళను పొడుగు చెయ్యి. నీ మేకులను బలపరచు. ఎందుకంటే నీవు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం ఇతర జనాల దేశాలను స్వాధీనం చేసుకొంటారు, వాటి పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.

ప్రియులారా వీటికోసం విస్తారంగా గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాం!

తరువాత వచనాలలో Isaiah(యెషయా గ్రంథము) 54:4,5

4. భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.

5. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.

ప్రియులారా 4-8 ఈ వచనాలు అర్థం కావాలంటే రోమ్ 7:1-6; 11:11-29 అర్థం చేసుకోవడం అవసరం.

Romans(రోమీయులకు) 7:1,2,3,4,5,6

1. సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.

2. భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును.

3. కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని( అసలుమాట-వివాహము చేసికొనినయెడల) చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్తచనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.

4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.

5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములైయుండెను.

6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.

Romans(రోమీయులకు) 11:11,12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28,29

11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.

12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను.

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.

29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

ఇక్కడ విడనాబడింది, విధవరాలు జెరూసలేం అని అర్థం! ఇంకా యూదా జనాంగము! అయితే అది ధర్మశాస్త్రం అనే దాస్యపు చెరలో ఉంది. అయితే వారియొద్దకు అభిషక్తుడు రక్షకుని వలె వచ్చినా అర్థం చేసుకోక నిజమైన సత్యాన్ని గ్రహించక మెస్సీయాను త్రోసివేయగా అన్యజనులమైన మనము ఇశ్రాయేలు వారితో పాటుగా అంటుకట్టబడ్డాము. అన్యజనులలో రక్షణ పొందబోయే వారి సంఖ్య పూర్తి అయిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలలో నున్న అవిశ్వాసం పోయి నిజాన్ని గ్రహించి వారుకూడా క్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుతారు.

యవ్వనంలో ఉన్న అవమానం అనగా గొడ్రాలితనం ఆ రోజుల్లో (వ 1) అవమానకరమని ప్రజలు ఎంచారు.

మొదటి వచనంలో జెరూసలేం గొడ్రాలుగా పిలువబడింది. 1. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“విధవరాలు”– ఆ జాతి అనేక శతాబ్దాలుగా భర్త మరణించిన స్త్రీ లాగా ఉంది. అయితే అదంతా మారిపోతుంది.

ఎందుకంటే, నీ భర్త నీ సృష్టికర్తే. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా, నీ విమోచకుడు ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు. సర్వలోకానికీ దేవుడు అని ఆయనకు పేరు.

5-6 వచనాలు: ధర్మశాస్త్రం క్రిందవున్న పాత ఇజ్రాయేల్ జాతికి భర్త యెహోవాదేవుడు. అయితే దాని పాపం వల్ల దేవుడా జాతిని తిరస్కరించాడు. దానికి భర్త లేనట్టు అయింది. క్రొత్త ఇస్రాయేల్‌కు యెహోవాదేవునితో మళ్ళీ పెళ్ళవుతుంది. ఈ విషయం హోషేయ 2:1 నుండి 3:5 వరకు చూడండి అర్ధమవుతుంది. భవిష్యత్తులో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినవాడిలా గాక, సృష్టికర్తగా, విమోచకుడుగా ఆ జాతిని తనదగ్గరకు చేర్చుకుంటాడు.

గతభాగం లో చెప్పడం జరిగింది మన సృష్టి కర్త మనకు భర్త ఏమిటి చండాలంగా అనుకోవద్దు. ఇక్కడ చెప్పబడిన భర్తకు అర్థం భరించువాడు లేదా యజమాని అని అర్థం. మన భారములు భరించేవాడు మన వ్యసనాలను శ్రమలను సహించిన వాడు మనలను పోషిస్తున్న వాడు మన భర్త- స్త్రీకి గాని పురుషులకి గాని అది దేవుడే! భర్త అనగా శారీరక కోరికలు తీర్చే (sexual desires) భర్త కానేకాదు అని గ్రహించాలి!!!

తరువాత నీ దేవుడు అంటున్నాడు, నీవు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యగా ఉన్నావు, పడుచుతనంలో పెళ్ళి చేసుకొని తృణీకారానికి గురి అయిన భార్యగా ఉన్నావు. అలాంటి నిన్ను యెహోవా మళ్ళీ పిలుస్తున్నాడు.

మరలా ప్రేమతో పిలుస్తున్నారు ప్రభువు. మరలా నీతో నిబంధన చేయబోతున్నారు!!!

క్షణమాత్రం నేను నిన్ను విడిచిపెట్టాను గాని, మహా వాత్సల్యంతో నిన్ను మళ్ళీ సమకూరుస్తాను.  నాకు కోపం ముంచుకు వచ్చింది. క్షణమాత్రం నీకు నా ముఖం కనబడకుండా చేశాను. అయితే నా శాశ్వతమైన అనుగ్రహం మూలంగా

నీకు వాత్సల్యం చూపుతాను. ఇది నీ విమోచకుడైన యెహోవా వాక్కు.

ఇదీ తండ్రి ప్రేమ!

మరి తప్పిపోయిన నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తున్నారు. మరి ఆయన దగ్గరకు వస్తావా! ఆయన బాటలో నడుస్తావా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*295వ భాగము*

యెషయా గ్రంథము 54:6--8

6. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.

7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 54వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా తరువాత వచనాలలో దేవుడు అంటున్నారు నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఇక్కడ నిమిష మాత్రం లేదా క్షణమాత్రం అనగా– ఇజ్రాయేల్ అనుభవించబోయే శాశ్వత రక్షణతో పోల్చి చూచుకుంటే ఇశ్రాయేలు ప్రజల అనుభవించిన శ్రమలు బాధలు కొద్దికాలమే. వ 8;

నాకు కోపం ముంచుకు వచ్చింది. క్షణమాత్రం నీకు నా ముఖం కనబడకుండా చేశాను. అయితే నా శాశ్వతమైన అనుగ్రహం మూలంగా నీకు వాత్సల్యం చూపుతాను.

ఇది నీ విమోచకుడైన యెహోవా వాక్కు.

రోమీయులకు 8:18

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

2కోరింథీయులకు 4:17

మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

2కోరింథీయులకు 4:18

ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

2 పేతురు 3:8

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

కాబట్టి తన ప్రజలు అనుభవించిన శ్రమలు దేవుని దృష్టిలో నిమిషమాత్రమే అని గ్రహించాలి!!!

ఇక ఇదే వచనంలో దేవుని వాత్సల్యం కోసం కూడా చెబుతున్నారు మహా వాత్సల్యం ఇది దేవుని లక్షణాల్లో ఒకటి. దీన్ని కనపరచడం దేవునికి మహా ఇష్టం. నిర్గమ 34:5-7;

Exodus(నిర్గమకాండము) 34:5,6,7

5. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.

6. అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

7.ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.

యెషయా 54:10

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 14:1

ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు.

యెషయా 49:10

వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

యెషయా 51:3

యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.

తరువాత వచనంలో నాకు కోపం ముంచుకు వచ్చింది. క్షణమాత్రం నీకు నా ముఖం కనబడకుండా చేశాను. అయితే నా శాశ్వతమైన అనుగ్రహం మూలంగా నీకు వాత్సల్యం చూపుతాను. ఇది నీ విమోచకుడైన యెహోవా వాక్కు అంటున్నారు.

ఈ వచనంలో కూడా కోపం వచ్చింది గాని ఇప్పుడు ఇశ్రాయేలు పట్ల శాశ్వతమైన అనుగ్రహం, వాత్సల్యం చూపిస్తాను అంటున్నారు.

కోపం కోసం చూసుకుంటే – 9:12, 17, 21;

Isaiah(యెషయా గ్రంథము) 9:12,17,21

12. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

17. వారందరును భక్తిహీనులును దుర్మార్గులునై యున్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యౌవనస్థులను చూచి సంతో షింపడు వారిలో తలిదండ్రులు లేనివారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

21. మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 60:10; 2 దిన 36:15-16;

యోహాను 3:36.

కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

దేవుని కోపం గురించి సంఖ్యా 25:3; కీర్తన 90:7, 11చూడండి

యెహోవా కోపాగ్ని”– కీర్తన 90:7-11; యోహాను 3:36; రోమ్ 1:18; 2:5; ప్రకటన 6:15-17. దేవుని కోపాగ్ని గురించి బైబిల్లో కొన్ని వందల సార్లు రాసి ఉంది. ఏకైక నిజ దేవునికి మంచితనం, సత్యం, నీతిన్యాయాలు, పవిత్రత పట్ల అపారమైన ఆసక్తి ఉంది. అందువల్ల ఈ గుణాలకు వ్యతిరేకమైనవి ఆయన కోపాగ్ని రేకెత్తిస్తాయి. ఆయన కోపం చెడుతనాన్ని అసహ్యించుకునే లోపరహితమైన ఆయన పవిత్ర స్వభావం మూలంగా పుట్టేది. నిర్మలమైన వాటిపట్ల ఆయన ఆసక్తి, తన సృష్టి అయిన విశ్వానికి అత్యంత క్షేమం కలగాలన్న ఆయన ఆకాంక్ష – వీటిల్లోనుంచే ఆయన కోపం కలుగుతుంది. పాపం, చెడుతనం విషయంలో ఆయనకేమీ కోపం లేకపోతే ఆయన దేవుడే కాదు. మనుషుల్లో చూచినా న్యాయం కోసం ఆసక్తి ఉండే వారెవరైనా అన్యాయాన్ని చూచి కోపం తెచ్చుకోకుండా ఉండరు. దయను ప్రేమించే ఎవరైనా క్రూరత్వాన్ని చూచి కోపగించకుండా ఉండరు. సత్యమంటే ప్రీతి ఉన్న ఎవరైనా అసత్యాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు. న్యాయాన్ని, దయను, సత్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటే అతడు లేక ఆమె వీటికి వ్యతిరేక లక్షణాలను అంతగా అసహ్యించుకుంటారు. పవిత్రతపట్ల దేవుని ఆసక్తి అంతులేనిది గనుక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిది. బైబిలు చెప్పేదాని ప్రకారం మనందరం దేవుని కోపానికి పాత్రులమే. తనకు కోపం తెప్పిస్తాయని దేవుడు చెప్పిన కొన్ని విషయాల జాబితా కోసం ద్వితీ 4:25 చూడండి. దేవుని కోపం గురించి కొన్ని ముఖ్యమైన రిఫరెన్సులు – 1:53; 11:1; నిర్గమ 32:10; లేవీ 26:28; ద్వితీ 32:22; యెహో 7:1; న్యాయాధి 2:12; 2 రాజులు 17:18; 24:20; కీర్తన 2:12; 7:11; 78:38, 49, 50; 90:7-11; యెషయా 5:25; 10:5; 13:9; 66:15; నహూము 1:2, 5; మత్తయి 3:7; యోహాను 3:36; రోమ్ 1:18; 2:5, 8; 5:9; 9:22; ఎఫెసు 2:3; 5:6; 1 తెస్స 1:10; ప్రకటన 6:16; 14:19; 15:1, 7; 19:15.

ఇక ఇదే వచనంలో నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు

కీర్తనలు 78:35

దేవుడు తమకు ఆధారశిలలాంటివాడని గుర్తు తెచ్చుకొన్నారు.

సర్వాతీతుడు తమ్మును కొనుక్కొని విడిపించినవాడని జ్ఞాపకం చేసుకొన్నారు.

విమోచకుడు”– ఇక్కడ ఇలా తర్జుమా చేయబడ్డ హీబ్రూ పదం (గోయేల్‌) హీబ్రూ పాత నిబంధనలో 46 సార్లు కనిపిస్తూవుంది. కొన్ని సార్లు దేవుణ్ణి, కొన్ని సార్లు మనిషిని ఉద్దేశించి ఈ పదం వాడబడింది. దీనికి వివిధ అర్థాలు ఉన్నాయి –

కష్టాలనుంచీ బానిసత్వం నుంచీ విడిపించిన విమోచకుడు (ఆది 48:16; ద్వితీ 13:5)

ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆస్తిని వెలకు కొని అతనికి తిరిగి అప్పగించే సమీప బంధువు (లేవీ 25:25)

హత్యకు గురి అయిన రక్తసంబంధి విషయంలో ప్రతీకారం చేసేవాడు (సంఖ్యా 35:12)

తన కుటుంబం సభ్యుని మరణం తరువాత అతని భార్యను వివాహమాడి అతనికోసం సంతానాన్ని కనడమే కాక ఆమె కోల్పోయిన ఆస్తిని కొని తిరిగి ఆమెకు అప్పగించే సమీప బంధువు (రూతు 2:20)

తన ప్రజలు వేధింపులకు గురౌతూ ఉంటే వారి పక్షాన నిలబడేవాడు (సామెత 23:11)

దేవుడు విమోచకుడుగా తన ప్రజలను దాస్యంనుంచి తప్పించాడు, వారిని వారి దేశంలోకి తిరిగి రప్పించాడు, వారి శత్రువులను శిక్షించాడు (యెషయా 49:25-26; యిర్మీయా 50:33-34).

క్రొత్త నిబంధనలో దీని అర్థం మరింత ఆధ్యాత్మికమైనది. అక్కడ విమోచకుడు యేసుప్రభువు. పాపదాస్యంనుంచి మనల్ని విడిపించేందుకు అవసరమైన వెలను చెల్లించాడు. ఆ వెల ఆయన రక్తమే. ఆ రక్తం మూలంగా విశ్వాసులకు పాపక్షమాపణ, విముక్తి, పరలోకంలో ఉన్న శాశ్వతమైన వారసత్వం లభించాయి. యేసు తన విశ్వాసుల పక్షంగా వారి శత్రువైన సైతాన్ను ఎదిరించి మానవాళిమీదికి మరణాన్ని తెచ్చి పెట్టిన ఈ పిశాచాన్ని ఆయన నాశనం చేసి, సైతాను చేతుల్లో పడడం మూలంగా మనిషి జారవిడుచుకొన్న దానంతటినీ తిరిగి మనిషికి సమకూరుస్తాడు. దేవుని కోసం ఫలించేందుకు తన ప్రజలంతా ఉమ్మడిగా తనకు ఆత్మ సంబంధమైన పవిత్ర వధువు కావాలని యేసుప్రభువు వారిని విమోచించాడు.

మత్తయి 20:28; 26:28; రోమ్ 3:24; 7:1-4; గలతీ 3:13-14; ఎఫెసు 1:7, 14; 4:30; 5:33; కొలస్సయి 1:14; హీబ్రూ 9:12; 1 పేతురు 1:4, 18, 19; ప్రకటన 1:5; 5:9-10; 19:6-9

మరి ఇటువంటి వాత్సల్యత కలిగిన కృప కలిగిన దేవుడు, తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి విమోచించిన దేవుడు నీకు రక్షకుడై ఉన్నాడు! మరి దానికి తగిన జీవితం జీవిస్తున్నావా! ఇబ్బందులలో బాధలలో ఉన్నావా? దారి తప్పిపోయావా?! అయితే తిరిగి నేడే ఆయన వద్దకు రా!! ఆయన నీ విమోచకుడు నీ పాప బంధకాలు నుండి విడిపించగలడు! ఆయన నీ రక్షకుడు నీ మీద ప్రేమ వాత్సల్యత చూపించేవాడు! యిర్మియా 31:3 లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నారు!

ఆ కృప గల దేవుని వద్దకు వస్తావా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*296వ భాగము*

యెషయా గ్రంథము 54:9--12

9. నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.

10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

12. మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 54వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తొమ్మిదవ వచనంలో అంటున్నారు నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.

ఇంతకీ నోవా గారి కాలంలో ఏమి ప్రమాణం చేశారు దేవుడు!!! ఆ కాలంలో వరదలు భూమిని ముంచివేసినట్టు ఇంక ఎన్నడూ ముంచివేయవని నేను ప్రమాణం చేశాను.

నీమీద కోపగించననీ నిన్ను గద్దించననీ ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను.

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

ఆదికాండము 8:22

భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృద యములో అనుకొనెను.

దేవుని కోపానికి గురి అయిన ఆ జాతి భవిష్యత్తులో ఆయన మళ్ళీ దాన్ని చేరదీసినప్పుడు ఆయన కోపాన్ని మరెన్నడూ రుచిచూడదు.

దీనిలో ఇప్పటి విశ్వాసులకు అనగా నూతన నిబంధన విశ్వాసులకు ఆధ్యాత్మిక భావం వివరణ ఉంది – రోమ్ 5:9; 1 తెస్స 1:10; 5:9. క్రీస్తులో నిజంగా నమ్మకం ఉంచి దేవుని ఆత్మమూలంగా పుట్టినవారు దేవుని కోపానికి మరెన్నడూ గురికారు.

రోమీయులకు 5:9

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

రోమీయులకు 8:1

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

రోమీయులకు 8:2

క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

1థెస్సలొనికయులకు 1:10

దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

1థెస్సలొనికయులకు 5:9

ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

ఇక పదవ వచనంలో మహత్తరమైన వాగ్ధానం చేస్తున్నారు దేవుడు! పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

పర్వతాలు శాశ్వతంగా ఉంటాయి. మెట్టలు అనగా చిన్న కొండలు స్థిరంగా ఉంటాయి. అవి మారినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నారు. హల్లెలూయ! మనయెడల ఆయన ప్రేమ ఆయన కృప ఎంతో బలిష్టమైనది!!

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

కీర్తనలు 46:2

కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను

కీర్తనలు 46:3

వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)

Hebrews(హెబ్రీయులకు) 12:26,27,28

26. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

27. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.

28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

ఇక దేవుని నిబంధన తొలిగిపోదు: యెషయా 49:15-16

15 స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డమీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? ఒకవేళ అలాంటివారు మరవవచ్చు. గాని, నేను నిన్ను మరవను!

16 చూడు! నా అరచేతుల మీద నిన్ను చెక్కాను! నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34,35,36,37

31.​ ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32.​ అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

35.​ పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

36.​ ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జన ముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

37.​ యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.

Jeremiah(యిర్మీయా) 33:20,21,22

20. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయము లలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

21. నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.

22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.

Ephesians(ఎఫెసీయులకు) 2:16,17,18

16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

ఇక తరువాత వచనాలలో ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

12. మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.

ఇక్కడ ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా! ఎవరూ అంటే యెరూషలేము మరియు ఇశ్రాయేలు ప్రజలు! నేను మిమ్మల్ని మరలా మణిమాణిక్యాలతో కడతాను అంటున్నారు!

ఈ మణులు భవిష్యత్తులో జెరుసలం నగర వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.

నేను నిన్ను వైడూర్యాలతో నిర్మిస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.

 కెంపులతో నీ బురుజులను, నిప్పులాగా మెరిసే మణులతో నీ ద్వారం తలుపులను,

విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు. వాగ్ధానం చేసినవాడు దానిని నెరవేర్చగలిగిన శక్తిగలవాడు. అలాగే నేటి దినాలలో అత్యధికమైన మేలులతో యెరూషలేముని ఇశ్రాయేలు ప్రజలను నింపారు దేవుడు!

ఇక నూతన నిబంధన సంఘకోణంలో చూసుకుంటే గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

12. మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.

గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అనగా ఈ లోకంలో నూతన నిబంధన సంఘము ఎన్నో ఇబ్బందులలో బాధలలో హింసలలో శ్రమల గుండా సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు నీలాంజనములతో కట్టడం కడుతున్నారు! నీలములతో పునాదులు వేస్తున్నారు. ఇది తప్పకుండా నూతన యెరుషలేముగా కట్టబడుతున్న నూతన నిబంధన సంఘముగా కనిపిస్తుంది. అక్కడున్న మణులు మాణిక్యాలు సూర్యకాంతాలు ఇవి నూతన యెరుషలేము లేదా అంత్యదినాలలో రాబోతున్న నూతన యెరుషలేముగా కనిపిస్తుంది! ప్రకటన గ్రంథంలో దీనికోసం విస్తారంగా ఉంది! సంఘము కూడా ఇలాగా అందంగా కట్టబడుతుంది మణులతో మాణిక్యాలతో! అదే సమయంలో ఆధ్యాత్మిక జీవితంలో నూతన నిబంధన సంఘానికి చెందిన రక్షించబడిన విశ్వాసి, జయ జీవితం గలిగిన విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో కలిగే అనుభవాలు, దేవుడిచ్చే మేలులు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలే , ఈ మణులు మాణిక్యాలుగా మనం చూసుకోవచ్చు!

ప్రకటన గ్రంథం 21:2

మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

ప్రకటన గ్రంథం 21:3

అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన గ్రంథం 21:10

ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

ప్రకటన గ్రంథం 21:11

దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.

ప్రకటన గ్రంథం 21:12

ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

ప్రకటన గ్రంథం 21:13

తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి.

ప్రకటన గ్రంథం 21:14

ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

ప్రకటన గ్రంథం 21:15

ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను.

ప్రకటన గ్రంథం 21:18

ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

ప్రకటన గ్రంథం 21:19

ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,

ప్రకటన గ్రంథం 21:20

అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

ప్రకటన గ్రంథం 21:21

దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

ప్రకటన గ్రంథం 21:22

దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

ప్రకటన గ్రంథం 21:23

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

మరి అటువంటి మణి మాణిక్యాలు కలిగిన ఆధ్యాత్మిక జీవితం నీవు కలిగి ఉన్నావా అయితే నీవు నూతన యెరుషలేముగా కట్టబడుతున్నామని మర్చిపోకు!

హల్లెలూయా!

దేవుని నామమునకు మహిమ కలుగును గాక!!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*297వ భాగము*

యెషయా గ్రంథము 54:13--17

13. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

14. నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.

15. జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు.

16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పని ముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించు వాడను నేనే

17. నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 54వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 13--17 వచనాలలో కూడా దేవుడు యెరూషలేముని ఇశ్రాయేలుని ఏవిధంగా స్థాపించి బలపరుస్తారో ఆదరణకరమైన మాటలు కనిపిస్తాయి!

13. నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

దీనికోసం ఆలోచన చేస్తే....

Isaiah(యెషయా గ్రంథము) 30:19,20,21

19. సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

20. ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

21. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

యిర్మియా 31:34

నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దీనికోసం చూసుకుంటే

యెషయా 9:7

ఆయన రాజ్య విస్తీర్ణానికీ శాంతికీ అంతం అంటూ ఉండదు. ఆయన దావీదు సింహాసనమెక్కి అతడి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్పటినుంచి ఎప్పటికీ ఆయన ఆ రాజ్యాన్ని న్యాయం చేత, నిజాయితీ చేత బలపరచి, సుస్థిరం చేస్తాడు. సేనలప్రభువు యెహోవా అత్యాసక్తిపరుడై దీనిని సాధిస్తాడు.

యెషయా 66:12

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

కీర్తనలు 147:13

ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి యున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి యున్నాడు.

యెషయా 31:5

పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును.

యెషయా 49:25

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

తరువాత వచనంలో నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.

నీతిగల దానివై స్థాపించబడతావు – 1:26; 4:3; 26:2; 58:8; 62:2 చూడండి

నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.

Isaiah(యెషయా గ్రంథము) 33:17,18,19

17. అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.

18. నీ హృదయము భయంకరమైన వాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?

19. నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.

జెఫన్యా 3:15

తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

జెకర్యా 9:8

నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను.

ఇక తరువాత వచనంలో అంటున్నారు ఎవరైనా నీకు వ్యతిరేకంగా గుమికూడితే

అది నావల్ల జరగదు. ఒకవేళ ఎవరైనా అలా గుమికూడితే వాళ్ళు నీకు లొంగిపోతారు.

15-17 వచనాల అంతరార్ధం: జెరుసలం (అది ప్రతినిధిగా ఉన్న జాతి) పూర్తి భద్రత కలిగి విజయవంతంగా ఉంటుంది. వారిని దేవుడు తిరిగి క్షేమస్థితికి తెచ్చిన తరువాత ఇంతకు ముందు చేసినట్టు మరెన్నడూ దానిపైకి శత్రువులను పంపడు.

తరువాత వచనంలో ఇదిగో విను! నిప్పులూది పనికి తగిన ఆయుధాలను చేసే

కమ్మరిని సృజించినది నేనే. ధ్వంసం చేయడానికి వినాశకారిని సృజించినది నేనే అంటున్నారు!

చూడండి ఏమంటున్నారో ఇశ్రాయేలు మీదికి నాశనం పంపించిన వాడను నేనే, ఇప్పుడు దానిని తిరిగి కట్టేవాడను కూడా నేనే అంటున్నారు.

యెషయా 10:15; యిర్మీయా 51:1, 11, 20; ప్రకటన 17:16-17.

ఇక చివరి వచనంలో ఎంతో ఆదరణకరమైన అద్భుతమైన మాట అంటున్నారు నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.

ఈ అధ్యాయంలోను, యెషయా గ్రంథంలోని ఇలాంటి ఇతర అధ్యాయాల్లోనూ సంబోధించిన ప్రజ భవిష్యత్తులోని క్రొత్త ఇజ్రాయేల్ అనుకున్నా, క్రొత్త నిబంధన సంఘం అనుకున్నా ఇందులోనుండి మనం నేర్చుకోదగిన ఆధ్యాత్మిక పాఠాలు, ఆచరణాత్మకమైన సంగతుల్లో ఏమీ తేడా ఉండదు. ఇలాంటి వచనాన్ని మనం నిస్సందేహంగా ఇప్పటి విశ్వాసులమైన మనకు అన్వయించుకోవచ్చు.

నీకు విరోధమైన ఏ ఆయుధం గెలవదు లేదా వర్దిల్లదు: నూతన నిబంధన సంఘానికి కూడా

మత్తయి 16:18

మరియు నీవు పేతురువు (పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

రోమీయులకు 8:37

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

1కోరింథీయులకు 15:57

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

హీబ్రూ 13:6

అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.

న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు: ఎలా అంటే

Romans(రోమీయులకు) 8:33,34

33. దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;

34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:3,4,5,6

3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము.

4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవైయున్నవి.

5. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి

6.మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడియున్నాము.

ఇక నూతన నిబంధన సంఘకోణంలో చూసుకుంటే నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారు అనగా‌ అది అపొస్తలుల భోదలోను, పరిశుద్ధాత్మ నడిపింపులోను నడిపించబడతారు. ఇదే దేవుని భోధ! ఇలా కట్టబడుతున్న సంఘానికి ఇహమందు విశ్రాంతి దొరకదు గాని విశ్వాసికి మరణం తరువాత, సంఘానికి రాకడ అనంతరం నిత్య విశ్రాంతి కలుగుతుంది!! సీయోను అనుభవం గల సంఘము‌ నీతిగలదిగా స్థాపించబడి శ్రమలద్వారా బలపరచబడి నిత్యత్వములోనికి వెళ్తుంది. అప్పుడు సంఘమును బాధించువారు ఉండరు గాని సంఘమే క్రీస్తుతో కలిసి ఇనుప ఘంటంతో లోకాన్ని ఏలుతారు! ఇక ఇప్పుడు అప్పుడు కూడా సంఘానికి, విశ్వాసికి విరోధమైన ఏ ఆయుధం గాని, చట్టాలు గాని నిలబడవు!! క్రీస్తు మరియు క్రీస్తు వారసులు మాత్రమే అధికారం కలిగి ఉంటారు. మరి నీకు సీయోను అనుభవం, జయించిన అనుభవం ఉందా?!!!

కాబట్టి ధైర్యంగా ఉందాం! విశ్వాసులమైన మనతో దేవుని ఆత్మ దేవుని శక్తి వెన్నంటి ఉంది! కాబట్టి ప్రార్థనతోనూ విశ్వాసముతోను సాతాను యొక్క ప్రతి తంత్రమును పగలగొట్టి జయోత్సాహంతో క్రీస్తు కొరకు సాగిపోదాం!!!

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*298వ భాగము*

యెషయా గ్రంథము 55:1--2

1. దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.

2. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 54వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 55వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం కోసం చూసుకుంటే ఇప్పుడు గాని మరెన్నడైనా గాని యూదులైనా, అన్యులైనా గాని క్రీస్తులో నమ్మకముంచిన వారందరి కోసమూ, దేవుని కృప మరియు మధురమైన వాగ్దానాలూ పుష్కలంగా ఉన్న గొప్ప అధ్యాయం ఇది.

మొదటి రెండు వచనాలు చూసుకుంటే దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.

ఇక్కడ దప్పిగొన్న వారలారా అంటూ మొదలుపెట్టారు. ఇంతకీ అది ఏ దాహం?!

ఆధ్యాత్మిక దాహం! దేవుడు లేని తనం! పేరుకు క్రైస్తవులైన వారి జీవితాలలో క్రీస్తు గాని పరిశుద్ధాత్మ గాని కనిపించని స్తితి! ఆధ్యాత్మిక ఫలాలు లేని గొడ్డుతనం!!!

వీరినే దేవుడు ఇప్పుడు పిలుస్తున్నారు!!!

యెషయా 44:3

నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.

ఇక్కడ నీరు అనగా పరిశుద్ధాత్మ గా పోలుస్తున్నారు!

కీర్తనలు 107:9

ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.

యోహాను 7:37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

యోహాను 7:38

నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

ప్రకటన గ్రంథం 21:6

మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

ప్రకటన గ్రంథం 22:17

ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

ఇక తరువాత నీళ్లు యొద్దకు రండి అంటున్నారు! ఇక్కడ నీరు అనగా మూడు అర్ధాలు కనిపిస్తాయి ప్రియులారా!

మొదటగా పై మూడు రిఫరెన్స్ లు ప్రకారం అనగా యోహాను 7:37--38, ప్రకటన 21:6; 22:17 ప్రకారం దేవుడు ఇచ్చే జీవజలములే ఆ నీరు!!!

రెండు పరిశుద్ధాత్మ! ఈ నీళ్ళు క్రీస్తుకూ ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మకూ సూచన (యోహాను 7:38-39). శాశ్వత జీవాన్నిచ్చే నీటిని పొందే మార్గం క్రీస్తు దగ్గరికి వచ్చి త్రాగడమే.

John(యోహాను సువార్త) 7:38,39

38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.

మూడు దేవుని వాక్యము. 1పేతురు 2:3

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

ఇంకా అంటున్నారు డబ్బు లేని వారలారా! మీరు వచ్చి, కొని, తినండి! రండి! డబ్బు లేకుండానే, ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసం, పాలు కొనండి!

డబ్బు లేకుండానే”– సువార్తలోని దీవెనలు కేవలం దేవుని కృప మూలంగా ఉచితంగా లభిస్తాయి. (రోమ్ 3:24; 6:23; ఎఫెసు 2:8-9; తీతు 3:3-7). వీటన్నిటి వెలను క్రీస్తు చెల్లించాడు (53 అధ్యాయం).

రోమీయులకు 3:24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

రోమీయులకు 6:22

అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

రోమీయులకు 6:23

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

Ephesians(ఎఫెసీయులకు) 2:8,9

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

Titus(తీతుకు) 3:3,4,5,6,7

3. ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

4. మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు

5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

6. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,

7. నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.

ఇంకా ద్రాక్షరసం, పాలు కొనండి అంటున్నారు!

ద్రాక్షరసం: దేవుడు చిందించిన నిబంధన రక్తమునకు సాదృశ్యం!! మరియు కల్వరిలో ఆయన చూపిన శాశ్వత ప్రేమకు సాదృశం!!!

మత్తయి 26:28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

పాలు: దేవుని వాక్యము! 1పేతురు 2:3

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

కాబట్టి దేవుని నిబంధన రక్తము మరియు ఆయన వాక్యము ఉచితమే! దానికోసం వెల చెల్లించాల్సిన అవసరం లేదు!!! వెల దేవుడు ఎప్పుడో సిలువమీద చెల్లించారు. సిలువచెంత చేరి పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన పాదముల వద్ద క్షమించమని అడిగితే వెంటనే ఉచితముగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు!!!

ఇక తరువాత ఆహారము కాని దానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి అంటున్నారు!!

ఎందుకు?”– శాశ్వతమైన తృప్తి నివ్వలేని దానికోసం అస్తమానం మనుషులు తమ డబ్బును, శ్రమను ఖర్చుపెడతారు. ప్రసంగి 1:2; 2:11;

ప్రసంగి 1:2

వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.

ప్రసంగి 2:11

​అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.

యిర్మియా 2:13

నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

ఈ లోకం, దాని సుఖభోగాలు, పనులు, మతాలు మనిషిలో అసంతృప్తినీ, శూన్యాన్నీ మిగులుస్తాయి (1 యోహాను 2:16-17)

1 John(మొదటి యోహాను) 2:15,16,17

15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.

16. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

అందుకే తృప్తి కలిగించనిదానికి మీ కష్టార్జితం ఎందుకిస్తారు? నా మాట వినండి అంటున్నారు

వినండి”– సంపూర్ణంగా తృప్తినిచ్చే దాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు సువార్త మంచి పదార్థాల విందులాంటిది. అన్నిటిలోకీ భాగ్యవంతమైనది

కీర్తనలు 22:26

దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

మత్తయి 22:2

పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

Luke(లూకా సువార్త) 14:15,16

15. ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా

16. ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.

యోహాను 6:27

క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

అన్నిటికంటే ముఖ్యంగా వారికి దేని గురించి శ్రద్ధ ఉండాలో ప్రభువు చెప్తున్నాడు. ఈ క్షణికమైన జీవితావసరాల కోసం కాదు, శాశ్వత జీవం కోసమే, శరీరం కోసం కాదు ఆత్మకోసమే వారు పాటుపడాలి. మత్తయి 6:31-33; 16:26; యెషయా 55:1-2.

ఇక ఎదురు చూడాల్సింది ప్రయత్నం చేయాల్సింది శాశ్వత జీవం లేక నిత్యజీవం కొరకు–యోహాను 3:16. యేసుక్రీస్తు ప్రభులవారే (మత్తయి 8:20) ఆ ఆహారం ప్రసాదిస్తాడు, గానీ దానికోసం వారు కష్టపడాలన్న సంగతి గమనించండి. అంటే పాపవిముక్తి అనేది కష్టపడి మంచి పనులు చేస్తే వస్తుందని కాదు. క్రీస్తు ఇచ్చేదాన్ని మనుషులు ఆయనలో వెదికేందుకూ క్రీస్తులో నమ్మకం ఉంచి ఆ ఈవిని పొందేందుకూ అన్ని ప్రయత్నాలూ చెయ్యాలని దీని భావం (వ 29). మత్తయి 11:12; హీబ్రూ 4:11; 2 పేతురు 1:10 .

నిత్యజీవం ఇచ్చే, పరలోక రాజ్యం ఇచ్చే క్రీస్తు కోసం పాటుపడదాం!

దానికి తగిన జీవితం జీవిద్దాం!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*299వ భాగము*

యెషయా గ్రంథము 55:3--6

3. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

4. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని

5. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.

6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 55వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక మూడవ వచనంలో అంటున్నారు చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

నామాట విని నాదగ్గరికి రండి అప్పుడు నేను మీతో శాశ్వతంగా నిలిచివుండే నిబంధన చేస్తాను. దావీదుకు వాగ్దానం చేసిన అమోఘమైన అనుగ్రహం మీకు చూపిస్తాను అంటున్నారు. మీరు అలా చేస్తే మీరు బ్రతుకుదురు అంటున్నారు.

మీరు బ్రతుకుదురు లేక ప్రాణం దక్కించుకొంటారు అనగా– విని, చెంతజేరే వారికి సువార్త ఒక నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రసాదిస్తుంది (యోహాను 5:24; 20:31)

యోహాను 5:24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యోహాను 20:31

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

“శాశ్వత నిబంధన కోసం చూసుకుంటే దావీదు రాజవంశం శాశ్వతంగా నిలిచివుంటుందని వాగ్దానం చేశాడు దేవుడు (2 సమూ 7:14-16).

2 Samuel(రెండవ సమూయేలు) 7:13,14,15,16

13. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

14. నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని

15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.

16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

యేసుప్రభువు ద్వారా దేవుని నమ్మకమైన ప్రేమను ఇది నెరవేరుస్తుంది. యెషయా గ్రంథంలోని ప్రవచనాల్లో మనం ఆయనను ఒక రాజుగా తరుచు చూస్తాం!

Isaiah(యెషయా గ్రంథము) 9:6,7

6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 11:1-9; 32:1-5; 33:17.

ఇంకా ఇవి కూడా చూడండి!

కీర్తన 2:6-9; 45:6; 72:5-11; 89:28-29, 35-37; అపొ కా 13:34

ఇక తరువాత వచనంలో అంటున్నారు ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని.

ఇక్కడ అతడు అనగా ఎవరూ?!

దావీదు కుమారుడైన యేసు ప్రభువు అని అర్థం. యెహె 37:24-25;

Ezekiel(యెహెజ్కేలు) 37:24,25,26,27,28

24. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.

25.​ మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.

26.​ నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.

27.​ నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.

28. మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.

హోషేయా 3:5

తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.

ఇక తరువాత వచనంలో నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.

ఇక్కడ నీవు మరియు నిన్ను అంటున్నారు– ఇది ఎవర్ని ఉద్దేశించి చెప్పినమాట? బహుశా అభిషిక్తుడు కావచ్చు, లేక విముక్తి పొంది, పూర్వక్షేమస్థితికి చేరుకొన్న క్రొత్త ఇజ్రాయేల్ అని చెప్పడానికి మరింత అవకాశం ఉంది. లేక వారి అభిషిక్తుణ్ణి కలుపుకుని ఇస్రాయేల్‌ను ఉద్దేశించి ఇక్కడి మాటలు ఉన్నాయి అనుకోవచ్చు

యెషయా 2:2-4; 44:23; 60:2-3; 66:18-21; యిర్మీయా 3:17; జెకర్యా 14:16

Isaiah(యెషయా గ్రంథము) 2:2,3,4

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

Isaiah(యెషయా గ్రంథము) 60:2,3

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

ఇక తరువాత వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నారు.

కీర్తనలు 32:6

కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.

కీర్తనలు 49:8

వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు

కీర్తనలు 49:9

వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.

వెదకండి”– ద్వితీ 4:29; యిర్మీయా 29:13-14; హోషేయ 3:5; ఆమోసు 5:8; మత్తయి 7:7-8.

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 4:29,30,31

29. అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.

30. ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల

31. నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.

Jeremiah(యిర్మీయా) 29:12,13,14

12.​ మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

13.​​ మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,

14.​ నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.

మత్తయి 7:7-8

7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది తెరవబడుతుంది.

8 అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. వెదికే వ్యక్తికి దొరుకుతుంది. తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది.

చూడండి దేవుడు మీకు దొరికే కాలమందే ఆయన వెతకండి! ఆయన సమీపంలో ఉండగానే వేడుకోండి అంటున్నారు! ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం అని క్రొత్త నిబంధన సెలవిస్తుంది! కాబట్టి నేడు అనే దినం ఉండగానే ఇంకా కృపా కాలము ఈ రక్షణ కాలము పోకముందే, నీ ప్రాణం ఉండగానే, ఇప్పుడే దేవుని వెతకండి! ఆయనను పిలవండి అంటున్నారు! నీ జీవితమంతా లోకంలో లోక ఆశలతో జీవితాన్ని పాడు చేసుకుని తర్వాత ఆ జీవితం దేవునికి ఇస్తాము అంటే దేవుడికి అప్పుడు నీ జీవితం నీ బ్రతుకు అవసరం లేదు! నీ బలము నీ యవ్వనము అన్ని ఉండగానే ఇప్పుడే ఆయన దగ్గరికి రా! ఆయన్ని వేడుకో! చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు! అనగా దేవుడు నిన్ను అసహ్యించుకొని దూరంగా వెళ్లిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని ఎంతగా పిలిచినా నేను నిన్ను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి ఆయన చెప్తారు!

కాబట్టి నేడే ఆయన వద్దకు రా! ఇదే రక్షణ దినము! నేడే అనుకూల సమయం !!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*300వ భాగము*

యెషయా గ్రంథము 55:7--13

7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

12. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 55వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఏడవ వచనంలో దేవుడు దీవించాలంటే ఏమి చెయ్యాలో చెబుతున్నారు

భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

2దినవృత్తాంతములు 7:14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

సామెతలు 28:13

అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

Ezekiel(యెహెజ్కేలు) 18:27,28

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరి గించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

28. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.

దీనికి ఒక గమనార్హమైన ఉదాహరణ 2 దిన 33:1-20 లో ఉంది. హిజ్కియా గారి కుమారుడు మనష్షే దుర్మార్గుడు. శిక్ష అనుభవించాడు. చివరికి మారుమనస్సు పొంది దేవున్ని బ్రతిమాలుకుంటే దేవుడు విడిపించారు.

ఇక చెడ్డవారు తమ తలంపులు మానాలి అంటున్నారు

తలంపులు”– దుష్టులు బాహాటంగానే కాక అంతరంగంలో కూడా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మనుషుల అంతరంగాల్లో పుట్టే చెడు తలంపులే వారి దుష్‌క్రియలకు మూలం (ఆది 6:5; 8:21; మత్తయి 5:28; 15:19; 2 కొరింతు 10:5). మన తలంపులను బట్టి, క్రియలను బట్టి కూడా పశ్చాత్తాపపడాలి.

అలా చెడు తలంపులు మానితే ఆయన క్షమిస్తారు

యెషయా 43:25; 44:22; 53:5; మీకా 7:18-19; ఎఫెసు 1:7; 1 యోహాను 1:9.

యెషయా 43:25

నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచి వేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

యెషయా 44:22

మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

ఇక తరువాత వచనంలో అంటున్నారు యెహోవా చెప్పేదేమిటంటే, “నా ఆలోచనలు

మీ ఆలోచనలలాంటివి కావు. మీ విధానాలు నా విధానాలలాంటివి కావు.

తమకు వ్యతిరేకంగా పాపం చేసినవారిని క్షమించడం పాపంలో ఉన్న మనుషుల ప్రవర్తన కాదు. ఇతరుల పట్ల వాత్సల్యం చూపడంలో వారికి ఆనందం ఉండదు. ఇది కేవలం దేవునికే చెందుతుంది.

తరువాత వచనంలో ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

దేవుడు చేసిన దానంతటినీ అర్థం చేసుకోవడం మొదలు పెట్టడమే మన తలంపులకు మించిన పని. అలాంటప్పుడు ఆ దేవుని మనస్సు లోతుల్లో ఏముందో గ్రహించడం ఎంత అసాధ్యం! కాబట్టి దేవుని మూలంగా కలిగిన ఈ యెషయా గ్రంథం, దేవుని తలంపులు, ఆయన ఉద్దేశాలు పొంగి పొరలుతూ ఉన్న ఈ గ్రంథం, ఇలాంటి ఇతర గ్రంథాలు మనకు పూర్తిగా అర్థం చేసుకొనేందుకు కష్టతరమైనవిగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.

కీర్తనలు 145:3

యెహోవా మహాత్మ్యముగల వాడు ఆయన అధికస్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది

Romans(రోమీయులకు) 11:33,34,35,36

33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?

36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

ఇక తరువాత వచనాలలో అంటున్నారు 10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

దేవుడు ఏ ఉద్దేశంలో వాననూ మంచునూ సృజించాడో అవి ఆ ఉద్దేశాలను చక్కగా నెరవేరుస్తాయి. దేవుని వాక్కు కూడా అంతే. దేవుని వాక్కులు ఆయన నోటినుండీ ఆయన ప్రవక్తల నోటినుండీ వచ్చి అక్కడినుండి లోకంలో దేవుని సంకల్పాలను నెరవేర్చేందుకు బయలుదేరాయి (యెషయా 44:26; యిర్మీయా 1:9-10; 25:15-17; యెహె 37:9-10; మత్తయి 4:4; యోహాను 6:63). దేవుడొక మాట చెప్పాడంటే దానికిక తిరుగు లేదు. అలాగే జరిగిపోతుంది (ఆది 1 వ అధ్యాయం చదవండి). ఇందువల్లనే ఎప్పుడో భవిష్యత్తులో నెరవేరనున్న బైబిలు భవిష్యద్వాక్కులో క్రియా వాచకం భూతకాలంలో ఉండవచ్చు. అంటే అవన్నీ అప్పటికే నెరవేరిపోయినట్టుగా రాసి ఉన్నాయి. వాటి నెరవేర్పు అంత ఖాయమన్నమాట.

యెషయా 44:26

నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

మత్తయి 4:4

అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

యోహాను 6:63

ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

ఇక చివరి వచనాలలో అంటున్నారు 12. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

దేవుడు సాధించే ఆయన ఉద్దేశాల్లో ఇదొకటి. దేవుడు చెప్పాడు కాబట్టి ఇది జరిగిపోయినట్టే. ఇజ్రాయేల్ విడుదల పొంది, ఆ దేశం దీవెనలతో సమృద్ధిగా ఉన్న దృశ్యం ఇక్కడ కనిపిస్తున్నది – యెషయా 35:1-2, 10; 41:18-20; 44:23; 52:9. కీర్తన 96:11-13; 98:7-9 చూడండి. అన్ని కాలాల్లోనూ దేవుని రాజ్యంలోని సహజ గుణాలు ఆనందం, శాంతి, గానాలాపన (రోమ్ 14:7).

కాబట్టి మన పాపములు అతిక్రములు మానివేసి ఆయన మాట వినడం మొదలుపెడితే, ఆయన వాక్కు ఆయన వాక్యము మన హృదయంలో పని చేయడం మొదలు పెడుతుంది! అది ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండడమే కాకుండా ఆయన రాజ్యమునకు వారసులుగా, పరలోక రాజ్యము చేరి ప్రభుత్వ జీవించగలము!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*301వ భాగము*

యెషయా గ్రంథము 56:1--7

1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి.

2. నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.

3. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

4. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5. నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

6. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియదైవజనమా! మనము 55వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 56వ అధ్యాయం ధ్యానం చేసుకుందాము!

మొదటి వచనంలో అంటున్నారు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి.

ప్రియులారా! ఈ వచనం కోసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి!

రాబోయే కాలంలో కనిపించే ఒక గొప్ప సంభవాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సంభవం ఏమిటో, ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా లేదు.

1) దేవుని రక్షణ, ఆయన నీతినిజాయితీ వెల్లడయ్యే ఈ సంభవం ఆయన ఇజ్రాయేల్ ను క్రీ.పూ. 538లో బబులోను చెరనుండి విడిపించిన వృత్తాంతమని కొందరి అభిప్రాయం (41:2; 44:28; 45:1-7 పోల్చి చూడండి).

యెషయా 41:2

తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.

Isaiah(యెషయా గ్రంథము) 45:1,2,3,4,5,6,7

1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

2. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని

5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

6. తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొను నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

7. నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను.

2) యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు రక్షణ, నీతిన్యాయాలు అద్భుతమైన రీతిలో వెల్లడైన సంభవం అని మరి కొందరి అభిప్రాయం.

3) మరి కొందరు ఇది క్రీస్తు రెండవ రాకడ సమయంలో రక్షణ నీతిన్యాయాలు వెల్లడై లోకమంతటా స్థిరపడే సమయాన్ని సూచిస్తున్నదని భావిస్తున్నారు (11:3-9; 32:1-5).

Isaiah(యెషయా గ్రంథము) 11:3,4,5,6,7,8,9

3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

4. కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

Isaiah(యెషయా గ్రంథము) 32:1,2,3,4,5,6

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

2. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

3. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

4. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

ఏది ఏమైనా యెషయా కాలంలోని ప్రజలు నీతి న్యాయాలతో జీవించాలని హెచ్చరించడానికి ఈ సంభవం ఉపయోగపడింది. 2 పేతురు 3:11-14.

2 Peter(రెండవ పేతురు) 3:10,11,12,13,14

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు (త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

13. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.

14. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.

ఇక రెండవ వచనం నుండి విశ్రాంతి దినం కోసం, అన్య జనాంగం నుండి రక్షించబడిన మనలాంటి వారికోసం, విదేశీయులు కోసం మరియు నపుంషకుల కోసం మాట్లాడుతున్నారు!

2. నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.

3. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

4. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5. నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

6. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.

విశ్రాంతి దినం కోసం: విశ్రాంతి దినాన్ని”– నిర్గమ 20:8-11; యిర్మీయా 17:19-27. విశ్రాంతి దినమంటే దేవుడు ఇస్రాయేల్‌తో చేసిన పాత నిబంధన కు గుర్తు (నిర్గమ 31:12-18). ఇది మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగం. ఇక్కడ ఇస్రాయేల్‌వారు అనుసరించవలసిన ధర్మశాస్త్రం అంతటికీ ప్రతినిధిగా ఉంది. ప్రస్తుతం క్రొత్త నిబంధన క్రింద ఉన్న విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద లేరు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలన్న ఆజ్ఞ ఎక్కడా కనిపించదు. ఆ మాటకొస్తే క్రైస్తవులు తమ ప్రవర్తనలో చూచుకోవలసిన విషయంగా పది ఆజ్ఞల్లో విశ్రాంతి దినం గురించిన ఆజ్ఞ ఒక్కదాన్ని మాత్రం చెప్పకుండా వదిలెయ్యడం జరిగింది. అయితే వారంలో ఒక్కరోజు అది ఏ రోజైనా కానివ్వండి, విశ్రాంతికీ, ఆరాధనకూ ప్రత్యేకించి దాన్ని అలా ఆచరిస్తే ఇదెంతో ప్రయోజనకరమౌతుంది. అయితే ఆది అపొస్తలులు విశ్రాంతి దినం శనివారం బదులుగా, ప్రభువుదినమైన (యెహోవా దినం కాదు) ఆదివారంనాడు సమాజంగా కూడుకోవడం మొదలుపెట్టారు. దానినే మనము ఆచరిస్తున్నాము. కారణం ఆదివారంనాడు యేసుక్రీస్తు ప్రభులవారు పునరుత్థానం చెందారు కాబట్టి!!!

అన్యులకోసం : యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు.

ఇప్పుడు క్రొత్త నిబంధన క్రింద ఉన్న యూదేతరుడెవడూ ఇలాంటి ఆలోచనే మనస్సులోకి రానివ్వడు. కానీ ద్వితీ 23:3, 7, 8 లాంటి వచనాలను బట్టీ, ఇజ్రాయేల్ ప్రత్యేక ప్రజలై వేరుగా ఉన్నారన్న ఆదేశాన్ని బట్టీ ఆ కాలంలో విదేశీయులెవరైనా ఇలా అనుకోవచ్చు.

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 23:3,7,8

3. అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.

7. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింప కూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.

8.​ వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.

కాబట్టి ఇప్పుడు వారు ఏదేశపు వారైనా నిరభ్యంతరంగా క్రీస్తు వద్దకు రావచ్చు!!!

ఇక నపుంషకులకోసం విస్తారంగా చెబుతున్నారు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

4. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5. నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

ద్వితీ 23:1

ఎవడికైనా వృషణాలు చితగ్గొట్టడం గానీ పురుషాంగం కోయడం గానీ జరిగితే అతడు యెహోవా సమాజంలో చేరకూడదు.

పూర్వకాలంలో బలవంతంగా పురుషులను పట్టుకుని వారిని బానిసలుగా చేసి, వారి పురుషాంగాన్ని తొలిగించి నపుంషకులుగా చేసేవారు. ఈ పద్దతి ఈజిప్ట్ లోను, అష్షూరు, బబులోను, మాదీయ పారశీక రాజ్యాలలోను మరియు గ్రీకు దేశంలోను విస్తారంగా ఉంది. ఈ నపుంషకుల్ని రాజ కుటుంబానికి చెందిన స్త్రీల కు పరిచర్య చేయడానికి, వారికి కాపలా ఉండటానికి ఉపయోగించే వారు.

ఇప్పుడు దేవుడు ఇలాంటి వారితో అంటున్నారు నా విశ్రాంతిదినాలను పాటిస్తూ, నాకు ఇష్టమైనవాటిని కోరుకొంటూ, నా ఒడంబడికలో దృఢంగా నిలుస్తూవుండే నపుంసకులకు నా ఆలయంలో నా గోడలలోపల ఒక భాగం ఇస్తాను. కొడుకులకంటే, కూతుళ్ళకంటే మంచి పేరుప్రతిష్ఠలు వారికి ప్రసాదిస్తాను. శాశ్వతమైన పేరుప్రతిష్ఠలు ప్రసాదిస్తాను. వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు అంటున్నారు!!!

ఎవరైనా తమను తాము దేవునికి అంటగట్టుకుని ఆయన నిబంధనను పాటిస్తూ ఉంటే అలాంటి వారెవరినీ దేవుడు తన ఆలయంలోనుండీ, తన సహవాసంలో నుండీ త్రోసివేయడని అర్థం ఇచ్చే వాగ్దానం.

ఇక వీరికోసం యేసయ్య చెబుతున్నారు

మత్తయి 19:12

తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

నూతన నిబంధన సంఘకోణంలో చూసుకుంటే ఈరోజు నీకేదైనా అవయవాల లోపం ఉందా?! భయపడకు, కృంగిపోకు! దేవునికి నీ ఎడల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఇక పరలోకం కోసం దేవుని రాజ్యం కోసం ఆయన పరిచర్యకోసం తమకు తాముగా నపుంషకులుగా జీవిస్తున్న దైవజనులారా! మీ ప్రయాస గొప్పది. మీత్యాగం గొప్పది. మీరు తప్పకుండా ఆయన రాజ్యం లో ఉన్నతమైన స్థానం పొందబోతున్నారు. సీయోను కొండమీద నిలువబడబోతున్నారు. ఆయన రాజ్యం కోసం సువార్త పరిచర్యకోసం సంసార సుఖం వద్దని, భాగ్యస్వామి ఉన్నా క్రీస్తు కోసం సుఖాలను త్యజించి నపుంషకులుగా చప్పిడి పథ్యం చేస్తున్న ఓ సేవకులారా మీతో దేవుడు అంటున్నారు నా విశ్రాంతిదినాలను పాటిస్తూ, నాకు ఇష్టమైనవాటిని కోరుకొంటూ, నా నిబంధనలో దృఢంగా నిలుస్తూవుండే నపుంసకులకు నా ఆలయంలో నా గోడలలోపల ఒక భాగం ఇస్తాను. అనగా పరలోకంలో ఉన్న నిజమైన దేవాలయం లో ఉండి పరిచర్య చేసే భాగ్యం దేవుడు ఇవ్వబోతున్నారు ఇంకా కొడుకులకంటే, కూతుళ్ళకంటే మంచి పేరుప్రతిష్ఠలు వారికి ప్రసాదిస్తాను. శాశ్వతమైన పేరుప్రతిష్ఠలు ప్రసాదిస్తాను. వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు అంటున్నారు!!!

నూతన నిబంధన సంఘంలో విశ్రాంతి దినం అనగా ఒక్క ఆరాధన కూడా వదలకుండా తప్పకుండా హాజరయ్యేవారికి దేవుడు అనేకమైన ఆశీర్వాదములు ఇవ్వబోతున్నారు.

6వ వచనంలో విశ్రాంతిదినం ప్రస్తావన ఉంది కాబట్టి పాత నిబంధన గురించి మాట్లాడుతున్నట్టు అర్థమౌతుంది. ఇక్కడ విదేశీయులు అంటే యూదు మతంలో ప్రవేశించినవారు (కొర్నేలిలాగా – అపొ కా 10వ అధ్యాయం). హోమాలు, బలులు కూడా పాత నిబంధన ను సూచిస్తున్నాయి. క్రొత్త నిబంధనలో వాటికి స్థానం లేదు. 7వ వచనం చివరి భాగాన్ని యేసుప్రభువు మార్కు 11:17లో ఉన్నదున్నట్టు పలికాడు.

ఆయన వారికి ఉపదేశిస్తూ “నా ఆలయం జనాలన్నిటికీ ప్రార్థన ఆలయం అంటారని రాసి ఉంది గదా. మీరైతే దానిని దోపిడీదొంగల గుహగా చేశారు” అన్నాడు.

దహనబలులును బలులును నాకు అంగీకారములగును: నూతన నిబంధన కోణంలో బలులు దహనబలులు నోటితో స్తుతియాగం చేయడం, సర్వాంగహోమంగా మన శరీర అవయవాలను దేవునికి అర్పించడం. అనగా మాటద్వారా గాని, చూపు ద్వారా గాని, శరీరంతో గాని చివరకు ఆలోచనల ద్వారా కూడా పాపం చేయకుండా దేహంతో దేవున్ని మహిమ పరచడమే సర్వాంగహోమంగా అర్పించుకోవడం. మరి నీ దేహమును దేవునికి అర్పించుకున్నావా?! ఆయనను స్తుతిస్తూ ఆయన సువార్తను ప్రచురం చేస్తున్నావా?!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*302వ భాగము*

యెషయా గ్రంథము 56:8--12

8. ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.

9. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి.

10. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు.

12. వారిట్లందురు నేను ద్రాక్షారసము తెప్పించెదను మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 56వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 8వ వచనంలో అంటున్నారు ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.

దీని కోసం చూసుకుంటే

Isaiah(యెషయా గ్రంథము) 11:10,11,12,13,14,15,16

10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు

14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు

15. మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.

16. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

ఇక ఇతరులు అనగా గతంలో యూదా మతాన్ని అవలంబించిన కొద్దిమంది కంటే చాలామంది విదేశీయులు ఇస్రాయేల్‌తో సమకూడుతారు

2:2-3; 49:5-6; 55:5; 60:3; జెకర్యా 8:2;

ఇక వారే కాకుండా

యోహాను 10:16; రోమ్ 11:11-18

యోహాను 10:16

ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.

Romans(రోమీయులకు) 11:11,12,13,14,15,16,17,18,19

11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.

12.వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

13. అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి,

14. వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను.

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

ఇక తరువాత వచనంలో పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి అంటున్నారు!

9-12 వచనాలో ఇజ్రాయేల్ పైకి ముంచుకువస్తున్న ప్రమాదాన్ని 9వ వచనం సూచిస్తున్నది. బైబిల్లో అక్కడక్కడ దుష్టజాతులను మృగాలు అని పిలవడం కనిపిస్తున్నది – యిర్మీయా 4:7లో సింహం అనీ, దానియేలు 7,8 అధ్యాయాల్లో మృగాలు అనీ ఉంది. ఇస్రాయేల్ నాయకులు, యాజకులు, ప్రవక్తలు కూడా అంధులు, చెడిపోయినవారు. కుక్క కూడా ప్రమాదాన్ని పసిగడితే మొరుగుతుంది. కానీ ఈ కావలివాళ్ళు మాత్రం తమకు మరింత తిండి కావాలనే మొరుగుతుంటారు (వ 11).

యిర్మీయా 4:7

పొదల్లోనుంచి సింహం వచ్చింది. జనాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు.

మీ దేశాన్ని పాడు చేయడానికి అతడు తన స్థలం విడిచివస్తున్నాడు. మీ పట్టణాలు శిథిలమైపోతాయి. వాటిలో ఎవరూ కాపురముండరు.

కాపరులు కోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము–

యిర్మియా 23:1

యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.

యిర్మియా 23:2

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

యెహె 34:1-6.

ఇక తరువాత కాపరులంతా స్వలాభం కోసం చూసుకుంటారు అంటున్నారు!

యెషయా 57:17; యిర్మీయా 6:13; 8:10; 22:17; యెహె 13:19; మీకా 3:11;

ఫిలిప్పీయులకు 3:18

అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.

ఫిలిప్పీయులకు 3:19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

చివరి వచనం లో కాపరులు కోసం ఇంకా అంటున్నారు వాళ్ళు అంటారు, “నేను ద్రాక్షమద్యం తెప్పిస్తాను. సారాయి కడుపునిండా త్రాగుదాం రండి. రేపు ఈ రోజులాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది అంటున్నారు!

ప్రియ దైవజనమా మనమైతే అలా ఉండొద్దు!

పౌలు గారు తిమోతి గారితో అంటున్నారు

1 Timothy(మొదటి తిమోతికి) 6:7,8,9,10,11,12

7. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.

8. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము.

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము).

12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

ఇలా జీవిద్దాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*303వ భాగము*

యెషయా గ్రంథము 57:1--7

1. నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.

2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

3. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.

4. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

5. మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,

6. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

7. ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 56వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 57వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా! ఈ అధ్యాయం లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

1) నీతిమంతులు కొందరు త్వరగా చనిపోతారు. పాపి చిరాయువు! ఎందుకు ఎలా?!

2) ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధన అనే వ్యభిచారమును ఎండారగడుతున్నారు 3--13 వరకూ!!

3) ఇశ్రాయేలు ప్రజల ను తిరిగి చేర్చుకోవడం!

1) *నీతిమంతులు కొందరు త్వరగా చనిపోతారు. పాపి చిరాయువు! ఎందుకు ఎలా?!*

మొదటి రెండు వచనాలలో అంటున్నారు

1. నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.

2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

ఉగ్రతా కాలం, శిక్ష దినాలు రాకముందే దేవుడు కొందరు నీతివంతులను ఈ లోకంనుండి తీసుకుని పోతారు. అయితే మిగిలివున్న దుష్టులకు ఏమి జరుగుతున్నదీ అర్థం కాలేదు. న్యాయవంతులు అలా చనిపోవడం వారి పైకి దేవుడు పంపిన శిక్ష అని దుర్మార్గులు భావిస్తారు! గాని నిజానికి నీతిమంతులు ముందుగానే ఎందుకు చనిపోతారంటే కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారు. కీడు చూడకుండేలా న్యాయవంతులను తీసివేయడం జరుగుతుంది అంటున్నారు భక్తుడు!!! ఈ విషయం దుష్టులు గ్రహించడం లేదు!! అయితే పాపి త్వరగా చనిపోడు. పాపి చిరాయువు! చివరకు కుళ్ళి కుళ్లి చస్తాడు వాడు!!!!

ఇక రెండవ వచనం లో అంటున్నారు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

నీతిమంతులు త్వరగా చనిపోయి విశ్రాంతిలో ప్రవేశిస్తారు అంటున్నారు. నిజానికి అది ఏ విశ్రాంతి?! శాశ్వత విశ్రాంతి! ఆ విశ్రాంతికి ఒక పేరు ఉంది!

దానిపేరు పరదైసు! దానినే అబ్రాహాము రొమ్ము అనికూడా పిలిచేవారు! లూకా సువార్తలో 16వ అధ్యాయం దీనికోసం చెబుతుంది!

లూకా 16:22

ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

లూకా 16:23

అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి

లూకా 16:24

తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను.

ఇదే విశ్రాంతి!! అయితే ఇది యేసుక్రీస్తు ప్రభులవారి మరణం వరకూ పాతాళంలో ఒకభాగమై ఉండేది గాని యేసుక్రీస్తు ప్రభులవారి పునరుత్థానం తరువాత పరదైసు అడ్రసు మారిపోయింది. భూమి క్రింద పాతాళంలో ఉండే పరదైసు ఇప్పుడు మూడవ ఆకాశంలోకి పరలోకములో ఒక భాగమై పోయింది. యేసుక్రీస్తు ప్రభులవారు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యుల కు ఈవులను అనుగ్రహంచెను అని చెబుతున్నారు!!

ఇక తరువాత తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు. దీని అర్థం ఏమిటి!!!

మొదటగా సూటిగా ఉన్న మార్గం ఏమిటి?! ఇరుకు మార్గం! క్రీస్తు యేసుక్రీస్తు నడిచిన మార్గం! రాజమార్గం! ఆయన నడచిన దారిలో ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన బాటలో నడుస్తూ, వాక్యానుసారమైన జీవితమే సూటి మార్గం!!

రెండవదిగా నీతిమంతులు యధార్థవంతులు మంచము మీద పడుకుని నిద్రలోనే చనిపోతారు అంటున్నారు! అంతేగాని ఏ యాక్సిడెంట్ లోనో, ఏ దీర్ఘకాలిక వ్యాధితోనో అనగా కేన్సర్, కుష్టు రోగంతోనో ఏ ఎయిడ్స్ తోనో చచ్చి పోడు అంటున్నారు! దుర్మార్గులు కాలం తీరకుండా మధ్యలోనే పోతారు లేదా కుళ్లి కుళ్లి పురుగులు పడి చస్తారు అని అర్థం!

ఇక తరువాత వచనం నుండి 2) ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధన అనే వ్యభిచారమును ఎండారగడుతున్నారు 3--13 వరకూ!!

3. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.

4. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

ఇక్కడ దేవుడు మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా ఇంతటి ఘోరమైన మాటలు మాట్లాడటానికి కారణం ఏమిటి?

తరువాత రాసివున్నదాన్ని బట్టి ఇది ఆధ్యాత్మిక వ్యభిచారంగా అర్థం చేసుకోవచ్చు (యిర్మీయా 3:14; 31:32; యెహె 16—23 అధ్యాయాలు).

యిర్మియా 3:14

భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

యిర్మియా 31:32

​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

ఇక్కడ మీరు అనగా– ఆ దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న దుర్మార్గుల కోసం చెబుతున్నారు 1:2-4, 10-17లో ఉంది. గాని వారు తాము దేవుని సంతానమనే వారు భావిస్తున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 1:2,3,4,10,11,12,13,14,15,16,17

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

10. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

మత్తయి 3:7-9;

7. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.

8. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు;

9. దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

మత్తయి 12:34

సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

23:33

మత్తయి 23:33

సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

ఇక తరువాత వచనంలో ఎవరిని చూసి వెక్కిరిస్తున్నారు అంటున్నారు

దేవుని నిజ ప్రవక్తలందరినీ ఇజ్రాయేల్ లోని దుర్మార్గులు హేళన చేసి వెక్కిరించారు.

Isaiah(యెషయా గ్రంథము) 28:9,14,15

9. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

14. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

15. మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

ఇలాంటి అపహాసకులను విగ్రహారాధికులను దేవుడు శిక్షించే సమయం ఆసన్నమైంది. ఇంకా నేటి రోజుల్లో పరిశుద్ధాత్మను భాషలను వెక్కరించే వారిని కూడా శిక్షించే సమయం దగ్గరలో ఉందని గమనించండి!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*304వ భాగము*

యెషయా గ్రంథము 57:1--7

1. నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.

2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.

3. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.

4. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

5. మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,

6. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

7. ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 57వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 5వ వచనం నుండి అంటున్నారు మస్తకి వృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,

6. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?

7. ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి

ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధన అనే వ్యభిచారం కోసం చాలా విస్తారంగా ఈ శీర్షిక లో చూసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

సిందూర వృక్షాలలో, పచ్చని ప్రతి చెట్టుక్రిందా మీరు కామాగ్నిలో మాడిపోతున్నారు.

కనుమలలో, బండల సందులలో పిల్లలను చంపి బలిగా అర్పిస్తున్నారు.

ఈ వచనంలో ప్రతీ పచ్చని చెట్టు క్రింద అనడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో విగ్రహాలను చెట్లక్రింద ఉంచేవారు. అలా విగ్రహాలను మ్రొక్కుతూ చెట్టుని కూడా మ్రొక్కేవారు. ఉదాహరణకు మన దగ్గర వేపచెట్టుని మ్రొక్కుతున్నట్లు!! దీనిని వ్యభిచారం తో పోలుస్తున్నారు.

ఇక బండల సందులలో పిల్లలను చంపి బలిగా అర్పిస్తున్నారు. అనగా ఆ దేశాలలో పూర్వకాలంలో చంటిపిల్లలను బలిగా అర్పించేవారు. ఆ విగ్రహాలయాలు కొండగుహలలో సాధారణంగా ఉండేవి. ఆ బండమీద చంటిపిల్లను గాని, కన్యకలను గాని, నరబలిగాని ఇస్తే ఆ రక్తం బండనుండి క్రిందకి దిగి అక్కడ ఉన్న జలపాతంలో కలిస్తే, ఆ రక్తపునీటిని అర్పించి ఆ నీటితో స్నానం చేసేవారు.

లేవీయకాండము 18:21

​నీవు ఏ మాత్రమును నీ సంతానమునుమోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయ కూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.

ద్వితియోపదేశకాండము 18:10

తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

ద్వితియోపదేశకాండము 18:11

కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

Psalms(కీర్తనల గ్రంథము) 106:36,37,38,39

36. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.

37. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.

38. నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను

39. తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.

యెహేజ్కేలు 16:20

మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి,

యెహేజ్కేలు 16:21

నీ జారత్వము చాలకపోయెననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి యప్పగించితివి.

అందుకే తరువాత వచనంలో అంటున్నారు లోయలో ఉన్న రాళ్ళే మీ భాగం.

అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యాలు అర్పిస్తున్నారు.

ఇలా జరుగుతూ ఉంటే నాకు దయ రావాలా?

ఇన్ని భయంకరమైన పనికిమాలిన పనులు చేస్తూ ఏమీ ఎరగనట్లు నాకు ప్రార్థన చేస్తున్నావే ఇవన్నీ చూసి నేను ఊరుకోవాలా అంటున్నారు!

తరువాత వచనంలో ఎత్తయిన, ఉన్నతమైన కొండమీద నీ పరుపు వేసుకొన్నావు. బలులు అర్పించడానికి నీవు అక్కడికే ఎక్కిపోయావు.

8 నీవు తలుపుల వెనుక, ద్వారం బంధాల వెనుక నీ స్మృతి చిహ్నం ఉంచావు.

నన్ను వదిలిపెట్టి బట్టలు విడిచి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకొన్నావు.

ఎవరి మంచాన్ని నీవు ప్రేమించావో వాళ్ళతో ఒడంబడిక చేసుకొన్నావు. వాళ్ళ దిగంబరత్వాన్ని చూశావు అంటున్నారు

కొండ లేక ఉన్నతమైన స్థలము అనగా”– కొండలపై ఉండే విగ్రహాల పూజ స్థలాలు

యిర్మియా 3:6

మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను ద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.

యెహేజ్కేలు 16:16

మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాటిమీద పండుకొని వ్యభిచారము చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగకూడనివి, అట్టి వియు నిక జరుగవు.

22:9

యెహేజ్కేలు 22:9

కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపుర మున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.

ఇక ఇక్కడ “పరుపు” అనగా– ఆత్మసంబంధమైన జారత్వం (వ 3).

తరువాత వచనంలో నీవు తలుపుల వెనుక, ద్వారం బంధాల వెనుక నీ స్మృతి చిహ్నం ఉంచావు. నన్ను వదిలిపెట్టి బట్టలు విడిచి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకొన్నావు. ఎవరి మంచాన్ని నీవు ప్రేమించావో వాళ్ళతో ఒడంబడిక చేసుకొన్నావు.

వాళ్ళ దిగంబరత్వాన్ని చూశావు అంటున్నారు!

“స్మృతి చిహ్నం”– వాళ్ళు అనుసరించిన దేవుళ్ళను వారికి గుర్తు చేసేందుకు.

ప్రేమించావో అనగా”– ఇతర జనాల దేవుళ్ళతో, వారి విగ్రహాలతో ఇహలోక సంబంధమైన పొత్తు పెట్టుకోవడానికి గుర్తుగా అంటున్నారు! (యిర్మీయా 3:2; యెహె 16:26; 23:7).

ఇశ్రాయేలు ప్రజలు ఇంతటి ఘోరమైన స్థితిలో ఉన్నారు.

ప్రియ నూతన నిబంధన సంఘమా! నీ పరిస్థితి ఎలా ఉంది?! క్రీస్తులో సగం లోకములో సగమా!? చర్చిలో నతానియేలు ఊరిలో నాగేశ్వరరావా!! అబ్రాహాము- అప్పారావా? చర్చిలో శారమ్మ ఊరిలో శారద కదా!!! లోక ఆచారాలను వదలకుండా చర్చికి వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అని పాడినంత మాత్రాన పరిశుద్ధుడవు అయిపోతావా?!

ముందు బ్రతుకు మార్చుకో!

తర్వాత పేరు మార్చుకో!

నీ జీవితమంతా సగం సగం చెరిసగంగా ఉండకూడదు!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*305వ భాగము*

యెషయా గ్రంథము 57:9--13

9. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి

10. నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండి నందుననే గదా నీవు నాకు భయపడుట లేదు?

12. నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును.

13. నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 57వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తొమ్మిదవ వచనం నుండి చూసుకుంటే నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి

10. నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.

ఇక్కడ రాజు అనగా – బహుశా మొలెకు దేవుణ్ణి ఉద్దేశించి వాడిన పదం. మొలెకు అంటే రాజు అని అర్థం. లేవీ 18:21; 1 రాజులు 11:7; యిర్మీయా 32:35 ప్రకారం!! కానీ ఇజ్రాయేల్ వారు తరుచుగా ఇతర రాజ్యాలతో చేసుకున్న సంధి ఒప్పందాలను ఈ వచనం చెప్తూ ఉండవచ్చు. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి తైలం తీసుకుని రాజునొద్దకు అనగా మొలెకు దేవత దగ్గరకు వెళ్లావు! ఇంకా రాయబారులను దూరప్రాంతాలకు రాయబారం కోసం ఇంకా విగ్రహారాధన కోసం పంపించావు అంటున్నారు!

తరువాత వచనంలో నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు అంటున్నారు! చూడండి ఏమంటున్నారో నీ దీర్ఘ ప్రయాణాలవల్ల నీవు అలసిపోయావు. అయినా మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది, గనుక నీవు నీరసించిపోలేదు అంటున్నారు! నిజానికి ఇతర రాజ్యాలలో చేసుకొన్న ఒప్పందాలు తమకు బలం చేకూర్చగలవని వారు అనుకున్నారు. ఇది కేవలం పొరపాటు.

తరువాత వచనంలో ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండి నందుననే గదా నీవు నాకు భయపడుట లేదు?

నీవు ఏ రాజుకి భయపడి నన్ను వదిలేసి విగ్రహాలు వెనుక, సంధి రాయబారాలుతో గడుపుతున్నావు అంటున్నారు. వాడికి భయపడ్డావే గాని నిన్ను నిర్మించి ప్రేమించి పోషిస్తున్న నాకు భయపడటం లేదు అంటున్నారు!

ఇతర రాజ్యాలకూ, కేవలం మానవ మాత్రులకూ వారు భయపడ్డారు

Isaiah(యెషయా గ్రంథము) 51:12,13

12. నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

13. బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

ఇంకా అంటున్నారు బహుకాలమునుండి నేను మౌనముగానుండి నందుననే గదా నీవు నాకు భయపడుట లేదు?

దేవుడు మనం తప్పు చేసిన వెంటనే లాగి లెంపకాయ కొట్టడం లేదు దయచూపిస్తున్నారు కాబట్టి మనము దేవునికి భయపడటం లేదు. నిజం చెప్పాలంటే దేవున్ని లెక్కచేయడం లేదు. హా మన దేవుడే కదా, క్షమించమని రెండు కన్నీటి బొట్లు కార్చితే కరిగిపోతాడు కదా అని అనుకుంటున్నాము!

ప్రసంగి 8:11

దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.

యెషయా 42:14

చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.

నాకు భయపడడం లేదు చూసుకుంటే ఆదికాండము 20:11

అబ్రాహాముఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.

Psalms(కీర్తనల గ్రంథము) 34:11,12,13,14,15,16,17

11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?

13. చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

15. యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.

16. దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.

17. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

అయితే

కీర్తనలు 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి వికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

భయభక్తులు– అసలైన విషయానికి వచ్చేశారు సొలొమోను గారు. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తి భావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకొనేదాని కనుచూపు మేరకైనా చేరలేము. ఆది 20:11; కీర్తన 34:11-14; 111:10; 130:3-4. ఇలాంటి భయభక్తులు లేనివారు విద్యావంతులై ఉండవచ్చు. మేధావులు, ఆరితేరినవారై ఉండవచ్చు. ఒకవేళ బైబిలు కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. “యెహోవా మీది భయభక్తులు” అనే మాటలు, అలాంటి అర్థాన్నిచ్చే మాటలు సామెతలు గ్రంథంలో 14 సార్లు కనిపిస్తాయి. ఇది ఈ సామెతలు గ్రంధానికి కీలకమైన అంశం. తత్వశాస్త్రం, వేదాంతం, ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబిలు వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్తగా గమనించండి.

తరువాత వచనంలో 12 నీ నీతినిజాయితీ ఎంతో, నీ క్రియలు ఎలాంటివో నేను వెల్లడి చేస్తాను. వాటివల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అంటున్నారు!

Isaiah(యెషయా గ్రంథము) 58:2,3

2. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.

3. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

యెషయా 64:6

మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

యెషయా 64:7

నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

ఇక తరువాత వచనంలో నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు అంటున్నారు.

నీవు నన్ను అనుసరించక అన్యదేవతలను పూజిస్తున్నావు కాబట్టి నీకు కష్టమొచ్చినప్పుడు నేను ఆదుకోను. మీ విగ్రహాలకు మొర్రపెట్టుకోండి అంటున్నారు!

ఇది మానవ స్వభావం. దేవునితో పని లేకుండా తన ఇష్ట ప్రకారం అన్నీ చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు సహాయం కోసం దేవునికి మొర్ర పెడతారు.

యెషయా 44:17

దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

Judges(న్యాయాధిపతులు) 10:12,13,14

12. సీదోనీయులును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా

13. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను.

14. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.

ప్రియమైన సోదరి సోదరుడా! నీవు కూడా ఇప్పుడు దేవున్ని వదిలేసి లోకంలో కలిసిపోయి లోకానుసారమైన జీవితం జీవిస్తూ, కష్టమొచ్చినప్పుడు నీవే నాకు దిక్కు నా ఆశ్రయం, నా కొండ నాకోట అంటే దేవుడు పోరా అంటారు! నీవు ఆయన మాట వింటూ ఆయన బాటలో నడిస్తే నీవు తండ్రి అంటే వెంటనే కుమారుడా అని జవాబు ఇస్తారు.

మరి నీవు సిద్దమా!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*306వ భాగము*

యెషయా గ్రంథము 57:14--16

14. ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

15. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను.

16. నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 57వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 14వ వచనంలో అంటున్నారు ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

14-19వచనాలలో మరొక సారి దేవుడు ప్రవక్తద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్తున్నారు.

త్రోవ అనగా”– వారు తిరిగి వచ్చేందుకు అడ్డం లేకుండా చెయ్యడానికి.

యెషయా 11:16

కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

Isaiah(యెషయా గ్రంథము) 35:8,9,10

8. అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు

9. అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

10. వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

యెషయా 62:10

గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

ఇక 15వ వచనం ఎంతో ఆదరణ కలది.

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను.

మొదటగా మహాఘనుడు:నిర్గమకాండము 15:11

యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

కీర్తనలు 91:1

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

నెహెమ్యా 4:14

అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోనువారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.

రెండు మహోన్నతుడు: యోబు 36:26

ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.

కీర్తనలు 47:2

యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.

కీర్తనలు 99:2

సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.

కీర్తనలు 113:4; 1సమూయేలు 22:47; దానియేలు 3:26; 4:2,17, 5:21, హెబ్రీ 7:2;

తరువాత పరిశుద్ధుడు: నిర్గమ 28:36, 39:30,

లేవీయకాండము 21:8

అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచ వలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.

Psalms(కీర్తనల గ్రంథము) 99:3,5,9

3. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.

5. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.

9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.

యెషయా 6:3

వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

యెషయా 40:25;57:15; మార్కు 6:20; అపొ 3:14; ప్రకటన 4:8;22:11

తరువాత నిత్యనివాసి: ద్వితియోపదేశకాండము 33:27

శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను.

యెషయా 40:28

నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.

యిర్మియా 10:10

​యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

అయితే ఇంతటి గొప్ప దేవుడు అంటున్నారు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సు గలవారియొద్దను నివసించుచున్నాను.

కీర్తనలు 34:18

విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

కీర్తనలు 51:17

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

కీర్తనలు 138:6

యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.

ఇక తరువాత వచనంలో అంటున్నారు నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.

దేవుడు ఇప్పుడు మనుషులపై నేరాలు మోపుతున్నాడు.

కీర్తన 50:21; యెషయా 3:13-14

వారి పాపాల విషయం కోప్పడుతున్నాడు – యోహాను 3:36; రోమ్ 1:18; ఎఫెసు 5:6; ప్రకటన 19:5.

ప్రతి మనిషి మీదా ఆయన శాశ్వతంగా కోపం పెట్టుకోరు. ఆయన అలా చేస్తే, అలాంటివాడైతే ఆయన ఎదుట నిలిచే శక్తి ఎవరికీ ఉండదు.

యెషయా 54:9; కీర్తన 103:9-14; యిర్మీయా 3:12

కాబట్టి ప్రియులారా దేవుడు దయాళుడు. ఎంతో గొప్ప వాడు. గాని వినయ విధేయతలు గలవారిని ప్రేమించే వాడు. ఒకవేళ నీవు పాపాలు చేసినా ఎల్లప్పుడూ నీమీద కోపపడే దేవుడు కాదు! కోపపడి శిక్షించాక తండ్రిలా క్షమించి ఆదుకొనే దేవుడు!

మరి ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాప పడి నేడే అయన పాదాలు పట్టుకుని ఆయనతో సమాధాన పడతావా?!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*307వ భాగము*

యెషయా గ్రంథము 57:17--21

17. వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.

18. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

19. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

20. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.

21. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 57వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఈ చివరి వచనాలలో దేవుని ఆదరణకరమైన పలుకులు చూడగలం!

17వ వచనంలో వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి అంటున్నారు.

17-19 వచనాలు ఇజ్రాయేల్ జాతికి గతంలోని క్షేమస్థితి కలగబోయే భావి కాలాన్ని ఈ వచనాలు సూచిస్తున్నాయి. జాతిని ఒక వ్యక్తిగా పరిగణించి ఇక్కడ రాయడం కనిపిస్తున్నది “అతడు”, “అతణ్ణి" అంటూ సంభోదిస్తున్నారు. యెషయా 41:8-16; 42:19-22; 44:1-2; 48:4-11 కూడా అలాగే సంబోధిస్తున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 44:1,2

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

దేవుని శిక్షను చవిచూచి కూడా ఇశ్రాయేలు ప్రజలు తమ పాపిష్టి మార్గంలోనే కొనసాగారు. 17వ వచనంలో ఇజ్రాయేల్ పాపానికి మూలకారణం కనిపిస్తున్నది. వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి అంటున్నారు.

ఇజ్రాయేల్ దేవుని నుంచి పూర్తిగా తొలగిపోయినా దేవుడు ‘అతణ్ణి బాగుచేస్తాను’ అంటున్నారు

ద్వితీ 32:39; 2 దిన 7:14; యెషయా 30:26; 32:3-5; 35:5-10 కూడా చూడండి.

ద్వితియోపదేశకాండము 32:39

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

2దినవృత్తాంతములు 7:14

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును..

ఇక తరువాత వచనంలో నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.

ఇక్కడ ఓదార్పు కేవలం దేవుని కృప మాత్రమే. ఇజ్రాయేల్ ప్రజలకు శాశ్వత శిక్షే తగిన శాస్తి.

యెషయా 40:2

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 49:13

శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము భూమీ, సంతోషించుము పర్వతములారా, ఆనందధ్వని చేయుడి.

ఇంకా దారి చూపిస్తాను/ నడిపిస్తాను అంటున్నారు

యెషయా 30:21

మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

యెషయా 42:16

వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.

యెషయా 48:17

నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

తరువాత వచనంలో అంటున్నారు వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

చూడండి ఏమంటున్నారో వారి పెదవులతో స్తుతి మాటలు పుట్టిస్తాను. దూరంగా ఉన్నవారికి, దగ్గరగా ఉన్న వారికి శాంతి, శాంతి అంటూ వారిని బాగు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.”

ఇక్కడ దూరంగా...దగ్గరగా”– ఎక్కడెక్కడ చెదిరి ఉన్నప్పటికీ జాతి అంతటినీ బాగుచేస్తానని అర్థం. మరొక అర్ధం యూదులను, అన్యజనాంగము నుండి వచ్చిన విశ్వాసులను కూడా బాగుచేస్తాను అని అర్థం కావచ్చు (2:4; 26:3, 12; 32:17; ఎఫెసు 2:17).

Isaiah(యెషయా గ్రంథము) 26:3,12

3. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షముననుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.

యెషయా 32:17

నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.

ఎఫెసీయులకు 2:16

తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

ఎఫెసీయులకు 2:17

మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

ఎఫెసీయులకు 2:18

ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

ఇస్రాయేల్ బాగుపడినప్పుడు భూమి అంతటికీ స్వస్థత కలుగుతుంది

ఇక తరువాత రెండు వచనాలలో దుష్టులకోసం చెబుతున్నారు

20. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.

21. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.

ఇజ్రాయేల్ అంతా, ప్రపంచమంతా శాంతి సమాధానాలతో ఉన్నప్పటికీ దుర్మార్గులకు శాంతి ఉండదు. వారి అంతరంగ పరిస్థితే వారికి శాంతి లేకుండా చేస్తుంది. గనుక శాంతి కలగడం వారికి అసాధ్యం. దానిలో చెడు తలంపులు, కోరికలు, దురాశలు చిందులు తొక్కుతూ ఉంటాయి (ఆది 6:5; 8:21). శాంతి రావాలంటే దేవుని శక్తిమూలంగా మనుషుల్లో మార్పు రావాలి.

యెషయా 48:22

దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.

కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా! నీవు దేవుని బాటలో ఉంటే నీకు నెమ్మది, శాంతి సమాధానం దీవెనాశీర్వాదాలు కలుగుతాయి. అయితే దుష్టుల మార్గంలో నడిస్తే అది నాశనమునకు నడుపును అని మొదటి కీర్తనలు చెబుతుంది.

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*308వ భాగము*

యెషయా గ్రంథము 58:1--5

1. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము

2. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.

3. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

4. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 57వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 58వ అధ్యాయం చూసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం లో దేవుడు ఇశ్రాయేలు జనాంగం చేస్తున్న దొంగ భక్తి, వేషధారణ ఉపవాసం కోసం ఎండారగడుతున్నారు! మొదటి రెండు వచనాలలో వారు చేస్తున్న పాపాలు కోసం గట్టిగా భిగ్గరగా అందరికీ వినబడేలా అరిచి చెప్పమంటున్నారు!

1. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము

అన్ని యుగాల్లోనూ దేవుని ప్రవక్తలు దేవుని ప్రజల పాపాలను ధైర్యంగా, బహిరంగంగా వారికి ప్రకటించాలి. అందుకే బూరలాగా నీ కంఠమెత్తి బిగ్గరగా చాటించు. బిగపట్టకు. నా ప్రజలు చేసిన తిరుగుబాటు వారికి తెలియజెయ్యి. యాకోబు వంశంవారు చేసిన అపరాధాలు వారికి తెలియజెయ్యి అంటున్నారు.

ఇక రెండవ వచనంలో తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు అంటున్నారు.

ఇక్కడ భక్తిపరులులా వేషధారణ చేస్తున్నారు అంటున్నారు. పాపం, తిరుగుబాటు నిండివున్న జీవితంతో ఏమేమి కలిసి ఉండవచ్చో మరోసారి చూడండి – మతాచారాలు, ప్రార్థనలు, అంతరంగంలో మోసం, తాము కోరినంతగా దేవుడు తమపట్ల న్యాయంగా దయగా వ్యవహరించడం లేదని వారి మనస్సులోని నమ్మకం. మనుషుల్లో ఇలాంటి వెర్రితనానికి మూలకారణమేమిటో యిర్మీయా 17:9లో రాసి ఉంది.

యిర్మియా 17:9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

ఇక మూడవ వచనంలో దేవున్ని దబాయిస్తున్నారు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు.

దానికి దేవుని జవాబు:మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు

4. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

ఇక్కడ వారు ఉపవాసముండి చేస్తున్న మొదటి తప్పు: మీ పనివారితో ఉపవాస దినాన కఠినమైన పని చేయించుకుంటారు.”

Isaiah(యెషయా గ్రంథము) 3:13,14,15

13. వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు

14. యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది

15. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 10:2

తలిదండ్రులులేనివారిని కొల్ల పెట్టుకొనవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండ దరిద్రులను తొలగించు టకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించువారికిని బాధకరమైన శాసనములను వ్రాయించువారికిని శ్రమ.

రెండవ తప్పులు: మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు.

ఇక్కడ కలహాలు పడి, వివాదాలు రేపి, అన్యాయంగా ఫైటింగ్ లు చేస్తూ ఉపవాసం ఉంటున్నారు. నేటిరోజులలో అయితే ఉపవాస దినాన్నే కుళాయి దగ్గర తిట్టుకుంటారు. కోర్టులకు పోలీసు స్టేషను లకు తిరుగుతారు. ఫంక్షన్ లకు వెళ్తారు. చీ ఇదొక ఉపవాసమా!!!

వారు ఉపవాసముండేది మంచి ఉద్దేశంతో కాదు. దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకొని కాదు వారు అలా చేసేది. అప్పటివారు ఉపవాసం ఉండడం (ఇతర మతాచారాన్ని బట్టి పాటించడం) పుణ్యం సంపాదించుకొనేందుకూ తన సొంత నీతిన్యాయాలు ఇతరులకు ప్రదర్శించుకొనేందుకూ అవకాశమని అనుకొంటారు.

మత్తయి 6:16

మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 6:17

ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.

మత్తయి 6:18

అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

Luke(లూకా సువార్త) 18:9,10,11,12,13,14

9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.

10. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

11. పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

12. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

అందుకే ఐదవ వచనంలో అంటున్నారు అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

చూడండి ఏమంటున్నారో నేను ఆమోదించే ఉపవాసం ఇలాంటిదే అనుకొంటున్నారా?

మనిషి తనను అణచుకోవడం మాత్రమే చాలనుకొంటున్నారా? జమ్ము రెల్లులాగా తల వంచుకొని, గోనెపట్ట, బూడిద పరచుకొని కూర్చోవడం ఉపవాసమనీ, యెహోవాకు ప్రీతికరమైన దినమనీ అనుకొంటున్నారా?

మీదన ఉన్న రిఫరెన్స్ లా వేషదారులులాగ మనుష్యులకు కనబడాలని ఉపవాసం చేస్తే నీకు ఏమి దొరకదు! దేవుడు నీ ప్రార్థనకు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా జవాబివ్వలేదో అలాగే నీకు కూడా జవాబివ్వరు.

ఒకసారి సరిచూసుకో!

సరిచేసుకో!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*309వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక ఈ వచనం నుండి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటో చెబుతున్నారు!

ఆరవ వచనంలో అంటున్నారు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

ఈరెండు వచనాలలో దేవునికి ప్రీతిపాత్రమైన ఉపవాసాలు రెండు రకాలైన ఉపవాసాలు కనిపిస్తాయి.

ఈ వచనంలో మొదటి రకం ఉపవాసం కనిపిస్తుంది. నేను ఆమోదించే ఉపవాసమేమిటంటే, దుర్మార్గులు వేసిన సంకెళ్ళను విప్పడం, కాడిమాను త్రాళ్ళు తీయడం, దౌర్జన్యానికి గురి అయినవారిని విడిపించి ప్రతి కాడినీ విరుగగొట్టడం.

6-7 వచనాలలో ఉపవాసంతో బాటు పశ్చాత్తాపం, న్యాయంగా జీవించాలన్న అభిలాష, దేవుని ఆజ్ఞలను అంటే ముఖ్యంగా పేదలకు, నిస్సహాయులకు, బలహీనులకు సంబంధించిన ఆదేశాలు పాటించాలన్న ఇంగితం ఉండాలని దేవుడు నిర్దేశించాడు. (1:17; యెహె 18:5-9; మత్తయి 25:35-36).

యెషయా 1:17

కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

Ezekiel(యెహెజ్కేలు) 18:5,6,7,8,9

5.​ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి

6.పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,

7.​ఎవనినైనను భాదపెట్ట కయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలా త్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగల వానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

8.వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి

9.యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల నను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజ ముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

ఇదే మనకు గొర్రెలు మేకలు ఉపమానం లో కనిపిస్తుంది

Matthew(మత్తయి సువార్త) 25:33,34,35,36,37,38,39,40

33.తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

34.అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

35.నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

36.దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును

37.అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

38.ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

39.ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40.అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

దేవుడు చూడగోరేది ఇదే. అంతేగాని ఉపవాసమున్నామని తామే న్యాయవంతులమని మనుషులు గొప్పలు చెప్పుకోవడం కాదు. మన మతం మన సాటి మానవుల పట్ల జాలి చూపడం నేర్పకపోతే, ఇతరులకు సహాయపడేలా మనలను చెయ్యకపోతే అది వ్యర్థం, నిరుపయోగం (యాకోబు 1:27).

యాకోబు 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

కాబట్టి దేవునికి ఆమోదయోగ్యమైన మొదటి రకమైన ఉపవాసం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము.

ఇక రెండవ రకమైన యోగ్యమైన ఉపవాసం

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము?

చూడండి నీ ఆహారం ఆకలిగొన్నవారికి పంచియివ్వడం, ఇల్లు వాకిలి లేక తిరుగాడవలసిన బాధితులకు నీడపట్టును అమర్చడం, బట్టలు లేనివారు కనిపిస్తే వారికి బట్టలు ఇవ్వడం, నీ రక్తసంబంధులకు ముఖం తప్పించకపోవడం.

మనలో ఎంతమంది ఈ రకమైన ఉపవాసం చేస్తున్నాము?!

అసలు ఇది ఉపవాసమని మనకు తెలియనే తెలియదు గదా!!!

దిక్కులేని వారిని ఆదుకోవడం, ఆకలిగా ఉన్నవారికి నీకున్నదానితో వారి ఆకలి తీర్చడం, విధవరాల్లను అనాదలను వారి అవసరాలలో ఆదుకోవడమే నిజమైన ఉపవాసం! నిజమైన భక్తి!!

మరి మనము చేస్తున్న భక్తి ఉపవాసం ఏమిటి?!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*310వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

యోవేలు 1:14

ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

ప్రియులారా! ఈ 14వ వ వచనంలో ఉపవాస దినం ప్రతిష్టించుడి, వ్రతదినం అనగా పవిత్రమైన దినంగా ఆచరించి పవిత్ర సభగా కూడండి!

ప్రతిష్ఠించడం అంటే ఒక ముఖ్యమైన పనికోసం ప్రత్యేక పరచడం. మరి ఇప్పుడు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి మీ సమయం మీ శరీరం ఆత్మ అన్నీ దేవునికోసం వెచ్చించి ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యమని. ఇక ఈ సమయంలో లోకవార్తలు చెప్పుకోవడం లాంటి లోకానుసారమైన శరీరానుసారమైన క్రియలు అన్నీ మానివేసి దేవునికోసమే ఈ సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో గడపమని అర్థం!

*ఎందుకు*?

యెహోవాను బ్రతిమిలాడుకొనుటకు పెద్దలను దేశములోని జనులను మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి అంటున్నారు.

అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే యెహోవాను బ్రతిమాలుకోవాలి-

*ఎందుకు బ్రతిమాలుకోవాలి* అంటే ఇంతవరకు అనగా ఈ యోవేలు 1: 4—13 వచనాల వరకు పంటలను మిడుతలు, పసురు పురుగులు, చీడపురుగులు తినేశాయి. యెహోవా మందిరంలో అర్పణలు నైవేద్యాలు ఆగిపోయాయి . మీకు తినడానికి తిండిలేదు. త్రాగడానికి ద్రాక్షారసం లేదు కాబట్టి కనికరించమని యెహోవాను బ్రతిమాలుకోవాలి!

బాగుంది, గాని గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే *మొదటగా ఎవరు బ్రతిమిలాడాలి*?

దేశపు పెద్దలు, తర్వాత మిగిలిన సర్వ జనులు!

*మొదటగా పెద్దలే ఎందుకు బ్రతిమాలు కోవాలి* అంటే చరిత్ర చూసుకుంటే ప్రజలను దారి మళ్ళించింది ప్రజలను పాపులుగా మార్చింది ఈ పెద్దలే కాబట్టి మొట్టమొదటగా బ్రతిమాలుకోవాల్సింది కూడా పెద్దలే!

సరే, అలా బ్రతిమాలు కోవాలి- లేక దేవునితో సమాధానపడాలి అంటే భక్తుడు/ దేవుడు కలిపి చెబుతున్న ఏకైక మార్గం *ఉపవాస ముండాలి*. అందుకే ఉపవాస దినం ప్రతిష్టించండి వ్రతదినం ఏర్పరచండి అంటున్నారు.

*ఏం మరో మార్గం లేదా* అంటే లేదు! యోవేలు 2వ అధ్యాయంలో కూడా ఇదేమాట రాస్తున్నారు భక్తుడు! అక్కడ ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుస్తూ మరలా నా దగ్గరకు రండి అని దేవుడే స్వయంగా చెబుతున్నారు!

అలా ప్రార్ధించిన వారు బైబిల్ లో చాలామంది ఉన్నారు. అలాచేసి మరణ శాసనమును జీవశాసనంగా మార్చుకున్నారు. ఇంకా అనేక మేలులు పొందుకున్నారు!

లేవీయ కాండంలో దేవుడు చెబుతున్నారు సంవత్సరంలో కొన్నిరోజులు అందరు ఉపవాసముండి సమాజముగా కూడాలి అంటున్నారు.

2సమూయేలు 12:16 లో దావీదుగారు ఉపవాసముండి ప్రార్ధనచేశారు!

యోనా ౩వఅధ్యాయంలో నీనేవే వారు రాజుతో సహా ఉపవాసముండి ప్రార్ధన చేసి మరణాన్ని తప్పించుకున్నారు.

ఎస్తేరు గ్రంధం ప్రకారం- ఎస్తేరు గారు, మొర్దేకై ఇంకా అక్కడి ప్రజలు ఉపవాసముండి మరణ శాసనాన్ని జీవ శాసనంగా మార్చుకున్నారు.

దానియేలు గారు ఉపవాసమున్నారు 85 సంవత్సరాలు వయస్సులో! అప్పుడు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచారు.

ఇంకా దుష్టుడు మూర్కుడైన రాజు ఆహాబు ఉపవాసముండి తనమీదకు రావలసిన ఉగ్రతను తగ్గించుకున్నాడు. 1రాజులు 21:27 ;

నెహేమ్యా గారు ఉపవాసమున్నారు. ఇలా అనేకమంది ఉపవాసముండి ఎన్నెన్నో గొప్ప కార్యములు చేశారు!

ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పనీయండి, మా పట్టణంలో గల ఒక ప్రభుద్దుడు తప్పుడు బోధలు చేస్తున్నాడు- పాత నిబంధనలో ఉపవాసముండాలి అని వ్రాయబడింది గాని నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు గాని, శిష్యులు గాని ఉపవాసముండాలి అని చెప్పలేదు కాబట్టి ఉపవాసముండవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఆలాగు అనేకమందిని గలిబిలి చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు తాను సేవ ప్రారంభించే ముందు తానే స్వయముగా 40రోజులు ఎందుకు ఉపవాసమున్నారు?. యేసుప్రభులవారే ఉన్నప్పుడు మనము కూడా ఉపవాసముండాలి కదా! ఇంతచిన్న విషయం ఆ గొప్పోల్లకు ఎందుకు అర్ధం కావడం లేదు??!!

ఒకసారి ఇలాంటి ధర్మ సందేహమే ఆరోజులలో కొంతమందికి వచ్చి యేసయ్యను అడిగారు మత్తయి 9వ అధ్యాయంలో! పరిసయ్యుల శిష్యులు, బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు గాని నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చెయ్యడం లేదు అని అడిగితే దేవుడు 15వ వచనంలో చెబుతున్నారు: పెండ్లి కుమారుడు తమతో ఉంటే ఎవరైనా ఉపవాసం ఉంటారా? ఆయన వెళ్ళిపోయినా తర్వాత నా శిష్యులు కూడా ఉపవాస ముంటారు అని ఆయనే స్వయముగా చెప్పారు. ఇప్పడు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి తప్పకుండా ఉపవాసముండాలి! అలాగే సేవను ప్రారంభించే ముందు ఉపవాసముండి ప్రార్ధనలో సిద్దపడి వెళ్ళాల్సిన అవసరం ఉంది!

యేసుక్రీస్తుప్రభులవారే కాదు ఆయన శిష్యులు కూడా ఉపవాసమున్నారు. అపోస్తలుల కార్యములు 13:3, 14:23 లో శిష్యులు ఉపవాసమున్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని ఉపవాస ప్రార్థనలు మానకండి!

సరే, రెండో అధ్యాయంలో ఎందుకు ఉపవాసముండమంటున్నారో దేవుడే స్వయంగా చెబుతున్నారు. 2:12—16

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

16. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

చూడండి ఇక్కడ ఇప్పుడైనా మీరు ఉపవాస ముండండి అంటూ కన్నీరు విడచుచు దుఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి అంటున్నారు దేవుడు! ఏదో మొక్కుబడిగా కాదు! మనసా వాచా కర్మేనా దేవుని దగ్గరకు నిండు మనస్సుతో నిజమైన పశ్చాతాపంతో రావాలి! ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలవాడు శాంతమూర్తి అత్యంత కృప గలవాడు అంటున్నారు. ఇదే మాటలు మనం నిర్గమకాండంలో చూడగలం!

నిర్గమ 34:6—7

6. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.

ఇంకా మీకా 7:18—19

18. తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

19. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.

1యోహాను పత్రిక 4:8

దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

కాబట్టే ఆయన దగ్గరకు రమ్మంటున్నారు. ఎప్పుడైతే అలా చేస్తారో వెంటనే దేవుడు కనికరించి తాను చేద్దామనుకున్న కీడు చేయకుండా తప్పిస్తారు అంటున్నారు. అవును కదా మీదన చదువుకున్నట్లు దేవుడు నీనేవే ప్రజల మీదకు ఉగ్రత వస్తుంది అని తన భక్తుడైన యోనా గారితో కబురుపెడితే నీనేవే ప్రజలు తప్పులు ఒప్పుకుని బట్టలు చింపుకుని కన్నీటితో ఉపవాస ప్రార్ధన చేస్తే, తాను చేద్దామనుకున్న కీడు చెయ్యడం మానేశారు దేవుడు! కాబట్టి మనం కూడా అలా చేస్తే మనమీదకు వచ్చే కీడు/ తీర్పు/ ఉగ్రత నుండి తప్పించుకోగలము!

ఇంకా ఆయన చేర్చుకోడానికి సంసిద్ధుడు అంటున్నారు. యిర్మియా 18:8

ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.

కాబట్టి మీ బట్టలు కాదు మీ హృదయాలను చింపుకొండి అంటున్నారు. బైబిల్ గ్రంధంలో అనేకమంది తమ బట్టలు చింపుకుని పశ్చాత్తాప పడి ఏడ్చినట్లు చూడగలం! బట్టలు చింపుకోవడం అనగా పశ్చాత్తాప పడి తమ దుఖాన్ని తెలియజేయడం అన్నమాట!

ఆదికాండం 37:29 లో రూబేను, యోసేపును అమ్మివేశాక తన బట్టలు చింపుకున్నాడు. ఈ విషయం తెలిసిన యాకోబు గారు తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని విలపించారు. 44:13;

హాయి వారి ముందు ఓడిపోయినప్పుడు యెహోషువా గారు తన బట్టలు చింపుకుని ఏడ్చారు 7:6

యోబుగారు కూడా ఏడ్చారు 1:20; 2:12

అయితే దేవుడు బట్టలు కాదు హృదయాలను చింపుకోండి అంటున్నారు అనగా మీ కఠినమైన హృదయాలను చింపుకుని పశ్చాత్తాప పడాలి అని అర్ధం!

కీర్తనలు 51:17

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

యెషయా 57:15

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

అలాచేస్తే తాను చేస్తానన్న కీడు చెయ్యను అంటున్నారు దేవుడు

యిర్మియా ౩:12

నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 3: 14

భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.

యిర్మియా 3: 22

భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి;మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మాదేవుడ వైనయెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,

విలాపవాక్యములు 3: 40

మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.

విలాపవాక్యములు 5: 21

యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.

హోషేయ 14:1—2

1. ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము.

2. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

కాబటి ఉపవాసం చెయ్యాలి. అయితే దానికి ఎవరు రావాలో మరలా చెబుతున్నారు. యోవేలు 2: 16

జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

చూడండి అందరూ రావాలి చిన్న పిల్లలతో సహా! మా అబ్బాయికి ప్రైవేట్ క్లాస్ ఉంది అంటే కుదరదు!

అయితే చివరలో పెండ్లి కుమారుడు అంతఃపురం లో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి అనగా మామూలుగా ఆలోచిస్తే క్రొత్తగా పెళ్ళైన జంట కూడా తమ సంసార సుఖాన్ని వదిలి రావాలి అని అర్ధమిస్తున్నా- ఆత్మీయ అర్ధం ఏమిటంటే పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు అంతఃపురం అనగా పరలోకం నుండి రాబోతున్నారు. పెండ్లి కుమార్తె అనగా ఎత్తబడే సంఘం గదిలోనుండి అనగా భూమి మీదనుండి సిద్దంగా ఉంటే ఎత్తబడతారు అన్నమాట!

మరి నేడైనా ఉపవాస ముంటావా?

దేవునితో సమాధాన పడతావా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*311వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

ప్రియులారా ఈ రోజు *ఉపవాస ప్రార్ధన అంటే ఏమిటి?* *ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి* అనేది ధ్యానం చేసుకుందాం!

*ఉపవాస ప్రార్ధన ఎందుకు చెయ్యాలి*?

యేసయ్య చేసారు గనుక.

దేవుని కుమారుడైయుండి ఆయనే ఉపవాసం చేసారంటే? దానికి చెప్పలేనంత ప్రాధాన్యత వుండి తీరుతుంది. సందేహం లేదు.

*ఉపవాసం అంటే*?

ఆహారం ఏమి తినకుండా, ప్రార్ధించడం. ఇది మన దృష్టిలో ఉపవాసం. కాని, పరిశుద్ధ గ్రంధం దీని అర్థాన్నే మార్చేసింది.

"నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ......

......అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును."

యెషయా 58:8,9

*ఒక్క మాటలో చెప్పాలంటే? నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించడమే సరియైన ఉపవాసము*.

ఉపవాసం చేసే మనము మొట్టమొదట పవిత్రమైనభక్తి కలిగియుండాలి.

*పవిత్రమైన భక్తి అంటే*?

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

యాకోబు 1:27

పొరుగువారిని ఆపదలలో నున్నవారిని ఆదరిస్తూ, మనము లోకములోవుండాలిగాని

లోకము మనలో లేకుండా జీవించగలగాలి.

ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఆయన ప్రకటించిన "ఉపవాస విధానం" చెయ్యగలగాలి.

మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.

అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును

మత్తయి 6:16-18

*ఉపవాసం చేస్తున్నప్పుడు అనుసరించ వలసిన విధానం*?

•వేషధారులవలే ఉండకూడదు

వేశ్యను అయినా ఆయన క్షమిస్తాడుగాని వేషధారిని క్షమించడు.

•దుఃఖ ముఖముతో వుండకూడదు.

ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపు చున్న నీముఖం తేజోవంతముగా, ప్రకాశమానముగా వుండాలి.

•నీ ఉపవాసం రహస్య మందున్న దేవునికి మాత్రమే తెలియాలి.

కాని నేటి దినాలలో దీని విధానం మారిపోయింది. నీవు ఉపవాసము చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకుండా, రహస్యముగా చెయ్యమని యేసు ప్రభువు వారు చెప్తే? మనమేమో,

" ఉపవాస ప్రార్ధనలు" అంటూ మైక్ లు పెట్టి మరీ చెప్పుకొంటున్నాము. బ్యానర్స్ పెట్టి పెద్ద హంగామా చేస్తున్నాము. మన ప్రార్ధన మనమేదో ప్రార్ధనాపరులమని చెప్పుకునే ప్రయత్నంలా వుందిగాని, ప్రార్ధనా లక్ష్యాన్ని చేధించేదిగాలేదు. ఆయన చెప్పిన విధానం యిదేనా?

క్రొత్త నిబంధనా విధానం దీనిని సమర్దిస్తుందా? ఆయన చెప్పినది చెయ్యకుండా, ప్రార్ధనా ఫలాలు ఆశించడం సమంజసంకాదు. సాధ్యం కూడా కాదు.

*ఇంతకీ ఎందుకు ఉపవాస ప్రార్ధన అనేది ఆహారమేమి తీసుకోకుండా చెయ్యాలి?*

" మన దృష్టి, ధ్యానం ఆహారం, ఇతర విషయాలజోలికి పోకుండా " దేవునిమీద మాత్రమే కేంద్రీకరించబడే విధంగా" వుండడానికి.

*ఉపవాస సమయం ఎట్లా గడపాలి*?

మొట్టమొదట ఆధ్యాత్మిక అవసరాలను గూర్చి ప్రార్ధించాలి.

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

కీర్తనలు 139:23, 24

ఆతర్వాత మన వ్యక్తిగత అవసరాలను గురించి ప్రార్ధించాలి.

ఉపవాస ప్రార్ధన తప్పక విజయాలనిస్తుంది. ఆరీతిగా ప్రార్ధించి ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం!

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*312వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!! అదేసమయంలో భక్తి అనగా ఏమిటి అనికూడా చూసుకుందాం!

యాకోబు 1:26, 27

26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.

27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

సరే, ఈ భక్తికోసం మన ఆధ్యాత్మిక సందేశాలు శీర్షికలలో అనేకసార్లు వ్ర్రాయడం జరిగింది, దానిని మరోసారి చూసుకుందాం!

మనము పవిత్ర భారతదేశంలో పుట్టాము. మన దేశమంతా భక్తికి ప్రాధన్యతనిస్తుంది. క్రైస్తవులుగా మనంకూడా భక్తికి చాలా ప్రాముఖ్యతనిస్తాము.

*భక్తి అనగా ఏమిటి*?

మన నిర్వచనం ప్రకారం పాపాలు చేయకుండా, అబద్దాలు ఆడకుండా, ప్రార్ధన చేస్తూ, ఉపవాసం ఉంటూ, ఇంకొందరు వీటితో పాటు భాషలు మాట్లాడుతూ, ప్రవచిస్తూ, ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటే అదే భక్తి అనుకొంటాం. ఇదేనా భక్తి? ఇంకా ఏమైనా ఉందా?

మనకి ప్రతీదానికి ఆధారం మన పరిశుద్ధగ్రంధమే! గనుక బైబిల్ లో ఏమి వ్రాయబడి ఉందో చూద్దాం!

యేసుప్రభులవారి సహోదరుడు యాకోబుగారు వ్రాసిన ఈ పత్రికలో 1:27

“*తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కలంకమును ఐన భక్తి ఏదనగా 1. దిక్కుమాలిన పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు (అనగా వారికి సహాయం చేయడం), 2. ఇహలోకమాలిన్యం తనకంటకుండా తననుతాను కాపాడుకొనుటయే!*”

ఇదే విషయాన్ని పాతనిభందన గ్రంధంలో యెషయా 58:3-10 లో భక్తిని- ఉపవాసంతో పోలుస్తున్నారు.

“*1. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు (ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం),

2. భాదింపబడేవారికి సహాయం చేయుటయు, 3. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు,

4. నీరక్త సంభందికి ముఖము తప్పించుకొనకుండుటయు,

5. వస్త్రహీనుడు కనబడితే వానికి వస్త్రములిచ్చుటయు, ఇదేకదా నాకిష్టమైన ఉపవాసము*” అని దేవుడు సెలవిస్తున్నారు.

ఇప్పుడు చూద్దాం మనం అనుకొంటున్న భక్తికి- దేవుడు సెలవిచ్చిన భక్తికి తేడా!!!!

మనం చేస్తున్నది ఒకటి! చెయ్యమన్నది ఒకటి!!!

అయితే మీరనొచ్చు మేం చేస్తున్నది భక్తి కాదా?!!!!! అని, మీరు చేస్తున్నది భక్తిలో ఒక భాగం మాత్రమే గాని అదే భక్తి కాదు!!!

మనల్ని మనం పరీక్షించుకొందాము ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం. మన బంధువులకి, రక్త సంభందికులకు, మన పొరుగువారికి సహాయం చేస్తున్నామా? నీవు ప్రపంచంలో ఉన్న అందరికి సహాయం చేయడం కష్టం గాని కనీసం నీ ఊరువాడికి చేయగలవు కదా! అందరికీ చేయలేకపోయినా నీ పొరుగు వాడికి, నీ స్నేహితునికి లేక నీ సహోదరునికి లేక నీ సంఘసభ్యునికి సహాయం చేయగలవు కదా! మరి చేస్తున్నావా?

నీవు ఎంత ప్రార్ధనాపరుడివైనా/పరురాలివైన, ప్రసంగీకుడవైనా, ఉపవాసాలుండినా ఇవి చేయకపోతే నీ భక్తి దండగ!!!

చర్చిలో మరియు ఇంట్లో గంటలుగంటలు ప్రార్ధనచేస్తావు గాని నీ పోరుగువానితో సమాధానంగా ఉండవు, సహాయం చేయవు! – నీ భక్తి వ్యర్ధం!!

భాషలు మాట్లాడుతావు గాని – నీ సహోదరుని ప్రేమించవు, ఎవరికీ భిక్షం వేయవు---- నీ భక్తికి అర్ధం లేదు!!!

ప్రసంగాలు చేస్తావు నీ పొరుగువాని ప్రేమించమని- నీ పొరుగు వానితో గాని, తోటి దైవసేవకునితో గాని సమాధానంగా ఉండవు, మాట్లాడవు- సరికదా వారితో వైరం!!! ఎవరికీ అన్నం పెట్టవు.--- నీ ప్రసంగాలు, నీ భక్తి దండగ!!!!!

ఉపవాసాలు ఉంటావు- ఇంట్లో నీ అత్తమామలకు లేక నీ తల్లిదండ్రులకు భోజనం పెట్టవు , నీవు చూడవు నీ భర్తను కూడా చూడనీయవు – నీది భక్తా? వేషధారణా????

ఉపవాసాలుంటావు, ప్రార్ధనలు చేస్తావు, భాషలు మాట్లాడుతావు, ప్రవచిస్తావు గాని, అన్యుడితో మాట్లాడవు, వారికి సహాయం చేయవు, దేవుని ప్రేమ చూపించవు, సరికదా వారిని అంటరానివారిగా చూస్తావు. ఇంకా వారెప్పుడు రక్షణ పొందుతారు? నిన్ను చూస్తూనే అసహ్యంచుకొంటారు. నీబట్టి యేసయ్యని కూడా ద్వేషిస్తున్నారు!!

చెబుతావు గాని చెయ్యవు!! నోరు తెరిస్తే భూతులు! కొళాయిలదగ్గర తగవులు. ఊరిలో ఎవరితోనూ సమాధానంగా ఉండవు!! సరికదా దేవుని పరువుపోయేలా తగవులాడుతావు!!

అందుకే యాకోబు పత్రికలో 1:26 లో “ఎవడైననూ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తానూ భక్తి గలవాడినని అనుకొంటే వాని భక్తి వ్యర్ధము” అని వ్రాయబడింది.

అందుకే యేసయ్య అంటున్నారు – శపింపబడిన వారలారా! అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచిన అగ్నిగుండములోనికి పొండి! ఎందుకంటే నేను ఆకలిగొంటిని- భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని- దాహమీయలేదు, పరదేసినై ఉంటిని- నన్ను చేర్చుకోలేదు, రోగినైయుంటిని- పరామర్శించలేదు,... అందుకు ప్రభువా నీవెప్పుడు ఆకలిగొంటివి? దప్పిగొంటివి? ........ దేవుడన్నారు అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు. అంటే వారికి సహాయం చేస్తే దేవునికి చేసినట్టే!!!!

కాబట్టి నీవు చేసేది భక్తా? వేషధారణా? సరిచూసుకో! సరిచేసుకో! 1 యోహాను 3:17 లో ఈలోకపు జీవనోపాధిగలవాడవై ఉండి, తన సహోదరునికి లేమి కలిగియుండుట చూచియు, అతనియెడల కనికరం చూపనివానియందు దేవుని ప్రేమ ఏలాగునిలుచును?

దేవుని ప్రేమ లేక పొతే నీవు వ్యర్దుడవే సుమా!!!

సరే నీవు భక్తి చేస్తున్నాను అంటున్నావు కదా! ఆ భక్తినే ఒకసారి ఆలోచిద్దాం!

1.ప్రార్ధన:- ప్రార్ధన ఎలా చేస్తున్నావు?

అస్తమాను ప్రభువా నాకు అది ఇచ్చేయ్! ఇది ఇచ్చేయ్! నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చేయ్! నా కోడలికి గర్భఫలం ఇచ్చేయ్! నాకు ఇల్లు ఇచ్చేయ్, కారు ఇచ్చేయ్, ఇంకా చాలా రకాలైన కోరికలు లిస్టు ఇస్తున్నావ్ (భర్త మార్కెట్ కి వెళ్ళినప్పుడు భార్య సరుకులు లిస్టు ఇచ్చినట్లు). లేకపొతే దేవుణ్ణి కాపలాదారులాగా ప్రభువా కాపలాకాయమని అడుగుతున్నావ్! రోగం బాగుచేయ్యమని అడుగుతున్నావ్! గాని ప్రభువా నాకిచ్చిన ప్రతీ ఈవికోసం నీకు వందనాలు అని దేవునికి స్తుతి చెయ్యడం లేదు.

ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునికి చెప్పడం- తిరిగి జవాబు పొందడం. దేవుడు తిరిగి జవాబిచ్చేవరకు ప్రార్ధనలో కనిపెడుతున్నావా?!

దేవుడు నీతండ్రి- తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడు, తండ్రికివ్వవలసిన గౌరవం ఇవ్వు

దేవుడు నీరాజు- రాజుతో జాగ్రత్తగా మాట్లాడు

దేవుడు నీ స్నేహితుడు- నీకు సంతోషం కలిగిన, భాదలున్నా అన్నీ ఆయనతో చెప్పేసుకో!!

దేవుడు నీకు తల్లిలాంటి వారు – నీకు గురువు- ఆయననుండి నేర్చుకో!!

2. ఉపవాసం:- అనగా దేవునితో సహవాసం

సహవాసం చేస్తున్నావా? వేషదారుల్లాగా అందరికీ కనబడాలని ఉపవాసం చేస్తున్నావా? మత్తయి 6:16

యెషయా 58: 5 అట్టి ఉపవాసము నాకనుకూలమా? ..... ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టిది నాకు ప్రీతికరమా? అని అడుగుచున్నారు.

6,7,8 వచనాలు దేవునికి కావాల్సిన భక్తి, ఉపవాసం ఏమిటో సెలవిచ్చారు.

కాబట్టి ఎలా ఉపవాసం చేస్తున్నావు? నిజమైన ఉపవాసమా? ఆచారపరమైన ఉపవాసమా? దేవుడు చెప్ప్పిన భక్తా? నీ సొంత భక్తా? నీ సంఘంలో చేసే – ఆచరించే కట్టుబాట్లు – ఆరాధనా క్రమం మాత్రమె భక్తా? ఆలోచించుకో!!

3. భాషలు:- భాషలు మాట్లాడటం తప్పులేదు. అవి కావాలి. కాని భాషలే భక్తి కాదు. అవి అంతరంగపురుషుడు బలపరచబడటానికే మాత్రమే ఉపయోగపడతాయి. ఉదా:- ఒక చంటిబిడ్డకు హార్లిక్స్, బూస్ట్ మాత్రమె ఇస్తే సరిపోదు, సరియైన ఆహారం, పోషక పదార్దాలు ఇవ్వాలి లేకపోతే పిల్లవాడు నీరసించిపోతాడు. అలాగే ప్రార్ధన, ఉపవాసం వీటితో పాటు – మంచి కార్యాలు చెయ్యాలి. అప్పుడే దానిని భక్తి అంటారు బైబిల్ ప్రకారం.

అపోస్తులుల కార్యంలో కోర్నెలు గారిదగ్గరకు దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు? కోర్నేలి! నీవు చేసిన ప్రార్ధన, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి. అంటే ప్రార్ధనతో పాటు ధర్మకార్యాలు మాత్రమే దేవునిని చేరుకొంటాయి కాబట్టి తప్పకుండా ధర్మకార్యాలు కావాలి. లేకపోతే నీ భక్తి వ్యర్ధం!

అసలు భక్తికి మూలం ఏమిటి? 1. దేవుడంటే భయము , 2. ప్రేమ కలిగియుండటం.

1. దేవుడంటే భయం ఉంటే పాపం చెయ్యవు. దానినే భక్తి నిర్వచనంలో – ఇహలోక మాలిన్యం తనకంటకుండా చూసుకోవడం!

భయముంటే అబద్దాలు చెప్పవు. దొంగతనం చేయవు. వ్యభిచారం చేయవు. పొరుగువాని భార్యను/భర్తను ఆశించవు. ఇవి చేస్తున్నావు అంటే దేవుడంటే నీకు భయం లేదన్న మాట!

2. ప్రేమ:- ప్రేమ ఉంటే పొరుగువానిని ప్రేమిస్తావు. స్నేహితునికి సహాయం చేస్తావు. అత్తమామలని, తల్లిదండ్రులని బాగాచూసుకొంటావు. సమాధానంగా ఉంటావు.

మరి నీవు ఏం చేస్తున్నావ్? యేసయ్య అంటున్నారు మత్తయి 7:22-23 ప్రభువా నీనామమున ప్రవచింపలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా? అనేక అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు; అప్పుడు నేను అక్రమము చేయు వారలారా! నాయొద్ద నుండి తొలగిపొండని మీతో చెప్పుదును. ఆలోచించుకో! దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా మీ సొంత భక్తి చేస్తే – అక్రమముచేయు వారలారా అంటే నీ ప్రార్ధన, ఉపవాసం, భాషలు, ప్రవచనాలు అన్నీ వ్యర్ధమే కదా!

పౌలుగారు ఏమంటున్నారు 1 కొరింథీ 13 వ అధ్యాయం మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడినా, ప్రవచించే వరం కలిగినా, కొండలు పెకలించే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా, బీదలపోషణ కొరకు నా ఆస్తిఅంతా ఇచ్చేసినా ప్రేమలేని వాడనైతే నేను వ్యర్దుడను. దేవునిచే నేను నిన్ను ఎరుగను అనే స్తితికి చేరుకొంటావు జాగ్రత్త!

ఒక విషయం చెప్పనా? యాకోబు పత్రిక 1:27 ప్రకారం, యెషయా 58 ప్రకారం పేదలకు సహాయం చెయ్యడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, బందీఖానాలో ఉన్నవారిని విడిపించడం చేస్తే భక్తి చేసినట్లే!!!

అలా అయితే అవిచేస్తే ప్రార్ధన, ఉపవాసాలు వద్దా అంటారేమో!!

పైనుదహరించిన ధర్మకార్యాలు చేస్తూనే, వాటితోపాటు దేవునితో సత్సంభందం కోసం నీ అత్మీయాభివృద్ధికోసం, నీ అంతరంగపురుషుడు బలపడేలాగా ప్రార్ధన, ఉపవాసం, వాక్యధ్యానం, భాషలు, సంఘపరిచర్యలో పాల్గొనుట, క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవడం చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను భళానమ్మకమైన మంచిదాసుడా! అని పిలుస్తారు.

అంతేకాదు ఇంకా ఏమంటున్నారు యెషయా 58లో అలాచేస్తే నీ వెలుగు వేకువ చుక్కలా ఉదయించును, స్వస్తత నీకు శీగ్రముగా లభించును, యెహోవా నిన్ను తృప్తి పరచును, నిన్ను పోషించును .... అంటున్నారు.

అలాకాకుండా నీ పొరుగువాడు చలికి భాదపడుతుంటే మంటకాచుకో, రగ్గు కప్పుకో, ఆకలితో ఉంటే ఇంటికివెళ్ళి భోజనం వండుకొని తిను అని చెబితే ప్రయోజనం ఏముంది? డబ్బులు ఉంటే రగ్గు కొనుక్కోలేరా? అన్నం వండుకోడానికి సరిపడే ధనం ఉంటే వండుకోలేదా? ఆరోగ్యం ఉంటె చేసుకోలేదా? లేకే కదా నిన్ను కోరినది. (యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదవండి)

ఆలోచించుకో! సరి చేసుకో!

అక్షరార్ధమైన భక్తి కాకుండా, వేషధారణ భక్తి కాకుండా, ప్రజలు మెచ్చుకొంటారనే భక్తి కాకుండా, నిజమైన దైవిక భక్తి, బైబిల్ చెప్పిన భక్తి కలియుండమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.

దేవుని కృపా సమాధానములు మనందరికీ మెండుగా కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*313వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

ఇక కొంతమంది దైవ జనులు అనగా బైబిల్ లో కాకుండా నూతన నిబంధన సంఘ భక్తులలో కొంతమంది ఎలా ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఉన్నారు? తద్వారా ఏమి సాధించారో కొంతమంది భక్తులు సేకరించి రాశారు. దానిని చూసుకొందాం మన ఆత్మీయ మేలులకై!!!

*✳ భక్తుల ఉపవాసము-- వారిచే దేవుడు రగిలించిన ఉజ్జీవజ్వాలలు🔥🔥*

🛐 *ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.*

యోవేలు 1:14

🔺 పరిశుద్ధగ్రంథము లో ఉపవాసము ద్వారా దేశము, సమాజము, వ్యక్తులు పొందుకున్న అద్భుతమైన మేళ్లను గూర్చి మనకు తెలియును

*ఉదాః యెహోషాపాతు, ఎస్తేరు, నెహెమ్యా , హిజ్కియా రాజు, నీనేవే పట్టణస్థులు మొ!!లగు వారు*

💎 ఆది అపోస్తలులు మరియు విశ్వాసులు కూడ ఉపవాస ప్రార్థనలచే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బలంగా ప్రభువు వాక్యమును ప్రకటించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించారు

🔮 లోకమును కదిలించిన దైవసేవకుల చరిత్రను చదివి చూడండి! అగ్ని, జ్వాలలవలె లేచిన ఉజ్జీవపు చరిత్రను చదివి చూడండి! అత్యధిక మహిమతో అభివృద్ధి చెందిన సంఘముల చరిత్రను చదివి చూడండి! దాని వెనుక ఆసక్తిగల ఉపవాసములు, బలమైన స్తంభములుగా, శక్తిగల వెన్నెముకగా ఉండిన విషయములను గ్రహించగలము.

👉 ఆట్టి గొప్ప దైవజనులలో కొందరి ఉపవాసప్రార్థనలు,వారి పరిచర్యలను జ్ఞాపకము చేసుకొందాము

💎 1. *అసిస్సి వాసియగు ఫ్రాన్సిస్‌ :*

▪12వ శతాబ్దములో జీవించిన గొప్ప భక్తుడు. ఐశ్వర్యవంతులకు జన్మించిన యితడు తిరుగుబోతు గాను, తన యిష్టానుసారముగా పాపములో మునిగి జీవించుచుండెను. సరిదిద్దుటకు ఎవరివలననూ కాలేదు. పాపమును మంచినీటివలె త్రాగిన యితనిని ప్రభువే రక్షించాలని అతని తల్లి విడిచిన కన్నీరు విస్తారము.

▪ *చివరకి రోజు విడిచి రోజు ఉపవాసముండి ప్రార్ధించిన ఫలితముగా, ప్రభువు యితనిని ముట్టెను.*

💥 రక్షణానుభవము పొందినపుడు తన ఆస్తి, అంతస్తులను ఉపేక్షించుకొని సన్యాసము పుచ్చుకొనెను. అతని కటిక చీకటి, పాపజీవితము తొలగిపోయెను. ప్రభువునామ మహిమార్ధమై జీవించసాగెను.

❇ అతని సేవ ద్వారా వేలకొలది ప్రజలు క్రీస్తును అంగీకరించిరి. తరువాత పూట భోజనము ఎక్కడ నుండి వచ్చునని పట్టించుకొనక, బహుకరించిన బట్టలను ధరించువానిగాను జీవించెను. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకొనక క్రీస్తు కొరకు కాలినడకన అతడు చేసిన సేవ నేడునూ మనకు సవాలుగా నున్నది.

💥 *భుజింపక, ఖాళీ కడుపుతో నుండినను ఉత్సాహముగా పాడి సాక్ష్యము చెప్పుచు ప్రసంగించెను. ఇతడు ప్రార్ధన పూర్వకంగా ఉపవాసముతో మెల్లగా వీధులలో నడుచుచుండగా చూసినవారు మారుమనస్సు, రక్షణ పొందిరి. దీని రహస్యము యితని ప్రార్ధనలోనూ ఉపవాసములోను వుండెను.*

💎2. *సేవకుడు సెవనరోల :*

▪ ఇతడు 14వ శతాబ్దములో ఇటలీ దేశములో దేవుడు లేపిన ఉజ్జీవ వీరుడు. *యితని ద్వారా ప్లారెన్స్‌ అనే పట్టణములో ఉజ్జీవ మంట రగులుకొనెను.* ప్రభువును స్తుతించుచు స్తుతులతోను, పాటలతోనూ ఆ పట్టణమంతా ఆవరించెను. యితని సేవ ద్వారా పట్టణస్థులందరూ రక్షణ పొందారని చెప్పవచ్చు.

💥 చరిత్రకారులు అతనిని గూర్చి యిలాగు వ్రాయుచున్నారు.

*తన ఎక్కువకాల ఉపవాస ప్రార్ధనల వలన ప్రసంగవేదికపై ఎక్కుటకునూ శక్తిహీనుడై యుంటాడు.*

❇ కానీ ఎక్కిన తరువాత ప్రసంగము వినే ప్రతి వారునూ ఏడ్చుచూ ప్రభువుకు అప్పగించుకొనుటకు నడిపించగలడట. అతని ఉపవాసము యొక్క శక్తి ఆత్మలను సంపాదించుటలో కనపడెను.

👉 ప్రియులారా ఉపవాసప్రార్థనలచే ప్రభువుతో వారి మనవులను మనస్పూర్తిగా ఆయన సన్నిధిలో ఉంచుట ద్వారా ఫలితమును పొందుకున్న ఈ దైవజనుల నిస్వార్థ పరిచర్య ద్వార వేలకొలది ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించి పరలోక దూతావళి సంతోషముతో గంతులువేసి ప్రభువును స్తుతించుటకు కారకులయిన ఈ భక్తులు ఎంతో ధన్యులు

🔥 నేడు కూడ ఈ ఉజ్జీవము మనదేశములో అత్యవశ్యకము ,అట్టి ఉజ్జీవము కొరకు ప్రభువు సన్నిధిలో నిందారహితులై ఉపవాసప్రార్థన చేయగలవారిలో నీవు ఉన్నావా?

▪ *అట్టి భాద్యత గల దైవజనులు,విశ్వాసులు మరియు నాయకులు నేటి సంఘానికి,ఈ దేశానికి అవసరమున్నది*

🔺మార్కు 9: 29

*అందుకాయన ప్రార్థనవలననే ఉపవాసము వలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.*

🔥 ఉపవాసప్రార్థన వీరులముగా మనమును ఉందాము, అట్టి గొప్ప దైవజనులను,నడిపించే యోదులను దయచేయులాగున ప్రభువుకు మొర్రపెడదాము!

*ఆమేన్! ఆమేన్! ఆమేన్!!*

*👆👆👆👆👆*

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*314వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

ఇక కొంతమంది దైవ జనులు అనగా బైబిల్ లో కాకుండా నూతన నిబంధన సంఘ భక్తులలో కొంతమంది ఎలా ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఉన్నారు? తద్వారా ఏమి సాధించారో కొంతమంది భక్తులు సేకరించి రాశారు. దానిని చూసుకొందాం మన ఆత్మీయ మేలులకై!!!

🛐 *ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.*

యోవేలు 1 : 14

❇ *ప్రియులార మరికొందరు భక్తులు వారి ఉపవాసప్రార్థనలచే భూమిని తలక్రిందులు చేయువారిగా శ్రమలను సహితము సంతోషముతో స్వీకరించి అనేకుల హృదయాలలో క్రీస్తును అంగీకరించే ఉజ్జీవజ్వాలలు రగిలించిన యోధులు వీరు*

3⃣ 💎 *మార్టిన్‌ లూధర్‌ :*

🔥 విప్లవ ఉపవాసవీరుడు యితడు! ఉపవాసము యొక్క శక్తిని బట్టి ప్రభుత్వములకునూ, అధికారులకునూ సవాలు చేసెను.

👁‍🗨 *తన ప్రాణమును లక్ష్య పెట్టక తప్పుడు సిద్ధాంతములను ఎదిరించి, దీర్ఘమైన దిద్దుబాటులను తెచ్చెను.*

*ప్రొటెస్టెంట్ల సంస్థాపకుడు ఈయనే! ఇతడు దిద్దిన దిద్దుబాటు విత్తనములు ఐరోపా, అమెరికా ఖండములకు చేరెను.*

🛐 ఇతడు ఎడతెగక ఎక్కువకాలము ఉపవాసముండి ప్రార్ధించేవాడు. ఇతని ఎక్కువకాల ఉపవాసము వలన శరీర ఆరోగ్యము దెబ్బతిన వచ్చని అతని బంధుమిత్రులు భయపడిరి. అతని యొద్దకు వచ్చి ప్రేమతో, *""నీ ఆత్మ, ఉపవాసము వలన బలపరచబడుట అవసరమే కాని ఉపవాసము వలన పరిశుద్ధాత్మ నివాసముచేయు నీ శరీరము పాడైపోకూడదు""* అని సలహా యిచ్చిరి. అయిననూ అతడు తన ఉపవాస ప్రార్ధనను మానుకోలేదు!

👉 *ఇతడు బైబిలును తర్జుమా చేయుట ప్రారంభించినపుడు, ఎదుర్కొనిన వ్యతిరేకతలు విస్తారము.*

🔺ప్రభుత్వము, సంఘము, లోకమంతా ఎదిరించిననూ ఆశ్చర్యముగా పరిశుద్ధ గ్రంధమంతయూ అనువదించెను.

☦ *దేవుని హస్తములే కాని వేరేదియూ దీనిని చేయుట అసాధ్యమే! అవును, "మార్టిన్‌ లూధర్‌గారి" ఉపవాస ప్రార్ధన విని ప్రేమామయుడైన దేవుడే దిగివచ్చి అతనికి సహాయకుడై యుండి విజయవంతముగా పని జరిగించెను. అతని ఉపవాస ప్రార్ధనయే మూలకారణమయ్యెను.*

🔥 పరిశుద్ధాత్మ దేవుడు మార్టిన్ లూథర్ గారిలో రగిలించిన ఆత్మీయ ఉజ్జీవజ్వాలల ఫలితమే నీవు నేను ప్రభువును ఆరాధిస్తున్న శ్రేష్టమైన విధానము, ప్రొటెస్టెంట్ సంఘము

4⃣ 💎 *జాన్‌ కాల్విన్‌ :*

▪జెనీవాకు చెందిన ఇతడు క్రమముగా ఉపవాసముచేయు ఉత్తమ సేవకుడై యుండెను. అతని ప్రార్ధనా ఫలితముగా ఆ పట్టణమంతా రక్షణ నొంది ప్రభువులోనికి వచ్చెను.

🔥 *అంతేకాదు, అతని ఉపవాస ప్రార్ధనా ఫలితముగా అనేక ప్రార్ధనా బృందములు స్థాపింపబడెను. ప్రార్ధన వీరులు బయలుదేరిరి. అతని సేవ ద్వారా మార్పునొందినవారు, ఇంటికొక ప్రార్ధన వీరుని చొప్పున లేచి ప్రార్ధించసాగిరి.*

👁‍🗨 ఉపవాసము యొక్క ఫలితమును గ్రహింపక దానిని అవమానించినవారు, ఉపవాసము యొక్క శక్తిని కనుగొనిరి. అంతవరకు ఆచారముగా ఉపవాసము చేసిన పారంపర్య క్రైస్తవులు పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఉపవాసము చేయనారంభించిరి.

🔥 ఈ దైవజనుని ద్వార ఉజ్జీవ మంట జ్వాలలుగా లేచెను.

5⃣💎 *జాన్‌నాక్స్‌ :*

👉 *జాన్‌నాక్స్‌ అను ఉపవాస వీరుని ప్రార్ధన, ఇంగ్లాండు దేశపురాణి యొక్క యుద్ధ వీరుల బలమున కంటె శక్తి గలదై యుండును!*

👉 ఇంగ్లాండు దేశమును పరిపాలించిన మేరి ఒక క్రూరమైన రాణి. దైవసేవకుడైన జాన్‌ నాక్స్‌ను సర్వనాశనము చేయుటకు ప్రయత్నించెను కాని ఆమె వలన కాలేదు!

🔥 *ఆమె సైన్యమంతా ఈ దీన సేవకుని ఉపవాసప్రార్థన జ్వాలల యెదుట నిలువలేక పోయెను.*

👉 జాన్‌ నాక్స్‌ అనే ఈ దైవజనుడు ఉపవాసముండి ప్రార్ధించగా ఆమె ఈ ప్రార్ధన శక్తిని ఎదుర్కొనలేక వణికెను.

💥 *పట్టువిడవక అతడు దేవుని సేవకు వ్యతిరేకముగా ఉన్న ఆ రాణి కొరకు ఉపవాసముతో ప్రార్ధించుటనుబట్టి, అహంభావముతో నిండిన రాణి, పదవీ భ్రష్టురాలై విదేశములో మృతి చెందెను. "ఉపవాస ప్రార్ధన ఎంతో శక్తి గలది"*

💥 ప్రియదేవుని సంఘమా నేడుకూడ దేవుని వాక్యప్రకటనకు అనేకమైన ఆటంకములు,అవమానములు,భయంకరమైన దాడులతో హింసిస్తున్న వారికొరకు ఉపవాసముతో ప్రభువు సన్నిధిలో ప్రార్థించ సిద్ధపడుదామా!!

🔥 ఉజ్జీవజ్వాలలు రగులించి అనేకులను ప్రభువునొద్ధకు చేర్చే యోధులు కావాలి యేసయ్యకు నీలో ఆ ఉత్సాహము ఉందా?

👉 ఉపవాస ప్రార్థనలతో , ప్రభువుని

వేడుకొందాము దైవశక్తిని పొందుకుందాము,

దేవుని కొరకు గొప్పకార్యములు చేయ పూనుకుందాము

🔥 యోవేలు 2: 28

*నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.*

*ఆమేన్! ఆమేన్!! ఆమేన్!!*

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*315వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

ఇక కొంతమంది దైవ జనులు అనగా బైబిల్ లో కాకుండా నూతన నిబంధన సంఘ భక్తులలో కొంతమంది ఎలా ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఉన్నారు? తద్వారా ఏమి సాధించారో కొంతమంది భక్తులు సేకరించి రాశారు. దానిని చూసుకొందాం మన ఆత్మీయ మేలులకై!!!

🛐 *ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.*

యోవేలు 1 : 14

❇ క్రీస్తునందు ప్రియులారా గత రెండుభాగములలో దైవజనుల ఉపవాసప్రార్థనలచే ఉజ్జీవము రగిలింపబడి వారి వారి దేశములలో ప్రభువు కొరకు వేలకొలది ఆత్మలను సంపాదించి, దైవవాక్య వ్యతిరేకులలో దేవుని భయాన్ని కలుగజేసారు

ఈ దినము మరికొందరి భక్తులు ఉపవాస ప్రార్థనలచే ఉజ్జీవజ్వాలలు రగిలించి అద్భుతంగా దేవుని కార్యములు చేసిన ప్రార్థన వీరులు వీరు

💎 *ఛార్లెస్‌ ఫిన్ని గారు:*

🛐 వేకువనే లేచి ఎక్కువ సమయాన్ని యితడు ప్రార్ధనలో గడుపుతూ వచ్చెను. శరీర వ్యాయామము దేహమును ఎలాగు బలపరచుచున్నదో అలాగే క్రమమైన ఉపవాస వ్యాయామము యితని ఆత్మను పరిశుద్ధాత్మ బలపరచెను.

👉 ఉపవాసము చేయుచూ దేవునితో ఏకాంతముగా సమయము గడుపు నిమిత్తము ప్రార్ధన గదిలోను, అడవులలోను వుండేవాడు.

ఇతడు యిరవై నాలుగు గంటలూ ప్రార్ధించాడని ఈ దైవజనుని గురించి సాక్ష్యము*

🔥 *ఉపవాసప్రార్థన తన ఆధ్యాత్మిక జీవితమునకు ఒక లంగరుగా వుండెనని చెప్పేవాడు.* *ఎప్పుడైనా తనలో దేవునిశక్తి తగ్గినట్లు గ్రహించిన యెడల మూడు దినములు తీవ్ర ఉపవాసము చేసి పోగొట్టుకొన్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుటను అలవాటుగా చేసుకొనెను.*

💥చార్లెస్‌ ఫిన్నీ చుట్టూ ఎల్లప్పుడూ ఆత్మ యొక్క బలమైన ప్రసన్నత ఆవరించి యుండెను. అందువలన వ్యాపారులు, కార్మికులు, సొసైటీలో అంతస్థు గలవారు, అధికారులు మరియు వేలకొలది ప్రజలు పాపమును గ్రహించి రక్షణ కోసము ఏడ్చి, దేవుని రక్షణను స్వతంత్రించుకొనిరి.

🛐 *కీర్తనలు 69: 13*

యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిమ్ము.

💎 *జోనతాన్‌ ఎడ్వర్డ్స్‌ :*

▪ఇతడు ఉపవాస ప్రార్ధనయందు గొప్ప నమ్మకము గలవాడై ప్రసంగ వేదికపై నిలుచుటకు శక్తిలేనంతగా ఉపవాసము చేయువాడై యుండెను. ప్రభువు అతని సేవను అపరిమితముగా ఆశీర్వదించెను.

🔥 ఈ దైవజనుడు ఎక్కువ కాలము ఉపవాసముండి ప్రసంగించిన *""రోషము గల దేవుని చేతిలోని పాపులు""*

అనే ప్రసంగము ప్రజలకు కలవరము పుట్టించి వణికించెను. అతడు ప్రసంగిస్తుండగానే తాము నరకములోనికి వెళ్ళిపోతామేమో అని భయపడిన ప్రజలు స్తంభాలను, కుర్చీలను పట్టుకొని వ్రేలాడే వారు

❇ *దేవుని న్యాయతీర్పును గూర్చి యితడు ప్రసంగిస్తుండగా వారి గుండె జారినట్లు వుండెను. ప్రజలకు పశ్చాత్తాపము కలిగించే అతని ప్రసంగము యొక్క రహస్యము ఉపవాస ప్రార్ధనయే!*

💎 *జాన్‌వెస్లీ గారు:*

🛐 ఎట్టి పరిస్థితులలోను క్రమము తప్పక ఉపవాసము చేసెను. సేవకులు మాత్రం కాదు, విశ్వాసులునూ ప్రతి బుధ, శుక్రవారములు ఉపవాసము చేయాలన్నది యితని ఆజ్ఞ.

🔥 *అతని దినములలో ప్రసంగ వేదికల నుండి నిప్పురవ్వలు వంటివి ఎగిరినట్లుగా వుండెను. అది మహా గొప్ప ఉజ్జీవమునకు ప్రారంభము.*

☦ *ఉపవాసప్రార్థన యొక్క అద్భుతశక్తిని కన్నులారా చూచిన అనేకులు ఒకరితో ఒకరు పోటీపడి, తమ శరీరారోగ్యములను లెక్కచేయక, ఎక్కువకాలము ఉపవాసము చేసిరి. అయిననూ జాన్‌వెస్లీ గారు ఉపవాసము యొక్క దైవశక్తిని నొక్కి చెప్పుట మానలేదు.*

👉 ప్రార్ధించని క్రైస్తవుల వలె ఉపవాసము చేయని క్రైస్తవులునూ పరలోక మార్గములో నడవనివారై యున్నారు అని అతడు ఉద్భోదించెను.

🔺 *1789 జులై 22న డబ్లిన్‌ నగరమందు క్రైస్తవ్యము బలహీనమై యుండుటకు కారణాలు అను అంశంపై ప్రసంగించినపుడు, అతి ప్రాముఖ్యమైన కారణము ఉపవాసము చేయకపోవుటయే అని ప్రకటించెను.*

👉 ఉపవాసప్రార్థనతో ఉజ్జీవము రగిలించిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీగారు

💎 *సి.హెచ్‌.స్పర్జన్‌ గారు :*

💥 బాల్యములో దైవసేవకుడై తన ప్రసంగ సమర్థత వలన లోకమును తల్లక్రిందులు చేసిన సి.హెచ్‌.స్పర్జన్‌ ఒక మంచి ఉపవాస వీరుడు.

🛐 *అతడు ఉపవాసమును గురించి యిలాగు వ్రాసెను. ప్రార్ధన వలననూ ఉపవాసము వలననేగాని మరి దేనివలననైననూ యీ విధమైన దయ్యములు వదలిపోవుట అసాధ్యమని క్రీస్తు బోధించెను. ఈ బోధలో ఆయనకు ఒక గొప్ప ఉద్దేశ్యముండి వుండాలి,*

👉 మారుమనస్సు పొందకుండా మనుష్యుల హృదయములు కఠినపరచి, బంధించి యున్న దెయ్యములు వెళ్ళగొట్టబడుటకునూ, మనుష్యులు రక్షణ పొందుటకునూ మామూలు ప్రసంగములు, పారం పర్యాచారముగా చేయబడు ప్రార్ధనలు సరిపోవు.

*ప్రత్యేకమైన ప్రసంగములును, ఆసక్తికరమైన ప్రార్ధనలునూ గట్టి ఉపవాసములు మాత్రమే మంచి ఫలమును యిచ్చెను*

👉 *నేనెందుకు ఉపవాసము చేయాలని మీరు అడగవచ్చు! మీ ప్రార్ధనా జీవితము కాపాడబడుటకును, ఆత్మ ఎదుగుదల నిమిత్తమును ప్రభువు కోసము సాహస కార్యములు చేయుటకును ఉపవాసము అవసరమని నేను చెప్పుచున్నాను.*

❇ *యేసు ఉపవాసము చేసెను, ఉపవాసము చేయమని ఆజ్ఞాపించెను. నీవు ఉపవాసము చేయనియెడల నీకు రావలసిన అదనపు ఆశీర్వాదములను పోగొట్టుకొనువాడవై యుందువు. తాను ఉపవాసము చేసినపుడు నరములు ముడుచుకొని పోవుట వలన శరీరము బిగుసుకు పోయిననూ, ఉపవాసము చేయుటను మానలేదు. ఎందుకనగా, ఆత్మను క్రొవ్వ చేసే ఆరోగ్య కేంద్రము ఉపవాసమే!*

🛐 నశించుచున్న ఆత్మల కొరకు పరితపించి, కన్నీరు కార్చుచున్న మీరు క్రమముగా ఉపవాసము పాటించి చూడండి. దయ్యములు భయముతో వణకుటను చూచెదరు.

💥 *ఉపవాసము విశ్వాస అభివృద్ధికి మంచి ఔషధమై యున్నది. శరీర ఆరోగ్యమునకునూ అది తోడ్పడుచున్నది. ఆత్మ సంబంధమైన అనుభవములేని అన్యజనులునూ శరీర ఆరోగ్యము కొరకు ఉపవాసము చేయుచున్నారు. ఉపవాసము చేయుట వలన శరీరమునకు హానిలేదు. మెదడుకు తెలివినిచ్చును. మనస్సును దేవునియందు ఓదార్చుటకును సహాయపడును.*

👉 ప్రియసంఘమా, దైవజనమా ఉపవాసము ద్వారా సాతానుపై జయము, కార్యవిజయము, కష్టములనుండి, నష్టములనుండి విడుదల పొందుకొనుటకు, ప్రాముఖ్యముగా ప్రభువుతో నిత్యసహావాసము కల్గియుండే గొప్పసాధనమై యున్నది

👉 *ఇంక రక్షణపొందుకొనని కోట్లాది ప్రజలపట్ల భారము కల్గియున్నవా?*

ఓ దైవజనమా! అయితే నేడే వారికొరకు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే భాద్యత చేపట్టు,

ప్రతిఫలమిచ్చే ప్రభువు సన్నిధిని ఆశ్రయిద్దాము

🛐 యిర్మియా 9: 1

నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

🔺 *నేడు సమాజము మార్చబడాలి ,అనేక ఆత్మలు ప్రభువునొద్ధకు నడిపించుటకు,దురాత్మశక్తులపై విజయము పొందుకొనుటకు ఉపవాసముండి ఆయన సన్నిధిలో మోకరిందాము!! పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాము*

💥 విలాపవాక్య2: 18

*జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.*

*ఆమేన్! ఆమేన్!! ఆమేన్!!!*

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*316వ భాగము*

యెషయా గ్రంథము 58:6--8

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా మనం ఉపవాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాము!!!

ఇక కొంతమంది దైవ జనులు అనగా బైబిల్ లో కాకుండా నూతన నిబంధన సంఘ భక్తులలో కొంతమంది ఎలా ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఉన్నారు? తద్వారా ఏమి సాధించారో కొంతమంది భక్తులు సేకరించి రాశారు. దానిని చూసుకొందాం మన ఆత్మీయ మేలులకై!!!

🛐 *ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.*

యోవేలు 1 : 14

💥 ప్రియదైవజనమా భక్తుల ఉపవాసప్రార్థనలచే ఆనాటి సంఘములో ఉజ్జీవజ్వాలలు రగిలించబడి ప్రభువు కొరకు ప్రాణాలను అర్పించుటకు సిద్ధపడ్డ విశ్వాసులు నాటి సంఘములో ఉన్నారు

❇ *నేడు ప్రభువు కొరకు ప్రయాసపడుతున్న వారి ప్రాణాలను తీసే వారుండగా, వారి మార్పు కొరకు ప్రార్థించేవారు కరువైనారు*

🔥 మరికొందరు ఆనాటి గొప్ప భక్తులు ఉపవాసప్రార్థనలచే అనేక ఆత్మలను ఉజ్జీవింపజేసిన మహా విశ్వాసయోధులు వీరు

💎 *డేవిడ్‌ బ్రైనార్డ్ గారు:*

▪ యవ్వన కాలములో ప్రభువు సేవ కొరకు ఉపవాసమందు తన్నుతాను క్రుమ్మరించుకొన్న ఉత్తమ భక్తుడీతడు. ఇతడు తన డైరీలో వ్రాసిన సంగతులు ఎంతో ఉజ్జీవకరమైనవి. అవి అతడెంతో శ్రేష్ఠమైన ఉపవాస వీరుడని సాక్ష్యమిచ్చుచున్నవి.

🛐 *""ఈ దినమున ప్రార్ధన, ఉపవాసము కొరకు కేటాయించితిని. ప్రభువు తన సేవకు నన్ను పరిపక్వపరచుటకును, తన కృపతో నింపుటకును, యిది అవసరమని తెలుసుకొన్నాను. నా ప్రాణము ప్రభువుపై తృష్ణగొనెను. ఆహారము భుజించుట మరచితిని. ఆహారమున కంటె దేవుని సముఖము నాకు ప్రీతికరమాయెను""* అని పలుచోట్లలో తన డైరీయందు వ్రాసి పెట్టెను.

👉 *దేవుని కొరకు ఆత్మలను సంపాదించుట,ఆత్మీయ ఉజ్జీవము రగిలించుటయే ఈ దైవజనుని ఆహారము

💎 *విల్లియం బ్రాన్‌వెల్‌ గారు:*

💥 *19వ శతాబ్దపు బలమైన సేవకుడు! ఇతడు ఉపవాసముండి ప్రార్ధించినపుడు ప్రత్యేకమైన దేవునిశక్తిచే నింపబడెను. అతని ఉపవాస ప్రార్ధన దేశములో గొప్ప ఉజ్జీవమును తెచ్చెను. తన ప్రార్ధన గదిలో కనీసం రెండు గంటలనుండి ఆరు గంటల సమయము ఎడతెగక ప్రార్ధించుచుండెను.*

🛐 ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రము 3 గం||ల వరకు మోకాళ్ళమీద నుండి తరచుగా ఉపవాసము చేయుట అతని అలవాటు *""ఉపవాసము మరియు తమ్మును తాము పరిశీలించుకొనుటయు తగ్గిపోయి, భుజించుటయు, త్రాగుటయు, పోకిరి మాటలును, సరసోక్తులును ఎక్కువైనందున చాలామంది విశ్వాసులు తాము పొందిన రక్షణానుభవమును నిలుపుకోలేక పోవుచున్నారు""* అని అతడు చెప్పెను.

💎 *రీస్‌ హవెల్‌ గారు :*

👉 రెండవ ప్రపంచ యుద్ధ విజయము యితని ఉపవాస ప్రార్ధన శక్తిలో నుండెను. ఇతనివంటి విజ్ఞాపన ఉపవాస వీరులు యింతవరకు బయలుదేరలేదని చెప్పవచ్చు.

🛐 *తాను సేవ ప్రారంభ దినమున మొదలుకొని కేవలము రెండు దినములకు ఒక్కసారి మాత్రమే భుజించెను. జీవితమంతా అలాగే పాటించెను. తరువాత 15 దినములు ఎడతెగక ఉపవాసము చేయుటకు దేవుని ఆత్మచే నడిపించబడెను.*

💥 సువార్త ప్రకాశమును అందించే, దేశములకు విరుద్ధముగా జరిగిన రెండవ ప్రపంచ యుద్ధకాలములో దేవుడు జోక్యము చేసుకొని, అంధకార శక్తులను లయము చేయు నిమిత్తము, ఒక దినమంతా భారముతో ప్రార్ధించుటకు తన కాలేజి విద్యార్ధులను పిలిచెను. బ్రిటిష్‌ వారు పొందిన విజయము ఆ యుద్ధవీరులు, ఆయుధముల ద్వారా కలిగెనా - లేక రీస్‌హవెల్స్‌ ప్రార్ధన ద్వారా కలిగెనా? అని అతని పుస్తకములను చదువువారు గ్రహించెదరు.

అంత గొప్ప దైవజనుడు అతను

💎 *డి.యల్‌.మూడి గారు :*

☦ డి.యల్‌.మూడి విజయవంతమైన సేవకు కారణము అతని సేవ కొరకు ఉపవాసముతో ప్రార్ధించిన విశ్వాసులే!

💥1872లో డి.యల్‌.మూడి కొద్ది విశ్రాంతి నిమిత్తము ఇంగ్లండు దేశమందున్న ఒక గ్రామమునకు వచ్చిరి. తాను ప్రసంగించకూడదని తీర్మానించి యుండిననూ, ఆ గ్రామ సంఘకాపరి ఒత్తిడిని బట్టి ఉదయము, రాత్రియూ ప్రసంగించుటకు ఒప్పుకొనెను.

👉 ఆదివారం ఉదయ వర్తమానము చప్పగా ఉండెను. ఆరాధనలో పాల్గొనిన ఒక సహోదరి తన యింట నడవలేని స్థితిలో నుండిన అక్కతో మూడిగారు వచ్చిన సంగతి, ప్రసంగమును గూర్చి వివరించెను.

🛐 *దానిని విన్న అక్కయ్య, ""మూడిగారు వస్తున్నారని నేను తెలుసుకొనకపోవుట నా దురదుష్టము. గత రెండు సంవత్సరముల నుండి ఆయన్ని దేవుడు యిక్కడికి పంపాలని ప్రార్ధించుచున్నాను. నేను రాత్రికూటము ముగించు వరకు భోజనము చేయను. ప్రభువు ఆయనను బలముగా వాడుకొను నిమిత్తము ఉపవాస ప్రార్ధన చేస్తాను"" అని చెప్పి తన ప్రార్ధనాగదిలోనికి వెళ్ళి గోజూడసాగెను.*

🔥 రాత్రి కూటము ప్రారంభమాయెను. మూడిగారి ప్రసంగము సాధారణముగానే వుండెను. అయితే హఠాత్తుగా, కూటములో ఒక గొప్ప కదలిక ఏర్పడెను. ప్రసంగించుట ముగించిన తరువాత, ప్రభువుకు సమర్పించుకొనగోరు వారిని లేచి నిలువబడమని చెప్పెను. 500 మంది నిలచిరి. మూడి దిగులు చెందెను. తన వర్తమానము, పిలుపు యొక్క ఉద్దేశ్యమును వారు సరిగా గ్రహించలేదని భావించెను.

🔥 *కాబట్టి అందరిని కూర్చుండ బెట్టి మరలా పిలుపు నిచ్చెను. 500 మంది లేచిరి. అయిననూ మూడిగారి సందేహము తీరలేదు. మూడవసారి కూడా 500 మంది లేచి నిలువబడిరి. యింత గొప్ప ఆత్మల రహస్యము ఏమిటో గ్రహించలేక కూటమును ముగించెను.*

💥 పిమ్మట ఆయన కొరకు ఉపవాసముతో ప్రార్ధిస్తున్న సహోదరి యొద్దకు తీసుకొని పోయిరి. *సేవ చేయుటకు శక్తి ఎక్కడనుండి వచ్చుచున్నదో అప్పుడు గ్రహించెను. ఉపవాసముయొక్క శక్తివలన సేవ, సేవకులు ఆశీర్వదించబడుచున్నారు.*

🛐 ఉపవాసదినము ప్రతిష్టించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశములోని జనులందరిని మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. యోవేలు 1:14.

🛐 *""ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి; ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడను, శాంత మూర్తియూ, అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.

🔥 *సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్టించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి.""*

యోవేలు 2:12,13-15.

👉 ప్రియదేవుని సంఘమా నేడు క్రైస్తవ్యానికి అనేక సమస్యలున్నాయి,

సువార్తకు ఆటంకములు,

విశ్వాసులలో ,భక్తి, ప్రేమలేనితనము,

*ప్రాముఖ్యముగా ఇంకా విశ్వసించని కోట్లకొలది ప్రజలు*

🔥 విలాపవా 2: 19

*నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము*

💥 వారు సామాన్యులైన దైవజనులే...కాని వారు భక్తితో ఉపవాసప్రార్థనలతో అసమాన్యమైన కార్యములు చేయుటకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని గొప్ప ఉజ్జీవమును రగిలించిన యోధులను గూర్చి తెలుసుకొన్నాము గదా!

❇ *నీలో ఆ శక్తిలేదా? ప్రభువుసన్నిధిలో ప్రార్థించలేవా?*

💥 1సమూయేలు 12: 23

*​నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక.*

🔥 దానియేలు 9: 3

*అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.*

🛐 పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ప్రవక్తలు, రాజులు, నాయకులు మరియు ప్రజలు ప్రార్థనలచే గొప్పకార్యములు సాధించారు

👉 అలాగుననే మనము ఈ భాగములలో చూచిన గొప్పదైవజనులు,

ఆ భక్తుల ఉపవాసప్రార్థనలచే ఉజ్జీవం రగిలించిన యోధుల వలే మనమును ప్రభువు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించ సిద్ధపడుదాము, ప్రభువుకొరకు గొప్ప కార్యముల చేయ పూనుకొందాము

*ఆమేన్! ఆమేన్!! ఆమేన్!!!*

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*317వ భాగము*

యెషయా గ్రంథము 58:8--14

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని

10. ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

12. పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును.

13. నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

14. నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

మనము ఉపవాసం అనగా ఏమిటి? ఎలా చెయ్యాలి? నిజమైన ఉపవాసం అనగా ఏమిటి? దేవునికి ఇష్టమైన ఆమోదయోగ్యమైన ఉపవాసం ఏమిటి అనేది చూసుకున్నాము! ఇక 8వ వచనం నుండి చివరి వరకు ఒకవేళ నీవు దేవునికి ఆమోదయోగ్యమైన ఉపవాసం చేస్తే దేవుడు చేసే మేలులు చూడగలం!!!

ఎనిమిదిలో అంటున్నారు ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

8-12 వచనాలలో ఇజ్రాయేల్ జనులుగాని, నూతన నిబంధన విశ్వాసులు గాని పశ్చాత్తాపపడి, వెదకవలసిన రీతిలో దేవుణ్ణి వెతికి, దేవుని వాక్కులను ఆచరణలో పెట్టినట్టయితే ఫలితాలు దివ్యంగా, వింతగా ఉంటాయి. ఈనాటి విశ్వాసులు కూడా వారు దేవుని వాక్కుకు లోబడినంత మేరకు ఈ వచనాల్లోని దీవెనలు అనుభవించవచ్చు. వెలుగు, ఆరోగ్యం, నీతిన్యాయాలు వారికి ముందుగా నడుస్తాయి. దేవుని మహిమ వారిని సంరక్షిస్తుంది. ప్రార్థనలకు జవాబులూ, దేవుడు దారి చూపడమూ సంతృప్తి, బలం, సాఫల్యం, కట్టేందుకూ బలపరచేందుకూ సామర్థ్యమూ ఇవన్నీ వారివౌతాయి.

నీవు దేవునికి ఆమోదయోగ్యమైన ఉపవాసం చేస్తే నీ వెలుగు వేకువచుక్క వలె ప్రకాశిస్తుంది అంటున్నారు. వేకువచుక్క లేక మార్నింగ్ స్టార్ కొన్ని సార్లు ఉదయం కూడా కనిపిస్తుంది. నావికులకు చేపలుపట్టేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు.

తరువాత నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే ఇప్పుడు నీవు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఒక కారణం నీవు దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేయడం లేదు. పేదలకు విధవరాళ్లకు అనాదలకు సహాయం చేయడం లేదు. నీ హృదయం దేవునికి దూరంగా ఉంది. ఇప్పుడు నీకు స్వస్థత కావాలంటే ఆయనకిష్టమైన రీతిలో ఉపవాసం చేయు! స్వస్థత దానికదే వస్తుంది!!!

ఇంకా దేవుని కాపుదల నీ ఇంట్లో, నీ పనిలో, నీ వ్యాపారంలో అన్నింటులోను ఉంటుంది.

తరువాత వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని

10. ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

ఇంతవరకూ దేవుడు నాకు జవాబివ్వడం లేదు నన్ను మర్చిపోయాడు చేయి విడిచి పెట్టాడు అని గింజుకుపోతున్నావు, దేవుని మీద నిష్ఠూరాలు వేస్తున్నావు కదా, ఇక్కడ దేవుడు నీకు జవాబు ఇవ్వకపోవడానికి మరో కారణం దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేయడం లేదు. రెండు నీ పాపాలు నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నాయి. పాపాలు మాని పశ్చాత్తాప పడి, దేవునికి ఆమోదయోగ్యమైన ఉపవాసం చేస్తే నీవు తండ్రి అని పిలిస్తే, వెంటనే దేవుడు కుమారుడా అంటారు. నీతో సహవాసం చేస్తారు.

ఇక తరువాత ఉపవాసం చేస్తూ చేయకూడని పనులు మరికొన్ని కనిపిస్తున్నాయి. మొదటిది ఇతరులను బాధించకూడదు! మాట ద్వారా గాని, చేతల ద్వారా గాని ఏవిధంగా కూడా ఇతరులను భాధించకూడదు!

రెండవది: ఇతరులను వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు; వాడు ఇలాగ, అది ఇలాగ అంటూ వేలు పెట్టి చూపుతూ ఎగతాళి చెయ్యకూడదు!!! హేళన చేయకూడదు!!!

మూడు: మోసంగా మాట్లాడడం, లేదా చెడ్డదానిని బట్టి మాట్లాడటం చేయకూడదు!!!

ఇక అలా చేయకుండా ఉంటూ: ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

చూడండి ఆకలిగొన్నవారికి నీదానిలో నుంచి ఇచ్చి, బాధితుల అక్కరలను తీర్చి వారిని తృప్తిపరస్తే చీకటిలో నీ వెలుగు ఉదయిస్తుంది. రాత్రివేళ నీకు మధ్యాహ్నంలాగా అవుతుంది అంటున్నారు!!

నీవు అలా చేస్తే యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన ప్రాంతంలో కూడా నీ అక్కరలను తీర్చి నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. నీళ్ళు ఎప్పుడూ తప్పని ఊటలాగా ఉంటావు.

12 నీ ప్రజలు పురాతన శిథిలాలను మళ్ళీ నిర్మిస్తారు. అనేక తరాలనుంచి పాడుగా ఉన్న పునాదులను నీవు మళ్ళీ వేస్తావు. మనుషులు నిన్ను ‘బీటలను బాగు చేసేవాడు’ అంటారు, ‘నివాసాలకోసం వీధులను మరమ్మత్తు చేసేవాడు’ అంటారు.

నీవు ఆపదలో ఉన్నవారి అవసరాలు తీర్చి వారిని ఆదుకుంటే ఎండిన నీ జీవితాన్ని నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు!! నీరు కట్టిన తోట ఫలించునట్లు ఫలిస్తావు. పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును.

ఇంకా అంటున్నారు నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

14. నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

చూడండి దేవుని ఆరాధనా దినాన్ని పవిత్రంగా భావించి ఆచరించాలి అంటున్నారు. దానిని ఘనంగా ఎంచాలి అంటున్నారు. అలా కాకుండా ఏదో ఆచారంగా ఆచరిస్తున్నా, లేక ఆ రోజే సినిమాలకి షికార్లకు వెళ్తూ, ఆ రోజే బట్టలు ఉదుక్కునే కార్యక్రమం పెట్టుకుంటూ, ఆరాధన ఎగ్గొట్టి లోకవార్తలు చెప్పుకుంటూ, నీ వ్యాపారం నీవు చేసుకుంటూ, ఆ రోజే పని దొరికింది అని ఆరాధన మాని పనులకు కూలి పనులకు వెళ్లిపోతే మీద చెప్పిన ఆశీర్వాదం ఏదీరాదు సరికదా శాపం అని మర్చిపోవద్దు! నీ మందిరంలో లేక నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే ఎక్కువ ఆశీర్వాదం అని మర్చిపోవద్దు. గాని విచారమేమిటంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఈ So called Religious Persons , భక్తిలేని పాపిష్టులు ఆదివారంనాడే ఫంక్షన్ లు పెడుతున్నారు. ఆదివారంనాడు ఫంక్షన్ లకు వెళ్తున్నారు. ఎవరేమనుకుంటే నాకు అనవసరం గాని ఎవరైతే ఆదివారంనాడు ఆరాధన మానేసి ఫంక్షన్ లకు వెళ్తారో వారు, ఆదివారం అని తెలిసి కూడా ఆరోజే ఫంక్షన్ లు పెట్టేవారు ఇద్దరూ దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడక తప్పదు! తీర్పు తప్పదు! ఆ రోజు మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు, ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరిస్తూ, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయక లోకవార్తలు చెప్పుకొనకయు ఉండమని ఆజ్ఞాపిస్తే దేవుని మాట నిర్లక్ష్య పెడితే ఇశ్రాయేలు జనాంగాన్ని చెరలు పాలు చేసిన దేవుడు నిన్ను వదిలేస్తారు అని అనుకోవద్దు!

Psalms(కీర్తనల గ్రంథము) 84:1,2,3,4,7,10

1. సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు

2. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.

3. సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను.

4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.(సెలా.)

7. వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.

10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో!

సరిచేసుకో!

ఆయనకు ఆమోదయోగ్యమైన ఉపవాసం చేసి ఆశీర్వాద కారకుడవు కమ్ము!!

ఆమేన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*318వ భాగము*

యెషయా గ్రంథము 59:1--8

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

4. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

5. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.

6. వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.

7. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి

8. శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 58వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 59వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!!

ఈ అధ్యాయం లో కూడా ఇశ్రాయేలు ప్రజలు పాపాలను చూపిస్తున్నారు. మొదటి భాగంలో వారి ప్రార్థన లకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కారణం చూపిస్తున్నారు!

గతభాగంలో వారు దేవునికి ఆమోదయోగ్యమైన ఉపవాసం చేయకపోవడం వల్ల దేవుడు వారి ప్రార్థన లకు జవాబు ఇవ్వడం లేదు అని చూసుకున్నాము.

Isaiah(యెషయా గ్రంథము) 58:5,6,7,8,9

5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని ...

ఇక ఈ అధ్యాయం లో అంటున్నారు 1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది

చూడండి రక్షించడానికి దేవునిచేతులు కురచకాలేదు. వినలేక పోవడానికి ఆయనకు చెవుడు రాలేదు గాని మీ ప్రార్థన దేవున్ని చేరకుండా మీ పాపాలు అడ్డంగా వస్తున్నాయి అంటున్నారు!!!

దేవుడు ఏమి చేయలేనివాడు కాడు. చెవిటివాడు కాదు.

యెషయా 66:18

వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

మలాకీ 3:16

అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

ఆయన తన ప్రజల ప్రార్థనలు వినిపించుకోకపోతే వారి తరఫున పనిచేయకపోతే ఆ తప్పు ఆయనది కాదు. వారిదే. పాపం మనలను దేవుని సహవాసం నుండి వేరుచేస్తుంది. అనేకసార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఇదే

యెషయా 1:15

మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

యెషయా 1:16

మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

యెషయా 1:17

కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

కీర్తనలు 66:18

నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.

కీర్తనలు 66:19

నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు

కీర్తనలు 66:20

దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.

మీ అపరాధాలు మీకూ మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు అంటున్నారు. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలకు కూడా జవాబు రాకపోవడానికి కారణాలు ఇవే! కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

ఇంకా అంటున్నారు మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

4. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మరిన్ని కారణాలు చూపిస్తున్నారు ఇక్కడ!

• మీ చేతులు రక్తముతో అపవిత్ర పరచబడ్డాయి. అనగా మీరు నరహత్య గాని, నిరపరాదులను బలి ఇవ్వడం గాని జరిగింది.

• మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రమయ్యాయి. అనగా చేతులతో చేసిన పాపాలు. వ్రేలితో రాసిన దొంగ లెక్కలు. మీ వ్రేళ్ళు దేనిని పట్టుకోకూడదో వాటిని పట్టుకుని, సొంత భార్య ఉండగా పరుని భార్యను పట్టుకోవడం లాంటి అపవిత్రమైన దోషాలతో మీ వ్రేళ్ళు ఉన్నాయి.

° మీ పెదవులు అబద్దాలు ఆడుతున్నాయి.

° మీ నాలుక కపటముగా మాట్లాడుతుంది. ఇచ్చకపు మాటలు పలుకుతుంది. బూతులు అపవిత్ర పలుకులు పలుకుతుంది.

° నీతిని బట్టి సత్యమైన సాక్ష్యం చెప్పడం లేదు.

• చెడుగుతో మీ హృదయం నిండిపోయింది.

ప్రియులారా 3-8 వచనాలలో ఇస్రాయేల్ ప్రజల చెడు ప్రవర్తన సారాంశం కనిపిస్తుంది. దీన్ని ఇంతకు ముందే ఖండించడం జరిగింది.

మీ చేతులు రక్తంచేత, మీ వ్రేళ్ళు అపరాధాలచేత అపవిత్రమయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుకలు కుటిలమైన మాటలు పలుకుతాయి. ఎవడూ న్యాయంగా దావా చేయడం లేదు, ఎవడూ నిజాయితీతో వ్యాజ్యెమాడడం లేదు. అందరూ వట్టి కబుర్లమీద ఆధారపడి, మోసంగా మాట్లాడుతారు. చెడుగును గర్భం ధరించి అపరాధాన్ని కంటారు అంటున్నారు!

ఇంకా చూసుకుంటే 5. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.

6. వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.

దీని అర్ధం వారు పన్నే ఎత్తుగడలు ఇతరుల పాలిట కాలకూట విషం. వారికి అవి నిరుపయోగం.

వాళ్ళ సాలెగూడు వాళ్ళకు వస్త్రం కాబోదు. వాళ్ళు నేసినదానితో కప్పుకోలేరు.

వాళ్ళ పనులు పాపిష్టి పనులు. వాళ్ళు చేతులతో దౌర్జన్యం చేస్తారు.

ఇంకా క్రిందకు పోతే 7. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి

8. శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.

చూడండి వారి కాళ్ళు పాపము చేయడానికి పరుగెత్తుచున్నాయి. ఇంకా నిరపరాధులను చంపడానికి వారి కాళ్ళు పరుగులెత్తుచున్నాయి అంటున్నారు.

పౌలుగారు చెబుతున్నారు Romans(రోమీయులకు) 3:10,11,12,13,14,15,16,17,18,19

10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

13. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

14. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

15. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.

16. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

17. శాంతిమార్గము వారెరుగరు.

18. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

చూడండి. మానవ జాతిని మొత్తంగా వర్ణించడంలో పౌలుగారు ఈ వచనాలను వాడుకున్నారు. 1-6 వచనాలు కూడా భ్రష్టులైన మానవులకు వర్తిస్తాయి. ఇజ్రాయేల్ ప్రజల్లో ఎక్కువమంది దేవుని దృష్టిలో ఈ వర్ణనకు సరిపోయిన వారైనప్పటికీ దేవుడు తమ ప్రార్థనలను వినాలని వారు అనుకొన్నారు (58:2-3).

ఆదికాండము 6:5

నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

సామెతలు 1:16

కీడు చేసేందుకు వాళ్ళ పాదాలు పరిగెత్తుతాయి. రక్తపాతం చేసేందుకు వాళ్ళు త్వరపడతారు.

మనుషులు ఎంత ఆతురతతో పాపం చేస్తారో ఇది చూపిస్తున్నది.

యెషయా 53:6

మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! మనలను మనమే పరిశోధన చేసుకుందాం! మనము కూడా ఇలాగే ఉన్నామా?! మన అపరాధాలు మనకు దేవునికి అడ్డంగా వచ్చాయి. మన పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు అంటున్నారు. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలకు కూడా జవాబు రాకపోవడానికి కారణాలు ఇవే! కాబట్టి మనలను మనం సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*319వ భాగము*

యెషయా గ్రంథము 59:9--15

9. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

10. గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము.

11. మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

12. మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త రించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.

13. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.

14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.

15. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 59వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 9--15 వచనాలలో యెషయా భక్తుడు తన ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నారు.

కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

తన ఇశ్రాయేలు జాతి పాపిష్ఠి స్థితిని ఒప్పుకోవడంలో యెషయా ప్రవక్త తనను కూడా తన ప్రజలతో కలుపు కుంటున్నారు. 64:5-7;

Isaiah(యెషయా గ్రంథము) 64:5,6,7

5. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

6. మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

7. నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

బైబిలు ప్రవక్తలు, పవిత్రులు తామేదో అందరికంటే గొప్పవారం అయినట్టూ పరిశుద్ధులూ, న్యాయమంతులూ అయినట్టూ ఎంచుకోలేదు.

ఎజ్రా 9:6-7; యిర్మీయా 3:22-25; దాని 9:4-19; రోమ్ 3:9

Ezra(ఎజ్రా) 9:6,7,8,9,10,13,15

6. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.

7. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి.

8. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.

9. నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుట కును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము1 నిచ్చుటకును కృప చూపించితివి.

10. మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా.

13. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

15. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

Jeremiah(యిర్మీయా) 3:23,24,25

23.​ నిశ్చయముగా కొండలమీద జరిగినది మోస కరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలు నకు రక్షణ కలుగును.

24. అయినను మా బాల్యమునుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొఱ్ఱెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మింగివేయుచున్నది.

25. సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.

దానియేలు గారు కూడా ఒప్పుకున్నారు

Daniel(దానియేలు) 9:4,5,6,7,8,9,10,14,15,16,17,18,19

4. నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసియొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముచేయువాడా,

5. మేమైతే నీ దాసులగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికిని చెప్పిన మాటలను ఆలకింపక

6. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.

7. ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితిమి; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.

8.​ ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.

9.​ మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

10. ఆయన తన దాసులగు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి.

14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి, సమయము కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రాజేసెను.

15. ప్రభువా మా దేవా, నీవు నీ బాహు బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.

16. ప్రభువా,మా పాపములనుబట్టియు మా పితరుల దోషమునుబట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యము లన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.

17.​ ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.

18. నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

19. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

ఇంకా ఒప్పుకుంటున్నారు భక్తుడు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

దేవుడు వెలుగు. పాపం మనుషులను ఆయననుండి దూరం చేస్తుంది. ఆయనలో చీకటి లేదు. ఈ మాటలు రాసిన సమయంలో ఇస్రాయేల్‌లో వెలుగనేదే లేదు. ద్వితీ 28:15, 28, 29 ఈ విధంగా నెరవేరింది. యెషయా 6:9-12 కూడా చూడండి. ఇస్రాయేల్ ప్రజలు తాము ఏమిటో, ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలో ఉన్నారు. ఇలా తమ మనసుల్లో, హృదయాల్లో ఆత్మల్లో పేరుకుపోయిన అంధకారం తమ పాపాలకు శిక్ష అన్న విషయం వారు గ్రహించలేదు. దేవుని వెలుగును సత్యాన్ని వారు వాంఛించలేదు. దానికి ఫలితం ఇది.

భక్తులు ఇలా తాము పాపము చేయకపోయినా పాపముచేసిన తమ పితరులతో కలుపుకుని పాపములు ఒప్పుకున్నారు. మనము కూడా అలా ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము.

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*320వ భాగము*

యెషయా గ్రంథము 59:9--15

9. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

10. గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము.

11. మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

12. మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త రించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.

13. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.

14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.

15. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 59వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 10వ వచనంలో కూడా పాపాలు ఒప్పుకుంటున్నారు భక్తుడు!

గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము.

చూడండి గుడ్డివారిలాగా గోడకోసం తడవులాడుతూ, కళ్ళు లేని వారిలాగా తడవులాడుతూ ఉన్నాం. మధ్యాహ్న కాలంలో మునిచీకటి అయినట్టు కాలు జారి పడుతున్నాం. బలిసిన వాళ్ళమధ్య మేము చచ్చినవాళ్ళలాగా ఉన్నాం.  మేమందరమూ ఎలుగుబంట్లలాగా ‘గుర్రు’ మంటున్నాం అంటున్నారు.

తరువాత వచనంలో మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది అంటున్నారు.

చూడండి గువ్వల వలే ఏడుస్తున్నాము అంటున్నారు.

యెషయా 38:14

మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణిం చెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.

యెహేజ్కేలు 7:16

​వారిలో ఎవరైనను తప్పించుకొనిన యెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.

నహూము 2:7

నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు.

ఇంకా అంటున్నారు న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది అంటున్నారు.

కీర్తనలు 9:8

యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.

అయితే అధికారులు ఏం చేస్తున్నారు?!

కీర్తనలు 58:1

అధిపతులారా, మీరు నీతి ననుసరించి మాటలాడుదు రన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చు దురా?

కీర్తనలు 58:2

లేదే, మీరు హృదయ పూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.

ఇక 12వ వచనంలో అంటున్నారు మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త రించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.

12-15 వచనాలలో ఇజ్రాయేల్ జాతి అంధకారంలో ఎందుకు ఉందో యెషయా గారు స్పష్టం చేస్తున్నారు. అతడు తన జాతి పాపాలను ముందు మొత్తంగాను, తరువాత ఒక్కొక్కటిగాను ఒప్పుకుంటున్నాడు. 13-15 వచనాల్లో చూస్తే ఇప్పుడున్న పరిస్థితులను గురించి అచ్చు గుద్దినట్టు రాసినట్టు ఉంది.

నీ ఎదుట మా అక్రమకార్యాలు అనేకం. మా అపరాధాలు మామీద సాక్ష్యం పలుకుతున్నాయి. మా అక్రమకార్యాలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, మా దోషాలు మాకు తెలిసే ఉన్నాయి –

13. యెహోవామీద తిరుగుబాటు, ద్రోహం చేశాం. మా దేవునినుంచి తొలగిపోయాం.

దౌర్జన్యాన్నీ అవిధేయతనూ ప్రోత్సహించాం. ఆంతర్యంలో కల్పించుకొన్న అబద్ధాలు చెప్పాం.

14 గనుక న్యాయానికి ఆటంకం కలిగింది. ధర్మం దూరంగా నిలిచి ఉంది. సత్యం వీధులలో పడివుంది. నిజాయితీ లోపలికి రాలేకపోతున్నది.

చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఒప్పుకుంటున్నారో భక్తుడు!

మేము తిరుగుబాటు చేశాము అంటున్నారు. యెషయా 1:2

యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

యెషయా 48:8

అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పించుకొంటివని నాకు తెలియును.

గతభాగం లో చూసుకున్నాము దానియేలు గారు, ఎజ్రా గారు, నెహెమ్యా గారు అయ్యా నీకు విరోధంగా పాపము చేసి తిరుగుబాటు చేసినందువలననే మాకు ఈ శ్రమలు, చెరలు అంటున్నారు!

ఇంకా దేవుని మార్గం నుండి తొలిగిపోయాము అంటున్నారు.

యెషయా 1:4

పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

2దినవృత్తాంతములు 29:6

మన పితరులు ద్రోహులైమన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.

యిర్మియా 2:27

వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి; అయినను ఆపత్కాలములోలేచి మమ్మును రక్షింపుమని వారు మనవి చేయుదురు.

ఇంకా దౌర్జన్యం ను ప్రోత్సాహించాము అంటున్నారు

యెషయా 3:14

యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది

యెషయా 3:15

నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 5:7

ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

యెషయా 30:12

అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కార మును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

ఇంకా అబద్ధాలు చెప్పాము అంటున్నారు– ఈ అధ్యాయంలో అబద్ధాలు చెప్పడమనే పాపాన్ని గురించి నొక్కి చెప్పినట్టు గమనించండి (వ 3,4,13,14,15). మనుషులు చాలా సార్లు ఇది అల్పమైన విషయంగా భావిస్తారు. అంతగా పట్టించుకోరు. అయితే ఇది అతి ఘోరమైన పాపాల్లో ఒకటి.

అందుకే న్యాయానికి ఆటంకం కలిగింది. ధర్మం దూరంగా నిలిచి ఉంది. సత్యం వీధులలో పడివుంది. నిజాయితీ లోపలికి రాలేకపోతున్నది అని వాపోతున్నారు దేవుని పాదాల దగ్గర భక్తుడు!!

యెషయా గ్రంథమంతటిలో న్యాయం, నీతి నిజాయితీల ప్రాముఖ్యత నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ఈ మాటలు దాదాపు 60 సార్లు కనిపిస్తాయి.

అప్పుడేనా ఇప్పుడు కూడా సత్యం సంతవీధులలో పడి ఏడవటం లేదా!!! చిన్నవాడి నుండి ముసలోడు వరకూ ప్రతీ ఒక్కడు అబద్దాలు చెబుతున్నారు గాని నీతిని అనుసరించి నిజం పలికేవాడు కనబడటం లేదు!!!

ఇక 15వ వచనంలో అంటున్నారు సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

నీతి న్యాయాల కోసం పవిత్రత పక్షంగా నిలిచేవారిని ఇతరులు గౌరవించాలి. అయితే సమాజంలో ఇలాంటి వారికి ఎదిరింపు, పీడన, ఒక్కోసారి మరణం ఎదురౌతాయి. ఇలాంటి సమాజాన్ని చూచి న్యాయం, యదార్థత, సత్యం అంటే ఎంతో ఇష్టమున్న దేవునికి ఏం సంతోషం ఉంటుంది? ఆది 6:5-6 లో కూడా ఇలాగే ఉంది!

Genesis(ఆదికాండము) 6:5,6,7

5. నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

6. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

7. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించి నందుకు సంతాపము నొంది యున్నాననెను.

ఇలాంటి పరిస్థితులలో భక్తులు సమాజం తరుపున పాపాలు ఒప్పుకొని ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని న్యాయమైన ఉగ్రత వారిమీదికి రాకుండా కాపాడుకున్నారు. నేడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి లోకంలో! కాబట్టి మనము కూడా జనుల పాపాలు ఒప్పుకుని ఉపవాసముండి ప్రార్థన చేద్దాం!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*321వ భాగము*

యెషయా గ్రంథము 59:15--18

15. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను

18. ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 59వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 16వ వచనం నుండి ప్రజలు దేవుని మాట వినలేదు కనుక దేవుని తీర్పులు కనిపిస్తున్నాయి.

15. సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.

16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.

చూడండి న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను అంటున్నారు.

నిజానికి ఇది ఇశ్రాయేలు వారి అవినీతికి దేవుని శిక్ష గాని అయితే ఇది అంత్యకాలంలో గోగుమాగోగు యుద్ధంలో మరియు హార్మెగిద్దోన్ యుద్ధం సమయమప్పుడు జరిగే సంభవంలా కనిపిస్తుంది.

యెషయా 63:5

నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

యెషయా 63:6

కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

యెషయా 64:7

నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

యిర్మియా 5:1

యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.

యిర్మియా 5:2

యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.

యెహేజ్కేలు 22:30

నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు.

యెహేజ్కేలు 22:31

కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యిర్మియా 5:30

ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగు చున్నది.

యిర్మియా 5:31

ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజ కులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?

అందుచేత తన సొంత హస్తం ఆయనకు విజయం చేకూర్చింది. తన న్యాయం ఆయనకు ఆధారంగా ఉంది అంటున్నారు!

యెషయా 51:9

యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

ఈ హస్తం ఇప్పుడు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కారణం తన పనికి పునాదిగా ఉండేందుకు దేవునికి ఇస్రాయేల్‌లో ఏ కోశానా నీతి న్యాయాలు కనిపించలేదు.

ఇక తరువాత వచనంలో నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను

18. ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.

చూడండి నీతిని కవచముగా రక్షణను శిరస్త్రాణము అనగా హెల్మెట్ గా దేవుడు ధరించుకున్నారట!! అయితే పౌలుగారు మనకు ఏమని చెప్పారంటే

ఎఫెసీయులకు 6:14

ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని

ఎఫెసీయులకు 6:17

మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.

ఇంకా అంటున్నారు ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను.

వాళ్ళు చేసినవాటి ప్రకారం ఆయన ప్రతీకారం చేస్తాడు. తన శత్రువులకు ఆగ్రహం చూపుతాడు. తన విరోధులకు ప్రతిక్రియ చేస్తాడు. ద్వీపవాసులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.

యెషయా 1:24

కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

యెషయా 34:8

అది యెహోవా ప్రతిదండనచేయు దినము సీయోను వ్యాజ్యెమునుగూర్చిన ప్రతికార సంవత్సరము.

యెషయా 35:4

తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.

యెషయా 47:3

నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

ఇక ఆసక్తిని పై వస్త్రంగా ధరించారు

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 26:11

యెహోవా, నీ హస్తమెత్తబడి యున్నదిగాని జనులు దాని చూడనొల్లరు జనులకొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడు దురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును.

యెషయా 37:32

శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.

యెషయా 42:13

యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

ఇక వాళ్ళు చేసినవాటి ప్రకారం ఆయన ప్రతీకారం చేస్తాడు. తన శత్రువులకు ఆగ్రహం చూపుతాడు. తన విరోధులకు ప్రతిక్రియ చేస్తాడు. ద్వీపవాసులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.

Isaiah(యెషయా గ్రంథము) 65:6,7

6. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను.

7. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.

యెషయా 66:6

ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.

రోమీయులకు 2:6

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

రోమీయులకు 2:7

సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

కాబట్టి దేవుడు ప్రతీ వానికి వాని క్రియలు చొప్పున తీర్పుతీర్చే సమయం దగ్గర పడింది గనుక మన క్రియలను పరిశీలన చేసుకుని, ఆయన మార్గములో నడిచిపోదాం!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*322వ భాగము*

యెషయా గ్రంథము 59:19--21

19. పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.

20. సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.

21. నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 59వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 19వ వచనం నుండి దేవుని ఆదరణ వాక్యాలు మరలా కనిపిస్తాయి.

పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.

ప్రపంచ జాతులన్నీ యెహోవాయే ఏకైక నిజ దేవుడని గ్రహించి ఆయన పట్ల శ్రద్ధాభక్తులు నేర్చుకుంటాయి. “ఆయన” అంటే తరువాతి వచనంలో కనిపిస్తున్న విమోచకుడు, అంటే యేసుప్రభువు.

పడమటి దిక్కున ఉన్నవారికి యెహోవా పేరుపట్ల భయభక్తులు కలుగుతాయి.

ఆయన వైభవం అంటే ప్రొద్దు పొడిచేదిక్కున ఉన్నవారికి భయభక్తులు కలుగుతాయి.

యెహోవా ఊపిరికి కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు. “విమోచకుడు సీయోనుకు వస్తాడు. యాకోబు వంశంవారిలో తమ అక్రమకార్యాలనుంచి నావైపు తిరిగేవారి దగ్గరికి వస్తాడు” అని యెహోవా అంటున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 2:2,3

2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

యెషయా 11:10

ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

యెషయా 40:5

యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

Isaiah(యెషయా గ్రంథము) 52:10,11

10. సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

11. పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి

ఇక తరువాత వచనం సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.

ఇది యేసుక్రీస్తు ప్రభులవారి కోసం చెప్పబడుతుంది. యెషయా గ్రంథాన్ని అర్థం చేసుకొనేందుకు ఇది మూల వాక్యాలలో ఒకటి. అన్య జనుల సంఖ్య పూర్తి అయిన తర్వాత ఇస్రాయేల్‌వారంతా రక్షణ పొందుతారు కాబట్టి ఇది క్రీస్తు రెండవ రాకడ సమయంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇస్రాయేల్‌కు విడుదల కలిగి తన గత క్షేమ స్థితి కలిగినప్పుడే 19 వచనంలో రాసివున్నట్టుగా భూమిపైని జాతులన్నీ దేవునివైపు తిరుగుతారు (రోమ్ 11:12, 15). పౌలుగారు చెబుతున్న సీయోను అంటే అక్షరాలా ఇస్రాయేల్‌జాతికి ప్రతినిధిగా ఉన్న జెరుసలం నగరమే అని అర్థం చేసుకోవాలి.

Romans(రోమీయులకు) 11:12,15,25,26

12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

ఇక చివరి వచనంలో అంటున్నారు నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

నిబంధన కోసం చూసుకుంటే యెషయా 55:3

చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

Jeremiah(యిర్మీయా) 31:31,32,33,34

31.​ ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32.​ అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.

ఇలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి, అహరోను యాజక క్రమం కొట్టివేసి యేసుక్రీస్తు ప్రభులవారి సిలువయాగం ద్వారా మెల్కీసెదకు క్రమంలో క్రొత్త నిబంధన అనే శాశ్వత నిబంధన చేశారు. మరి క్రొత్త నిబంధన ద్వారా రక్షణ పొందిన నీవు దానికి తగిన జీవితం జీవిస్తున్నావా!!!!

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*323వ భాగము*

యెషయా గ్రంథము 60:1--5

1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

4.కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

5. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

6. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 59వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 60వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం కోసం చూసుకుంటే ఈ అధ్యాయంలో “నీకు”– అనగా ఇజ్రాయేల్ జాతికి ప్రతినిధిగా ఉన్న జెరుసలం – వ 10,14,15,18,21. ఇజ్రాయేల్ జాతికి భవితవ్యం ఏమీ లేదనీ ఈ అధ్యాయంలోను, ఇతర చోట్ల కనిపించే ఈ ప్రవచనాలు క్రొత్త నిబంధన సంఘానికే వర్తిస్తాయనీ కొందరు బైబిల్ పండితులు భావిస్తారు. ఈ ప్రవచనాలు ఆధ్యాత్మికంగా క్రొత్త నిబంధన సంఘానికి ఏమాత్రం చెందవని చెప్పడం లేదు గాని ఇస్రాయేల్‌జాతి విషయంలో ఇవి అక్షరాలా నెరవేరవు అన్న మాటతో ఏకీభవించడం లేదు. ఈ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజల పునరాగమనం, వెయ్యేళ్ల పరిపాలన కోసం చెబుతుంది. నిజానికి పాత నిబంధన గ్రంథంలో దేవుని రాజ్యం గురించిన ప్రవచనాలు నాలుగు నెరవేర్పులు ఉంటాయి –

1) ప్రవక్తలు బ్రతికిన కాలంలోని పరిస్థితులకు ఇవి వర్తించాయి;

2) క్రీస్తు సంఘానికి ఆధ్యాత్మికంగా, సాదృశ్యరూపకంగా వర్తించవచ్చు;

3) వెయ్యేళ్ళ పాలనకు అక్షరార్థంగా వర్తించవచ్చు;

4) క్రొత్త భూమి, ఆకాశాల విషయంలో జరిగే శాశ్వత నేరవేర్పు కూడా ఉండవచ్చు.

ఇక మొదటి రెండు వచనాలలో నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది అంటున్నారు.

ఇంతవరకు పాపాంధకారంలో, చెర అనే అంధకారంలో ధర్మశాస్త్రమనే చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు వచ్చింది లెమ్ము తేజరిల్లమంటున్నారు దేవుడు!

Isaiah(యెషయా గ్రంథము) 4:5,6

5. సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6. మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

యెషయా 9:2

చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

నిజానికిఆధ్యాత్మిక అంధకారాన్ని పటాపంచలు చేసే వెలుగు సాక్షాత్తూ యెహోవాదేవుడే .

మలాకీ 4:2

అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

John(యోహాను సువార్త) 1:4,5,9,10

4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:4,5

4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

ఇక రెండవ వచనంలో చూడు, భూమిని చీకటి కమ్ముతూ ఉంది. కటిక చీకటి జనాలను కమ్ముతూ ఉంది. అయితే యెహోవా నీమీద ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన శోభ నీమీద కనబడుతూ ఉంది అంటున్నారు.

పాపం వల్ల కలిగే ఆధ్యాత్మిక అంధత్వాన్ని ఈ చీకటి సూచిస్తున్నది.

యెషయా 9:1

అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

యెషయా 9:2

చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

యెషయా 59:9

కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము

అయితే ఈ అంధకారం ఎలా వచ్చిందో పౌలుగారు చెబుతున్నారు Ephesians(ఎఫెసీయులకు) 4:17,18,19

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామేకాముకత్వమునకు అప్పగించుకొనిరి.

కాబట్టి ప్రియులారా ఇలాంటి అంధకార సంబంధమైన క్రియలను మనము విసర్జించవలసిన అవసరం ఉంది.

Romans(రోమీయులకు) 13:12,13,14

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

కాబట్టి విశ్వాసులమైన మనము కూడా అంధకార క్రియలను వదలి శరీరకార్యాలు వదలి, క్రీస్తు మనమీద పకాశించులాగున ఆయన వెలుగులో నడుద్దాం!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*324వ భాగము*

యెషయా గ్రంథము 60:1--5

1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

4. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

5. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

6. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక మూడవ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

4. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

ఇజ్రాయేల్ నకు రక్షణ పూర్వ క్షేమస్థితి కలగడంవల్ల లోకమంతటికీ అద్భుతమైన దీవెనలు వస్తాయన్న సత్యం యెషయా గ్రంథంలో పదేపదే కనిపిస్తున్నది. తద్వారా అబ్రాహాము గారికి దేవుడు చేసిన వాగ్ధానం నెరవేరింది.

ఆదికాండము 12:3

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

Isaiah(యెషయా గ్రంథము) 60:5,9,10,11,12

5. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ఇక తరువాత వచనంలో తలెత్తి చుట్టూరా చూడు. అందరూ సమకూడి నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తూ ఉన్నారు. నీ కూతుళ్ళు చంకనెత్తబడి వస్తూ ఉన్నారు అంటున్నారు.

ఈ రకంగా చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఇశ్రాయేలు దేశమునకు చేరుకుంటారు అని చెబుతున్నారు. ఈ వాగ్ధానం రెండు సార్లు జరిగింది. ఇంకా జరుగుతుంది. మొదటి సారి కోరెషు పాలనలో! రెండవసారి 1948 నుండి ఇంతవరకూ కొనసాగుతుంది.

Isaiah(యెషయా గ్రంథము) 49:18,19,22,23

18. కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

22. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

ఇక తరువాత వచనంలో నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.

ఇప్పుడు ఎందుకు ప్రకాశిస్తారు అంటే

కీర్తనలు 34:5

వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.

ఇప్పుడు వారికి సంతోషం కలుగుతుంది. యెషయా 35:1

అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును

యెషయా 35:2

అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెషయా 35:10

వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

యెషయా 66:14

మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

ఇక మాటిమాటికీ దేవుడు ఇశ్రాయేలు చెరవిముక్తి అనంతరం జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును అంటున్నారు.”– వ 11; 18:7; 23:18; 45:14; 61:6; 66:12.

ఇక తరువాత వచనంలో ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

ఇక మిద్యాను అనగా యోసేపుని అన్నలు అమ్మినది వీరికే! ఇశ్రాయేలు నిర్గమనంలో పాపముచేసింది వీరితోనే! ఆది 37:28; న్యాయాధి 6:2; కీర్తన 83:9.

ఏయిఫా మిద్యాను కొడుకు.

“షేబ” అనేది– అరేబియా దేశాలలో దక్షిణ భాగాన ఉంది. షేబ దేశపురాణి సొలొమోను రాజును చూడటానికి వచ్చి దేవుని తెలుసుకున్నట్లు చూడగలం!!!

అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మిధ్యాను వారు, షేబవారు వెండి బంగారాలు తీసుకుని వచ్చి దేవుని కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు. – ఆ జాతులలో కలిగే సంపూర్ణమైన మార్పును సూచిస్తూ ఉంది. “వారంతా” అనే మాటను గమనించండి.

ఈ రకంగా ఇశ్రాయేలు వారి సంతోషం లో అన్యులు కూడా పాలుపంచుకుంటారు. నీవుకూడా క్రీస్తు వెలుగు నీమీద ప్రకాశించనిస్తే, జనాలకు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తే నీవుకూడా అనేకులకు ఆశీర్వాదము లకు కారకుడవు కాగలవు!!!

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*325వ భాగము*

యెషయా గ్రంథము 60:7-12

7. నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

8. మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఏడవ వచనం చూసుకుంటే నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

విదేశాలనుండి వచ్చిన విరాళములతో దేవుని మందిరాన్ని అలంకరిస్తాను అంటున్నారు. ఇంకా కేదారు నెబాయోతు నుండి వచ్చిన గొఱ్ఱెమందలతో బలియాగాలు జరుగుతాయి అంటున్నారు.

మొదటగా కేదారు”– అరేబియా ఎడారిలోని తెగలను ఒక ముఖ్య స్థానం. బబులోను రాజు నెబుకద్నెజరు కేదారు పై దాడి చేశాడు (యిర్మీయా 49:28-29)

రెండు నెబాయోతు అనగా ఇష్మాయేలు కొడుకు!

మూడు: జంతుబలులు! 56:6-7లో కూడా దీనికోసం వ్రాయబడింది. కానీ రాబోయే వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో జంతు బలులు ఉంటాయా? ఇది చాలా చిక్కు ప్రశ్నే యెహె 40:38-43 కూడా జంతుబలులు జరుగుతాయి అని వ్రాయబడింది.

యెహేజ్కేలు 40:38-43 ఈ వచనాలలో ఇక్కడ మూడు రకాల అర్పణలు కనిపిస్తున్నాయి – హోమబలి, పాపాలకోసమైన బలి, అపరాధబలి. ఇవి గాక శాంతి బలులు, ధాన్య నైవేద్యాలు తరువాతి అధ్యాయాల్లో కనిపిస్తున్నాయి (ఉదా।। 43:27; 45:17; 46:2, 12). ఈ బలుల అంతరార్థాలు తెలుసుకోవాలంటే మనము లేవీ 1-7 అధ్యాయాలు చూసుకోవాలి. అయితే జంతు బలుల గురించి ఇక్కడ రాసి ఉండడం బైబిల్ వ్యాఖ్యాతలను తబ్బిబ్బు చేసింది. ఇది బలులను ఇంకా అర్పిస్తూనే ఉండే కాలాన్ని సూచిస్తున్నది. యెహెజ్కేలు 40-48 అధ్యాయాలు క్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన గురించి అయితే జంతు బలులు అర్పించడం అప్పుడు జరుగుతుందని అర్థమా? అలా కాక ఈ బలులన్నిటినీ క్రీస్తు చేసిన ఒక్క బలికీ దృష్టాంతంగా అర్థం చేసుకోవాలా? ఈ బలులు సాదృశ్యాలైతే ఈ దర్శనంలోని ఇతర విషయాలు కూడా సాదృశ్యంగా తెలుసుకోవాలా? ఆలయం, నగరం, యాజకులు మొదలైనవన్నీ కేవలం సూచనలేనా? అక్షరాలా వాస్తవంగా ఇవి ఉండవా? లేక బైబిల్లో చాలా చోట్ల ఉన్నట్టుగా ఇక్కడి వృత్తాంతం సూచనలూ అక్షరార్థమైన వివరాలూ కలిసి ఉన్నాయా? ఇక్కడ చెప్పిన ప్రతి విషయమూ అక్షరాలా నెరవేరవలసిన అవసరం లేకపోతే కొంతమట్టుకు ఏదో ఒక విధంగా అక్షరాలా నెరవేరే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు అడగడం తేలికే. అయితే బైబిలు గురించి ప్రస్తుతం మనకు తెలిసినదానిపై ఆధారపడి వీటికి జవాబులివ్వడం అసాధ్యం కావచ్చు. ఒకటి మాత్రం నిజం – వెయ్యేళ్ళ పరిపాలనలలో జంతు బలులు కొనసాగడం గనుక జరిగితే అవి క్రీస్తు ఇప్పటికీ అర్పించి ముగించిన ఒకే బలియాగానికి స్మారక చిహ్నాలు మాత్రమే (ఇప్పటి ప్రభువు బల్లలాగా నన్నమాట). అవి పాపాలను తీసివేసేందుకు చేసే బలులుగా ఉండవు. ఎందుకంటే క్రీస్తు తన మరణం ద్వారా ఒకేసారి శాశ్వతంగా తన ప్రజలందరి పాపాలను కొట్టివేశాడు (హెబ్రీ 10:5-14). భవిష్యత్తులో ఉండే దేవాలయం, అర్పణల గురించి ఇతర ప్రవక్తలు కూడా ఇలాంటిది ఉంటుందని పలికినట్టు కనిపిస్తున్నది. యెషయా 19:21 (20-25 వచనాలను బట్టి చూస్తే ఈ సందర్భం భవిష్యత్కాలం గురించి ఉంది); యెషయా 60:7 (సందర్భాన్ని బట్టి); యెషయా 66:20-23; యిర్మీయా 33:14-18; హగ్గయి 2:6-9; జెకర్యా 14:16-21; మలాకీ 3:2-4.

కాబట్టి ఇక్కడ సూచించే బలులు ప్రభురాత్రి సంస్కారాలు మరియు మనమర్పించే స్తుతియాగాలు అనుకోవచ్చు అని నా ఉద్దేశం. కారణం స్తుతియాగమర్పించు వాడు నన్ను మహిమ పరుస్తున్నాడు అనియు (కీర్తనలు 50:23), నా ప్రార్ధన ధూపం వలెను, నేను చేతులెత్తి ప్రార్థన చేయుట సాయంకాల నైవేద్యం వలెను నీకు అంగీకార మగును గాక భక్తుడు పలుకుతున్నాడు ఆత్మావేశుడై కీర్తనలు 141:2లో!!

ఇక తరువాత వచనంలో మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

ఇక్కడ ఎనిమిదవ వచనానికి జవాబు 9,10 వచనాలలో కనిపిస్తుంది. మొదటగా వారు నీ కుమారులు అనగా చెర విముక్తి నొందిన ఇశ్రాయేలు ప్రజలు, రెండు ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసి, రక్షణ పొంది దేవున్ని ఆరాధించటానికి వచ్చే అన్యజనులు!!! వీరే దేవుని మందిరాన్ని అలంకరిస్తారు.

ఇక అదే ఎనిమిదవ వచనానికి జవాబు మనకు యెషయా 11 లో కూడా కనిపిస్తుంది.

Isaiah(యెషయా గ్రంథము) 11:11,12,13,14,16

11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు

14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు

16. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును.

దీనిని నూతన నిబంధన సంఘకోణంలో చూసుకుంటే అన్యజనులలో నుండి రక్షణ పొందిన మనలాంటి విశ్వాసులు. వీరే జయోత్సవంతో దేవున్ని ఆరాధన చేయడానికి సమీపిస్తున్నారు. అయితే అన్ని జాతులవారూ నిజ దేవుణ్ణి ఆరాధించే కాలం వస్తుంది అని మనకు ప్రకటన గ్రంథం లో కనిపిస్తుంది – ప్రకటన 21:24, 26.

Revelation(ప్రకటన గ్రంథము) 21:24,26

24. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.

26. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.

ఇక ఈ వచనంలో కనిపించే తర్షీసు స్పెయిన్ దేశంలో ఉంది. యోనా గారిని నీనెవే అనగా ఇరాక్ వెళ్లమని చెబితే మొదటి సారి వినకుండా ఇదే తర్షీసుకి వెళ్దామని ఓడ ఎక్కారు. ఈ తర్షీషు ఓడలరేవు మరియు వ్యాపార కేంద్రం!

ఇలా ప్రజలంతా దేవున్ని మహిమ పరుస్తారు.

యెషయా 44:23

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

యెషయా 55:5

నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.

మరి నీవు అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు మాదిరికరమైన విశ్వాసపు సాక్ష్య జీవితాన్ని కలిగియున్నావా!!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*326వ భాగము*

యెషయా గ్రంథము 60:7--12

7. నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

8. మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక పదవ వచనం చూసుకుంటే ఇది చాలా అమూల్యమైన వచనం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

ఈ వచనంలో రెండు విభిన్నమైన విషయాలు చెప్పబడ్డాయి.

మొదటగా అన్యులు యెరూషలేము పునర్నిర్మాణం లో సహాయపడతారు.

రెండవది దేవుడు కోపించి శిక్షించినా తర్వాత జాలిపడి వాత్సల్యంతో తిరిగి చేర్చుకున్నారు.

మొదటిది: అన్యులు యెరూషలేము పునర్నిర్మాణం లో సహాయపడతారు.

అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు

దీనికోసం ఆలోచిస్తే ఈ మాట రెండు కోణాలలో మనకు అర్థం అవుతుంది.

మొదటిది: ఇశ్రాయేలు ప్రజలు చెరనుండి వచ్చాక అన్యదేశపు రాజులు నిర్మాణంలో సహాయం చేస్తారు. నిజానికి కోరేషు అజ్ఞ మరియు ఆర్ధిక సహకారంతో యెరూషలేము మందిరం పట్టణం కట్టబడింది. రాజైన అర్తహషస్త ఇంకా దర్యావేషు రాజు కూడా సహకరించారు. ఇలా అన్యులు ఎంతో సహాయపడ్డారు.

ఇక రెండవదిగా నూతన నిబంధన సంఘ విషయంలో అనేక జాతులకు చెందిన నేటి విశ్వాసులు క్రొత్త నిబంధన సంఘాన్ని ఏదో విధంగా కడుతూ ఉన్నారు అన్నది నిజం (1 కొరింతు 3:10-13). అలానే క్రీస్తు సంఘం ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నదన్న మాట కూడా నిజమే (ఎఫెసు 2:22). రాజులు కూడా ఈ నిర్మాణ కార్యక్రమంలో చేతులు కలిపారు. అయితే నూతన నిబంధన సంఘం లో ఇశ్రాయేలు ప్రజలు చాలా చాలా తక్కువ. అన్యజనుల నుండి రక్షణ పొందిన మనలాంటి వారితోనే సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.

అయితే ఈ తరువాత వస్తున్న మాటలు ఇస్రాయేల్‌కు ప్రతినిధిగా ఉన్న జెరుసలంను ఉద్దేశించి రాసినవని స్పష్టంగా తెలుస్తున్నది.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:9,10,11,12,13,14,15,16

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14 .​పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

15.​ ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

16. మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

Ephesians(ఎఫెసీయులకు) 2:19,20,21,22

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

రెండవది దేవుడు కోపించి శిక్షించినా తర్వాత జాలిపడి వాత్సల్యంతో తిరిగి చేర్చుకున్నారు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము.

– లేవీ 26:27-33;

Leviticus(లేవీయకాండము) 26:15,16,17,18,19,20,21,23,24,25,28,29,40,41,42,44

15. నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

16. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

17.​ నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

18.​ ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

19.​ మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

20.​ మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.

21.​ మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.

23.​ శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

24.​​ నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

25.​​ మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.

28.​ నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

29.​​ మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

40.​ వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41.​​ నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

42.​ నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

44.​ అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

ద్వితీ 28:22; విలాప 1:12; యెషయా 1:5; 5:25; లూకా 19:41-44; 20:14-18; 1 తెస్స 2:16.

1థెస్సలొనికయులకు 2:15

ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,

1థెస్సలొనికయులకు 2:16

అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునైయున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.

హోషేయా 2:14

పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;

హోషేయా 2:15

అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు

హోషేయా 2:16

అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవుబయలు(యజమానుడు) అని నన్ను పిలువకనా పురుషుడవు(భర్త) అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు.

హోషేయా 2:23

​నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.

కాబట్టి నీవు నేను చేసిన అతిక్రమములకు దేవుడు తప్పకుండా శిక్షిస్తారు. అప్పుడు నీవు ఆహాబు వలె, రాజైన ఆసా వలె మూతిముడుచుకోకుండా పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన జాలిగల దేవుడు కనుక క్షమించి నిన్ను ప్రేమతో హత్తుకుని నీకు సహాయపడతారు. మరి నీవు ఆయన వద్దకు వస్తావా!!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*327వ భాగము*

యెషయా గ్రంథము 60:7--12

7. నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.

8. మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇంకా 11,12 వచనాలలో అంటున్నారు నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

అన్యజనుల ఐశ్వర్యం నీ దగ్గరకు తేబడుతుంది అని ఈ యెషయా గ్రంథం లో చాలా సార్లు వ్రాయబడింది. దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము. గతభాగం లో కూడా విదేశీ రాజుల సహకారంతో జెరూసలేం కట్టబడింది అని చూసుకున్నాము గనుక ముందుకు పోదాం! అయితే దీనిని నూతన నిబంధన కోణంలో తప్పకుండా చూసుకోవాలి.

ఇక్కడ మనకు రెండు విషయాలు అర్థం అవుతాయి నూతన నిబంధన సంఘకోణంలో!

మొదటిది ఈ మాటలు ప్రకటన 21:24-26లో కనిపిస్తున్న మాటలను పోలి ఉన్నాయి. అలాగని జెరుసలం నగరం విషయంలో ఇది అక్షరాలా నెరవేరలేదని కాదు. ప్రకటన 21:24-26 లోని నగరాన్ని దేవుడెన్నడూ కొట్టలేదు, విడిచిపెట్టలేదు (54:7). దేవుడు ఎన్నడూ నిజ సంఘాన్ని విడిచిపెట్టలేదు.

Revelation(ప్రకటన గ్రంథము) 21:24,25,26

24. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.

25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.

26. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.

రెండవ విషయం: గుమ్మములు ఎప్పుడూ వేయబడవు. ఈ వచనంలో అనగా 60:11లో అయితే నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును అని చెబుతుంది. అనగా ఇశ్రాయేలు నిర్మాణం కోసం! అయితే నూతన నిబంధన సంఘ నిర్మాణం కోసం పరలోకపు ద్వారములు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని ప్రకటన 21:25 చెబుతుంది. మరో కారణం యేసుక్రీస్తు ప్రభులవారి ప్రకాశం వలన అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు అంటున్నారు!!!

ఇక తరువాత వచనంలో నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

భవిష్యత్తులో ఇస్రాయేల్‌జాతి రాజకీయంగా ఉన్నత స్థానాన్ని అలంకరిస్తుందని ఈ భాగం మరోమారు తెలియజేస్తుంది. వెయ్యేళ్ల పాలనలో ఇశ్రాయేలు దేశం ప్రపంచ కేపిటల్ గా ఉంటుంది. ఇశ్రాయేలు దేశమునుండే ప్రపంచానికి ఆజ్ఞలు చట్టాలు బయలుదేరుతాయి.

యెషయా 14:2

జనములు వారిని తీసికొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములోవారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు వారు తమ్మును చెరలో పెట్టినవారిని చెరలో పెట్టి

యెషయా 49:23

రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

Zechariah(జెకర్యా) 14:16,17,18,19

16. మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును.

18.​ ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.

19. ఐగుప్తీయులకును, పర్ణశాలపండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్షయిదే.

ఇక తరువాత వచనంలో అంటున్నారు యెషయా 60:13

నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.

చూడండి ఏమంటున్నారో  నా పవిత్రాలయమున్న స్థలానికి అలంకారంకోసం

లెబానోనులోని మేలిరకమైన దేవదారు వృక్షాలూ సరళ వృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. నా పాదాలు పెట్టుకొనే స్థలాన్ని నేను ఘనంగా చేస్తాను.

లెబానోను”–. సొలొమోను కట్టించిన దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన మేలిరకం కలపకు ప్రసిద్ధి (1 రాజులు 5:10, 18). పాత ఒడంబడిక కాలంలో ఇజ్రాయేల్ రాజకీయంగా దాని అత్యున్నత స్థాయిని అందుకున్నది సొలొమోను పరిపాలనా కాలంలోనే. అదే మహిమ, ప్రభావం అంతకన్నా ఎక్కువగా తిరిగి దానికి చేకూరుతుంది అని అర్థం!!!

యెషయా 35:2

అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

తరువాత వచనంలో అంటున్నారు యెషయా 60:14

నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.

మీద వచనాలలో చెప్పినదే మరలా చెబుతున్నారు ఇక్కడ!

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

యెషయా 49:7

ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

యెషయా 49:23

రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

ఇక మరో మంచి విషయం “యెహోవా నగరం”– భవిష్యత్తులో జెరుసలంకు ఉండబోయే అనేక పేర్లలో ఇదొకటి;. దేవుని పరలోక నగరానికి ఇది భూలోకంలో ప్రతిబింబంగా ఉంటుంది (హీబ్రూ 12:22).

యెషయా 1:26

మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

యెషయా 62:4

విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

యెహేజ్కేలు 48:35

దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.

జెకర్యా 8:3

యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.

హెబ్రీయులకు 12:22

ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,...

అట్టి పరిశుద్ధ పట్టణంలో నీవు నివసించడానికి సిద్దపడుతున్నావా!!! లేకపోతే విడువబడి నరకానికి పోగలవు జాగ్రత్త!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*328వ భాగము*

యెషయా గ్రంథము 60:15--18

15. నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.

16. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.

17. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగానునీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

18. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక 15వ వచనం చూసుకుంటే నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.

అవును జెరూసలేం విడువబడింది బాధించబడింది.

Isaiah(యెషయా గ్రంథము) 6:10,11,12

10. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

11. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును

12. యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.

యెషయా 62:4

విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

యిర్మియా 30:17

​వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

కీర్తనలు 106:40

40 కనుక యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. తన సొత్తుగా ఉన్న జనంమీద ఆయనకే అసహ్యం వేసింది.

అయితే ఇప్పుడు దేవుడు అదే యెరూషలేమును శాశ్వత శోభాతిశయముగా మారుస్తున్నారు. జెరుసలం భూమిపైనున్న స్థలాలన్నిటిలోకీ సర్వ శ్రేష్ఠం, ప్రకాశమానం అవుతుంది. సత్యానికీ, ఆధ్యాత్మిక పరిస్థితులకూ కేంద్రస్థానం అవుతుంది.

తరువాత వచనంలో యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.

చూడండి నీవు జనాల పాలు కుడుస్తావు. అనగా జనముల ఆస్తిపాస్తులు నీవు అనుభవిస్తావు. రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నేనే – యెహోవాను – నీ రక్షకుణ్ణి అనీ యాకోబు బలవంతుడైన దేవుణ్ణి అనీ విముక్తి దాతను అనీ నీవు తెలుసుకొంటావు అంటున్నారు.

అప్పుడు అనగా ఇలా జరగడం చూసి మానవాళి అంతా దేవుని ప్రభావం తెలుసుకుంటారు. ఇస్రాయేల్‌కు అయితే ఇలాంటి అనుభవ పూర్వకమైన జ్ఞానం పరిపూర్ణంగా కలుగుతుంది.

యెషయా 49:26

యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

తరువాత వచనంలో నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

బంగారము– సొలొమోను పరిపాలన లక్షణాల్లో ఒకటి. అనగా వెయ్యేళ్ల పాలన ఇశ్రాయేలు దేశానికి స్వర్ణ యుగముగా ఉండబోతుంది. 1 రాజులు 10:21

21 సొలొమోను రాజు పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి. లెబానోను వనం భవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను కాలంలో వారికి వెండి అంటే లెక్కే లేదు.

ఇక ఈ వచనంలో మరో ముఖ్యమైన మాట నేను నీకు శాంతిని అధికారిగా, న్యాయాన్ని పరిపాలకుడుగా నియమిస్తాను.

యెషయా 9:7

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 32:17

నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు

యెషయా 54:13

నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

యెషయా 54:14

నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.

ఇక తరువాత వచనంలో యెషయా 60:18

ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

ఇది కూడా రాకడ అనంతరం వెయ్యేళ్ల పాలనలో జరిగేదే!

యెషయా 14:4

నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?

యెషయా 49:19

నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.

యెషయా 54:14

నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు.

ఇక విముక్తి”, “స్తుతి”. సంపూర్ణ భద్రత కలుగుతాయి దేశానికి! దాన్ని స్థాపించిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*329వ భాగము*

*వెయ్యేళ్ల పాలన-1*

యెషయా గ్రంథము 60:19--22

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

22. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రియులారా ఇక 19వ వచనం నుండి వెయ్యేళ్ల పాలన ఎలా ఉంటుందో చెబుతున్నారు ఆత్మావేశుడై!!!

ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

చూడండి అప్పటినుంచి పగటివేళ ప్రొద్దు నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీమీద ప్రకాశించదు. యెహోవా తానే నీకు శాశ్వత కాంతిగా ఉంటాడు. నీ దేవుడు నీకు శోభగా ఉంటాడు అంటున్నారు.

వెయ్యేళ్ళ పాలన సమయంలో పరిస్థితులు ప్రకటన 21:23; 22:5 వచనాలతో పోల్చుకోవచ్చు . ఆ వచనాలలో శాశ్వత కాలంలో నెలకొని ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రకటన గ్రంథం 21:23

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

ప్రకటన గ్రంథం 21:24

జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.

ప్రకటన గ్రంథం 21:25

అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు.

ప్రకటన గ్రంథం 22:5

రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

యెషయా గారు కూడా నాల్గవ అధ్యాయం లో చెబుతున్నారు యెషయా 4:5

సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

యెషయా 4:6

మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

ఇక తరువాత వచనంలో నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

ఇక నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి ఆ వెయ్యేళ్ల పాలనలో అంటున్నారు.

యెషయా 25:8

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.

యెషయా 35:10

వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.

యెషయా 40:2

నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 51:11

యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

యెషయా 65:19

నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.

ప్రకటన గ్రంథం 21:4

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

ఇక తరువాత వచనంలో అంటున్నారు 21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

యెషయా 4:3

సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖ లైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

ప్రకటన గ్రంథం 21:27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

“దేశమును స్వతంత్రించు కుంటారు అనగా”– దేవుడు ఇస్రాయేల్‌వారికి వాగ్దానం చేసిన దేశం. దేవుడు ఈ వాగ్దానాన్ని పదే పదే స్థిరపరచాడు (ఆది 12:6-7; 15:18-19; 17:8; 28:13; కీర్తన 37:11, 22; యెషయా 49:8; 61:7).

అలాగే ఎత్తబడిన వారు, పునరుత్థానం పొందిన పరిశుద్దులు దేశాలను స్వతంత్రించుకుని క్రీస్తుతో పాటుగా మత్తయి 25 మరియు లూకా 19లో చెప్పబడిన విధంగా ఏలుతారు.

ఇక నన్ను నేను మహిమపరచుకొనునట్లు అనగా– తన కుమారుణ్ణి తిరస్కరించి సిలువ వేసిన తలబిరుసువారు, తిరుగుబాటు దారులు, అపనమ్మకస్థులు, పాపులు అయిన ఆ జనాన్ని , అదే జనాలను తన కుమారుని ముందు సాగిళపడి వారు దేవునికి విధేయులుగా, పవిత్రులు శ్రేష్ఠులుగా చేసినప్పుడు ఆయనకు కలిగే మహిమ ఎంత వర్ణనాతీతమైనది!

ఇక నేను నాటిన కొమ్మ అనగా – ఈ అంకురం ఇజ్రాయేల్ జాతి (5:1-2, 7; నిర్గమ 15:17; కీర్తన 44:2; 80:8-11). వారిని తిరిగి నాటడం జరుగుతుంది – ఆమోసు 9:15.

ఇక చివరి వచనంలో అంటున్నారు వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

హల్లెలూయ!

ఇక్కడ వేయిమంది అనగా ”– తన ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని భావం.

యెషయా 54:1

గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 54:2

నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.

యెషయా 54:3

కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.

యెషయా 54:4

భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసికొనవు.

ఇక తగిన కాలంలో తప్పక త్వరగా జరిగిస్తాను అంటున్నారు ఇస్రాయేల్‌ను తిరిగి దాని పూర్వస్థితికి తెచ్చే కార్యాన్ని దేవుడు ఒకసారి ఆరంభించాడంటే అది పూర్తయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదు.

ఇదీ వెయ్యేళ్ల పరిపాలన. మరి ఆ పరిపాలనలో ఉండటానికి క్రీస్తుతోపాటుగా ఏలడానికి సిద్దంగా ఉన్నావా! తగిన జీవితం జీవిస్తున్నావా!!?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*330వ భాగము*

*వెయ్యేళ్ల పాలన-2*

యెషయా గ్రంథము 60:19--22

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! వెయ్యేళ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ధ్యానం చేసుకుంటున్నాము!!

(గతభాగం తరువాయి)

ప్రకటన 20:1—6

1. మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

2. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

3. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

6. ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

ఇక్కడ మొదటి వచనంలో పెద్ద సంకెళ్ళను చేతపట్టుకుని అగాధపు తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట యోహాను గారు చూశారు! గమనించాలి- ఇప్పటికే మహావేశ్యకు తీర్పు జరిగిపోయింది. క్రూరమృగం,అబద్దప్రవక్త ప్రాణాలతో నరకంలో త్రోయబడటం జరిగిపోయింది. ఇక మిగిలినది ఎవరు అంటే సాతాను గాడు అనబడే ఘటసర్పం! వాడిని బంధించడానికి, శిక్షించడానికి ఈ దేవదూత వస్తున్నాడు!

ఇక రెండో వచనంలో ఒక దేవదూత ఈ ఘటసర్పాన్ని బంధించి అగాదములో పడవేశాడు! ఇక వాడు అక్కడ వెయ్యి సంవత్సరాలు అగాధములో ఉండాలని నిర్ణయించబడింది. ఇక అక్కడున్న కాలము వాడు జనములను మోసపరచకుండునట్లు వాడు బయటకు రాకుండా ఉండాలని, వాడి స్వరము/ మెసేజ్ బయటకు రాకూడదని అగాధమున మూసి దానికి ముద్ర వేశారు అనగా సీల్ చేసేశారు! ఎందుకు ఇలా సీల్ చేశారు అంటే భూమిమీద దేవుని వెయ్యేండ్ల పాలన ప్రారంభమౌతుంది కాబట్టి ఇక అక్కడ అన్యాయానికి గానికి నేరాలకు గాని అబద్దాలకు గాని తావుండదు! వీడుంటే మరలా ప్రారంభమవుతాయి. అందుకే ఇక వాడిని మూసి అగాదానికి సీల్ చేసేశారు!

ఇక భూమిమీద దేవుని వెయ్యేండ్ల పాలన ప్రారంభమయ్యింది!

వెయ్యేండ్ల పాలన ప్రారంభం కావాలంటే *మొదటగా హార్మెగిద్దోను యుద్ధం జరగాలి

*క్రూరమృగం, అబద్దప్రవక్త నరకంలో త్రోయబడాలి!

*ఘటసర్పం అనబడే సాతాను గాడు చెరసాలలో అనగా అగాధంలో త్రోయబడాలి!

*ఇక 4వ వచనం ప్రకారం మహాశ్రమల కాలపు హతస్సాక్షులు పునరుత్థానులు కావాలి.

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

అప్పుడు వెయ్యేండ్ల పాలన మొదలవుతుంది. ......

గతంలో చెప్పుకున్నాము- మొదటి పునరుత్థానం ఏమిటి రెండవ మరణం ఏమిటి అనేది వివరంగా!

ఇప్పుడు మొదటి పునరుత్థానం జరిగి మహాశ్రమలకాలపు మృతులు అనగా హతస్సాక్షులు లేచారు!!

ఇక్కడ 5వ వచనంలో ఆ వెయ్యేండ్లు గడచువరకు కడమ మృతులు బ్రతుకలేదు అంటున్నారు. ఇంతకీ ఆ కడమ మృతులు ఎవరు?

యేసుక్రీస్తుప్రభులవారిని నమ్మనివారు, భూమిమీద పుట్టి మరణించిన ఆదాము నుండి ఇప్పటి వరకు గల పాపులు అన్నమాట!!!!

ఇక ఈ మొదటి పునరుత్థానం లో ఉన్నవారు ధన్యులు మరియు పరిశుద్దులునై యున్నారు అంటున్నారు! అవును కదా, వీరు పరిశుద్ధంగా జీవించి క్రూరమృగపు సైనికులతో హత్యచేయబడ్డారు దేవుని గూర్చిన సాక్ష్యము నిమిత్తం! వీరికి రెండవ మరణం లేదు! వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో పాటుగా వెయ్యేండ్లు రాజ్య పాలన చేస్తారు! హల్లెలూయ!

అయితే ఇక్కడ రాజ్యపాలన కేవలం వీరే అనగా మహాశ్రమల కాలపు హతస్సాక్సులైన బ్రతికిన వారు మాత్రమే చేస్తారా?

కాదండి వీరితో పాటుగా ఇప్పుడు వెయ్యేండ్ల పాలనలో ఎవరున్నారు?

*రాజుల రాజుగా యేసుక్రీస్తుప్రభులవారు!

*క్రీస్తునందు మరణించిన వారు, *పాతనిబంధన విశ్వాసులు- అనగా పరదైసునుండి వచ్చిన వారు!

*ఎత్తబడిన సంఘము!

*మహాశ్రమల కాలపు హతస్సాక్షులు!

*రక్షణ పొందిన ఇశ్రాయేలు ప్రజలు!

*ఇంకా హార్మెగిద్దోను యుద్ధంలో చనిపోకుండా బ్రతికి ఉన్న పాపులు!

*మహాశ్రమల కాలంలో యూదులకు సహాయం చేసిన అన్యజనులు!

వేదపండితులు అభిప్రాయం ప్రకారం మత్తయి 25 :31-46 లో చెప్పబడిన గొర్రెలు వీరే!

గొర్రెలు-ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన వారు!

మేకలు వీరికి సహాయం చెయ్యనివారు, క్రీస్తువిరోధితో పొత్తు పెట్టుకున్నవారు!

....

తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.

అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు.

అయితే, పరిపాలించేదెవరు?

*క్రీస్తునందు మరణించిన వారు, *పాతనిబంధన విశ్వాసులు- అనగా పరదైసునుండి వచ్చిన వారు!

*ఎత్తబడిన సంఘము!

*మహాశ్రమల కాలపు హతస్సాక్షులు!

*బహిరంగ రాకడలో, ప్రభువుతో పాటు దిగివచ్చిన సంఘము. వీరంతా రక్తమాంసములను కలిగియుండక, మహిమ శరీరాలను కలిగియుండి, రాజ్య పాలన చేస్తారు.

సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. (2 తిమోతికి 2:12)

*వెయ్యేండ్ల పాలనలో మన అధికార హోదా ఎట్లా వుండబోతోంది?*

ఇప్పుడు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ, నీకివ్వబడిన తలాంతులతో ఆత్మల రక్షణకై పాటుపడితే, నీవు ఒక స్టేట్ కి సి.ఎం కావొచ్చు. కలెక్టర్ వి కావచ్చు, కమీషనర్ వి కావచ్చు, లేకపోతే, ఒక వార్డ్ మెంబర్ గా సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో?

అప్పుడు మత్తయి 25:14-30 సంభవం జరుగుతుంది...

పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి అయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మక మైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.

తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునై కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.

అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

హార్మెగిద్దోను యుద్ధము తర్వాత మిగిలియున్న పాపులు కూడా వెయ్యేండ్ల పాలనలో ఉంటారు కాబట్టి, ఎట్లా జీవించినా సరే, వచ్చిన సమస్య ఏమిటి? అని నీకు నీవు సర్ది చెప్పుకోవలసిన అవసర్లేదు. చివర్లో అసలైన మరొక యుద్ధం వుంది. అది “గోగు మాగోగు యుద్ధం” దానితో సర్వ పాపులు భూమిమీదలేకుండా నశించిపోతారు. సాతాను కూడా నరకంలో వేయబడతాడు. పరిశుద్ధులే నిత్యత్వంలో ప్రవేశిస్తారు.

ఆ నిత్య రాజ్యంలో- క్రీస్తుతో పాటు వెయ్యేండ్ల పాలనలో ఉండాలని ఉందా? అయితే నీ బ్రతుకును సరిచేసుకో!

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*331వ భాగము*

*వెయ్యేళ్ల పాలన-3*

యెషయా గ్రంథము 60:19--22

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! వెయ్యేళ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ధ్యానం చేసుకుంటున్నాము!!

(గతభాగం తరువాయి)

వెయ్యేండ్ల పాలన కోసం అనేక వాగ్దానాలు- వివరాలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన గ్రంధములో అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయి!వాటిని వివరంగా చూసుకుందాం!

వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజధాని ?

* యెరూషలేము

ఆ కాలమున యెహోవాయొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు.

యిర్మియా 3:17

👉 వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ రాజాధిరాజు?

* ప్రభువైన యేసు క్రీస్తు

దూత- మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

లూకా 1:30-33

రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

దానియేలు 7:13,14

👉 పరలోకమే ఆయన వెయ్యేండ్ల పాలనను గూర్చి ప్రకటించు చున్నది.

ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

దానియేలు 2:44

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

లూకా 1:32

👉 వెయ్యేండ్ల పాలనలో శపించబడిన భూమి, శాప విమోచనాన్ని పొందుతుంది.

*ఏదెను వనములో:*

ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

ఆదికాండము 3:17

*వెయ్యేండ్లపాలనలో శాపవిమోచన:*

ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

యెషయా 55:13

అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.

యెషయా 35:1,2

👉 వెయ్యేండ్లపాలనలో మానవులు సుదీర్ఘమైన ఆయుష్షును కలిగియుంటారు.

* బాలుని వయస్సు నూరు సంవత్సరాలుంటుంది.

* వృక్షాయస్సు అనగా, వృక్షాల వలే కొన్ని తరాలవరకు జీవిస్తారు.

అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు, కాలమునిండని ముసలివారుండరు, బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.....

వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు

యెషయా 65:20,22

*బాలుని వయస్సే నూరు సంవత్సరాలంటే? ఇక వృద్ధుల వయస్సు, వందల సంవత్సరాలుంటుంది.*

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.

జెకర్యా 8:4,5

👉 వెయ్యేండ్ల పాలనలో జంతులోకంలో విపరీతమైన మార్పులుంటాయి.

తోడేలు గొఱ్ఱపిల్ల యొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

యెషయా 11:6-9

👉 *పాలస్తీనా దేశములో పెను మార్పులు:

యెహోషువా నాయకత్వంలో పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నప్పుడు, అది పాలు, తేనెలు ప్రవహించు దేశమై యుండెను. కానీ,వారు పాపం చెయ్యడం ద్వారా, ఆకాశమును మూసివేయునని హెచ్చరించెను. (ద్వితీ 11:3-17)

అయితే, ఈ కాలమందు వర్షము తన కాలమందు కురియును. మంచి ఫలములు వారు పొందుదురు.

వెయ్యేండ్ల పాలనలో వర్షములద్వారా మాత్రమే కాదు. పరిశుద్ధ స్థలమునుండి ప్రవహించుచున్న దాని ఉపనదులవలన రాజ్యము ఫల సమృద్ధియగును.

ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.

యోవేలు 3:18

రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వత ములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 9:13

కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరుపురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

యోవేలు 2:24-26

👉 ఏడురెట్లు ప్రకాశమానము:

యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

యెషయా 30:26

నూతన భూమియందు దాని సంపూర్ణ నెరవేర్పు జరుగును.

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.

ప్రకటన 21:23,24

ఆ రాజ్యములో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*332వ భాగము*

*వెయ్యేళ్ల పాలన-4*

యెషయా గ్రంథము 60:19--22

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! వెయ్యేళ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ధ్యానం చేసుకుంటున్నాము!!

(గతభాగం తరువాయి)

వెయ్యేండ్ల పాలన కోసం అనేక వాగ్దానాలు- వివరాలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన గ్రంధములో అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయి!

*వెయ్యేండ్లకాలమందలి ప్రత్యేకతలు:*

🔺 *సమాధానము:*

*యుద్ధములుండవు. ఈటెలు, ఖడ్గాలతో పనిలేదు.*

ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

యెషయా 2:4

*యెరూషలేములో గుఱ్ఱములు, యుద్దపు విల్లులుండవు.*

ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

జెకర్యా 9:10

(మీకా 4:2,3; యెషయా 9:4-7; 11:6-9; 32:17,18)

🔺 *సంతోషం:*

సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

జెఫన్యా 3:14-17

(జెకర్యా 8:18,19; 10:6,7; యెషయా 9:3,4; 12:3-6; 14:7,8; 25:8,9)

🔺 *పరిశుద్ధత:*

సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవముపొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

యెషయా 4:3-5

(యెషయా 35:8,9; 52:1; యోవేలు 3:21; జెఫన్యా 3:11,13)

🔺 *నీతి:*

ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యెషయా 9 :7

( యెషయా 11:5; 32:16; 42:1-4; 65:21-23; యిర్మీయా 23:5; 31:23)

🔺 *పరిపూర్ణ జ్ఞానం:*

యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు *లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.*

యెషయా 11:1,2,9

(యెషయా 54:3; హబక్కూకు 2:14)

🔺 *శాపము లేదు:*

అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

యెషయా 35:9

తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.

యెషయా 11:6,9

🔺 *రోగము లేదు:*

నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.

యెషయా 33:24

అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 30:17

తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును;

యెహేజ్కేలు 34:16

🔺 *రోగ స్వస్థత:*

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

యెషయా 29:18,19

(యెషయా 35:3-6; 61:1,2; యిర్మీయా 31:8; మీకా 4:6,7; జెఫన్యా 3:1,9)

*ఇట్లాంటి ధన్యకరమైన రాజ్యంలో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!*

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం!

ప్రభువు రాకడకై సిద్దపడదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*333వ భాగము*

*వెయ్యేళ్ల పాలన-5*

యెషయా గ్రంథము 60:19--22

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! వెయ్యేళ్ల పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ధ్యానం చేసుకుంటున్నాము!!

(గతభాగం తరువాయి)

వెయ్యేండ్ల పాలన కోసం అనేక వాగ్దానాలు- వివరాలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన గ్రంధములో అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయి!

*వెయ్యేండ్లకాలమందలి ప్రత్యేకతలు:*

🔺 *బాధలుండవు:*

తమ్మును బాధించినవారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను? దుష్టుల దుడ్డుకఱ్ఱను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు.

యెషయా 14:3-5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.

యెషయా 49:8

🔺 *భద్రత:*

నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

యెషయా 41:8-14

యెషయా 62:8,9; యిర్మీయా 32:37; యెహెఙ్కేలు 34:27; యోవేలు 3:16,17

🔺 *పనులుంటాయి:*

ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును. ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.

యెహేజ్కేలు 48:18,19

🔺 *ఆర్థికాభివృద్ధి:*

యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు.

యెషయా 62:8,9

జెకర్యా 8:11,12; 9:16,17; యోవేలు 2:21-27; ఆమోసు 9:13,14. మీకా 4:4; యెహెఙ్కేలు 34:26.

🔺 *దేవునితో సాన్నిహిత్యం:*

ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ప్రకటన 21:3

ఇట్లాంటి అనేకమైన ప్రత్యేకతలు ఆ ధన్యకరమైన రాజ్యములో ఉంటాయి. ఆ రాజ్యంలో నీవుండాలంటే? నేడే అనుకూల సమయం. ఆయనను నీ హృదయంలో చేర్చుకో!

ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? లేకుంటే, ఉగ్రతనుండి తప్పించుకోలేవు. సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*334వ భాగము*

యెషయా గ్రంథము 62:1--5

1. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

2. జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.

3. నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

4. విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

5. యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 60వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 61వ అధ్యాయం అభిషక్తుని మొదటి రాకడలో ధ్యానం చేసుకున్నాము గనుక 62వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ఇక ఈ 62వ అధ్యాయం కూడా వెయ్యేళ్ల పాలన, ఇశ్రాయేలు ప్రజల పునరాగమనం తరువాత పరిస్థితులు కోసము చెప్పబడ్డాయి. వీటికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకు పోదాం! అలాగని నూతన నిబంధన సంఘము కోసం చెప్పలేదని కాదు.

మొదటి వచనంలో అంటున్నారు సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

ఈ వచనంలో నేను ఊరికే కూర్చోను అంటున్నారు. అలాగే ఏడవ వచనంలో యెహోవా జ్ఞాపకకర్తలారా మౌనంగా ఉండవద్దు అంటున్నారు. అనగా దేవుని ప్రవక్తలు మౌనంగా ఉండకూడదు విశ్వాసులు కూడా దేవుడు చేసిన వాగ్ధానం నెరవేర్చే వరకు మౌనంగా ఉండక ప్రార్థన విజ్ఞాపణములు చేస్తూ ఉండాలి.

అయితే ఇక్కడ నేను”– ఇలా పలుకుతున్నదెవరు? తరతరాలుగా ఉన్న విశ్వాసులకు ప్రతినిధిగా యెషయాగారు ఇలా మాట్లాడుతున్నాడని కొందరి అభిప్రాయం. 61:1లో లాగా ఇక్కడ మాట్లాడుతున్నదీ అభిషిక్తుడేనని మరి కొందరి అభిప్రాయం. రెండో అభిప్రాయమే సరైనదని తోస్తున్నది. అలా మాట్లాడినదెవరైనా కూడా వెల్లడైన సత్యం ఒకటే – జెరుసలం నీతిన్యాయాలతో నిండి, శాశ్వతంగా విముక్తినీ రక్షణనూ అనుభవిస్తుంది – 4:3-4; 26:1-2; 46:13; 59:20-21; 60:18; యిర్మీయా 23:5-6.

నూతన నిబంధన సంఘములో కూడా మనమంతా ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవరకు ప్రార్థిస్తూ ఉండాలి.

ఇక రెండవ వచనంలో జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.

యెషయా 2:2

అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు

యెషయా 60:3

జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.

ఇక నీకు క్రొత్త పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరు యెహోవా తానే తెలియజేస్తాడు.

చూడండి 4 మరియు 12 వచనాలలో జెరూసలెం కి దేవుడు కొత్తపేరులు పెట్టారు.

యెషయా 62:4

విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

యెషయా 62:12

పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

యెషయా 1:26

మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

ఇది నూతన నిబంధన సంఘమునకు కూడా వర్తిస్తుంది మనకు కూడా పరిశుద్ధులు అని దేవుడు పేరు పెట్టారు.

ఇక మూడవ వచనంలో నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

అనగా వెయ్యేళ్ల పాలనలో జెరూసలెం ప్రపంచ కేపిటల్ గా ఉండబోతుంది. కిరీటం రాజకీయాధికారానికి చిహ్నం.

యెషయా 28:5

ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.

జెకర్యా 9:16

నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.

తరువాత వచనంలో విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

లేవీ 26:43; యెషయా 5:5-6; 6:12; 54:6-7; 60:15; యిర్మీయా 30:17.

పై అన్ని వచనాలలో నేను మిమ్మల్ని మీ పట్టణాలను పాడుచేస్తాను అని సెలవిచ్చి పాడుచేశారు. అయితే ఇప్పుడు నేను మరలా కడతాను బాగుచేస్తాను అంటున్నారు.

“హెఫ్సీబా” అంటే “నాకు ఇష్టురాలు” అని అర్థం. “బ్యూలా” అంటే “వివాహిత” అని అర్థం. విడిచిపెట్టబడి, ఎడారిగా మారిన దేశానికీ, నగరానికీ ఈ ఆశ్చర్యకరమైన మార్పు కలుగుతుందని గమనించాలి.

నూతన నిబంధన సంఘములో అంగమైన నీవు నేను కూడా దేవునికి ఇష్టురాలుగా దేవునికి ప్రధానము చేయబడిన పరిశుద్ధుడిగా పరిశుద్దురాలుగా ఉండాలి.

ఇక ఐదవ వచనం కొంచెం వివాదాస్పదంగా ఉంటుంది యౌవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.

ఇక్కడ కొడుకులు తల్లిని పెళ్ళి చేసుకోవడమేమిటి చండాళంగా అనుకోవద్దు. దీని అర్థం అంటే ఇస్రాయేల్‌వారు తిరిగి ఆ దేశాన్ని స్వాధీన పరచుకుంటారు. దేవుడు తిరిగి ఇస్రాయేల్‌ప్రజను తన “భార్య”గా పరిగణిస్తాడు అని అర్థం! ఇంకా వివాహం చేసుకున్నాక భార్యను భర్త ఎలా సంరక్షించి పోషిస్తాడో అలాగే దేవుడు మరియు చెర విముక్తి పొంది తిరిగి వచ్చిన వారు దేశమును జెరూసలెం ని అలాగే పోషించి కడతారు అని అర్థం! గతంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై ఉన్నాడు అని వ్రాయబడిన విషయాన్ని కూడా ఇదేవిధమైన అర్థం చెప్పడం జరిగింది.

కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని కట్టి పోషిస్తున్నారు. అలాగే నీవు దేవునితో అంటుకట్టబడితే ఇశ్రాయేలు వారితో పాటుగా సంరక్షణ పోషణ దీవెనలు కలుగుతాయి!

మరి ఆయనతో అంటుకట్టబడి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావా??!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*335వ భాగము*

యెషయా గ్రంథము 62:6,7

6. యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

7. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 62వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

6-7 వచనాలలో మాట్లాడుతున్నది అభిషిక్తుడు లేక తండ్రి అయిన దేవుడు. మాట్లాడినదెవరైనా వెల్లడి అయిన సత్యం మాత్రం ఒకటే. కాపలా వాణ్ణి గురించి 52:8; 58:10; యిర్మీయా 6:17; 31:16; యెహె 3:17; 33:7 వ్రాయబడింది. జెరుసలంకు పూర్వ క్షేమస్థితి కలిగేవరకూ వారు వదలక ప్రార్థించాలి.

ఆయన జెరుసలంను సుస్థిరం చేసేవరకూ, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించేవరకూ ఆయనను విశ్రమించనియ్యవద్దు అంటున్నారు అనగా ప్రార్థన మానవద్దు!!

సరే ఇప్పుడు కావలివాని కోసం ధ్యానం చేసుకుందాం!

     Ezekiel(యెహెజ్కేలు) 3:17,18

17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.

18. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

ప్రియ దైవజనమా! ఈ భాగంలో దేవుడు యేహెజ్కేలుగారిని ఇశ్రాయేలీ ప్రజలకు కావలివానిగా ఉంచినట్లు చూస్తాం. ఇక్కడ యేహెజ్కేలుగారు ప్రతీ దైవసేవకునికి, పరిచర్య చేసేవారికి, కాపరికి సాదృశ్యంగా ఉన్నారు. ఒక  దైవసేవకుని ఎన్నుకోవడంలో దేవుని ఉద్దేశ్యం ఏమిటో దీనిద్వారా తెలుస్తుంది.

సందర్భము: 1-3 అధ్యాయాలలో యేహెజ్కేలుగారు యెహోవా ప్రభావ స్వరూప దర్శనాన్ని చూస్తారు. ఆ ధర్శనంలోనే దేవుడు తనని ఎందుకు ఎన్నుకొన్నారు? తన యొక్క Mission ఏమిటి? అని చెబుతూ ఇచ్చిన ఆజ్ఞలు.

     ఇక 3:16-27 లో చూసుకుంటే, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలిగా ఉంచాను. నామాట ఆలకించి నేను వారితో చెప్పమన్నవి నీవు చెప్పాలి అంటున్నారు. కావలి వాని పని ఏమిటి? కాపలా కాస్తూ, దొంగతనం జరుగకుండా, శత్రువుల దాడి జరిగేలా ఉంటే సైన్యాన్ని, ప్రజలను హెచ్చరించడం, శత్రువులతో పోరాడటం, క్రూరమృగాలనుండి  కాపాడటం కావలి వారి భాద్యత!

   ఇక్కడ యేహెజ్కేలుగారిని దేవుడు ఇశ్రాయేలీయులకు కావలి వానిగా ఉంచారు. అలాగే దైవసేవకులు అందరిని దేవుడు తన ప్రజలకు కాపలాదారులుగా ఉంచారు. వారిపని ఏమిటంటే దేవునివాక్కు కోసం ఎదురుచూస్తూ, ప్రజల నడతలను కనిపెడుతూ, సరి చేస్తూ, దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా ముంచుకొచ్చే/ రాబోయే ఆపదలను, ప్రమాదాలను కనిపెట్టి ప్రజలను హెచ్చరించాలి. అవుసరమైతే 2 తిమోతీ 3,4 అధ్యాయాలలో దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉపయోగించి ఖండించి, గద్దించి, బుద్ధిచెప్పాలి. అయితే ఇంతకుముందు ఉన్న కాపలాదార్లు అలా చేయలేదు. కాబట్టే వారు చేసినట్టే నీవుకూడా చేయవద్దు అంటున్నారు. కాపలాదారుల కోసం ఏం వ్రాయబడిందో చూద్దాం.

Isaiah(యెషయా గ్రంథము) 56:10,11

10. వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

 Jeremiah(యిర్మీయా) 6:17

17.​ మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.

Ezekiel(యెహెజ్కేలు) 33:7

7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.

  ప్రతీ దైవసేవకుడూ కావలివాడే!

       ఓ కావలివాడా!  నీవు ఏం చేస్తున్నావ్? 3:16-21, 33:7-9 ప్రకారం ఒక దుర్మార్గుడు పాపం చేస్తే, నీ పాపానికి నీవు దేవుని ఉగ్రత వచ్చి చస్తావ్,

నీతిమంతుడు పాపం చేస్తే నీ పాపానికి నీవు దేవుని ఉగ్రత కలిగి చస్తావ్ అని చెప్పమన్నారు. అలా ప్రకటిస్తే వారు విని మార్పు పొందితే, వారు బ్రతుకుతారు. నీవు నీ ఆత్మను రక్షించుకొంటావ్. వారి ఆత్మకు నిన్ను ఉత్తరవాదిగా ఉంచాను అంటున్నారు. వారు విని మార్పు చెందితే పర్వాలేదు. వినకపోతే నరకానికి పోతారు, గాని నీ మట్టుకు నీ ఆత్మను రక్షించుకొంటావ్ అంటున్నారు. వినినా వినకపోయినా చెప్పాల్సిన భాద్యత ప్రతీ కావలివాని మీద అనగా ప్రతీ దైవసేవకుని మీద ఉంది.

  ఓ  కావలివాడా! నువ్వు అలా చెబుతున్నావా? సంఘంలో పాపాన్ని ఖండిస్తూ, సరిచేస్తూ వారిని దేవుని దగ్గరకి నడిపిస్తున్నావా? రెండో రాకడకు సిద్ధం చేస్తున్నావా? లేక వారిని సంతోషపెట్టె, మేగే ప్రసంగాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నావా?

     ఈమధ్య మా గ్రామానికి దగ్గరలో నర్సీపట్నం అనే పట్టణంలో ఒక సంఘటన జరిగింది.  ఒక పాష్ట్రగారిని ఏమయ్యా అయ్యగారు! మీరు ఈ సంఘానికి వచ్చి రెండు నెలలు మాత్రమే అయ్యింది కదా , మరి పెట్టె బేడా సర్దుకొని ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగితే ఆ పాష్ట్రమ్మగారు కన్నీటితో చెప్పారు: అయ్యా ఈ సంఘంలో పాపాన్ని ఖండించకూడదంట! నరకం కోసం చెప్పకూడదంట! రెండో రాకడ కోసం చెప్పకూడదు అంట! అలా చెబితే ఖాళీ చేసి పొమ్మన్నారు. దేవునికి భయపడి వెల్లి పోతున్నాము అని చెప్పారు. పిలిచిన వాడు దేవుడే గాబట్టి ఆయన మీద భారం వేసి పోతున్నాం అన్నారు. ఎంత విచారం!!! ఎంత అన్యాయం!  రాకడకోసం, పాపాన్ని ఖండిస్తే కాపరులను మార్చేస్తున్నారు. ఇదేనా న్యాయం? కావలివాడా! సేవకుడా! వారికి భయపడి దేవుడు నీకిచ్చిన mission, చెప్పడం మానేస్తావా? ఎవరికి భయపడతావ్? వారికా? నిన్ను పుట్టించి, ఏర్పరచుకొని, అర్హతలేని నిన్ను పిలిచిన దేవునికా?

సంఘపెద్దలారా! మీకనుకూలమైన ప్రసంగాలు చేయకపోతే కాపరులను మార్చేస్తారా? తీర్పు దినం అనేది ఒకటుందని, ఆరోజున తప్పించుకోలేరు అని గుర్తుందా?  *దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి నిన్ను అధ్యక్షునిగా, కాపరిగా, సేవకునిగా, పెద్దగా, కాపలావానిగా నియమిస్తే సంఘాన్ని కాయడం ఇలానా*? మందకు సరియైన మేత, సరియైన ఆహారం తగినంత పెడుతున్నావా సహోదరుడా!!??

      ఒకసారి ఆలోచిద్దాం!! అక్కడ *దేవుని తీర్పు సింహాసం ముందు తీర్పు జరుగుతుంది. దేవుడు నిన్ను అడుగుతారు, నా కుమారుడా! నీవు ఎంతమందిని నా దగ్గరకు నడిపించావు? ఎంతమందికి భాప్తిస్మము ఇచ్చావు? నీవన్నావు అయ్యా! 500 మంది. సరే అని చెప్పి వారిని ఒక్కొక్కరిగా న్యాయపు త్రాసులో తూస్తున్నారు.  500 మందిలో కేవలం ఒక 20 లేక 30 మంది మాత్రం బరువు తూగి, మిగిలినవారు మంచి విత్తనాలలో కాకుండా పొట్టులో కలిసి పోయారనుకో, లేక గొర్రెలమందలో కాకుండా మేకలమందలో కలసి పోయారనుకో  దేవునిముందు నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకొంటావు సహోదరుడా!??? భళా నమ్మకమైన మంచిదాసుడా! అనిపించుకొంటావా? లేక సోమరివైన చెద్దదాసుడా అనిపించుకుంటావా* మత్తయి 25:21,23; లూకా 19:17?

   ఇక విశ్వాసులారా! మీరు గొర్రెలమందలో ఉంటారా? మేకలమందలో ఉంటారా? మీకోసం మీ కాపరి దేవుని తీర్పులో దేవుని ముందు తన తల ఎత్తుకొనేలా చేస్తారా? లేక తల దించుకొనేలా చేస్తారా? అయినా మీరు దేవుని దృష్టిలో అవిదేయతగా నడవడం ఏమిటి? నీ కాపరి సిగ్గుతో తలదించుకోవడమేమిటి? ఇది మీకు న్యాయంగా ఉందా సహోదరీ/ సహోదరుడా!???

   ఇక కావలివాడా/ సేవకుడా! అయ్యా!  నేను ఉన్నది ఉన్నట్లు సంఘంలో మరీ మరీ చెప్పాను, గాని వారు వినలేదండి, కావాలంటే మీరు రికార్డులు తెప్పించుకొని, గ్రంధాలు తెరచి చూడండి  అని ధైర్యంగా చెప్పాగలిగావనుకో (ప్రకటన 20:12), నీమట్టుకు నీవు నీ ఆత్మను రక్షించు కొన్నవాడివి అవుతావు. ఇంకా నీ భోద వినిన వారిని రక్షించుకొన్నవాడవు అవుతావు. అంతేకాకుండా అనేకమందిని నిజ క్రైస్తవులుగా తీర్చి దిద్దితే, దేవుడు అందరి ముందు భళా నమ్మకమైన మంచిదాసుడా! సెహబాస్!! అని మెచ్చుకొంటారు. దేవుని విందులో దేవునితో పాటు భోజనం చేస్తావు. కాబట్టి ప్రియ సేవకుడా! ఎవరికీ భయపడకు!! కష్టాలు ఎదురైనా, ఆకలిదప్పులు ఎదురైనా సరే, ఉన్నది ఉన్నట్లు భోదించు!! సత్యవాక్యం కోసం సాక్షిగా నిలబడు!! దేవుడు నీకిచ్చిన సంఘాన్ని సరియైన త్రోవలో నడిపించు!!  ఆనాడు ఆది అపోస్తలులు, ఆదిమ సంఘం నేటి దినాల్లో జరిగినట్లు Comfortness కోసం, శ్రమలు సహించకుండా, భాదలు పడకుండా ఉంటే మనం రక్షింపబడి ఉండేవారమా? ఆలోచించు సంఘమా?

  మనం కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా సత్యవాక్యం కోసం సాక్షిగా నిలబడుదాం! అవుసరమైతే హతస్సాక్షిగా మారుదాం!!

ఇక దేవుడు తాను చేసిన వాగ్ధానములు నెరవేర్చే వరకు సిగ్గుమాలిన దీన విధవరాలు గోజాడినట్టు గోజాడుదాం!

కీర్తనలు 123:1

ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.

కీర్తనలు 123:2

దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

ఇలా ప్రార్థనలో వేడుకుందాం!!!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*336వ భాగము*

యెషయా గ్రంథము 62:8--12

8. యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

9. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.

10. గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

11. ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

12. పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 62వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 8వ వచనం నుండి చూసుకుంటే యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.

9. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.

8-9 వచనాలు చూసుకుంటే ఇక్కడ ఒక ప్రమాణం కనిపిస్తుంది. ఇది గంబీరంగా ఖచ్చితంగా ఒక మాటను ఇవ్వడాన్ని సూచిస్తున్నది. ఇచ్చిన మాట ఏమిటంటే జెరుసలంకు తిరిగి పూర్వ క్షేమ స్థితి కలిగిన తరువాత శత్రువులు దౌర్జన్యం చేయడం అనేది శాశ్వతంగా ఆగిపోతుంది. మనము న్యాయాధిపతులు గ్రంథం చూసుకుంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పండించిన పంటను పంటకాలంలో ఫిలిస్తీయులు, మిద్యానీయులు ఇలా అన్యజనులు వారి పంటను కోత కాలంలో దౌర్జన్యంగా ఎత్తుకుని పోయినట్లుగా చూస్తాము. అయితే ఇక వెయ్యేళ్ల పాలనలో ఇక ఇశ్రాయేలు ప్రజలు గాని, నూతన నిబంధన సంఘ విశ్వాసులు గాని దౌర్జన్యం పొందరు. దోచుకోబడరు అని ఈ వచనాల ద్వారా అర్ధమవుతుంది.

ఇక 10,11 వచనాలు చూసుకుంటే గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి.

11. ఆలకించుడి, భూదిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నా డని సీయోను కుమార్తెకు తెలియజేయుడి.

ఇక్కడ గుమ్మముల ద్వారా రండి రండి అని పిలుస్తున్నారు. దీని అర్థం ఏదో దొంగచాటుగా కాదు. ధైర్యంగా ఆర్భాటంగా విజయోత్సాహంతో మీ నగరానికి సింహద్వారం నుండి ప్రవేశించండి అంటున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 11:10,11,12,16

10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

16. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును

యెషయా 57:14

ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.

యెషయా 48:20

బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రకటించుడి.

యెషయా 60:11

నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.

పదకొండవ వచనంలో యెహోవా భూమి మీద కొనలవరకు ఇలా చాటింపు చేశాడు:

“సీయోను కుమార్తెకు ఈవిధంగా చెప్పు: ఇదిగో నీకు చెందే విముక్తి వస్తూ ఉంది. దానిని తెచ్చేవాని దగ్గర బహుమానాలున్నాయి. ప్రతిఫలం ఆయనతో కూడా వస్తుంది.” ఈ మాటలు బహుమతి ప్రదానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, కాబట్టి ఈ రాక క్రీస్తు రెండవ రాకడ అనడంలో సందేహం లేదు.

యెషయా 40:10

ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది.

Matthew(మత్తయి సువార్త) 25:14,15,16,17,18,19,20,21

14. (పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును.

15. అతడు ఒకనికి అయిదు తలాంతులను (ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చును) ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.

16. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను.

17. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.

18. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.

19. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.

20. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపాదించితినని చెప్పెను.

21. అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో-ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

ప్రకటన గ్రంథం 11:18

జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

ప్రియ సహోదరి సహోదరుడా! దేవునిరాకడ సమీపముగా ఉంది. వచ్చేటప్పడు ఆయన ప్రతివానికి జీతం ఇవ్వబోతున్నారు. నీవు చేసిన క్రియల చొప్పున, నీవు చేసిన పరిచర్య కొలదీ నీకు జీతం ఇవ్వబోతున్నారు. జీతం తీసుకునే స్తితిలో ఉన్నావా లేక తీర్పుకు పాత్రుడుగా ఉన్నావా సరిచూసుకో!!!!

ఇక చివరి వచనంలో పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.

పరిశుద్ధ ప్రజలని పేరుపెట్టబడును దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!

యెషయా 4:3; 26:2; 45:25; 52:1; 60:21.

ఇక విమోచించ బడిన వారు: ఈ ప్రవచనం క్రీస్తు రెండవ రాకడ తరువాతే ఈ వచనం నెరవేరుతుంది.

యెషయా 35:9

అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు

యెషయా 44:23

యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును

యెషయా 51:11

యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

హల్లెలూయ! నీవు విమోచించ బడ్డావు గనుక ఇక పాప దాస్యములో చిక్కుకోవద్దు!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*337వ భాగము*

యెషయా గ్రంథము 63:1--6

1. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

2. నీ వస్త్రము ఎఱ్ఱగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టలవలె ఉన్న వేమి?

3. ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్ట లన్నియు డాగులే.

4. పగతీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను

5. నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకాధారమాయెను.

6. కోపముగలిగి జనములను త్రొక్కి వేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని వారి రక్తమును నేల పోసివేసితిని.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 62వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 63వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం.

ప్రియులారా ఈ భాగం ప్రకటన 14వ అధ్యాయం లో ద్రాక్షల తొట్టి సంభవమును సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో కనిపించే దృశ్యానికి చాలా దగ్గర సంబంధం ఉన్న దృశ్యాలే 34:6; 34:1-8లోనూ కనిపిస్తాయి. ఇవి అభిషిక్తునికి చెందినవే. ఇది ఇస్రాయేల్‌ను విడిపించేందుకు ఆయన తరలివస్తున్న దృశ్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది హార్మెగిద్దోన్ యుద్ధం మరియు గోగుమాగోగు యుద్ధంలో దేవుడు ఏవిధంగా శత్రువులను అణగద్రొక్కుతారో వివరించే దృశ్యము!!!

*ద్రాక్షల కోత మరియు ద్రాక్షల తొట్టి*

ప్రకటన 14:17—20

17. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతని యొద్దను వాడిగల కొడవలి యుండెను.

18. మరియొక దూత బలిపీఠమునుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచిభూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.

19. కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను

20. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.

ప్రియులారా! 17—20 వచనాలలో మరో ఇద్దరు దూతలు కనిపిస్తున్నారు! ఇద్దరు కూడా పరలోకంలో నుండే వచ్చారు! ఇద్దరు దేవాలయం లోనుండే వచ్చారు! అనగా యితడు కూడా దేవుని దగ్గరనుండి సందేశం తీసుకుని వచ్చాడు! ఇతని చేతిలో కూడా వాడిగల కొడవలి ఉంది!

ఇక మరియొక దూత బలిపీఠం దగ్గరనుండి వస్తున్నాడు! ఇతనికి అగ్నిమీద అధికారం ఉంది. ఈ రెండవ దూత మొదటి దూతతో అంటున్నాడు: నీ వాడిగల కొడవలి భూమిమీద వేసి ద్రాక్షగెలలు కోసేయ్! కారణం ద్రాక్షపండ్లు ముగ్గిపోయి ఉన్నాయి అన్నాడు! వెంటనే ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి ఆ ద్రాక్షపండ్లు కోసినట్లు చూడగలం!

ఇక్కడ జాగ్రత్తగా కనిపిస్తే మరొక దూత అని మొదలుపెట్టారు కాబట్టి మునుపటి పైరుకోత దూత కాదని అర్ధమవుతుంది. ఆ దూత వచ్చిన సందర్బం వేరు! ఈ దూత సందర్బం వేరు! కాబట్టి ఇది దుర్మార్గులైన మనుష్యుల మీదికి దేవుని నుండి రాబోయే ఉగ్రతను సూచిస్తుంది!

ఇక్కడ ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి వచ్చిన వారే! ఐతే రెండవ వానికి అగ్నిమీద అధికారం ఉంది! అనగా బహుశా 8:3—5 లో కనిపించే దేవదూత కావచ్చు!

ఇప్పుడు చెబుతున్నాడు భిగ్గరగా: భూమిమీద ద్రాక్షపండ్లు పరిపక్వమై ఉన్నాయి వాడియైన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుము!!!

ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భూమిమీద లేక భూమి ద్రాక్షపండ్లు- దేవుని ద్రాక్షపండ్లు కానేకాదు! దీనికోసం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి!

కొంతమంది ఈ ద్రాక్షపండ్లు ఇశ్రాయేలు ప్రజలు అంటారు! ఎందుకు అంటే యెషయా 5:7 లో ఇశ్రాయేలు వంశం సైన్యములకధిపతియగు యెహోవా యొక్క ద్రాక్షతోట అని వ్రాయబడింది కాబట్టి ఈ ద్రాక్షతోట- పండ్లు- ఇశ్రాయేలు ప్రజలు! అయితే ఈ తోట మంచి ఫలములు ఫలించాలని చూస్తే వారు కారు ద్రాక్షలు కాశారు అని అదే భాగంలో చెప్పబడింది కాబట్టి వీరు ఇశ్రాయేలు ప్రజలలో క్రీస్తు విరోధికి లోబడి వాడి గుర్తును వేసుకున్న వారు! వారికి జరిగే తీర్పునే ఇక్కడ రాయడం జరిగింది అంటారు! ద్రాక్షల తొట్టి అనగా దేవుని ఉగ్రతాదినమున జరిగే తీర్పు! ప్రకటన 19:15..

ఇంకా అంటారు యేసుప్రభువే ఆ ద్రాక్ష తొట్టి త్రొక్కుతారు అని చెబుతూ యెషయా 63:1—6 చూపిస్తారు!

నేను కూడా దీనిని ఒప్పుకుంటాను అదే సందర్భము గాని ఇక్కడ ఈ భాగము బాగా అర్ధము చేసుకుంటే ప్రభువు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎక్కడనుండి వస్తున్నారు అంటే ఎదోము నుండి వస్తున్నారు! ఇంకా శోభిత వస్త్రాలు వేసుకుని గంభీరముగా అనగా సీరియస్ గా నడుచుకుంటూ ఎక్కడ నుండి వస్తున్నారు అంటే బొస్రా నుండి. అనగా అప్పటి ఇరాక్ కేపిటల్ పట్టణం!

కాబట్టి ఈ భాగంలో చెప్పబడిన ఇరాక్ లేదా ఎదోము అన్యజనుల పట్టణాలను లేక దేవుని ప్రజలను బాధించిన పట్టణాలను రాజ్యాలను అలంకారముగా చెప్పబడింది అని నా ఉద్దేశం! ఇది ఇశ్రాయేలు ప్రజల గురుంచి చెప్పబడలేదు అనేది నా అభిప్రాయం! ఇక్కడ వారినే దేవుడు ఒంటరిగా గానుగ త్రొక్కారు కారణం అప్పటికి ఏమి జరిగింది అంటే అన్యజనులు 1260 రోజులు యేరూషలేమును ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మరోసారి చెరపట్టబడ్డారు!

జెకర్యా 14:1—౩ లో చెప్పిన సంబవం జరిగింది.....

1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.

2.​ ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

కాబట్టి ఇది హార్మెగిద్దోను యుద్ధం తోను, దుష్టులను దేవుడు శిక్షించే ఉగ్రతతోను సంబంధం కలిగిన విషయం!

వీరు వచ్చారు- హార్మెగిద్దోను అనే ప్రాంతంలో ఉన్నారు! యెరూషలేమును దోచుకున్నారు. స్త్రీలను రేప్ చేశారు! నగరంలో సగం మందిని బందీలుగా మరోదేశానికి తీసుకుని పోయారు! మిగిలిన వారు ఏడుస్తున్నారు- అప్పుడు దేవుడు వచ్చి వీరిమీద తీర్పు తీరుస్తున్నారు! అందుకే అంటున్నాడు దూత- భూమిమీద ద్రాక్షపండ్లు ముగ్గిపోయాయి! అనగా భూమిమీద దుష్టుల యొక్క పాపం పండిపోయింది. వారికి తీర్పు తీర్చే సమయం వచ్చేసింది. ఇంకా క్రూరమృగపు పాలనలో నీతిన్యాయాలు పూర్తిగా అడుగంటి పోయాయి, అన్యాయం రాజ్యమేలుతుంది. అందుకే దేవుడు రౌద్రుడై ఈ గానుగ తొట్టిని అనగా ద్రాక్షలతొట్టిని త్రొక్కుతున్నారు!

సరే. ఇక్కడ ఆ దూత కొడవలివేసి భూమిమీద ఉన్న ద్రాక్షగెలలను కోసి తిన్నగా గానుగ తొట్టిలో లేక ద్రాక్షల తొట్టిలో వేసాడు!

దేవుని ద్రాక్షల తొట్టి అనగా దేవుని ఉగ్రతాదినము అని మీదన చెప్పడం జరిగింది.

యెషయా 6౩:౩—4

యోవేలు ౩:13

​పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.

ఈ ద్రాక్షల తొట్టి నగరం బయట త్రొక్కడం జరిగింది. ఎందుకు నగరం బయట అని చూసుకుంటే: వారు నగరం బయట హార్మెగిద్దోను దగ్గర కూడి ఉన్నారు కాబట్టి! ఇంకా యేసుక్రీస్తుప్రభులవారిని నగరం బయట సిలువవేశారు కాబట్టి! ఇంకా యేరూషలేము చుట్టూ దండ్లు కాపు కాచాయి యెరూషలేమును నాశనం చెయ్యడానికి!

సింపుల్ గా చెప్పాలంటే అన్యులకు జరిగే తీర్పు హార్మెగిద్దోను యుద్ధ సమయంలో!!!

అప్పుడు ప్రకటన 19:15 లో సంభవం జరుగుతుంది.....

ప్రకటన గ్రంథం 19: 15

జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

ఆ ద్రాక్షలతొట్టి నుండి రక్తము సుమారు 200 మైళ్ళు అనగా 321 కి.మీ.దూరం వ్యాపించింది! అనగా అంతమందిని అక్కడ హతమార్చడం జరిగింది. గమనించాలి ఒకవేళ వీరు ఇశ్రాయేలు ప్రజలు అయితే వారి రక్తం అంతదూతం వెళ్ళే అవకాశం లేనేలేదు! వీరు హార్మెగిద్దోను యుద్ధానికి వచ్చిన సేనలు మరియు క్రీస్తు విరోధి మనుష్యులు కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వారు కాబట్టి చాల ఎక్కువ మంది, బహుశా కొన్ని కోట్లమంది- వారి రక్తం ఇప్పుడు 321 కి.మీ దూరం పారింది. ఈ విధంగా దేవుడు దుష్టుల మీద తీర్పు తీర్చబోతున్నారు!

ప్రియ సంఘమా! ఈ సంభవాలు అతి తొందరలో జరుగబోతున్నాయి! నీవు సిద్ధంగా ఉన్నావా?

రక్షణ పొందుకున్నావా?

రక్షణ కాపాడుకుంటున్నావా? ఆత్మను పొందుకుని ఆత్మచేత నడిపించబడి ఆత్మలో ఆత్మద్వారా నడుస్తున్నావా?

వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావా?

అలాగయితేనే ఎత్తబడగలవు!

లేదా విడువబడతావు జాగ్రత్త!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*338వ భాగము*

యెషయా గ్రంథము 63:7--14

7. యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

11. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

12. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

13. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడి పించితివి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 63వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఏడవ వచనం నుండి చూసుకుంటే యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

ఈ మాటలు యెషయా ప్రవక్త చెబుతున్నారు. 7-14 వచనాలు కీర్తన 105,106 అధ్యాయాలలో కీర్తనాకారుడు గతంలో ఇస్రాయేల్ పట్ల దేవుని గొప్ప మేలును క్లుప్తంగా నెమరు వేసుకుంటూనే ఇశ్రాయేలు ప్రజలు దేవున్ని మర్చిపోయి ఆయన దారి నుండి ఎలా తప్పిపోయారో జ్ఞప్తికి తెచ్చుకుంటూ దేవుని పాదాల దగ్గర మమ్మును క్షమించు మహాప్రభూ అంటూ వేడుకుంటున్నారు.

ఎనిమిదో వచనంలో వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

చూడండి వారు పాపాత్ములై తిరుగుబాటు చేస్తారని దేవునికి ముందే తెలుసు. అయినా వారి పట్ల కనికరం చూపిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక ఎప్పటికీ నా మార్గము నుండి తొలిగిపోరు అనుకున్నాడు దేవుడు గాని వారు వినలేదు.

తొమ్మిదవ వచనంలో వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని విడుదల చేశాడు. పురాతన దినాలన్నిటిలో వారిని ఎత్తుకొంటూ మోస్తూ వచ్చాడు అంటున్నారు.

ఈ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే బైబిల్‌లో వెల్లడైన దేవుని స్వభావం ఇదే. తనకేమీ పట్టనట్టు దూరంగా కఠిన మనస్కుడై ఆప్యాయత లేకుండా ఉండేవాడు కాడు మన దేవుడు. తన ప్రజలు అనుభవించే బాధ ఆయనకు కూడా బాధే. వారితో కలిసి వారిలో ఉండి ఆ బాధను ఆయన కూడా అనుభవిస్తాడు. కనికరం అనే పదానికి అర్థం ఎదుటివాని బాధను పంచుకోవడం. హీబ్రూ గ్రీకు బాషల్లో ఈ పదానికి ఉన్న అర్థం గంబీరమైనది. ఉదాహరణకు క్రొత్త నిబంధన గ్రంథంలో రెండు రిఫరెన్స్ లు చూసుకుందాం!!

Matthew(మత్తయి సువార్త) 25:31,32,33,34,35,36,37,38,39,40

31. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

32. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి

33. తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

36. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును

37. అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

38. ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

39. ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

ఈ భాగం బట్టి రెండు విషయాలు అర్ధమవుతాయి. మొదటిది: పేదలకు, అనాదలకు, విధవరాళ్లకు, అవసరంలో ఉన్నవారిని, దేవుని బిడ్డలను మనము ఆదరించి వారి అవసరాలను తీర్చి సహాయం చేస్తే దేవునికి చేసినట్లే!

రెండవది: అదే పేదలు, దేవుని బిడ్డలు, అవసరతలో ఉన్నవారు లేమితో ఆకలితో బాధ పడితే వారితో పాటుగా దేవుడు కూడా బాధపడుతున్నారు. అదేవారిని సంతృప్తి పరిస్తే వారితో పాటుగా దేవుడు సంతోషిస్తారు.

అపో.కార్యములు 9:4

అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

అపో.కార్యములు 9:5

ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;

అనగా పైరెండు ఉదాహరణలు చూసుకుంటే దేవుడు మన బాధలను మనతోపాటుగా అనుభవిస్తున్నారు మరియు మన సంతోష సమయాలలో మనతో పాటు సంతోషిస్తారు అన్నమాట!!!

ఇక ఈ వచనంలో కనిపించే మరో ముఖ్యమైన విషయం: ఆయన సన్నిధి దూత:

ఈ దూత మనకు అనేకసార్లు బైబిల్ లో వివిధ రకాలుగా కనిపించాడు.

నిర్గమకాండము 14:19

అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను

Exodus(నిర్గమకాండము) 23:20,21,22,23

20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.

21. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.

22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.

23. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.

Exodus(నిర్గమకాండము) 33:12,14,15

12. మోషే యెహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.

14. అందుకు ఆయననా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా

15. మోషే నీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.

సంఖ్యాకాండము 20:16

​​మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.

ప్రియ దైవజనాంగమా! అదే సన్నిది దూత మనతో కూడా ఉన్నాడు గనుక భయపడవద్దు! అదే సమయంలో అదే సన్నిధి దూత మనలను 24/7 మనతో ఉంటూ మనము చేసే ప్రతీ పనిని చూస్తున్నాడు, మనము మాట్లాడే ప్రతీమాట వింటున్నాడు, దేవునికి సమాచారం చేరవేస్తున్నాడు గనుక అతి జాగ్రత్తగా అనగా వాడుక భాషలో చెప్పాలంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ప్రవర్తించాలి అని మర్చిపోవద్దు!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*339వ భాగము*

యెషయా గ్రంథము 63:7--14

7. యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

11. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

12. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

13. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడి పించితివి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 63వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక ఇదే తొమ్మిదవ వచనంలో ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను అంటున్నారు. అవును మన దేవుడు మనలను ఎంతో ధీర్ఘశాంతము కలిగి మనలను సహిస్తున్నారు. మనము మాటిమాటికీ తప్పిపోయి ఆయనకు ఇష్టం కాని పనులు చేస్తున్నా సహించి, జాలిచూపి మనలను క్షమిస్తున్నారు. ప్రేమచేతను తాలిమిచేతను కాపాడుతున్నారు. అందుకే భక్తుడు అంటున్నారు అనుదినము నూతనంగా వాత్సల్యం నీకు పుట్టును.

విలాపవాక్యములు 3:23

అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.

యిర్మియా 31:3

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

కీర్తనలు 68:19

ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.

ఇక మరోమాట పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

ద్వితియోపదేశకాండము 1:31

ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 32:10,11,12

10. అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.

11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.

12. యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.

ఇక తరువాత వచనంలో యెషయా భక్తుడు అంటున్నారు అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

సంఖ్యాకాండము 20:2

ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.

సంఖ్యాకాండము 20:3

జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోద రులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

సంఖ్యాకాండము 20:4

అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?

సంఖ్యాకాండము 20:5

ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.

ద్వితియోపదేశకాండము 9:24

​నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.

కీర్తనలు 78:37

నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.

కీర్తనలు 78:38

అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు.తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.

కీర్తనలు 78:39

కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.

కీర్తనలు 78:40

అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.

కీర్తనలు 78:41

మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి.

కీర్తనలు 78:42

ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.

కీర్తనలు 106:40

కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

ఇక పరిశుద్ధాత్మకు విరోధంగా మారారు.

కీర్తనలు 106:33

ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

ఎఫెసీయులకు 4:30

దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

ఇక అప్పుడు దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువుగా మారాల్సి వచ్చింది.

లేవీయకాండము 26:17

​నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

యిర్మియా 21:5

కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై, బాహుబలముతోను, చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసెదను.

యెహేజ్కేలు 15:7

​నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

కాబట్టి ప్రియులారా! ఈ భాగం బట్టి అర్ధమయ్యేది దేవుడు కరుణామయుడు దయామయుడు వాత్సల్యపూర్ణుడు, గాని దానిని అలుసుగా తీసుకుని మాటిమాటికీ తప్పిపోతే దేవుడే నీకు విరోధిగా మారిపోయి నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించి వారితో పాటు దేవుడు నీమీద యుద్ధం చేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా మనము ఏమీ చెయ్యలేమని మర్చిపోవద్దు! ఆ పరిస్తితులలో నీవు నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభువుపాదాలను పట్టుకుంటే ఆయన కరిగిపోయే దేవుడు కూడా!

కాబట్టి ఆయనకు ఇష్టమైన పనులు చేస్తూ ఆయన మార్గములో నడిచిపోదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*340వ భాగము*

యెషయా గ్రంథము 63:7--14

7. యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.

8. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.

11. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

12. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

13. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 63వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ఇక తరువాత వచనంలో అంటున్నారు అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?

ఇక 11-14 వచనాలలో యెషయా గారు ప్రజలు గతాన్ని గుర్తు చేసుకుని అంత ఘనకార్యాలు చేసిన దేవుడు ఇప్పుడేమయ్యాడు? అంటున్నారు.

ఇక్కడ మోషే దినాలలో దేవుడు ఏవిధంగా ప్రజలను ఎర్ర సముద్రం దాటించారో గుర్తుకు తెచ్చు కుంటున్నారు!

Exodus(నిర్గమకాండము) 14:13,14,16,17,21,22

13. అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

16. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

17. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.

21. మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

ఇక తరువాత వచనంలో తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? అంటున్నారు!

ఈ అధ్యాయం లో 10,14 వచనాలలో పరిశుద్ధాత్మను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు!

ఆదికాండము 1:2

భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

సంఖ్యాకాండము 11:17

​నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.

సంఖ్యాకాండము 11:25

యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.

అందుకే దావీదు భక్తుడు కన్నీరు కార్చుతున్నాడు

కీర్తనలు 51:11

నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.

యోహాను 14:16

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.

యోహాను 14:26

ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మలేక,ఉత్తరవాది) సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.

ఇక తరువాత వచనంలో తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

యెషయా 51:9

యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?

యెషయా 52:10

సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.

యెషయా 53:1

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

నిర్గమకాండము 15:16

యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.

అందుకే మోషే కుడి చేతివైపున తన ఘనమైన చెయ్యి ఉండిపోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారి ముందర నీళ్ళను విభజించినవాడేడి?  జలాగాధం గుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రంలాగా వారు తొట్రుపడలేదు అంటున్నారు.

ఇక తరువాత వచనంలో పల్లమునకు దిగు పశువులు విశ్రాంతినొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి అంటున్నారు.

దావీదుగారు కూడా ప్రభువు సన్నిధిలో ఇలా అంటున్నారు

2సమూయేలు 7:23

నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనులవశములోనుండియు, వారి దేవతల వశములో నుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.

2సమూయేలు 7:24

మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.

సొలొమోను గారు అంటున్నారు

1దినవృత్తాంతములు 29:13

మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

నెహెమ్యా గ్రంథంలో భక్తులు స్తుతిస్తూ అంటున్నారు

నెహెమ్యా 9:5

అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.

దూతలు పాడుతున్నారు

లూకా 2:13

వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి

లూకా 2:14

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.

ఇంతటి ఘనమైన నామమును మనము కూడా కొనియాడుతూ ఆయన పట్ల భయమును మరియు భక్తియు కలిగి జీవిద్దాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*341వ భాగము*

*యెషయా గారి ప్రార్ధన-1*

యెషయా గ్రంథము 63:15--19

15. పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.

16. మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.

17. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.

18. నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి యున్నారు.

19. నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 63వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 15వ వచనం చూసుకుంటే పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.

ప్రియులారా ఈ వచనం నుండి యెషయా గారి ప్రార్థన ప్రారంభం అవుతుంది. ఇతడు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రతినిధిగా ప్రార్థిస్తున్నారు. దానియేలు గారు ప్రార్ధించినట్లు, నెహెమ్యా గారు, ఎజ్రాగారు ప్రజల పక్షాన ప్రార్థన చేసినట్లు యెషయా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు! దేవుడు ఈ లోకంనుండి పరలోకానికి వెళ్ళిపోయి తమ మధ్య ఎలాంటి కార్యకలాపాలూ కొనసాగించకుండా ఊరుకున్నాడని ప్రజలు భావిస్తున్నారు.

అయ్యా దేవా! పరలోకంనుంచి ఒకసారి దయచేసి చూడు! నీ దివ్యమైన పవిత్ర నివాసంలో నుంచి చూడు బాబు! నీ ఆసక్తి, నీ ప్రభావం ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం అణగిపొయ్యాయా ఓ దయగల దేవుడా అంటూ దీనమనస్సుతో ప్రార్థన చేస్తున్నారు!

ఇక తరువాత వచనంలో మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.

చూడండి ఎంతమంచి ప్రార్థన చేస్తున్నారో! అందుకే భక్తుడు అంటున్నాడు మాటలు సిద్దపరచుకుని ఆయన సన్నిధికి రండి అంటూ!

హోషేయా 14:2

మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

దావీదు భక్తుడు అంటున్నారు కీర్తనలు 5:3

యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

ఇలాంటి ప్రార్థన నీకు నాకు ఎంతో అవసరం!

యెషయా 64:8

యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

నిర్గమకాండము 4:22

అప్పుడు నీవు ఫరోతోఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;

ద్వితియోపదేశకాండము 32:6

బుద్ధిలేని అవివేకజనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.

యిర్మియా 3:4

​అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

ఇస్రాయేల్‌లో దేవుణ్ణి తమ జాతికి తండ్రిగా పరిగణించేవారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత అట్టడుగుకు దిగజారారంటే, దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఎంత తీవ్రంగా తిరగబడ్డారంటే అబ్రాహాము అతని మనుమడు ఇజ్రాయేల్ అప్పుడు గనుక అక్కడ ఉంటే ప్రజలను చూచి వారు తమ సంతానంగా గుర్తు పట్టలేకపోయేవారు.

నేడు మనము కూడా దేవున్ని మన తండ్రిగా భావిస్తున్నాము కదా! మరి తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా లేక ఆయనకు ఆయాసకరమైన పనులు చేస్తున్నామా అనేది పరిశీలించుకోవాలి!

ఇక తరువాత వచనాలలో యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము.

18. నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి యున్నారు.

19. నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి అంటున్నారు!

ఈ ప్రార్థనకు బహుశా 6:9-10తో సంబంధం ఉంది. ఈ రకంగా దేవుడు వారికి ఏమన్నా చేసివుంటే అది సంపూర్ణంగా న్యాయసమ్మతమైన శిక్షే!

యెషయా 6:9

ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

యెషయా 6:10

వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.

నీ పవిత్ర దేశం నీ ప్రజల స్వాధీనంలో ఉండడం కొద్దికాలం మాత్రమే ఉంది. ఇప్పుడు మా శత్రువులు నీ పవిత్రాలయాన్ని త్రొక్కివేశారు అంటూ భక్తుడు విలపించాడు ఇక్కడ!

Isaiah(యెషయా గ్రంథము) 64:10,11,12

10. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

12. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

ఇది నిజానికి యెషయా గారి రోజుల్లో జరగలేదు. కాబట్టి యెషయా గారు భవిష్యత్తులోకి చూస్తూ రాబోయే తరంవారి పక్షంగా ప్రార్థన చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.

ఇక చివరి వచనంలో నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతిమి నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతిమి అంటున్నారు. మరోవిధంగా చెప్పాలంటే నీవెన్నడూ పరిపాలించనివాళ్ళలాగా అయ్యాం. నీ పేరు ఎన్నడూ ధరించనివాళ్ళలాగా అయ్యాం అంటున్నారు. అనగా నిన్ను గాని నీ ప్రభావ ఘనతలు ఎరుగని దేశంలో నీకు దూరంలో నిన్ను ఆరాధన చేయలేని ధౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము అంటున్నారు!

అందుకే కరుణించమని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు! మనము కూడా మన కుటుంబంలో రక్షణ పొందని వారికోసం, ఇరుగుపొరుగు వారికోసం, గ్రామం కోసం దేశం కోసం ఇలాగే ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*342వ భాగము*

*యెషయా గారి ప్రార్ధన-2*

యెషయా గ్రంథము 64:1--3

1.గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.

2.నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.

3.జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 63వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక 64వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ 1-12 వచనాలు కూడా పాపాలను ఒప్పుకొంటూ దేవుడు తన మహా బల ప్రభావాలతో దిగివచ్చి తమను క్షమించి తిరిగి తమను పూర్వ క్షేమ స్థితికి తేవాలని విన్నవించుకునే శ్రేష్ఠమైన ప్రార్థన. ఇది గత అధ్యాయం 15వ వచనంలో ఆరంభమైన ప్రార్థన ఈ అధ్యాయం చివరి వరకూ సాగుతుంది!

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే యెషయా గారు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మద్యలో పరవశుడై పోయారు. మధ్యలో ప్రవచనాలు చెబుతున్నారు ఆత్మావేశుడై!!

మొదటి వచనంలో గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక అంటున్నారు!

ఇంకా రెండవ వచనంలో నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక అంటున్నారు!!

ఈ 1-2 వచనాలలో దేవుడు హఠాత్తుగా, శక్తివంతంగా భూమినీ సకల జాతులనూ కంపింపజేస్తూ, తన శత్రువుల పాలిట భగభగ మండే మంటలాగా దిగిరావాలని ప్రార్థిస్తున్నారు ప్రవక్త. ఈ ప్రార్థన సంపూర్ణంగా నెరవేరుతుంది కొన్ని రోజుల్లో!

Isaiah(యెషయా గ్రంథము) 24:18,19,20,23

18. తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి

19. భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది

20. భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.

23. చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.

Isaiah(యెషయా గ్రంథము) 30:27,28

27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

28. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

2థెస్సలొనికయులకు 1:6

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

2థెస్సలొనికయులకు 1:7

దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

2థెస్సలొనికయులకు 1:8

మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

Hebrews(హెబ్రీయులకు) 12:26,27,28,29

26. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.

27. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.

28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

29. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.

Revelation(ప్రకటన గ్రంథము) 19:11,12,13,14,15,16

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13. రక్తములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో-చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

1థెస్సలొనికయులకు 4:16

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

ఇంతటి ఆర్భాటముతో మనదేవుడు దిగి రాబోతున్నారు! అలాంటి మహా ప్రభావముతో రమ్మని భక్తుడు ప్రార్థిస్తూ ప్రవచిస్తున్నారు!

ఇంకా ఇదే వచనంలో నీవు నీ శత్రువులకు నీ పేరు తెలిసేలానీ సమక్షంలో జనాలు వణకేలా దిగి రా అని ప్రార్ధిస్తున్నారు!

యెషయా 30:27

ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

యెషయా 59:19

పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.

Philippians(ఫిలిప్పీయులకు) 2:6,7,8,9,10,11

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

హల్లెలూయ! ఆయన నామమున ప్రతీ మోకాలు వంగ వలసినదే! ప్రతీ నాలుక ఒకరోజు ఆయనను పొగడవలసినదే!!!

ఇక తరువాత వచనంలో జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.

ద్వితియోపదేశకాండము 7:21

వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.

ద్వితియోపదేశకాండము 10:21

ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.

కీర్తనలు 65:5

మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు

Psalms(కీర్తనల గ్రంథము) 66:3,4,5,6,7

3. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు

4. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. (సెలా.)

5. దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.

6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి.

7. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు? అన్యజనుల మీద ఆయన తన దృష్టియుంచియున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు.(సెలా.)

Psalms(కీర్తనల గ్రంథము) 106:21,22

21. ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను

22. ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

కీర్తనలు 145:6

నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.

ప్రియ దైవజనమా! ఇంతటి ఘనమహాత్యములు గల దేవుడు మన దేవుడు! ఆయన గగనము చీల్చుకుని త్వరలో రానైయున్నారు! మరి నీవు ఆయనకు భయపడి ఆయన రాకడకు సిద్దంగా ఉన్నావా?!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*343వ భాగము*

*యెషయా గారి ప్రార్ధన-3*

యెషయా గ్రంథము 64:4--6

4. తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

5. నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

6. మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 64వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! యెషయా గారి ప్రార్థనను ధ్యానం చేస్తున్నాము!!

(గతభాగం తరువాయి)

ఇక నాల్గవ వచనం నుండి చూసుకుంటే తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు అంటున్నారు!

మనుషులలో భయభక్తులను కలిగించే గొప్ప కార్యాలు చేసే సమర్థత గల ఒకే ఒక దేవుణ్ణి ఉద్దేశించి ఈ ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. ఆ దేవుడు తండ్రియైన యెహోవా దేవుడు. ఆయన కోసం ఓపికతో ఎదురు చూచేవారి పక్షంగా తన పని జరిగిస్తాడు –

యెషయా 25:9

ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.

యెషయా 30:18

కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

కీర్తనలు 27:14

ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

కాబట్టి ఆయన కోసమే ఇంకా ఎదురు చూద్దాం!

తరువాత వచనంలో నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

చూడండి దేవున్ని జ్ఞాపకం చేసుకుంటూ నీతిని అనుసరించే వారిని దేవుడు దర్శించి కాపాడుతున్నారు, మేమైతే పాపంలో ఉన్నాము నిన్ను అనుసరించడం లేదు. కాబట్టి నీనుండి రక్షణను మేము పొందుకోలేకపోతున్నాము అంటున్నారు. న్యాయాన్ని అనుసరించే దేవుడు పూనుకొని చర్య తీసుకొనే వరకూ ఊరికే చూస్తూ ఉండడంతోనే సరిపోదు. దేవుడు మన పక్షాన పని చెయ్యాలంటే ఆయన పక్షాన మనం ఇష్ట పూర్వకంగా పని చెయ్యాలి.

ఇంకా అంటున్నారు మేము మా పాపాలలో ఉండిపోయాము– దేవుడు తమ కోసం అద్భుత కార్యాలు చెయ్యడం ఎందుకు మానుకున్నాడో యెషయా గారికి బాగా తెలుసు 59:1-2 చెప్పినట్లు. దేవుని శక్తి మనుషులను మార్చేవరకూ వారు చేసేదల్లా పాపంలో కొనసాగడం మాత్రమే.

సంఖ్యా 25:3;

అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

కీర్తన 90:7-11;

7. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము.

8. మా దోషములను నీవు నీ యెదుట నుంచు కొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

9. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

10. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

11. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

యోహాను 3:36

కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.

రోమ్ 1:18.

దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

సహాయం చేసే సామర్ధ్యం గల ఏకైక దేవునికే మనుషులు కోపం తెప్పించినప్పుడు రక్షణ నిశ్చయత పొందగలగడం చాలా కష్టతరం. దేవుని కోపమంతటికీ తమ పైకి వచ్చిన ఆపదలన్నిటికీ తాము తగిన వారమేనని ఇక్కడ భక్తుడు గుర్తించి పాపములను ఒప్పుకుంటున్నారు! మనము అలాగే ఒప్పుకోవాలి!

తరువాత వచనంలో మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను .

ఇక్కడ అపవిత్రులమైతిమి అనగా– మనుషులు చేయగల మంచి కార్యాలు కూడా మురికి గుడ్డలైతే వారి చెడ్డ కార్యాలు ఎలాంటివో మరి! అలాంటప్పుడు తమ పుణ్యంగా వారు భావించే మాసిన గుడ్డపీలికలను దేవునికి ఇచ్చి దానికి ప్రతిగా దేవుడు రక్షణను ఇవ్వాలని ఆశించేందుకు మనకు ఏం హక్కు ఉంది? ఈ వచనం అర్థాన్ని పూర్తిగా గ్రహించి క్రీస్తు నీతిన్యాయాల కోసం ఆయన్ను ఆశ్రయించేవారు ధన్యులు.

ఫిలిప్పీయులకు 3:8

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.

ఫిలిప్పీయులకు 3:9

క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

ఫిలిప్పీయులకు 3:10

ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,

ఫిలిప్పీయులకు 3:11

ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

ఇంకా ఆకుతో పోల్చుకుంటున్నారు- “ఆకు” పచ్చగా ఉన్నా కొన్ని రోజులకు వాడిపోయి పడిపోతుంది– అలాగే పాపం చేసేటప్పుడు మజా కలిగించినా ఒకరోజు తెగులును కలుగజేసి నశింపజేస్తుంది.

ఇంకా మా అపరాధాలు మమ్మల్ని ఎగరగొట్టి గాలిలో తీసుకు పోతున్నాయి అంటున్నారు! మన పాపాలు సత్యం, నీతిన్యాయాలనుంచీ, దేవునినుంచీ పాపం మనిషిని దూరానికి ఎగరగొట్టేస్తుంది.

కాబట్టి మనము మన పాపకార్యాలు దేవుని నుండి మనలను దూరం చేస్తున్నాయని గ్రహించి భయమునొంది పాపమును విడిచిపెడదాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*344వ భాగము*

*యెషయా గారి ప్రార్ధన-4*

యెషయా గ్రంథము 64:7--9

7. నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

8. యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

9. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 64వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! యెషయా గారి ప్రార్థనను ధ్యానం చేస్తున్నాము!!

(గతభాగం తరువాయి)

ఇక ఏడవ వచనం నుండి చూసుకుంటే నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొను వాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు అంటున్నారు.

చూడండి ఏమంటున్నారో నీ ముఖాన్ని మాకు కనబడకుండా దాచుకొన్నావు. మా అపరాధాల క్రింద మేము నీరసించేలా చేశావు, గనుక ఎవరూ నీ పేర ప్రార్థన చేయడం లేదు, నీమీద ఆధారపడడానికి తమను పురికొలుపుకోవడం లేదు అంటున్నారు.

దేవా నీవు నీ ముఖము దాచుకున్నావు అంటున్నారు. దేవుడు ఏఏ పరిస్తితులలో తన ముఖము దాచుకుంటాను అంటున్నారు?!

మనము ఆయన మాట విననప్పుడు, ఆయన పిలిచినప్పుడు మనము ఆయన చెంతకు రానప్పుడు!!!

సామెతలు 1:24

నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

సామెతలు 1:25

నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

సామెతలు 1:26

కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

సామెతలు 1:27

భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

ఇంకా యెషయా గ్రంథం లో అంటున్నారు 59:1,2,3

1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను

2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

3. మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.

కాబట్టి ఈరెండు విషయాలలో మనము సరిచేసుకుంటే ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తారు.

మనుషులు తమ అనేక దేవుళ్ళకు ప్రార్థన చేస్తారు. కానీ స్వభావ సిద్ధంగా ఎవరూ నిజ దేవుని పేరట ప్రార్థించరు. ఒకవేళ మనం ఆయన్ను వేడుకుంటున్నామంటే అలా చెయ్యాలని ఆయన మనలను పురిగొల్పినందువలననే అని గ్రహించాలి.

ఇంకా ఇదే వచనంలో మా దోషముల చేత మమ్మల్ని కరిగించేశావు అంటున్నారు భక్తుడు! ఇక్కడ యెషయా గారు ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇందులోని సత్యం మనందరికీ వర్తిస్తుంది. మనం పాపం చేస్తాం. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు. మనం నీరసించిపోయి ప్రార్థించడం మానుకుంటాం. అయితే అలా మానుకోవడం తప్పు. ఇలా చెయ్యడం వల్ల మరింత పాపానికి దిగజారతాం.

ఇక తరువాత వచనంలో మహత్తరమైన మాటలు ప్రార్దిస్తున్నారు- యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

అవును కదా మనమంతా ఆయన చేతిపని! ఆయన పరమ కుమ్మరి!

ఈ 8-12 వచనాలలో గల ఈ ప్రార్థనను దేవుడు తప్పకుండా వినవలసిన కారణాల జాబితా ఇది.

యెషయా 63:16

మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నెరుగక పోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా, నీవే మాతండ్రివి అనాదికాలమునుండి మా విమోచకుడని నీకు పేరే గదా.

ఇక్కడ వారి స్థితిగతుల గురించి ఎక్కువ శ్రద్ధ చూపేవానికే ఈ ప్రార్థన చేస్తున్నారు భక్తుడు!

ఆయన మన కుమ్మరి! యెషయా 29:16

అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చిఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

యెషయా 45:9

మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?

Jeremiah(యిర్మీయా) 18:1,2,3,4,5,6

1. యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2. నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.

3.​ నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.

4. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను.

5. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

6. ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కుజిగటమన్ను కుమ్మరిచేతిలొ ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.

ఇలాంటి వివేకవంతుడు, నిపుణుడు అయిన కుమ్మరి అయిన దేవుడు, వారికోసం పని చేస్తూ ఉన్నందువల్ల ఆ జాతికి ఇంకా నిరీక్షణ ఉంది. వారికే కాదు మనకు కూడా అదే నిరీక్షణ ఉంది!!

ఎఫెసీయులకు 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

అందుకే 9వ వచనంలో బ్రతిమిలాడుతున్నాడు భక్తుడు దేవున్ని: యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

గమనించాలి ఈ విన్నపాలు/ ప్రార్ధనలు దేవుడు చెప్పిన దానిపై ఆధారపడి చేసినవే. మన ప్రార్థనలకు కూడా జవాబు రావాలంటే మన విన్నపాలు కూడా ఇలానే ఉండాలి.

Isaiah(యెషయా గ్రంథము) 54:7,8

7. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను

8. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

చూడండి గత అధ్యాయాలలో దేవుడు వాగ్ధానం చేశారు కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నారు భక్తుడు! ఇదీ మనము అనుసరించాల్సిన పద్దతి!!!

ఇంకా మా అపరాధాలను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకోవద్దు అంటున్నారు!

Isaiah(యెషయా గ్రంథము) 40:1,2

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 43:25

నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.

ఇది కూడా ఆయన సెలవిచ్చిన మాట! దీనిని కూడా ఎత్తిచూపు తున్నారు!

ఇంకా చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా. అంటున్నారు!

ఇది దేవునితో తమకు గల ఒడంబడిక బంధాన్ని ఆయనకు గుర్తుచేయడం!

ఆదికాండము 17:7

నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

Leviticus(లేవీయకాండము) 26:40,41,42,43,44,45,46

40.​ వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41.​​ నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

42.​ నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

43.​ వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించు కొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు.

44.​ అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

45. నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

46. యెహోవా మోషేద్వారా సీనాయికొండ మీద తన కును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

కాబట్టి మనము కూడా ఆయన వాగ్ధానాలు గుర్తు చేస్తూ ప్రార్ధించి పొందుకుందాం!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*345వ భాగము*

*యెషయా గారి ప్రార్ధన-5*

యెషయా గ్రంథము 64:10--12

10. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

12. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 64వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! యెషయా గారి ప్రార్థనను ధ్యానం చేస్తున్నాము!!

(గతభాగం తరువాయి)

ఇక 10వ వచనంలో నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను అంటున్నారు!

ఈ వచనాలలో కూడా భవిష్యత్తులో జరుగబోయేది ఆత్మద్వారా గ్రహించి రాస్తున్నారు, కారణం ఈ అధ్యాయం ప్రవచించబోయే సరికి యెరూషలేము ఎంతో ఉన్నతమైన స్తితిలో ఉంది! సుందరంగా ఉంది. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. కొన్ని దశాబ్దాల తరువాత జరుగబోయేది ప్రవచించారు!

నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

ఇక్కడ నీ పరిశుద్ద పట్టణాలు అనడం చూడండి. ఇది దేవుణ్ణి ఆయన స్వజనం వైపు మాత్రమే కాక స్వంత ఆస్తివైపు కూడా శ్రద్ధతో ఒకసారి చూడాలని విన్నవించడం (వ 8,9). ఇక్కడ సీయోను, జెరుసలం జంట నగరాల్లాగా ఉన్నాయి.

తరువాత వచనంలో అంటున్నారు మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

యెషయా భక్తుడు భవిష్యత్తులోకి దృష్టి సారించి అంతవరకు జరగని సంగతులను కూడా జరిగిపోయినట్టే వర్ణిస్తున్నాడు. ఆలయం మరో 100 సంవత్సరాల వరకు నాశనం కాలేదు. దాని స్థానంలో నిర్మితమైన ఆలయం ఆ పైన ఇంకా కొన్ని వందల సంవత్సరాలు నిలిచి ఉంది.

యెషయా 53:1

మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?

యెషయా 53:2

లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

ఈ భాగమైతే 700 సంవత్సరాల తరువాత జరిగింది. 700 సంవత్సరాల క్రితమే యెహోవా భాహువు యెషయా గారికి బయలుపరచ బడింది.

Isaiah(యెషయా గ్రంథము) 55:10,11

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

ఈ విధంగా ఆయన బయలుపరచిన వాక్యము భూమికి చేరి ఫలించి ఆయన సంకల్పమును నెరవేర్చుతున్నాయి అన్నమాట!!!

ఇక చివరి వచనంలో యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?అంటున్నారు!

భవిష్యత్తులో జరుగబోయేది ఆత్మ బయలుపర్చిన తరువాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు దేవా ఈ శ్రమలు చాలు! దయచేసి కరుణించు! ఇక ఈ శ్రమలు చాలు అంటూ మొర్రపెడుతున్నారు!

Isaiah(యెషయా గ్రంథము) 62:1,6,7

1. సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.

6. యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.

7. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు

భక్తులు కూడా ఇలాగే మొర్రపెట్టారు

ఎజ్రా 9:13

అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

ఎజ్రా 9:14

ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనిన యెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండు నట్లును, నీవు కోపపడుదువు గదా.

ఎజ్రా 9:15

యెహోవా ఇశ్రా యేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

కీర్తనలు 103:10

మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

దానియేలు 9:8

​ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా యధిపతులకును మా పితరులకును ముఖము చిన్న బోవునట్లుగా సిగ్గే తగియున్నది.

దానియేలు 9:9

​మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి; అయితే ఆయన కృపాక్షమాపణలుగల దేవుడైయున్నాడు.

దానియేలు 9:18

నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

దానియేలు 9:19

ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.

భక్తులు ఈవిధంగా ప్రార్థన చేసి దేవుని ఉగ్రతను మరలుగొల్ప గలిగారు. ఈరోజు మన దేశం మరింత ధౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. మరి నీవు నేను ఆ భక్తులు ప్రార్ధించినట్లు ప్రార్థన చేస్తున్నామా?! కన్నీటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ఉందా మన జీవితాలలో!

సరిచేసుకుందాం!

సరిదిద్దుకుందాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*346వ భాగము*

యెషయా గ్రంథము 65:1--2

1. నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

2. తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 64వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇంకా యెషయా గారి ప్రార్థనను ధ్యానం చేసుకున్నాము!! ఇక 65వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

మొదటి వచనంలో నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను అంటున్నారు!

ప్రియులారా! ఈ అధ్యాయం యెషయా గారు చేసిన ప్రార్థనకు జవాబు అనగా 1-2 వచనాలలో చెప్పింది యెషయా 63:15—64:12 లోని ప్రార్థనకు జవాబుగా దేవుని మాటలు ఇక్కడ ఆరంభమౌతున్నాయి. ఈ రెండు వచనాలను పౌలుగారు రోమా 10:20-21 లో ఎత్తి రాశారు. ఇస్రాయేల్‌వారి దేవుణ్ణి ఎరుగని ఇతర జనాల గురించి దేవుడు 1వ వచనంలో మాట్లాడుతున్నారు. తన కృప చొప్పున ఆయన వారి వైపుకు తిరుగుతారు. నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను అంటున్నారు!

దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన పేరు ఎరుగని వారు అన్యజనుల మైన మనమే! ఇశ్రాయేలు వారు దేవుని కృపను నిరాకరించారు కాబట్టి అనాదికాలమందే దేవుడు అన్యజనుల నుండి తనకొరకు ప్రజలను ఏర్పాటు చేసుకోడానికి, ధర్మశాస్త్రం కాకుండా మరో నూతన నిబంధన చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆయనను మనము వెదకక పోయినా ఆయనే ఈ లోకమునకు వచ్చి, పాపములకు తానే ప్రాయశ్చిత్తం చేసి, ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నాయొద్దకు రండి అని పిలిచి, తన పరిశుద్ధ సంఘములో చేర్చి తనకు రాజులైన యాజక సమూహముగా చేసుకున్నారు. ఇక్కడ ఇన్ డైరెక్ట్ జవాబు దేవుని నుండి ఇశ్రాయేలు ప్రజలు నా ప్రణాళికను త్రోసివేస్తున్నారు కాబట్టి నా నామమెరుగని వారిని నాకు ప్రజలుగా చేసుకుని, వారు తండ్రి అని పిలువగా నేనున్నాను నా కుమారుడా అంటాను అని చెబుతున్నారు!!!

మరి అటువంటి మహత్తరమైన పిలుపుని అందుకుని సార్వత్రిక సంఘములో చేరిన ప్రియ సహోదరి సహోదరుడా! పిలుపుకి తగిన జీవితం జీవిస్తున్నావా!? క్రీస్తుతో అంటుకట్టబడిన నీవు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావా! సంఘముతో కలిసి ఉంటున్నావా! ఆయనకు వేరుగా ఉంటే నరకబడతావు అంటున్నారు!

యోహాను 15:1

నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

యోహాను 15:2

నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

యోహాను 15:4

నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

యోహాను 15:5

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

యోహాను 15:6

ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.

యోహాను 15:7

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.

Romans(రోమీయులకు) 11:17,18,19,20,21,22,23,24,25

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

ఇక రెండవ వచనంలో అంటున్నారు తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.

ఇదీ తండ్రి మనస్సు! నిజానికి లోబడనొల్లని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు! వారు పశ్చాత్తాపంతో తిరిగి తన వద్దకు వస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు!

అలాగే మనయెడల కూడా కృప చూపుతూ శాశ్వతమైన ప్రేమతో దీర్ఘ శాంతం తో ఎదురు చూస్తున్నారు!

ప్రియులారా 2-16 వచనాలలో తాను ఇజ్రాయేల్ విషయం ఏం చేస్తారో దేవుడిక్కడ తెలియజేస్తున్నారు. అయితే వారి గుణాలను, వారి ప్రవర్తనను వర్ణించడంతో మొదలుపెట్టారు.

మొదటగా వారు మూర్ఖులు అంటున్నారు:

Isaiah(యెషయా గ్రంథము) 1:2,3,4

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

Isaiah(యెషయా గ్రంథము) 30:1,9

1. యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

9. వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

రెండు: వారు తమ సొంత ఆలోచనల చొప్పున నడుస్తారు గాని దేవుని మార్గములో నడవరు:

యెషయా 59:7

వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి

ఆదికాండము 6:5

నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

ఆదికాండము 6:6

తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

గమనించాలి ఎవరైనా తమ సొంత ఆలోచనల చొప్పున నడుచుకుంటే అది తప్పక చెడు మార్గమే.

సామెతలు 14:12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

ప్రియులారా మనము కూడా మన స్వంత ఆలోచనల చొప్పున నిర్ణయం తీసుకుంటే మనము కూడా వర్ధిల్లము. గాని ప్రతీ విషయంలో దేవుని చిత్తము తెలుసుకుని మన అడుగులు వేస్తే మన గమ్యానికి చేరుకుంటాము!

సామెతలు 3:6

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

సామెతలు 3:7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము

సామెతలు 3:8

అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

దైవాశీస్సులు!!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*347వ భాగము*

యెషయా గ్రంథము 65:3--7

3. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు.

4. వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి

5. వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

6. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను.

7. నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే 16వ వచనం వరకూ దేవుడు యెషయా గారి ప్రార్థనకు జవాబిస్తున్నారు. వారు ఎంతటి ఘోరపాపాలు చేసి దేవుని కోపాన్ని రేపారో! నిజానికి వీటికోసం మనం గత భాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకు పోదాం!!!

మూడవ వచనంలో వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు.

ఇది వారు చేసిన విగ్రహారాధన కోసం చెబుతున్నారు దేవుడు! మనుషులు చేసే పనులన్నిటిలోకీ విగ్రహారాధన దేవుని కోపాన్ని అత్యధికంగా రేపుతుంది. లేవీ 26:30; ద్వితీ 4:25; న్యాయాధి 2:12-13 దయచేసి చదవండి. కాబట్టి వారు చేసిన విగ్రహారాధన నాకు ఎప్పుడూ కళ్లముందు కనిపిస్తూనే ఉంది కాబట్టి ఈ తీర్పు తీర్చాను అంటున్నారు!

తరువాత వచనంలో వారు నేర్చిన చెడుపు చిల్లంగి, దయ్యాలతో స్నేహం అనగా కర్ణపిశాచాలతో స్నేహం లాంటివి కనిపిస్తుంది.

వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి

సమాధులలో కూర్చోవడం అనగా సమాధులలో కూర్చొని దయ్యాలను పిలిచి

యెషయా 8:19; 57:9; ద్వితీ 18:11 కూడా చదవండి.

ఇక ఈ వచనంలో పందిమాంసం తినుచుందురు అంటున్నారు. గత శీర్షికలలో చెప్పడం జరిగింది. విశ్వాసులు పందిమాంసం తినడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి విశ్వాసులు ఏవిధమైన పందిమాంసం కూడా తినకూడదు. అది బజారు పంది కాని, మనుష్యులు పెంచుకునే ఊరపంది గాని, అడవి పంది గాని ఏవీ కూడా తినకూడదు!

ఎందుకంటే 1) లేవీ 11:7--8 ప్రకారం అది అపవిత్రమైనది.

2) యేసుక్రీస్తు ప్రభులవారు నాశనకరమైన హేయవస్తువు కోసం జెరూసలేం దేవాలయం లో బలిపీఠం మీద అర్పించబడుతుంది అన్నారు మత్తయి 24:15లో. క్రీస్తుపూర్వం లో అంతియొకస్ ఎఫిపానిస్ అనేవాడు ఒకసారి దేవాలయమును పాడుచేసి పందిని బలిపీఠం మీద అర్పించాడు. గాని మరలా యేసుక్రీస్తు ప్రభులవారు మరోసారి అర్పించబడుతుంది అంటున్నారు కాబట్టి మరోసారి క్రీస్తు విరోధి వాడి అనుచరులు పందిని దేవాలయం లో అర్పించి, అనుదిన బలియర్పణలు జరుగకుండా ఆపుతారు. కాబట్టి పంది నాశనకరమైన హేయవస్తువు కావచ్చు! అందుకే తినకూడదు!

3) ఈ వచనంలోనే కాకుండా తర్వాత అధ్యాయం లో రెండు సార్లు పందికోసం వ్రాయబడింది

యెషయా 66:3

ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

యెషయా 66:17

తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.

ఇక తరువాత వచనంలో వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

చూడండి ఇంతటి ఘోరమైన స్తితిలో ఉన్నాగాని మేము పరిశుద్ధులము. మాకు మీరు దూరంగా ఉండండి అంటున్నారు. ఈ తిరుగుబాటుదారులు, విగ్రహారాధకులు, మాంత్రికులు, నిషిద్ధ పదార్థాలను తినేవారు తాము ఇతరులకంటే చాలా నీతిమంతులం, పవిత్రులం అని భావించుకొంటున్నారు. కానీ వారు తమను తాము నీతిపరులుగా ఎంచుకునే కపట భక్తులు. ఇదే పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభులవారి కాలంలో కూడా జరిగాయి. పరిసయ్యులు ఇలాగే అన్నారు. దయచేసి మత్తయి 9:11; లూకా 7:39; 18:9-12 చూడండి.

ఇక ఆరవ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెదుట గ్రంథములో అది వ్రాయబడి యున్నది ప్రతికారముచేయక నేను మౌనముగా నుండను నిశ్చయముగా వారనుభవించునట్లు నేను వారికి ప్రతి కారము చేసెదను.

దీనికోసం కూడా గతంలో ధ్యానం చేసుకున్నాము. నేను ఊరుకోను ప్రతీకారం తీర్చుకుంటాను అంటున్నారు దేవుడు – యెషయా 42:14; 57:11; కీర్తన 50:21; హబక్కూకు 1:13 చూడండి.

అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే వారు చేసిన ప్రతీపాపము, మనము చేస్తున్న ప్రతీపాపము పుణ్యకార్యాలు కూడా దేవుని సన్నిధిలో గ్రంథంలో లిఖించబడుతున్నాయి.

యిర్మియా 17:2

యూదా పాపము ఇనుపగంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయ ములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది.

మలాకీ 3:16

అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

ప్రకటన గ్రంథం 20:12

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

ప్రకటన గ్రంథం 20:13

సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

అపో.కార్యములు 10:4

అతడు దూతవైపు తేరి చూచి భయపడిప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

ఇక తరువాత వచనంలో నిశ్చయముగా మీ దోషములనుబట్టియు మీ పితరుల దోషములనుబట్టియు అనగా పర్వతములమీద ఈ జనులు ధూపమువేసిన దానినిబట్టియు కొండలమీద నన్ను దూషించినదానినిబట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారము కొలిచి పోయుదును అని దేవుడు చెబుతున్నారు!

ఇక్కడ పర్వతాలు అనగా ఎత్తయిన స్థలాల్లో వారి పుణ్య స్థలాలు ఉన్నాయి. వాటిమీద తీర్పు తీర్చుతాను అంటున్నారు. ఈ ప్రజలు పర్వతాల మీద ధూపం వేసినందుచేత, కొండలమీద నన్ను దూషణకు గురి చేసినందుచేత, మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను” అని యెహోవా అంటున్నారు.

కాబట్టి మనము కూడా దేవుడు చూస్తున్నారు ఆయన గ్రంధములో మనకార్యములు వ్రాయబడుతున్నాయి అని గమనించి జాగ్రత్తగా నడుచుకుందాం!

ప్రసంగి 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

ప్రసంగి 11:10

లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*348వ భాగము*

యెషయా గ్రంథము 65:8--16

8. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులుఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లు వారినిబట్టి నేనాలాగే చేసెదను.

9. యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.

10. నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱెల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.

11. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు

12. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు.

13. కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె దరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

14. నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

15. నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.

16. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! ఈ వచనాలు భావము కూడా గత అధ్యాయాలలో ధ్యానం చేసినవే కాబట్టి క్లుప్తంగా చూసుకుందాం!

ఎనిమిదవ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్షగెలలో క్రొత్తరసము కనబడునప్పుడు జనులుఇది దీవెనకరమైనది దాని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా? నా సేవకులనందరిని నేను నశింపజేయకుండునట్లు వారినిబట్టి నేనాలాగే చేసెదను

గమనించాలి ఈ 8-10 వచనాలలో దేవుడు ఇశ్రాయేలు జాతిని సమూలంగా నాశనం చెయ్యను. తనను వెదికే ప్రజలను కొందరిని మిగుల్చుకుంటాను అంటున్నారు!

దయచేసి యెషయా 1:9; 10:20-21, 22; 11:11, 16; 46:3 చూడండి!

ఇక తరువాత వచనాలలో యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.

10. నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱెల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.

యాకోబు (9వ వచనం) అంటే బహుశా అష్షూరు చెరలోకి వెళ్ళిపోయిన ఉత్తర రాజ్యానికి అనగా పదిగోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు సూచన.

ఇక నా పర్వతాలు– అంటే ఇజ్రాయేల్ దేశమంతా అని అర్థం. దేవుడు దాన్ని ఇజ్రాయేల్ వారికి శాశ్వతంగా ఇస్తానని వాగ్దానం చేశారు (ఆది 17:8; మొ।।).

షారోను అనేది (వ 10) మధ్యధరా సముద్ర తీరాన ఉంది.

ఆకోరు లోయ యొర్దాను నది వైపుగా ఉంది. ఆ దేశాన్ని స్వాధీనపరచుకునేవారు దేవుణ్ణి వెతికేవారే అని గ్రహించాలి.

యెషయా 51:1

నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి

Jeremiah(యిర్మీయా) 29:12,13,14

12.​ మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

13.​​ మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,

14.​ నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.

ఇక తరువాత వచనంలో యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు

12. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు అంటున్నారు!

ఇక 11-16 వచనాలలో ఇస్రాయేల్‌లో గాని (మరి ఏ జాతిలో గాని) దేవుణ్ణి వెదికేవారికే ఆనందకరమైన భవిష్యత్తు ఉంటుంది. దుర్మార్గులు, తిరగబడేవారు తమకు అందులో ఏదన్నా భాగం ఉంటుందేమోనని ఆశించకూడదు అని భావము కనిపిస్తుంది!

ఇక “గాదు” మరియు “ అదృష్టదేవత లేక మనీ” అని పిలువబడే ఈ హీబ్రూ పదాలు భాగ్య దేవత, అదృష్ట దేవత అనబడే దేవతలను సూచిస్తూ ఉన్నాయి. కొందరు యూదులు యెహోవా ఆరాధనతో ఈ దేవతల ఆరాధన కలిపి చెయ్యవచ్చని అనుకొన్నారు.

మత్తయి 6:24

“ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు. లేదా, ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవునికీ సిరికీ సేవ చేయలేరు.

అయితే 12వ వచనంలో దేవుడు అంటున్నారు నేను ఖడ్గాన్ని మీకు అదృష్టంగా నియమిస్తాను. మీరంతా సంహారానికి లోనవుతారు.

కారణం కూడా చెబుతున్నారు ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు జవాబియ్యలేదు, నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు.

నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు, నాకు ఇష్టం కానివాటిని కోరుకొన్నారు.

దయచేసి యెషయా 41:28; 50:2; సామెత 1:24-32; యిర్మీయా 7:27 చూడండి!

తరువాత వచనాలలో అంటున్నారు 13. కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనె దరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

14. నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

13-14 వచనాలలో న్యాయవంతులకు న్యాయ సమ్మతంగా కలగబోయే వాటికి కేవలం వ్యతిరేకమైనవే దుర్మార్గులకు కలుగుతాయి. ఇది న్యాయ సమ్మతమే దేవుని దృష్టిలో!!!

అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇదిగో వినండి! నా సేవకులు భోజనం చేస్తారు గాని, మీరు ఆకలిగొంటారు. నా సేవకులు పానం చేస్తారు గాని, మీరు దప్పిగొంటారు. నా సేవకులు ఆనందిస్తారు గాని, మీరు సిగ్గుపాలవుతారు. నా సేవకులు ఆనందమయమైన హృదయాలతో పాటలు పాడుతారు గాని, మీరు హృదయవేదనతో ఏడుస్తారు. మనోదుఃఖంతో రోదనం చేస్తారు అంటున్నారు!

ఇక తరువాత వచనంలో నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.

ఇక్కడ మీ పేరు అనగా దేవుడు జెరూసలేం నగరానికి పరిశుద్ధ పట్టణం, యెహోవా పట్టణం, సీయోను లాంటి పేర్లు పెట్టారు కదా, వాటిని మీరు పాడు చేస్తారు అని అర్థం!!! యెషయా 1:26; 60:14; 62:2, 4, 12; ప్రకటన 2:17 చూడండి.

ఇక 16వ వచనంలో అంటున్నారు దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరు వాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలెనని కోరుకొనును దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును.

ఇస్రాయేల్‌కు ఎట్టకేలకు తన పూర్వ క్షేమస్థితి తిరిగి కలిగిన తరువాత (ఆమోసు 9:15) అక్కడి వారెవ్వరూ బయలు దేవత వంటి ఏ అబద్ధ దేవుడి పేరునా ఒట్టు వెయ్యరు –

యిర్మియా 12:16

​బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన యెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు.

ఆమోసు 9:14

మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.

ఆమోసు 9:15

వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఇదీ అంత్యకాలంలో ఇశ్రాయేలు దేశమునకు కలుగబోయే స్థితిగతులు!!!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*349వ భాగము*

*క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము-2*

యెషయా గ్రంథము 65:17--25

17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

18. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.

19. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము కోసం ధ్యానం చేసుకుంటున్నాము!!!

(గతభాగం తరువాయి)

ప్రకటన 21:1—4

1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

ఇంతకీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎందుకు?

పాత భూమి పాత ఆకాశము నశించిపోయాయి కాబట్టి!

1. భూమి మరియు ఆకాశం పారిపోయింది కదా! ...

ప్రకటన గ్రంథం 20: 11

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

2. ఆకాశములు కాలిపోయాయి. పంచభూతములు లయమై పోయాయి, భూమిమీద ఉన్నవి అన్నియు కాలిపోయాయి 2పేతురు ౩:10—11 ప్రకారం!

అందుకే ఇప్పుడు దేవుడు మరో ఆకాశము మరో భూమిని సృష్టిస్తున్నారు .

మరి ఇప్పుడు మరో అనుమానం రావచ్చు—మరి వెయ్యేండ్ల పాలనలో ఉన్న మనము అనగా పరిశుద్దులు ఎలా ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీదికి వెళ్తారు లేక రవాణా చేయబడతారు?

అయ్యా! మనకు మేఘములను వాహనములుగా చేశారు దేవుడు! అప్పుడు ప్రజలందరూ మహిమ గలవారై ఉంటారు. కాబట్టి బహుశా మేఘముల మీద రవాణా చేయబడతారు ఈ భూమి కాలిపోక ముందు! లేదా దేవుడు మరో రవాణా సౌకర్యంచున్నామ చేయవచ్చు!

సరే, పరిశుద్ధ గ్రంధములో మూడు పర్యాయములు భూమి, ఆకాశములను సృష్టించబడినట్లుగా చూడగలము.

🔹 *మొదటి సృష్టి:*

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. (ఆది. కా. 1:1) ఇది మొదటి సృష్టి. లూసిఫర్ పడద్రోయబడిన తర్వాత ఈ సృష్టి నాశనమై నిరాకారముగా మారింది. అనగా పనికిరాకుండా పోయింది అని అర్ధం.

🔹 *రెండవ సృష్టి:*

ఆరు దినములలో రెండవ సృష్టిని చేసిన దేవుడు, ఏడవదినాన్న విశ్రమించెను. (ఆది. కా. 2:2) ఇప్పుడు ఆ రెండవ సృష్టిలోనే మనము జీవిస్తున్నాము. త్వరలో ఈ భూమి, ఆకాశములు కూడా గతించిపోనున్నాయి.

🔹 *మూడవ సృష్టి:*

మూడవ సృష్టియైన నూతన భూమి, నూతన ఆకాశం కొరకు మనము ఎదురుచూచుచున్నాము.

మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును. (2 పేతురు 3:13)

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

యెషయా 65:17

నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

యెషయా 66:22

🌏 *నూతనమైన భూమిని గురించి రెండు అభిప్రాయములు కలవు:*

🔻 *మొదటి అభిప్రాయం:*

వెయ్యేండ్ల పాలన అనంతరం భూమి అగ్నివలన కాలిపోయి, శుద్ధీకరణం పొంది, నూతన భూమి ఆవిర్భవించును. అయితే, తాను భూమిని నిత్యముగా స్థాపించెను.

(కీర్తనలు 78:69). గనుక, భూలోకం నాశనం పొందదు. అది కాలి, కాలి, నూతన భూమిగా రూపాంతరం చెందుతుంది. అనేది కొందరి అభిప్రాయం.

🔻 *రెండవ అభిప్రాయం:*

ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.

కీర్తనలు 102:25,26

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.

ప్రకటన 21:1

దీనిని బట్టి, భూమిగా నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందనేది మరికొందరి అభిప్రాయము.

👉Note: *ఈ పాపభూయిష్టమైన భూమి నశించిపోయి, నూతన భూమి ఏర్పడుతుందని అందరూ అంగీకరిస్తారు.*

అయితే మరొక అభిప్రాయం కూడా ఉంది: వెయ్యేండ్ల పాలన నూతన ఆకాశము నూతన భూమిమీదనే జరుగుతుంది గాని ఈ పాప భూమిమీద జరుగదు అంతేకాకుండా అణుబాంబులు వలన కలిగే రేడియేషన్ వలన భూమి నివాసయోగ్యముగా ఉండదు. అందుకే వెయ్యేండ్ల పాలన క్రొత్త భూమి క్రొత్త భూమిపై జరుగుతుంది. గాని బైబిల్ ప్రకారం క్రొత్త భూమి క్రొత్త ఆకాశము గోగుమాగోగు యుద్ధం తర్వాత భూమి ఆకాశం కాలిపోయిన తర్వాతనే క్రొత్త భూమి క్రొత్త ఆకాశము వస్తున్నట్లు చూడగలం! గతభాగం లో దీనికోసం ధ్యానం చేసుకున్నాము!

🌏 *నూతన భూమి, ఆకాశము యొక్క ప్రత్యేకతలు:*

▪సముద్రము ఉండదు.

▪నూతన యెరూషలేము పట్టణము పరలోకమునుండి నూతన భూమి మీదికి దిగివస్తుంది.

▪నూతన భూమి మీద మనుష్యులు, దేవునితో ప్రత్యక్ష సహవాసం కలిగి నివసిస్తారు.

▪దేవుడు తన ప్రజల కన్నులనుండి ప్రతీ భాష్ప బిందువును తుడిచివేస్తాడు.

▪పాపం లేదు

▪మరణం లేదు

▪దుఃఖం లేదు

▪ఏడ్పు లేదు

▪వేదన లేదు

▪సూర్యుడు లేడు.

▪చంద్రుడు లేడు

▪రాత్రి లేదు

ఇట్లా అనేకమైన ప్రత్యేకతలు కలిగివుంటాయి. ఇది ప్రభువు నిత్యత్వం. ఇక దీనికి అంతములేదు.

ఈ నిత్యత్వంలో నీవుండాలంటే? ఈ లోకంలో నీవు జీవించిన జీవితమే ప్రమాణం. అట్లా అని, నీ సత్క్రియలు నిన్ను ప్రభువు నిత్యత్వంలో చేర్చలేవుగాని, రక్షించబడి, కొనసాగింపుగా సత్క్రియలు చేస్తూ, ఆ నిత్యరాజ్యం కొరకు సిద్ధపడాలి.

మరి నీవు సిద్ధమా?

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*350వ భాగము*

*క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము-3*

యెషయా గ్రంథము 65:17--25

17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

18. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.

19. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రకటన 21:1—4

1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

ఇక రెండవ వచనంలో నూతనమైన యేరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలే పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట చూచితిని! అప్పుడు దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది అంటున్నారు!

కొంతమంది నూతన యెరూషలేము అనేది భూమిమీదికి రాదు అంటున్నారు! ఇక్కడైతే స్పష్టంగా పరలోకం నుండి దిగింది అనగా పరలోకం నుండి క్రొత్త భూమి మీదికి దిగింది.

క్రొత్త భూమి మీద ఎవరున్నారు?

పరిశుద్ధులు! అనగా ఎత్తబడిన వారు, మహాశ్రమల పునరుత్తానులు, మృతులైన పరిశుద్ధులు, రక్షించబడిన ఇశ్రాయేలు జనాంగము,

అయితే ఈవిషయంలో కొందరు భిన్నమైన భోదలు చేస్తున్నారు. క్రొత్త భూమిపైన నూతన నిబంధన విశ్వాసులు! నూతన ఆకాశము మీద పాత నిబంధన విశ్వాసులు! వారందరికీ పైగా 144౦౦౦ మంది నూతన నిబంధన పరిశుద్దులు అనబడే సీయోను పర్వతం మీద నున్న పరిశుద్దులు ఉంటారు అంటారు! మరి వీరు చెప్పిన వాటికి స్థిరమైన వాక్య రిఫరెన్సులు కనబడటం లేదు!

దీనికోసం మనం అంతగా ఆలోచించవలసిన పనిలేదు! ఇలాంటి వివాదాస్పదమైన విషయాలలో దయచేసి తలదూర్చవద్దు! మనకు కావలసింది నిత్యత్వములో చోటు! క్రొత్త ఆకాశములో ఉంటే ఏమిటి? క్రొత్త భూమి మీద ఉంటే ఏమిటి? క్రీస్తుతోపాటుగా ఆ శ్రేష్ఠుల సంఘములో పరిశుద్దుల సమూహములో ఉంటే చాలు! నాకైతే ఆ నిత్యత్వములో ఆ గేట్ ప్రక్కన చిన్న చోటు ఇస్తే చాలు!!!

సరే, ఇక్కడ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలే పరలోకం నుండి దేవుని యొద్ద నుండి క్రిందికి దిగింది!

పాత యెరూషలేము, పరలోక యెరూషలేము యొక్క ఛాయయై(నీడ) యున్నది. నీడ వున్నది అంటే? తప్పక అసలైనది వున్నది అనే విషయం సుస్పష్టం. పాత యెరూషలేము పలుమార్లు ధ్వంసం చేయబడి, కట్టబడింది. అయితే, నూతన యెరూషలేము ఎప్పటికీ నశించదు. ప్రభువే ఆ పట్టణాన్ని సిద్ధపరచును.

ప్రభువు మనకోసం సిద్ధపరచుటకు వెళ్ళియున్న పట్టణమే, “నూతన యెరూషలేము”.

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

యోహాను 14:2

ఈ పట్టణం పరలోకమందు సిద్ధపరచి, నూతన భూమి మీదకు తీసుకు వచ్చెను.

ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.

ఆమోసు 9:6

పరలోకమందు అనేక నివాసములున్ననూ, తన పెండ్లికుమార్తె కొరకు ప్రత్యేకముగా కట్టుచున్నారు. ఆ సుందరమైన పట్టణ నిర్మాణము గత రెండువేల సంవత్సరాలనుండి జరుగుతూనే వుంది. త్వరలో పూర్తికాబోతుంది. ఒక మనిషి కట్టిన కట్టడాన్ని చూడ్డానికే రెండు కళ్ళూ చాలట్లేదు. ఇక, నిర్మాణకుడు దేవుడే అయితే, ఆ సుందర పట్టణాన్ని ఊహించగలమా?

అందుకే అబ్రాహాముగారు కూడా, అత్యంత సుందరమైన ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురుచూస్తున్నారు.

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

హెబ్రీ 11:10

*నూతన యెరూషలేము ఏ రీతిగా వుండబోతోంది?*

🔺యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

🔺దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.

🔺ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను.ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి,

🔺ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

🔺తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి.

🔺ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

🔺 దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

Note:

750 కోసులు అనగా 1500మైళ్ళు. అనగా సుమారు 2500 కిలో మీటర్లు.

* పొడవు : 2500 కిలో మీటర్లు.

* వెడల్పు : 2500 కిలో మీటర్లు.

* ఎత్తు : 2500 కిలో మీటర్లు.

అయితే, మనము కట్టే భవనాల లెక్కల్లో చూస్తే? ఒక అంతస్థు 8 అడుగులు లేదా 2.5 మీటర్లు ఉంటుంది. అట్లా అయితే, ఒక కిలో మీటరు ఎత్తుకు 400 అంతస్తులు ఉండును. 2500 కిలో మీటర్ల ఎత్తుకు పదిలక్షల అంతస్థులుండును. (దేవుని లెక్కలు మనకు తెలియదుగాని, మనము కడితే, ఆ ఎత్తుకు పదిలక్షల అంతస్తులు వచ్చును. ఒక్కసారి ఊహించండి? ఆ నూతన యెరూషలేము ఎట్లా వుండబోతుందో? )

🔺ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను;

🔺పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

🔺ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.

* మొదటి పునాది సూర్యకాంతపురాయి,

* రెండవది నీలము,

* మూడవది యమునారాయి,

* నాలుగవది పచ్చ,

* అయిదవది వైడూర్యము,

* ఆరవది కెంపు,

* ఏడవది సువర్ణరత్నము,

* ఎనిమిదవది గోమేధికము,

* తొమ్మిదవది పుష్యరాగము,

* పదియవది సువర్ణల శునీయము,

* పదకొండవది పద్మరాగము,

* పండ్రెండవది సుగంధము

🔺దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు;

🔺ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది.

🔺పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

🔺దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

🔺ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము.

🔺అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. (ప్రకటన 21:10-25)

*ఈ నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారు?*

గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

ఆ నూతన యెరూషలేము, పరలోకంలో పెండ్లికుమార్తెవలే అలంకరింపబడి, నూతన ఆకాశాన్ని దాటి, నీవుండే నూతన భూమి మీదకు, నీ కోసం దిగిరాబోతుంది. అయితే, దానిలో నిత్య నివాసం చేసే ధన్యత, అట్లాంటి పరిశుద్ధ జీవితం మనకుందా? ఆ నూతన యెరూషలేములో నేనుండాలనే ఆశ నీకుంటే, నీవు నూతనముగా తిరిగి జన్మించి, నూతనంగా ప్రభువు కొరకు జీవించాలి. దానికి నీవు సిద్దమేనా? అయితే, నీవు తప్పక ఆ నిత్యరాజ్యంలో నీవుంటావు.

ఇంతవరకూ, అశాశ్వతమైన వాటిగురించి పోరాటం చేస్తూ, అక్షయమైన, శాశ్వతమైన ఆ నూతన యెరూషలేమును గురించిన తలంపుగాని, దానిలో నేనుండాలనే ఆశగాని, లేకుండా జీవిస్తున్నామేమో?

నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!

ఆమెన్!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*351వ భాగము*

*క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము-4*

యెషయా గ్రంథము 65:17--25

17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

18. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.

19. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! క్రొత్త ఆకాశము-క్రొత్త భూమి- నూతన యెరూషలేము కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

(గతభాగం తరువాయి)

ప్రకటన 21:18-20

18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,

20. అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

*నూతన యెరూషలేము యొక్క అలంకరణ:*

ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమి్మదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

నూతన యెరూషలేము పట్టణము, సంఘమునకు. సంఘమందున్న విశ్వాసుల సమూహమునకును సాదృశ్యము. అందుచే, నూతన యెరూషలేము అలంకరింపబడినట్లుగా, మన జీవితాలు అలంకరింపబడి యుండాలి.

*పట్టణ ప్రాకారము సూర్యకాంతి:*

సూర్య కాంతి “పరిశుద్ధతకు” సాదృశ్యం.

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; ( ప్రకటన 4:3) ఆయన సూర్యకాంతమును పోలినవాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుని తేజస్సు ఆ పట్టణములో ప్రతిబింబించు చున్నది.

*పట్టణము శుద్ధ సువర్ణము:*

బంగారము “దైవత్వమునకు” సాదృశ్యం. ఆయన శరీరధారిగా దిగివచ్చిన దైవ కుమారుడు. అందుకే, జ్ఞానులు బంగారాన్ని సమర్పించారు.

*పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను.*

* మొదటి పునాది సూర్యకాంతపురాయి,

* రెండవది నీలము,

* మూడవది యమునారాయి,

* నాలుగవది పచ్చ,

* అయిదవది వైడూర్యము,

* ఆరవది కెంపు,

* ఏడవది సువర్ణరత్నము,

* ఎనిమిదవది గోమేధికము,

* తొమ్మిదవది పుష్యరాగము,

* పదియవది సువర్ణల శునీయము,

* పదకొండవది పద్మరాగము,

* పండ్రెండవది సుగంధము

1. *సూర్యకాంతపురాయి:*

సూర్య కాంతి, మనము స్వచ్ఛతను, పరిశుద్దతను కలిగియుండాలని తెలియజేస్తుంది.

2. *నీలము:*

నీలము ఆకాశమునకు, పరలోకమునకు సాదృశ్యము. అనగా మనము పైనున్నవాటియందు లక్ష్యముంచి, పరలోక సంబంధులుగా జీవించగలగాలి. మనము లోకములో నున్నప్పటికీ, లోకం మనలో లేకుండా జాగ్రత్తపడాలి.

3. *యమునారాయి:*

ఇది బూడిద లేదా తెలుపురంగులో ఉంటుంది. వస్తువు కాలిపోయాక మిగిలేది బూడిద. మనము కూడా దేవుని వెలుగు బిడ్డలుగా కాలిపోవు జ్యోతులుగా ఉండాలి.

4. *పచ్చ:*

జీవము, సమాధానమునకు సాదృశ్యము. మనము సమాధానము కలిగి, మృతతుల్యమైన జీవితం కాకుండా, జీవము గలిగి, ప్రభువుకొరకు జీవించాలి.

5. *వైడూర్యము:*

ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు. మండు చున్న దీపము ఎరుపురంగు కలిగియుండును. మంట తీవ్రత ఎక్కువైనప్పుడు పైభాగమందు ఆకుపచ్చ రంగు కనిపించును. మనమునూ, వెలగడమే కాకుండా, ప్రభువుకొరకు ప్రజ్వలించాలి. ఆత్మలో తీవ్రత కలిగియుండాలి.

6. *కెంపు:*

ఎరుపు. యేసు క్రీస్తు రక్తమునకు, ఆయన శ్రమలకు సాదృశ్యము. ఆయన రక్తములో కడుగబడిన మనము, ఆయనకొరకు శ్రమలను అనుభవించడానికి కూడా సిద్దపడగలగాలి.

7. *సువర్ణరత్నము:*

దైవత్వము, విశ్వాసము, వాక్యమునకు సాదృశ్యము. విశ్వాసముతో, వాక్యమును ప్రేమిస్తూ, అనగా వాక్యానుసారమైన జీవితం జీవించగలగాలి.

8. *గోమేధికము:*

పచ్చ, నీలము కలసిన రంగు. పచ్చ జీవానికి, నీలము పరలోకసంబంధమైన వాటికి సాదృశ్యం. సజీవులముగా పరలోక పౌరసత్వం గలవారమని గుర్తెరిగి, పైనున్నవాటి యందే మనస్సుంచగలగాలి.

9. *పుష్యరాగము:*

పసుపు, ఆకుపచ్చ కలసిన రంగు.

పసుపు జ్ఞానమునకు, ఆకుపచ్చ జీవమునకు సాదృశ్యం. మనము సజీవులుగా జ్ఞానము కలిగియుండుటను సూచిస్తుంది.

10. *సువర్ణల శునీయము:*

తెల్లరాతిపై బంగారు చుక్కలు గలది. పరిశుద్ధత, దైవత్వం కలిగి జీవించుటకు తెలియజేస్తుంది.

11. *పద్మరాగము:*

ఊదా, నీలిరంగు మిశ్రమం.

ఊదారంగు రాజరికం, నీలిరంగు పరలోకసంబంధమైన జీవితంనకు సాదృశ్యం. మనము పరలోకసంబంధులముగాను, రాజులైన యాజకులముగా జీవించగలగాలి.

12. *సుగంధము:*

ఊదా, ఎరుపురంగుల మిశ్రమం.

ఊదా రంగు రాజరికమునకు, ఎరుపు క్రీస్తు శ్రమలకు సాదృశ్యం. మనము రాజులైన యాజక సమూహముగా, సిలువ శ్రమలను సహిస్తూ జీవించ గలగాలని నేర్చుకొందము.

*నూతన యెరూషలేములో నివసించేదెవరు?*

* గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తె.

(ప్రకటన 21:9)

* ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములు

(ప్రకటన 21:12)

* రక్షణ పొందిన అన్య జనులు

(ప్రకటన 21:24)

*నూతన యెరూషలేములో ప్రవేశములేనిదెవరికి?*

* పిరికివారును,

* అవిశ్వాసులును,

* అసహ్యులును,

* నరహంతకులును,

* వ్యభిచారులును,

* మాంత్రి కులును,

* విగ్రహారాధకులును,

* అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

ప్రకటన 21:8

1. *పిరికివారు*:

రక్షణ పొందిన తర్వాత, ఇతరులు గేళి చేస్తారేమోనని భయపడి, బహిరంగ సాక్ష్యులుగా వుండలేకపోవుట పిరికితనం.అయితే, పిరికితనమునుగల ఆత్మను దేవుడు మనకియ్యలేదు.

దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

2 తిమోతికి 1:7

2. *అవిశ్వాసులు*:

యేసు క్రీస్తును నమ్మని వారు.

ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

యోహాను 3:18

3. *అసహ్యులు*:

మనుష్యుల మధ్యలో గొప్పలు చెప్పుట, దేవుని సన్నిధిలో అసహ్యమైనది.

ఆయన మీరు మను ష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.

లూకా 16:15

దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.

తీతుకు 1:16

4. *నరహంతకులు*:

హత్య చేసేవారు!

తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.

1 యోహాను 3:15

5. *వ్యభిచారులు*:

అన్ని రకాలైన వ్యభిచారములు! పరస్త్రీతో పర పురుషులతో లైంగిక కార్యములు చేసేవారు! పెళ్ళి కాకుండా సెక్స్ చేసేవారు. లెస్బియన్ గేలు అందరూ!

జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

ప్రకటన 22:14,15

6. *మాంత్రికులు*:

మంత్రము చేయువారు.

తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

ద్వితీ 18:10-12

మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వ ములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.

ప్రకటన 9:21

7. *విగ్రహారాధికులు*:

దేవుని కంటే, శరీర క్రియలకు ప్రాధాన్యత నిచ్చేవారు.

విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

గలతీ 5:20,21

8. *అబద్ధికులు:*

అబద్దం చెప్పువారు. ప్రభువును క్రీస్తుకాదని నిరాకరించువారు.

యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు?

1 యోహాను 2:22

వీరెవ్వరికి నూతన యెరూషలేములో ప్రవేశం లేదు.వీరి గమ్యం నిత్య నరకం. అది అత్యంత భయంకరం.

ప్రియ నేస్తమా! సరిచేసుకుందాం! నేడే, ఒక స్థిర నిర్ణయం చేద్దాం! ప్రభువు కొరకు జీవిద్దాం! ఆ నిత్య నూతనమైన, నూతన యెరూషలేములో, ప్రభువుతో నిత్య నివాసం చేద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందాము!

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

*యెషయా ప్రవచన గ్రంధము*

*352వ భాగము*

యెషయా గ్రంథము 66:1--2

1. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?

2. అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 65వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము! ఇక చివరి అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

ప్రియులారా ఈ అధ్యాయం 1-24 వచనాలు కూడా యెషయా గారి ద్వారా దేవుడు తన మాటలను కొనసాగిస్తున్నారు. తన ప్రజలు ఎలాంటివారుగా ఉండాలని తాను కోరుతున్నాడో నొక్కి చెప్తున్నారు. వారలా దేవుని మాట వింటే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. తనను, తన వాక్కును నిరాకరించినవారి అంతం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నారు ఈ అధ్యాయంలో!

ఇక మొదటి రెండు వచనాలలో దేవుడు ఎంతటి మహాఘనుడో తెలుస్తుంది!

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?

2. అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

చూడండి ఆకాశము ఆయన సింహాసనం భూమి పాదపీఠం! మరోచోట సముద్రం మీద కాలు భూమి మీద మరోకాలు వేసినంతటి మహా గొప్ప దేవుడు!!!

అయితే దీనికోసం ఆలోచన చేసే ముందు ఒకమాట చెప్పనీయండి. తెలుగు ఇంగ్లీషు భాషలలో ఆకాశము నా సింహాసనం అని వ్రాయబడినా, ఆదిమ హెబ్రూ బాషలో ఆకాశాలు నా సింహాసనం అని వ్రాయబడింది!

అనగా ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము!

Just like Troposphere, Stratosphere and Ionosphere.

Off course Ionosphere divided in to 3 more spheres.

OK మన పాఠ్య భాగము నకు వచ్చేద్దాం!

Isaiah(యెషయా గ్రంథము) 40:21,22

21. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?

22. ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

సొలొమోను గారు అంటున్నారు 1రాజులు 8:27

నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

కీర్తనలు 2:4

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు.

మత్తయి 5:34-35

34 కానీ మీతో నేనంటాను, మీరు ఎంతమాత్రం ఒట్టుపెట్టుకోకండి. పరలోకంతోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని సింహాసనం.

35 భూమితోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని పాదపీఠం. జెరుసలం మీద ఒట్టుపెట్టుకోకూడదు – అది మహా రాజు నగరం.

అపొ కా 7:48-50

48 “అయితే మానవ హస్తాలతో చేసిన ఆలయంలో సర్వాతీతుడైన దేవుడు నివాసం చేయడు. ప్రవక్త చెప్పాడు గదా,

49 ‘నా సింహాసనం ఆకాశమే. నా పాదపీఠం భూతలమే. మీరు నాకోసం ఎలాంటి మందిరం కట్టగలరు? నా విశ్రాంతి స్థలమేది? 50 ఇవన్నీ నా చేతితో చేసినవి కావా? అని ప్రభువు చెపుతున్నాడు.’

అపొ కా 17:24-25

24 జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు.

25 తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.

ఇజ్రాయేల్ వారి దేవుడు మహా బలాఢ్యుడైన సృష్టికర్త – 40:26; ఆది 1:1. ఈ విశ్వమంతా కలిసినా ఆయన దృష్టిలో అల్పమే. చేతులతో కట్టిన ఆలయం ఆయనకు అక్కరలేదు. ఆత్మ సంబంధమైన ఆలయం ఆయనకు ఎక్కువ ఇష్టం. అంటే ఆయనలో నమ్మకం ఉంచిన మనుషుల వినయపూరితమైన హృదయాలు, దేహాలే ఆయనకు ఆలయాలు. అలాంటివారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఇక్కడున్న హీబ్రూ పదానికి అక్షరార్థం!

యెషయా 57:15

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

పౌలుగారు చెబుతున్నారు 1కోరింథీయులకు 6:19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు.

Ephesians(ఎఫెసీయులకు) 2:20,21,22

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

ఇక రెండవ వచనంలో అంటున్నారు నేను నా చేతులతో వీటన్నిటినీ చేశాను. అన్నీ నా ద్వారానే కలిగాయి. ఇది యెహోవా వాక్కు. ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాటకు వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

వారి మీదే నా దృష్టి ఉంటుంది- ఇదే మాట ఆది 4:4-5; నిర్గమ 2:25; సంఖ్యా 16:15; న్యాయాధి 6:14; కీర్తన 25:16లో కూడా ఉంది. ఈ వాక్యములో దేవుని ఆమోదం, అప్యాయత ఇమిడి ఉన్నాయి.

వినయం, నలిగిన హృదయం గురించి యెషయా 57:15; కీర్తన 51:17; మత్తయి 5:3-4; లూకా 18:13-14; యాకోబు 4:6 చూడండి.

దేవుని మాటకు వణకడమంటే మన అయోగ్యతను గుర్తించి, ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయంతో, ఆయన పట్ల గౌరవభావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడమన్న మాట – ఎజ్రా 9:4; హోషేయ 3:5. కీర్తన 2:11; 99:1; 114:7; యిర్మీయా 5:22 కూడా చూడండి.

యిర్మియా 5:22

సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

కీర్తనలు 2:11

భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.

కాబట్టి ఇంతటి ఘనుడు బలిష్టుడైన భయంకరుడైన దేవునికి భయపడదాం! ఆయనకు భయభక్తులు కలిగి ఉందాం! ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇద్దాం! పెదాలతో కాక హృదయపూర్వక ఆరాధన చేద్దాం!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*353వ భాగము*

యెషయా గ్రంథము 66:3--6

3. ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి.

4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

5. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.

6. ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 66వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాము!

ఇక మూడవ వచనంలో ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి అంటూ వారి వేషధారణ భక్తిని చూపిస్తున్నారు!

మీ బలులు అర్పణలు నాకు అసహ్యంగా కనిపిస్తున్నాయి అంటున్నారు!

మొదటి అధ్యాయం లోనే చెప్పారు Isaiah(యెషయా గ్రంథము) 1:11,12,13,14,15,16,17

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొల గింపుడి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.

దుర్మార్గుల లేక భక్తిహీనుల అర్పణలేవీ దేవునికి అంగీకారం కాదు

సామెతలు 15:8

భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయ ములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.

సామెతలు 21:27

భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.

ఇంకా అంటున్నారు నన్ను అనుసరించక మీసొంత మార్గాలలో వెళ్తున్నారు

యెషయా 53:6

మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

యెషయా 57:17

వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.

మనుష్యలు తమ అసహ్య కార్యాలనుబట్టి ఆనందిస్తున్నారంటే మనుషులు తమ పాపంలో చాలా ముదిరిపోయారన్నమాట.

ఫిలిప్పీయులకు 3:18

అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.

ఫిలిప్పీయులకు 3:19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

అందుకే తరువాత వచనంలో అంటున్నారు నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

దీనికోసం మనము విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాం!

యెషయా 65:7, 12; కీర్తన 18:25-26 చూడండి.

ఇక తరువాత వచనంలో యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.

దేవుని వాక్కుకు వినయంతో అణుకువ చూపేవారిని ప్రేమించవలసినవాళ్ళే కొన్నిసార్లు ద్వేషిస్తారు. భక్తిమార్గంలో నడుచుకునే వారిని ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా ద్వేషించారు.

కీర్తనలు 38:20

మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి.

ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా పరిశీలించాలి: నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు కూడా చెప్పారు కొండమీద ప్రసంగంలో

మత్తయి 5:11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5:12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

మత్తయి 10:22

మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.

కాబట్టి దేవుడు చెప్పినట్లు జరుగుతుంది కనుక దేవుని నామము నిమిత్తం శ్రమలు కలిగినపుడు కృంగిపోక సంతోషించాలి!!

ఇక తరువాత వచనంలో అంటున్నారు ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.

ఇక్కడ పట్టణం దేవాలయం అనగా జెరూసలేం నగరం పట్టబడుతుంది దేవాలయం పాడుచేయబడుతుంది అని అర్థం!

ఇది తన సొంత ప్రజల అతిక్రమ క్రియలను బట్టి జరుగుతుంది.

Isaiah(యెషయా గ్రంథము) 64:10,11

10. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

Jeremiah(యిర్మీయా) 52:12,13,14

12.​ అయిదవ నెల పదియవ దినమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు పందొమ్మిదవ సంవత్సరమున బబులోనురాజు ఎదుట నిలుచు నెబూజర దానను రాజదేహసంరక్షకుల యధిపతి యెరూషలేమునకు వచ్చెను.

13.​ అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను.

14.​ మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీ యుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి

ఇలా చేయడానికి దేవుడు శత్రువులను వాడుకున్నారు. అయితే ఆ తరువాత శత్రువుల మీద అనగా అష్షూరు వారిమీద బబులోను వారిమీద దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు.

అలాగే దేవునిబిడ్డలు దేవుని మాట వినకపోతే అన్యులకు అప్పగించి బుద్ధి చెబుతారు జాగ్రత్త!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*354వ భాగము*

యెషయా గ్రంథము 66:7--14

7. ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది.

8. అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను.

9. నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.

10. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

11. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

13. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

14. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 66వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక ఈ 7--11 వచనాలలో దేవుడు ఇశ్రాయేలు సంతతికి చేయబోయే మేలులు కోసం చెప్పబడింది.

ఏడవ వచనంలో ప్రసవవేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులకమునుపు మగపిల్లను కనినది అంటున్నారు!

ఇక్కడ ప్రసవవేదన పడింది ఇశ్రాయేలు జనులు!! ఇది ఇస్రాయేల్ జాతికి ప్రతినిధిగా ఉన్న సీయోను ఫలవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నది. యెషయా 49:14-20; 54:1-8 లో ఇదే విషయాన్ని చెబుతున్నారు!

7వ వచనంలోని “పిల్లవాడు” ఇస్రాయేల్ దేశమే, ఆ జాతే (వ 8). దేశంలోని మార్పు ఎంత మహత్తరంగా ఉంటుందంటే ఆ దేశం, ఆ జనం పూర్తిగా నవనూతనమయ్యాయా అనిపిస్తుంది. యెషయా 4:2-6; 11:6-16; 27:6; 35:1-10 కూడా చూడండి. ఇస్రాయేల్‌లోని ఈ మార్పు పురిటి నొప్పులు లేకుండానే హఠాత్తుగా కలుగుతుంది అని ఈ వచనాలు యొక్క అర్థం!!

జెకర్యా 12:10 – 13:2; రోమ్ 11:26-27; ప్రకటన 1:7 కూడా చూడండి!!!

అందుకే నేను ప్రసూతిని ఆరంభించి కనకుండా చేస్తానా?’ అని యెహోవా అడుగుతున్నాడు. ‘ప్రసవించడం ఆరంభం అయ్యేలా చేసి గర్భాన్ని మూసివేస్తానా?’ అని నీ దేవుడు అడుగుతున్నాడు.

ఇక తరువాత వచనంలో యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి అంటున్నారు!

యెషయా 65:18

నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.

కీర్తనలు 122:6

యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

కీర్తనలు 122:7

నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.

కీర్తనలు 137:5

యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

కీర్తనలు 137:6

నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.

ఇక తరువాత వచనంలో ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు.

వెయ్యేళ్ళ పాలన సమయంలో జెరుసలం ఒక తల్లిలాగా ఉంటుంది. చివరికి అది నమ్మేవారందరికీ తల్లిగా ఉన్న పరమ యేరూషలేము (గలతీ 4:26) నిజమైన ప్రతిబింబంగా ఉంటుంది.

యెషయా 49:23

రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

యెషయా 60:16

యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.

గలతియులకు 4:26

అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.

ఇక 12వ వచనంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

చూడండి యెహోవా అంటున్నాడు, “వినండి. శాంతిని సమాధానమును నదిలాగా జెరుసలంకు ప్రవహించేలా చేస్తాను. జనాల ఐశ్వర్యం ఒడ్డుమీద పొర్లిపారే ప్రవాహంలాగా దానికి వచ్చేలా చేస్తాను. మిమ్మల్ని చంకను ఎత్తుకోవడం, మోకాళ్ళమీద ఆడించడం జరుగుతుంది అంటున్నారు. దీనికోసం కూడా విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!

యెషయా 60:5;

యెషయా 48:18

నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.

తరువాత వచనంలో ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.

దేవుని వాత్సల్యం తల్లి వాత్సల్యం లాంటిది. జెరుసలం భవిష్యత్తు గురించి దిగులుపడుతూ ఉన్న వారందరినీ ఆయన ఓదారుస్తారు.

Isaiah(యెషయా గ్రంథము) 40:1,2

1. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,

2. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.

యెషయా 49:13-16; 54:7-8 కూడా చూడండి.

ఇక 14వ వచనంలో అంటున్నారు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

ఇక్కడ దేవుడు తన ప్రజలకు దీవెనలు కలిగించేందుకు పని చేస్తున్న దేవుని శక్తి యెహోవా హస్తబలముగా చెప్పబడింది. ఇశ్రాయేలు చెరవిముక్తి సమయంలో బలమైన హస్తముగా చెప్పబడింది. నిర్గమ 6:1లో!!!

నిర్గమకాండము 6:1

అందుకు యెహోవాఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.

కీర్తనలు 89:13

పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నత మైనది.

కాబట్టి ఆయన బాహువును నమ్మకుందాం!

1పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*355వ భాగము*

యెషయా గ్రంథము 66:15--18

15. ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

17. తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తు వును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.

18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 66వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 15,16 వచనాలు యేసుక్రీస్తు ప్రభులవారి రెండవ రాకడను ఆయన వచ్చే విధానాన్ని తెలియజేస్తున్నాయి!

ఆలకించుడి, మహాకోపముతో ప్రతికారము చేయుట కును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలె త్వరపడుచున్నవి.

16. అగ్ని చేతను తన ఖడ్గముచేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడును యెహోవాచేత అనేకులు హతులవుదురు.

ప్రియులారా దీనికోసం మనము రెండవ అధ్యాయం నుండి కూడా చూసుకుంటున్నాము!

Isaiah(యెషయా గ్రంథము) 2:10,11,12,17,19,20,21

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.

20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను

21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.

Isaiah(యెషయా గ్రంథము) 26:19,20,21

19. మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

20. నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును.

21. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

Isaiah(యెషయా గ్రంథము) 30:27,28

27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

28. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

యెషయా 34:2; 42:25;

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:6,7,8,9,10

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు

10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:16,17

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

Revelation(ప్రకటన గ్రంథము) 19:11,12,13,14,15,16

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13. రక్తములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో- చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

‌ఇక 17,18 వచనాలు భిన్నమైనవి!

తోటలోనికి వెళ్లవలెనని మధ్యనిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్నవారై పందిమాంసమును హేయవస్తువును పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండ నశించెదరు ఇదే యెహోవా వాక్కు.

18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

ఇక్కడ మరోసారి పందిమాంసం తినేవారిని దండిస్తాను అంటున్నారు!

యెషయా ప్రవచన గ్రంథం వంటి మహోత్కృష్టమైన పుస్తకంలోని ఇలాంటి శ్రేష్ఠమైన ఆఖరు అధ్యాయంలో మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహారాన్ని తినడం గురించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది గదా. 65:4 కూడా చూడండి. ఇక్కడ చెప్తున్నది అక్షరాలా ఇజ్రాయేల్ జాతి గురించే అని దీన్ని బట్టి తెలియదా? వారిలోని దుర్మార్గులు దేవుని ఆజ్ఞల పట్ల తిరస్కార భావం చూపడం ద్వారా బయట పడతారు. ధర్మశాస్త్రంలోని ఆదేశాలన్నిటిలోకీ ఆచరణలో పెట్టడానికి అతి తేలికైనది అశుద్ధ జంతువుల గురించిన ఆజ్ఞ. ఈ ఆదేశాలను పాటించడానికి ఇష్టం లేనివారు ఇక ఇతర ఆజ్ఞలను ఎలా పాటిస్తారు? కొన్ని ఆహార పదార్థాలు తినడం నిషేధం గురించి లేవీ 11 అధ్యాయంలో వ్రాయబడింది!!

ఇంకా అంటున్నారు వాళ్ళ క్రియలూ తలంపులూ, నాకు తెలిసే ఉన్నాయి. జనాలన్నిటినీ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళనూ సమకూర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా శోభను చూస్తారు.

యెషయా 65:2

తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను.

ఇంకా అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు.

దేవుడు రెండవ రాకడలో హార్మెగిద్దోన్ యుద్ధం సమయంలో తన ప్రజలను కాపాడడంలోను, వారి శత్రువులను సంహరించడంలోను చూపే పరాక్రమాన్ని, మహిమను ఇస్రాయేల్‌వారి శత్రువులంతా ఎర్ర సముద్రం దగ్గర ఈజిప్ట్ వాళ్ళు చూచినట్టు చూస్తారు (నిర్గమ 14 అధ్యాయం) అని దీని అర్థం!!

యోవేలు 3:2

అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యె మాడుదును.

జెఫన్యా 3:8

కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.

Zechariah(జెకర్యా) 14:1,2,3,4,5,6,7,8,9,12,13,14,15

1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.

2.​ ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

5. కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

6.​ యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.

7. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలుకాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.

8. ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.

9.​ యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

12. మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.

13 .ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరికొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.

14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చ బడును.

15. ఆలాగుననే గుఱ్ఱములమీదను కంచర గాడిదల మీదను ఒంటెలమీదను గార్దభములమీదను దండు పాళెములో ఉన్న పశువులన్నిటిమీదను తెగుళ్లుపడును.

ప్రియులారా ఆయన త్వరగా రాబోతున్నారు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా!!!

ప్రకటన గ్రంథం 3:11

నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.

ప్రకటన గ్రంథం 3:20

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

ప్రకటన గ్రంథం 3:21

నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

ప్రకటన గ్రంథం 22:12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

ప్రకటన గ్రంథం 1:7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌!!!

దైవాశీస్సులు!

*యెషయా ప్రవచన గ్రంధము*

*356వ భాగము*

యెషయా గ్రంథము 66:19--24

19. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

21. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

23. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును..

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 66వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! గ్రంధము చివరికి వచ్చేశాము.

అయితే ఈ చివరి రెండు అధ్యాయాలు ఇశ్రాయేలు పునర్నిర్మాణం కోసం మరియు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, వెయ్యేళ్ల పాలన కోసం వ్రాయబడినా ఈ రెండు అధ్యాయాలలో అనేక అంశాలు నూతన నిబంధన సంఘకోణంలో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

చాలా క్లుప్తంగా ఈ విషయాలను నూతన నిబంధన సంఘకోణంలో చూసుకుందాం!

65:1 లో యెషయా 65:1

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

ఇది తప్పకుండా నూతన నిబంధన సంఘంలో చేరిన అన్యజనుల నుండి రక్షణ పొందిన/ పొందుతున్న విశ్వాసులు! మనము వెదకక పోయినా దేవుని మహా వాత్సల్య ప్రేమతో ఆయన ప్రణాళికలో రక్షణ పొందుకుని సంఘంలో చేరాము!

ఇక యెషయా 65:5

వారుమా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.

ఇది నూతన నిబంధన సంఘానికి రెండు రకాలుగా వర్తిస్తుంది. దేవునినెరుగని వారు తామే భక్తిపరులుగా ఎంచుకుంటూ మనలను తృణీకరిస్తున్నారు. క్రీస్తుని తెలుసుకున్న వారు కూడా చాలా సంఘాలు వారే పరిశుద్ధులుగా మిగిలిన వారు అపవిత్రులుగా త్రోసివేస్తున్నారు. వారిలో క్రీస్తు ప్రేమ ఏమాత్రం లేదు!

ఇక మరో కోణంలో ఇప్పుడు రక్షణ పొందుకున్న అనేకమంది విశ్వాసులను కొన్ని సంవత్సరాల క్రితం అంటరాని వారిగా, ఎందుకు పనికిరాని వారిగా పరిగణించారు మా దగ్గరకు రావద్దు, మమ్మల్ని అంటుకోవద్దు. మీ పిల్లలు చదవకూడదు, ఇలాంటి అంటరానితనం వలన అణగారిపోయిన తరుణంలో దేవుని ప్రేమ కృప ఆదరించి హక్కున చేర్చుకుంది. తనవారిగా చేర్చుకుని పరిశుద్ధులుగా మార్చి ఆస్తి అంతస్తు ఐశ్వర్యం సమకూర్చింది. ఇలాంటి వారు ఇప్పుడు అదే అంటరాని వారిగా పరిగణించిన వారిదగ్గరకే వెళ్ళి దండ కట్టుకుని ఎస్ సార్, నమస్తే సార్ అంటున్నారు!!!

ఇప్పుడు పరిస్థితులు 13,14 వచనాలకు సరిపోతుంది!

యెషయా 65:13

కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు

యెషయా 65:14

నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.

ఇక 17వ వచనం నుండి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కోసం చెబుతున్నారు

యెషయా 65:17

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.

ఇది కూడా నూతన నిబంధన సంఘానికి దేవుని వాగ్ధానం! దీనికోసం గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము. అయితే కొన్ని మాటలు చూసుకుని ముందుకు పోదాం!

ఇప్పుడు మనమున్న భూమి ఆకాశాలు దేవుని ఉగ్రతలో కాలిపోబోతున్నాయి అని పేతురు పత్రికలో చూసుకున్నాము గనుక క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని దేవుడు సృజించబోతున్నారు. ఆ క్రొత్త భూమి మీదికి నూతన యెరూషలేము దిగి రాబోతుంది.

అయితే యోహాను సువార్తలో నేను మీకొరకు స్థలము సిద్దపరచ వెళ్లుచున్నాను అని చెప్పారు. యోహాను 14:2

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

యోహాను 14:3

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

పౌలుగారు మరియు పేతురు గారు చెబుతున్నారు మనము దేవుని ఆలయము అనియు పరిశుద్ద మందిరముగా కట్టబడుచున్నాము.

1పేతురు 2:5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1కోరింథీయులకు 3:9

మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

1కోరింథీయులకు 3:10

దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

1కోరింథీయులకు 3:11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

1కోరింథీయులకు 3:16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

కాబట్టి మనము నూతన జెరూసలేంగా కట్టబడుతున్నాము. ఇలా కట్టబడిన సంఘము ప్రకటన 21 ప్రకారం దిగిరాబోతుంది. ప్రకటన గ్రంథం 21:1

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

ప్రకటన గ్రంథం 21:2

మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

ప్రకటన గ్రంథం 21:3

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

కాబట్టి ఈ నూతన యెరూషలేములో ఉండేది తప్పకుండా నూతన నిబంధన సంఘము! మరి ఇశ్రాయేలు ప్రజలు ఉండరా అని అడగవచ్చు. వారు ఉంటారు గాని అత్యధిక ప్రాధాన్యత నూతన నిబంధన సంఘమునకు ఉంటుంది అని చెబుతున్నాను.

కారణం మహా శ్రమలగుండా వచ్చారు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే పండ్రెండు గుమ్మాలు, పండ్రెండు దేవదూతలు, పండ్రెండు పునాదులు, పండ్రెండు రత్నాలు ఇంకా పండ్రెండు అపొస్తులుల పేరులు!

ఇది ఖచ్చితంగా పండ్రెండు అపొస్తలుల బోధ మీద కట్టబడిన నూతన నిబంధన సంఘానికి గుర్తు! గతంలో ఆ ముత్యాలు దేనికి సాదృశ్యమో చెప్పడం జరిగింది! అవన్నీ నూతన నిబంధన సంఘము యొక్క గుణగణాలు!!!

ఇక ఆ నూతన యెరూషలేములో అత్యంత ఉన్నతమైన స్తితిలో సీయోను అనుభవం గల విశ్వాసులు దైవజనులు ఉంటారు. వీరు స్త్రీ సాంగత్యం అనగా వివాహాన్ని కూడా త్యజించి, శరీర కోర్కెలను జయించి, క్రీస్తు కోసం ఆయన సాంగత్యం మాత్రమే ఆశించి, చివరకు ఊహలలో కూడా పాపము చేయలేని అత్యంత పరిశుద్ధ అనుభవం గల వీరికి దేవుడు అత్యున్నతమైన అత్యుత్తమమైన స్థానంలో పెట్టి సత్కరిస్తారు.

ఇక 66:10 నుండి 14 వరకు యెరూషలేము అనగా పరమ యెరూషలేము మనకు తల్లిగా చెప్పబడుతుంది. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు.

వెయ్యేళ్ళ పాలన సమయంలో జెరుసలం ఒక తల్లిలాగా ఉంటుంది. చివరికి అది నమ్మేవారందరికీ తల్లిగా ఉన్న పరమ యేరూషలేము (గలతీ 4:26) నిజమైన ప్రతిబింబంగా ఉంటుంది.

గలతియులకు 4:26

అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.

కీర్తనలు 48:2 ప్రకారం సీయోను సర్వభూమికి సంతోష కరంగా ఉంటుంది.

53:6 ప్రకారం సీయోను లోనుండే రక్షణ!

అప్పుడు 87:2 ప్రకారం సీయోను గుమ్మములు దేవునికి ప్రియములై ఉంటాయి.

87:5 ప్రకారం ప్రతీ జనము దానిలోనే జన్మించును

102:16 ప్రకారం ఎందుకంటే దేవుడు సీయోనుని కట్టియున్నాడు అక్కడ మహిమతో ప్రత్యక్ష మయ్యారు కాబట్టి!

110:2 ప్రకారం అక్కడ నుండి అనగా సీయోను నుండి, యెరూషలేము నుండి పరిపాలన చేస్తారు. అనగా వెయ్యేళ్ల పాలనకు యెరూషలేములో నుండి పాలన, ప్రపంచ కేపిటల్ గా ఉంటుంది.

ఇంకా బోలెడన్ని వాగ్ధానాలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఎంతో శ్రమలను కష్టాలను అనుభవించి సీయోను అనుభవానికి వచ్చారు.

ఇప్పుడు ఇదే నూతన నిబంధన సంఘము క్రీస్తుతో పాటుగా పరిపాలన చేస్తుంది. ఇంకా నిత్యత్వములో క్రీస్తుతో పాటు సహవాసం చేస్తుంది!!!

ఇక 21వ వచనంలో యెషయా 66:21

మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

అవును దేవుడు మనలను రాజులుగా యాజకులుగా ఉండటానికి పిలుచుకున్నారు.

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

ప్రకటన గ్రంథం 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

ప్రకటన గ్రంథం 5:10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

ఇదీ నూతన నిబంధన సంఘానికి గల దివ్య లక్షణం! ఇశ్రాయేలు కైతే కేవలం లేవీయులలో అహరోను గోత్రపు వారు మాత్రమే యాజకులుగా ఉన్నారు ఉంటారు. కొన్ని గోత్రాలు వారు మాత్రమే రాజులుగా ఉన్నారు. అయితే నూతన నిబంధన సంఘంలో దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని పరిశుద్ధమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం వాక్యానుసారమైన జీవితం సాక్ష్యానుసారమైన జీవితం కలిగి జీవిస్తున్న ప్రతీ ఒక్కరు రాజులుగాను యాజకులుగాను ఉండటానికి అర్హులే!!! హల్లెలూయ!!!

ఇక చివరి వచనం ప్రకారం 24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును..

దేవుని పేరు పెట్టుకుని, బాప్తిస్మము తీసుకుని, పరిశుద్ధాత్మ కూడా పొందుకున్న తరువాత దేవునిమీద తిరుగుబాటు చేస్తే, నీవెవడవైనా సరే నరకానికి పోతావు! నీవు ప్రసంగీకుడవైనా, ప్రార్థనా పరుడవైనా, కాపరివైనా విశ్వాసివైనా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నా లేకున్నా, ఏదిఏమైనా దేవునికి ఇష్టుడిగా లేకపోతే విడువబడతావు! నేను నూతన నిబంధన సంఘ విశ్వాసిని, కాపరిని, రెవరెండుని ఇరవైరెండుని అన్నా దేవుడు అక్రమము చేయువారలారా నాయొద్ద నుండి తొలిగిపొండి అని చెప్పి ఆరని అగ్నిలో వేస్తారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. అగ్ని ఆరదు పురుగు చావదు!

గనుక నూతన నిబంధన సంఘములో అంగమైన ప్రతీ ఒక్కరము జాగ్రత్తగా ఉండాలి నా వాడుకభాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి. దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని పరిశుద్ధమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం వాక్యానుసారమైన జీవితం సాక్ష్యానుసారమైన జీవితం కలిగిఉండాలి!!

అట్టి కృప ధన్యత దేవుడు చదువరులందరికీ దయచేయును గాక!!

ఆమెన్!

దైవాశీస్సులు!!

*యెషయా ప్రవచన గ్రంధము*

*357వ భాగము*

యెషయా గ్రంథము 66:19--24

19. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

21. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

23. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

24. వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును..

ప్రియులారా మనం యెషయా గ్రంధాన్ని ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియదైవజనమా! మనము 66వ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాము! గ్రంధము చివరికి వచ్చేశాము.

ఇక 19,20 వచనాలు సంచలనాత్మక వచనాలు!

19. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

20. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఈ 19-21వచనాలలో ఉన్న ఈ సందర్భాన్ని బట్టీ, యెషయా గారు మరియు తదితర ప్రవక్తల గ్రంథాల్లోని ప్రవచనాలను బట్టీ చూస్తే ఈ మాటలు రాబోయే వెయ్యేళ్ళ పాలనలోని సంభవాలు కొన్నిటిని వర్ణిస్తున్నాయి. ఇందులో కొన్ని మాటలు క్రొత్త నిబంధన సంఘం కార్యకలాపాలకు సరిపోతున్నాయి, గాని కొన్ని అలా సరిపోవడం లేదు. కాబట్టి ఈ సంభవాలు క్రొత్త నిబంధన సంఘపు కాలంలో కొన్ని, వెయ్యేళ్ల పాలనలో కొన్ని జరుగుతాయి అని గ్రహించాలి. కొన్ని రెండు కాలాలలో కూడా జరుగుతాయి!

19 వచనం ప్రకారం క్రొత్త నిబంధన సంఘకాలంలో అనగా నేటి రోజులలో సువార్త ప్రపంచమంతా చాటించబడి దేవుని మహిమ ప్రకటించబడుతుంది. దానికి సూచనగానే అనేక ప్రజలను ఎత్తి వ్రాయబడింది. అయితే మరో ముఖ్యమైన మాట ఏమిటంటే అలా సువార్త వలన రక్షణపొందిన వారి ద్వారానే ఆ దేశాల వారి వలననే అనేక దేశాలనుండి 1948నుండి ఇశ్రాయేలు ప్రజలు వారి దేశానికి తిరిగి వస్తున్నారు. ఇది 20వ వచనంతో సరిగా సరిపోతుంది!!! ఇంకా అంత్యకాలంలో మరోసారి జరుగబోతుంది.

ఇక్కడ తర్షీషువారు అనగా స్పెయిన్ దేశానికి చెందిన రేవు పట్టణం వారు!

పూలు వారు అనగా ఇరాక్ దేశపు జనులు!

లూదు అనగా నేటి టర్కీ దేశము!

ఇక తుబాలు కూడా టర్కీ దేశపు ఒక రకమైన తెగ!

యావాను అనగా గ్రీసు దేశస్తులు!

మొత్తానికి వీరంతా ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన, ఈశాన్య, వాయువ్య దిశలలో ఉన్న దేశాలు వారు!!!

ఇంకా నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

యేసుక్రీస్తు ప్రభులవారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు మత్తయి 28, మార్కు 16వ అధ్యాయాలలో! ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని మహిమను అన్యదేశాలలో ప్రకటించినట్లు బైబిల్ లో గాని, చరిత్రలో గాని లేదు! గాని నూతన నిబంధన సంఘం ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తుంది. ఇంకా మారుమూల ప్రాంతాలకు ద్వీపాలకు దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. తద్వారా మనము కూడా రక్షణ పొందాము. ఈ ప్రవచనాలు నెరవేరాయి, నెరవేరుతాయి!!

Isaiah(యెషయా గ్రంథము) 11:11,12

11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.

యెషయా 49:22

ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

యెషయా 60:4

కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

ఇక 21వ వచనంలో మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అంటున్నారు!

యెషయా 61:6

మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు.

అయితే ప్రియులారా ఈ క్రొత్త నిబంధన యుగంలో విశ్వాసులంతా యాజకులే, ప్రత్యేకంగా కొందరని లేదు 1 పేతురు 2:5, 9 ప్రకారం.

1పేతురు 2:5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు *పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు*, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, *ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును*, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

కాబట్టి ఇంతటి మహత్తరమైన పిలుపును కలిగిన మనము దానికి తగిన జీవితం జీవించాలి!!

ఇక తరువాత వచనంలో నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

దీనికోసం గత భాగాలలో ధ్యానం చేశాము! అయితే ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిమీద నీ సంతతి అనగా ఇశ్రాయేలు ప్రజలలో విమోచించ బడిన వారు, ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలమైన విశ్వాసులు ఎల్లప్పుడూ నివాసం చేస్తారు అంటున్నారు!!!

Isaiah(యెషయా గ్రంథము) 60:20,21

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.

Jeremiah(యిర్మీయా) 33:19,20,21,22,23,24,25,26

19. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

20. యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

21. నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.

22. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్యచేయు లేవీయులను లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.

23. మరియు యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్య క్షమై యీలాగు సెలవిచ్చెను.

24. తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.

25.​ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల

26. భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

ఇక తరువాత వచనంలో ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

అనగా ప్రతిష్టిత దినములయందు సమస్త మానవాళి వెయ్యేళ్ల పాలనలో దేవుని సన్నధికి వస్తారు. ఆయనకు మ్రొక్కతారు!

ఇక చిట్ట చివరి వచనంలో అంటున్నారు వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును..

తిరుగుబాటు చేసిన వారు అనగా దేవుని మాటలకు లోబడని వారు, ఇశ్రాయేలు విరోధులు మరియు వాక్యపు విరోధులు, నూతన నిబంధన సంఘానికి విరోధులు!

యెషయా గ్రంధంలో తరచుగా కనిపించే అంశం “తిరుగుబాటు” (1:2, 23; 3:1, 9; 60:10; 65:2). జెరుసలం నగర వాసులు వెళ్ళి బెన్ హిన్నోం, తోఫెతు లోయలోకి చూస్తున్న దృశ్యం ఇక్కడ ఉంది (30:33; యిర్మీయా 7:31-33; 19:6). దేవుని పై తిరగబడిన వారందరి అంతం ఇక్కడ తెలుస్తున్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో బెన్ హిన్నోం నరకానికి సూచనగా ఉంది. ఈ వచనంలో కొంత భాగం మార్కు 9:48లో రాసి ఉంది. యూదుడైనా ఇతర జాతివాడైనా

శిక్షను తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇది ఈ పుస్తకం 53వ అధ్యాయం వర్ణించిన వేదన పాలైన అభిషిక్తుణ్ణి ఆశ్రయించడమే. అనగా యేసుక్రీస్తు ప్రభులవారిని నమ్మి రక్షణ పొందవలసినదే!

మార్కు 9:48

48 నరకంలో వాళ్ళ పురుగు చావదు. అగ్ని ఆరదు.

నరకాన్ని ఒక బ్రహ్మాండమైన ఘోరమైన చెత్తకుప్పతో పోల్చవచ్చు. అది అస్తమానం మండుతూనే ఉంటుంది. చనిపోయిన వాటిని పురుగులు ఎప్పుడూ పీకుతూనే ఉంటాయి. జెరుసలం ప్రాకారం బయట గెహెన్నా లోయలో ఇలాంటి చెత్తకుప్ప ఒకటి ఉండేది. క్రొత్త నిబంధన గ్రంథంలో ముఖ్యంగా మత్తయి, మార్కు సువార్తల్లో 12 చోట్ల గెహెన్నా అనే పదాన్నే “నరకం” అని అనువదించడం జరిగింది. పాపభరితులైన మానవులకు పట్టబోయే గతి గురించి యేసుక్రీస్తు ప్రభులవారు భయంకరమైన వర్ణన ఇచ్చారు. దీన్ని అలక్ష్యం చెయ్యడం కేవలం తెలివితక్కువతనం. మత్తయి 5:22; లూకా 16:2, 24; ప్రకటన 20:14-15 కూడా చూడండి. ఈ లోకానికి చెందిన మురికినీ, చెత్తనూ కోరుకుని (ఫిలిప్పీ 3:8), క్రీస్తు మూలంగా లభించే రక్షణను తిరస్కరించేవారు తమను తాము నీచులను, వ్యర్థులను, చెత్తతో సమానంగా చేసుకుంటున్నారు. అలాంటివారు జగత్తు యొక్క చెత్తకుప్పకు వెళ్ళిపోవలసి వస్తుంది.

యోహాను 14:6

యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

అపో.కార్యములు 4:12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

కాబట్టి ఆ ఘోరమైన నరకబాధను తప్పించుకోవాలంటే యేసే మార్గము! మరి ఆయన వద్దకు వస్తావా! వచ్చిన నీవు ఆ మార్గములోనే ఉన్నావా లేక దారితప్పావా!

సరిచూసుకో!

సరిచేసుకో!

ప్రకటన గ్రంథం 22:17

ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

ప్రకటన గ్రంథం 22:20

ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

ప్రకటన గ్రంథం 22:21

ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు (కొన్ని ప్రాచీన ప్రతులలో, పరిశుద్ధులకందరికి అని పాఠాంతరము) తోడై యుండును గాక. ఆమేన్‌.!!!

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

దేవుని నామమునకు మహిమ కలుగును గాక!!!

ప్రియదైవజనమా! దేవుని కృపవలన ఈ యెషయా గ్రంధ ధ్యానములు పూర్తి చేయడం జరిగింది. మొదలుపెట్టినప్పుడు ఎంతో భయమేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారి మొదటి రాకడ, రెండవ రాకడ, సువార్త, జనన మరణము, హార్మెగిద్దోన్ యుద్ధం, గోగుమాగోగు యుద్ధం, వెయ్యేళ్ల పాలన, నిత్యత్వము, ఇశ్రాయేలు ప్రజల చెర, చెర విముక్తి ఈ మొత్తమంతా ముందుగానే ప్రవచించిన ఏకైక గ్రంథం ఇదే! గాని ప్రార్థన చేస్తూ, దేవుని నడిపింపు మీద ఆధారపడి నందువలన ఎందుకూ కొరగాని పురుగులాంటి నేను ఇంతటి మహత్తరమైన గ్రంధ వివరణ పూర్తి చేయడం జరిగింది. ఇంకా అనేక వచనాలు పూర్తి వివరణ ఇవ్వలేకపోయాను. కారణం ఇంతకుముందు వాటిమీద ధ్యానం చేయడం వలన, ఒకే విధమైన భావము కలిగినందువలన మరియు ఇప్పటికే చాలా రోజులపాటు (సుమారుగా సంవత్సరమంతా) ఒకే విషయాన్ని ధ్యానం చేయడం వలన! లేకపోతే ఈ భాగాలు బహుశా రెట్టింపు అయి ఉండేవి!

ఈ ధ్యానాల ద్వారా అనేకమంది ఆశీర్వదించబడినట్లు వర్తమానాలు పంపారు. దేవునికే మహిమ ఘనత నిత్యమూ చెల్లును గాక!!

దయచేసి నాకోసం, నేను చేసే పరిచర్య, ఉద్యోగం కోసం, మా సంఘాలకోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యండి!

ప్రభువు చిత్తమైతే పేతురు గారు వ్రాసిన పత్రికల ధ్యానం తో మరలా కలుసుకుందాం!!!

దైవాశీస్సులు!!!

ఇట్లు

ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు

*డేవిడ్ రాజ కుమార్. దోనె*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము