పేతురు వ్రాసిన పత్రికలు


*పేతురు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతం-1*

*మొదటి భాగము*

 

      అలెగ్జాండ్రియాకి చెందిన చరిత్రకారుడు క్లెమెంట్ పేతురు గారికోసం పౌలుగారి కోసం ఏమన్నారంటే:

ఇటీవలి కాలంలో అదే మూలం నుండి తక్కువ చెడులు ఏవీ తలెత్తలేదు. పీటర్ మరియు పాల్ యొక్క బలిదానం.

 

అయితే పురాతన ఉదాహరణల గురించి ఆలోచించకుండా, ఇటీవలి ఆధ్యాత్మిక నాయకుల విషయానికి వద్దాం. మన తరంలో అందించిన గొప్ప ఉదాహరణలను తీసుకుందాం. అసూయ మరియు అసూయ ద్వారా, [చర్చి] గొప్ప మరియు అత్యంత నీతివంతమైన స్తంభాలు హింసించబడ్డాయి మరియు చంపబడ్డాయి. ప్రఖ్యాత అపొస్తలులను మన కళ్ల ముందు ఉంచుదాం. పీటర్, అన్యాయమైన అసూయతో, ఒకటి లేదా రెండు కాదు, అనేక శ్రమలను భరించాడు మరియు చివరకు అతను బలిదానం చేసి, అతని కారణంగా కీర్తి స్థానానికి బయలుదేరాడు. అసూయ కారణంగా, ఏడుసార్లు బందిఖానాలోకి విసిరివేయబడి, పారిపోవడానికి బలవంతంగా మరియు రాళ్లతో కొట్టబడిన తర్వాత,

పౌలు సహనం యొక్క ప్రతిఫలాన్ని కూడా పొందాడు. తూర్పు మరియు పడమరల రెండింటిలోనూ బోధించిన తరువాత, అతను తన విశ్వాసం కారణంగా గొప్ప కీర్తిని పొందాడు, ప్రపంచం మొత్తానికి ధర్మాన్ని బోధించాడు మరియు పశ్చిమాన తీవ్ర పరిమితికి వచ్చాడు మరియు ప్రిఫెక్ట్స్ క్రింద బలిదానం చేశాడు. విధంగా అతను లోకం నుండి తొలగించబడ్డాడు మరియు సహనానికి అద్భుతమైన ఉదాహరణగా తనను తాను నిరూపించుకొని పవిత్ర స్థలానికి వెళ్ళాడు.

 

పేతురు గారిని నీరో సముఖానికి రమ్మని సమన్లు వచ్చినప్పుడు, ఆత్మలో ఎంతో ఆనందించి తన భార్య పెనొలోప్ (పెనూయేల్) అలియాస్ ఏడెన్ తో పేతురు గారు పలికిన మాటలు:

అమ్మీ! సందర్భంలో ప్రభువుని మాత్రమే స్మరించుకో!!!

 

విచిత్రమేమిటంటే తనకంటే ముందుగా ఒక గంట ముందుగానే తన భార్యను సిలువవేయడం చూసి ఆత్మలో సంతోషించి ఆనందించిన గొప్ప విశ్వాస వీరుడు!!!

 

పేతురు గారిని సిలువ వేసేముందు ఆయన పలికిన మాటలు: నన్ను ప్రభువుకు వలె సిలువ వేయవద్దు. తలక్రిందులుగా సిలువవేయండి. ఎందుకంటే ఆయనను నా కళ్లముందు పెట్టుకుని ఆయన ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదు అని ముమ్మారు బొంకాను కాబట్టి ఆయన వలె సిలువ వేయబడటానికి నేను అర్హుడను కాను. నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి!!!

 

అందుకే చరిత్రకారులు క్లెమెంట్ మరియు యుషేబియన్ వీరికోసం ఏమన్నారంటే: క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఇలా వ్రాశాడు:

 

దాని ప్రకారం, ఆశీర్వాదం పొందిన పీటర్, తన భార్య మరణానికి దారితీసిందని చూసినప్పుడు, ఆమె పిలిచినందుకు మరియు ఇంటికి చేరవేసేందుకు సంతోషించి, చాలా ప్రోత్సాహకరంగా మరియు ఓదార్పుగా పిలిచి, "నీవు ప్రభువును గుర్తుంచుకో" అని పేరు పెట్టాడు. ఆశీర్వాదం పొందిన వారి వివాహం మరియు వారికి అత్యంత ప్రియమైన వారి పట్ల వారి పరిపూర్ణ వైఖరి అలాంటిది.

 

క్లెమెంట్, ది స్ట్రోమాటా, బుక్ VII

 

పేతురు:

ప్రధమ అపొస్తలుడు!

సంఘానికి ప్రధమ అధ్యక్షుడు!

ప్రధాన అపొస్తలుడు!

ప్రధమ ఉపన్యాసకుడు!

గొప్ప మాదిరి!

తగ్గింపు గలవాడు!

ప్రభువు చేసిన ప్రతీ అధ్భుతానికి ప్రత్యక్షసాక్షి!

ప్రభువుచేత అనేకసార్లు పిలువబడిన వాడు!

ప్రభువు పొందిన హింసలకు సాక్షి!

ప్రభువు మరణానికి సాక్షి!

ప్రభువు పునరుత్థానము నకు సాక్షి!

ప్రభువుతోపాటు నీటిమీద నడచిన వాడు!

ప్రభువును అత్యధికంగా ప్రేమించిన వాడు!

ప్రభువు కోసం చనిపోడానికే కాదు చంపడానికి కూడా ప్రయత్నించిన వాడు!

బొంకినందుకు పశ్చాత్తాప పడి ఒక మూలన ఏడుస్తుంటే ప్రభువే పలకరించి ఓదార్పును పొందుకున్నాడు!

ఆత్మ లేనప్పుడు బొంకిన వాడు, ఆత్మను పొందుకున్నాక వేలాదిమందికి యేసే క్రీస్తని ధైర్యంగా సాక్ష్యం చెప్పినవాడు!

నామము కోసం నేను చావడానికి రడీ అని నాయకుల మధ్య ఖరాకండిగా చెప్పిన వాడు!

పేతురు బండమీద నా సంఘాన్ని కడతాను అని ప్రభువుచేతనే పలుకబడిన వాడు!

విశ్వాస వీరుడు!

గొప్ప నాయకుడు!

ఇట్టి దైవజనులను మాదిరిగా పెట్టుకుని పరమునకు సాగిపోదాం!

దైవాశీస్సులు!!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతం-2*

*రెండవ భాగము*

 

       దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియమైన దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ భాగంగా మరోసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనములు! పండ్రెడవ సీరీస్ లో దైవజనుడు అపొస్తలుడైన పేతురు గారు వ్రాసిన పత్రికలు ద్వారా మరికొన్ని ధ్యానాలు చేసుకుందాం!

పత్రికలు ధ్యానం చేసుకునే ముందుగా పేతురు గారికోసం చూసుకుని యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకుని అప్పుడు పత్రికలు ధ్యానం చేసుకుందాం! ఎందుకంటే పత్రికలు ఏదో అల్లాటప్పగా వ్రాయకుండా ఆయనకు యేసుక్రీస్తు ప్రభులవారితో గల సంభంధము, అనుభవాలు, సువార్త పరిచర్యలో అపారమైన అనుభవంతో ఆయన పత్రికలు వ్రాయడం జరిగింది.

 

పేరు: సీమోను లేదా సుమియోను లేదా షిమ్యోను; అనగా రెల్లు గడ్డి!

ప్రభువు పెట్టిన పేరులు: 1) పెట్రోస్ , తెలుగు లో పేతురు, అనగా రాయి; 2) కేఫా అనగా రాయి లేదా బండ

పుట్టిన ప్రదేశం: బెత్సయిదా, గలలియ సముద్రపు ఒడ్డున

నివసించిన ప్రాంతం: కపెర్నహోము, అత్తగారి ఇంట్లో

తండ్రి: యోహాను లేదా యోనా

తల్లి: తెలియదు

సహోదరుడు: అంద్రెయ (అన్నయ్య అంటారు)

 

పేతురు గారికి భార్య ఉందా?

1) భార్య లేకుండా పేతురు గారికి అత్తగారు ఎలా ఉంటారు? ఈమె కోసం మూడు సువార్తలలో చెప్పబడింది. ఆమె జ్వరం తో బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభులవారు స్వస్థపరిచారు!!

2) 1పేతురు 5:13 ప్రకారం భార్య మరియు కుమారుడు ఉన్నారు. బబులోను అనగా సౌత్ ఇరాక్ లో పరిచర్య చేశారు.

3) 2కొరింథీ 9:5 ప్రకారం పౌలుగారు పేతురు గారు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని సువార్త ప్రకటించినట్లు చెబుతున్నారు!

కాబట్టి పేతురు గారికి భార్య ఉంది.

 

భార్య: పెనొలోప్ (పెనూయేల్) అలియాస్ ఏడెన్. మంచి విశ్వాసి. పేతురు గారితో అనేక శ్రమలు అనుభవించి సువార్త పరిచర్యలో పాల్గొని, భర్తకు తోడుగా ఉంటూ భర్తకంటె ముందుగా హతస్సాక్షి అయ్యింది.

పేతురు గారిని తన భార్యను నీరో సముఖానికి రమ్మని సమన్లు వచ్చినప్పుడు, ఆత్మలో ఎంతో ఆనందించి తన భార్య పెనొలోప్ (పెనూయేల్) అలియాస్ ఏడెన్ తో పేతురు గారు పలికిన మాటలు:

అమ్మీ! సందర్భంలో ప్రభువుని మాత్రమే స్మరించుకో!!!

 

విచిత్రమేమిటంటే తనకంటే ముందుగా ఒక గంట ముందుగానే తన భార్యను సిలువవేయడం చూసి ఆత్మలో సంతోషించి ఆనందించిన గొప్ప విశ్వాస వీరుడు!!!

 

కుమారుడు: మార్కు , 1పేతురు 5:13 ప్రకారం భార్య మరియు కుమారుడు ఉన్నారు. బబులోను అనగా సౌత్ ఇరాక్ లో పరిచర్య చేశారు. కొందరు ఆత్మీయ కుమారుడు అంటారు. ఏమో మనకు తెలియదు గాని వాక్యంలో చెప్పబడింది కాబట్టి నిజ కుమారుడు అని అనుకుందాం!

 

కుమార్తె: చరిత్ర ప్రకారం ముఖ్యంగా RCM చరిత్ర కారులు ప్రకారం కుమార్తె ఉంది. ఆమె పేరు పెట్రోనిల్లా! చాలా అందమైనది! భక్తి విశ్వాసాలు గల కన్యక! తండ్రి అనంతరం పరిచర్యను కొనసాగించి హతస్సాక్షి అయిపోయింది!

 

శిష్యునిగా పిలువబడుట: Matthew(మత్తయి సువార్త) 4:18,19,20

18. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

19. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

20. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

 

యేసుక్రీస్తు ప్రభులవారితో బంధుత్వం ఉందా?

చరిత్రకారులు ఉంది అంటారు. లూకా 5:10 ప్రకారం జెబదయి కుమారులైన యాకోబు యోహాను గార్లు పేతురు గారికి పాలివారు. అయితే జెబదయి ఎవరూ? యేసుక్రీస్తు ప్రభులవారికి పెదనాన్న అనగా తన తల్లి మరియ గారి అక్క భర్త! కాబట్టి రకంగా పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభులవారికి బంధువే!

 

పరిచర్య చేసిన ప్రాంతాలు: బైబిల్ ప్రకారం గలలియ, జెరూసలేం, సమరియ, యొప్పా, కైసరియ, అంతియొకయ, రోమా, బబులోను. ఆసియా మైనర్ లేదా చిన్నాసియా, గ్రీసు,

చరిత్ర ప్రకారం పై ప్రదేశాలతో పాటుగా ఈజిప్ట్ లో అలెగ్జాండ్రియా, సైప్రస్ లేదా కుప్ర,

 

పరిచర్య చేసిన కాలము: క్రీస్తు శకం 34 నుండి 68 వరకూ!

 

మరణం: రోమ్, వాటికన్ సిటీ. క్రీస్తు శకం 68లో! తన భార్యకంటె ఒక గంట తరువాత, పౌలుగారి కంటే ఒక రోజు ముందుగా!!!

పేతురు గారిని సిలువ వేసేముందు ఆయన పలికిన మాటలు: నన్ను ప్రభువుకు వలె సిలువ వేయవద్దు. తలక్రిందులుగా సిలువవేయండి. ఎందుకంటే ఆయనను నా కళ్లముందు పెట్టుకుని ఆయన ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదు అని ముమ్మారు బొంకాను కాబట్టి ఆయన వలె సిలువ వేయబడటానికి నేను అర్హుడను కాను. నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి!!!

పేతురు గారి కోరిక మేరకు తలక్రిందులుగా ఇటలీలో రోమ్ పట్టణం లో వాటికన్ కొండమీద సిలువవేశారు. రకంగా హతస్సాక్షి అయ్యారు!

దానికి గుర్తుగా 220 సంవత్సరాల తర్వాత కాన్సంటంటైన్ అనే రాజు అదే భూమిపై బాసిల్లికా అనే దేవాలయం కట్టి పేతురు గారికి అంకితమిచ్చారు!

 

పౌలుగారి వలే మంచి పోరాటం పోరాడి పరుగు తుదముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొన్న విశ్వాసవీరుడు!

దైవాశీస్సులు!

(ఇంకా ఉంది)

*పేతురు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతం-3*

*మూడవ భాగము*

*యేసుక్రీస్తు ప్రభులవారితో పేతురు*

 

అపొస్తలుల కార్యములు 4:13

13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని (లేక, సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలే! అందుకే క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం!

 

 యోహాను సువార్త ప్రకారం పేతురు గారు మొదట బాప్తిస్మమిచ్చు యోహాను గారి శిష్యుడు! గాని అప్పులబాధలు బట్టి యేసుక్రీస్తు ప్రభులవారు బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన లేరు. చేపలు పట్టడానికి వెళ్లిపోయారు. అయితే యోహాను గారు ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు అంద్రెయ గారు పేతురు గారికి చెబితే పట్టించుకోలేదు! అయితే నాలుగు సువార్తలలో ఉన్న సన్నివేశాలు క్రమ ప్రకారం చూసుకుంటే పేతురు గారు రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేపకూడా పడలేదు. ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభులవారు కొద్దిమంది జనముతో కపెర్నహూము చేరుకుని చేపలు పడక వలలను శుభ్రం చేసుకుంటున్న పేతురు అంద్రెయ గార్లు మరియు జెబదయి కుమారులైన యోహాను యాకోబు గారు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువుల వారు పేతురుతో: పేతురు నీ పడవ మీద నన్ను ఎక్కనిస్తావా, కొద్దిసేపు వీరితో వాక్యము పంచుకుంటాను అని అడిగి అక్కడ వారికి సువార్త ప్రకటిస్తారు యేసయ్య!

 అది జరిగాక పేతురు నీ వలను లోతుగా వేయమని చెబుతారు యేసయ్య. అందుకు పేతురు అయ్యా రాత్రంతా వలలు వేసినా ఒక్క చేప కూడా పడలేదు అంటాడు! తర్వాత మనసు మార్చుకొని అయినను నీ మాట చొప్పున వలవేస్తాము అని చెప్పి వలలు పగిలిపోయేటంత విస్తారమైన చేపలు పడతారు! చివరికి వారు లాగలేక పాలివారైన జెబదయి కుమారులైన యోహాను గారిని యాకోబు గారిని కూడా సహాయానికి పిలుస్తారు. అప్పుడు పేతురు గారు అయ్యా నేను పాపాత్ముని నన్ను వదిలిపో అంటారు! అందుకు ఏసుక్రీస్తు ప్రభువుల వారు: పేతురు నన్ను వెంబడించు ఈరోజు నుండి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పినట్లు చూడగలము!

 అదే సమయంలో పేతురు గారితో పాటుగా అంద్రెయ గారిని అక్కడే ఉన్న జెబదయి కుమారులైన యోహాను గారిని యాకోబు గారిని కూడా తనను వెంబడించమంటారు. జెబదయి సంతోషంగా తన కుమారులను ఏసు క్రీస్తు ప్రభువు వారితో పంపడానికి ఒప్పుకుంటారు. రకముగా నలుగురికి ఒకేసారి అపోస్తులుల పిలుపు కలిగింది!

 

 అయితే మత్తయి మార్కు లూకా ప్రకారము అదే రోజు కపర్ణెహోమ్ లో పేతురు గారి ఇంటికి ఏసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పేతురు గారి ఇంట్లోనే యేసుక్రీస్తు బస చేసేవారు ఇది మనకి చరిత్ర ఆధారాలతో నిరూపిస్తుంది. కారణం పేతురు గారిల్లు చాలా పెద్దది! అందుకే కపెర్నహోమ్ లో జరిగిన అద్భుతాలలో నూటికి 95% పేతురు గారి ఇంట్లోనే జరిగాయి. కపెర్నహూములో చేసిన భోధలు నూటికి 100% పేతురు గారి ఇంట్లోనే జరిగింది అని గ్రహించాలి.

 

అదే రోజు ఏసుక్రీస్తు ప్రభువుల వారు నలుగురిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు పేతురు గారి అత్తగారు భయంకరమైన జ్వరంతో బాధపడుతూ ఉంటారు. వెంటనే ఏసు ప్రభువు ఆమెను ముట్టగానే జ్వరము పేతురు అత్తగారిని విడిచిపెట్టిందని వెంటనే ఆమె ఏసుప్రభుల వారికి, మిగిలిన వారందరికీ పరిచర్య చేయడం మొదలుపెట్టిందని నాలుగు సువార్తలలో కూడా రాయబడింది! ఇలా ఏసుప్రభుల వారితో మొట్టమొదటి ముఖాముఖి పేతురు గారికి!

 

 ఇక తర్వాత చూసుకుంటే మత్తయి 5 అధ్యాయంలో మనకి ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో కొండమీద ప్రసంగం కనిపిస్తుంది కొండమీద ప్రసంగానికి ప్రత్యక్ష సాక్షి పేతురు గారు కొండమీద ప్రసంగాన్నే శాంతము తన మనసులో ఆయన భద్రపరచుకున్నాడు. కొండమీద ప్రసంగం వీరితో పాటు మరో కుష్ఠ రోగి కూడా వినినట్లు మనము తర్వాత వచనాల్లో చూసుకుంటున్నాం అది చరిత్రలో వ్రాయబడి ఉంది. అందుకే కొండమీద ప్రసంగం జరిగిన వెంటనే కొండ దిగిన వెంటనే ఒక కుష్ఠ రోగి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయుము అని అడిగితే, వెంటనే నాకు ఇష్టమే అని కుష్టి రోగిని స్వస్థపరచినట్లు మనం చూడగలము. ఇది పేతురు గారు చూసిన రెండవ అద్భుతం!

 

 ఇక కానాలను ఊరిలో జరిగిన పెళ్లిలో జరిగిన అద్భుతము నీటిని ద్రాక్షారసము చేసిన అద్భుతమునకు ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!!

 

ఇక కపెర్నహోమ్ లో శతాధిపతి యొక్క దాసుని యేసు క్రీస్తు ప్రభువుల వారు మాటమాత్రము సెలవియ్యగా స్వస్థపరచినట్లు మనం చూడగలం. దానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు.

 ఇక గెరాసేనీయుల దేశము లేదా గదరేనీయుల దేశములో దయ్యం పట్టిన ఒక వ్యక్తిని సేన అనే దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి కూడాను ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!

 పక్షవాయువుతో రోగముతో మంచం పట్టి ఉన్న ఒక రోగిని ఏసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థ పరచడానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు

 

 ఇక 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేయడానికి, ఒక అధికారి కూతురు చనిపోతే తిరిగి లేపడానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారే! శతాధిపతి కూతురిని లేపేటప్పుడు ఆయన అందరినీ కాకుండా కేవలం పేతురు యాకోబు యోహాను గారిని మాత్రమే తీసుకెళ్లినట్లు మనం చూడగలం!

 

 అంతేకాకుండా గుడ్డివారి కన్నులు తెరిచినట్లు చూడగలం. దానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!

 

 ఇక ఇద్దరుగా దేవుడు శిష్యుల్ని పంపినప్పుడు పేతురు గారిని కూడా పంపించారని గ్రహించాలి!

 ఇక మత్తయి 12 అధ్యాయం ప్రకారం దెయ్యం పట్టిన గుడ్డువాడైన మూగవాడు వాడిని స్వస్థపరిచినప్పుడు కూడా పేతురు గారు అక్కడే ఉన్నారు!

 ఇక మత్తయి 13 లో విత్తువాడు విత్తనం కోసమైనా బహుమానం చెప్పినప్పుడు ఉపమాన భావం మాకు చెప్పమని, ఉపమానంతోనే ఎందుకు చెప్తున్నావు అని ప్రశ్నించింది కూడా పేతురు గారు మరియు యోహాను గారని గమనించాలి.

ఇంకా అనేక ఉపమానాలను కోసము యేసు క్రీస్తు ప్రభువుల వారిని అడిగి దాని మర్మాలను నేర్చుకున్నది కూడా పేతురు గారు!

ఇక 14 అధ్యాయంలో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచిన సన్నివేశం ఉంటుంది. రాత్రికి యేసయ్య మరియు శిష్యులు మరో ప్రాంతం వెళ్తా ఉంటారు. శిష్యులుని ముందుగా వెళ్ళమంటారు యేసయ్య. అయితే నాలుగవ జామున ఏసు క్రీస్తు ప్రభువుల వారు సముద్రం మీద నీటి మీద నడుచుకుంటూ వస్తారు. అప్పుడు శిష్యులు భూతం అని భయపడతారు. ఏసుప్రభు అంటారు భయపడొద్దు నేను నేనే అంటారు అప్పుడు పేతురు గారు నువ్వు నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడవనివ్వండి అని పేతురు గారు అడిగిన వెంటనే, వచ్చి నడవమని చెప్తారు. పేతురు గారు కూడా నీటి మీద నడిచారు కానీ గాలిని చూసి అలలు చూసి అనుమానపడి మునిగిపోతారు. అప్పుడు యేసయ్య అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్తారు.

అయితే ఇక్కడ మన గ్రహించవలసింది ఏసుక్రీస్తు ప్రభువుల వారి వలె నీటి మీద నడిచిన భక్తుడు మానవుడు ఎవరైనా ఉన్నారంటే అది పేతురు గారు మాత్రమే!

 ఇక రెండవది అవిశ్వాసం అప నమ్మకం అనేది ఎంత ఘోరమైన విషయం అంటే యోహాను సువార్త చూసిన మిగతా సువార్తలలో పేతురు గారు చేపలు పట్టే జాలరి మరియు గజ ఈతగాడు ఒకసారి రెండు పర్లాంగుల దూరంలోనే దూకేసి ఈతకొట్టుకుని ఒడ్డుకు వచ్చినట్లు మనం చూడగలం. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ప్రపంచ గజ ఈతగాడు ఎవరైనా ఉన్నారంటే అది పేతురు గారే! కానీ అప నమ్మకం అనేది తాను ఒక గజతగాడు అనేది మర్చిపోయి ప్రభువా నన్ను కరుణించు అంటూ కేకలు వేశారు ఆయన ఈత కొట్టకుండా! అందుకే యేసయ్య అంటారు ఒకసారి ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి వెనక్కి పొమ్మంటే పోతాది అని చెప్పారు. ఒక భక్తుడు దానికి వ్యాఖ్యానాన్ని ఏం చెప్పాడంటే ఆవగింజంత అవిశ్వాసం ఉన్నా నువ్వు ఏమీ సాధించలేవు కాబట్టి అవిశ్వాసం అనేది ఎంతో భయంకరమైన విషయము అని గ్రహించాలి!

 మరొకసారి పేతురు గారు నడిచి వెళ్తుంటే అరషెకులు పన్ను వసూలు చేసేవాడు మీ గురువుగారు అరషెకులు పన్ను చెల్లించడా అని అడిగితే చెల్లిస్తారు అని చెప్పారు. పేతురు గారు ఇంట్లో ప్రవేశించి ఇక విషయం మాట్లాడక ముందే పేతురు సుంకము పన్ను ఎవరు చెల్లించాలి కుమారులా లేక పనివారా అంటే పని వారే అంటారు. అయినా ఇతరులకు అభ్యంతరం కలగకుండా నదిలోకి వెళ్లి గాలమువేసి చేప లోపల ఒక షెకెలు ఉంటది. అది నీకు నాకు కలిపి చెల్లించమని యేసయ్య చెబుతారు!

 

 ఇక 15 అధ్యాయంలో కనాను దేశపు స్త్రీ యొక్క కుమార్తెను మాట ద్వారా స్వస్త పరచడానికి కూడా ప్రత్యక్ష సాక్షి!

 యేసు క్రీస్తు ప్రభువు వారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పట్టుకొని 5000 మందికి ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు విరిచి పంచిపడ్డానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!

 

 ఇక మత్తయి 16 అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువు వారు మనుషులంతా నన్ను ఏమని అనుకుంటున్నారు అని అడిగితే ఎవరెవరో ఏదో చెప్పారు గానీ పేతురు అయితే నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనగా మెస్సయ్యవు అని ధైర్యముగా సాక్ష్యం చెప్తాడు! అందుకు యేసుప్రభు సీమోను బర్ యోనా అనగా సీమోను  యోనా కుమారుడైన  సీమోను, నువ్వు ధన్యుడవు పరలోకమందు నా తండ్రి నీకు సంగతి బయలు పరిచారు కాబట్టే నీకు తెలిసింది! నువ్వు పేతురువు, బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను! ఇంకా పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటూ ఎన్నెన్నో వాగ్దానాలు చేసినట్లు మనము మత్తయి సువార్త 16 లో గమనించగలము

 

Matthew(మత్తయి సువార్త) 16:15,16,17,18,19,21,22,23

15. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.

16. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని (క్రీస్తు అను శబ్దమునకు- అభిషిక్తుడని అర్థము) చెప్పెను.

17. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు (మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.

18. మరియు నీవు పేతురువు (పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

19. పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

21. అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపె ద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా

22. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

23. అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను.

 

అయితే ఇదే అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువుల వారు తన శిలువ మరణం కోసం చెప్పినట్టు, వెంటనే యేసయ్యను గద్దించినట్లు పేతురు చూడగలరు! వెంటనే ఏసయ్య సాతానా నా వెనక్కు పో, నువ్వు నాకు అభ్యంతర కరంగా ఉన్నావు నువ్వు మనుష్యుల సంగతుల్ని తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంచట్లేదు అని పేతురుతో చెప్పినట్లు మనం చూడగలం!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతం-4*

*4 భాగము*

*యేసుక్రీస్తు ప్రభులవారితో పేతురు*

 

అపొస్తలుల కార్యములు 4:13

13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని (లేక, సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలే! అందుకే క్లుప్తంగా ధ్యానం చేసుకుంటున్నాము!

 

                   (గతభాగం తరువాయి)

 

ఇక మత్తయి సువార్త 17 అధ్యాయంలో రూపాంతరం కొండమీద యేసయ్య పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంటబెట్టుకొని పోయి అక్కడ రూపాంతరం చెందినట్లు, అక్కడ మోషే గారు ఏలియా గారు యేసయ్యతో మాట్లాడుతూ యేసయ్య నిర్గమనం కోసం మాట్లాడుతున్నట్లు బలపరిచినట్లు మనం చూడగలం! వెంటనే పేతురు గారు వారి ముగ్గురిని చూసి ఏం పలకాలో నోట మాట రాక, అనాలోచితంగా ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ మూడు పర్ణశాల కడతాను ఒకటి నీకు, ఒకటి ఏలియాకు ఒకటి మోషేకు అని చెప్పినట్లు అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వచ్చినట్లు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అనే పలికిన శబ్దానికి కూడా పేతురు గారు ప్రత్యక్ష సాక్షి!!!

 

 ఇక బాప్తీసమ్ ఇచ్చే  యోహాను గారి కోసం ఇంతకీ ఆయన ఎవరు అని అడిగి ఆయన రాబోయే ఏలియా అనే యేసయ్యతో చెప్పించుకున్న వ్యక్తి కూడా పేతురు గారే!!

 ఇక కొండ దిగిన వెంటనే చాంద్ర రోగముతో బాధపడుతున్న ఒక యవ్వనస్తుని స్వస్థ పరిచినప్పుడు పేతురు గారు అక్కడే ఉన్నారు!!

 

 ఇక ఏసుప్రభువు చెప్పిన ప్రతి ఉపమానానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!

 

 ఇక మరో సమయంలో 18 అధ్యాయంలో పేతురు గారు అంటారు నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి, ఏడుసార్లా అని అడిగితే యేసయ్య అంటారు ఏడు మార్లు మట్టుకు కాదు నీకు 70 సంవత్సరాలు వచ్చేవరకు క్షమిస్తూనే ఉండాలి అని పేతురు గారితో యేసయ్య చెప్పారు!!

 

 ఇక తర్వాత అధ్యాయంలో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని చెప్తే అలాగైతే ఎవరు రక్షించబడగలరు అని అడిగింది కూడా పేతురు గారే! తర్వాత ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మరి మాకేటి మాకేం జరుగుతుంది అని అడిగింది కూడా పేతురు గారే! వెంటనే యేసయ్య చెప్తారు ప్రపంచ పునఃస్తాపన మందు మనిష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీ 12 మంది అపొస్తలులకు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు అని అక్కడ పేతురు గారితో చెప్పడం మనం చూడగలం!!!

 

 తర్వాత అధ్యాయంలో ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరచడానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!

 ఇక యేసయ్యను గాడిద మీద ఊరేగించినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా పేతురు గారే!

 యూదులు ఆయనను శోధించినప్పుడు, అధికారులు శోధించినప్పుడు కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు.

 రాకడ సమయం గుర్తులను 24,25 అధ్యాయాలలో చెప్తున్నప్పుడు యేసయ్య పేతురు గారు అక్కడే ఉన్నారు

 

 ఇక ప్రభు రాత్రి సంస్కారం జరిగినప్పుడు కూడా పేతురు గారు ఉన్నారు! అక్కడ యేసయ్య రుమాలు పట్టుకొని ప్రతి ఒక్కరు పాదాలు కడిగినప్పుడు, తుడిచినప్పుడు పేతురు గారు మొదట నన్ను కడగొద్దు అని చెబితే, నేను నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు అంటే మొత్తం నా తల నుండి పాదాల వరకు కడిగేయమని పేతురు గారు చెప్తారు. అది అయ్యాక నేను మీరు నన్ను వదిలేసే సమయం వచ్చింది అంటే నీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను గాని నేను నిన్ను వదలను అని చెప్పినట్లు చూడగలం. అయితే లేదు లేదు నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమని చెప్తే రాత్రి కోడి కూయక మునుపు నేనెవరో ఎరుగను అని నువ్వు మూడు సార్లు అబద్దం ఆడుతావు అని యేసయ్యతో చెప్పించుకున్నవాడు. కాదు నేను చచ్చిపోవడానికి కూడా నీకోసం సిద్ధమే అని చెప్పిన వ్యక్తి!

 ఇక యూధా ఇస్కరియోతు యేసయ్యను మోసం చేసి ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడే ఉన్నారు! వెంటనే యేసుప్రభుని అరెస్టు చేయడానికి ప్రధాన యాజకుడు యొక్క పనోడు వస్తే కత్తి దూసి అని పీక నరికేద్దామని ఏసుప్రభు కోసం యుద్ధం చేసినవాడు పేతురు గారే! నీ కత్తిని నీ ఒరలో పెట్టు అని వ్యక్తిని స్వస్థపరచినట్లు మనం చూడగలం!

 ఇక యోహాను సువార్త ప్రకారం పేతురు గారు యేసయ్య వెనకాల వెనకాలే దాక్కుంటూ దాక్కుంటూ వెళ్ళినప్పుడు యోహాను గారు పేతురు గారిని ప్రధాన యాజకుని ఇంట్లోకి తీసుకొని వెళ్ళినట్లు చూడగలం!

 అక్కడ మూడుసార్లు యేసు ఎవరో నాకు తెలీదని బొంకినట్లు వెంటనే ఏసు ప్రభుల పేతురు గారి వైపు చూసినట్లు, అది గుర్తుకొచ్చి బయటకు పోయి సంతాపపడి ఏడ్చినట్లు మనం చూడగలం! తర్వాత యేసయ్యను సిలువ మీదకి తీసుకెళ్లినప్పుడు పేతురు గారు  అక్కడ ఉండరు కానీ సమాధిలో పెట్టినప్పుడు పేతురు గారు ఉన్నారు!

 ఇక పునరుద్దానుడయ్యాక ఏసు క్రీస్తు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచాక మగ్దలేని మరియ ఇంకా కొందరు స్త్రీలు యేసయ్య తిరిగి లేచారు మాకు కనబడ్డారు అని చెప్పినట్లు చెప్పినప్పుడు, యోహాను కంటే ముందుగా పరిగెత్తి సమాధిలో ఖాళీ సమాధిని చూసినట్లు మనం చూడగలం! ఒంటరిగా ఉన్న పేతురు గారి దగ్గరకు ఏడుస్తున్న పేతురు గారికి యేసయ్య కనబడినట్లు మనము చూడగలం లూకా సువార్తలో మరియు మొదటి కోరింది పత్రికలో కూడా చూడగలరు!

 ఇది జరిగాక నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని మొట్టమొదట తిరిగిపోయిన వాడు కూడా పేతురుగారే! ఆయన వెనుక  యోహాను యాకోబు అంద్రెయ కూడా వెళ్లినట్లు చూడగలం. అక్కడ చేపలు పట్టి దూరంగా ఉన్న యేసయ్యను చూసి దిగంబరంగా ఉన్న పేతురు గారు సముద్రంలోకి దూకినట్లు మనం చూడగలం!

 బయటికి వచ్చాక ముమ్మారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లు మనం చూడగలం. మొదటిసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే అవును ప్రభువా అది నీకు తెలుసు అంటే నా గొర్రె పిల్లలను మేపు! రెండవసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా, నా గొర్రెలను మేపుమూడుసార్లు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగినట్లు మనం చూడగలం!

 ఎందుకు మూడు సార్లు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగారు? అంటే ముమ్మారు పేతురు గారు యేసు ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదు  అని బొంకినాడు కాబట్టి యేసయ్య మూడు సార్లు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడిగారు!

 అప్పుడే పేతురు గారు యవ్వనంలో చని పోరు వృద్ధాప్యం అయ్యాక మరొకరు నిన్ను తీసుకెళ్లి పోతారు అప్పుడు నీవు చనిపోతావు అని పేతురు గారికి రోజే యేసయ్య చెప్పినట్లు మనం చూడగలము!

 సంఘపు యొక్క తాళపు చెవులు, సంఘము యొక్క బాధ్యత పేతురు గారికి అప్పగించారు అక్కడ యేసయ్య!!!

 చివరికి ఏసుక్రీస్తు ప్రభువుల వారి పునరుత్థానానికి ఆరోహణమునకు కూడా అనగా పరలోకంలోకి తిరిగి వెళ్లిపోవడానికి కూడా ప్రత్యక్ష సాక్షి పేతురు గారు!!!

 అక్కడే దూతలు చెప్పిన మాటలు కూడా విన్నారు గలలియ మనుష్యులారా మీరు ఎందుకు చూస్తున్నారు ఆరోహణమైన యేసుక్రీస్తు ఒకరోజు మరలా ఇదే కొండమీదకి దిగి రాబోతున్నారు అని చెప్పడానికి సాక్షి కూడా పేతురు గారే!!!

  రకంగా పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువుల వారితో విడదీయలేని మధురానుభూతులైన ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి! ఏసుప్రభువు గారిని తెలియదని బొంకినందుకు ఎంతో బాధపడిన పశ్చాతాపపడిన అనుభవాలు కూడా పేతురు గారికి ఉన్నాయి!!!

 దైవాశీస్సులు!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*ఉపోద్ఘాతం-5*

*5 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు*

 

Acts(అపొస్తలుల కార్యములు) 1:13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26

13. వారు పట్టణములో ప్రవేశించి తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే (మతాభిమానియను) అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు (లేక, సహోదరుడగు) యూదా అనువారు.

14. వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

15. కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా *పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను*

16. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసియుండెను.

17. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.

18. యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.

19. సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

20. అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.

21. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు,

22. ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.

23. అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి

24. ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,

25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

26. అంతట వారు వీరిని గూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా పై భాగంలో వివరించిన లేఖనాల ప్రకారం యేసయ్య ఆరోహణము తరువాత శిష్యులందరూ శిష్యులతో పాటు మరి కొంతమంది స్త్రీలు మేడ గదిలో ప్రార్థనలు నిలిచి ఉన్నారని చూస్తున్నాం. వీరందరిలో మొట్టమొదటి పేరు పేతురు గారిదే!

 ఇక ప్రార్ధనలో ఉండగానే పేతురు గారికి పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. యేసయ్య 12 మంది శిష్యులు ఏర్పరుచుకున్నారు, అయితే ఒకడు ద్రోహం చేసి యేసయ్య అప్పగించి చచ్చాడు, కాబట్టి యేసయ్య మొదలుపెట్టిన పండ్రెండు అనే సంపూర్ణ సంఖ్యను పూర్తి చేయాలి, అందుకే సంఘము యొక్క బాధ్యత యేసయ్య పేతురు గారికి అప్పగించారు. మరియమ్మ గారికి అప్పగించలేదు. యేసయ్యను ప్రేమించిన శిష్యుడు పేతురు అయితే యేసయ్య ప్రేమించిన శిష్యుడు యోహాను గారు! అయితే పేతురు గారికే సంఘపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు ఇవ్వడమే కాకుండా సంఘము యొక్క బాధ్యత అప్పగించారు! కాబట్టే నాయకత్వాన్ని పునికి పుచ్చుకొని మొట్టమొదటిగా చేసిన పని 12 మందిలో తప్పిపోయిన యూదా స్థానంలో మత్తీయ్య గారిని ఏర్పర్చుకోవడం!

 అయితే దీనికోసం ఆయన తన సొంత నిర్ణయాన్ని చెప్పినట్లు కనబడలేదు, పైన చెప్పిన వివరాలు చూసుకుంటే సొంత నిర్ణయం కాకుండా, లేఖనాల్ని చూపించి మొట్టమొదట యూదా ఎలా తప్పిపోయాడో, లేఖనాల్లో యూదా మరణాన్ని కోసం, ద్రోహం కోసం ఏమని వ్రాయబడిందో జెకర్యా గ్రంథంలో విషయాలన్నీ క్రోడీకరించి ఇప్పుడు చెప్తున్నారుకాబట్టి యూదా పొందుకున్న ఉద్యోగము అపొస్తలత్వము అనే మహోన్నతమైన స్థానమును పోగొట్టుకున్నాడు కాబట్టి మహోన్నతమైన స్థానము ఎవరికి రావాలి ఎవరికో ఒకరికి చెందాలి అని చెప్పి ప్రార్థించి చీట్లు వేసి మత్తీయ్య గారిని వారు సెలెక్ట్ చేసుకున్నట్లు మనం చూడగలం!

 దీని ప్రకారం ఏమని అర్థం అవుతుంది అంటే పేతురు గారు ఎంత దుడుకు పేతురైనా యేసయ్య పునరుద్దానం తర్వాత చాలా తగ్గిపోయాడు ఆయన, విశ్వాసమందు స్థిరపడ్డారాయన! ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోకపోయినా లేఖనాలను అర్థం చేసుకొని లేకనానుసారముగా వాక్యానుసారముగా ప్రవర్తించి 12 సంపూర్ణ సంఖ్యను పూర్తి చేశాడు ఆయన!

 

  విధముగా దైవజనులమైన మనము విశ్వాసులమైన మనము కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోవాలి మనము! మనము చేయబోయే పని, మనము తీసుకునే నిర్ణయాలు అవి వాక్యానుసారమైనవా కావా? మనం మాట్లాడే మాటలు మనం చేసే స్నేహాలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా అని గమనించి దానికి ప్రకారము నడుచుకుంటే పేతురు గారు మరియు 120 మంది పెంతుకోస్తు దినాన్న ఆత్మాభిషేకం పొందుకొని ఉజ్జీవము పొందుకున్నట్లు, మనం కూడా ఉజ్జీవానికి ఆత్మాభిషేకానికి పాత్రులను కాగలము అని తెలుసుకోవాలి!!!

 

 ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయం లో సుడి గాలి వంటి ధ్వని ఆకాశము నుండి వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అంటూ అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము రకంగా కలిగింది అనేది మనం చూడగలం. ఎప్పుడూ? వాక్యానికి లోబడి వారు చేసిన పని తర్వాత వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు! దిగిన వెంటనే అక్కడ గొప్ప అల్లరి జరిగింది! అల్లరి జరిగినప్పుడు అక్కడ ఉన్న అనగా జెరూసలెం లో ఉన్న సుమారు 16 ప్రాంతాల నుండి వచ్చిన అనేకమంది విభ్రాంతి నొంది ఎటు తోచక ఉంటే, మరి కొందరు వీరు కొత్త మద్యం  ఉదయాన్నే  తాగేశారు అని అపహాస్యం చేస్తుంటే, పేతురు గారి రెండవ ప్రసంగం ఇక్కడ కనిపిస్తుంది. పేతురు గారి మొదటి ప్రసంగం ఒకటో అధ్యాయంలో 120 మంది మధ్య జరిగితే , రెండవ ప్రసంగము కొన్ని వేల మంది మధ్యలో జరిగింది. అప్పుడు చేసిన ప్రసంగము 3,000 మందిని మార్చింది!

 చూడండి యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకిన పేతురు గారు పరిశుద్ధాత్మ పొందేకా యేసే క్రీస్తుని గట్టిగా నొక్కి వక్కాణించి ధైర్యముగా ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్పు చెందారు! తర్వాత అధ్యాయములో జరిగిన ప్రసంగానికి మరో రెండు వేల మంది మారారు. ఇలాగా అనేకమందిని ప్రభువు నందు తిప్పిన గొప్ప ప్రసంగీకుడు పేతురు గారు!

 అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే పేతురు గారి ప్రసంగానికి మూడు వేల మంది ఎలా మార్పు చెందారు? ఇది రోజున టాపిక్ !

భాగాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇంతమంది మార్పు పొందడానికి నాకు కనిపించిన కారణాలు రెండు!

 మొదటిది పరిశుద్ధాత్మ అభిషేకం!

 రెండు: లేఖనముల నుండి బోధ!

 

మొదటిది:  పరిశుద్ధాత్మ అభిషేకం కోసం చూసుకుంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉంటే, నీవు పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్ముడు నీ నోరు ఉపయోగించుకొని తానే నీ నోటితో మాట్లాడుతాడు! అందుకే యోహాను సువార్తలో గాని ఇంకా మిగిలిన సువార్తల్లో అప్పుడు మీరు ఏం చెప్పాలో అని మీరు భయపడవద్దు పరిశుద్ధాత్ముడే మీ తరఫున జవాబు ఇస్తాడు అని చెప్పిన విధానంగా, మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి అప్పగించుకుంటే, పరిశుద్ధాత్ముడికి మీ నోరు అప్పగిస్తే, లేఖనాలను చూసుకునే పరిశుద్ధాత్ముడే మాట్లాడుతాడు. ప్రసంగం అయిపోయాక ఎన్నోసార్లు ఇంత ఘనంగా నేను రకంగా వాక్యము చెప్పగలిగాను అని మనకు మనమే ఆశ్చర్యపోతాంనా జీవితంలో అది ఎన్నోసార్లు జరిగింది! అనేకమంది దైవ సేవకులు జీవితంలో కొన్ని లక్షల సార్లు ఇది జరిగింది ఇది! ఎప్పుడు సాధ్యమంటే మనల్ని మనము పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నప్పుడే!

పేతురు గారు సైన్స్ మాట్లాడలేదు, తత్వశాస్త్రం మాట్లాడలేదు, వేదాంతశాస్త్రం మాట్లాడలేదు, దేనికోసం చెప్పలేదు! లేఖనములను తీసి యోవేలు గారు చెప్పిన అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను! మీ కుమారులును కుమార్తెలు ప్రవచిస్తారు మీ యవ్వనస్తులు దర్శనములు చూస్తారు వృద్ధులు కలలు కంటారు. దినములలో నా దాసుల మీద నా దాసు రాండ్ర మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కనుక వారు ప్రవచిస్తారు, ఇంకా పైన ఆకాశమందు కింద భూమి మీద సూచకక్రియలు జరుగుతాయి అంటూ యోవేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనాలను ఎత్తి చూపించి, వీరు పొందుకున్నది అదే ఆత్మ! యోవేలు గారి ద్వారా ప్రవచించిన ఆత్మను వీరు పొందుకున్నారు అని చెప్పి ఒక బలమైన ప్రసంగము చేసిన తర్వాత అనేకమందిని తీసుకుని రాగలిగారు!

 ఇక ప్రసంగం చేసేటప్పుడు మనము ముఖ్యముగా చెప్పాల్సిన విషయము ఏమిటంటే యేసయ్య సిలువను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి! దైవజనుడు మిషనరీ జార్జి విట్ఫీల్డ్ గారికి ఒక మామగారు విషయం చెప్తే, ఆయన చనిపోయే వరకు ప్రతి ప్రసంగంలోని చివరలో యేసయ్య సిలువను గుర్తుతెచ్చుకుంటూ యేసయ్య సిలువ దగ్గరకు వారిని నడిపించేవారు! వారి బదులుగా తానే ఏడ్చేవాడు ప్రసంగంలో! అప్పుడు వేలాది మంది రక్షణ పొందేవారు! పేతురు గారు కూడా యేసయ్య సిలువను జ్ఞాపకం తెచ్చుకొని, ఆయన మరణాన్ని చెబుతూ, ఆయన పునరుద్ధానం కూడా ఎత్తి చూపించి, ఆయన రాకడ మరలా రాబోతున్నాడు అని నొక్కి వక్కాణించి పరిశుద్ధాత్మ కోసం చెప్పి వారిని సిలువ దగ్గరకు నడిపినప్పుడు ఒకే ఒక ప్రసంగానికి 3,000 మంది మార్పు చెందినట్లు మనము చూడగలము!!

 

 సహోదరుడా! 1) నీ ప్రసంగంలో పరిశుద్ధాత్మునికి చోటు ఉందా?! పరిశుద్ధాత్ముడుకి నీవు అప్పగించుకుంటున్నావా?

రెండు నీ ప్రసంగాలలో ఏమున్నాయి? సైన్సా? పిట్టకదలా?! జోకులా?! తత్వశాస్త్రమా! వేదాంతమా! లేక వాక్యమా! లేఖనాలాపేతురు గారు లేఖనాలను ఉపయోగించి వారిని సిలువ దగ్గరికి తీసుకొచ్చారు, వేలాది మందిని నడిపించారు!

 నీవు నేను కూడా అలా పరిశుద్ధాత్మ పూర్ణులుగా, లేఖనాలను ఉపయోగించి వాక్యాన్ని చెబుదాం! అనేకమందిని క్రీస్తు కొరకు గెలుద్దాం!

 దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*6 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు-2*

 

Acts(అపొస్తలుల కార్యములు) 3:1,2,3,4,5,6,7,8,9,10,11,12

1. పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,

2. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.

3 .పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా

4. పేతురును యోహానును వానిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి.

5. వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.

6. అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి

7. వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

8. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.

9. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి

10. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

11. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

12 .పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

ప్రియులారా మూడు నాలుగు అధ్యాయాల్లో జరిగిన విషయాలు చూసుకుంటే, పేతురు గారు యోహాను గారు ప్రార్థన సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకు దేవాలయం ఎక్కి మెట్లు ఎక్కి వెళ్తుంటే అక్కడ మెట్లు మీద పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉన్నాడు, వాళ్ళందర్నీ బిక్షం అడుక్కుంటున్నాడు! పేతురు గారిని యోహాను గారిని కూడా చూసి భిక్షమడిగితే పేతురు గారు యోహాను గారు మాతట్టు చూడమని చెప్పి వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే ఇస్తున్నాము, అదే ఏసు నామం అని చెప్పి, వాని చేయి పట్టుకొని లేపిన వెంటనే వాడు బాగుపడతాడు. తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తారు! అప్పుడు మరి కొన్ని వేల మంది రక్షణ పొందుతారు! ఇది మూడవ అధ్యాయంలో జరిగిన విషయం!

 

 అయితే విషయం కోసం విస్తారంగా చూసుకునే ముందు కొద్దిగా చరిత్రను కూడా చెప్పనివ్వండి! ఇలాగ చరిత్ర చెప్పడానికి కారణం నాకు ఏదో చరిత్ర తెలిసని అని చెప్పడం ఎంత మాత్రం కాదు కానీ కొంచెం బాగా అర్థమవుతుంది అనే విషయం కోసమే  చెప్తున్నాను!

 పేతురు గారు యేసయ్య ఆరోహణం తర్వాత ఒక రకమైన డిప్రెషన్ కి వెళ్లారట ఇంతవరకు యేసయ్యతో ఉన్నాను యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశారు ఆయనతో ఉంటూ మనం కూడా అద్భుతాలు చేశాం ఇప్పుడు అధికారం మనతో ఉందా లేదా? సంఘపు బాధ్యత నాకు అప్పగించాడు నేను చేయగలనా లేదా అని తర్జనభర్జన పడుతూ ఉండేవారట అలాంటప్పుడు! పేతురు గారితో అన్ని విషయాలు పంచుకునేవాడు పేతురు గారు కూడా అన్ని విషయాలను పంచుకునే ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే యోహాను గారుయోహాను గారు పేతురు గారి కంటే సగం వయసు కంటే తక్కువ వయసుగలవాడు, యోహాను గారిని ఒరే యోహాను అనే పిలిచేటంత చనువు పేతురు గారికి ఉందిఅందుకే ప్రతి విషయం యోహాను గారితో పంచుకునేవాడు. అంతే కాదు యేసయ్య విషయాన్ని అయినా పేతురు గారిని యోహాను గారికి ఇద్దరికే చెప్పేవారు. ఆయనతో అనేకమైన అనుభవాల్ని పంచుకున్న భాగ్యం పేతురు గారికి యోహాను గారికి మాత్రమే కలిగింది! విషయాన్ని ఒకసారి పేతురు గారు యోహాను గారికి చెప్పారు, యోహాను గారు అన్నారు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఎందుకు అనుమానం పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదా ఇప్పుడు కూడా మనము అద్భుతాలు చేయగలము అని యోహాను గారు చెప్పారట! కానీ పేతురు గారు అద్భుతాలు చేయడానికి భయపడేవారు! ఈలోగా మూడవ అధ్యాయంలో చెప్పినట్లు ప్రార్థన పేతురు గారు యోహాను గారు నడుచుకుంటూ వెళ్లిపోతుంటే పుట్టినది మొదలుకొని కుంటివాడు పేతురు గారిని యోహాను గారిని బిక్షం అడిగారట! అడిగితే వీరు ఇవ్వకుండా వెళ్ళిపోయారు! అప్పుడు పేతురు గారిని యోహాను గారిని చూసి వాడు తిట్టుకున్నాడట. ఈలోగా యోహాను గారు అన్నారట ఇదే సమయం అద్భుతాలు చేయడానికి! అన్న వెంటనే పేతురు గారికి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిందట! ఆత్మలో భాషలు మాట్లాడుకుంటూ వారి దగ్గరికి వచ్చి మా వైపు తేరి చూడు!!  (ఆత్మ పొంగిపోతుంది. భాషలు మాట్లాడుతున్నాడు ఆయన) వ్యక్తి చూసిన వెంటనే వారి దగ్గర ఏమైనా ద్రవ్యం దొరుకుతుంది అని కనిపెడుతున్నాడు. వెంటనే అన్నారు పేతురు గారువెండి బంగారాలు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. అదే ఏసు నామము అని చెప్పి, యేసు నామములో లేచి నిలబడు అని వాడి చెయ్యి పట్టుకుని లేపిన వెంటనే వాడు నిలిచాడు నడిచేడు గంతులు వేశాడు పరిగెత్తాడు దేవుని స్తుతించాడు వారిద్దరిని పట్టుకున్నాడు! లోపుగా దేవాలయంలో ఉన్న ప్రజలంతా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే అది పండుగ సమయం. అప్పుడు పేతురు గారు  రెండవ బహిరంగ ప్రసంగం కనిపిస్తుంది అక్కడ ప్రసంగంలో కూడా ఆయన చేసింది ఏంటంటే సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు కాకుండా, ప్రజలారా ఇదేదో మా సొంత శక్తి చేత మా బలము చేత వీడిని స్వస్థ పరిచాము అన్నట్లు మా వైపు చూసి ఆశ్చర్యపోవద్దు. వీడ్ని స్వస్థపరచింది ఏంటంటే మీరు సిలువ వేసినట్టి మీరు చంపినట్టి ఏసుక్రీస్తు ప్రభువులవారి నామమే ఆయన యందలి విశ్వాసమే వీనిని స్వస్థపరచింది తప్ప మాకు శక్తి లేదు అని ఒప్పుకున్నాడు. దేవునికే సమస్త మహిమ ఘనత ఆపాదించారు!

 

 ఈరోజు దేవుడు స్వస్థపరిస్తే ప్రజలు మా అయ్యగారు ప్రార్థిస్తే అద్భుతాలు జరిగాయి, మా అయ్యగారు చెబితే ఇలా జరిగింది అని అయ్యగారికే మహిమ ఘనత ఆపాదిస్తున్నారు! తప్ప దేవుడు యేసయ్య నన్ను స్వస్థపరిచారు అనే మాటలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి! ఐదు రూపాయల అద్భుతాలు చేసి 500 రూపాయల అడ్వర్టైజ్మెంట్  పండిస్తున్నారు! అయితే ఎంతో గొప్ప అద్భుతాన్ని చేసిన పేతురు గారు గాని, ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు చేసిన యేసు క్రీస్తు ప్రభువుల వారు గానీ డప్పులు వేసుకొని చాట లేదు. ప్రమోషన్స్ చేయలేదు! అరగంట ప్రసంగంలో పావుగంట వాక్యం చెప్పి పావుగంట స్వస్థతల్ని చూపించడం లేదు! కేవలం యేసు క్రీస్తు ప్రభువుల వారికి మహిమను ఘనతను ఆపాదించి ఆయనే వీడిని స్వస్థ పరిచాడు తప్ప ఆయన నామమందలలి విశ్వాస మూలము గానే ఆయన నామమే వీడ్ని స్వస్థపరచింది తప్ప మా బలం వల్ల కాదు అని చెప్పారు!

 తర్వాత మరల లేఖనాలను చూపించి ప్రసంగం చేశారు. సమూయేలు గారు మొదలుకొని ఇంతవరకు వచ్చిన ప్రవక్తలంతా ఎవరిని గూర్చి ప్రకటించారో వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్పారు. దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మనము వారసులమై ఉన్నాము, నిజమైన వారసుడు ఎవరంటే ఇస్సాకు గారు కాదు వారసుడు ఇస్సాకు గారు శారీరిక సంబంధమైన వారసుడు, అయితే నిజమైన వారసుడు ఆత్మీయ వారసుడు యేసు క్రీస్తు ప్రభువు వారు! ఆయన ద్వారానే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము కలుగుతుంది! నామముందే మన రక్షణ పొందగలము అని ధైర్యంగా వాక్యం చెప్పారు!

 ఇంకా పెద్దలు అసూయ తోటి బలత్కారంగా పట్టుకున్నట్టు వారిని చెరసాలలో వేసినట్టు చూడగలం. తర్వాత రోజు పేతురు గారిని వారు బలం చేత నామం బట్టి దీనిని చేశారు అంటే 4:8 నుండి పేతురు గారు అంటారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను ప్రజల అధికారులారా పెద్దలారా దుర్బలునకు చేయబడిన ఉపకారాన్ని గూర్చి దేని వలన స్వస్థత పొందిననే నేడు మమ్మలను అడుగుతున్నారు మీరు అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమిటంటే మీరు సిలువ వేసినట్టయు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అనగా ఏసుక్రీస్తు ప్రభువులవారే! రాయి మూలకు తరరాయి అయ్యింది.

 మరొక ముఖ్యమైన విషయం చెబుతున్నారు 12 వచనం: మరి ఎవరి వలనను రక్షణ కలుగదు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద ఈయబడిన నామమున రక్షణ పొందలేము. 13 వచనం ఇలా చెప్పినప్పుడు వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడే వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి!

 కాబట్టి తర్వాత వారిని కొట్టేసి బయటకు పొమ్మన్నట్లు ఈనామము బట్టి మీరు ప్రకటించకూడదు అని చెబితే మేము దేవుడికి భయపడాలా మీకు భయపడాలా మీరు కొట్టుకున్నా మమ్మల్ని చంపినా మేము కన్న వాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని చెప్పారు! ప్రసంగం ద్వారా అనేక వేల మంది రక్షణ పొందారు పురుషుల సంఖ్య 5000 మంది అయిపోయిందట! వారి స్త్రీలు పిల్లలు ఎంతమందో మనకు తెలియదు!

 తర్వాత వాళ్లంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ప్రార్థన చేసిన వెంటనే వారు కూడియున్న చోటు కంపించెను!!

 ఎంత బలమైన సేవ వారు చేశారో కదా!

 మొట్టమొదటిగా భాగం ప్రకారం చూసుకుంటే వారు అద్భుతాన్ని చేసి అద్భుతానికి పూర్తి క్రెడిట్ యేసు నామమునకు దేవునికి ఇచ్చారు తప్ప తమ సొంత మహిమను కోరుకోలేదు!

 రెండు గత భాగంలో చెప్పినట్లు లేఖనాలనే ఉపయోగించి వాక్యం చెప్పారు అందువల్ల అనేక వేలమంది రక్షణపొందారు!

 ఇక నామము కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు అందుకే దేవుడు వారిని వాడుకున్నారు!

 నీవు నేను కూడా పేతురు గారిని మాదిరిగా పెట్టుకుని, పరిశుద్ధాత్మతో నింపబడి, అద్భుతాలు జరిగిన ఏమి జరిగినా దేవునికే మహిమను ఆపాదిస్తూ, లేఖనానుసారముగా వాక్యము చెబితే, అనేక మందిని దేవుడు రప్పించగలడు!

  తర్వాత చనిపోవడానికి కూడా మనము సిద్ధమైనప్పుడు మరణమునకు వరకు వెళ్లి కూడా మనల్ని తప్పించగలిగిన దేవుడు మన దేవుడు!

 మనల్ని వాడుకొని తన మహిమకు ఘనతకు పాత్రులుగా చేయగలడు!

 అట్టి కృప మనందరికీ కలుగును గాక!

 ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*7 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు-3*

Acts(అపొస్తలుల కార్యములు) 5:1,2,3,4,5,6,7,8,9,10,11,15,16

1. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

2. భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

3. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

4. అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.

5. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను;

6. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

7. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

8. అప్పుడు పేతురుమీరు భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

9. అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను.

10. వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడిప్రాణము విడిచెను. పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

11. సంఘమంతటికిని, సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.

15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.

16. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక పేతురు గారి కోసం సంఘంలో పేతురు గారి యొక్క పాత్ర ధ్యానం చేస్తూ ముందుకు పోతే ఐదవ అధ్యాయంలో 3 చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చూడగలం.

 మొదటిది పరిశుద్ధాత్మను మోసగించాలి అనుకొని అననీయ సప్పీరలు చనిపోవడం. దీనికోసం ధ్యానం చేసుకుంటే భూమిని అమ్మి మొత్తం ధనం పరిచర్య కు ఇస్తాము అని చెప్పారు కానీ కొంచెం దాచుకున్నారు కొంచెం తెచ్చారు. దీనికోసం విస్తారంగా ధ్యానం చేయాలనుకోవట్లేదు అయితే మన పాఠ్యం ఏమిటంటే పేతురు గారి యొక్క ఆత్మ పూర్ణత! పేతురు గారి కున్న వివేచనా వరము! దానికోసం చూసుకుందాం!

 మొదటగా భర్త అననీయ వస్తాడు ధనం పట్టుకొని వచ్చాడు, అపొస్తలు పాదముల దగ్గర పెట్టిన వెంటనే పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు మీ భూమిని అమ్మిన వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తున్నావు, నీ వద్ద ఉన్నప్పుడు డబ్బులు మీదే కదా! అమ్మిన తర్వాత కూడా నీదే కదా! ఎవరిని మోసం చేసావు పరిశుద్ధాత్మను మోసగించాడు. పేతురు గారు ఏమి అనుకుంటానే అననీయ అక్కడే  ప్రాణాలు విడిచి చచ్చిపోయాడు. అక్కడ యవ్వనస్తులు వీళ్లంతా మరి ఎలాంటివారో మాకు తెలీదు గాని భార్యకు కూడా కబుర్లు చెప్పుకుంటా అప్పు చెప్పు అడక్కుండా సమాధి చేసేశారుమధ్యాహ్నం మూడు గంటలకి తన భార్య జరిగింది ఏమీ తెలియకుండా వచ్చింది ఆమెకు కూడా అదే ఒక ప్రశ్న. భూమిని ఇంతకే అమ్మారా అంటే అంతకే అని చెప్పింది! పేతురు గారు అన్నారు ఆత్మను ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించితివి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు ఇంకా లోపలికి రాలేదు వాకిట్లో ఉన్నాయి వారు నిన్ను కూడా మోసుకొని పోతారు అన్నారు. ఆమెకూడా అక్కడ చచ్చిపోయింది. ఇక్కడ కార్యము చేసింది పరిశుద్ధాత్మ దేవుడు! మోసం చేయడం ఏమాత్రం తట్టుకోలేక!

 ఇంతటి వివేచన వరము అంతటి ఆత్మ పూర్ణుడు పేతురు గారు. నిత్యము పరిశుద్ధాత్మ తాకిడితోనే ప్రభువు సన్నిధితోనే ఆయన జీవించేవారు అని దీని ప్రకారం అర్థమవుతుంది!

 

 12 వచనం ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్కార్యలు అపోస్తులుల చేత చేయబడుచుండెను. ఇంకా 15 వచనం అందుచేత పేతురు గారు వస్తుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరిమీదైనను అతని నీడ కనీసం నీడైనా పడాలని మంచాల మీద పరుపులు మీద వారు ఉంచారు అంట ఎందుకంటే ఒక్కొక్కరిని ముట్టుకుని టచ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి పేతురు గారి దగ్గర అంత సమయం లేదు కాబట్టి కనీసం ఆయన నీడ పడితే బాగుపడుతుందని ఆయన నడిచి వెళుతుండగా నీడ పడే దారిలోని మంచాల మీద పరుపులు మీద రోగులు ఉంచితే నీడ ఎవరి మీద పడిందో అందరూ స్పష్టత పడ్డారు అని బైబిలే చెబుతుంది! ఇంతటి ఆత్మపూర్ణుడుగా మారిపోయాడు ఆయన!

 ఇక అధ్యాయంలో తర్వాత విషయం ఏమిటంటే అప్పుడు అపోస్తులుల అందరిని పేతురు గారితో పాటు మొత్తం అపోస్తులందరినీ తీసుకెళ్లి చెర్సాల్లో పెట్టేశారు. అయితే రాత్రి ప్రభువు దూత వచ్చి వీళ్లందరినీ విడిపించి తీసుకెళ్లిపోయి దేవాలయంలో వాక్యం చెప్పమంటే అక్కడికి వెళ్లి  దేవాలయంలో సువార్త చేస్తున్నారు. రకంగా పేతురు గారిని ఒకసారి చెరసాల నుంచి పేతురు గారిని పాటు ఇతర శిష్యులు కూడాను విడుదల చేసినట్టు చూడగలం దేవుని యొక్క దేవదూత! అప్పుడు మరో ప్రసంగం చేశారు. మేము మనుషులకు కాదు దేవుడికి లోబడాలి కదా. మీరు మ్రానున వేలాడదీసిన చంపేసిన యేసును మన పితరుల దేవుడు లేపి ఇస్రాయేలుకు మారుమనస్సు పాపక్షమాపణ దయచేయడానికి దేవుడే  అధిపతిగాను రక్షకుడిగాను ఆయన హెచ్చించి ఉన్నాడు. మేము దానికి సాక్షులు, దేవుడు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ కూడా సాక్షులు అని చెప్పినట్లు చూడగలం.

 

 ఇక ఆరవ అధ్యాయం చూసుకుంటే అక్కడ ఒక డిస్ట్రబెన్స్ కలుగుతుంది విశ్వాసుల మధ్య. అప్పుడు ఏడుగురు పెద్దలని అక్కడ ప్రతిష్టించినట్లు మనం చూడగలం దానికి కూడా అధ్యక్షుడు పేతురు గారే!

 ఇక ఎనిమిదో అధ్యాయం రాబోవు సరికి సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు ఫిలుప్పు గారి వాక్య పరిచర్య ద్వారా. అయితే సమరయవారు బాప్తిసం పొందారని తెలిసి, సంఘము పేతురు గారిని యోహాను గారిని అక్కడ పంపించినప్పుడు పేతురు గారు అధ్యక్ష పదవిలో అక్కడికి వచ్చారు. అప్పుడు పేతురు గారు యోహాను గారు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు చూడగలం. అక్కడ ఒక గారడీ వాడు రక్షణ పొందిన గారడి వాడు అక్కడ ఉన్నాడు, వాడు అంటాడు (వాడి పేరు కూడా సీమోను) . అతడు పేతురు గారి దగ్గర ధనం పెట్టి వరం నాకు కూడా ఇవ్వండి నేను కూడా ఎవరిమీదైనా చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకునే లాగా. వెంటనే పేతురు గారు గద్దిస్తారు ఇది అధ్యాయంలో పేతురు గారు కనబడడం.

 

ఇక తొమ్మిదో అధ్యాయంలో  మరల పేతురు గారి పరిచర్య కనిపిస్తుంది. ఇది చెప్పేముందు మరో మాట చెప్పాలి. సంఘంలో పౌలుగా మార్చబడిన సౌలు గారి సమయములో హింసలు శ్రమలు ఎక్కువవడం వల్ల సంఘం చెదిరిపోయింది. అప్పుడు శిష్యులంతా చెదిరిపోయారు సువార్త ప్రకటిస్తూ ప్రపంచ దేశాలు అంత చెదిరిపోయారు. విశ్వాసులు కూడా చెదిరిపోయారు. అప్పుడు కేవలం యాకోబు గారు అనగా యేసయ్య పెద్ద తమ్ముడు. గతంలో చెప్పడం జరిగింది యేసయ్య మరణం వరకు తన సహోదరులు రక్షణ పొందలేదు కానీ ఆయన చనిపోయినప్పుడు తమ్ములకి చెల్లెలికి చాలా బాధ కలిగింది. యేసయ్య పునరుద్దానుడు అయ్యాక ఆయన తమ్ముళ్లు చెల్లెళ్లు అందరూ రక్షణ పొందారు. అయితే పెద్ద తమ్ముడు యాకోబు గారు చిన్న తమ్ముడు యూదా గారు మాత్రమే పరిచర్య కొనసాగించారు. వీరే పత్రికలు రాశారు. సరే ఇలాగా శ్రమలు విస్తరించినప్పుడు పేతురు గారు యాకోబు గారు మాత్రం యెరుషలేములో ఉండిపోయారు. మిగిలిన వారంతా చెదిరిపోయారు. పేతురు గారు అవసరమైనప్పుడు వివిధ ఏరియాలోకి వెళ్తూ సువార్త పరిచర్య చేసేవారు. సంఘపు అధ్యక్ష బాధ్యత మాత్రం యాకోబు గారికి అప్పగించారు. యాకోబు అక్కడే ఉండి పోయారు యాకోబు గారికి నీతిమంతుడు అనే పేరు ఉంది కాబట్టి యాకోబు గారిని ఏమి అంటూ ఉంటే వారు కాదు. పేతురు గారు మాత్రం యెరుషలేముకు మిగిలిన దేశాలకు తిరుగుతూ ఉండేవారు పరిచర్య చేస్తూ ఉండేవారు.

 ఇలా జరుగుతున్నప్పుడు పేతురు గారు అన్ని దేశాలలో ఎవరెవరైతే అన్యులు గాని యూదులు గాని రక్షణ పొందుతారో వారి దగ్గరికి వెళ్లి పరిచర్య చేస్తూ ఉండేవారు. అలాగే లిడియా అనగా లుద్దలో పరిశుద్ధుల వద్దకు కూడా వచ్చారు. అక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం పట్టిన ఐనెయా అనే వ్యక్తిని స్వస్థపరచినట్లు మనం చూడగలం. ఇక తర్వాత లుద్దషారోన్ లో కూడా అక్కడ ప్రాంతాల్లో పరిచర్య చేసినట్లు, తర్వాత యొప్పేలో కూడా పరిచర్య చేసినట్లు చూడగలం. అక్కడ తబిత అనే ఒక శిష్యురాలిని చనిపోయి ఉండగా ఆమెకు పేతురు గారు ప్రార్థించి బ్రతికించినట్లు మనం చూడగలం. ఇంకా యొప్పే లోని చర్మకారుని ఇంటిలో పేతురు గారు అనేక రోజులు ఉన్నట్లు మనం అధ్యాయంలో చూడగలం.

 ఇంతటి గొప్ప పరిచర్య చేస్తూ ఆయన ప్రపంచమంతా తిరిగారు. రోజుల్లో ఎంత గొప్ప పరిచర్య చేసినా తనని తాను తగ్గించుకుంటూ, మాదిరిగా ఉంటూ, పరిచర్య చేశారు తప్ప ఆస్తులు సంపాదించుకోవాలని బంగ్లాలు కట్టుకోవాలని ఒకే ప్రాంతంలో సెటిల్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోకుండా, పరదేశులుగా ఉంటూ సువార్త ప్రకటించిన గొప్ప మనిషి!

 మనము కూడా అదే బాటలో తప్పకుండా పయనించాల్సిన అవసరం ఉన్నది అని మర్చిపోకూడదు!

 దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*8 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు-4*

 

Acts(అపొస్తలుల కార్యములు) 10:3,4,5,6,9,10,11,12,13,14,15,16,17

3. పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

4. అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

5. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;

6. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగి యున్నాడని అతనితో చెప్పెను.

9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.

10. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై

11. ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమిమీదికి దిగివచ్చుటయు చూచెను.

12. అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకు పురుగులును, ఆకాశపక్షులును ఉండెను.

13. అప్పుడు పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్ద మతనికి వినబడెను.

14. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా

15. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు శబ్దము అతనికి వినబడెను.

16. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే పాత్ర ఆకాశమున కెత్తబడెను.

17. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక పేతురు గారి కోసం సంఘంలో పేతురు గారి యొక్క పాత్ర ధ్యానం చేస్తూ ముందుకు పోతే 10 అధ్యాయంలో 3 చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చూడగలం.

ప్రియులారా అధ్యాయంలో రెండు దర్శనాలు మనకు కనిపిస్తే మొదటి దర్శనం శతాధిపతి అయిన కొర్నేలు గారికి కలిగితే, రెండవ దర్శనం పేతురు గారికి కలిగింది. కొర్నేలుగారి దర్శనంలో దేవుని దూత పేతురు గారిని పిలిపించుకొని సువార్తను వినమని సత్య సువార్తను తెలుసుకోమని చెబితే, కొర్నేలు గారు తన దగ్గర ఉన్న సైనికులను తన దాసులను యొప్పేలో ఉన్న కొర్నేలు గారి దగ్గరికి పంపిస్తారు. సైనికులు దాసులు సమయానికి పేతురు గారికి ఒక దర్శనం కనిపిస్తుంది అప్పటికి పేతురు గారు చాలా ఆకలితో ఉన్నారు ఇంటివారు భోజనం సిద్ధపడుతున్నారు అనగా చర్మకారుడైన సీమోను గారి ఇల్లు ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకని ప్రార్థన చేసుకుంటున్నారు పౌలు గారికి మనకి తేడా ఏంటి అంటే ఖాళీగా ఉంటే మన సెల్ ఫోన్ లో ఏవో ఏవో చూసుకుంటావు లేదా టీవీలు చూసుకుంటాం కానీ పేతురు గారి పరిచర్యకు ఏసుక్రీస్తు ప్రభువుల వారి పరిచర్యకు ఆది అపోస్తులుల పరిచర్యకు అంతటి బలము శక్తి ఎలా కలిగిందంటే వారు ఖాళీ దొరికితే ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధనే! పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనాన్ని చూశారు ఆత్మవేశుడై అనగా ఆత్మ పూర్ణుడై దర్శనంలో ఆకాశం తెరవబడింది నాలుగు చెంగులు పట్టి దించబడిన ఒక పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర పేతురు గారి ముందుకు వచ్చింది. అందులో భూమి మీద ఉండే నాలుగు కాళ్లతో నడిచే జంతువులు ప్రాకే పురుగులు ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి. అప్పుడు పేతురు నువ్వు ఆకలిగా ఉన్నావు కదా లేచి చంపుకొని తిను అని ఒక శబ్దం వినబడింది. పేతురు గారు అన్నారు వద్దు ప్రభువా నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఏదైనా నేనెప్పుడూ తినలేదు అని చెప్తే, దేవుడు దూత దేవుడు పవిత్రంగా చేసిన వాటిని నీవు నిషిద్దముగా ఎంచకూడదు, తినుము అంటే తినలేదు. రెండవ సారి కూడా అదే శబ్దము వినబడింది రెండోసారి అదే జవాబు! మూడోసారి కూడా అలాగే కలిగింది! మూడోసారి కూడా అదే జవాబు! ఇక పాత్ర ముమ్మారు తిరస్కరించినందువల్ల తిరిగి పరలోకం వెళ్ళిపోయింది! ఇది దర్శనం!

 వెంటనే పేతురు గారు దర్శనం యొక్క అర్థం ఏంటో తెలియక ఆశ్చర్యపోతున్నప్పుడు దేవుని దూత ఏమని చెప్తాడంటే నీకోసం ముగ్గురు మనుషులు కిందనే వెదుకుతున్నారు వారిని నేనే పంపించాను నోరు మూసుకొని వెళ్ళి వారితో పాటు వెళ్ళు అని చెప్తే, పేతురు గారు కొర్నేలిగారి దర్శనం వివరాలు విని తర్వాత రోజు కైసరియలోని కొర్నేలి గారి దగ్గరికి వెళ్లినట్టు మనం చూడగలంపేతురు గారికి దర్శనం యొక్క అర్థం అప్పుడు తెలిసింది ఏమిటంటే ఎవరిని అంటరాని వారిగా నిషిద్ధమైన వారిగా ఎంచకూడదు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు! జాతి బేధము గాని, మతబేదముగాని, కులబేధము గాని అంతస్తుభేదం గాని చూపించకూడదు. ప్రభువు దృష్టికి అందరూ సమానులే అని నిజానికి ఆదర్శనానికి ఒక అర్థం!

దీనికోసం ఇంకా చెప్పే ముందు ఇక్కడ నా సొంత అభిప్రాయాన్ని చెప్పనీయండి! నేనేమనుకుంటానంటే పేతురు గారు ఆరోజు పరలోకము నుండి కలిగిన దర్శనానికి ఆదర్శనములోనే లోబడి పాత్రలో ఉన్న జంతువులను పక్షులను వాటిని తిని ఉంటే బహుశా పౌలు గారి కంటే ఇంకా గొప్ప పరిచర్య చేసేవారేమో!!! కానీ అక్కడ తిరస్కరించారు కాబట్టి పౌలు గారే ఎక్కువ పరిచర్య చేశారు పేతురు గారి కంటే అనేది కేవలం నా అభిప్రాయం మాత్రమే అండి! ఇది నా అభిప్రాయం!

 

 సరే పేతురు గారు కొర్నేలు గారి ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న వారిని చూశారు. కొర్నేలి భక్తుడు  తన బంధువులను స్నేహితులని గ్రామస్తులను పిలిచారు వాక్యం వినడానికి! అప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తూ అంటారు దేవుడు పక్షపాతి కాడు. అందరికీ ప్రభువు! ఇంకా ప్రసంగం చేస్తూ ఉండగానే వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగినట్లు మనం చూడగలం! అప్పుడు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరికి నీటికి ఆటంక పరచగలరా అని చెప్పి అక్కడ వారందరికీ బాప్తిసం ఇచ్చినట్లు మనం చూడగలం!

అధ్యాయంలో పేతురు గారు రెండు మాటలు చెబుతారు మొదటిది దేవుడు పక్షిపాతి కాడు అని నిజముగా గ్రహించాను!

 రెండు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు!

  రెండు మాటలు ఎంతో విలువైనవి!

 

 ఇక మూడవ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే 47,48 వచనాలు: అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీటికి ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమమందు వారు బాప్తిస్మము పొందాలి అని ఆజ్ఞాపించెను, వెంటనే వారు బాప్తిస్మము తీసుకున్నారు!

 జాగ్రత్తగా గమనించాలి మత్తయి 28 అధ్యాయం ప్రకారము మార్కు 16 అధ్యాయం ప్రకారం యేసయ్య ఏమని చెప్పారు సువార్తను ప్రకటించండి వారు నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి! నామములో బాప్తిసం తీసుకోవాలని చెప్పారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి! ఇది యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ కదా!!! మరి దానికి విరుద్ధముగా పేతురు గారు ఏసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి అని ఆజ్ఞాపించారు!!! మరి ఇది యేసయ్య ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకమే కదా అంటే కానే కాదు. ఆత్మపూర్ణుడైన పేతురు గారికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ఆత్మీయ మర్మము ఏమిటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామము ఏమిటంటే యేసు నామము! తండ్రి యొక్క నామము యేసు నామము! కుమారుడు యొక్క నామము ఏసుక్రీస్తు! పరిశుద్ధాత్మ యొక్క నామము ఏసుక్రీస్తు !

కాబట్టి ఏసుక్రీస్తు నామములో మీరు బాప్తీస్మం పొందాలి అని పేతురు గారికి పరిశుద్ధాత్ముడు బయలుపరచగా పేతురు గారు అదే చెప్పారు!

 ఈరోజు చాలామంది యేసు నామములోనే బాప్తిసం పొందాలి. యేసు నామములో బాప్తిస్మము పొందకపోతే బాప్తిస్మము చెల్లదు అని కొంతమంది, కాదు కాదు కాదు యేసయ్య స్వయాన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము పొందమన్నారు కాబట్టే అలాగే పొందాలని కొంతమంది గొడవలు పడుతున్నారు!!

 అయితే రెండు ఒకటే అని చెప్పడం జరుగుతుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క నామమును పరిశుద్ధాత్మ నామమును మూడు ఏసు నామమే కాబట్టి ఎలాగైనా ఒకటే అని నా ఉద్దేశం! అయితే ప్రియ దైవజనులారా గొడవ గోల లేకుండా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామము అనగా యేసు నామములో బాప్తీస్మం ఇచ్చుచున్నాను అని చెప్పి బాప్తిస్మమిస్తే గొడవ గోల ఉండవు అని నా ఉద్దేశ్యం!!!

 దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*9 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు-5*

 

Acts(అపొస్తలుల కార్యములు) 11:1,2,3,15,16,17,18

1. అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.

2. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు

3. నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.

15. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.

16. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్ధాత్మతో) బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని.

17. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.

18. వారు మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక పేతురు గారి కోసం సంఘంలో పేతురు గారి యొక్క పాత్ర ధ్యానం చేస్తూ ముందుకు పోతే 11 అధ్యాయంలో మరో ముఖ్యమైన విషయం మనం చూడగలం.

ప్రియులారా అధ్యాయంలో పేతురు గారు యొప్పే నుంచి కొన్ని రోజులకు యెరుషలేము వచ్చిన వెంటనే నువ్వు అన్యజనుల మధ్యకి వెళ్లి సేవచేశావు బాగానే ఉంది కానీ సున్నతి పొందని వారి వద్ద వారిగృహంలో ఉంటూ వారి ఇంట్లో ఎందుకు భోజనం చేశావు అంటూ వాదం పెట్టుకున్నారు. ఎవరితోటి పేతురు గారితో! గమనించాలి అప్పటికే అధ్యక్ష పదవిని యేసయ్య సహోదరుడు యాకోబు గారికి ఇచ్చేశారు పేతురు గారు. ఎందుకంటే పదవిలో ఉంటూ పరిచర్య చేయడం కష్టం కాబట్టి పేతురు గారు అధ్యక్షుడు పదవి యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు గారికి ఇచ్చేసి వచ్చేసారు. ఇప్పుడు అది చూసుకొని పేతురు గారి మీద సున్నతి పొందిన బ్యాచ్ వాదం పెట్టుకుంది. అప్పుడు పేతురు గారు రెచ్చిపోలేదు గాని ఒరేయ్ ఏం జరిగిందంటే అంటూ యొక్క చర్మకారుడైన సీమోను ఇంటిదగ్గర మధ్యాహ్నం పూట ప్రార్ధన చేయుచుండగా పరవశుడనైపోయాను! అప్పుడు నాకు దర్శనం కలిగింది! నాలుగు చెంగులు పట్టి దింపబడిన దుప్పటి ఒకటి నా దగ్గరకు వచ్చింది అంటూ దర్శనం మొత్తం చెప్పి, అదే సమయంలో కైసరియ నుండి నా యొద్దకు కొర్నేలు పంపగా వచ్చిన ముగ్గురు మనుషులు కొర్నేలు గారి కోసం చెప్పి దర్శనం కోసం చెప్పినప్పుడు, దేవుని దేవదూత నువ్వు అతనితో వెళ్ళమని చెప్తే నేను వెళ్లాను! అక్కడికి వెళ్లి అందరికీ నేను వాక్యము, సువార్త ప్రకటిస్తూ ఉండగా మన మీదికి పరిశుద్ధాత్ముడు ఎలా దిగెనో వారి మీద కూడా అలాగే దిగేడు. కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి నేను బాప్తిస్మము ఇచ్చాను. ఎందుకంటే యోహాను గారు అన్నారు కదా  నేను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు కాబట్టి మాట జ్ఞాపకం వచ్చింది! పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన వారికి నేను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాను. కాబట్టి వారి దగ్గర ఉన్నాను వారి దగ్గర భోజనం చేశాను అని చెప్పినప్పుడు ఇక వారు ఏమీ అడ్డము చెప్పక, దేవుడు అన్యజనులకు కూడా మారుమనసు ఇచ్చాడు అని దేవుని మహిమ పరిచారు!!!

 ఇది అధ్యాయంలో జరిగిన మాట.

 

 పేతురు గారు ఏమి చేసినా ఏమి మాట్లాడినా ప్రసంగం చేసినా లేఖనములను చూపించి మాత్రమే తన జవాబు గాని తన ప్రసంగం గాని కొనసాగించారు. లేఖనములు చూపించకుండా ఎక్కడా ప్రసంగం చేయలేదు ఆత్మ పూర్ణుడై ప్రసంగం చేశారు! ఇదే మాటిమాటికి నేను చెప్తున్నాను ఇక్కడ కూడా పెద్ద వివాదాన్ని లేఖనాలు చూపించి ఇట్టే సద్దు మణిగించేశారు పేతురు గారు!!!

 

ప్రియులారా ఇంకా 15 అధ్యాయంలో మరొక చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది . అసలు జరిగిందేంటంటే యూదయ నుంచి కొంత మంది వచ్చి సున్నతి పొందిన బ్యాచ్, మీరు సున్నతి పొందితేనే గాని మీరు రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి వారిని కలవర పెట్టారు. మీరు బాప్తిస్మము పొందారు బాప్తిజంతో పాటు సున్నతి కూడా పొందాలని అపోస్తులులు వారికి అధికారం ఇవ్వకుండానే సొంత మాటలు చెప్పి, వారిని అనగా విశ్వాసులను కలవర పెడితే పౌలు గారికి బర్నబాగారికి వారితో వాదం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా కాదు దీని సంగతి తేల్చాలి అని అన్యజనులలో రక్షించబడిన సంఘము పౌలు గారిని బర్నబాగారిని యెరుషలేము పంపించడం జరిగింది. అప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది! రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరెవరున్నారు అంటే పేతురు గారు ఉన్నారు యోహాను గారు ఉన్నారు ఇక యాకోబు గారు ఉన్నారు చిన్న యాకోబు ఉన్నారు. మిగతా శిష్యులు ఉన్నారు.

 

 అప్పుడు సున్నతి పొందిన బ్యాచ్ తప్పకుండా సున్నతి పొందాలి అని వాదించడం మొదలు పెట్టారు! అప్పుడు అపోస్తులులు కూడా చాలా వాదించడం జరిగింది. అప్పుడు పేతురు గారు చెప్తున్నారు 15:7 లో ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరుచుకున్నానని మీకు తెలుసు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను కాబట్టి పరిశుద్ధాత్మకు బేధము లేనప్పుడు మన పితరులైనా మనమైనా మోయలేని కాడిని అన్యజనుల నుండి రక్షించబడిన శిష్యుల మెడ మీద ఎందుకు పెడతారు? ప్రభువైన యేసు క్రీస్తు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని మనకు తెలుసు కదా అలాగే వారు కూడా రక్షణ పొందుతున్నారు! కాబట్టి వారికి సున్నతి పొందాలని మనం వాదించొద్దు అని చెప్పిన తర్వాత  అధ్యక్షుడుగా ఉన్న యాకోబు గారు లేచి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నారు సహోదరులారా అన్య జనుల నుండి దేవుడు తన నామము కొరకు జనాన్ని ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెను సుమియోను అనగా సీమోను పేతురు గారు వివరించి ఉన్నారు అంటూ, ఆయన కూడా ప్రవక్తలు లేఖనాలని చూపించి అంటున్నాడు కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టొద్దు. విగ్రహ సంబంధమైన అపవిత్రత జారత్వము గొంతు పిసికి చంపిన వాటిని రక్తమును విసర్జించుటకు పత్రిక పంపాలి అని జడ్జిమెంట్ ఇచ్చారు!!

 

Acts(అపొస్తలుల కార్యములు) 15:1,2,5,6,7,8,9,10,11,13,14,15,16,17,18,19,20,21

1. కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.

2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.

5. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.

6. అప్పుడు అపొస్తలులును పెద్దలును సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను

7. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.

8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

9. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని భేదమైనను కనుపరచలేదు

10. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?

11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

13. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా, నా మాట ఆలకించుడి.

14. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.

15. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా

16. తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు

17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి సంగతులను తెలియ

18. పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.

19. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

21. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

 

దీనికి నాయకుడు కూడా పేతురు గారు! ముఖ్య సమస్యకు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించిన వాడు కూడా పేతురు గారే అని గ్రహించాలి! ఇక్కడ పేతురు గారు గాని యాకోబు గారు గానీ మరల లేఖనాల్ని చూపించే సమస్యను పరిష్కరించారు!

 

 రెండవది పేతురు గారికి అధ్యక్ష పదవి తప్పిపోయినా దేవుడు ఇచ్చిన బాధ్యతను మర్చిపోకుండా బాధ్యతలు నెరవేర్చడమే కాకుండా పెద్ద వివాదాలను కూడా వాక్యాన్ని చూపించి సరిదిద్దిన గొప్ప వ్యక్తి పేతురు గారు!

 

 దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*10 భాగము*

*యేసుక్రీస్తు ఆరోహణం తరువాత పేతురు-6*

 

Acts(అపొస్తలుల కార్యములు) 12:1,2,3,4,5,6,7,8,9,10,11

1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.

3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. దినములు పులియని రొట్టెల పండుగ దినములు.

4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల (పదునారుగురు) సైనికులకు అతనిని అప్పగించెను.

5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.

6. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.

7. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టిత్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

8. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను మనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.

9. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.

10. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11. పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.

 

     ప్రియులారా పేతురు గారు ఇంతటి శక్తివంతమైన పత్రికలు వ్రాయడానికి కారణం తప్పకుండా యేసుక్రీస్తు ప్రభులవారితో ఆయనకున్న అనుభవాలను చూసుకున్నాము! ఇక యేసయ్య తర్వాత పేతురు గారి పాత్ర చూసుకుందాం!

 

                   (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా ఇక పేతురు గారి కోసం సంఘంలో పేతురు గారి యొక్క పాత్ర ధ్యానం చేస్తూ ముందుకు పోతే 12 అధ్యాయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం మనం చూడగలం.

మొదట హేరోదు పెద్ద యాకోబు గారిని చంపేస్తాడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు ఉన్నారు కదా యోహాను గారి పెద్దన్నయ్యని ఖడ్గముతో చంపించేస్తాడు! యాకోబు గారు ఏసుప్రభుల వారికి అన్నయ్య అవుతాడు! అతన్ని చంపించేస్తాడు! ఇది యూదులకు ఎంతో ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు గారిని కూడా పట్టేసుకుని పేతురు గారిని కూడా చంపాలనుకుంటాడు! పస్కా పండుగ అనగా సుమారుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయి సుమారుగా రెండు సంవత్సరాల అయ్యుండొచ్చు అప్పుడు పేతురు గాని కూడా పట్టుకొని చెరసాలలో వేసేసి పస్కా పండుగ అయిపోయిన వెంటనే చంపేద్దాం అనుకున్నాడు. అలాగని చెప్పి నాలుగు చతుష్టయాలు అనగా 16 మంది సైనికులను కాపలాగా ఉంచాడు.

పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను!!

 

చూడండి పేతురు గారు అయితే చెరసాలలో నిద్రపోతున్నారు ఆరో వచనం ప్రకారం ఇద్దరు సైనికులు ఉన్నారు చెరసాల్లోనే ఇటు పక్కలో ఒకడు అటుపక్క ఒకడు. పేతురు గారు నిద్రపోతున్నారు సైనికులు కూడా నిద్రపోతున్నారు. కానీ సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను!

 

 ఇది నేటి సంఘంలో కావలసిన ముఖ్యమైన అంశము! సంఘములో అత్యాశక్తితో ప్రార్థన చేసేవారు రోజుల్లో కనబడటం లేదు! వాక్యానికి ప్రాధాన్యత ఉంటుంది! డాన్సులకి ఇంక మరొక దానికి ప్రాధాన్యత ఉంటుంది! పాటలకు ప్రాధాన్యత ఉంటుంది! వర్షిప్ కి కూడా ప్రాధాన్యత ఉంటుంది! మంచిది! మరి మరి ప్రార్థనకు కూడా ప్రాధాన్యత ఉండాలి కదా! రోజుల్లో ఉపవాసకూటాలంటే ఎవడు రావట్లేదు, భోజనాలు మీటింగ్ లు సభలు అంటే వస్తున్నారు. ఇంకా ఆల్నైట్ ప్రార్థన లేదా సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఒక్కడు రావట్లేదు. ఎందుకంటే కంఫర్ట్ కి అలవాటు పడిపోయారు లగ్జరీలకు అలవాటు పడిపోయారు! ప్రార్థన లేదు!

 

కానీ సంఘమైతే పేతురు గారి కోసం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పరలోకపు పునాదులే కదిలిపోయాయి. వెంటనే దేవుడు ఒక దూతను పంపించి పేతురు గారిని విడిపిస్తున్నారు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర అనగా పేతురు గారి దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అప్పుడు దూత పేతురుతో అంటున్నాడు పేతురు లే త్వరగా లెమ్మనిచెప్పిన వెంటనే అతని సంకెళ్లు చేతి నుండి ఊడిపోయి పడిపోయాయి. పేతురు గారితో అప్పుడు దూత అంటున్నాడు నీ నడుము కట్టుకొని చెప్పులేసుకోమంటే ఇది కలలో జరుగుతుంది అనుకుంటూ నడుము కట్టుకున్నాడు వస్త్రం పైన వేసుకున్నారు చెప్పులేసుకున్నారు, నా వెంబడి రా అంటే దూత వెనకాల వెళ్లడం ప్రారంభించారు! ఇంకా దర్శనం అనుకుంటున్నారు!

 ఆయన మొదటి గేటు రెండో గేటు ఇంక మూడో గేటు ఐరన్ గేట్ కూడా దాటేశారు దాటేసి బయటకు వచ్చినప్పుడు వీధిలోకి వచ్చిన తర్వాత పేతురు గారికి బాయ్ చెప్పేసి దూత వెళ్ళిపోయాడు!

 

 అప్పుడు పేతురు గారికి పూర్తిగా తెలివి వచ్చింది! ఓహో దేవుడు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల చేతిలో నుండియు నన్ను తప్పించి ఉన్నాడు కదా అని అనుకున్నారు!

 నేను అనుకుంటాను బహుశా అయ్యో నేను దేవుడు నిజంగా దూతని పంపించాడు అని అనుకోలేదు దర్శనం అనుకున్నాను, దూత ఉన్నప్పుడే అతని పాదాలు పట్టుకుని ఇంకా నాలుగైదు వరాలు ఫలాలు పొందుకొందును కదా అనుకొని ఉండి ఉండొచ్చు! ఇది నా ఉద్దేశం!

 

 ఇంకా అలాగా ఆలోచించుకుంటూ మార్కు అనే మారుపేరు గల యోహాను గారి ఇంటికి వస్తారు. మార్కు సువార్త రాసింది ఈయనే! వచ్చి తలుపు కొడుతున్నారు కొడుతూ ఉంటే రొదే చిన్నది ఒక అమ్మాయి తలుపు తీయడానికి వచ్చింది, ఎవరు అంటే నేను పేతురును అన్నారు! సంతోషంతో తలుపు తీయడం మానేసి పేతురు గారు వచ్చారు పేతురు గారు వచ్చారు అంటూ అరవడం మొదలు పెట్టింది! విశ్వాసులన్నారు నువ్వు పిచ్చి దానివి అన్నారు! నిజానికి వారు ఇంతవరకు ప్రార్థన చేసింది ఎవరి కోసం ? పేతురు గారి కోసం. కానీ పేతురు గారు వచ్చిన తర్వాత ఏమంటున్నారు  పిచ్చి దానివి నీకు భ్రమ అంటున్నారు కానీ పేతురు గారు ఇంకా తలుపు తడుతున్నందువల్ల తలుపు తీసి ఆశ్చర్యపోయారు. వెంటనే దేవుడు తన పట్ల చేసిన మహా అద్భుతాన్ని వివరించి మరో చోటికి వెళ్లిపోయినట్లు మనం చూడగలం!

 

 తర్వాత 15 అధ్యాయంలోనే పేతురు గారు కనిపిస్తారు దాని కోసం మనం గత భాగంలో చూసుకున్నాము. సున్నతి కోసమైన తగాదా వచ్చినప్పుడు పేతురు గారు అక్కడ కూడి వాక్యానుసారముగా సమస్యను పరిష్కరించినట్లు మనం చూడగలం!

 

 ఇక అపొస్తలుల కార్యములో పేతురు గారి కోసం ఇంకా ఎక్కడ రాయబడలేదు గాని గలతీపత్రికలో పేతురు గారి కోసం రెండుసార్లు రాయబడింది. మొదటిసారి ఏంటంటే పౌలుగారు రక్షించబడిన తర్వాత సంఘాన్ని పరిచయం చేసుకోవడానికి ముఖ్యంగా కేఫాను పరిచయం చేసుకోవాలని వెళ్లాను. కేఫా అనగా పేతురు గారు అని అర్థం! పేతురు గారితో నేను 15 రోజులు ఉన్నాను అంటూ తనకు తాను చెప్పుకుంటున్నారు పౌలు గారు! అప్పుడు యాకోబు గారిని కూడా నేను చూశాను అంటున్నారు!

Galatians(గలతీయులకు) 1:18,19

18. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడ పదునయిదు దినములుంటిని.

19. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని.

 

 తర్వాత మరల యెరుషలేము వెళ్ళాను అని చెబుతూ రెండో అధ్యాయంలోని మరలా పేతురు గారి కోసం చెబుతున్నారు తన యొక్క ఆర్డినేషన్ రకంగా జరిగిందంటే సున్నతి పొందిన వారికి బోధించడానికి అపొస్తలత్వము పేతురు గారికి ఎలాగ కలిగిందో సున్నతి పొందని వారికి అపొస్తలత్వము నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సామర్థ్యము కలగజేశారు అని చెబుతూ స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు తమతో పాటు అపోస్తులత్వములో పాలివారము అనుటకు నాకును బర్నబాకును కుడిచేతి ఇచ్చారు కదా. అభిషేకాన్నిచ్చారు ఆర్డినేషన్ ఇచ్చారు అని ఇక్కడ మనం చూడగలం!

 

Galatians(గలతీయులకు) 2:1,2,7,8,9,10,11,12,13,14,15,16

1. అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని.

2. దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము (కష్టము) వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని.

7. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,

8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,

9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

10. మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.

11. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

12. ఏలయనగా యాకోబునొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.

13. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.

14. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

15. మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులముకాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలమూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము;

16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.

 

 అక్కడ పౌలు గారిని అన్యజనులకు అపోస్తులులుగా మీరు ఉండండి అంటూ వారిని యాక్సెప్ట్ చేస్తూ అక్కడ ఆర్డినేషన్ ఇచ్చినట్లు భాగంలో మనం చూడగలం!

 

 అయితే అదే గలతీపత్రిక రెండో అధ్యాయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన కోసం అక్కడ చెప్తున్నారు అంతియొకయలో ఉన్నప్పుడు పేతురు అపరాధిగా తీర్చబడ్డారు ఎలాగంటే యాకోబు దగ్గర నుండి సున్నతి బ్యాచ్ కొంతమంది రాకముందు అతడు అన్యజనులతో పాటు నాతోపాటు భోజనం చేశాడు గాని యాకోబు దగ్గర నుండి కొందరు మనుషులు వచ్చిన తర్వాత అన్యజనులతో పాటు భోజనం చేయడం మానేశాడు అప్పుడు పౌలు గారు పేతురు గారిని ఎదిరించి ఇలా చేయడం తప్పు అని చెప్పడం జరిగింది!

 

 ఇది బైబిల్లో పేతురు గారి కోసం వ్రాయబడిన విషయాలు!!!

 

 ఇక పేతురు పత్రికలో ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ పొంతు గలతీయ కప్పదొకియా ఆసియా అనే దేశాలలో చెదిరిన యాత్రికులు అని చెబుతున్నారు కాబట్టి పై ప్రాంతాలలో పేతురు గారు సేవ చేసినట్లు మనము గ్రహించాలి!

 

 ఇక ఐదవ అధ్యాయంలో బబులోనులో మీవలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెబుతున్నారు అంటున్నారు. కాబట్టి పేతురు గారి భార్య బబులోనులో  మరియు ఆయన కుమారుడైన మార్కు కూడా సువార్త పరిచర్య చేసినట్లు మనం గ్రహించగలము! అయితే కొంతమంది ఏమంటారంటే బబులోను అనేది రోమాకు వాడబడిన సర్వనామము, ప్రకటన గ్రంథంలో కూడాను మహాబబులోను కూలిపోయెను అనగా అది పునరుద్ధరణ పొందబోతున్న రోమా సామ్రాజ్యము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రోమ్ లోనే పేతురు గారి భార్య కుమారుడు సేవ చేశారు కొంతమంది చెప్పడం జరుగుతుందికాబట్టి రోములోనే సేవ చేసి ఉండొచ్చు బబులోను అనగా సౌత్ ఇరాక్ కూడా వెళ్లి సేవ చేసి ఉండవచ్చు!

 

 ఇలా సేవ చేసి క్రీస్తు శకం 68లో నీరో చక్రవర్తి చేతిలో సిలువ మీద మరణించి ప్రభువు కోసం హతసాక్షి అయిపోయిన గొప్ప దైవజనుడు, అపొస్తులుడు, పెద్ద, మన పేతురు గారు!

 

 మనము కూడా ఆయన బాటలో అంత గొప్ప సాక్షి సమూహము యొక్క బాటలో నడిచిపోతూ సువార్తను వ్యాపిద్దాం!

 ప్రభువు రాజ్యము చేరుకుందాం!

 దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

 దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*11 భాగము*

2పేతురు 1:12--15

12. కాబట్టి మీరు సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.

13. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,

14. నేను గుడారములో ఉన్నంతకాలము సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

15. నేను మృతిపొందిన తరువాత (నా నిర్గమమునకు తరువాత) కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.

 

     ప్రియమైన దైవజనమా! ఇంతవరకూ పేతురు గారు ఇంతటి మహోన్నతమైన పత్రికలు రాయడానికి ఏసుక్రీస్తు ప్రభువుల వారితో ఆయనకున్న అనుబంధము, ఆయన చేసిన పరిచర్య అని ధ్యానం చేసుకున్నాము. ఇక భాగంలో పత్రికలు ఎందుకు రాశారు? సందర్భాలలో రాశారు? ఎప్పుడు రాశారు? పత్రికల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయం చేసుకుందాం!!!

 

*మొదటి పత్రిక*

ఎప్పుడు రాశారు?

క్రీ.. 64-65 మధ్యలో

 

ఎక్కడ నుండి వ్రాశారు?

రోమాలో స్థానిక సంఘమునుండి.

 

ఎవరు రాశారు?

పిచ్చి ప్రశ్న అనుకోవద్దు. పేతురు గారు విధ్యలేని పామరుడు. కాబట్టి పేతురు గారు చెబుతుండగా బహుశా ఆయన కుమారుడు మార్కు గారు గాని, మరో పేతురు గారి అసిస్టెంట్ గాని వ్రాసి ఉండవచ్చు!

 

ఎందుకు వ్రాసారు?

యేసయ్య అనంతరము మరియు నీరో చక్రవర్తి పాలనలో విశ్వాసులపై దాడులు హింసలు చెలరేగిపోయాయి. కేవలం యూదయలోనే కాకుండా ప్రపంచమంతటా చివరికి రోమాలో కూడా దేవుని బిడ్డలపై హింసలు పెచ్చిమీరి పోయాయి. ముఖ్యంగా యూదుల నుండి. కాబట్టి చిన్నాసియా అనగా ఆసియా మైనర్ లో ఉన్న సంఘాలకు మరియు తను సువార్త ప్రకటించిన ప్రదేశాలలో కూడా ఎక్కడైతే హింసలు ఎక్కువగా ఉన్నాయో ప్రాంత విశ్వాసులను ఉద్దేశించి శ్రమల ద్వారానే మీరు మహిమ పొందగలరు. మొదట సిలువ తర్వాతనే మహిమ అని చెబుతూ శ్రమల వలన మీరు దిగులు పడవద్దు, ఒకరోజు మహిమపరచబడతారు అని చెబుతూ పత్రిక వ్రాశారు.

 

*రెండవ పత్రిక*

ఎప్పుడు రాశారు?

క్రీ.. 67లో. జూలై 18 క్రీస్తుశకం 64 లో రోమ్ నగరం తగలబెట్టబడింది. అది నీరో చక్రవర్తి తగలబెట్టాడు అంటారు. అయితే నేరాన్ని క్రైస్తవులపై రుద్దినట్టు చరిత్ర చెబుతుంది. అప్పుడు క్రైస్తవులంతా కొన్ని వేలమంది చెరసాలలో ఉన్నారు. అదే సమయంలో సుమారుగా  66,67 మధ్యలో పేతురు గారిని కూడా పట్టుకొని రోమా చెరశాలలో వేశారు. పౌలు గారు అప్పటికే చెరసాలలో ఉన్నారు. ఇక పేతురు గారికి అపోస్తులుల కార్యములలో వివరించబడ్డ చెరసాల కాకుండా అప్పటికే 7సార్లు చెరసాలలో ఉంచారు పేతురు గారిని కొన్ని నెలల పాటుగా. చివరి చెరశాలలో ఉన్నప్పుడే ఇక తాను చనిపోతానని స్థితిలో పేతురు గారు పత్రికను వ్రాశారు.

 

 ఎందుకు రాశారు?

  కాలంలో సంఘంలో భయంకరమైన దుర్బోధలు బయలుదేరాయి. అబద్ధ బోధకులు ద్వారా సంఘం పాడైపోతుంది. రాకడ జరిగిపోయింది అని కొందరు చెప్పడం జరుగుతుంది సమయంలో అబద్ధ బోధలను ఖండిస్తూ రెండవ పత్రిక రాశారు.

 

ముఖ్యమైన వచనాలు:

1 Peter(మొదటి పేతురు) 1:7,18,19

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

1పేతురు 2:5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

1పేతురు 3:20

దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

1పేతురు 3:21

దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

1పేతురు 3:22

ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

1పేతురు 4:12

ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

1పేతురు 4:13

క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

1పేతురు 4:14

క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

1పేతురు 4:15

మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

1పేతురు 4:16

ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

1పేతురు 4:17

తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

 

1పేతురు 5:2

బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

1పేతురు 5:3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;

1పేతురు 5:4

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

1పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

1పేతురు 5:7

ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు  (లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

 

2పేతురు 1:10

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

2పేతురు 1:13

మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,

2పేతురు 1:14

నేను గుడారములో ఉన్నంతకాలము సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

2పేతురు 1:20

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

2పేతురు 1:21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 

2పేతురు 3:4

ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.

2పేతురు 3:5

ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

2పేతురు 3:6

నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

2పేతురు 3:7

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

2పేతురు 3:8

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

2పేతురు 3:9

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

2పేతురు 3:10

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

2పేతురు 3:11

ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

2పేతురు 3:12

దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

పత్రిక ముఖ్య ఉద్దేశం:

అన్యాయమైన బాధలను భరించినప్పటికీ, మంచిగా విశ్వాస జీవితం జీవించడం కొనసాగించడం అనే దాని ప్రాముఖ్యతపై మొదటి పేతురు పత్రిక దృష్టి పెడుతుంది ( 1 పేతురు 2:20 ). విధంగా, 1 పేతురును క్రొత్త నిబంధన యోబు అని పిలుస్తారు, యేసుక్రీస్తు తన అనుచరులందరికీ నిర్దేశించిన విధంగా నిజమైన విశ్వాసి కొనసాగడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. విశ్వాసులను పేతురు పిలిచిన ఓర్పు యోబుకు సమానం, అతను నీతిమంతుడైనప్పటికీ బాధపడ్డాడు. దేవుడు తన ప్రజల నుండి ఆశించే నిజమైన పట్టుదల ఇదేనని పేతురుగారు వాదించారు.

 

పెద్ద ఆలోచన ఏమిటి?

మూడు సంవత్సరాలకు పైగా యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించడం, ప్రతికూల ప్రపంచంలో పవిత్రంగా జీవించడం ఎలా ఉంటుందో చూపించడానికి అపొస్తలుడైన పేతురుకు అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. భూమిపై నడిచిన మరే ఇతర వ్యక్తి కంటే ఎక్కువగా, యేసుక్రీస్తు ప్రభులవారి జీవనశైలిని ఆదర్శంగా తీసుకున్నారు. అందువల్ల పేతురుగారు తన పాఠకులకు సాధ్యమైనంత ఉత్తమమైన దిశలో, యేసు వైపు చూపించారు. విశ్వాసులు భూమిపై తమ తక్కువ సమయంలో యేసు కోరుకున్నట్లుగా జీవించి ప్రవర్తించేలా వారి హృదయాలలో "క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించండి" అని అపొస్తలుడు క్రైస్తవులను పిలిచారు ( 1 పేతురు 3:1418 ). ఇందులో ప్రభుత్వంలో, ఇంట్లో మరియు కార్యాలయంలో అధికారానికి - అన్యాయమైన అధికారానికి కూడా - విధేయత ఉంటుంది. పరీక్షలు మరియు కష్టాల మధ్య ఒకరి జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి యేసు కేంద్ర బిందువు అవుతారు. క్రీస్తు వ్యక్తిత్వం మరియు పనిలో వారి పట్టుదలను పాతుకుపోవడం ద్వారా, విశ్వాసులు ఎల్లప్పుడూ బాధల మధ్య ఆశను అంటిపెట్టుకుని ఉండవచ్చు.

ఈవిధంగా మనము కూడా సిలువ ద్వారా మహిమ లేదా శ్రమల ద్వారా సంపూర్ణత సాదిద్దాం!

 

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*12 భాగము*

 

1 పేతురు 1:1,2,3

1. యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.

 

     ప్రియమైన దైవజనమా! ఇక మనము పత్రికను ధ్యానం చేసుకుందాం!  ప్రియులారా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానము బట్టి అంటూ మొదలుపెట్టారు. ఇక్కడ పేతురు గారు ఏసుక్రీస్తు యొక్క అపోస్తులుడను నేను అని పత్రిక మొదలుపెట్టారు గత శీర్షికలలో అనేకసార్లు అపోస్తులుడు అనగా దేవుని చేత పంపబడినవాడు అని అర్థము అని విస్తారంగా ధ్యానం చేసుకున్నాం కాబట్టి ముందుకు పోదాం.

 

ఇక  ఇక్కడ మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము బట్టి విశ్వాసులంతా దేవుని దగ్గరికి వచ్చారు ఇంతకీ భవిష్యత్ జ్ఞానము అనగా ఏమిటి? దీని కోసం కొద్దిగా మన ధ్యానం చేసుకుందాం!

 

భవిష్యత్ జ్ఞానం కోసం రోమ్ 8:29,30లో వ్రాయబడింది .

రోమీయులకు 8:29

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

రోమీయులకు 8:30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

వచనంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులనూ గమనించండి (మత్తయి 3:16-17; మొ।। చూడండి). విశ్వాసుల విముక్తికి మూలాధారం, ఆరంభం ఇక్కడ కనిపిస్తున్నాయి అది దేవుని ఎన్నిక. వారు విశ్వాసులు అయిన విధానం, క్రమం అది దేవుని ఆత్మ చేసిన పని. వారి నమ్మకానికి ఆధారం, పునాది అది క్రీస్తు రక్తం. వారు విశ్వాసులు అయిన ఉద్దేశం, ప్రయోజనం వారు క్రీస్తుకు విధేయులుగా ఉండడం.

 

ముందుగా నిర్ణయించెను. నిర్ణయించిన వారిని పిలిచెను. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. అలా చేసి వారిని మహిమ పరచెను. ఇదీ దేవుని ఉద్దేశం ఇది: విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (హీబ్రూ 2:10-11; 1 యోహాను 3:1-2).  ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం, గొప్ప లక్ష్యం వేరొకటి ఉండబోదు. ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన ఐదు మెట్లను పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. వీటిలో రెండు లోక సృష్టికి ముందున్నవి. రెండు క్రీస్తులో విశ్వాసి జీవితం ఆరంభంలో ఉన్నవి. ఒకటి ఇకముందు రాబోయేది. వీటిలో ప్రతి మెట్టుకూ మిగతా నాలుగింటితో సంబంధం ఉంది. అన్ని మెట్లూ దేవుడు వాటినెంత ఖచ్చితంగా చేయగలడో అంత ఖచ్చితమైనవి.

 

విశ్వాసులు తన కుమారుని పోలికలోకి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించడం వారిని గురించి ఆయనకున్న భవిష్యత్ జ్ఞానంపై ఆధారపడిన సంగతి. 1 పేతురు 1:2 కూడా చూడండి.

 

ఇక ముందుగానే నిర్ణయించాడు అనగా గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో పదం ఆరు సార్లు మాత్రమే కనిపిస్తున్నది (ఇక్కడ, 30; అపొ కా 4:28; 1 కొరింతు 2:7; ఎఫెసు 1:5, 11). దీనికీ కర్మ సిద్ధాంతానికీ సంబంధమూ లేదు. జరిగేదానంతటికీ అదృష్టమే కారణమనే భావనకూ దీనికీ పోలికా లేదు. ఏమి జరగాలో ముందుగానే తెలిసిన దేవుడు అలా జరగాలని నియమించాడని దీని అర్థం. సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు అయిన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమి జరగాలని నియమిస్తాడో అది తప్పక జరిగి తీరుతుందని ఏమీ అనుమానం లేకుండా నమ్మవచ్చు. ఒక సంఘటన గురించి చెప్పిన అపొ కా 4:28 మినహా క్రొత్త నిబంధన గ్రంథమంతట్లో దేవుని పూర్వ నిర్ణయాన్ని గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తున్నవి. దేవుడు ఎవరినైనా శాశ్వత నరక శిక్షకు పూర్వమే నిర్ణయించినట్టు ఎక్కడా చెప్పలేదు. కొత్త నిబంధన లో పూర్వ నిర్ణయం సిద్ధాంతం విశ్వాసులకు గొప్ప ఆదరణను, గొప్ప ఆశాభావాన్ని ఇవ్వాలి. తనను పాపవిముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడో లేదోనని ఎవరూ భయ సందేహాలకు తావియ్యనక్కర లేదు. యోహాను 6:37, 44 కూడా చూడండి. ఇష్టమున్న వారెవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు (ప్రకటన 22:17). ఆయన చెంతకు రావడం, ఆయనలో నమ్మకముంచడం అన్న చర్యలే దేవుడు వ్యక్తిని పూర్వం ఎన్నుకున్నాడని రుజువు.

యోహాను 6:38

తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను.

యోహాను 6:40

ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

యోహాను 6:45

నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:46

వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

 

 2 థెస్స 2:13-14

13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును (ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.

14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.

 

ఇది మరో గొప్ప వాగ్దానం. యేసుప్రభువు దగ్గరికి రావడంద్వారా మనం జీవాహారంలో భాగం పంచుకుంటామని ఇది తెలియజేస్తున్నది. ఆధ్యాత్మిక జీవం కలగాలంటే ఇదొక్కటే ఏకైక మార్గం (3:36; 5:40; 14:6; ప్రకటన 22:17).  ఆయన దగ్గరికి రావడం అంటే ఆయనలో నమ్మకం ఉంచడం; వారిలాగా అపనమ్మకంతో, వేరే ఉద్దేశాలతో రావడం కాకుండా నమ్మకంతో రావడం ( 24,26).  రావడమంటే మన హృదయాలు ఆయనకు దగ్గర కావడం, ఆత్మలో ఆయన వైపుకు తిరగడం. అలా వచ్చినవారిని ఆయన ఎప్పుడూ పంపివెయ్యడు. మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎవరైనా, ఎక్కడ ఉన్నా అతడు లేక ఆమె క్రీస్తు దగ్గరికి వస్తే వ్యక్తిని క్రీస్తు స్వీకరిస్తాడు. దేవుడు తనను ఎన్నుకోలేదేమోనని, కాబట్టి క్రీస్తు తనను స్వీకరించడేమోనని వచనం మొదటి భాగం విషయం ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. అతడు క్రీస్తు దగ్గరికి రావడమే దేవుడు అతణ్ణి ఎన్నుకున్నాడని రుజువు.  దేవుడు మానవాళిలో నుంచి కొందరు వ్యక్తులను క్రీస్తుకు ఇచ్చాడన్నది నిజమే (10:29; 17:6). ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి రాకముందు అతడు, లేక ఆమె అలాంటి కోవకు చెందినవారో కాదో ఎవరూ చెప్పలేరు. అయితే దేవుడెన్నుకున్న వారందరూ మాత్రం నమ్మకంతో క్రీస్తు దగ్గరికి వస్తారు. అలా రావడం ద్వారా దేవుడు తమను క్రీస్తుకు ఇచ్చాడని రుజువు చేస్తారు. రోమా 8:29-30  చూడండి. పాపవిముక్తి కోరుతున్న పాపి దేవుని రహస్య ఉద్దేశాల గురించి ఆందోళన పెట్టుకోవడం మాని, ఉన్నట్టుగా లేదా ఉన్నపాటుగా క్రీస్తు చెంతకు రావాలి (మత్తయి 11:28). రాదలచుకున్న వారంతా రావచ్చు (ప్రకటన 22:17).

ఇదీ దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే! విధంగానే నీవు నేను పిలువబడ్డాము గనుక మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని ముందుకు పోదాం!

దైవాశీస్సులు!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*13 భాగము*

1 పేతురు 1:1,2,3

1. యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక రెండవ వచనములో ఆత్మవలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అంటున్నారు ఇక్కడ మొదటగా ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై....

  మాటను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు పరిశుద్ధత ఎలా కలుగుతుంది? ఆత్మవలన! దేవుని పరిశుద్ధాత్మ వలననే మనకు పరిశుద్ధత కలుగుతుంది! ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ పూర్ణుడవవుతావో దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నీలో పనిచేసి నీలో ఉన్న సమస్త కల్మషాన్ని కడుగుతా ఉంటుంది. మనము పాప లోకంలో ఉన్నాము కాబట్టి మన శరీరమునకు ధూళీ మట్టి ఎలా అంటుకుంటుందో అలాగే మన ఆత్మలకు కూడా లోకంలో ప్రతిరోజు కళంకం అంటుకుంటు ఉంటుంది. దేహానికి అంటుకున్న కళంకము స్నానం ద్వారా శుద్ధి చేసుకుంటాం ప్రతిరోజు మనం. అయితే ఆత్మకు అంటుకున్న కళంకము ఎలా పోతుంది?

అంటే మొదటగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందుకుంటాం!

 వాక్యము వలన ఉదక స్నానం పొందుకుంటాం!

 ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రభువా పాపము ఆలోచన వల్ల పలానా కార్యం వల్ల నాకు పాపము అంటుకుంది, పలానా ఆలోచన వల్ల నా మనసు చెదిరింది, నన్ను క్షమించు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేయగా మన ఆత్మకు అంటుకున్న కల్మషము కరిగిపోయి  మనం  అనుదినము పరిశుద్ధులుగా మార్పు చెందుతూ ఉంటాము!  ఇది మాటలో గల పరమార్థము!

 

 ఇంకా మరి విధముగా పరిశుద్ధత పొందుకుంటామంటే ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడ్డాము అన్నారు కదా ఇదే వచనంలో! ఏసుక్రీస్తు రక్తము మన మీద ప్రోక్షించబడడం వల్ల కూడా మనం పరిశుద్ధులుగా మారగలము! దీన్ని యోహాను పత్రికలలో మనం చూడగలం! మనము పాపము లేని వారమని అనుకుంటే మనము దేవునిని అబద్ధికునిగా చేస్తున్నాము. అయితే మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి విమోచించును అని అక్కడ చూడగలం!

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1:8

మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

  రకంగా మనం పరిశుద్ధత పొందుకుంటాం! మరో విషయం చెప్పనా! బైబిల్ చెబుతుంది పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము పరలోక రాజ్యము చేరలేము!

హెబ్రీయులకు 12:14

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

 కాబట్టి అనుదినము మన పాపములను కడుగుకుంటూ పరిశుద్ధత కలిగి పరిశుద్ధులు పరిశుద్ధులుగా జీవించవలసిన అవసరమో ఎంతైనా ఉంది అని గ్రహించమని మనవి చేస్తున్నాను!

 

ప్రియులారా ఇక తర్వాత మాట ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అన్న తర్వాత పరిశుద్ధత పొందిన తర్వాత మనం ఏం చేయాలి అంటే విధేయత కలిగి ఉండాలి! దేనికి విధేయులు?!

 వాక్యమునకు విధేయులవ్వాలి!

 దేవునికి విధేయత చూపించాలి!

 వాక్యము ఏమి చేయమన్నదో అదే మనం చేయాలి! వాక్యము లేఖనము నకు విరోధమైన పనులు దేనిని చేయకూడదు! ఏవి చేయకూడదు అని లేఖనంలో వ్రాయబడిందో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు! విధేయుల అవ్వాలి!

 

*విధేయతదేవునికి కావలసింది విధేయత! బైబిల్ గ్రంధంలో అనేకమైన భక్తులు వాక్యమునకు విధేయత చూపించి దేవుని కొరకు ఘనమైన కార్యములు అసాధారణమైన అద్భుతాలు చేశారు!

 అబ్రాహామా నీ తండ్రి ఇంటిని నీ స్వజనాన్ని వదిలి నేను చూపించబోయే దేశానికి వెళ్ళిపో అన్నారు దేవుడు! అబ్రహం గారు విధేయత చూపించారు! అబ్రాహాము గారిని ఆశీర్వదించడమే కాకుండా అనేక జనాలకు తండ్రిగా దేవుడు చేశారు! ఇశ్రాయేలీయులకు తండ్రి అబ్రహం గారు! ఇస్మాయేలు ముస్లింలకు తండ్రి అబ్రహం గారు! క్రైస్తవులమైన మనము మన విశ్వాసం విశ్వాసులకు తండ్రిగా పిలవబడ్డారు అబ్రహాము గారు! ఇదంతా కేవలం విధేయత వలన జరిగింది.

ఇస్సాకు గారి విధేయత చూపించారు. మోషే గారు విధేయత చూపించారు. కాబట్టే అంత గొప్ప సైన్యాన్ని గొప్ప జనాంగానే కనాను దేశము రప్పించగలిగారు! యెహోషువా గారు విధేయత చూపించారు! దావీదు గారు ప్రతి విషయంలో విధేయత చూపించారు! విధేయత భక్తులను ఘనమైన కార్యాలు చేయడానికి అవకాశం కలిగించింది! కాబట్టి మనము కూడా విధేయత కలిగి ఉండాలి!

 

 అయితే విధేయత ఎప్పుడు వస్తుంది?!

 నీవు ఆత్మవలన పరిశుద్ధత పొందుకున్న తర్వాతనే నీవు విధేయుడుగా ఉండగలవు! విశ్వాసిగా ఉండగలవు అని మర్చిపోవద్దు!!!

 

ఇక ఇదే వచనములో తర్వాత మాట ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు పిలువబడిన వారు....

 ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుట అనగా శుద్ధి చేయబడుట! నిజానికి దీనికోసం ఆలోచన చేస్తే ప్రోక్షణ కార్యక్రమం సందర్భాల్లో చేస్తారు అంటే లేవీ 14 అధ్యాయం ప్రకారం దేనినైనా కడగడం లేదా శుద్ధి చేయడానికి వాడుతారు!

 తర్వాత యాజకులను ప్రతిష్ట చేయడానికి దేవునికి అంకితం చేయడానికి ప్రోక్షణo చేస్తారు నిర్గమకాండం 29 :20 -- 22 వచనాలు!

 ఇక తర్వాత దేవుని యొక్క నిబంధనను ధ్రువీకరించడానికి నిర్గమ 24 అధ్యాయం ప్రకారం!

 ఇక ప్రాయశ్చిత్తం చేయడానికి పాపముల నుండి విముక్తి కలగడానికి కూడా ప్రోక్షణము చేస్తారు లేవీ 16:14.

 

 అయితే విశ్వాసులకు నూతన నిబంధన విశ్వాసులకు క్రీస్తు రక్తము ప్రోక్షించబడటం వల్ల విశ్వాసులకు ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది, శుద్ధి కలిగింది. ఎఫెసీ 1: 7 హెబ్రీ 9:14, మొదటి యోహాను ఒకటి 1:7!

 దీనివల్ల యాజకులకు దేవుని సన్నిధికి సంపూర్ణ ప్రవేశం కలిగింది హెబ్రీ పత్రిక ప్రకారం. మనం కూడా ఇదే ప్రోక్షణ వల్ల మనకు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశం దొరికింది. అంతేకాకుండా మనం కొత్త నిబంధనలో భాగస్వాములు కూడా అయ్యాము ఇదే ప్రోక్షణవల్ల!

 

 కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఆధిక్యత పొందుకున్న నీవు దాని ప్రకారం జీవిస్తున్నావా లేదా అనేది గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుసుకోవాలి!!!

 

ఇక ఇక్కడ ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడడానికి పిలవబడ్డాము అని మనం చూస్తున్నాం! ఇక అనేకసార్లు చెప్పాను మనం దేనికోసం పిలవబడ్డాము?

 రోమా 1:2  ప్రకారము పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం! కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి! ఎందుకంటే మన పిలుపు సామాన్యమైనది కాదు భవిష్యత్ జ్ఞానము బట్టి మనల్ని పిలుచుకున్నారు.

 కాబట్టి రాజులైన యాజకులుగా మన పిలుచుకున్నారు కాబట్టి పిలుపుకు తగిన జీవితము మనము జీవించాలి! పరిశుద్ధులుగా ఉండాలి!

 

  మనము దేవుని పరిశుద్ధులుగా అపోస్తులుగా బోధకులుగా కాపరులుగా ఇంకా దేవుని పని చేయడానికి పిలువబడ్డాము!

 

 ఇక 1కొరింథీ 7:22 ప్రకారము స్వాతంత్రం పొందడానికి పిలవబడ్డాము!

 

 హెబ్రీ 9:15 ప్రకారం నిత్యమైన స్వాస్త్యము పొందడానికి పిలవబడ్డాము!

 

 ఇంకా చీకటి నుండి వెలుగులోనికి పిలువబడ్డాము కాబట్టి ఆయన గుణాతిశయాలు ప్రకటించడానికి కూడా పిలవబడ్డాము!

 

 ఇక తర్వాత దేవుని యొక్క దీవెనకు ఆశీర్వాదాలు వారసులవ్వడానికి పిలవబడ్డాము మొదటి పేతురు 3:9 ప్రకారం!

 

 మొదటి పేతురు 5:10 ప్రకారం శాశ్వత మహిమకు పిలవబడ్డాము!

 

 ప్రకటన 19:9 ప్రకారం గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డాము!

 

 ఇంకా ఏసుక్రీస్తు ప్రభువుల వారియొక్క వారుగా, ఆయన వారుగా ఉండటానికి పిలవబడ్డాము!

 

 కాబట్టి విధేయులగు పిల్లలవలే మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉండకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని పేతురు గారు ఇదే అధ్యాయంలో చెబుతున్నారు

1 Peter(మొదటి పేతురు) 1:15,16

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

 యేసయ్య అంటున్నారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే!!! మరి నువ్వు పిలవబడ్డావు కదా మరి నువ్వు గుంపులో ఉన్నావో తెలుసుకో!!!

 దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*14 భాగము*

1 పేతురు 1:1,2,3

1. యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఇక రెండవ వచనములో తర్వాత మాట అనగా ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు  గలతీయ కప్పదొకియా ఆసియా బితునియా అనుదేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక అంటున్నారు!!

 దీనికోసం ఆలోచిస్తే పొంతు గలతీయ కప్పదొకియా ఆసియా ఇవన్నీ ప్రస్తుతం టర్కీ దేశంలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి!

 పేతురు గారు ప్రాంతాలు అన్నిటిలో సేవ చేశారు అని గుర్తు తెచ్చుకోవాలి.

 పొంతు అనగా పొంతుపిలాతు ఏలిన ప్రాంతము. గలతీయ అనగా అది నాలుగు ప్రాంతాలు కలిపి గలతీయ అంటారు! ఇవన్నీ టర్కీలో ఉన్నాయి ప్రస్తుతం!

 ఇక ఆసియా అనగా చిన్న ఆసియా ఆసియా మైనర్ అని గుర్తుంచుకోవాలి.

ఆసియా మైనర్ లోనే ఎఫెసీ సంఘం మరిన్ని సంఘాలు ఉన్నాయి!

 

 ఇక తర్వాత మాట ఏంటంటే చెదిరిన వారిలో చేరిన యాత్రికులు!

 చెదిరిన వారిలో అనగా దీని అర్థం ఒకసారి దీనికోసం యోహాను సువార్త 7: 35 లో చూసుకుంటే గ్రీస్ దేశస్థుల మధ్య చెదిరిపోయిన యూదుల దగ్గరకు అని ఒక మాట ఉంటుంది. అనగా హింసలు చెలరేగినప్పుడు యేసయ్య కాలం కన్నా ముందు అనేకమంది గ్రీసు దేశానికి ఏరియాకి ప్రాణ భయంతో యూదులు చాలామంది చెదిరిపోయారు! అలాంటి చెదిరిపోయిన యూదులకి పత్రిక రాస్తున్నారు!

 ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం బయట ఉంటున్న యూదులకు ఉత్తరం రాశారు! అంతేకాకుండా ఆయా ప్రాంతాలలో చెదిరిపోయిన యూదులు మరియు రక్షించబడిన యూదులు, ఇంకా వీరే కాకుండా క్రీస్తును అనుసరించే ప్రతి వారి కోసం పేతురు గారు లేఖ రాస్తున్నారు అని గమనించాలి!

 

 ఒక విషయం గుర్తు చేస్తాను గలతీ 2:7, 8 వచనాలు చూసుకుంటే పేతురు గారు యూదులకు అపోస్తులుడు అని అక్కడ రాయబడి ఉంటుది. పౌలు గారు అన్యజనులకు అపొస్తలుడు!

 చెదిరిపోయిన యూదు క్రైస్తవులకు మరియు ప్రాంతాలలో ఉన్న సంఘాలకు ఉత్తరం రాస్తూ కొన్ని సలహాలు ఆదేశాలు ఇస్తున్నారని గమనించాలి!

 

 అయితే ఉత్తరం కేవలం వారికే కాకుండా అన్ని కాలాల్లో ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తాయి అని తప్పకుండా గమనించమని మనవి చేస్తున్నాను!

 

 ఇక తర్వాత మాట ఏమిటంటే చెదిరిన యాత్రికులకు! చెదిరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పు రాస్తున్నారు! యాత్రికులు అనగా పరదేశులు! ప్రయాణం చేస్తున్నవారు!

 నీవు నేను ప్రతి విశ్వాసి మనము ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. అదే పరమ కనాను యాత్ర! కనాను యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు వలె మనకు కూడా ఎన్నెన్నో ఇక్కట్లు పరీక్షలు ఇబ్బందులు ఆకలి దప్పులు అవమానాలు ఎండ భయములు యుద్ధాలు ఇవన్నీ కలుగుతాయి. వీటన్నిటినీ ఎదుర్కొంటూ జయిస్తూనే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును దేవుడిచ్చిన ప్రార్థన విశ్వాసము అనే ఆయుధాలను వాడుకుంటూ మనము గమ్యస్థానం అనగా పరలోకం చేరవలసిన అవసరం ఎంతైనా ఉంది అని గమనించాలి!!!

 

 అందుకే హెబ్రీ పత్రిక 11 అధ్యాయము తొమ్మిదో వచనంలో విశ్వాసమును బట్టి వాగ్ధత్తదేశంలో ఉండగానే పరాయి దేశంలో ఉన్నట్టుగా అబ్రహాము గారు డేరాలలో నివసించారు. అలాగే వాగ్ధానమునకు సాటి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా డేరాలలోనే నివాసం చేశారు అని చెప్తున్నారు! ఇక 13 వచనంలో వీరంతా అదే విశ్వాసంతో ఉండి చనిపోయారు వాగ్దానాలను వారు అనుభవించలేదు కానీ దూరం నుంచి చూస్తూ వాటిని గురించిన నిశ్చయత కలిగి వందనం చేసి తాను భూమి మీద యాత్రికులను పరదేశులము అని ఒప్పుకొని తమ విశ్వాసాన్ని కొనసాగించారు అని చెప్పబడింది!

 

హెబ్రీయులకు 11:9

విశ్వాసమునుబట్టి అతడును, అతనితో వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.

హెబ్రీయులకు 11:10

ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

హెబ్రీయులకు 11:13

వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

 

 కాబట్టి లోకంలో మనమంతా యాత్రికులమే! భూమి మీద విశ్వాసులకు శాశ్వత నివాసము అనేది ఏమీ లేదు! ఎందుకంటే మన పౌరసత్వం పరలోకంలోనే ఉంది! ఇండియాలో మనకున్న భారతదేశ పౌరసత్వము అది కొద్ది కాలమే! మనం బ్రతికున్నంత కాలమే! కానీ విశ్వాసులమైన మనకు పరలోకంలో ఒక పౌరసత్వం ఉంది! అది నిత్యము ఉండేది! ఫిలిప్పీ 3:20లో పౌలు గారు ఒక మాట అంటారు మనమైతే పరలోక పౌరులము అక్కడ నుండే మనం ముక్తి ప్రదాత రక్షకుడు వస్తాడని ఆత్రుత ఎదురుచూస్తూ ఉన్నాము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు!

ఫిలిప్పీయులకు 3:20

మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

 

 మన పౌరసత్వము పరలోకంలో ఉంది కాబట్టి కాబట్టి భూమి మీద ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ప్రయత్నం ఎక్కువగా చేయకుండా, పరలోకం చేరడానికి కావలసిన ప్రతి ప్రయత్నం, ఇంకా పరలోకంలో ఆస్తి సంపాదించుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను!

పరలోకంలో ఆస్తి ఎలా సంపాదించుకుంటావో మత్తయి సువార్త 25 ప్రకారం ఇక మిగిలిన సువార్తల ప్రకారము చెప్పబడింది. పేదలకు అవసరాలలో ఉన్న వారికి, దిక్కులేని వారికి సహాయం చేయడము అనగా పరలోకంలో ఆస్తి సంపాదించుకోవడం!!! అంతేకాకుండా దేవునికి ఇచ్చినా పరలోకంలో ఆస్తి సంపాదించుకుంటామని మనకు అర్థమవుతుంది!

 కాబట్టి దొంగలు దోచుకునేవారు చిమ్మట లేని పరలోకంలో మన ఆస్తిని సంపాదించుకుందాం.

 

ఇక తర్వాత మాట ఏమిటంటే మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక! మిగిలిన పత్రికలలో దీనికోసం చాలా విస్తారంగా చూసుకున్నాం!

 కాబట్టి తన ప్రజలను దీవించే ఆశీర్వదించే విధానము ఇదే!

 దేవుని కృప మరియు ఆయన శాంతి అనుగ్రహము సమృద్ధిగా కలుగును గాక !

అందుకే చివరిలో ప్రార్థన చివరిలో ఆరాధన చివరలో ఆశీర్వాద ప్రార్థన లో తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ కలుగును గాక! ఇంకా శాంతి సమాధానము కలుగును గాక ! అని ఆశీర్వాద ప్రార్థనలో ఇస్తా ఉంటారు!

 

 చివరికి పాత నిబంధన గ్రంధంలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించే విధానము మనకి చెప్పడం జరిగింది ఇది సంఖ్యా కాండం ఆరో అధ్యాయంలో ఉంటుంది! 23 నుంచి 26 వరకు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును మీరు ఇశ్రాయేలీయులకు ఇలాగ దీవించవలెను యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయం కలుగజేయును గాక !

Numbers(సంఖ్యాకాండము) 6:22,23,24,25,26,27

22. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

23. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.

24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;

25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;

26. యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.

27. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.

 

ఇది దేవుడు చెప్పిన విధానం! పేతురు గారు దానిని పాటిస్తున్నారు! నీవు కూడా  సంఘస్తులును ఇదే విధముగా ఆశీర్వదించాలి దీవించాలి అని దేవుడే చెప్తున్నారు! ప్రియ తల్లి తండ్రి నీ కుమారులను నీ కుమార్తెను నీ సంతానాన్ని కూడా ఇదే విధముగా దీవించాలని మనవి చేస్తున్నాను! అంతే  తప్ప పనికిమాలినోడా, నువ్వు నాశనమైపోను! ఇలాంటి తిట్లు తల్లిదండ్రుల నోట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు అని ప్రభువు పేరిట మనవి చేస్తూ హెచ్చరిస్తున్నాను!

 దేవుడు  మిమల్ని దీవించును గాక!

 ఆమెన్!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*15 భాగము*

1 పేతురు 1:4--5

4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

      ప్రియులారా! ఇక నాల్గవ వచనం చూసుకుంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను అంటున్నారు.

జాగ్రత్తగా వచనం పరిశీలించాలి. యేసుక్రీస్తు ప్రభులవారు మృతులలోనుండి తిరిగి లేవడం వలన మనకు ఏమేమి దొరికాయి అంటే

జీవముతో కూడిన నిరీక్షణ!

జీవముతో కూడిన నిరీక్షణ అంటే:

అక్షయమైన స్వాస్థ్యము అనగా ఎల్లప్పుడూ నిలిచిఉండే స్వాస్థ్యము,

నిర్మలమైన స్వాస్థ్యము అనగా కళంకము లేని స్వాస్థ్యము,

వాడబారని అనగా వాడిపోని స్వాస్థ్యము మనకు కలిగాయి.

ఇదంతా చూసుకుంటే పరలోకంలో కలుగబోయే నిత్యజీవము, నిత్యస్వాస్థ్యము కోసమే పేతురు గారు మాట్లాడుతున్నారు అని అర్ధమవుతుంది.

యేసుక్రీస్తు ప్రభులవారు మృతులలోనుండి లేచారు అని మనము నమ్మతున్నాము. అదే మన విశ్వాసం! ఆయన ఏవిధంగా మృతులలోనుండి లేచారో మనముకూడా ఒకరోజు మృతులలోనుండి తిరిగి లేస్తాము అనేదే మన నిరీక్షణ!

 

మృతులలోనుండి లేచుట కోసం చూడండి మత్తయి 28:6; అపొ కా 1:3; 2:24; రోమ్ 1:4; 1 కొరింతు 15:12-19.

 

వారసత్వం సృష్టికి సంబంధించినది కాదు, పాడైపోయేది కాదు (1 కొరింతు 15:50, 53). అది నాశనం కానిది, శాశ్వతమైనది.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:50,53

50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

 

ఇక ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను అంటున్నారు!

నూతన జన్మ కోసం క్రింది రిఫరెన్సులు చూడండి

యోహాను 1:13; 3:3-8; ఎఫెసు 2:5; యాకోబు 1:18; 1 యోహాను 3:9; 4:7; 5:1.

 

ఇదే జీవముతో కూడిన నిరీక్షణ!

రోమీయులకు 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

 

రోమీయులకు 8:23

అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

రోమీయులకు 8:24

ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

రోమీయులకు 8:25

మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.

 

తీతుకు 1:2

నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో....

 

ఇక 5 వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది అంటున్నారు!

కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ అనగా మనము పొందబోయే నిత్యజీవము నిత్యరాజ్యము! పరిశుద్ధుల సహవాసం, తేజోవాసుల స్వాస్థ్యము!

ఇంకా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడుట- ఎవరూ? విశ్వాసులు!!!

అంతవరకూ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది అంటున్నారు!

విశ్వాసులు పాపం చేసే సమయం వరకు, లేదా వారి మనసుల్లో ఏదో ఒక అనుమానం పొడసూపేవరకు వారిని కాపాడడం కాదు; వారి విముక్తి సంపూర్ణం అయ్యే వరకు భద్రంగా ఉంచుతాడు. ఇక్కడ పేతురు విముక్తి భవిష్యత్తు కార్యక్రమం గురించి రాస్తున్నాడు. విశ్వాసులు ఇంతకు ముందే విముక్తి పొందారు యోహాను 5:24; రోమా 8:24; ఎఫెసు 2:5; 2 తిమోతి 1:9; తీతు 3:5 ప్రకారం.

వారు ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నారు 1 కొరింతు 1:18; 2 కొరింతు 2:15.

వారు తరువాత విముక్తి పొందుతారు రోమా 13:11; ఫిలిప్పీ 1:28; హీబ్రూ 1:14; 9:28!

 

ఇక విశ్వాసం ద్వారా...కాపాడుతూ కాపాడడం అని తర్జుమా చేసిన గ్రీకు పదం సైనికులు ఒక దాన్ని కాపలా కాస్తూ ఉండడాన్ని సూచించే పదం. దేవుని ప్రభావమే మన విముక్తికి కావలి. ఆయన సేనల ప్రభువు. పరలోక సైన్యాలన్నీ ఆయన చెప్పుచేతల్లో ఉన్నాయి. విశ్వాసులకు పరిచర్య చేసేందుకు ఆయన తన బలాఢ్యులైన దేవదూతలను పంపిస్తారు (హీబ్రూ 1:14; కీర్తన 91:11-12). ఆయన లోకంలోను అదృశ్యంగా ఉండే ఆత్మల లోకంలోను కూడా తన విశ్వాసులు చివరి వరకు భద్రంగా ఉండగలిగే ఏర్పాట్లూ పరిస్థితులూ చేయగలరు, చేస్తారు కూడా (యోహాను 6:39; 10:28-29).

తన కుమారుని ప్రార్థనకు జవాబుగా ఆయన ఇది చేస్తారు (యోహాను 17:11-12; హీబ్రూ 7:25).

అలాగైతే విశ్వాసులు తమ విశ్వాసాన్ని కోల్పోతే ఎలా? తమ విముక్తిని, రక్షణను పోగొట్టుకొంటారా? దేవుడునమ్మకం ద్వారావారిని కాపాడుతూ ఉంటారు. నమ్మకం దేవుడు ఉచితంగా ఇచ్చేదే (ఎఫెసు 2:8; ఫిలిప్పీ 1:29). తనతో మనకు సజీవ సంబంధం ఉండేలా ఆయన ఉపయోగించే పరికరం ఇదే. అది మన జీవితాల్లో దేవుడు ప్రవేశపెట్టిన శక్తివంతమైన ప్రభావం. అది దేవుని రక్షణ కార్యానికి పరిపూర్ణమైనది. మనలో దేవుడు చేయదలచుకున్న పనికి చక్కగా సరిపోయినది. విశ్వాసులకు విశ్వాసాన్ని ఇచ్చినవాడు వారి హృదయాల్లో దాన్ని సజీవంగా ఉంచగల సమర్థుడే (లూకా 22:31-32). మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనల్ని భద్రంగా ఉంచుతాడనేది నిజం కాదు. మనం నమ్ముతూ ఉండేలా ఆయన చేస్తారు (ఫిలిప్పీ 1:6; హీబ్రూ 12:2).

 

కాబట్టి విశ్వాసాన్ని కూడా మనము కాపాడుకోవాలి. బంగారు వెండి వజ్రాల కంటే మిన్నగా మన విశ్వాసం కాపాడుకోవాలి!

పౌలుగారు బోలెడు దేశాలలో సువార్త చేసి, కొన్ని వందల సంఘాలు కట్టి, వేలమంది ని క్రీస్తువైపు త్రిప్పి, వేల అధ్భుతాలు చేసి ఇంత చేశాను అంత చేశాను అని మురిసిపోలేదు గాని తన విశ్వాసాన్ని కాపాడుకొన్నాను అంటూ సవాలుకరమైన మాటలన్నారు. మంచి పోరాటం పోరాడితిని....

2తిమోతికి 4:7

మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

2తిమోతికి 4:8

ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.

మరి నీవుకూడా నీ విశ్వాసాన్ని కాపాడుకొంటున్నావా!!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*16 భాగము*

*శ్రమలలో ఆనందం-1*

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఆరవ వచనంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించు చున్నారు అంటున్నారు. ఎందువలన?

4-5 వచనాలలో చెప్పబడిన విషయం గురించి! ఏం చెప్పబడింది?

1 Peter(మొదటి పేతురు) 1:4,5

4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

 

యేసుక్రీస్తు ప్రభులవారు మృతులలోనుండి తిరిగి లేచుటవలన మనకు కలిగిన జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము కలిగాయి కాబట్టి, కడవరి కాలమందు బయలుపరచబడబోయే రక్షణ కూడా మనకు కలుగబోతుంది కనుక మిక్కిలిగా ఆనందిస్తున్నారు అంటున్నారు!

గాని దానివలన మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

జాగ్రత్తగా గమనిస్తే పరలోక ఆధ్యాత్మిక స్వాస్థ్యము పొందుకొనేక్రమంలో ఇహలోకములో మనము కొంతకాలం అవసరాన్ని బట్టి నానావిధములైన శోధనలు శ్రమలు హింసలు పరీక్షలు కలుగుతున్నాయి అంటున్నారు! దానికి కొంతమంది దుఃఖిస్తూ ఉన్నారు  అయితే వీటిలో కూడా మీరు సంతోషిస్తున్నారు అంటున్నారు!

 

శ్రమలలో ఆనందించేవారు ఎవరండీ! నిజానికి భౌతికమైన శ్రమలకు శోధనలకు హింసలకు మనుషులుగా ఎంతో బాధపడతాం. క్షోబిస్తాము. ఇంకా ఏడుస్తాము! గాని శ్రమలలో ఆనందించడం ఎలా?! సేన దయ్యాలు పట్టినవాడు తననుతాను గాయపరచుకుంటూ ఆనందపడేవాడు. ఎందుకంటే వానిలో దయ్యాలు ఉన్నాయి కనుక! కొందరు మతిస్థిమితం లేని వారు కూడా ఇలానే చేస్తారు. ఎవరు తిట్టినా కొట్టినా వారికి పరవానహీ! మరి శ్రమలలో ఆనందించేవీరు పైవాటిలో రకం?!

 

క్రీస్తులో ఆధ్యాత్మిక ఆనందం పొందడం నిజ క్రైస్తవుని లక్షణాల్లో ఒకటి. అది దేవునికి చెందినవారికి ఆయనిచ్చే ఉచిత వరం. ఆనందం అంటే అంతా బాగున్నప్పుడు మన మనసుల్లో సహజంగా కలిగే సంతోషం కాదు. అది మానవాతీతమైన ఆనందం. మనం దీన్ని ఎన్నడూ అనుభవించలేదంటే మనం క్రీస్తులో నమ్మకం/ నిజమైన విశ్వాసం ఉంచలేదనుకోవడానికి ఇది బలమైన ఆధారం (యోహాను 15:11; 16:24; 17:13; అపొ కా 5:41; 8:39; 16:34; రోమ్ 5:2-3, 11; 14:17; 2 కొరింతు 6:10; 8:2; గలతీ 5:22; 1 తెస్స 1:6).

 

కాబట్టి నిజమైన విశ్వాసి శ్రమలలో ఆనందిస్తాడు అని దీనిని బట్టి అర్ధమవుతుంది. అయితే విశ్వాసులు కూడా కొన్ని సందర్భాలలో ఇక్కడ దుఃఖిస్తూ ఉన్నారు అంటున్నారు.

 

 మన హృదయాల్లో దేవుని ఆనందాన్ని అడ్డుకునే అనుభవాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొదటిది పాపం ఒకటి

కీర్తన 32:3-5;

3. నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.

4. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)

5. నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)

 

Psalms(కీర్తనల గ్రంథము) 51:3,4,7,11,12,13

3. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.

11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.

12. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

13. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.

 

రెండవది: సందేహం. దానికి పేతురు గారే ఉదాహరణ:

 మత్తయి 14:28-31;

28. పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

29. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెనుగాని

30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్నురక్షించుమని కేకలువేసెను.

31.వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

 

Luke(లూకా సువార్త) 24:36,37,38,39,40

36. వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి-- మీకు సమాధానమవుగాకని వారితో అనెను.

37. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము (మూలభాషలో-ఆత్మ) తమకు కనబడెనని తలంచిరి.

38. అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?

39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి

40. తన చేతులను పాదములను వారికి చూపెను.

 

యాకోబు 1:6

అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

యాకోబు 1:7

అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

యాకోబు 1:8

గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.

 

మూడవది: దుర్బోధలను నమ్మడం

 గలతీ 3:1-3;

1. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన పొందితిరా?

3. మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?

 

Galatians(గలతీయులకు) 4:15,16,17,19

15. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

16. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?

17. వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు; మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయ (మూసివేయ) గోరుచున్నారు.

19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

 

నాల్గవది : తట్టుకోలేని శ్రమలు/ హింసలు/ విషమ పరీక్షలు కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అడ్డగించగలవు. ఉదాహరణకు యోబుగారు 3:1-26.

 

కానీ అవి విశ్వాసుల ఆనందానికి అడ్డుబండలు కానవసరం లేదు. చాలా గడ్డు పరిస్థితుల్లో కూడా బలమైన విశ్వాసం ఉన్నవారు ఆనందించగలిగారు

అపో.కార్యములు 5:41

నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి. . .

 

ఇక పౌలుగారిని సీలగారిని జ్ఞాపకం చేసుకుంటే శ్రమలలో ఎంతగా ఆనందించారో తెలుస్తుంది!

అపో.కార్యములు 16:23

వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.

అపో.కార్యములు 16:24

అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.

అపో.కార్యములు 16:25

అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.

 

2 కొరింతు 12:7-10;

7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

8. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము (లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

 

కొలస్సయి 1:24;

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

 

యాకోబు 1:2

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

యాకోబు 1:3

మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

అందువల్ల విచారం, ఆనందం, రెండూ ఒకే సమయంలో మనలో చోటు చేసుకోవచ్చు (2 కొరింతు 6:8-10).

 

అయితే "ప్రస్తుతం కొద్ది కాలంవిషమ పరీక్షలుండేదికొద్ది కాలమేనని గమనించండి.

ప్రతీ విశ్వాసి/ సేవకుని విశ్వాస జీవితంలో శ్రమలు శోధనలు వస్తాయి. అవి ఆకాశంలో మబ్బులు/ మేఘముల వంటివి. విశ్వాసుల జీవితాలలో శోధనల కాలం మబ్బురోజు లాంటిదికారుమబ్బులు కాచినప్పుడు దారి కానరాదు. భయంకరమైన ఈదురుగాలులు వస్తాయి. అయితే విశ్వాసి భయపడకూడదు. అదే ఈదురుగాలి కారుమబ్బులను ఈడ్చుకుని పోతాయి. మబ్బులన్నీ పటాపంచులవుతాయి. తేటతెల్లని వెలుగు ప్రసరిస్తుంది. అప్పుడు విశ్వాసి అనుకుంటాడు- అయ్యా మబ్బులను/ శ్రమలను ఇట్టే తీసేసావే! ఇక నాపని అయిపోయింది. ఇక నా చాప్టర్ క్లోజ్! ది ఎండ్ అనుకున్నానే! గాని నా శ్రమ ప్రమేయం లేకుండా ఎలా వచ్చిన మబ్బులు/ శ్రమలు అలాగే వెళ్లపోయాయయ్యా! నీవు ఆశ్చర్యకరుడవయ్యా! నా మీద నీకెంత ప్రేమ జాలికదయ్యా కరుణామయా అని పరవశించిపోతాడు.

ఇదీ నిజమైన విశ్వాస జీవితం! అప్పుడు నిజంగా శ్రమలలో ఆనందించగలవు! అలా ఆనందించడానికి మరో కారణముంది!

2కోరింథీయులకు 4:17

మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

2కోరింథీయులకు 4:18

ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.

 

మరి ఇట్టి విశ్వాసము, శ్రమలలో ఆనందించే జీవితం నీకుందా?!!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*17 భాగము*

*శ్రమలలో ఆనందం-2*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ఇక ఏడవ వచనంలో అంటున్నారు నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

ఆరవ వచనంలో మీరు శ్రమలలో ఆనందిస్తున్నారు అంటూ, ఏడవ వచనంలో  నశించుపోయే బంగారం అగ్నిద్వారా శుద్ధి చేయబడి మరలా జిగేల్ మనే మెరుపుగలదిగా క్రొత్తదిగా ఎలా చేయబడుతుందో, బంగారముకంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్నిలాంటి శోధనల చేత పరీక్షించబడి, మెరుగు పరచబడి, దృడపరచబడి శోధనలకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనగా రెండవ రాకడలో మద్యాకాశంలో జరిగే గొర్రె పిల్ల పెండ్లివిందు సందర్భంగా జరిగే బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమంలో మీకు మత్తయిసువార్త 25 ప్రకారం మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణం అవుతుంది అంటున్నారు!!!

 

మనుషులు బంగారాన్ని శుద్ధి చేసేందుకు అగ్నిని వాడుతారు. ఇదే కారణంతో దేవుడు మనుషుల్ని విషమ పరీక్షల గుండా వెళ్ళనిస్తాడు.

కీర్తన 66:10-12

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 విశ్వాసము బంగారం కన్నా మరెంతో విలువైనది. అలాగైతే మనుషులు విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేసి లోక సంపదల వెంట పరుగులెత్తడం విచారం కాదా. పరలోకంలో ఉండే శాశ్వత సంపదలను చేపడుతుంది కాబట్టి నమ్మకం అంత విలువైనది.

 

పరీక్షలకు నిలిచి మనం నిజంగా నమ్ముతున్నామో, లేక సరైన ఆధారం లేకుండా నమ్మామనుకుంటూ అలా చెప్పుకొంటున్నామో పరీక్షలే అనగా శోధనలు బయట పెడతాయి. ఇలాంటి విషమ పరీక్షలు వచ్చినా విశ్వాసంతో కొనసాగితే లోకంవైపుకు మళ్ళకుండా ఉంటే మన విశ్వాసం వాస్తవమైనదనడానికి ఇది రుజువు.

మత్తయి 13:21, 23;

అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

23. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

 

హెబ్రీయులకు 10:32

అయితే మీరు వెలిగింపబడిన మీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.

హెబ్రీయులకు 10:33

ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి.

హెబ్రీయులకు 10:39

అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు (లేక, సంపాదించుకొనుటకు) విశ్వాసము కలిగినవారమై యున్నాము.

 

నిజ విశ్వాసి విశ్వాసం శోధనల ద్వారానే పరీక్షించబడుతుంది. అబ్రాహాము గారికి వచ్చిన శోధనలలో భయంకరమైన శోధన ఇస్సాకును బలి అర్పించడం! మనసులో ఎన్నో ఒడిదుడుకులు అలజడులు కలిగాయి, చివరికి తండ్రి దహనబలికి నిప్పు కట్టెలు ఉన్నాయి మరి గొర్రె పిల్ల ఏదీ అని ఇస్సాకుగారు అడిగినప్పుడు ముసలితండ్రి హృదయం ఎంతగా రోధించిందో తెలియదు! గాని దృఢమైన విశ్వాసం కలిగి కత్తి పైకెత్తిన వెంటనే దేవుడు ప్రత్యక్షమైపోయారు. అబ్రాహాము గారి విశ్వాసం శ్రమ శోధన ద్వారా బలపరచ బడింది.

ఇస్సాకు గారి విశ్వాసం కరువు అనే శోధన ద్వారా ధృఢపరచబడింది.

గిద్యోను గారి విశ్వాసం నాలుగు శోధనలు ద్వారా ధఢపరచబడింది.

దావీదుగారి విశ్వాసం అదే నిత్య శోధనల ద్వారా ధృఢపరచబడింది.

దానియేలు గారి విశ్వాసం సింహపుబోనులో రెట్టింపు అయ్యింది.

హనన్యా, మిషాయేలు అజర్యా విశ్వాసం అగ్ని గుండములో ధృవీకరించబడింది!!

ఆది అపొస్తలులు, నిజ విశ్వాసుల విశ్వాసం ఇదే శోధనలు ద్వారా ధృఢపరచబడింది.

అంతెందుకు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు కూడా ఇదే శ్రమలద్వారా సంపూర్ణత సాధించారు!

హెబ్రీయులకు 2:10

ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

హెబ్రీయులకు 2:11

పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

హెబ్రీయులకు 2:12

నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య (లేక, సంఘముమధ్య) నీ కీర్తిని గానము చేతును అనెను.

పరిశుద్ధ పరచువాడు యేసుక్రీస్తు ప్రభులవారు!

పరిశుద్ధ పరచబడేవారు విశ్వాసులు, నీవు నేను!

అందరికీ ఒక్కటే మూలము!

 శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయబడుట!

అలా చేయబడిన తర్వాతనే హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడటం లేదు. మనము యేసుక్రీస్తు యొక్క సహోదరి సహోదరులుగా పిలువబడుచున్నాము! యేసుక్రీస్తు ప్రభులవారు శ్రమలు సహించి  శ్రమలలో ఎలా సంతోషించారో అలాగే మనం కూడా శ్రమలలో పారిపోకుండా సహించి, శ్రమలలో దేవున్ని నిష్టూరంగా మాట్లాడకుండా సంతోషిస్తామో వెంటనే దేవుడు ఇతడు/ ఈమె నా సహోదరుడు నా సహోదరి అని ధైర్యంగా చెబుతారు!!!

గతభాగంలో చూపించడం జరిగింది. అనేకమంది భక్తులు శ్రమలలో కృంగిపోకుండా సంతోషించారు. అలాగే మనము కూడా శ్రమదినమందు కృంగిపోక ఆనందిద్దాము!

సామెతలు 24:10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

దైవాశీస్సులు!!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*18 భాగము*

*శ్రమలలో ఆనందం-3*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంకా శ్రమలకోసం ధ్యానం చేసుకుందాం!

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

ఇక 12 వచనంలో అంటున్నారు: శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. శోధనలను/ శ్రమలను/ పరీక్షలను చూసి పారిపోకూడదు, వాటిని సహించాలి అంటున్నారు. అలా సహిస్తే వారు దేవునిచేత ప్రేమించబడిన వారవుతారు తద్వారా దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు అంటున్నారు యాకోబు గారు!

 

ఇప్పుడు, ఇంకా రాబోయే రోజులలో కూడా  విశ్వాసుల మేలుకే శోధనలు/ శ్రమలు/ విషమ పరీక్షలు పని చేస్తాయి 24; అందుకే మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి అంటున్నారు యాకోబు గారు! అయితే అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం అనే జీవ కిరీటం పొందుకుంటారు అంటున్నారు. ఇప్పుడు నేను కిరీటం కోసం చెప్పడం లేదు కారణం గతంలో అనేకసార్లు కిరీటాలు కోసం మాట్లాడుకున్నాం! అయితే ఎవడైతే శ్రమలను శోధనలను విషమపరీక్షలను తట్టుకుని క్రీస్తుకోసం నిలిచి జయిస్తాడో వాడు మాత్రం జీవకిరీటం పొందుకుంటాడు అన్నమాట! అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచినవారికి జీవ కిరీటాన్నిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది.  “ప్రేమించేవారికి విషమ పరీక్షల్లో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి ఇదే!. ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం.

 

ఇంకా తర్వాత వచనంలో  దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు అంటున్నారు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మెరుగు పెడతాడు గానీ దుష్ట ప్రేరణ కలిగించడు.

మత్తయి 6:13 లో జవాబివ్వడానికి దేవునికి బహు ఇష్టమైన ప్రార్థన ఉంది చెడుతనమూ, పాపమూ కూడా దేవునికి లేశమాత్రమైనా ఇష్టం లేదు. చెడుతనాన్నంతటినీ పూర్తిగా, శాశ్వతంగా ఆయన అసహ్యించుకుంటాడు

 

సరే, రోజు శోధనలను సహించేవాడు ధన్యుడు అంటూ వాడు దేవునిచేత ప్రేమించబడి జీవకిరీటం పొందుకుంటాడు అని యాకోబు గారు  చెబుతున్నారు కదా, ఎవరైనా ఇలా శోధనలను శ్రమలను పరీక్షలను తట్టుకుని కిరీటాలు బహుమానాలు ఆశీర్వాదాలు పొందుకున్నారా లేదా అనేది చూసుకుందాం!

 

బైబిల్ గ్రంధంలో గల గొప్ప వారు ప్రవక్తలు దైవజనులు అందరూ ఇలాంటి శోధనలను పరీక్షలను తట్టుకున్న వారే, అలా శోధనలకు నిలిచి సహించి అసాధారణమైన కార్యాలు చేయగలిగారు! అయితే వీరిలో కొందరిని మాత్రము మనం జ్ఞాపకం చేసుకుందాం!

 

మొదటగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము గారిని జ్ఞాపకం చేసుకోవడం సమంజసందేవుడు అబ్రాహాము గారిని పిలిచి అబ్రాహామా! నీవు నీ తండ్రి ఇంటివారిని నీ స్వజనాన్ని విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెబితే- ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నలు వేయకుండా తిన్నగా తనకు కలిగిన సమస్తము తీసుకుని వెళ్ళిపోయారు! గొప్ప ధనవంతుడు- తన కున్న ఆస్తి బంగళాలు అన్ని వదిలేసి- టెంట్ లలో ఉన్నారు, ఎండకు వానకు ప్రయాణం చేసి- దేవుడా ఇంతన్నావ్ అంతన్నావ్ అని ఎప్పుడు అనలేదు! కొన్ని సంవత్సరాలకు ఊహించలేనంత ఆస్తి ఐశ్వర్యము ఇచ్చి, నూరేళ్ళ వయస్సులో వాగ్ధాన పురుషుడైన కుమారున్ని అనగా ఇస్సాకుని ఇచ్చి, ఒకరోజు హటాత్తుగా అబ్రాహామా నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని మోరియా కొండమీద బలి ఇచ్చేయ్ అన్నారు! ఇంతవరకు వచ్చిన పరీక్షలు కంటే గొప్ప పరీక్ష ఎదురైంది అబ్రాహాము గారికి! వెంటనే తన హృదయం బద్దలై పోయింది, గాని ఏమాత్రము దేవుణ్ణి నిందించలేదు దేవుని వాగ్దానాలను అనుమానించలేదు. కుమారుడైన ఇస్సాకుని ఉదయాన్నే తీసుకుని మోరియా కొండకు వెళ్ళిపోయారు! ప్రయాణంలో ఎన్ని సార్లు తన మనస్సు అడిగిందో , దేవుడు నీ సంతానాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నారు, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నారు. ఇప్పుడు నీ కొడుకుని బలి ఇచ్చెయ్యమంటారా దేవుడు! మనుషులను బలికోరే దేవుడా నీ దేవుడు అని, గాని తన మనస్సుతో చెప్పి ఉండాలి- దేవుడు ఒకవేళ తన కుమారున్ని బలికోరితే దహనమైపోయిన తర్వాత మిగిలే భష్మము లేక బుగ్గిలోనుండి   దేవుడు ఇస్సాకుని లేపగలరు, బుగ్గిలోనుండి  నాకు సంతానం అభివృద్ధి చేయగలరు అని నమ్మి విశ్వసించి తన మనస్సుతో చెప్పి ఉంటారు! కొండ ఎక్కేటప్పుడు ఎన్ని కన్నీళ్లు రాలాయో కదా! చివరికి తండ్రీ- దహన బలికి కట్టెలు, నిప్పు ఉన్నాయి గాని మరి ఇంతకీ గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన గుండె ముక్కలుగా విడిపోయి ఉంటుంది, ఇది మరీ పెద్ద పరీక్షగాని ఆయన చెప్పిన సమాధానం- నా కుమారుడా దహనబలికి పశువును దేవుడే చూసుకుంటాడు! జాగ్రత్తగా పరిశీలిస్తే తన హృదయంలో రేగే అలజడిని వెనుకకు పంపించి దృఢమైన విశ్వాసంతో అంటున్నారు: నాకుమారుడా దహనబలికి గొర్రెను కొండమీద దేవుడే చూసుకుంటారు! బలిపీటం కట్టారు, గుండె రాయి చేసుకుని తన కుమారుడైన ఇస్సాకుని ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకుని పొందుకున్న వరపుత్రుని రెండు చేతులు కట్టేసి తన చేతులతో బలిపీటం మీద పెట్టినప్పుడు ఎంతగా మౌనంగా రోధించారో అబ్రాహాము గారు మనకు తెలియదు! అయ్యా అబ్రాహాము గారు ఎలా చేశారో నాకైతే అర్ధం కావడం లేదు త్యాగం, సమర్పణ! వేరేవారికోసం నేను చెప్పలేను గాని అదే నా కొడుకుని దేవుడు బలి ఇచ్చేయ్ అని నన్ను గాని అడిగితే నేను నా చేతులతో ఇవ్వలేనండి, నేను ఒప్పుకోలేనండి- దేవుని సేవకు ఇచ్చెయ్యమంటే ఇవ్వగలను గాని, నా ఆస్తి మొత్తం ఇవ్వమంటే ఇచ్చెయ్యగలను గాని నా చేతులతో నా కుమారుని బలి ఇవ్వమంటే నేను ఇవ్వలేను! గాని ఈయన సిద్ధమైపోయి కత్తి ఎత్తారు!! దృశ్యాన్ని చూడటానికి బహుశా పరలోకం మొత్తం వంగి చూస్తుంది అని నా ఉద్దేశం!!! ఎప్పుడైతే కత్తిఎత్తి ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నారో చివరి క్షణంలో దేవుడే కరిగిపోయి అబ్రాహామా అబ్రాహామా అని కంగారుగా పిలిచేశారు, లేకపోతే నిజంగా బలి ఇచ్చేస్తారు అబ్రాహాము గారు! అందుకే అబ్రాహామా అబ్రాహామా! చిన్నవాని మీద కత్తి వేయవద్దు! ఇందును బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే ఈలోకంలో ఉన్నవారికంటే చివరికి నీ ముద్దుల కొడుకు కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని నాకర్ధమయ్యింది. అన్నికంటే దేవునికే ఎక్కువగా భయపడుతున్నావు! అదిగో పొదలలో చిక్కుకున్న పొట్టేలుని బలి ఇచ్చేయ్ అంటూ గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నారు దేవుడు! పరీక్షలో విజయుడై నిలిచినందుకు ప్రతిఫలం చూశారా ఎంత గొప్ప దీవెనో...

 

Genesis(ఆదికాండము) 22:2,3,5,7,8,9,10,11,12,13,14,15,16,17,18

2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.

3. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

5. తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా

8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.

9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.

10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

11. యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

12. అప్పుడు ఆయన చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలన నాకు కనబడుచున్నదనెను.

13. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను.

14. అబ్రాహాము చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

15. యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున

17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.

 

బలి ఇవ్వకముందు తన కుమారుని రక్షించుకున్నారు, గొర్రెపిల్ల/పోట్టేలుని బలి ఇచ్చాక మరింత దీవెన ఇస్తున్నారు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు లాగ చేస్తాను, సముద్ర తీరంలో ఉన్న ఇసుక ఎంత ఉంటుందో అంతగా చేస్తాను అబ్బో ఎంత దీవెనో కదా!

 

ఇప్పుడు చూడండి ఇశ్రాయేలు వారిని అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!

ఇస్లామీయులను అడగండి మీ త్రండి ఎవరు? అబ్రాహాము!

క్రైస్తవులను అడగండి మీ తండ్రి ఎవరు? అబ్రాహాము!!!!

 

ఇన్ని పరీక్షలు తట్టుకున్నారు కనుకనే అంతగా ఆశీర్వాదం కలిగింది! అబ్రాహాము గారికి కలిగిన శోధనలో/ పరీక్షలో విధేయత మరియు విశ్వాసం ద్వారా జయించగలిగారు!

 

 అదే కదా రాస్తున్నారు యాకోబు గారు ఆత్మావేశుడై- శోధన సహించువాడు ధన్యుడు, అతడు దేవునిచేత ప్రేమించబడి జీవ కిరీటం పొందుకుంటాడు! మరి ఇది నిజమే కదా!

 

కాబట్టి ప్రియ దైవజనమా! మనము కూడా శోధనలలో శ్రమలలో జారిపోకుండా పారిపోకుండా నిలకడగా నిలబడదాం! శ్రమలలో ఆనందపడదాందైవాశీర్వాదాలు ముఖ్యంగా జీవ కిరీటం పొందుదాం!

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*19 భాగము*

*శ్రమలలో ఆనందం-4*

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

ప్రియులారా గతభాగంలో అబ్రాహాము గారికి కలిగిన శోధనలో ఎలా జయించారో చూసుకున్నాం! ఇంకా అనేకమంది ఉన్నారు. అబ్రాహాము గారి తర్వాత యాకోబు గారు కూడా శ్రమలను శోధనలను జయించారు! మామ ఎన్నోసార్లు తన ఆస్తిని తారుమారు చేసినా, శోధనలు ఎదురైనా మామ గారి దగ్గరనుండి పారిపోయారు, అయితే యబ్బోకు రేవు వచ్చేసరికి ఎదరనుండి అన్న యాశావు గారు తనను ఎదుర్కొని బహుశా చంపడానికి వస్తున్నారు నాలుగు వందలమందిని తీసుకుని, వెనుక నుండి మామ లాబాను తరుముకుంటూ వస్తున్నాడు! ఏమిచెయ్యాలి? భయంకరమైన పరీక్ష / శోధన/ శ్రమ ఎదురైంది! నిజం చెప్పాలంటే సంఘటన జరిగేసరికి- యాశావు గారు కేవలం నాలుగు వందలమందిని తీసుకుని వస్తున్నారు గాని అంతకంటే ఎక్కువమంది పనివారు తనతో ఉన్నారు, లాబాను కంటే ఎక్కువమంది తనతో ఉన్నారు. యాకోబు గారు యుద్ధం చేయగలరు! గాని దేవుడు చెప్పిన మాట ఉంది అది ఏమిటంటే నీవు నీ స్వదేశానికి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అని,

ఆదికాండము 31:3

అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా...

  వాగ్దానం పట్టుకుని యబ్బోకు రేవులో ఒక్కడే రాత్రంతా దేవుని సన్నిధిలో మగసిరిగలవాడై ప్రార్ధనలో మోకాళ్ళపై దేవునితో పోరాడుతున్నారు యాకోబు గారు! తన కాలు లేక తొడ గాయమైపోడానికి ఒప్పుకున్నారు గాని దేవుని దగ్గర మేలు లేక ఆశీర్వాదం పొందకుండా వదలలేదు! నన్ను దీవిస్తావా లేదా అంటూ మొండిపొట్టు ప్రార్ధనలో ఉడుం పట్టు పట్టారు ఆయన! దేవుడు దీవించక తప్పలేదు! ఆశీర్వదించి వెళ్ళిపోయారు దేవుడు! నీవు మనుష్యులతోను దేవునితోను పోరాడి గెలిచావు రా సెహబాష్ అన్నారు దేవుడు! పేరు మార్చేశారు దేవుడు, మోసపూరితమైన బుద్ధి మార్చేశారు దేవుడు! మొత్తం జీవితమే మారిపోయింది!

 

Genesis(ఆదికాండము) 32:9,10,11,12,24,25,26,27,28,29,30

9. అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

11. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింప జేయుదునని సెలవిచ్చితివే అనెను.

24. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

25. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.

26. ఆయనతెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడునీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

27. ఆయననీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.

28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

30. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

 

 ఇదయ్యాక శత్రువైన అన్న మిత్రుడుగా అన్నగా మారిపోయి యాకోబు గారి బుజాల మీద పడి బోరున ఏడ్చాడు ఆయన! అందుకే ఒకని ప్రవర్తన మంచిదైతే దేవునికి ఇష్టమైతే వాని శత్రువును కూడా మిత్రుడుగా చేస్తారు అంటున్నారు బైబిల్ లో...

సామెతలు 16: 7

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.

 

యాకోబు గారు తన శోధనను మోకాళ్ళపై జయించారు. చివరికి గొప్ప దీవెనలు పొందుకున్నారు....

 

మరోసారి తన ఒక్కగానొక్క కుమార్తె దీన చేసిన పిచ్చిపని వలన- తన కుమారులు లేవి షిమ్యోను హంతకులై ఒక గ్రామం మొత్తమందరినీ చంపేసి వారి ఆస్తిని దోచేసుకున్నారు. ఇది విని ప్రక్క ప్రాంతాల వారందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు! మరలా మోకాళ్ళమీద పడ్డారు యాకోబు గారు! దేవుడు చెప్పారు: నీవు బయలు దేరి ఎక్కడైతే దేవునికి బలిపీటం కడతాను అని మ్రొక్కుకుని మర్చిపోయావో అక్కడికి వెళ్లి బలి అర్పించు, నేను నీతో ఉంటాను అన్నారు! మరోసారి మోకాళ్ళమీదనే జయించారు. దేవుని భయం ఇరుగుపురుగు వారికి కలిగి ఎవరూ యాకోబు గారిని తరుమలేదు!

 

మరినీకు ఇలాంటి శ్రమలు ఎదురైనప్పుడు నీ సొంతవారిని తీసుకుని యుద్ధానికి వెళ్తావా లేక యాకోబు గారిలా మోకాళ్ళమీద జయిస్తావా?

 

ఇక మరో వ్యక్తీ- దేవుని పరీక్షలను ఎదుర్కొన్న వ్యక్తి యాకోబు గారి పదకొండో కుమారుడు- యోసేపు గారు! చిన్నప్పుడే దేవుడు నీవు అధిపతివి రాజువు అవుతావు అని దర్శనం కలిగితే , అన్నలు పగపట్టి చేయని నేరానికి కొట్టి నీరులేని గుంటలో పడిచేశారు! తర్వాత గొప్ప యువరాజు లాంటి యోసేపు గారిని బానిసగా అమ్మేశారు. అక్కడ చేయని నేరానికి బానిసగా బ్రతికాడు! దేవుని కృప వలన అక్కడ బాగా జీవిస్తున్న సమయంలో ఇంటి యజమానురాలికి కామపిశాచి పట్టి యోసేపు గారితో పాపం చెయ్యమంటే నేను దేవునికి, నా యజమానికి ద్రోహం చెయ్యను అని బట్టలు వదిలించుకుని పారిపోయాడు! మరలా చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించాడు! గాని చివరికి దేశానికే గొప్ప అధికారి అయ్యారు (కొందరు ప్రధానమంత్రి అంటారు, కొందరు గవర్నర్ అంటారు) యోసేపు గారు శోధనలను శ్రమలను చూసి దేవుణ్ణి నిందించలేదు- ఇంతన్నావ్ అంతన్నావ్, నేను చేయని నేరానికి నేనెందుకు బాధలు శ్రమలు అనుభవించాలి అని అడుగలేదు! దేవునికి పూర్తిగా తనను తానూ అర్పించుకున్నారు. అయ్యా నీదే భారం! నీ ఇష్టమొచ్చినట్లు నన్ను చెక్కు అని దేవుని చేతులకు అప్పగించుకుంటే ఒకరోజు దేశానికే అధికారి అయ్యారు యోసేపు గారు!

 

Genesis(ఆదికాండము) 37:18,19,20,22,24,26,27,28

18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

19. వారు ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు;

20. వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

22. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.

24. అతని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

26. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27. ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

28. మిద్యానీయు లైన వర్తకులు మీదుగా వెళ్లుచుండగా, వారు గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

 

Genesis(ఆదికాండము) 39:1,5,6,7,9,12,19,20,21

1. యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను.

5. అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను.

6. అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

7. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

12. అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

19. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పినమాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

21. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతని యందు కనికరపడి అతనిమీద చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.

 

Genesis(ఆదికాండము) 41:40,41,42,43,44

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

41. మరియు ఫరోచూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

43. తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.

44. మరియు ఫరో యోసేపుతోఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

 

యోసేపు గారు తనకు వచ్చిన శోధనలను దేవుని చిత్తానికి తనను అప్పగించుకోవడం వలన మరియు ఇంద్రియ నిగ్రహం వలన జయించగలిగారు. మరినీకు ఇలాంటి బలహీన క్షణాలు ఎదురైనప్పుడు దేవునికి భయపడుతున్నవా? నీ ఇంద్రియాలను నీ కోరికలను అదుపు చేసుకుంటావా?

ఈలోకంలో మంచివారుగా చెలామణి అయ్యేవారు రెండు రకాలు. మొదటి వర్గం : అవకాశం రాక మంచివారుగా మిగిలిపోయిన వారు! రెండవ వర్గం అవకాశం కలిగినా యోసేపు గారిలా ఇంద్రియాలను నిగ్రహించుకుని దేవునికి భయపడి మంచివారుగా జీవించేవారు! నీవు ఏరకం నా ప్రియ చదువరీ!!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*20 భాగము*

*శ్రమలలో ఆనందం-5*

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

   శ్రమలలో సంతోషించే ఇంకా ఎందఱో వ్యక్తులున్నారు! ఒకసారి దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందాం! నేను రాజు అవ్వాలని ఆయన కోరుకోలేదు! తన చిన్న గొర్రెలమందను మేపుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండగా హటాత్తుగా ఒకరోజు ఒకడొచ్చి మీ నాన్న పిలుస్తున్నాడు అని వెళ్తే అక్కడ సమూయేలు గారు తన తండ్రితో కూడా ఉన్నారు! దైవజనుడు కదా అని వందనం చేస్తే దేవుడు చెప్పిన విధముగా నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలమీద రాజుగా చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు దైవజనుడు! ఇశ్రాయేలు ప్రజలు గొల్యాతును చూసి పిల్లుల్లా పారిపోతే వాడ్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపడం అయన చేసిన తప్పా? రాజు గారికి నేను అల్లుడవ్వాలి అని అనుకున్నారా ఆయన లేదు కదా! రాజు కూతురుని పెళ్లి చేసుకోవడం తప్పా? ఇశ్రాయేలు ప్రజలకోసం శత్రువులతో యుద్ధాలు చెయ్యడం తప్పా? ఇలా ఎన్నెన్నో తాను చేయని తప్పులుకి కొన్ని సంవత్సరాలు అరణ్యాలలో అడవులలో కొండలలో తిరగాల్సి వచ్చింది! ఎన్నోన్నో శ్రమలు శోధనలు ఎదుర్కొన్నారు దావీదు గారు! రాజు కాకముందు, రాజయ్యాక కూడా అనేకమైన శ్రమలను శోధనలు ఎదుర్కొన్నారు!!! ఒకరోజు రాజుగానే కాదు చక్రవర్తి అయ్యారు దావీదు గారు! ఏడ్పు వచ్చినా పాట పాడేవారు లేక పాట రాసేవారు, సంతోషం వచ్చినా పాటే, యుద్ధానికి వెళ్ళినా పాటే, గెల్చినా పాటే, దేవుని మందిరానికి వెళ్ళినా పాటే! ఇలా దేవుని స్తుతి తన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది! ఇదే ఆయనను విజయశీలిగా చేసింది! దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవునిచేతనే సర్టిఫై చేయించుకోగలిగారు!

 

దావీదుగారు తన శ్రమలను శోధనలను కేవలం స్తుతి ఆరాధన ద్వారా జయించగలిగారు! మరి నీకు అలాంటి స్తుతి ఉందా సహోదరుడా! కష్టాలు వచ్చినప్పుడు ఎవడైనా దేవున్నే ప్రార్ధిస్తాడు, కారణం మరో దారిలేదు కాబట్టి! మరి కష్టాలప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? సుఖాలప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లిస్తున్నావా? ప్రతీ విషయంలో దేవుణ్ణి ముందు పెడుతున్నవా? దావీదు గారు ఏమి చెయ్యాలన్నా ముందు దేవుణ్ణి అడుగకుండా ఏమీ చెయ్యలేదు! కేవలం బత్షేబ విషయంలో మాత్రం దేవుణ్ణి అడుగకుండా చేసినందు వలన దేవుని చేత చీవాట్లు పొండుకుని శ్రమలను కోరి తెచ్చుకున్నారాయన! మరినీవు దేవుణ్ణి అడిగి చేస్తున్నావా ఏపని అయినా?

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎలీయా గారు, ఎలీషా గారు, ఇంకా పాత నిబంధన భక్తులందరూ ఎన్నెన్నో శ్రమలనూ శోధనలను ఎదుర్కొన్నారు!! పాపం భక్తుడైన యిర్మియా గారు బ్రతుకంతా ఏడుస్తూనే బ్రతికారు! చేయని నేరానికి ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని అవమానాలు పొందుకున్నారో? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షను పొందుకున్నారో!! అయినా దేవుణ్ణి విడువలేదు! చివరికి తన సొంతవారు ఆయనను రాళ్ళు రువ్వి చంపేశారు! అయినా విశ్వాశాన్ని వదలలేదు ప్రాణం పోయేవరకు!!

 

    దానియేలుగారికి శోధన వచ్చింది! 84 సంవత్సరాల వయస్సులో ఆయనను సింహాలబోనులో వేసేశారు తప్పు చేయకుండా! కేవలం ప్రార్ధిస్తూ గడిపారు! తన ప్రార్ధన సింహాల నోళ్లను మూసింది. ప్రార్ధన ద్వారా శ్రమలను జయించారు! ప్రపంచానికి దేవున్ని పరిచయం చేశారు.

షడ్రక్ మేషాక్ అబెద్నెగోలకు భయంకరమైన శోధన వచ్చింది. బంగారమ్మను మ్రొక్కమన్నాడు చక్రవర్తి, మేము మ్రొక్కమన్నారు, చావడానికి సిద్దమన్నారు! అగ్నిగుండములో త్రోయబడ్డారు! అక్కడున్న వారందరికీ భగవంతుని ప్రత్యక్షత కలిగించారు! నా చేతిలోనుండి తప్పించగలిగిన దేవుడెవడైనా ఉన్నాడా అన్న నోటితోనే జీవముగల దేవుని సేవకులారా అని చెప్పి, ఇవ్విధముగా రక్షించగలిగిన దేవుడెవరూ లేరని పలికించారు! గొప్ప అధికారులు కాగలిగారు!

 

ఇక క్రొత్త నిబంధన  భక్తులందరూ దెబ్బలు శ్రమలు శోధనలు అవమానాలు పొందుకున్న వారే!

 

అంతెందుకు? యేసుక్రీస్తుప్రభులవారే ఎన్ని శ్రమలు శోధనలు అనుభవించారో కదా! తన చిన్నతనంలో తండ్రిలేకుండా పుట్టినోడు అంటూ అవమానించారు! తానూ సేవచేసిన మూడున్నర సంవత్సరాలు ఎన్నెన్నో అవమానాలు చీత్కారాలు పొందారో? పరిచర్య ప్రారంభించాక ముందు సాతాను గాడితో శోధన పరీక్ష అనుభవించారు! చివరకు 39 కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, అవమానాలు, ముళ్ళకిరీటం, సిలువమరణం, మూడు మేకులు ఇవన్నీ పొందారు అనుభవించారు! మరణాన్ని జయించారు! అందుకే పరలోక అధిపతి అయ్యారు! భూమిమీదను పాతాలమందును ఆకాశమందును సర్వాదికారం పొందుకున్నారు! పౌలుగారు అంటున్నారు....

 

Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8,9,10,11

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6.ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

చివరికి శ్రమల ద్వారా తాను సంపూర్ణత సాధించి అమనలను సంపూర్ణులుగా చేస్తున్నారు!

 

పేతురు గారు ఎన్ని శ్రమలను శోధనలను అనుభవించారు? పౌలుగారు ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు పత్రికలో రాస్తున్నారు!..

 

అయితే ఇవన్నీ అనుభవించాక తిమోతి గారికి చార్జి అప్పగిస్తూ అంటున్నారు: మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుద ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక నాకొరకు నీతికిరీటం ఉంచబడింది అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు! యాకోబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి సరిగ్గా పౌలుగారు చెబుతున్నారు నా కొరకు నీతికిరీటం ఉంచబడింది!

2తిమోతి 4:7--8

 

మరినీవు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చే స్తితిలో ఉన్నావా?

 

శ్రమలు శోధనలు లేకుండా నీకు ఆధ్యాత్మిక దీవెనలు, వరాలు ఫలాలు లేవు! పరీక్ష లేకుండా నీవు డిగ్రీ పొందుకోలేవు, ఉద్యోగం పొందుకోలేవు! యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల బాటలో సంపూర్ణత సాధించారో నీవుకూడా బాటలోనే సంపూర్ణత సాధించగలవు! సంపూర్ణత మరియు జయజీవితం లేకుండా నీవు ఎత్తబడలేవు!

 

చూడండిఒక చెక్క- ఎన్నో ఉలి దెబ్బలను సుత్తి దెబ్బలను తిని ఓర్చుకున్నాకనే మంచి వస్తువుగా లేక విగ్రహంగా తీర్చబడుతుంది! అలాగే ఒక రాయి ఎన్నెన్నో సుత్తి సేనం ఉలి దెబ్బలను తింటుంది బహుశా కొన్ని లక్షల దెబ్బలు తింటుంది. చివరికి అందమైన ఒక రూపానికి వస్తుంది! రూపానికి రావడానికి అది ఎన్నో శ్రమలను దెబ్బలను తిన్నది ఈరోజు ప్రజలందరూ దానిని చూసి ఆహా ఓహో అంటున్నారు!

అదే విధంగా ఒక కుండ అది రూపానికి రావడానికి ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొంది! పిసకబడింది, బాధపడిందిదెబ్బలు తింది, కాల్చబడింది! తర్వాతనే అది వాడబడుతుంది! నీవుకూడా దేవునిచేత వాడబడాలి అంటే తప్పకుండా దెబ్బలు శ్రమలు శోధనలు అనుభవించాలి!

 

మరి నీవుకూడా దేవునిచేత వాడబడతావా? అయితే శ్రమలను ఓర్చుకో! శ్రమలలో ఆనందించడం నేర్చుకో!

 

యోసేపుగారు ఓర్చుకున్నారు! దేశానికి అధిపతి అయ్యారు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*21 భాగము*

*శ్రమలలో ఆనందం-6*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ఇక మనము ఇంతకీ శ్రమలు/శోధనలు/విషమపరీక్షణలు ఎందుకు కలుగుతాయి అనేది చూసుకుందాం ఈరోజుశోధనలు పరీక్షలు దేవుని నుండి కలుగవు అంటున్నారు 1314 వచనాలలో!

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మనలని పరీక్షిస్తారు గాని దురాశ కలిగించరు!

 ఉదాహరణకు ఆదికాండం 22 లో అబ్రాహాము గారిని పరీక్షించారు. కీర్తనల గ్రంధంలో 66:1012లో అంటున్నారు:..

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు నేర్పిన పరలోక ప్రార్ధనలో మత్తయి 6:13 లో మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మరియు కీడు నుండి తప్పించుము అని ప్రార్ధన చెయ్యమమని నేర్పారు ప్రభువు! దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే దేవుడు ఎవరిని శోధించరు మరి మనకు కలిగే శోధనలు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయి???

రోజు మనం మొదటి కారణం చూసుకుందాం! ఇది 14-15 వచనాలలో ఉంది. ప్రతీవాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి శోధనలను తనకుతానుగా శోధనలు తెచ్చుకుంటారు! ఇది మొదటి కారణం! ఎందుకు అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పండిపోయి మరణానికి తీసుకుని వెళ్తుంది అంటున్నారు!

 

మరి యాకోబు గారు చెప్పిన స్టేట్ మెంట్ నిజమా కాదా, నిజమైతే ఎవరికైనా ఇలా జరిగిందా అని మాటలద్వారా కాక వాక్యపు వెలుగులో చూసుకుందాం!

 

మనం ఆదికాండంలో చూసుకుంటే బిలాము గారు కనిపిస్తారు. ఆయనకోసం చూసుకుంటే ఆయన అన్యజనాంగంలో నుండి యెహోవా దేవుడు ఏర్పాటుచేసుకున్న మొదటి ప్రవక్త! నిరంతరం దేవునితో సంభాషించే అనుభవం గలవాడు! ఆయన నోటితో దీవిస్తే వారికి దీవెన, శపిస్తే అవతలి వారు శాపం పొందుకుంటారు అంతటి శక్తివంతమైన పరిచర్య గలవాడు!! ఇంతటి మహా భక్తుడు గాని ధనాశ ఆకర్షించి పాపములో పడిపోయాడు! దేవుడు వద్దని చెప్పినా ఇశ్రాయేలు జనాంగమును శపించడానికి బయలుదేరాడు. గాడిదచేత కూడా బుద్ది చెప్పించుకున్నాడు, వెళ్లి శపించడానికి బదులు ఆశీర్వదించి వెళ్లిపోతుంటే , పెద్దలు బ్రతిమిలాడితే భయంకరమైన సలహ ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలలో 24వేలమంది మరణించడానికి కారణం అయ్యాడు! ఏమని కోరుకున్నాడు అంటే నీతిమంతులకు వచ్చు మరణం వంటి మరణం నాకు కావాలి అని కోరుకున్నా , సంఖ్యాకాండం, యెహోషువా గ్రంధంలో వ్రాయబడి ఉంది చంపబడిన ఇతరులు కాక.. అంటూ రాస్తూ బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి!!! ఇలా గొప్ప ప్రవక్త, దేవునితో మాట్లాడే అనుభవం, దీవెనకరంగా జీవించిన గొప్ప ప్రవక్త- ధనాశ వలన పాపిగా మారి కుక్కచావు చచ్చాడునీతిమంతుని మరణం కావాలని కోరుకున్నా గాని ఒక పాపి దుర్మార్గుడు పొందుకునే మరణం పొందుకుని సరియైన సమాధి చేయబడకుండా కుక్క శవంలా పారవేయబడ్డాడు!

 

Numbers(సంఖ్యాకాండము) 22:5,6,11,12,22,23,28,32,33

5. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.

6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.

11. చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.

12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

22. అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

23. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

28. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా

32. యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.

33. గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.

 

సంఖ్యాకాండము 23:10

10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.

సంఖ్యాకాండము 31: 8

చంపబడిన యితరులుగాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.

 

ఇదే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనడం అంటే!!! 

 

   ఈయన లాంటివాడే మరొకడు ఉన్నాడు! పౌలుగారితో సుమారుగా పదిహేను సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి, గొప్ప ప్రసంగీకుడుగా, పరిశుద్ధ వరాలు ఫలాలు పొందుకున్న పరిశుద్దుడుగా పౌలుగారి దగ్గర ఒక కుమారుడిలా పెరిగి, పౌలుగారు రోమా చెరసాలలో ఉంటే కొద్దిరోజులు పరిచర్య చేసి, ఆయనను అంటిపెట్టుకుని సపర్యలు చేయవలసినది పోయి, దూరంనుండి వచ్చిన వార్త విని పౌలుగారిని విడిచిపెట్టి పోయాడు! ఒక అబద్దం చెప్పాడు, అయ్యగారు థెస్సలోనికయ సంఘం నుండి వార్త వచ్చింది, అక్కడ కొన్ని సరిచేయవలసిన విషయాలున్నాయి, నేను వెళ్లి మరలా వస్తాను అని చెప్పి , థెస్సలోనికయ వెళ్లి, సంఘమునకు వెళ్ళకుండా పట్టణం బయట ఉన్న వెండి గనికి వెళ్ళాడు! నిజానికి తెలిసిన వర్తమానం ఏమిటంటే- థెస్సలోనికయ పట్టణం బయట ఉన్న కొండలో వెండి గని ఉంది, దానిని తవ్విన ప్రతీ ఒక్కరికీ బోలెడు వెండి దొరుకుతుంది, త్రవ్విన ప్రతీవాడు ధనవంతుడు అయిపోతున్నాడు అనేమాట విని వీడుకూడా వెండి గనికి వెళ్ళాడు, వెళ్ళిన వెంటనే త్రవ్వడం మొదలుపెట్టాడు. బోలెడు వెండి దొరికింది. సాయంత్రం అయిపోయింది. ఇంకో గంట ఉంటే ఇంకా వెండి దొరుకుతుంది అనుకుని చీకటి పడినా త్రవ్వడం ఆపలేదు. చీకటిలో కాలు జారింది, లోయలో పడిపోయాడు. శవానికి ఆనవాలు కూడా లేకుండా జంతువులూ మరియు రాంబందులు పీక్కుతిన్నాయి! దిక్కులేని చావు చచ్చాడు మరో పరిశుద్ధుడు! దురాశ గర్భం ధరించి చావుకి తీసుకుని పోయింది భక్తుణ్ణి! ఇతని పేరు దేమా! అందుకే పౌలుగారు రాస్తున్నారు దేమా ఇహలోకమును ఆశించి థెస్సలోనికయకు వెళ్ళెను అంటూ! 2తిమోతికి 4: 10

దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

 

యేహెజ్కేలు గ్రంధంలో దేవుడు నిన్ను నేను కావలివానిగా ఉంచుతున్నాను అని చెబుతూ భక్తునితో అంటున్నారు: ఒక దుర్మార్గుడు తన జీవితం అంతా పాపిగా జీవించి, నేను నీ ద్వారా  చెప్పిన గద్దింపు విని లోబడి మారుమనస్సు పొందితే వాడు క్షమించబడిపరిశుద్దుడుగా మారుతాడు అని చెబుతూ, ఒక నీతిమంతుడు తన జీవితమంతా నీతిగా జీవించి చివరలో పాపం చేస్తే వాడి నీతి పోయి నరకానికి పోతాడు, వాడి భక్తీ మరువబడుతుంది అన్నారు! ఇద్దరు భక్తులకు  అదే కలిగింది!......

Ezekiel(యెహెజ్కేలు) 18:23,24,26,27

23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.

26. నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?

27. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.

 

 ప్రియ సేవకుడా! సేవకులకు ఎక్కువగా శోధించే శోధనలు మొదటిది: స్త్రీ, రెండు: ధనం, మూడు: పొగడ్త!! వీటిలో పడ్డావా- అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది నీ జీవితం! ఇద్దరు దైవజనులు- దురాశ వలననే దిక్కుమాలిన చావు చచ్చారు! నీవుకూడా జాగ్రత్తగా ఉండమని మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*22 భాగము*

*శ్రమలలో ఆనందం-7*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా రోజు మరికొందరిని జ్ఞాపకం చేసుకుని మనకు మనమే బోధ చేసుకుందాం!

 

ఆదిలోనే దురాశ వలన భయంకరమైన స్థితికి వచ్చిన మరో పరిశుద్దుడు, ఏర్పాటు చేయబడ్డ కెరూబు, వేకువ చుక్క లూసిఫర్! వీడు దేవుని దగ్గర పరలోకంలో ప్రధాన దూతయై, ప్రభువును స్తుతించడానికి ఏర్పరచబడ్డ క్వయిర్ లీడర్! వీడు చేయి ఎత్తితే మ్యూజిక్, దేవదూతలందరూ వీడి సంజ్ఞలు విని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు! ఒకరోజు వీడు అనుకున్నాడు: దేవుడు అలా సింహాసనం మీద కూర్చుంటున్నాడు అంతే, దేవదూతలందరూ నేను ఏమి చెయ్యమంటే అది చేస్తున్నారు. నాకు లోబడుతున్నారు! కాబట్టి ఆయనకు దేవునికి నేనెందుకు లోబడాలి- ఆయనకన్నా నా స్థానాన్ని ఎత్తుగా చేసుకుంటాను! సభా పర్వతం మీద కూర్చుంటాను అని మనస్సులో అనుకున్నాడు అంతే, ఒక్క తాపు తంతే పాతాళంలో ఒక మూలకు పడ్డాడు. వీడికోసం బైబిల్ లో ఏమి వ్రాయబడిందో చూసుకుందాం....

 

Isaiah(యెషయా గ్రంథము) 14:12,13,14,15

12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

 

Ezekiel(యెహెజ్కేలు) 28:12,13,14,15

12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

13. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంక రింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

14. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.

15. నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

 

చూశారా- వీడి దురాశ వలన పరలోక భాగ్యము పోగొట్టుకోవలసి వచ్చింది, ఒక పరిశుద్ధుడు పాపిగా మారిపోయాడు! ఒక కెరూబుగా, దేవుని యొక్క ప్రధాన దూతగా ఉండటం చాలా అల్పమని భావించి దేవుడైపోవాలి అనుకున్నాడు! ఏదీ లేకుండా పోయిందివీడిలో మొదట గర్వము, రెండు దురాశ, మూడు జీవపు ఢంభము పనిచేసి వీడ్ని అత్యల్ప స్థానానికి సాతానుగా మార్చింది!

 

  ఇలాంటి పనికిమాలిన బుద్ధే వచ్చింది మరొకనికి, వాడు తనతో మరికొందరిని చేర్చుకున్నాడు! వీడిపేరు కోరహు! వీడు దాతాను అభిరాములను తనతో చేర్చుకున్నారు! వీరు మరో 250 మందిని కలుపుకున్నారు! వీరంతా మోషేగారిమీద వ్యతిరేఖంగా పోగయ్యారు! మోషేగారు భాధపడ్డారు. దేవుడు రౌద్రుడు అయ్యారు! మొత్తానికి అసాధారణ మరణం కలిగి పోయారు! అసాధారణ మరణం అనగా మానవులంతా పోయే సాధారణ దారిలో పోకుండా భూమి నోరు తెరిచి వీరిని మింగేసింది! ఇది మనకు సంఖ్యాకాండంలో కనిపిస్తుంది.....

 

Numbers(సంఖ్యాకాండము) 16: 1,2,3,4,9,10,11,15,20,24,25,27,29,30,31,32,33

1. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

2. ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి

3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదు; సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,

4. మోషే మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

9. తన మందిరసేవ చేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?

10. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.

11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

15. అందుకు మోషే మిక్కిలి కోపించినీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.

20. అప్పుడు యెహోవామీరు సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.

24. కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.

25. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.

27. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.

29. మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్నుపంప లేదు.

30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.

31. అతడు మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.

32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.

33. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.

 

వీడికి అధికార కాంక్ష అనే దురాశ మొదటిగా కలిగింది! రెండు ఓర్వలేనితనం పనిచేసింది! జీవపుడంభం కలిగింది. లేవీయులుగా వారు చేయబోయే కార్యాలు అత్యల్పంగా భావించి, యాజకత్వము తమకే కావాలనుకున్నారు! దేవునిచేతనే ప్రధానయాజకునిగా అంగీకరించబడ్డ ఆహారోను గారి ప్రధాన యాజకత్వము కూడా కావాలనుకున్ని భయంకరమైన చావు చచ్చారు!

 

ప్రియ సంఘమా! జాగ్రత్త! ఇలాంటి బుద్ధి ఉంటే వెంటనే విడిచి పెట్టు! చెప్పడానికి బాధగా ఉన్నా కొంతమంది విశ్వాసులు దేవునిచేత పిలువబడ్డ దైవసేవకులను చూసి కుళ్ళిపోతూ అనుకుంటున్నారు, నేను పాటలు పాడితేనే ఆరాధన జరుగుతుంది. నా పాటల కోసమే సంఘం అంతా వస్తున్నారు, ఆయనకు వాక్యం బాగా చెప్పడం రాదు, నేను లేకపోతే సంఘమే లేదు అనేవారు కూడా ఉన్నారు! నా వల్లనే అక్కడ ఆరాధన జరుగుతుంది నేను మానేస్తే పాష్టర్ కద ఇంతే! అనుకుంటూ ఉన్నారు చాలామంది నేటి రోజులలో! యేసయ్య ఒకరోజు అంటున్నారు: వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తారు అని, అలాగే నీవు గుడి మానేస్తే దేవుడు కుక్కనైనా వాడుకుంటాడు, బిలాముకి బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్న దేవుడు ఎవరినైనా వాడుకుంటారు, నీవు కాకపోతే నీ బాబుని వాడుకుంటారు దేవుడు, గాని రెండు పాటలు రెండు ప్రసంగాలు చేయడం వస్తేసంగీత వాయిద్యాలు వాయించడం వస్తే నా అంత మొనగాడు లేడు అనుకుని ఫీల్ అవ్వకు! దేవుని పని ఆగదు! మరొకరిని ఉపయోగించుకుంటారు దేవుడు! అలాగే కొందరు దురాశతో రెండు పాటలు ప్రసంగాలు నేర్చుకుంటే నీ సంఘానికి నీ కాపరికి వ్యతిరేఖంగా మరో సంఘం పెట్టేసుకుంటున్నావు! జాగ్రత్త- దురాశే లూషీఫర్ ని, కోరహు దాతాను అబీరాములను కుక్కచావు చచ్చేలా చేశాయి! నీవు కూడా ఇలాంటి దురాశను అధికార కాంక్షను వదిలిపెట్టు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*23 భాగము*

*శ్రమలలో ఆనందం-8*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! తమ స్వకీయ దురాశల వలన శోధనలు శ్రమలు కొని తెచ్చుకున్న కొందరి గూర్చి  ధ్యానం చేసుకున్నాము! ఇక శోదనలు సంభవించడానికి మరో కారణం : దేవుడు నిన్ను హెచ్చించడానికి, మరియు మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకోడానికి, లేదా నిన్ను ఆధ్యాత్మికంగా మరో మెట్టు ఎక్కించడానికి దేవుని సాధనం!

 

  ఇలా హెచ్చించిన వారిలో మొట్టమొదట మనం యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి! నిజం చెప్పాలి అంటే యోబు గారి విషయంలో యోబు గారు చేసిన దోషము పాపము ఏమీలేదు! కేవలం దేవుడు మరియు సాతాను గాడు బెట్ కట్టుకుని యోబు గారికి శోధనలు/ పరీక్షలు తీసుకుని వచ్చారు! ఒక్కరోజులో తనకున్న ఆస్తి మొత్తం పోయింది. తనకున్న ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు! తర్వాత మరో సమావేశం- తద్వారా యోబుగారికి ఒళ్ళంతా కురుపులు వచ్చాయి! ఆయన ఆరోగ్యం పాడైపోయింది! భార్య దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది! యోబు 1,2 అధ్యాయాలుస్నేహితులు నీవు పాపివి దుర్మార్గుడివి కాబట్టే దేవుడు నీకు శిక్ష విధించాడు అన్నారు! గాని ఆయన దేవుని మీదనే ఆనుకున్నారు! యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనెను! యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నారు!

 యోబు 1: 21

నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

 ఇంకా ముందుకు పోతే నేను శోదించబడిన మీదట సువర్ణముగా మారుదును అనే గొప్ప విశ్వాసముతో కూడిన  స్టేట్మెంట్ ఇచ్చారు! యోబు 23: 10

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

మరో తిరుగులేని స్టేట్మెంట్ ఏమిటంటే ఒకరోజు నేను దేవుణ్ణి చూస్తాను అనే మాట! యోబు 19: 25

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.

 యోబు 19: 26

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

 

ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా దేవుణ్ణి విడువలేదు! తన నీతిని తాకట్టుపెట్టలేదు! భార్యను తిట్టలేదు! మూర్ఖురాలు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు అన్నారు! చివరికి ఆయన విశ్వాసం ఆయనను దేవునిని చూసేలా మాట్లాడేలా చేసింది! మొదట కలిగిన ఆస్తికి రెట్టింపు ఆస్తి కలిగింది! తనకు పూర్వమున్న ఆరోగ్యం కంటే మెరుగైన ఆరోగ్యం కలిగింది! మరలా పిల్లలు పుట్టారు! (అదే భార్యతోనే నండి)! కాబట్టి పరీక్ష యోబుగారికి ఆస్తి ఐశ్వర్యం తీసుకుని రావడమే కాకుండాదేవుణ్ణి చూసే అనుభవం, మరింత దృఢమైన విశ్వాసపు స్థితి యోబు గారికి తీసుకుని వచ్చింది!

 

Job(యోబు గ్రంథము) 42:10,12,13

10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱెలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

13. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

 

   ప్రియ దైవజనమా! నీకు కలిగే శ్రమలు శోధనలు పరీక్షలు కూడా నీకు కొన్ని రోజులు బాధలు ఇబ్బందులు కలిగించినా తర్వాత మరింత మెరుగైన ఆత్మీయ స్థితిని, ఇంకా దృఢమైన విశ్వాసాన్ని  ఇంకా మెరుగైన ప్రార్ధనా అనుభవం గల స్థితిని, ఇంకా బలమైన అత్మానుభవాన్ని నీకు తీసుకుని వస్తాయి! ఇక అనుభవంతో నీకు ఇంతకంటే కటిన మైన స్థితి గల శోధనలు పరీక్షలు ఎదురయ్యేలా చేస్తారు! అప్పుడు నీవు నిలబడితే దానికన్నా మెరుగైన అనుభవం కలిగేలా చేస్తారు దేవుడు! ఇలా నిన్ను శ్రమలు శోధనలు అనే కొలిమిలో వేసి నిన్ను శుద్ధి చేసి నీకు పుటమి వేసి నిన్ను పూర్ణత నుండి సంపూర్ణతకు, సంపూర్ణత నుండి పరిపూర్ణతకు తీసుకుని పోయి- చివరకు నిన్ను క్రీస్తురూపము లోనికి మార్చుతారు! అప్పుడే నీవు జయించిన వాడవు! జయజీవితపు అనుభవం గలవాడవు!

 

హెబ్రీ పత్రికలో భక్తుడు చెబుతున్నారు: నిన్ను ..... ఇలా శ్రమల ద్వారా నిన్ను సంపూర్ణునిగా మార్చడం దేవునికి అలవాటు అన్నారు.....

Hebrews(హెబ్రీయులకు) 2:10,11,18

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

18.తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.

 

ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే విద్యార్దులకు సంవత్సరం అంతా పాటాలు చెప్పి- సంవత్సరాంతమున వారికి పరీక్షలు పెడతారు! ఎందుకంటే నీవు ఎంతగా నేర్చుకున్నావు, పాటాలను నీవు ఎంతగా అర్ధం చేసుకున్నావో నిన్ను పరీక్షిస్తారు పరీక్షల ద్వారా! వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే అంతకంటే పెద్ద తరగతికి లేక డిగ్రీకి వెళ్ళడానికి అర్హత కలుగుతుంది! అదే విధంగా దేవుడు కూడా నిన్ను పరీక్షించి  దానిలో నీవు విజయం సాదిస్తే అంతకన్నా పెద్ద ఆధ్యాత్మిక స్థితి కలిగించి మరిన్ని వరాలు ఫలాలు ఇస్తారు దేవుడు నీకు!

 

ఇక తర్వాత అంటున్నారు: దేవుడు నీవు ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకే నిన్ను శోధించడానికి ఒప్పుకుంటారు గాని నీవు తట్టుకోలేనంతగా శోధనలను పరీక్షలను దేవుడు నీకు అనుమతించరు అని చెబుతున్నారు! ఇంకా శోధనలను జయించే మార్గము కూడా నీకు చూపిస్తారు! 1కోరింథీయులకు 10: 13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 కనుక శ్రమలు రాకుండా సహాయం చెయ్యు అనడం కంటే శ్రమలను తట్టుకునే బలం దయచేయు, వాటిని జయించే మార్గం దయచేయు అని ప్రార్ధించాలి! సామెతల గ్రంధకర్త అంటున్నారు: శ్రమ దినమందు నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడవౌతావు అంటున్నారు!

సామెతలు 24: 10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.

 కాబట్టి శ్రమలలో శోధనలలో కృంగిపోకు! దైర్యంగా పోరాడి విజయం సాధించు!

 

ముగించే ముందు ఒక్కమాట చెప్పనీయండి:  *ఒక విద్యార్ధి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? పదిహేను సంవత్సరాలు గాని మరీ ఎక్కువైతే పద్దెనిమిది సంవత్సరాలు మాత్రం చదువుతాడు! ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఎంత కాలం సుఖపడతాడు? దానికి నాలుగైదు రెట్లు సంవత్సరాలు సుఖంతో జీవిస్తాడు! బహుశా 22 నుండి 30 సంవత్సరాల మధ్య ఉద్యోగం సాధిస్తే తాను చనిపోయే వరకు తానూ, తన పిల్లలు కూడా సంతోషంగా బ్రతకటానికి గల సంపాదన కలిగి సంతోషంగా జీవించగలడు! దీనికి అతడు కష్టపడింది కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే! అలాగే ఒక విశ్వాసి తన జీవితంలో శ్రమలు శోధనలు పరీక్షలు అనుభవిస్తూ చప్పిడి పథ్యం చేసేది ఎన్ని సంవత్సరాలుమహా అయితే ఒక నలబై నుండి అరవై సంవత్సరాలు మాత్రమే! అయితే విశ్వాసం, శ్రమలు చప్పిడి పథ్యం వలన నీవు ఒకసారి విజయం సాధిస్తే, పరదైసులో కొంతకాలం, వెయ్యేండ్ల పాలనలో వెయ్యి సంవత్సరాలు, మధ్యాకాశంలో ఏడేండ్లు, చివరకి నిత్యత్వంలో నిరంతరం సుఖసంతోశాలతో జీవించగలవు! కాబట్టి కొంతకాలము ఓర్చుకోండి! ఇప్పుడు ఓర్చుకుంటే అప్పుడు సంతోశిస్తావు! ఇప్పుడు ఓర్చుకోలేక పోతే అప్పుడు నిరంతరం అగ్ని గంధకాలతో మండే గుండములో అలమటిస్తూ ఉంటావు!*

 

మరి నీకు ఏది కావాలి?

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*24 భాగము*

*శ్రమలలో ఆనందం-9*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

ఇక సంఘకాపరులకు సేవకులకు సువార్త పరిచర్యలో ముందుకు సాగకుండా సాతాను గాడు ఆటంకాలు కలుగజేస్తాడు!

 

ఇక విశ్వాసులకు వారి విశ్వాస బ్రష్టులు చెయ్యడానికి భయభ్రాంతులను చెయ్యడానికి సాతాను గాడి సాధనము శ్రమలు శోధనలు!

 

మొదటగా దేవుని సేవకులకు సాతాను గాడు కలుగజేయు శోధనలు చూసుకుందాం!

 

ఆదినుండి దేవుని సేవకులను అధైర్యపరచడానికి సాతాను గాడు శ్రమలను శోధనలను సాధనంగా చేసుకున్నాడు! పాత నిబంధన భక్తులు గాని, క్రొత్త నిబంధన భక్తులు గాని, ప్రస్తుతమున్న భక్తులను గాని ఇటువంటి శోధనలు శ్రమలు చూడకుండా వారు విశ్వాసజీవితంలో జయజీవితం జీవించలేదు! ప్రతీ భక్తునికి ఇది మామూలే! పౌలుగారు తన చివరి పత్రికను తిమోతి గారికి రాస్తూ అంటున్నారు: క్రీస్తుయేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువానికి హింసలు శ్రమలు కలుగుతాయి!

2తిమోతికి 3: 12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 

 నిజమైన విశ్వాస జీవితం అనగా సద్భక్తితో బ్రతకాలి అనుకుంటేనే శ్రమలు! నలుగురితో నతానియేలు కులంతో కొర్నేలు అన్నవాడికి శోధనలు రానేరావు! నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక పాట పాడేవారు! క్రీస్తుయేసు మంచి సైనికా శ్రమలయందు సోలిపోవకా అంటూ.. నిజమైన క్రైస్తవునికి శ్రమలుండుట ఖాయము- న్యాయము, ప్రార్ధనలో ఎదురించుట క్రైస్తవుని ధ్యేయము...  కాబట్టి నిజమైన విశ్వాసం కలిగి జీవించాలి అనుకుంటే తప్పకుండా శ్రమలు శోధనలు కలుగుతాయి! అయితే శ్రమలు శోధనలు కలిగించేవాడు సందర్భాలలో సాతాను గాడే! ఇవి అనేక రకాలుగా ఉంటాయి! వీటికోసం విస్తారంగా విశ్వాసి-ఆత్మీక పోరాటాలు అనే శీర్షికలో ఎంతో వివరంగా రాయడం జరిగింది. మరలా చదవాలి అనుకుంటే లింకుని నొక్కి డౌన్లోడ్ చేసుకోండి

https://drive.google.com/file/d/1u_O7VK2wsopXJkDbwGBKtuWpyax9Bekf/view?usp=drivesdk

 లేక మా వెబ్సైట్ లో చదవండి. https://adhyatmikasandeshalu.blogspot.com/

 

   మా నాన్న గారిమీద ఎలాంటి కేసు పెట్టాలో తెలియక మా ప్రాంత ప్రజలకు మందు రాసి మతంలో కలిపేస్తున్నాడు అని 13 గ్రామాల ప్రజలు నాన్న గారిమీద కేసు పెట్టారు! అది సుమారుగా 12 సంవత్సరాలు కోర్టుల వెనుక తిరగాల్సి వచ్చింది నాన్నగారు! ఇలాంటివి సువార్త పరిచర్యలో మా చిన్నతనంలో సేవకులకు ఎంతో కామన్ గా ఉండేవి!

 

యేసుక్రీస్తు ప్రభులవారికే శోధనలు తప్పలేదు! ఆయన సువార్త పరిచర్య ప్రారంభించేముందు 40 ఉపవాసం చేస్తే- ఉపవాస దీక్ష ముగిసిన వెంటనే సాతాను గాడు శోధించాడు! మత్తయి 4 అధ్యాయం. ఆయన వాడిని జయించారు! ఇలా భక్తులందరికీ ఎన్నెన్నో శ్రమలు కలిగాయి గాని వారు శోధనలకు జడిసి సేవా పరిచర్య మానలేదు! యేసయ్య ఇవి ముందుగానే జరుగుతాయి అని హెచ్చరించారు! యోహాను 16: 33

నాయందు మీకు సమాధానము కలుగునట్లు మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

 

ఇంకా మీరు ఇలాంటి శ్రమలు శోధనలు కలిగినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును అంటూ కొండమీద ప్రసంగలో ముందుగానే చెప్పారు! మత్తయి 5: 11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5: 12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

 

 శిష్యులులందరికీ శ్రమలు శోధనలు ఎదురయ్యాయి! అయినా వారు పరిచర్య మానలేదు! ఆదిలోనే శిష్యుడైన పెద్ద యాకోబు గారిని చంపి సువార్తను  పరిచర్యను ఆపాలని చూశాడు! అపోస్తలుల కార్యంలో వ్రాయబడింది, ఇవి పొందడానికి వారు పాత్రులు అని ఎంచబడినందున వారు సంతోషించుచు  వెళ్లారు అట! 5:41

 

ప్రభువు యొక్క శిష్యులలో ఇలా సభల ముందట, నాయకుల ముందట కోర్టుల యెదుట హాజరవని శిష్యుడు ఎవరూ లేరు! ఇలాంటి శ్రమలు అనుభవించే వారు పరిచర్యను మన వరకు తీసుకుని వచ్చారు! శిష్యులు కూడా పరిచర్య చేసేటప్పుడు మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకం వెళ్ళాలి అంటూ ప్రజలకి ముందుగానే చెప్పారు!

 

అపో.కార్యములు 14: 22

శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

 

 పౌలుగారు తెగించి మనము శ్రమలు శోధనలు పొందడానికే పిలువబడ్డాము అన్నారు ....

1థెస్సలొనికయులకు 3: 4

అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

కాబట్టి సేవకుడైనా, విశ్వాసి అయినా సువార్త పనిలో ముందుకు సాగుతూ ఉంటే వారిని నిరాశ పరచడానికి అధైర్య పరచడానికి సాతాను గాడు శ్రమలను శోధనలను పంపిస్తాడు! అవి ఇరుగుపొరుగు వారితో కావచ్చు! ఊరిపెద్దలతో కావచ్చు! ప్రభుత్వము నుండి కావచ్చువీరిని కూడా జయిస్తే వాడు విశ్వాసులలో లేక సంఘ పెద్దలలో పడి శోధిస్తాడు శోధన చాలా గొప్పది! వేదనతో కూడినది! ఎవరో దేవుణ్ణి తెలియక చేశారంటే ఏమో గాని తోటివిశ్వాసులు, కాపరులు, సంఘపెద్దలు శోధనలు కలిగిస్తున్నారు అంటే ఓర్చుకోవడం కొంచెం కష్టం! గుండె బ్రద్దలవుతూ ఉంటుంది! అందుకే ఒకసారి దావీదు గారు అంటున్నారు- పని చేస్తున్న నీవు పై వాడివి కాదు! నీవు నేను కలిసి భోజనం చేసినవారమే, కలిసి దేవుని మందిరానికి వెళ్ళిన వారమే అంటున్నారు! అంతటి గొప్ప భక్తుడు, ప్రవక్త, పాటగాడు, వాయిద్యకారుడు, రాజు, చక్రవర్తికే ఇలాంటి శోధనలు తప్పలేదు!... కాబట్టి మనకు కూడా ఇలాంటివి వస్తాయి కాబట్టి వాటిని కూడా జయించాలి!

 

ఇక దీనిని కూడా జయించావా- అప్పుడు సాతాను గాడి అంభులుపొది తీసి భార్యమీద పడి భార్యద్వారా శోధిస్తాడు! ఎంతోమంచి భార్య ఇప్పుడు గయ్యాలిగా మారిపోతుంది! ఎంతగానో సాధిస్తుంది! లేదా అలుగుతుంది, పుట్టింటికి కూడా వెళ్ళిపోతుంది! ఇది సాతాను గాడు భార్యమీద పడి శోదిస్తున్నాడు అని గ్రహించి సేవకులారా మనమే తగ్గిపోవాలి! నెమ్మదిగా వారితో మాట్లాడి సాతాను శోధన అని వారికి తెలియజెప్పాలి! ఇది ప్రతీ సేవకునికి ఎదురై ఉంటుంది! నాకు కూడా చాలాసార్లు ఎదురయ్యింది! నా భార్య చాలామంచిది! సువార్త పరిచర్యలో నాకు అన్నివిధాలా సహకరిస్తూ ఉంటుంది. వచ్చిన దైవసేవకులు ఎంతమంది వచ్చినా వండి పెడుతూ ఉంటుంది! గాని నేను గమనించాను- ఎప్పుడైతే మీటింగ్స్ సభలు పెడతానో దానికి ముందుగా ఆమెలో పడి నన్ను శోదిస్తూ ఉంటాడు సాతాను గాడు! ఒక్కోసారి అలిగి కూర్చుంటుందిఅప్పుడు నేనే తగ్గిపోతాను! కోపం పోయాక వివరంగా చెబుతాను! వెంటనే ప్రార్ధించి సహకరిస్తూ ఉంటుంది!

 

మరో చిన్న సాక్ష్యం చెప్పనీయండి! నేను గతంలో షిప్ ఎక్కినప్పుడు రెండు నెలల కోసం ఎక్కితే ఎనిమిది నెలలు వరకు దిగడం అవ్వలేదుషిప్ లో ఉండగా సంఘం కోసం ప్రార్ధిస్తూ ఉండగా నీ సంఘం ఎలా ఉందొ చూడు అంటూ దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు! దర్శనంలో మా సంఘం కునికే కోడిలా ఉంది అన్నమాట! ప్రభువా నేను ఏమి చెయ్యగలను? ఉపవాస కూటాలు పెడితే ఒకసారి ఉజ్జీవం వచ్చి, సోడా కాయలో గేస్ పోయిన వెంటనే ఎలా చప్పబడిపోతాదో అలా తుస్సుమంటున్నారు, నేను ఏమి చెయ్యాలి అని ప్రార్ధిస్తే దేవుడు 15 రోజులు ఉపవాస కూటాలు పెట్టమన్నారు! ఆరోజునుండి షిప్ దిగటానికి ప్రయత్నిస్తే సాతాను గాడు నేను షిప్ దిగటానికి చేసే ప్రయత్నాలు అన్నీ వమ్ము చేశాడు! ఎనిమిది నెలలు అయిపోతే నేనే కావాలని నా షిప్ ని ఆపేసి, షిప్ ని అరెస్ట్ చేయించి దిగాల్సి వచ్చింది (నా ర్యాంకుకి అధికారం ఉంది). ఇంకా ఇంటికి రాకముందే దైవసేవకులతో మాట్లాడి, పోస్టర్స్ బ్యానర్స్ వేయించి అప్పుడు ఇంటికి వచ్చాను! గాని ఎవరికీ మీటింగ్స్ అని ముందుగా చెప్పలేదు! సాతాను గాడు నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు విపరీతమైన జ్వరం కలిగించాడు! తర్వాత రోజు నా భార్యకు టైఫాయిడ్ మరియు డెంగ్యూ రెండూ ఒకేసారి కలుగజేశాడు! నా ఇద్దరు కుమారులకు విపరీతమైన జ్వరం కలుగజేశాడు! నేను నా భార్యకు చెప్పాను- ఇది సాతాను గాడి పని అంటూ నాకు వచ్చిన దర్శనం అంతా వివరించాను! మనకు పదిహేను రోజులు కూటాలున్నాయి అని చెప్పానువెంటనే నా భార్య నేను కలిసి ప్రార్ధన చేశాము జ్వరాలతోనే కూటాలు ప్రారంభమయ్యాయి! కూటం మధ్యలోనే నా భార్య సంపూర్ణ స్వస్తత పొంది అన్ని రోజులు ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా అందరికీ పరిచర్య చేసింది! కూటాలు జరుగుతుండగానే మా అన్నయ్యలిద్దరికీ వారి భార్యలకు పిల్లలకు టైఫాయిడ్ డెంగ్యూ కలుగుజేసింది సాతాను! వారికి కూడా చెప్పానునాకు తెలుసు- కూటాలు ఆపడానికి సాతాను గాడు ఇంతగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే దేవుడు మా సంఘంలో గొప్ప కార్యాలు చేస్తారు అని! దానిని వివరంగా వివరించాను! నా భార్య సహకరించింది!

 

కాబట్టి సేవకులారా! నీ సేవకు ఆటంకంగా నీ భార్య మారితే నీవు సహనం పాటించు! బయట చిరాకులు నీ భార్యమీద చూపించకు! వారు బలహీన మైన ఘటాలు అని శిష్యులు ముందుగానే చెప్పారు! వారికోపం కొంచెం తగ్గాక వివరంగా వాక్య సహకారంతో వివరించి చెబితే తప్పకుండా సేవకు సహకరిస్తారు! ఒకమాట చెప్పనా మిగిలిన ఆడవారికంటే సేవకుల భార్యలు ఇంకా అధికంగా కష్టపడుతున్నారు! వీరు ఒక గృహిణి లేక భార్య నిర్వర్తించవలసిన భాధ్యతలే కాకుండా ఇంకా ఒక సేవకురాలుగా, సంఘానికి ఒక తల్లిగా ఉంటూ నిర్వర్తించాల్సిన భాద్యతలు, ఇంకా వచ్చిన దైవసేవకులను విశ్వాసులను పరామర్శించవలసిన భాద్యతలు అన్నీ ఎంతో ఓపికగా అలుపులేకుండా పనిచేస్తారు! ఇంకా ఎన్నోసార్లు వచ్చిన దైవసేవకుల కోసం తానూ తినవలసిన భోజనం కూడా సేవకులకు పెట్టేసి- ఇక వండుకోవడానికి ఓపికలేక మంచినీరు త్రాగి పడుకున్న రాత్రులు ఎన్నో ఉంటాయి- ఇది నేను చూశాను! కాబట్టి వారు ముందుగానే బలహీన మైన ఘటాలు కాబట్టి వారి కోపం రేపవద్దు! వారితో సహకరించండి! వారికోసం ప్రత్యేకంగా ప్రార్ధన చేసి ప్రేమించండి! శోధనలు వచ్చినప్పుడు ఓర్చుకుని వివరిస్తే తప్పకుండా వారు సువార్తకు సహకరిస్తారు! భార్య సహకారం లేకపోతే ఒక దైవసేవకుడు తన పరిచర్యను ఏమాత్రము బాగా చెయ్యలేడు! ఆమె సహకరిస్తే తను బయటకు వెళ్లి ఒక సైనికునిలా సాతానుతో పోరాడి విజయోత్సవంతో తిరిగి వస్తాడు దైవజనుడు!

 

కాబట్టి ప్రియ దైవజనుడా! ఎలాంటి శోధన వచ్చినా నీతో దేవుడు ఉన్నారు అని మర్చిపోకు! గ్రామస్తులనుండి సేవకు ఆటంకాలు కలిగినా, ప్రభుత్వ అధికారుల నుండి కలిగినా, ఆర్ధిక ఇబ్బందులు కలిగినా , కొన్నిసార్లు నీ ఆరోగ్యం మీద కొడతాడు, ఎన్ని కలిగినా ప్రార్ధన ద్వారా విశ్వాసం ద్వారా నీకు చూపించే ప్రేమ ద్వారా ఓర్పు ద్వారా వీటిని జయించగలవు! ఒకవేళ సంఘ పెద్దలనుండి విశ్వాసుల నుండి కలిగినా ఓర్చుకో! నోరు జారకు! ఇక నీ భార్యద్వారా కలిగినా ఓర్చుకో! వివరించి చెప్పు! నీ పరిచర్యలో సాగిపో!

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*25 భాగము*

*శ్రమలలో ఆనందం-10*

 

1 పేతురు 1:6--7

6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

7. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

ఈరోజు విశ్వాసులకు రకమైన శోధనలు శ్రమలు పరీక్షలు కలుగుతాయో చూసుకుందాం!

 

    సాధారణంగా సేవకులకు కలిగేటటువంటివే కలుగుతాయి అయితే సేవకులకు -విశ్వాసులకు కలిగే శ్రమలు శోధనలతో పాటుగా బోనస్ గా సేవలో ఆటంకాలు కలుగుతాయి. విశ్వాసులకు బోనస్ ఉండదు! అయితే మరో రకమైన శ్రమలు శోధనలు కలిగి వారిని విశ్వాస బ్రష్టులు చెయ్యడానికి సాతాను గాడు ప్రయత్నం చేస్తాడు!

 

  మొదటగా సాతానుడు లోకాన్ని చూపించి లోకాశలు చూపించి తిరిగి పాపములోనికి లోకము లోనికి లాగాలని ప్రయత్నిస్తాడు! వీటిని జయించాలి! దీనికోసం వాడు ఉపయోగించే ఆయుధాలు: మొదటివి: శరీరాస, నేత్రాశ, జీవపు డంభము! హవ్వమ్మ గారికి సాతాను గాడు అవునా ఇది నిజమా అని చెప్పి, మీరు చావనే చావరు మీరు వాటిని తింటే మీ కన్నులు తెరువబడి మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవతలై పోతారు అనబోసరికి (జీవపు డంభము), తినవద్దన్న ఫలాలు చూపునకి అందమైనవి, (నేత్రాశ), ఆహారానికి మంచివి (శరీరాస) అని చెబితే వెంటనే తను తిని తన పెనిమిటికి ఇచ్చేశారు ఆవిడ! రకంగా వారిని బ్రష్టులను చేసేసింది! (ఆదికాండం 3 అధ్యాయం).

 

ఇక రెండవ ఆయుధము: గలతీ పత్రిక 5 అధ్యాయంలో వివరించిన శరీర కార్యాలు మనలో పనిచేసి మనలను బ్రష్టులను చేసేస్తాయి! వ్యభిచార క్రియలు, కోపం ద్వేషం, లాంటివి అన్ని పనిచేస్తాయి! నీవు భక్తిపరుడవే! గాని లోకం నిన్ను ఆకర్షించేలా చేస్తాడు వాడు! దారిన పోతున్నప్పుడు నీ కళ్ళు ఆటోమేటిక్ గా గోడమీద అంటించిన సినిమా వాల్ పోష్టర్ కనిపిస్తుంది. దానిలో స్త్రీలు సగం సగం గుడ్డలు వేసుకుని కనిపిస్తారు, వెంటనే నీలో ఏదో అలజడి మొదలవుతుంది. స్త్రీని ఇంకా చూడాలని సినిమా చూడాలని కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తప్పించుకోవాలి? మొదట నీ కన్నులు సూటిగా  తిన్నగా చూడాలని బైబిల్ చెబుతుంది.

సామెతలు 4: 25

నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

సామెతలు 4: 27

నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

 ఇంకా , ఇటూ అటూ చూసేది కేవలం సాతాను గాదే అని గ్రహించాలి యోబు మొదటి రెండు అధ్యాయాల ప్రకారం! ఇంకా కీర్తనలు 119:11 ప్రకారం నీ ఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అని వ్రాయబడినట్లు వాక్యము మనలను ఏలనియ్యాలి అప్పుడు ప్రతీ విషయంలో వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటే పరిశుద్ధాత్ముడు వెంటనే నిన్ను సరిచేసి వాటిని చూడకుండా, చూసినా పాపం నిన్ను ఆకర్షించకుండా నిన్ను చేయగలడు!

 

ఇంకా దుష్ట సాంగత్యము వలన వారు మాట్లాడుకునే మాటలలో కలిపి నవ్వడం వలన వారు చేసే దానిలో నిన్నుకూడా పాలిభాగస్తులను చేస్తాడు!

1కోరింథీయులకు 15: 33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

 

చాలామంది స్త్రీలకు నీటి కొళాయి దగ్గర ఎంత నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలన్నా ఇతరుల వలన నోరు పారేసుకుంటారు! ఇది కూడా సాతాను గాడి కుట్రయే! దావీదు గారు అంటారు నేను కోరేది సమాధానమే గాని మాట నా నోటినుండి బయటకు రాకముందే వారు నాతో యుద్ధానికి సిద్ధమైపోతున్నారు అంటున్నారు!

చాలాసార్లు మనం అందరితో సమాధానంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే వారే నీమీదకు తగవుకు యుద్ధానికి వస్తారు!

కీర్తనలు 120: 7

నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

 

వెంటనే నీవు నన్ను అంతమాట అంటావా అని కచ్చా భిగించి తగువులాడితే నీ భక్తీ నీ విశ్వాసం అన్ని బూడిద పాలైపోతుందినీవు ఏమీ అనకపోతే వారికి తిట్టే అవకాశం లేకపోతే కుక్కమీద, కాకిమీద చేటమీద పెట్టి తిడుతుంటారు! అది నిన్నే తిడుతున్నారు అని నీకు తెలిసినా నీవు ఏమీ అనలేవు! నన్నెందుకు తిడుతున్నావు అని ఒకవేళ అడిగితే అక్కడ రణరంగమే అవుతుంది! ఇలాంటప్పుడు మరి ఏమిచెయ్యాలి? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖము లేదు అన్నట్లు మిన్నకుండి పోవాలి! దీర్ఘశాంతము చూపించాలి! లేకపోతే దేవునికి స్తోత్రము! దేవుడు నిన్ను దీవించును గాక అని వారిని దీవించి చూడండి! వారికి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది! లేకపొతే యేసురక్తం యేసురక్తం దేవా నీకు వందనాలు అని చెప్పండి! కొన్నిరోజులకు వారే సిగ్గుపడి పోతారు! లేకపోతే ఇంటివారితోనే వారికి బుద్ధి చెప్పిస్తారు దేవుడు! ఒక పదిహేను సంవత్సరాల క్రితం బహుశా తూర్పు గోదావరి జిల్లాలో అనుకుంటాను- ఒక విశ్వాసిని ప్రక్కింటి ఒకామె అలానే తిడుతుంటూ ఉండేదట! వెంటనే ఈమె కూడా తిట్టేసేదట! ఒకరోజు పాష్టర్ గారు చూసి ఇది తప్పు అని చెబితే నేను ఏమి చెయ్యాలి అంటే ఆయన యేసురక్తం యేసురక్తం అనమని చెప్పారట! ఇలా కొన్నిరోజులు జరిగాక నన్ను రక్తానికి అప్పగించేస్తావా అంటూ బయటకు వచ్చి రక్తం రక్తం అంటూ రక్తం కక్కుకుని చనిపోయింది అక్కడే! తర్వాత జరిగింది మనకు అప్రస్తుతము గాని రకంగా ఆమెకు దేవుడు బుద్ధిచెప్పారు! నీవు వారిని తిట్టకుండా దీవిస్తూ ఉంటే ఒకరోజు వారు పశ్చాత్తాపం కలిగి తప్పకుండా మారతారు అని నా ఉద్దేశం!

 

ఇంకా అనేకమంది విశ్వాసులకు లంచం లాంటి విషయాలు ద్వారా శోధిస్తాడు వాడు!

 

*ఇంకా దురభిమాన పాపం మనలను ఏలేలా చేస్తాడుమొగమాటానికి కొన్ని ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వస్తుంది! నీకు ఇష్టం లేకపోయినా నీ బాస్ నిన్ను బార్ కి తీసుకుని పోతాడు, సినిమాకు తీసుకుని పోతారు నీ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్! నీవు ఏమీ అనలేవు! గాని నిజంగా వారి వెనుక వెళ్తే నీవు నరకానికి పోతావు! ఇదే దురభిమాన పాపం! నీవు చర్చికి బయలుదేరి వస్తున్నప్పుడే నీ చుట్టాలు ఇంటికి వస్తారు! వారిని వదిలి రాలేవు నీవు! దురభిమాన పాపం! గాని ఇలాంటప్పుడే నీవు దీనిని జయించాలి! ఎలా కుదురుతుంది అని అడగవచ్చు! అందరికీ ఫోన్లు చేసి చెప్పండి! మీరు ఎప్పుడైనా రండి పర్వాలేదు Always Welcome అని చెప్పండి! అయితే ఆదివారం మాత్రం రావద్దు అని ఖచ్చితంగా చెప్పండి! ఎవడు ఏమనుకుంటే నీకనవసరం! నీవు దేవునికి లెక్కచెప్పవలసిన అవసరం లేదు! గాని నీవు అలా చెప్పలేకపోతే దురభిమాన పాపంలో పడిపోయి నరకానికి పోతావు! ఒకవేళ నీవు చెప్పినా నీ చుట్టాలు కావాలని వచ్చారో అనుకో- సింపుల్ గా ఇదిగో అక్కడ ఉప్పుంది ఇక్కడ పప్పుంది, వండుకొని తినండి, నేను ఆరాధన అయ్యాక వస్తాను అని వారికి అప్పజెప్పి మందిరానికి పొండి! తర్వాత ఎప్పుడూ వారు రారు! ఇక మరికొంతమంది అదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు! ఏమంటే ఆదివారం నాడే అందరికి సెలవుంటుంది అంటున్నారు! అన్యులు అన్నా పర్వాలేదు గాని ప్రభువును అంగీకరించిన కొంతమంది పాపాత్ములు కూడా ఆదివారం నాడే ఫంక్షన్ లు పెట్టుకుంటున్నారు! ఇలా ఫంక్షన్ లకు వెళ్ళేవారు. దేవుని బిడ్డలు ఆదివారం నాడు ఫంక్షన్ లు పెట్టేవారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి వస్తుంది! ఎవడు ఏమనుకుంటే నాకనవసరం! చెప్పవలసిన భాద్యత నాకుంది! ఇలాంటి బేచ్ నరకానికి పోతారు! ఏమి అలా అంటావు అని నన్ను అడిగితే నా జవాబు- వారు దొంగలు దోచుకొనువారు కాబట్టి నరకానికి పోతారు అంటాను! ఎలా అంటే దేవునికి ఇవ్వాల్సిన ధనము, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వాలి! ఆదివారం దేవుని మందిరంలో ఉండాల్సిన అవసరం ప్రతీ విశ్వాసికి ఉంది! దానిని ఎగ్గొట్టి నీ ఫంక్షన్ లకు, సినిమాలకు బీచ్ లకు పార్కులకు టూర్ లకు తిరిగితే దేవుడు నిన్ను లెక్క అడగరా! నీవు దేవుని సమయాన్ని దొంగలించి దొంగయు దోచుకొనువాడవు కావా????? ఇప్పుడు  చాలా సంఘాలలో ముఖ్యంగా పట్టణాలలో ఉదయం ఆరుగంటల ఆరాధనకు కాళీ ఉండటం లేదు! ఎందుకంటే ఎనిమిదిన్నర లోగా ఆరాధన అయిపోతుంది! అది అయ్యాక వారు చుట్టాలింటికి పార్టీలకు ఫంక్షన్ లకు బీచ్ లకు వెళ్ళిపోతున్నారు! ఏమంటే ఆరాధన ఎగ్గోట్టడం లేదు కదా! ఆరాధనకు వెళ్లి ఆయన సమయం ఆయనకు ఇచ్చేశాము అంటున్నారుఅయ్యా అమ్మా! నాకు తెలిసినది నేను బైబిల్ లో అర్ధం చేసుకున్నది నేను చెబుతున్నాను: ఇదికూడా చెయ్యకూడదు! కారణం యెషయా గ్రంధంలో చెబుతున్నారు: విశ్రాంతి దినము అనగా మనము నేడు ఆచరిస్తున్న పునరుత్థాన దినాన్ని పవిత్రంగా ఆచరించాలి! ఆరోజు లోకవార్తలు చెప్పుకోకూడదు! లోకానికి చెందిన పని చెయ్యకూడదు! వ్యాపారం చెయ్యకూడదు! పని చెయ్యకూడదు! నీకిష్టమైన పని ఏమాత్రము చెయ్యకూడదు.* యెషయా 58: 13

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యెషయా 58: 14

నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

 

 కనీసం సాయంత్రం వరకు ఇలాంటివి ఏవీ చెయ్యకూడదు అని నా ఉద్దేశం! ఇది కేవలం  బైబిల్ ని చదివి నాకు అర్ధమయిన విషయం ప్రియులారా! కాబట్టి ఇలాంటివి చెయ్యవద్దు! నీకు కావలసిన చుట్టాలు బంధువులు మిత్రులు ఆదివారం ఫంక్షన్ అంటే దయచేసి ఏమీ అనుకోవద్దు- ఆరోజు మేము ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పండి! మరో రోజు వస్తాము అని చెప్పండి. దురభిమాన పాపంలో పడిపోవద్దు! ఇది సాతాను గాడి కుట్ర! ఒకవేళ సాయంత్రం వెల్లవచ్చేమో! నాకు తెలియదు! గాని పగటివేళలో వెళ్ళినవారు ఫంక్షన్ పెట్టిన వారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అని మర్చిపోవద్దు!

 

 ఇక ఇలాంటివి ఎన్నో వస్తాయి శోధనలు పరీక్షలు! ఇవి దేవునినుండి సాతాను నుండి కూడా! ఒక్కోసారి నీవు చిన్న తప్పు చేస్తే దేవుడు వెంటనే ఒక లెంపకాయ మొట్టికాయ కొడుతూ ఉంటారు! మరొకొందరు ఎంతో ఘోరమైన తప్పులు పాపాలు చేసిన దేవుడు వారిని ఏమీ అనరు! నీవు అంటావు దేవుడా నేను కేవలం చిన్న తప్పుచేస్తే వెంటనే లెంపకాయ పీకేస్తున్నావ్ వారైతే భయంకరమైన పాపాలు చేస్తున్నారు అయినా వారిని ఏమీ అనడలం లేదు అంటావు! జవాబు సింపుల్! నీవు దేవునిచేత ప్రేమించబడుతున్నావు. నీవు పరలోకం పోయే బ్యాచ్ లో ఉన్నావు కాబట్టి నీవు తప్పుచేస్తే తండ్రిలా ఒక దెబ్బ కొట్టి నిన్ను సరిచేసి తన రాజ్యం వెళ్ళే ట్రాక్ నుండి తప్పకుండా చూస్తున్నారు! అయితే నీవు ఏమీ తప్పుచెయ్యకుండా నీకు భయంకరమైన శోధనలు శ్రమలు వస్తుంటే అవి సాతాను గాడు కలిగించే శోధనలు అని గ్రహించి సంతోషించి బలంగా సాతానుని ఎదిరించి విశ్వాసంతో సాగిపో ముందుకు! శోధన పోయిన తర్వాత అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఆధ్యాత్మిక స్తితి ఇవ్వబోతున్నారు దేవుడు! పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులకు ఇలాంటివి దాదాపు అందరికి వచ్చాయి! యాకోబు గారికి రాలేదా? దావీదు గారికి మామ చంపాలని చూశాడు, కొడుకు చంపాలని చూశాడు! యిర్మియా గారిని తన సొంత ఊరివారు అనాతోతు గ్రామస్తులు చంపాలని చూశారు! ఏలియా గారిని రాజులు రాణి చంపాలని చూశారు! పౌలుగారిని చంపాలని చూశారు! చేయని నేరానికి దానియేలు గారు సింహాల బోనులో ఉండాల్సి వచ్చింది! పేతురు గారు చెరలో ఉండాల్సి వచ్చింది! కాబట్టి విశ్వాసులందరికీ శ్రమలు శోధనలు వస్తూనే ఉంటాయి! చివరికి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా వచ్చాయి!

 

     కాబట్టి శోధనలను సహిద్దాము! జయిద్డాము! విశ్వాసాన్ని వదలవద్దు! జారిపోకు సోలిపోకు! ధైర్యంగా నిలబడు! శ్రమలలో ఆనందపడదాం!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*26 భాగము*

*శ్రమలలో ఆనందం-11*

 

1 పేతురు 1:8--9

8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,

9. అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

     ప్రియులారా ఇక 8,9 వచనాలలో మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,

9. అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

అనగా శ్రమలను సహిస్తూ శ్రమలలో ఆనందిస్తూనే మీరాయనను అనగా యేసుక్రీస్తు ప్రభులవారిని చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును పొందుచున్నారు అంటున్నారు. మరి ఇది సాధ్యమా!!!!

సాధ్యమే!

ఎలా?!

మనమెప్పుడూ చూడని వ్యక్తిని ప్రేమించడం, ఆయనలో నమ్మకం పెట్టుకోవడం సాధ్యమేనా? తప్పకుండా. కారణం ఆయన వాక్కు  లేదా వాక్యము మనకు ఉంది, ఆయన సన్నిధిని అనుభవించేలా చేసే ఆయన ఆత్మ మనతో ఉన్నాడు. వీరిద్దరూ ఆయనను ప్రేమించేలా, మనతో ఆయన ఉన్నారు అనే భావనను కలుగజేస్తూ మనము ఒంటరివారము కాము జంటగా ఆయన ఉన్నారు అని అనునిత్యమూ గుర్తు చేస్తూ ఉండగా, ఆయన మనకోసం కార్చిన రక్తము, ఆయన మనకోసం చేసిన సమస్తము, మనమీద ఆయన కున్న ప్రేమ సమస్తము మనకు గుర్తుకు వచ్చేలా చేయుచుండగా మనము ఆయనను చూడకపోయినా వీరిద్దరి వలన ఆయనను ప్రాణ ప్రదంగా ప్రేమిస్తున్నాము! అలాగే విశ్వాసులు కూడా ప్రేమిస్తున్నారని పేతురు గారు సాక్ష్యం చెబుతున్నారు!

 

అయితే తోమా గారితో యేసుక్రీస్తు ప్రభులవారు అంటారు చూసి నమ్మిన వారికంటే చూడకనమ్మిన వారు ధన్యులు! ధన్యులము మనమే!

యోహాను 20:25

గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

యోహాను 20:27

తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

యోహాను 20:28

అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.

యోహాను 20:29

*యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను*.

 

కాబట్టి మన విశ్వాసం నిజమైనదే అనడానికి ఇది మరో రుజువు ఆయనను ప్రేమించడం. నిజ విశ్వాసం, క్రీస్తుపట్ల ప్రేమ ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనలో ఒకటి లేకపోతే రెండోది కూడా ఉండదు.

యోహాను 14:15

మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.

 

అయితే ప్రేమను యేసుక్రీస్తు ప్రభులవారు పేతురు గారినుండి ఎలా బయటకు తీసారో చూద్దాం

యోహాను 21:15

వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు నా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.

యోహాను 21:16

మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.

యోహాను 21:17

మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

యోహాను 21:18

యేసు నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవైయుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.

 

భాగంలో రెండు విషయాలు మనకు అర్ధమవుతాయి.

మొదటిది మూడు సార్లు యేసు ఎవరో నాకు తెలియదు అని పేతురుగారు బొంకారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు మూడు సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు!

రెండవది: ప్రేమిస్తున్నాను అని పెదాలతో చెప్పడమే కాదు ప్రేమను నిరూపించడానికి ప్రయత్నం చేయాలి. ఆదిమసంఘ భాధ్యత మొట్టమొదటి సారిగా దేవుడు పేతురు గారిమీద పెట్టి నా గొఱ్రెలను గొఱ్ఱెపిల్లలను మేపమని చెబితే తప్పకుండా చేస్తాను ప్రభువా అని మాటిస్తున్నారు! ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. చివరకు మరణం వరకు తన ప్రేమను బాధ్యతలు వదలలేదు!

 

1కోరింథీయులకు 13:4

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

1కోరింథీయులకు 13:7

అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

1కోరింథీయులకు 13:8

ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

సరే మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. 9 మీరు మీ విశ్వాస ఫలితం, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు అంటున్నారు!

ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమునుఅనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.

దివ్య సంతోషం కోసం చూసుకుంటే సంతోషం లేవీ 9:24; ద్వితీ 16:15; నెహెమ్యా 8:10; కీర్తన 4:7; 16:11; 21:6; 28:7; 43:4; 81:1; యెషయా 12:3; 35:6, 10; లూకా 2:10; యోహాను 16:20-24.

 

కీర్తనలు 4:7

వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.

కీర్తనలు 4:8

యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

 

కీర్తనలు 16:11

జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.

 

కీర్తనలు 21:6

నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి యున్నావు.

 

కీర్తనలు 28:7

యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

 

ఇలా ప్రభువునందు ఆనందిస్తూ మన నిజమైన సంతోషం ప్రభువులోనే ఆధ్యాత్మిక విషయాలను బట్టే ఆనందించాలి!

 

మీ విశ్వాసమునకు ఫలమునుఅనగా ఆత్మరక్షణను పొందుచు సంతోషిస్తున్నారు అంటున్నారు!

ఇప్పుడు పరీక్షలు, శోధనలు శ్రమలు అనుభవిస్తూనే విశ్వాసులు రక్షణను, విముక్తిని అనుభవిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత సంపూర్ణంగా అనుభవిస్తారు!!!

అందుకే ఐదవ వచనంలో చెబుతున్నారు కదా : కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

కాబట్టి నిత్యమైన విషయాలమీద మనస్సుపెట్టి అల్పకాలముండే శ్రమలను సహిస్తూ శ్రమలలో ఆనందిస్తూ ముందుకు పోదాం!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*27 భాగము*

*శ్రమలలో ఆనందం-12*

 

1 పేతురు 1:10--12

10. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు రక్షణను గూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,

11. వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.

12. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

       ప్రియులారా ఇక పదవ వచనం నుండి చూసుకుంటే 10. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు రక్షణను గూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,

11. వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.

మీకు కలిగే కృపను గురించి ముందుగానే పలికిన ప్రవక్తలు రక్షణ అనే విముక్తిని గురించి విచారిస్తూ శ్రద్ధాసక్తులతో పరిశీలించారు. 11 తమలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధలనూ వాటి తరువాత కలిగే మహిమగలవాటినీ ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి విచారించారు అంటున్నారు!

 

ఇక్కడ ముందుగా పలికిన ప్రవక్తలు అనగా అంటే పాత నిబంధన ప్రవక్తలని పేతురు గారి ఉద్దేశం. ఇప్పుడు విశ్వాసులకు కలిగిన కృపను గురించి వారు చెప్పారు. వారి రచనలలో గల ప్రవచనాలు  సాదృశ్యాలూ సూచనలూ నీడలూ ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తును, ఆయన తెచ్చిన రక్షణను సూచిస్తున్నాయి

లూకా 4:17-21;

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

Luke(లూకా సువార్త) 24:25,26,27,45,46,47,48,49

25. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

26. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27. మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

45. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48. సంగతులకు మీరే సాక్షులు

49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

 

John(యోహాను సువార్త) 5:39,46,47

39.లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు( లేక, పరిశోధించుండి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.

46.అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.

47.మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

 

హెబ్రీయులకు 8:5

మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.

హెబ్రీయులకు 8:6

ఈయన యైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియ మింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.

 

1హెబ్రీయులకు 10:1

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయ నేరవు.

 

ఒకసారి ప్రవక్త అనగా ఎవరూ అనేది చూసుకుందాం!

ప్రవక్త హీబ్రూలో ప్రవక్త అంటే అర్థం వాగ్దాటి గలవాడనీ, పండితుడనీ కాదు (అయినా బైబిల్లోని ప్రవక్తలలో కొందరు వాగ్దాటిగలవారే, పండితులే). హీబ్రూ భాషలో ప్రకటించడం, చాటించడం లేక పారవశ్యం, పరిశుద్ధాత్మ ఆవేశం మూలంగా మాట్లాడ్డం అనే అర్థానిచ్చే పదం నుంచి ప్రవక్త అనే పదం వచ్చింది. బైబిల్లో ప్రవక్త అంటే పరిశుద్ధాత్మ ప్రేరితుడై, ఒక ఆత్మవశుడై పలికేవాడు.

నిజమైన ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరణవల్ల దైవ సందేశాలు వినిపించేవాడు. సంఖ్యా 11:25  చూడండి.

అబద్ధ ప్రవక్తలు దేవుని మూలంగా కాక వేరే ఆత్మ మూలంగా లేదా, తమ సొంత ఆవేశం మూలంగా ప్రకటించేవారు. వారు ఇచ్చే సందేశాలు అబద్ధమైనవి. నిజ ప్రవక్తల గురించి ద్వితీ 18:18; 1 సమూ 3:19-21; 1 రాజులు 17:1-2, 8; యిర్మీయా 1:4-10; మీకా 1:1; 3:8 మొదలైనవి చూడండి.

అబద్ధ ప్రవక్తల గురించి ద్వితీ 18:20-22; 1 రాజులు 18:19-29; యిర్మీయా 14:14; 23:32; యెహె 13; మత్తయి 7:15-20; 24:11, 24; లూకా 6:26; 2 పేతురు 2:1; యోహాను 4:1; ప్రకటన 16:13; 19:20 చూడండి. బైబిలంతటినీ తన ప్రవక్తల మూలంగా దేవుడు ఇచ్చాడు. అందులో చాలా భాగం నెరవేరింది. మిగిలినది నెరవేరుతుంది.

 

కాబట్టి ఎక్కువ మంది పాత నిబంధన ప్రవక్తలు క్రీస్తు మొదటి రాకడ మరియు చేయబోయే విముక్తి కార్యక్రమం మరియు ఆయన మహిమ పరచబడటం కోసం ప్రవచించారు. మరికొందరు భవిష్యత్తులో జరగబోయే వాటిని ప్రవచించారు. అలాగే

క్రీస్తు ఆత్మ వారిలో ఉండి, వారికే పూర్తిగా అర్థం కాని విషయాలను వారి చేత రాయించాడు. తాము రాసిన వాటిని మరింత బాగా అర్థం చేసుకోవాలని వారే వాటినింకా క్షుణ్ణంగా చదివారు. క్రీస్తు లోకానికి రాకముందే క్రీస్తు ఆత్మ ఇక్కడ ఉన్న సంగతి గమనించండి. ఆయన క్రీస్తు బాధలనూ మహిమనూ గురించి ముందుగానేసాక్ష్యంచెప్పాడు.

ఉదాహరణకు కీర్తన 22:1-21 యేసు క్రీస్తు పడబోయే బాధలు, 22-31 వచనాలు ఆయనకు కలిగే మహిమ;

యెషయా 53:1-9 ఆయన బాధలు; 10-12 వచనాలు  ఆయన పొందబోయే మహిమ.

 బాధలు, మహిమ రెండూ యెషయా 52:13-15లో కనిపిస్తాయి. యెషయా 54 అధ్యాయంలో ఆయన మహిమను గురించి ఉంది. మరెన్నో ఉదాహరణలున్నాయి.

 

అలాగే యెషయా గ్రంథంలో అనేకచోట్ల యెరూషలేము నాశనం చేయబడింది అని రాశారు ఇంకా యెరూషలేము ఎంతో అభివృద్ధి పధంలో నడుస్తున్నప్పుడే!

జెకర్యా గారు ఎంతో అబ్బురముగా నాకు ఏర్పరచిన ముప్పై వెండిరూకలు నాకు కూలిగా ఇచ్చారు అని రాశారు. ధనము కుమ్మరి వానికి పారవేయమన్నారు.

పాత నిబంధన ప్రవక్తలు వాటి అర్థం కోసం ధ్యానం చేశారు గాని వారికి పూర్తిగా అర్థం కాలేదు. అయినా రక్షణను గూర్చి పరిశీలించారు, ఇంకా ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి  అంటున్నారు!

 

అయితే  12 వచనం చెబుతుంది: పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.

ప్రవక్తల పలుకులు భవిష్యత్తు కాలంలో నెరవేరుతాయనీ, వారి పరిచర్య రాబోయే తరాల కోసమేనని దేవుడు వారికి తెలియజేశారు. పాత నిబంధన రాసినది క్రీస్తు విశ్వాసులకు జ్ఞానం కలగాలని! అనగా మనకోసమే వ్రాయబడ్డాయి!

రోమీయులకు 15:4

ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.

 

1కోరింథీయులకు 10:11

సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

 

ఇప్పుడు సువార్తికులు లోకానికి ప్రకటిస్తున్న విషయాల గురించి పాత నిబంధన ప్రవక్తలు రాశారు. క్రీస్తు మరణం, సజీవంగా లేవడం, మహిమ పొందడం అనే విషయాలని. సువార్త ప్రకటించేవారంతా పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ మూలంగా ప్రకటించాలి యోహాను 14:16-17; లూకా 24:49;

 అపొ కా 1:4-5, 8; 2:1-4.

Acts(అపొస్తలుల కార్యములు) 2:1,2,3,4,5,14,15,16,17,18,19

1. పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.

2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.

3. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ

4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

5. కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

14. అయితే పేతురు పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెనుయూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.

15. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

17. అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.

18. దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

19 .పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

 

ఇక దేవదూతలు కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.

దీనికోసం చూసుకుంటే "దేవదూతలు  విశ్వాసుల విముక్తి విషయంలో దేవుడు క్రీస్తు ద్వారా, తన ఆత్మ ద్వారా చేస్తున్నది కొంత వరకు మాత్రమే దేవదూతలకు అర్థం అయినట్టుంది. దేవుడిప్పుడు వారికి నేర్పిస్తున్నాడు (ఎఫెసు 3:9). రహస్య సత్యాలు ఎంత గొప్పవంటే వాటి గురించి మరింతగా తెలుసుకోవాలని దేవదూతలు ఆరాటపడుతున్నారు.

 

ఎఫెసీయులకు 3:9

పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి,

ఎఫెసీయులకు 3:10

శోధింపశక్యము కాని(మూలభాషలో-అడుగుజాడలు పట్ల శక్యముకాని) క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును,

ఎఫెసీయులకు 3:11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న మర్మమును గూర్చిన యేర్పాటు(లేక,గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు కృప అనుగ్రహించెను.

 

కాబట్టి ప్రవక్తలు ఆత్మానుసారులై ఆత్మపూర్ణులై మనకోసం వ్రాసిన పాత నిబంధన ప్రవచనాలు క్రొత్త నిబంధన ప్రవచనాలు చదివి భక్తులు ఎన్ని శ్రమలనుభవిస్తున్నా దేవునిఆత్మ వారితో ఉన్నదని సంతోషిస్తూ శ్రమలలో ఆనందించారు. అలాగే దేవుని ఆత్మ, ఆయన ప్రేమ, ఆయన వాక్యం మనతో ఉన్నవని సంతోషిస్తూ శ్రమలను సహిస్తూ గురివద్దకు పరుగెత్తుదాము!!!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*28 భాగము*

*విశ్వాసి లక్షణాలు-1*

 

1 పేతురు 1:13--16

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16.మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! శ్రమలుకోసం ధ్యానం చేసుకున్నాము!

 

ఇక 13 వచనం చూసుకుంటే కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి అంటున్నారు!

ప్రియులారా తెలుగులో వచనంలో గల ఒక వాక్యము తప్పిపోయింది. నిజానికి ఇది కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకుని, నిబ్బరమైన బుద్ధి గలవారై యుండుడి. మెళుకువ కలవారై యుండుడి అని ఉండాలి.

ప్రాచీన ప్రతులు చూసుకుంటే అందుచేత కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృపకోసం సంపూర్ణమైన ఆశాభావంతో ఎదురు చూడండి.

 

సరే ఇక్కడ మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమంటున్నారు. దేనికోసం?! కార్యసిద్ధి కోసం!

కార్యసిద్ధి కోసం!?

సువార్త కోసం!!

గొప్ప రక్షణ సువార్తను గురించిన వివరాల కోసం దేవదూతలు తహతహ లాడుతున్నారు. రక్షణను పొందిన మనకు అలాంటి కోరిక మరి ఇంకా ఎక్కువగా ఉండాలి కదా. మనకు కొత్త మనసులు కలగాలి కదా

 రోమా 12:2;

మీరు లోక (లేక, యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.

 

ఎఫెసు 4:23-24

23. మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,

24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును (మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.

 

ఇలా మారిన మనసులను దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుడు మనకు వెల్లడి చేసినదాన్ని మనం ఆలోచించడం, ధ్యానించడం, పఠించడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం.

కీర్తన 1:2;

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

 

Psalms(కీర్తనల గ్రంథము) 119:25,26,27,34,47,48,72,73,92,93,94,99,103

25. (దాలెత్‌) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.

26. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము

27. నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

34. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.

47. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.

48.నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్‌.

72. వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

73. (యోద్‌) నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము.

92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.

93. నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.

94 .నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.

99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

 

ఎఫెసీయులకు 1:18

ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

 

ఎఫెసీయులకు 3:18

మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

ఎఫెసీయులకు 3:19

జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

ఫిలిప్పీ 1:9-10;

 

కొలస్సీయులకు 1:9

అందుచేత సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

కొలస్సీయులకు 1:10

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,....

 

కాబట్టి మన మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని వాక్యము మీద సువార్త ప్రకటన మీద మనస్సు పెట్టాలి. మరి అలాంటి మనస్సు ఉందా నీకు?!!!

 

ఇక తరువాత మెళుకువగా ఉండమని చెబుతున్నారు పేతురు గారు!

పౌలుగారు అనేకసార్లు ఇదే చెప్పారు!

 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 16:13,14

13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

14. మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.

 

వచనాలలో మెలుకువగా ఉండండి విశ్వాస మందు నిలకడగా ఉండండి పౌరుషం గలవారై ఉండండి బలవంతులై ఉండండి, మీరుచేయు కార్యములన్నియు ప్రేమతో చెయ్యండి అంటున్నారు! ఇలా రాయడం ప్రతీ పత్రికలోను ప్రతీ సంఘానికి రాయడం పౌలుగారికి అలవాటు!

 

మెలకువగా కోసం చూసుకుంటే

కొలస్సీయులకు 4: 2

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

 

1థెస్సలొనికయులకు 5: 6

కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.

 

మత్తయి 26: 41

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి...

 

ఎఫెసీ 6:10,18,20

10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

20. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 4: 7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 5: 8

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

 

ప్రకటన 16:16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

 

కాబట్టి మెలకువగా ఉందాం!

నిబ్బరమైన బుద్ధి కలిగి ఉందాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*29 భాగము*

*విశ్వాసి లక్షణాలు-2*

1 పేతురు 1:13--16

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16.మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 13 వచనం ఇంకా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

ప్రియులారా నాలుగు వచనాలలో పేతురు గారు విశ్వాసులకు కావలసిన ముఖ్య లక్షణాలు చెబుతున్నారు.

13 వచనంలో నిబ్బరమైన బుద్ధి, మెళుకువ, నిరీక్షణ, వాక్యమందు ఆసక్తి, సువార్త ప్రకటన ఉండాలి అన్నారు.

14,16 వచనాలలో పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు!

15 వచనంలో విధేయత కలిగి ఆయన పిల్లలు వలె ఉండాలి అంటున్నారు!

 

సరే, ఇక ముందుకుపోతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. యేసుక్రీస్తు ప్రభులవారు అతిత్వరలో ప్రత్యక్షం కాబోతున్నారు అని మన అందరికీ తెలుసు!

(మత్తయి 24:30; తీతు 2:13; హీబ్రూ 9:28.)

అయితే ఇలా ప్రత్యక్షమయ్యే సమయంలో ఆయన ప్రత్యేకమైన కృప మనమీద కుమ్మరించబడుతుంది. కృపకోసం నిరీక్షణ కలిగి ఉండమంటున్నారు.

దేవుడు విశ్వాసులకు ఇప్పటికే కృపను ఇచ్చారు. అయితే వారికి కృప ఇంకా కలగబోతున్నది ( 4; ఎఫెసు 2:7). దానిపై మన ఆశలను సంపూర్ణంగా నిలుపుకోవడం మన కష్టాలనూ హింసలనూ ఆనందంతో భరించేందుకు సహాయపడుతుంది.

ఈవిధంగా నమ్మిక కలిగి నిరీక్షణ కలిగి ఉండమంటున్నారు!

 

గతభాగాలులో చూసుకున్నాము! కొలస్సీ పత్రిక మరియు ఎఫెసీ పత్రికలో గల అంశాలు చాలావరకు ఒకేలా ఉంటాయి! కాబట్టి ఇప్పుడు కొలస్సీ పత్రికలో ఏమని చెప్పారో ఒకసారి ధ్యానం చేద్దాం!

 

కొలస్సీయులకు 1: 3

పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,. .

 

  ఇక   వచనంలో కొలస్సీ సంఘానికున్న మూడు మంచి లక్షణాలను ఎత్తి రాస్తున్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు. అవి:

1). పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ,

2) క్రీస్తుయేసు నందు కలిగియున్న విశ్వాసము,

3) పరిశుద్దులందరి మీద ఉన్న ప్రేమ!!

మూడు లక్షణాలు వారికి ఉన్నాయి. వారికే కాదు రక్షంచబడిన ప్రతీ విశ్వాసికీ ఉండాలి!

 

*పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ*: వీరి నిరీక్షణ పరలోకంలో ఉంది. నిరీక్షణ కోసం ధ్యానం చేస్తే, పరిశుద్ధ గ్రంధంలో నిరీక్షణ కోసం చాలా రిఫరెన్సులున్నాయి. కొన్నింటిని మాత్రం చూద్దాం!

 

  నిరీక్షణ అంటే ఎదురుచూడటం అని అర్ధం వస్తుంది.  Waiting with Trust/Hope అనొచ్చు! బైబిల్ లో అనేకచోట్ల విశ్వాసానికి బదులుగా/ సర్వనామంగా నిరీక్షణ వాడారు. కాబట్టి నిరీక్షణ- విశ్వాసానికి దగ్గరగా ఉంటుంది. బైబిల్ గ్రంధంలో అనేకమందికి అనేకరకాలైన నిరీక్షణలు ఉన్నట్లు చూస్తాం!

 

   ఇక యోబుగారి నిరీక్షణ: తన ఆస్తి, అంతస్తు, పిల్లలు అంతా ఒక్కరోజే పోగొట్టుకొన్నా,దేహానికి కుష్టువ్యాది వంటి చర్మవ్యాధి సోకినా అంటున్నారు: యోబు 20:25-27  *అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూస్తాను! ఎవరో కాదు, నేనే, నాకన్నులారా చూస్తాను* అంటున్నారు! ఆహా! ఎంత గొప్ప నిరీక్షణ!!!

 

   ఇక దావీదు గారిని చూస్తే : నా నిరీక్షణ నీవే! నీవే నా నిరీక్షణకు ఆధారం, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు? దేవుని మీద నిరీక్షణ యుంచుము అంటున్నారు. చివరకు మరణ పర్యంతము నిరీక్షణ కలిగియున్నట్లు చూస్తున్నాము. కీర్తనలు 42:5,11; 43:5; 62:5; 119:49.

 

  ఇక పౌలుగారి నిరీక్షణ అమూల్యమైనది. ఆయనకు మూడు నిరీక్షణలున్నాయి.

 

1). అపోస్తలుల కార్యముల ప్రకారం ముఖ్యంగా 26 : విధముగానైన మృతుల పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నారు! యేసుప్రభులవారు ఎలా చనిపోయి తిరిగి లేచారో, అలాగే ఆయనను విశ్వసించిన వారు కూడా ఒకరోజు తిరిగి పునరుత్థానం అవుతారు, లేచి ప్రభువును ఎదుర్కొంటారు. అలాగే పౌలుగారు ఒకరోజు తిరిగిలేస్తారు అని ఆయన నిరీక్షణ! అందుకోసమే ఎన్నో కష్టాలు పడ్డారు!

 

2) మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసం కాపాడుకొంటిని, ఇక నాకు నీతికిరీటము ఉంచబడింది అని గర్వంగా, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు! 2 తిమోతి 4:7. నాకొరకు నీతి కిరీటం ఉంది అంటున్నారు. అదీ నిరీక్షణ! చూసారా ఎంత ధైర్యమో? మరో దగ్గర నేను క్రీస్తుని పోలి నడచుకొనిన ప్రకారం మీరునూ, క్రీస్తుని పోలి నడచుకోండి అనడం లేదు! నన్నుపోలి నడచుకోండి అని ధైర్యంగా చెబుతున్నారు. 1 కొరింథీ 11:1; ఇలా ధైర్యంగా చెప్పగలవా?

 

బైబిల్లో ఇలాంటి challenging decelerations రెండే ఉన్నాయి. మొదటిది యేసయ్య: నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించగలడు అని చాలెంజ్ చేసారు యోహాను 8:46. ఇది రెండవది!

 

పౌలుగారు మృతులలో పునరుత్థానం కోసం నిరీక్షణ కలిగియున్నారు. ఇంకా అంటున్నారు: నిరీక్షణ మనలను సిగ్గుపరచదు!! రోమా 5:5;

 

   ఇక ఇలాంటి నిరీక్షణనే కొలస్సీయులు కూడా కలిగియున్నారు. అది పరలోక సంభందమైన నిరీక్షణ. నిరీక్షణకు పౌలుగారు మంచి పేరు పెట్టారు.

 

3) శుభప్రదమైన నిరీక్షణ: తీతుకు 2:12-13 లో చూసుకోవచ్చు దీనికోసం. శుభప్రదమైన నిరీక్షణ అనగా *మహా దేవుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం*. అదే శుభప్రదమైన నిరీక్షణ! ఇక్కడ మనం చూస్తే పౌలుగారు యేసయ్యను దేవుడు అనకుండా *మహాదేవుడు* అంటున్నారు (GREAT GOD). మహాదేవుని మహిమకోసం మనం నిరీక్షించాలి. ఒకరోజు మహాదేవుడు రాబోతున్నారు, కడబూర మ్రోగగానే ఎత్తబడి, దేవునిని కలుసుకుంటాము. తేజోవాసులైన పరిశుద్దుల సమూహముతో కలసి, రాజు పెండ్లి విందులో పాల్గొంటాము. ఇక పరలోకం వెళ్తాము. అక్కడ అబ్రహాము గారిని చూస్తాము, మోషే, ఏలీయా, ఎలీషా, దావీదు, దానియేలు గార్ల వంటి మహానీయలతో కలసి తిరుగుతాము. వారిని ఇంటర్యూ చేస్తాము. ఇదే శుభప్రదమైన నిరీక్షణ!

 

పనికిమాలిన చెత్త బంగారం కోసం ప్రాకులాడి, మెడలో, చెవికి, చేతికి తగిలించుకొంటున్నావు గాని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటే బంగారు వీధులలో బంగారం మీద నడుస్తావు. ప్రకటన 21లో పట్టణం శుద్ధ సువర్ణము అని వ్రాయబడింది. భాగ్యం కావాలంటే నీకు నిరీక్షణ కావాలి!! నిరీక్షణ నీకుందా?

 

   ప్రియ చదువరీ! నీ నిరీక్షణ దేనిమీద? బంగారం మీదా? అధికారం మీదా? ప్రియురాలి మీదా? ఉద్యోగమా? పదవా? ఉత్తీర్ణతా? material blessing నా?

 

హెబ్రీ 11:13-16 లో విశ్వాస వీరులు పరలోకసంభందమైన శ్రేష్టమైన దేశమును వెదికారు. దానికోసం చాలా కష్టాలు పడ్డారు. చివరకు దానిని స్వతంత్రించుకొన్నారు! అటువంటి నిరీక్షణ నీకుందా? అసలు నీకు నిరీక్షణ అంటూ ఉందా? ఏదో గుడికి వెళ్తున్నాం, యేసుబాబుని నమ్ముకొంటే రోగాలుపోతాయి, ఆశీర్వాదం కలుగుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది అనుకుని వస్తున్నావు గాని శుభప్రదమైన కలిగి ఒకరోజు దేవాదిదేవుడిని, మహా దేవుడ్ని చూస్తాను అనే ఆశ ఉందా? ఏదో మా అమ్మ, బాబు పోరు పడలేక గుడికొస్తున్నాను గాని నిరీక్షణా/పాడా అనుకుంటున్నావా? విడువబడుట బహుఘోరమని మరచిపోవద్దు! ప్రతీ ఒక్కరు శుభప్రదమైన నిరీక్షణ కలిగియుండాలి!

 

  అట్టి కృప, నిరీక్షణ చదువరులందరికీ కలుగును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*30 భాగము*

*విశ్వాసి లక్షణాలు-3*

 

1 పేతురు 1:13--16

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా నాలుగు వచనాలలో పేతురు గారు విశ్వాసులకు కావలసిన ముఖ్య లక్షణాలు చెబుతున్నారు.

13 వచనంలో నిబ్బరమైన బుద్ధి, మెళుకువ, నిరీక్షణ, వాక్యమందు ఆసక్తి, సువార్త ప్రకటన ఉండాలి అన్నారు.

14,16 వచనాలలో పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు!

15 వచనంలో విధేయత కలిగి ఆయన పిల్లలు వలె ఉండాలి అంటున్నారు!

 

ఇక 14 వచనం ఇంకా చూసుకుంటే నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

ఇక 16 వచనంలో మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి అంటున్నారు పేతురు గారు!!

 విశ్వాసులందరి గురి ఇదే కావాలి. లేవీ 20:7 లో అంటున్నారు తండ్రియైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు నా పిల్లలు గనుక మీరును పరిశుద్ధులై ఉండమంటున్నారు. దానినే ఎత్తి రాస్తున్నారు పేతురు గారు!

పౌలుగారు కూడా ఇదే రాశారు. నా ప్రతీ శీర్షిక లోను కనీసం ఒకసారైనా దీనికోసం గుర్తుచేస్తూ ఉంటాను! ఎందుకంటే మనదేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన దేవుడు త్రాగుబోతు జూదగాడు మోసగాడు వ్యభిచారి కాదు ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలము అని పేరుపెట్టుకున్నాము గనుక మనము ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలి. అదంతే!

అయితే 16 వచనం ప్రకారం సమస్త ప్రవర్తన లోను పరిశుద్ధులుగా ఉండాలి. అనగా మాటలోను పనిలోనూ అన్ని విషయాలలోను పరిశుద్ధులుగా ఉండాలి!

 

ఇక 1కొరింథీ 1:2 లో  కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అంటూ అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికిని ఇంకా యేసుక్రీస్తు నామంలో ప్రతీస్థలంలో ప్రార్ధించు వారికిని అనగా మనలాంటి వారికిని శుభమని చెప్పి వ్రాయునది అంటున్నారు! మొదటి వచనంలో తాను యేసుక్రీస్తు యొక్క అపోస్తలునిగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటూ తనకోసం చెప్పుకుని, రెండో వచనంలో యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటూ విశ్వాసులకోసం రాస్తున్నారు! పౌలుగారు యేసుక్రీస్తునందు అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడితే కొరింథీ సంఘము లేక సార్వత్రిక సంఘము క్రీస్తుయేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు అని ఆత్మావేశుడై రాస్తున్నారు!

 

గమనించారా! సార్వత్రిక సంఘములో అంగములై ఉన్న ప్రతీ విశ్వాసి మొదటిగా పరిశుద్ధ పరచబడ్డారు తర్వాత పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు!!  విశ్వాసి క్రైస్తవుడు లోకములోనుండి పిలుబడ్డాడు! ఎందుకోసం పిలువబడ్డాడు అంటే  పరిశుద్దులుగా ఉండుటకోసం దేవుడే వారిని పరిశుద్ధ పరిచారు కాబట్టి పరిశుద్దులుగా తమ జీవితాంతము జీవించాలని పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు! కాబట్టి విశ్వాసి అన్యజనుల వలే మాట్లాడకూడదు, అన్యుల వలే  ప్రవర్తించకూడదు, అన్యుల వలే వస్త్రధారణ చేసుకోకూడదు, అన్యుల వలే మధ్యపానీయాలు తీసుకోకూడదు! అన్యజనుల వలే వారి ఆచార వ్యవహారాలూ చేయనే కూడదు! నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండాలి అనే ఖండితమైన ఆజ్ఞ మనకు లేవీకాండంలో మాటిమాటికి కనిపిస్తుంది.

లేవీ 11:44-45; 20:26; 21:8;

అదే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పారు!

 

1 Peter(మొదటి పేతురు) 1:14,15,16

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

ప్రతీ శీర్షికలో దీనికోసం చెబుతున్నా ప్రస్తుతం ఇది సంఘానికి అవసరం కాబట్టి మరోసారి దీనికోసం మీకు గుర్తుచేసి మిమ్మల్ని కదిలించాలని ఆశిస్తున్నాను!

 

1). మొదటగా పరిశుద్ద పరచబడిన వారై...

2) పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారు

 

  పౌలుగారు అంటున్నారు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడను అని చెప్పుకుంటున్నారు రోమా పత్రిక 1:1లో.

 

   పౌలుగారే కాదు ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన జనము. మూర్కులైన తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగలిగారు! దానియేలు 3;

నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!!

పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు 

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . .  

 

 కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి పాపిష్టి పనులు చేయకూడదు. మీరు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడ్డారు.1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

 అంతేకాకుండా వెండి బంగారముల వంటి వెలగల వస్తువులచేత మీరు విమోచించ బడలేదు గాని క్రీస్తు రక్తముద్వారా విమోచించ బడ్డారు 1పేతురు 1:18; కాబట్టి ప్రత్యేకముగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎందుకు అంటే:

 

2) కారణం మనము దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. గతములో హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు దేవున్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవునికి ఇష్టులుగా జీవించగలము!  

 

  ఇక్కడ పౌలుగారు ఇంకా స్పష్టముగా దేవునికి ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45; 20:26; 21:8;

 

 అంతే తప్ప నన్ను కేవలం నమ్ముకో! కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, తరువాత నీవెలా ఉన్నా పర్వాలేదు. వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోక రాజ్యము ఇచ్చేస్తానని దేవుడు చెప్పలేదు. మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును ఉంటారు. అదే విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో

1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? 

2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.  . . . .

 

 ఇంకా అంటున్నారు ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన జీవితం. నీ డబ్బులు, ఇంకా మరేదో ఆశించడం లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు మందిరమైపోవాలి,. మందిరములో దేవుడు నిత్యమూ ఉండాలని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్దమైన జీవితం జీవిస్తావో, అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు పరిశుద్దముగా జీవిస్తే దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించినట్లు దేవుడే దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ నివాసం చేస్తారు. 

 

   కాబట్టి ప్రియ దైవజనమా! నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం జీవించు! సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పేరుకు తగ్గట్టు జీవించు! అప్పుడు దేవుడు నీతో అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు! 

మరి నీవు సిద్ధమా?

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*31వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-4*

 

1 పేతురు 1:13--16

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈ నాలుగు వచనాలలో పేతురు గారు విశ్వాసులకు కావలసిన ముఖ్య లక్షణాలు చెబుతున్నారు.

13వ వచనంలో నిబ్బరమైన బుద్ధి, మెళుకువ, నిరీక్షణ, వాక్యమందు ఆసక్తి, సువార్త ప్రకటన ఉండాలి అన్నారు.

14,16 వచనాలలో పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు!

15వ వచనంలో విధేయత కలిగి ఆయన పిల్లలు వలె ఉండాలి అంటున్నారు!

 

ఇక 15వ వచనం ఇంకా చూసుకుంటే కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, ...

చూశారా తర్వాత విశ్వాసికి ఉండవలసిన లక్షణం విధేయత!

విధేయులైన పిల్లలు వలె ఉండాలి!

దీనికోసం పౌలుగారు ఇంకా వివరంగా రాశారు.

 

రోమా 5:1819

18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.

19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.  . .

 

      ప్రియులారా!  ఇక్కడ పౌలుగారు మనకు అర్ధమయ్యే రీతిలో తన యొక్క భావాన్ని వివిధ సమీకరణములతో ఋజువుచేస్తున్నారు. అది ఏమిటంటే ఆదాము ద్వారా పాపము- పాపముద్వారా శాపము మరియు తీర్పు ఎలా వచ్చాయో అలాగే యేసుక్రీస్తుప్రభులవారి విధేయత వలన ఆయన చేసిన పుణ్యయాగం వలన అందరి అనగా మానవాళి అందరి పాపములు తొలగిపోయే అవకాశం కలిగింది. ఇంకా 19వ వచనంలో అంటున్నారు ఆదాముచేసిన అవిధేయత/ తిరుగుబాటు ద్వారా ఉగ్రత ఎలా వచ్చిందో అలాగే యేసుక్రీస్తుప్రభులవారు చూపిన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అంటున్నారు.  ఈ విధేయత కోసం ఫిలిప్పీ 2:8లో పౌలుగారు అంటున్నారు. 2:6,7,8

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.      ...

 

  ఇక్కడ మానవునిలో దేవునికి కావలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే విధేయత. Complete obedience. సంపూర్ణ విధేయత!  విధేయత వలన లాబాలు ఏమిటో బైబిల్ గ్రంధంలో విస్తారంగా చూసుకోవచ్చు! అబ్రాహముగారిని దేవుడు నీ తండ్రి ఇంటిని, నీవారిని, నీ ఊరిని వదలి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నేను ఏ ఊరు వెళ్ళాలి? ఎన్నిరోజులు ఉండాలి? దాని అడ్రస్ ఏమిటి? ఇలాంటివి ఏమీ అడగలేదు. విధేయత చూపించారు.  లేకలేక పుట్టిన కుమారున్ని మోరియా కొండమీద బలి ఇచ్చేయ్ అంటే మారుమాట్లాడకుండ బలి ఇవ్వడానికి సిద్దమైపోయారు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయారు. ఆ విధేయతయే ఆయనను అత్యున్నతుడిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చివేసింది.,

 

   ఇలా చూసుకుంటూ పోతే మోషేగారు, యెహోషువా గారు, దావీదుగారు, సమూయేలుగారు, ఏలియాగారు, ఎలీషా గారు ఇలా భక్తులంతా దేవునిమాటకు సంపూర్ణ విధేయత చూపించారు. అందుకే దేవుడు వారిని వాడుకున్నారు.

 

  హవ్వ దేవుని మాటకు విధేయత చూపించకుండా సాతాను/ సర్పము మాటకు లొంగిపోయింది. మన అందరికీ శాపానికి కారణమయ్యింది. లోతు భార్య అవిధేయత ఆమెను ఉప్పుస్తంభంగా మార్చివేసింది. బిలాము అవిధేయత ఖడ్ఘముతో చంపబడటానికి కారణమయ్యింది. గేహాజి అవిధేయత అతనిని అతని కుటుంబాన్ని కుష్టురోగులుగా మార్చివేసింది.  అననీయ సప్పీర అవిధేయత వారిని చంపింది.  ఇలా ఎన్నోన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి.

 

     కాబట్టి ప్రియ చదువరీ! దేవుని పట్ల విధేయత కలిగి ఉండు. దేవాదిదేవుడు అయిన యేసుప్రభులవారే విధేయత చూపించినప్పుడు నీవు నేను కూడా దేవునికి విధేయత చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

        ఇక 18వ వచనంలో మనుష్యులందరికీ.. అంటున్నారు. అనగా మనష్యులందరికీ ఈ నిత్యజీవం/ శాశ్వతజీవం/ రక్షణను దేవుడు అందుబాటులో ఉంచారు. అయితే అది కేవలం క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రం ఆ జీవం/ నిత్యజీవం/ శాశ్వతజీవం కలుగుతుంది. ప్రకటన 22:17; 1యోహాను 5:1112; యోహాను సువార్త 7:3738;

 

   ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడటానికి, నిత్యజీవానికి మధ్యగల సంభందాన్ని గ్రహించాలి. ఈ పరలోకం/నిత్యజీవం కావాలి అంటే మొదట నీతిమంతులుగా తీర్చబడాలి. కారణం అపవిత్రమైనదేది అందులో ప్రవేశించదు అని బైబిల్ సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని యేసయ్య చెబుతున్నారు.  కేవలం పరిశుద్దులకు మాత్రమే ఆ పరమ రాజ్యంలో చోటుంది. ఆ రాకడనే రైలుబండిలో ప్రయాణం చేయాలంటే కేవలన్ రక్షణ అనే టిక్కెట్ ఉంటే చాలదు, పరిశుద్ధతయే ఆ బండిలో ప్రయాణం చేయడానికి అర్హత! ప్రియ సహోదరీ/సహోదరుడా! నీ పరిస్తితి ఎలా ఉంది? పరిశుద్దుడువా లేక అపవిత్రంగా ఉన్నావా?  పౌలుగారు చెబుతున్నారు మనం మన నీతిక్రియలు/ పుణ్యకార్యాలు ద్వారా నీతిమంతులుగా తీర్చబడము గాని విశ్వాసం ద్వారా ఆయనను విశ్వసిస్తే కృపద్వారా మనం నీతిమంతులుగా, పరిశుద్దులుగా తీర్చబడతాము అంటున్నారు. అపొస్తలుల 13:39; 1కొరింథీ 6:11; గలతీ 3:8; మరి నీవు కృపకు పాత్రుడిగా ఉంటున్నావా? చెత్త పనులుచేస్తూ అపాత్రుడిగా మిగిలిపోతున్నావా?      దేవునికి విధేయత గల పిల్లలు వలె ఉన్నావా?!

   

       ఒకసారి సరిచేసుకో. సరిదిద్దుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*32వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-5*

1 పేతురు 1:13--16

13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈ నాలుగు వచనాలలో పేతురు గారు విశ్వాసులకు కావలసిన ముఖ్య లక్షణాలు చెబుతున్నారు.

13వ వచనంలో నిబ్బరమైన బుద్ధి, మెళుకువ, నిరీక్షణ, వాక్యమందు ఆసక్తి, సువార్త ప్రకటన ఉండాలి అన్నారు.

14,16 వచనాలలో పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు!

15వ వచనంలో విధేయత కలిగి ఆయన పిల్లలు వలె ఉండాలి అంటున్నారు!

 

ఇక 15వ వచనం ఇంకా చూసుకుంటే కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, ...

ప్రియులారా ఇక్కడ విధేయులగు పిల్లల వలె ఉండాలి, ఇంకా మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలును అనుసరించకూడదు!!!

ఇది విశ్వాసికి ఉండకూడని లక్షణం!

అపో.కార్యములు 3:17

సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.

 

అపో.కార్యములు 17:30

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

అపో.కార్యములు 17:31

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

 

1కోరింథీయులకు 15:34

నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.

 

ఎఫెసీయులకు 4:18

వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

 

1తిమోతికి 1:13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

 

2పేతురు 2:20

వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

2పేతురు 2:21

వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

2పేతురు 2:22

కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.

 

వీటన్నిటి భావము ఏమిటంటే రక్షణ పొందిన నీవు, ఆత్మను పొందుకున్న నీవు ఆయనకు విధేయత కలిగి ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండాలి తప్ప గతంలో అనగా రక్షణ పొందని స్తితిలో దయ్యపు కుమారుడు కుమార్తెగా జీవించినట్లు అనగా లోకపుటాశలతో త్రాగుడు, వ్యభిచారం, అబద్దాలు, అపవిత్రమైన జీవితం జీవించకూడదు. పవిత్రమైన జీవితం జీవించాలి!

 

గతంలో లేదా పూర్వము మీకుండిన ఆశలు అనగా లోకాశలు! వాటిని అనుసరించి నడువకూడదు! అజ్ఞానంలో మీ హృదయం ఎలా చెబితే అలా చేశారు.

మత్తయి 15:18

నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

మత్తయి 15:19

దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

మత్తయి 15:20

ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

 

రోమీయులకు 1:24

ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

రోమీయులకు 1:25

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌.

 

రోమీయులకు 8:5

శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

రోమీయులకు 8:6

ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

రోమీయులకు 8:7

ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

 

ఎఫెసీయులకు 2:1

మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

ఎఫెసీయులకు 2:2

మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున (మూలభాషలో-యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.

ఎఫెసీయులకు 2:3

వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై (మూలభాషలో-ఉగ్రత పిల్లలమై) యుంటిమి.

 

ఆదికాండము 8:21

అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందు కనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

 

కాబట్టి మనసులో ఇంకా హృదయంలో వచ్చే ప్రతీ చెడ్డ కోరిక ఆశల ప్రకారం జీవించకూడదు!

మరి ఎలా ఉండాలి?

రోమీయులకు 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

రోమీయులకు 12:2

మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

రోమీయులకు 8:29

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

రోమీయులకు 8:30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

సరే, నిజానికి ఈ వచనపు అర్థం కొన్ని ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది:

విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి.

ఇక్కడ అంటున్నారు దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు!

దురాశను విడిచి పెట్టాలి!

 

కొలస్సీ ౩:56

5. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.

 

1తిమోతి 6:911

9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.

10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.

11. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము).

 

పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్ర్రీస్తురక్తముచేత విమోచింపబడితిరి (1 పేతురు 1:18,19)

ప్రియ సహోదరి/సహోదరులారాఇవి దేవుని నుండి మనల్ని దూరం చేశాయి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి (1పేతురు 2:25).

   మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవి జరిగించుటకు గతించిన కాలమే చాలును (1పేతురు 4:3). దయచేసి ఈ పాపములన్నీ మానివేసి ప్రభువువైపు తిరుగమని బ్రతిమాలుతున్నాను. నీ జారత్వము, వ్యభిచారం నుండి పారిపో, మోహపుచూపును వెలిచూపును వదిలెయ్! హస్తప్రయోగం లాంటి అలవాట్లు మానెయ్! దేవునికి కోపం పుట్టించే పోములు/ రక్షరేకులు/ తావీదులు తీసిపారెయ్! త్రాగుడు, ధూమపానం విసర్జించు! మన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి సమర్ధుడు! నీ అబద్ధాలు అబద్ద ప్రమాణాలు మానెయ్! తాళి కట్టడం, వాస్తు చూడటం లాంటి అన్యాచారాలు విసర్జించు! ఎందుకంటే ఇవన్నీ దేవుని నీతిని నెరవేర్చవు. మనం పరిశుధ్ధులగుట అనగా జారత్వం నుండి పారిపోవుట & తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము! (1 థెస్స 4:3,4).

 

        ఇంకా చాలా ఉన్నాయి. లంచాలు పుచ్చుకొనేవారు కొందరు. లంచం పుచ్చుకోకూడదు అని బైబిల్ సెలవిస్తుంది (నిర్గమ 23:8). అన్యాయస్తులు దేవుని రాజ్యం చేరరు అని గ్రంథం సెలవిస్తుండగా మరి ఎందుకు నీ సహోదరుని/ స్నేహితుని/ పొరుగువారిని/ తెలిసినవారిని/ తెలియని వారిని మోసం చేస్తావు? నిన్ను ఎవరూ దోచుకొనక పోయిననూ,మోసం చేయకపోయినా మోసం చేసే నీకు శ్రమ! నీవు దోచుకొనుట, మోసగించుట ముగించిన తర్వాత మోసగింపబడతావు అని బైబిల్ సెలవిస్తుంది.(యెషయా 33:1)

 

ఇక భార్యను కొట్టేవారు కొందరు. అనుమానించేవారు కొందరు. పురుషులారా! మీ భార్యలను ప్రేమించి పోషించమని వ్రాయబడిఉంటే (ఎఫెసీ 5: 23-30) భార్యని హింసిస్తావా? నీవు నీ భార్య ఎంత పవిత్రంగా, పతివ్రతగా ఉండాలని కోరుకొంటున్నావో ఆమె కూడా, నీవు కూడా అలాగే ఉండాలని కోరుకొంటుంది. మరి నీవు అలా ఉంటున్నావా? ఆమెకో రూలు! నీకో రూలా? భార్యమీద భర్తకి, భర్తమీద భార్యకి నమ్మకం ఉండాలి, అప్పుడే కుటుంబం నిలబడతాది. దానిని వమ్ము  చేస్తే అది కాపురం కాదు వ్యభిచారం అవుతుంది.

మరికొందరు జూదాలు, రేస్ లు ఆడేవారున్నారు. ఇవన్నీ పాపాలే, చేయకూడని పనులే.

 

మరికొందరు ఆదివారంనాడు ముఖ్యమైన క్రికెట్ మాచ్ ఉంటే చర్చికి రారు. కొంతమంది పాటగాల్లు వచ్చినా పాటలు అయిపోయిన వెంటనే మాచ్ చూడటానికి పారిపోతారు. దేవుని కన్నా మీకు క్రికెట్ మ్యాచ్ ఎక్కువై పోయిందా మీకు? క్రికెట్ నీకు విగ్రహంగా మారిపోలేదా నీకు? మరికొంతమంది (స్త్రీలు ముఖ్యంగా) TV serials ఉంటే రాత్రిపూట సంఘంలో జరిగే ఆరాధనలకుగాని, ఉపవాస కూటాలకి గాని, గృహకూటములకి గాని రారు. లేదా సీరియల్స్అయిపోయిన తరువాత వస్తారు. ఇదేనా నీ భక్తి? దేవునికిచ్చే స్థానం ఇదేనా? దేవునికన్నా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే!

 *ఒకవేళ దేవుడు రెండో రాకడలో వచ్చి పిలిస్తే మ్యాచ్ అయిపోయాక వస్తాను, సీరియల్ అయ్యాక వస్తాను అని చెబుతావా?* బుద్ధిలేని కన్యకలవలే విడచిపెట్టబడతావ్ జాగ్రత్తఒకవేళ మరణదూత వచ్చి పిలిస్తే అవి చూసి వస్తాను అని చెప్పడం కుదురుతుందా? బలవంతంగా నీ ప్రాణాన్ని గుంజి, ఈడ్చుకొంటూ తీసుకొని పోతాడు.

 

నేటికాలంలో సినిమాలు చూడటం, సీరియల్స్చూడటం తప్పని బోధించడం మానేసారు. సినిమా అబధ్ధమని, దానిలో మంచికన్నా చెడే ఎక్కువని తెలుసువాటిలో జారత్వం కాముకత్వం పెంచే సన్నివేశాలు ఎక్కువని తెలుసు. అయినా చూస్తావుతప్పించుకొంటావా? వ్యభిచారుణులారా! ఈ లోకస్నేహం దేవునితో వైరమని తెలియదా? అని గ్రంథం సెలవిస్తుంది.(యాకోబు 4:4). పైకి భక్తి గలవాని వలె నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారిలా ఉంటున్నావు (2పేతురు 3:5). నీవు ప్రశస్తమైన దేవుని అమూల్యమైన రక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోతున్నావు.

 

మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?

      ఇప్పడైననూ మీరు ఉపవాసముండి కన్నీరు విడచుచూ, దుఃఖించుచూ, మనఃపూర్వకముగా (మనస్పూర్తిగా) తిరిగి నాయొద్దకు రండి! ఇదే యెహోవా వాక్కు! (యోవేలు 2:12). ఇశ్రాయేలు! నీవు తిరిగి రానుధ్ధేశించిన యెడల నా దగ్గరకే రావలయును అంటున్నారు తండ్రినిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో యేసయ్య పాదాలు కడగాలి ఎందుకంటే మనం చేస్తున్న పాపాలు ఎక్కడ జమ అవుతున్నాయో తెలుసా? నీవు చేసే పాపాలు నీ రక్తము లో కలసి పోతున్నాయి. రక్తమే ప్రాణం, జీవము. మానవుని రక్తంలో  20% రక్తము, 80% నీరు ఉంటాయి. రక్తము మనిషిని బ్రతికిస్తుంటే, ఆ రక్తాన్ని ద్రవరూపంలో ఉంచి మన శరీరభాగాలుకు చేరడానికి నీరు సహాయ పడుతుంది. ఇప్పుడు నీ రక్తం పాపపంకిలమై పోయిందిపాపులెవరూ పరలోకము చేరలేరు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? కన్నీటితో యేసయ్య పాదాలను కడుగు, ఆ కన్నీరు యేసయ్య రక్తాన్ని నీ రక్తము లోకి ప్రవహింప జేసి నీ పాపాలు నీ కన్నీటిలో కొట్టుకుపోడానికి దోహదపడుతుంది. ఎందుకంటే యేసయ్య వచ్చినదే అందుకు. యేసు రక్తము ప్రతీ పాపము నుండి మనలను పవిత్రులనుగా జేయును.(1యోహాను 1:7; మత్తయి 1:2)

కాబట్టి ఇప్పుడే యేసయ్య పాదాలు పట్టుకో!

 

ఇంకొందరంటారు యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది కదా మేము తప్పిపోవడం సామాన్యమే. మేము భక్తిగా యదార్థంగా ఉండాలనుకొన్నా ఉండలేక పోతున్నాం అంటారు. నిజమే సహోదరుడా నీకు నీవుగా యదార్థంగా ఉండాలన్నా ఉండలేవు. నీకు తోడుగా వాక్యాన్ని తీసుకుని పోతున్నావా? దేవున్ని సహాయం చేయమని అడిగావా?

1. ఆత్మానుసారముగా నడచుకొనుడి, అప్పుడు మీరు శరీరాశలను నెరవేర్చరు (గలతీ 5:16)

2. నీ ఎదుట పాపము చేయకుండునట్లు నాహృదయంలో నీ వాక్యమునుంచుకొందును (కీర్తనలు 119:11) ఎప్పుడైతే వాక్యమును అనుదినం అనుక్షణం ధ్యానిస్తావో పాపం నీ దగ్గర నుండి పారిపోతుంది. పరిశుధ్ధాత్మ ను వేడుకో, నీకు సహాయం చేయమని, నడిపించమని, అప్పుడు నీ మార్గములను సరాళము.చేస్తారు.

ప్రియ దేవుని సంఘమా! ఒకసారి ఆలోచించు, సరిచేసుకో!

 

ప్రియ దైవసేవకుడా! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాందించిన సంఘాన్ని కాయుటకు నిన్ను అధ్యక్షునిగా ఉంచారు ఆ సంఘాన్ని జాగ్రత్తగా చూడటం మీ భాధ్యత! ( అపొ 20:28)

సంఘం తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దాల్సిన భాద్యతను దేవుడు నీకు అప్పగించారు. ఖండించుము, గధ్ధించుము, బుద్ది చెప్పుము అని అధికారం ఇచ్చారు (2పేతురు 3:16-17; 4:1-3). వారిని సరిచేయకపోతే దేవుడు ఆ ఆత్మలకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తారని మరచిపోకు.(యెహేజ్కేలు 3:16-21).

గాబట్టి మనందరం దేవుని చిత్రాన్ని నెరవేర్చడానికి సిద్దపడదాం! సరిదిద్దుకొందాం. యేసయ్యని బ్రతిమిలాడదాం.

ఆ పరలోకాన్ని పట్టుకొందాం!

అట్టి కృప మనందరికీ కలుగును గాక!

ఆమెన్!

మరణాత!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*33వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-6*

1 పేతురు 1:17--20

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైయున్నంతకాలము భయముతో గడుపుడి.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 17వ వచనం ప్రకారం దేవుడు పక్షపాతం లేకుండా తీర్పుతీర్చేవాడు కనుక మీరు అనగా చిన్న ఆసియాలో ఉన్న విశ్వాసులు దేవున్ని తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు! అలాగే మనము కూడా దేవునికి అబ్బా తండ్రీ అని ప్రార్థన చేయాలి!

ఇక మీరు పరదేశులై ఉన్నంతకాలము దేవునిపట్ల భయము కలిగి ఉండాలి!

ఇక 18-20 వచనాలు ప్రకారం వెండిబంగారు వంటి వస్తువుల ద్వారా మీరు విమోచించబడక క్రీస్తు అమూల్యమైన రక్తముచేత విమోచించ బడ్డారు కనుక దేవునియందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నారు!

 

సరే, 17వ వచనం ప్రకారం దేవునికి పక్షపాతం లేదు కాబట్టి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయాలి!

పౌలుగారు అంటున్నారు అలా ప్రార్థన చేసేది పరిశుద్ధాత్ముడే మీలో ఉండి మీ పక్ష్యముగా ఉచ్చరించలేని మూల్గులతో ప్రార్థన చేస్తున్నాడు అంటున్నారు!

 

రోమీయులకు 8:26

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 

ఇక ఈ వచనంలో  ప్రాముఖ్యమైన అంశం: *దేవుని ఆత్మ మన బలహీనతలో మనకోసం ప్రార్ధించుట* లేక *ఆత్మ ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ప్రార్ధించుట* కోసం వ్రాయబడింది. 2627 వచనాలు. ఈ వచనాలలో ఆత్మ మన బలహీనతల విషయంలో చూచి మనకోసం ప్రార్ధన చేస్తున్నాడుఎందుకంటే మనం ఎలా ప్రార్ధన చేయాలో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మనపక్ష్యంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని చెబుతున్నారు. పరిశుద్ధాత్ముడు మనకోసం ఉచ్చరింపశక్యం కాని మూల్గులతో ప్రార్ధించటానికి రెండు కారణాలు ఉన్నాయి.

 

1). 26 లో చెప్పినట్లు ఎలా ప్రార్ధన చేయాలో మనకు తెలియదు కనుక మనకు సహాయం చేయడానికి మూల్గులతో కూడిన ప్రార్ధన మన పక్ష్యంగా చేస్తున్నాడు. మూల్గులు ఎప్పుడు వస్తాయికన్నీరు/దుఖం వచ్చినప్పుడు! మరి పరిశుద్దాత్ముడికి దుఖం ఎందుకు వస్తుంది? మన బ్రతుకులు లేక ఇరుగుపొరుగు వారు/ సంఘం బాగోలేనందువలన. మనకోసం మరియు ఇతరుల కోసం కన్నీటితో ప్రార్ధన చేస్తున్నాడు పరిశుద్దాత్ముడు!  ఈ కన్నీటి ప్రార్ధన ఎప్పుడు వస్తుంది? సామాన్యంగా ఏమైనా తీరని కష్టాలు, తీరని రోగం వస్తే ఎంత ప్రార్ధన, కన్నీటి ప్రార్ధన వస్తుందో మనకు తెలియదు. ఆ ప్రార్ధనలో గోల్డ్ మెడల్ కొట్టెయ్యగలరు. గాని ఆ రోగం/ కష్టం పొతే ప్రార్ధన అటకెక్కుతుంది- మొక్కుబడి ప్రార్ధనగా ఏవో రెండు ముక్కలు చేసి ముగించేస్తారు. గాని నిజంగా ఏవిధమైన కష్టనష్టాలు లేకపోయినా/ వ్యాదిబాధలు లేకపోయినా ఒక విశ్వాసికి ఎప్పుడు కన్నీరు వస్తుంది అంటే: ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసినప్పుడు!! మోకరిస్తే చాలుబోరుమని కన్నీళ్లు వచ్చేస్తాయి. భయంకరమైన దుఖం వచేస్తుంది. ఇప్పుడు నిన్ను ఎవడు కొట్టేడు, ఎవరు ఏమన్నారు? ఎందుకు అలా ఏడుస్తావే ఏడుపుగొట్టుదానా అంటాడు భర్త! గాని అతనికి తెలియదు ఆమె కావాలని ఏడవటం లేదు! అది పరిశుద్దాత్ముని కార్యం! ప్రజల పక్షంగా ఆమె ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రార్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేని సగం సచ్చిన విశ్వాసికి ఈ అనుభవం ఎప్పటికీ రాదు!

 

    మీకో విషయం గుర్తుచెయ్యనివ్వండి: దేవుడు సృష్టి తర్వాత ఏమిచేసినా సొంతంగా చేయలేదు. మానవుని సహకారంతో చేస్తున్నారు. దేవుడు చెయ్యగలరు. గాని చెయ్యరు! దేవునికోసం సంపూర్ణంగా సమర్పించుకున్న, దేవునికి తనకుతానుగా అర్పించుకున్న హృదయాలు కావాలి దేవునికి! వారిద్వారా దేవుడు మానవాతీత అద్భుతాలు చేస్తారు. బైబిల్ గ్రంధంలో అలాంటివారినే ఉపయోగించుకుని ఎన్నో అసాధారణమైన అద్భుతాలు చేసారు దేవుడు! ఇక్కడ కూడా పరిశుద్దాత్ముడు ప్రార్ధన చేయగలరుగాని తనకు పూర్తిగా సమర్పించుకున్న హృదయం కావాలి. అప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షంగా తానే ప్రార్ధన చేస్తాడు.

 

2. 27వ వచనం ప్రకారం ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో పరిశుద్దాత్ముడు ప్రార్ధించటానికి కారణం : పరిశుద్దాత్మునికి దేవుని యొక్క మనసు తెలుసు! కాబట్టి ఎప్పుడైతే మనిషి తననుతాను దేవునికి సమర్పించుకుంటాడో, ప్రార్ధనలో తన హృదయాన్ని కుమ్మరించడానికి పూనుకున్నాడో పరిశుద్దాత్ముడు వెంటనే ఆ వ్యక్తిని స్వాధీనం చేసుకుని, దేవుని యొక్క మనస్సును, పరిశుద్దాత్ముడు తెలుసుకుని, దేవుని మనస్సును తన మనస్సుగా చేసుకుంటాడు. వెంటనే ఆత్మపూర్ణుడైన విశ్వాసి ఆత్మయొక్క మనస్సుని తెలుసుకుని విజ్ఞాపనం చేయడం ప్రారంబిస్తాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఈ విశ్వాసికి సహాయం చేస్తాడు. ఈకారణాల వలన పరిశుద్దాత్ముడు తానే మనపక్ష్యంగా ఉచ్చరింపశక్యము కానీ మూల్గులతో ప్రార్ధన చేస్తాడు.

 

    ఈ సంధర్బంలో దైవజనుడు హిజ్కియా ఫ్రాన్సిస్ గారి సాక్ష్యం గుర్తుకువస్తుంది నాకు. ఆయన రక్షించబడిన మొదట్లో అనగా ఇంకా టీన్స్ లో ఉన్నప్పుడు ఆయన ఎంతో భారంతో కన్నీళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్దించేవారంట! ఇది చూసిన ఆయన తల్లిదండ్రులు దైవజనులు డి.జి.ఎస్. దినకరన్ అయ్యగారికి ఉత్తరం రాసారట. అయ్యా మా అబ్బాయి ప్రార్ధన చేస్తున్నాడు, బాగుంది గాని చాలా వెక్కిక్కి ఏడుస్తున్నాడు. అలా ఏడవడం మానేసి ప్రార్ధన చెయ్యమని చెప్పండి అని రాసారట! వెంటనే దినకరన్ అయ్యగారు హిజ్కియా ఫ్రాన్సిస్ గారికి ఉత్తరం రాసారట, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? మీ తల్లిదండ్రులు ఇలా అంటున్నారు అని! దానికి ఆయన జవాబు: అంకుల్ నేను ఏడుస్తూ ప్రార్దిస్తున్నది నాకోసం కాదు. నాకు యేసయ్య అంటే చచ్చేంత ఇష్టం! ఆయన సిలువయాగం గుర్తుకు వస్తే నాకు ఏడుపు ఆగదు! నాకు అదిమాత్రం గుర్తుంటుంది. తర్వాత ఎందుకు ఏడుస్తానో ఎలా ఏడుస్తానో, ఎంతసేపు ఏడుస్తానో నాకే తెలియదు. బోజనమైనా మానేస్తాను గాని ఈ కన్నీటితో ప్రార్ధించడం మాత్రం నేను మానలేను అని రిప్లై ఇచ్చారంట! అది ప్రార్ధనా జీవితం! ఒకసారి దేవుని హస్తాలలోనికి/ పరిశుద్దాత్ముని హస్తాలలోనికి ప్రార్ధనలో వెళ్ళిన నీవు ఆయనకు సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఉపయోగించుకుని సంఘక్షేమం కోసం, ఇరుగుపొరుగు వారి రక్షణ కోసం, నీ సంఘకాపరికోసం ప్రజలకోసం ప్రార్ధన చేస్తాడు. ఈ క్రమంలో నీవు ఎట్టి పరిస్తితిలోనూ టైం చూసుకోకూడదు! ప్రార్ధన మొదలుపెట్టడం నీవంతు! ముగించడం, ఎలా ప్రార్ధన చేయాలో చేయడం ఆయన వంతు!

 

              బైబిల్ గ్రంధం ప్రకారం ఇద్దరే ఇద్దరు విశ్వాసుల పక్షంగా ప్రార్ధనావిజ్ఞాపనలు చేస్తున్నారు.  ఒకరు పరిశుద్ధాత్ముడు! 26,27 వచనాలు. మరొకరు యేసుక్రీస్తుప్రభులవారు! 4వచనం. ఈ ఇద్దరి ప్రార్ధనలు వినే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ప్రార్ధనలు విని మనకు సహాయం చేస్తారు. కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ దేవుని సంకల్పం చొప్పుననే ప్రార్ధన చేస్తుంటారు. దేనికోసం ? విశ్వాసుల బలహీనతలో సహాయం చేసేందుకు! లోకాన్ని, శరీరాన్ని , సైతానుని జయించడానికి కావలసిన శక్తిని మనిషికి కలగాలని వీరు ఎప్పుడూ ప్రార్ధన చేస్తుంటారు. ఈ విధంగా త్రిత్వమై యున్న దేవుడు మనిషికి ఎప్పుడూ సహాయం చేస్తున్నారు.

 

   ప్రియ చదువరీ! నీకు అలంటి ప్రార్ధన జీవితం ఉందా లేక పైపైన పెదాలతో రెండు ముక్కలు చేసి ఆమెన్ అంటున్నావా? ఆ భక్తులు అలా ప్రార్ధనచేశారు కాబట్టే దేవుడు ఆ భక్తులను అంతగొప్పగా వాడుకుంటున్నారు, వాడుకుంటారు. నీవునేను చేయడం లేదు కాబట్టే మనమింకా ఇలాగే ఉన్నాం!

మరి నేడైనా అలా ప్రార్ధించడానికి ఇష్టపడతావా?

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*34వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-7*

 

1 పేతురు 1:17--20

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17వ వచనం ప్రకారం దేవుడు పక్షపాతం లేకుండా తీర్పుతీర్చేవాడు కనుక మీరు అనగా చిన్న ఆసియాలో ఉన్న విశ్వాసులు దేవున్ని తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు! అలాగే మనము కూడా దేవునికి అబ్బా తండ్రీ అని ప్రార్థన చేయాలి!

ఇంకా మీరు పరదేశులై ఉన్నంతకాలము దేవునిపట్ల భయము కలిగి ఉండాలి!

 

ఇక 18-20 వచనాలు ప్రకారం వెండిబంగారు వంటి వస్తువుల ద్వారా మీరు విమోచించబడక క్రీస్తు అమూల్యమైన రక్తముచేత విమోచించ బడ్డారు కనుక దేవునియందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నారు!

 

               (గతభాగం తరువాయి)

 

సరే, 17వ వచనం ప్రకారం దేవునికి పక్షపాతం లేదు కాబట్టి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయాలి!

ఇంకా మీరు పరదేశులై ఉన్నంతకాలము దేవునిపట్ల భయము కలిగి ఉండాలి!

 

దేవునిపట్ల భయము కలిగిఉండాలి!

పౌలుగారు కూడా అంటున్నారు

2 కొరింథీ 5:11

11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.

 

మేము ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము అంటున్నారు! మొదట పౌలుగారికి దేవుడు అంటే భయము ఉంది ఇంకా చెప్పాలంటే పౌలుగారి భక్తి దేవుని  భయముతో నిండి ఉంది! నేటిరోజులలో అనేకులకు దేవుడు అంటే భక్తి ఉంది గాని భయములేకుండా పోయింది! నిజానికి దేవుడంటే భయము ఉంటే నోటితో అబద్దాలు పలకము, వ్యభిచారం చేయము, మత్తు పానీయాలు త్రాగరు, ఇంకా చెప్పాలంటే దేవుని మందిరానికి భయంకరమైన వస్త్రధారణతో రారు, మందిరానికి వచ్చి వాక్యము జరుగుతుంటే వీరితోనూ వారితోనూ మాట్లాడటం చేయరు, వాక్యం జరుగుతా ఉంతే  సెల్ ఫోన్లో ఏ మెసేజ్ వచ్చింది అని చూడరు, కాళ్లుచాపుకుని కూర్చోరు ! ఎంతో భయ భక్తులు కలిగి వణుకుతూ ఉంటారు ఆయన మందిరంలో! భయము లేనందువలనే నీవు అలా జీవిస్తున్నావు! నిజంగా ఆయన ఎవరో గుర్తెరిగితే నీ ప్రవర్తన అలా గుండదు ఎప్పటికీ!!!

 

ప్రభువుపట్ల భయం కోసం పౌలుగారు అంటున్నారు: రోమీయులకు 3:18

వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

 

దావీదు గారు అంటున్నారు: కీర్తనల గ్రంథము  36:1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.

 

 ఆదికాండము 20:11లో అబ్రాహాము గారు అంటున్నారు: అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. ;

 

అందుకే దావీదు గారు  కీర్తనల గ్రంథము 34:11-14లో అంటున్నారు: కీర్తనల గ్రంథము  34

11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?

14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.

 

పేతురు గారు అంటున్నారు: 1 పేతురు  3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

 

కీర్తనల గ్రంథము  111:10. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు  1

7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

 

దేవుని గూర్చిన భయము ఉన్నప్పుడే రాబోయే తీర్పును గురించిన ఆలోచనలు దీన్ని అతనికి గుర్తు చేస్తాయి! పౌలుగారి  పరిచర్యకు ఇది శక్తివంతమైన ఒక ప్రేరణ.

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా! మనము కూడా ఇలాంటి దేవుని పట్ల భయము కలిగిన భక్తితో దేవుని ముందర బ్రతుకుదాము!

 

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*35వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-8*

 

1 పేతురు 1:17--20

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17వ వచనం ప్రకారం దేవుడు పక్షపాతం లేకుండా తీర్పుతీర్చేవాడు కనుక మీరు అనగా చిన్న ఆసియాలో ఉన్న విశ్వాసులు దేవున్ని తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు! అలాగే మనము కూడా దేవునికి అబ్బా తండ్రీ అని ప్రార్థన చేయాలి!

ఇంకా మీరు పరదేశులై ఉన్నంతకాలము దేవునిపట్ల భయము కలిగి ఉండాలి!

 

ఇక 18-20 వచనాలు ప్రకారం వెండిబంగారు వంటి వస్తువుల ద్వారా మీరు విమోచించబడక క్రీస్తు అమూల్యమైన రక్తముచేత విమోచించ బడ్డారు కనుక దేవునియందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నారు!

 

               (గతభాగం తరువాయి)

 

ఇక విశ్వాసికి ఉండవలసిన తరువాత లక్షణం: 18-20 వచనాలు ప్రకారం వెండిబంగారు వంటి వస్తువుల ద్వారా మీరు విమోచించబడక క్రీస్తు అమూల్యమైన రక్తముచేత విమోచించ బడ్డారు కనుక దేవునియందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నారు!

నిరీక్షణ కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము గనుక ఈ రోజు విశ్వాసం కోసం చూసుకుందాం!

 

గలతీ 5:2223

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

♻  ఆత్మ ఫలము లోని  ఏడవ అంశము: *విశ్వాసము* :

 

🔺 విశ్వాసము అంటే?

*నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు*.

                     హెబ్రీ 11:1

 

🔺 *విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది*.

1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.

2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.

 

🔺 *విశ్వాసం అంటే*?

చీకటిలోనికి దూకడం కాదు.

* గాలిలో మేడలు కట్టడం కాదు.

* దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.

* నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.

* దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.

* పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.

 

నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసములోనికి నడిపించగలగాలి.

ఒకవేళ పాస్ పోర్ట్, విసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్లిపోగలవేమో గాని, యేసు క్రీస్తు లేకుండా, నిత్యరాజ్యం చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు.

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6)

నిత్యజీవాన్ని నీవు చేరాలంటే? దాని 'మార్గమైన' యేసు ప్రభువును నీవు చేరాలి. 'విశ్వాసమే' నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు.

 

🔺 1. 'విశ్వాసమే' రక్షణకు మార్గము.

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. (ఎఫెస్సి 2:8)

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. (మార్కు 16:16)

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. (రోమా 10:9)

 

🔺 2. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే ఆయన పిల్లలు.

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను 1:12)

 

🔺 3. ఎవరయితే ఆయనను నిజముగా యధార్థంగా పరిపూర్ణంగా విశ్వసిస్తారో? వారు మాత్రమే ఎత్తబడే సంఘములో వుంటారు.

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును. (యోహాను 6:47)

 

🔺 4. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు తీర్పులోనికి రారు.

ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. (యోహాను 3:36)

 

🔺 5. ఎవరయితే ఆయనను విశ్వసిస్తారో? వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.  (యోహాను 3:16)

 

దేవుని రాకడ సమీపం కానుంది. అబద్దబోధకులు యేసు క్రీస్తు దేవుడు కాదని అసత్య ప్రకటనలు ముమ్మరం  చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంధము 'సాతాను సమాజము' అని పిలుస్తుంది.

 

🔺 అయితే ఒక్క విషయం ఆలోచించు!!!

* యేసు క్రీస్తును దేవునినిగాఅంగీకరించనివారు, విశ్వసించనివారు ఎట్లా రక్షించ బడతారు?

* ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు?

* ఎట్లా ఎత్తబడే సంఘములో వుంటారు?

* ఎట్లా తీర్పు నుండి తప్పించ బడతారు?

* ఎట్లా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు?

 

సాధ్యం కానేకాదు. నిత్య మరణమే వారి గమ్యం.

 

వద్దు!

విశ్వసిద్దాంఆత్మఫలము ఫలిద్దాం!

 

ఆ విశ్వాసము కలిగి విశ్వాసవీరులు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనము కూడా చేద్దాం!

అదే విశ్వాసంతో అబ్రాహాము గారు తన కుమారుడైన ఇస్సాకును మరలా పొందుకోగలిగారు,

అదే విశ్వాసముతో మోషేగారు ఐగుప్తులో, కనాను మార్గములో ఎన్నో అసాధారణ అద్భుతాలు జరిగించారు!

అదే విశ్వాసముతో సూర్యచంద్రులను ఆపారు యెహోషువా!

అదే విశ్వాసముతో గొల్యాతును ఒక్క దెబ్బతో చంపారు దావీదు గారు!

ఇంకా ఈ విశ్వాస వీరులు చేసిన గొప్పగొప్ప కార్యాలు మనం హెబ్రీ 11లో చూడగలం!

ఆ విశ్వాసవీరులకు కలిగినటువంటి విశ్వాసము మనకు కూడా కావాలి!

ఆ విశ్వాసం పొందుకుందాం!

ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం!

 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*36వ భాగము*

 

1 పేతురు 1:17--20

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఈ మూడు వచనాలను క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం!

పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

దేవుడు పక్షపాతి కాడు! అందరినీ ఒకేలా చూసే దేవుడు!

ఎఫెసీయులకు 6:9

యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

 

2దినవృత్తాంతములు 19:7

యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

 

అపో.కార్యములు 10:34

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.

అపో.కార్యములు 10:35

ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

కాబట్టి ఆయన అందరినీ ఒకేలా చూసే దేవుడు!!

 

 

ఇక తండ్రి అని మొర్రపెట్టడం కోసం చూసుకుంటే:

తండ్రి దేవుణ్ణి గురించి యేసుక్రీస్తు ప్రభులవారు ఉపయోగించిన పేర్లలో ఈ పేరును ఎక్కువ సార్లు, అంటే దాదాపు 170 సార్లు ఉపయోగించాడు. క్రొత్త నిబంధన అంతట్లో ఈ పేరు 350 కంటే ఎక్కువ సార్లు ఉంది. దేవుడు ఎంతో శ్రద్ధ, ప్రేమ కలిగి, నిజమైన మంచి తండ్రిలాగా తన పిల్లల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్న వ్యక్తి అని దీని అర్థం. ఆయనకు ఆధ్యాత్మికంగా పిల్లలు ఉన్నారని కూడా ఈ పేరు సూచిస్తున్నది ( 9; యోహాను 1:12-13). మనం మంచి పనులు చేయవలసినది మనుషులు ఆయనను స్తుతించాలని గాని మనకు మెప్పు కలగాలని కాదు

 

మత్తయి 5:16

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

 

రోమీయులకు 8:14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

రోమీయులకు 8:15

ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.

రోమీయులకు 8:16

మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

రోమీయులకు 8:17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

రోమీయులకు 8:26

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 

ఇక పరదేశులుగా ఉన్నంతకాలం భయంతో గడపండి అంటున్నారు. భయం కోసం, పరదేశులు కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!

భయము భక్తి కోసం ఈ రిఫరెన్స్ లు చూడండి ఆది 20:11; యోబు 28:28; కీర్తన 34:11-14; 90:7-11; 111:10; సామెత 1:7

 

ఇక తరువాత వచనం: పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

అవును మనం మామూలుగా విమోచించ బడలేదు. కోడెల రక్తము గొర్రెలు రక్తము చేత గాని బంగారం వెండి లాంటి ఘనమైన వాటితో కాక క్రీస్తు యేసు అమూల్యమైన రక్తముచేత విమోచన పొందాము.

 

కొలస్సీయులకు 2: 13

మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా,

14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,

 

    ప్రియులారా! ఈ వచనాలలో

 

 a) మనము ఏ కారణాల వలన మృతులమో;

 

b) ఆ శిక్షను యేసయ్య ఏ రకంగా తప్పించారో చాలా వివరంగా వ్రాయబడింది!

 

1). మనము ఏ కారణాల వలన మృతులము??!!

a). అపరాధముల వలన. . .: ప్రియులారా! గతంలో చెప్పిన విధముగా లేఖనాలను లేఖనాలతోనే పరిశీలించాలి. అప్పుడే అది సరియైనది. ఒక వచనానికి supporting verse కనీసం మరొకటి ఉండాలి మనకు. ఇక్కడ ఈ వచనంలో మన అపరాధముల వలన మనము మృతులము అని వ్రాయబడింది. supporting reference ఎఫెసీ 2:1 & 4.

1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

4. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను. . . . .

 

ఇంకా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడింది. అపరాధము ద్వారా ఇంకా పాపముద్వారాను 3:4 అందుకే పెనాల్టీ కడతాము. అయితే పాపమునకు వచ్చు జీతం మరణం.

రోమా 6:23. కాబట్టి పాపము చేసినందువలన మనం చావ వలసినదే! అంటే మనమందరమూ మృతులమే!!

 

b) శరీరమందు సున్నతి పొందకయుండుట బట్టి మృతులము!!: గతంలో చెప్పిన విధముగా ఆదికాండము 17వ అధ్యాయములో దేవుడు అబ్రాహాము గారి ద్వారా ఇశ్రాయేలీయులను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేయుటకు గాను, వారికి సున్నతి అనే ప్రక్రియ చేయాలి అని ఆజ్న ఇచ్చారు. అక్షరార్ధమైన, శారీరిక సున్నతిద్వారా ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధనలోనికి వెళ్ళారు. అయితే అన్యజనాంగమునుండి రక్షణ పొందిన మనకు అటువంటి కట్టుబాట్లు లేవు! కాబట్టి మనమందరమూ ధర్మశాస్త్రమును బట్టి మృతులము. అంతేకాకుండా మనం సున్నతి కూడా పొందలేదు.

 

   ఒక రాజు శాసనం చేస్తే, దానిని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ అదే రాజు దానిని మారిస్తే పిచ్చి తుగ్లక్ అంటారు. ఆలోచన లేని బలహీనమైన రాజు అంటారు. అలాంటిది దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు చేసిన శాసనాన్ని మార్చడం ఎలా??? అందుకే ఇది మానవులకు సాధ్యం కాదు కాబట్టి- ఆ దేవాదిదేవుడే ప్రణాళిక చేసి- ఆయనే దీనుడై- కుమారునిగా శరీరరీతిగా భూలోకానికి వచ్చి- ఆ రాతను, శాసనాన్ని గౌరవిస్తూ- ఆ పెనాల్టీ (Penalty) తానే తన స్వరక్తముతో కట్టి- ఆ రాతను చెరిపివేశారు.

 

14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,  . . . .

 

    ** దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలనఅనగా ధర్మశాస్త్రము వలన కారణం ధర్మశాస్త్రం ఏ తప్పిదానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తమేమిటో వ్రాయబడి యుంది.- ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మనము పాపులము, చావుకు లోనైన వారము.

 

** మనకు విరోధముగాను, ఋణముగాను ఉన్న పత్రమును ధర్మశాస్త్రము వలన నిర్ధారించబడిన మన పాపము- పాపమునకు శిక్ష- Death Penalty/ Death sentense or Judgement ను

 

** మేకులతో కొట్టిమనస్థానంలో ఆయన ఉండి- మన చేతులతో మనం చేసిన పాపమునకు ఆయన చేతులలో మేకులు కొట్టించుకొన్నారు, నడకలతో చేసిన పాపాలకు కాళ్ళలో మేకులు కొట్టారు, తలంపులతో చేసిన పాపాలకు తలమీద ముళ్ళ కిరీటం ధరించారు. శరీరంతో చేసిన పాపాలకు కొరడా దెబ్బలు తిన్నారు. ఈ రకంగా మనమీద పడవలసిన శిక్షను ఆయనే భరించి, మనమీద నున్న judgement పూర్తిచేసి- ఇక ఆ శాసనాన్ని సిలువకు కొట్టి-

 

** దాని చేవ్రాతను చెరిపివేసి Once the Penalty paid, it’s over. అంతేకాకుండా చేసిన నేరానికి/ పాపానికి already శిక్ష అనుభవించారు కాబట్టి ఇక ఆ శాసనానికి విలువ లేదు. అందుకే దాని చేవ్రాతను తుడిచివేశారు.

 

** మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిధర్మశాస్త్రము వలన పడిన శిక్షను ఆయన కేన్సిల్ చేసేశారు.

 

** అపరాధములను క్షమించిమన శిక్షను తానే భరించారు కారణం అది ఆయన మనపై చూపించిన ప్రేమ- అందుకే శిక్షను తానే భరించి, మన అపరాధములను జాలితో క్షమించారు.

 

** ఆయనతోపాటు జీవింపజేసెను.అనగా మొదట ఆయనతో పాటు మనం చనిపోయాముఆయన మృత్యుంజయుడు / పునరుత్థానుడు కాబట్టి ఆయనతోపాటు మనలని కూడా తనతోపాటు జీవింపజేశారు.

 

   ఇదీ రక్షణ కార్యము! ఈ రక్షణ మనకు ఉచితముగా రాలేదు. ఆయన గొప్ప వెల చెల్లించారు. ప్రియ చదువరీ! ఇంత అమూల్యమైన రక్షణ కార్యాన్ని చేసారు కదా దేవుడు, మరి ఆయనకోసం నీవు నీ ప్రాచీన పాత రోత జీవితాన్ని విడచిపెట్టలేవా?? ఆయనకోసం సాక్షిగా జీవించలేవా??

 

  ఇంతగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందువు??? హెబ్రీ 2:3

 

కాబట్టి మన పాత అలవాట్లు / ప్రాచీన స్వభావము వదలివేసి ఆయనకోసం సాక్షిగా జీవిద్దాం! ఇదిగో ఇదే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*37వ భాగము*

 

1 పేతురు 1:17--20

17. పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

20. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

                  (గతభాగం తరువాయి)

 

ఇక నిర్ధోషమును నిష్కళంక మైన రక్తం కోసం చూసుకుంటే:

1పేతురు 2:22

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

 

హెబ్రీయులకు 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

 

హెబ్రీయులకు 7:26

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (లేక, తగినవాడు)

 

నిర్గమకాండము 12:6

నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.

 

లేవీయకాండము 1:3

అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన యెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.

 

యేసుక్రీస్తు రక్తాన్ని చిందించడం జరగకపోతే ఎవరికీ ఎప్పుడూ పాపవిముక్తి అనేది లేదు.

హెబ్రీయులకు 9:22

మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.

అయితే ఆయన చిందించినది పవిత్ర మైన నిర్ధిష్టమైన పరిశుద్ధ రక్తము!

 

ఇక గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము:

యోహాను 1:29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

యోహాను 1:36

అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.

 

ఇక తర్వాత వచనంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి.

ఈ రక్షణ ప్రణాళిక భూమి! లోకపు పునాది వేయబడకముందే చేయబడింది అంటున్నారు!

దేవుడు లోకాన్ని చేయక మునుపు, మానవాళి పాపంలో పడక మునుపు మానవుడి రక్షణార్థం దేవుడొక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు కేంద్రం క్రీస్తే.

ఎఫెసీయులకు 1:4

ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

ఎఫెసీయులకు 1:5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

ఎఫెసీయులకు 1:6

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

 

అపో.కార్యములు 2:23

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత (లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.

జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమించబడ్డాడు గాని ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షం అయ్యాడు. ఇక్కడ మీకోసం అనగా మనకోసం అని అర్థం!

కాబట్టి మన విశ్వాసము నిరీక్షణ క్రీస్తు మీదనే ఉంచాలి అంటున్నారు పౌలుగారు!!

యోహాను 3:18

ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.

 

యోహాను 6:41

కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

 

అపో.కార్యములు 10:43

ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

 

రోమీయులకు 10:11

ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

 

ఎఫెసీయులకు 6:10

తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*38వ భాగము*

1 పేతురు 1:21--25

21. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

                  (గతభాగం తరువాయి)

 

ఇక 21,22 వచనాలలో అంటున్నారు: 21. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

 

ప్రియులారా ఈ అధ్యాయంలో రెండు ప్రత్యేకమైన విషయాలు కనిపిస్తాయి!

మొదటిది వెండిబంగారు వంటి వెలగల వస్తువుల చేత కాకుండా అమూల్యమైన నిర్ధోషమును నిష్కళంకమైన రక్తము చేత విమోచించబడ్డారు.

 

ఇక రెండవది: మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు అంటున్నారు!

క్షయ బీజము అనగా నశించుపోయే విత్తనము. అక్షయ బీజము అనగా ఎల్లపుడూ స్థిరంగా జీవంగా ఉండే విత్తనము!

ఈ అక్షయమైన విత్తనము ద్వారా నిత్యమూ శాశ్వతజీవముగల విత్తనం ద్వారా నూతన జీవనం పొందారు అంటున్నారు!

ఆ అక్షయమైన విత్తనం దేవుని వాక్యము! అది వాడిపోని విత్తనం. హృదయంలో ఆ విత్తనం మొలకెత్తడం ద్వారా కొత్త జన్మ కలుగుతుంది!

యోహాను 1:13

వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

యాకోబు 1:18

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

ఇక 22వ వచనం మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి. అంటున్నారు!

మీరు సత్యమునకు విధేయులగుట ద్వారా మీ మనస్సులను పవిత్రపరచుకొన్నవారై ... అంటున్నారు!

ప్రియులారా నిజానికి ఈ వచనం తెలుగులో తప్పుగా తర్జుమా చేయబడింది!

ఇంగ్లీషు లోను ప్రాచీన ప్రతులలోను *దేవుని ఆత్మ ద్వారా* సత్యానికి విధేయులగుట చేత మనస్సులను పవిత్రపరచుకొన్నారు అంటున్నారు!

మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడంచేత మీ హృదయాలను మీరు పవిత్రంగా చేసుకొన్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా, శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి.

 

1పేతురు 1:22

మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

Seeing ye have purified your souls in obeying the truth *through the Spirit* unto unfeigned love of the brethren, see that ye love one another with a pure heart fervently:

 

చూశారా తెలుగు తర్జుమా లో దేవుని ఆత్మ అనే పదం ఎగిరిపోయింది.

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే దేవుని ఆత్మ ద్వారా మనము సత్యమునకు విధేయత చూపిస్తే మన మనస్సులు హృదయము పవిత్ర పరచబడుతుంది!!!

అలా పవిత్ర పరచుకోవడం వలన మీకు తద్వారా  నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా, శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి అంటున్నారు!!

ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజంనుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కానిదాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు అంటున్నారు!

కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా సత్యానికి విధేయత చూపించాక మన మనస్సులను పరిశుద్ధ పరచుకున్నాక సహోదర ప్రేమను చూపించాలి!

ముందు సత్యము అనగా చూసుకుందాం!

యోహాను 1:17

ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

 

యోహాను 5:33

మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.

 

యోహాను 8:31

కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

యోహాను 8:32

అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

 

యోహాను 14:6

యేసు నేనే మార్గమును, *సత్యమును*, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

 

అసలు సత్యము అనగా యోహాను 17:17

సత్యమందు ( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; *నీ వాక్యమే సత్యము.*

 

యోహాను 1:1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1:2

ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,

 

యోహాను 18:37

అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.

యోహాను 18:38

అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

 

కాబట్టి సత్యము అనగా వాక్యమై యున్న యేసుక్రీస్తు ప్రభులవారు!!!

 

 కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా సత్యానికి విధేయత చూపించాక మన మనస్సులను పరిశుద్ధ పరచుకున్నాక సహోదర ప్రేమను చూపించాలి!

 

అయితే పేతురు భక్తుడు ఒక చైన్ రియాక్షన్ కోసం చెబుతున్నారు!

2 పేతురు 1:58

5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,

6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,

7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.

8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.

9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.

 

చూడండి విశ్వాసమునందు సద్గుణం ఇమిడి ఉంది. సద్గుణంనందు జ్ఞానము ఇమిడి ఉంది.   జ్ఞానమునందు ఆశానిగ్రహము ఇమిడి ఉందిఆశానిగ్రహమునందు సహనము ఇమిడి ఉందిసహనము నందు భక్తి ఇమిడి ఉంది.    భక్తియందు సహోదరప్రేమ ఇమిడి ఉంది.    సహోదర ప్రేమయందు దయ ఇమిడి ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి! ఒకటి వస్తే దానికి అనువైనది తోటిది వచ్చేస్తుంది! అనగా నీ మంచి గుణం ఉంటే ఆటోమేటిక్ గా  జ్ఞానము వచ్చేస్తుంది. భక్తి ఉంటే సహోదర ప్రేమ వచ్చేస్తుంది! అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే నీవు మొదలుపెట్టవలసింది విశ్వాసముతో మొదలుపెడితే దయ సహోదర ప్రేమ వచ్చేస్తాయి!

 

అయితే ఆ క్రిందన ఎందుకు ఇవి కావాలో అనేది చెబుతున్నారు! ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవ జ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును. ఒకవేళ మీకు లేకపోతే  వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేని వాడునగును.

 

కాబట్టి ఈ చైన్ ఆఫ్ కమాండ్ ని అందరూ పొందుకోవాలి! అదేవిధంగా మనము గతభాగాలలో చెప్పిన ఇరుకు ఇబ్బందులు అన్నీ ఓర్చుకుంటే మనకు ఇక్కడ మరోరకమైన చైన్ ఆఫ్ యాక్షన్స్ సమృద్ధిగా కలుగుతాయి! అవి మిగుల ఓర్పుగలవారమై,

 

6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను

7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,

 

 అనగా మిగుల ఓర్పు ఉంటే పవిత్రత వస్తుంది, పవిత్రత వస్తే జ్నానము వస్తుంది జ్నానము కలిగాక ధీర్ఘ శాంతం వస్తుంది, ధీర్ఘ శాంతం వస్తే దయ కలుగుతుంది, దయకూడ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వలన నిశ్కపటమైన ప్రేమ కలుగుతుంది. దేవుని బలము వలన కుడి ఎడమలు ఏవో తెలుసుకునే నీతి ఆయుధాలు వస్తాయి! నీతి ఆయుధాలు ఏమిటి? ఎఫెసీ  6లో చెప్పిన ఆయుధాలు అన్ని వస్తాయి!!

 

కాబట్టి మనము పరిశుద్ధాత్మ ద్వారా సత్యానికి విధేయత చూపించాక మన మనస్సులను పరిశుద్ధ పరచుకున్నాక సహోదర ప్రేమను చూపించాలి!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*39వ భాగము*

*విశ్వాసి లక్షణాలు-9*

 

1 పేతురు 1:21--25

21. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

                  (గతభాగం తరువాయి)

 

ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణము: ప్రేమ / సహోదర ప్రేమ!!

 

గలతీ 5:2223

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

 

 ఆత్మఫలములో మొదటిది శ్రేష్టమైనది  *ప్రేమ*

 

కొలస్సీయులకు 3: 14

వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.

 

ప్రియులారా! ఈ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ పోతే ఏమీ అర్ధం కాదు మనకు. దానిని జాగ్రత్తగా ప్రార్ధనపూర్వకముగా చదివితే అర్ధం అవుతాయి మనకు పౌలుగారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు మనకోసం వ్రాయించారో అర్ధం అవుతుంది. ఈ వచనంలో అంటున్నారు పౌలుగారుపరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ ఆయన వీటన్నికన్నా ప్రేమను ధరించుకొనుడి అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటున్నారు. దీని అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటేప్రేమకుపరిపూర్ణతకు సంబంధం ఉంది.

 

పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే పరిచర్య చేయాలి అది fivefold ministry గాని, tenfold ministry అయినా సరే! ఈ సంపూర్ణులు పరిపూర్ణులు కావాలి అంటేప్రేమను ధరించుకోవాలి!!! ఒక వ్యక్తికి ఎన్ని ఫలాలు, శక్తులు, టాలెంట్లు ఉన్నా ప్రేమలేకపోతే పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు అంటున్నారు

1 కొరింథీ 13:1-3 లో

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.  . ..

*కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు వేస్ట్ ఫెల్లో!*

 

     ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు! అందుకే ఆయన మనలను రక్షించడానికి మానవరూపం దాల్చి, పరమును విడచి, భువికి వచ్చారు. Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో కదా!

 

  ఇక ప్రేమకోసం బైబిల్ ఎక్కువగా రాసినవారు మొదటగా పౌలుగారు, రెండవదిగా యోహానుగారు! ప్రేమకోసం రాయడానికి కారణం విశ్వాసుల మధ్య ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదుప్రేమలేకపోతే మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన ఆశలు, తగాదాలు, కొట్లాటలు, చీలికలు ఉంటాయి. ప్రేమలేకపోతే శరీర కార్యాలు అన్నీ పనిచేస్తాయి!

 

 అందుకే సామెతలు 10:12 లో ప్రేమ దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది , ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది అంటున్నారుదేవుడు మనపట్ల చూపేది ఆగాపే ప్రేమ! అది అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన యిర్మియా 31:3 లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!

అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి అనేది దేవుని ఆశ! అయితే ఈ ప్రేమ చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలాఅక్రమము విస్తరించినందువలన అనేకుల ప్రేమ చల్లారును! మత్తయి 24:12;

 

   యోహాను 17:26 జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు యేసుప్రభులవారియందు  ఏ విధమైన ప్రేమను ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు ఉండేలా తండ్రిని వేడుకున్నారు

పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:

రోమా 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

. . .  దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా!

కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు! మరి ఈ ప్రేమ మనలో ఎలా ఉండాలి?

 

*** నిష్కపటమైనదిగా ఉండాలిరోమా 12:9;

*** చెడును అసహ్యించుకొనాలిరోమా 12:9;

*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;

*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;

*** క్షేమాభివృద్ధి కలుగజేసేది.  1 కొరింథీ 8:1;

 

ఇంకా Romans(రోమీయులకు) 13:8,9,10

8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

* ప్రేమ దీర్ఘకాలము సహించును,

* దయ చూపించును.

* ప్రేమ మత్సరపడదు;

* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;

* అది ఉప్పొంగదు;

* అమర్యాదగా నడువదు;

* స్వప్రయో జనమును విచారించుకొనదు;

* త్వరగా కోపపడదు;

* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

* దుర్నీతివిషయమై సంతోషపడక

* సత్యమునందు సంతోషించును.

* అన్ని టికి తాళుకొనును,

* అన్నిటిని నమ్మును;

* అన్నిటిని నిరీక్షించును;

* అన్నిటిని ఓర్చును.

* ప్రేమ శాశ్వతకాలముండును. 

 

👉 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

            1కొరింది 13:4-8,13

అందుకే 1 కొరింథీ 14:1 లో

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి(మూలభాషలో-ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 . .

గలతీ 5:6 ప్రకారం విశ్వాస కార్యసాధకం కావాలి అంటే ప్రేమ తప్పకుండా కావాలి!

 

గలతీ 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

ఫిలిప్పీ 1:9

మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ...

 

అందుకే హెబ్రీ 10:25 లో

ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము  అంటున్నారు.

 

పేతురుగారు ప్రేమ కోసం ఏమ్మన్నారు ఈ వచనాలలో ఉన్నాయి  1పేతురు 1: 21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,. . .,

ఇంకా రిఫరెన్సులు 3:8, 4:8;

యోహాను గారు చెప్పినది చూద్దాం. 1 యోహాను 2:5

ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

మరిన్ని రిఫరెన్సులు 3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను 1:6

 

కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా, చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

అట్టి ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*40వ భాగము*

1 పేతురు 1:21--25

21. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

22. మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్ర పరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయ పూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.

23. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

                  (గతభాగం తరువాయి)

 

ఇక చివరి మూడు వచనాలు చూసుకుంటే ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;

24. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.

25. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

ఇక్కడ ఏలయనగా అంటూ మొదలుపెట్టారు. మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజము అనగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభులవారి వలన నూతన జన్మపొందారు. ఆయన ఆత్మ ద్వారా  మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకున్నారు గనుక మీరు మిక్కుటమైన సహోదర ప్రేమ కలిగి జీవించండి అని చెబుతూ.... ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై యున్నారు. వారి అందమంతా గడ్డిపువ్వులా ఉంది. ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు వాలిపోతుందో తెలియదు. అలాగే మీ జీవితాలు కూడా ఎప్పుడు రాలిపోతాయో తెలియదు గనుక కక్షలు కార్పణ్యాలు గొడవలు ఈర్ష్య లు వదిలేసి సహోదర ప్రేమ కలిగి , తోటి మనుష్యులు పట్ల ప్రేమ కలిగి జీవించండి అని సంఘమునకు హితవు చెబుతున్నారు పేతురు గారు!!

యోహాను గారు ఇంకా రెండు అడుగులు ముందుకేసి ఎందుకంటే దేవుడే ప్రేమ! ప్రేమే దేవుడు! దేవుడు ప్రేమయై యున్నాడు. దేవుడు ప్రేమా స్వరూపి అంటున్నారు! కాబట్టి ఈ సహోదర ప్రేమ, తోటి మానవుల ఎడల ప్రేమ జాలిగలవాడు దేవున్ని కలవాడు అని తెగించి చెబుతున్నారు!!!

 

1యోహాను 4:7

ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

 

1యోహాను 4:8

దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయై యున్నాడు),  ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

 

1యోహాను 4:16

మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు (దేవుడు ప్రేమయై యున్నాడు), ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.

 

మరి నేటిరోజుల్లో మన సంఘాలు ఎలా ఉన్నాయి? ఎక్కడా ప్రేమ కానరావడం లేదు! అధికారం కోసం పోటీలు, ఒకరిమధ్య ఒకరికి ఈర్ష్యలు, అమర్యాద! ఇవన్నీ ప్రేమలేకపోవడం బట్టి, సాతానుగాడి లక్షణాలు వచ్చేశాయి సంఘంలో! దేవుడు ప్రేమయై ఉన్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు ప్రేమలేక సంఘంలో సాతానుగాడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి వీటిని విసర్జించి, ప్రేమ లక్షణాలు సంఘము కలిగి ఉండాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు. కాబట్టి ప్రియ సంఘపెద్దా! విశ్వాసి! సేవకుడా! ఒకవేళ నీకు సాతానుగాడి లక్షణాలుంటే ఇప్పుడే దేవుని యెద్ద క్షమాపణ అడిగి, పశ్చాత్తాపపడి నీ పాపాలు కడిగివేసుకో! నీకు కలిగిన అధికారం అది దేవుని వలన కలిగింది కాబట్టి, ఆ అధికారం దైవరాజ్య వ్యాప్తికోసం, సంఘ క్షేమాభివృద్ది కోసం, సంఘ శ్రేయస్సు కోసం  ఉపయోగించాలే తప్ప, నీ పేరు ప్రతిష్టల కోసం ఎంతమాత్రము కాదని గ్రహించు! కాబట్టి ప్రేమ కలిగి సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధికోసం పాటుపడు!

వారు ఏ కులస్తులైనా, వారి ఆర్ధిక స్తితి ఎటువంటిదైనా సరే, అందరితోనూ ఒకే రకంగా వ్యవహరించు!

అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటారు!

 

ఇక మనిషి జీవితం గడ్డి లాంటిది. అయితే దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే. అశాశ్వతమే. దేవుని వాక్యము మాత్రమే (ఆ వాక్కు ద్వారా కొత్త జన్మ పొందినవారు) శాశ్వతం !!!

Isaiah(యెషయా గ్రంథము) 40:6,7,8

6. ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

7. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.

8. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

 

మత్తయి 24:35

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

 

మరి శాశ్వతంగా ఉండేది ఏమిటంటే 1యోహాను 2:17

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

ఎందుకంటే, “శరీరం ఉన్నవారంతా గడ్డిలాంటివారు, మానవ వైభవమంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, గాని ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.” మీకు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే.

మరి అటువంటి శాశ్వతంగా నిలిచే సువార్తను వినిన నీవు వాక్యమునకు లోబడి జీవించాలి కదా! క్షణికమైన ఈ జీవితంలో కోపతాపాలు కక్షలు ఈర్ష్యలు ఎందుకు?

దేవుని వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు మనపట్ల చూపించిన ప్రేమ కలిగి ఒకరికొకరు క్షమించుకుని సహోదర ప్రేమ కలిగి కడవరకు సాగిపోదాం!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*41వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-10*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మొదటి అధ్యాయంలో శ్రమలలో ఆనందించండి అనే విషయం ధ్యానం చేస్తూ విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ధ్యానం చేసుకున్నాము! ఈ రెండవ అధ్యాయంలో కూడా విశ్వాసికి ఉండవలసిన లక్షణాలుతో పాటు ఉండకూడని లక్షణాలు చెబుతున్నారు పేతురు గారు!! ఇంకా మన పిలుపు ఏర్పాటు ఎంతగొప్పదో చెబుతూ మనము క్రీస్తు యొక్క రాజులము యాజకులము ఇంకా సజీవమైన రాళ్లము అంటూ గొప్ప మర్మాలు చెబుతున్నారు పేతురు గారు!

 

సరే మొదటి వచనంలో అంటున్నారు: ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల....

     

దేవుడు దయగల వాడు అని రుచి చూస్తే మీరు దుష్టత్వము దుష్ట మాటలు మానివేయాలి అంటున్నారు!

 

      *విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-10*

ఇక్కడ పేతురు గారు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం చెబుతున్నారు! ఆయన ప్రేమను దయను రుచి చూడాలి!!!

 

దావీదు గారు అంటున్నారు కీర్తనలు 34:8

యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

మరి ఆయన ఉత్తముడు అని రుచి చూడటం ఎలా?

మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. తేనెలోని తియ్యదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, దానిని ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది. దేవుని మంచితనం కూడా ఇంతే. మనం వేదాంతానికి సంబంధించిన, మతపరమైన  అనేక పుస్తకాలు చదవవచ్చు. బైబిలును గురించి అస్తమానమూ ధ్యానిస్తూ ఉండవచ్చు. అయితే మనకు మనం దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరియైన విధంగా మనం అర్థం చేసుకోలేము. అందువల్ల దావీదుగారు మనల్ని రుచి చూడాలని, దేవుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నించాలని, ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని ప్రోత్సహిస్తున్నారు.

ఇది ఎలా చేయగలం?

జవాబు ఇదే వచనంలో ఉంది ఆయనలో నమ్మకం విశ్వాసము ఉంచడం ద్వారా. దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసమొక్కటే సరియైన విధానం!!

మత్తయి 9:29

వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.

ఇక్కడ వారి విశ్వాసమే వారికి స్వస్థత కలిగించింది.

 

మత్తయి 21:22

మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

 

మార్కు 11:24

అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

 

కాబట్టి ఆయన యందు విశ్వాసము నమ్మకం ఉంచి ఆయన నుండి ఈవులు పొందుకోవడం ద్వారా ఆయన ప్రేమను దయను రుచి చూడగలము!

 

అయితే హెబ్రీ పత్రికలో పౌలుగారు అంటున్నారు:

హెబ్రీయులకు 6:4

ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

హెబ్రీయులకు 6:5

దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

హెబ్రీయులకు 6:6

తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

 

ఇక్కడ భక్తుడు హెచ్చరిస్తున్నారు ఒకసారి నీవు దేవుని ప్రేమను రుచి చూసి, ఆయనలో ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోతే నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని మరలా బాహాటంగా సిలువ వేసినట్లు!!! ఇంకా మరలా నీవు మారుమనస్సు పొందటం, నూతన పరచబడటం అసాధ్యము!!

కాబట్టి ఆయన ప్రేమను దయను రుచిచూసిన నీవు ఆయనలోనే కడవరకు ఉండాలి! ఆయన ప్రేమను దయను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని  నిజముగా రుచి చూస్తే నిజముగా అనుభవిస్తే ఇక నీవు లోకాన్ని పట్టించుకోవు! ఎన్ని బాధలు హింసలు శ్రమలు కలిగినా ప్రభువులో బలంగా సాగుతూ ఆత్మలో ఆనందించగలవు. ఎన్నో శ్రమలున్నా నీ నోటినిండా నవ్వు, హృదయంలో ఆనందం, మనస్సులో దేవుని శాంతి ఉంటుంది. ఇది కేవలం ఆయన దయను ప్రేమను ఆయనను రుచిచూసిన వారికి మాత్రమే తెలుస్తుంది!

అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*42వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-1*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈరోజు విశ్వాసికి ఉండకూడని మొదటి లక్షణం చూసుకుందాం! అది *దుష్టత్వము*

 

అసలు దుష్టత్వమును ఎందుకు వదిలెయ్యాలి?!

హబక్కూకు 1:1213

12. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

 

  13వ వచనం: నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంక మైనది కదా అంటూ అంటున్నారు ప్రవక్త వారు అనగా బబులోనువారు తమకంటే నీతిమంతులను నాశనము చేయగా నీవెందుకు ఊరకున్నావుఇది అసలు ప్రశ్న!!! నీ సొంతజనులు పాపము చేశారు అని ఒప్పుకుంటున్నాను అయితే యూదులు బబులోనువారికంటే నీతిపరులు. కాబట్టి నీతివంతమైన జనము పాపము చేసినప్పుడు వారిని అన్యాయవంతమైన జనముతో ఎందుకు శిక్షిస్తున్నావు? ఇంకా ముందుకుపోతే అడుగుచున్నారు ప్రవక్త- ఇలా ఎంతకాలం వారు అనగా బబులోనువారు ప్రజలను హింసిస్తారు. చెరపడతారుఇదీ ప్రవక్త రెండవ ప్రశ్న. దీనికి దేవుడు రెండో అధ్యాయంలో తాపీగా జవాబు చెప్పారు. అయితే ఈరోజు ప్రవక్త అడిగిన ప్రశ్నలోంచి దేవుని గుణగణాలు కొద్దిగా ధ్యానం చేద్దాం!

 

      మొదటగా 12వ వచనం ప్రకారం దేవుడు పరిశుద్దుడు, పవిత్రుడు; పాపం చేసేవారిని దండించే స్వభావం గలవాడు కారణం ఆయన సర్వాధిపతి, సర్వ సృష్టికర్త! ఇక 13వ వచనం ప్రకారం ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేదు. అవును దేవుడు దుష్టత్వమును, చెడుగును, తప్పును చూసి ఊరుకునే దేవుడు కాదు! వెంటనే దండించే దేవుడు! అయితే భక్తుల ప్రశ్న, నీతిమంతుల భాద ఏమిటంటే: దుష్టులు తప్పుచేస్తే వెంటనే వారిని దండించడం లేదు. ఎప్పుడో చివర్లో దండిస్తున్నావు. వెంటనే దండిస్తే/ బుద్ది చెబితే వారు గుణపడతారు కదా! దేవుని ఉద్దేశం వారికి బుద్ధిచెప్పి వారు గుణపడటం కన్నా, ఆ బుద్ధిచెప్పడం ద్వారా నీతిమంతులు గుణపడాలని, తప్పుచేస్తే ఇలా జరుగుతుంది అని భయపడాలని! దేవుడు మనిషికి మంచి చెడ్డలు గ్రహించే బుద్ధి, తెలివితేటలూ ఇచ్చారుమనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తించే స్వేచ్చ/ ఫ్రీడం ఇచ్చారు దేవుడు,. అయితే దానిని ఉపయోగించి అనగా తన బుద్ధి ఉపయోగించి చేసే పనులే తనను పరలోకానికి గాని నరకానికి గాని తీసుకుని పోతాయి. దేనిని ఎన్నుకోవడం అనేది మనిషి చేతిలో ఉంది. తప్పుచేస్తే దేవుడు దండిస్తాడు అనే భయం మనిషి కలిగి చెడుగు చేయకుండా ఉండాలి.

 

   మొదటగా కయీను తమ్ముడైన హేబెలును హత్యచేస్తే దేవుని కన్నులు చూసి ఊరుకోలేదు. శపించినట్లు చూస్తున్నాం. అడికాండం 4:10-13;. అదేవిధముగా దేవునిచేతనే నా స్నేహితుడు అనిపించుకున్న అబ్రాహాముగారిని, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్న అబ్రాహముగారిని అంటున్నారు దేవుడు: అబ్రాహామా! నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని హెచ్చరిస్తున్నారు. ఆదికాండం 17:1; కారణం దేవుడు చెప్పని పని, దేవుని అనుమతి లేకుండా చెయ్యడం. దేవుడు ఎంతో ఆస్తి ఇచ్చారు కాని పిల్లలు లేరు అని భార్య చెప్పిన మాట విని దాసితో సంసారం చేసారు. నిజంగా అబ్రాహాముగారు ఎంతో భక్తిపరుడు! చనిపోయేవరకు తన భక్తీ-విశ్వాసాలను విడచిపెట్టలేదు. విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నారు. ఇక తన భార్యకూడా మంచి సాధ్వీమణి! గుణవంతురాలు. గాని పిల్లలు పుట్టలేదు అని తన దాసితో పొమ్మన్నది. దేవుని దృష్టిలో ఇది విపరీతం! అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే అబ్రాహాముగారు కోరుకుంటే ఈ పని ఎప్పుడో చేసేవారు, కారణం తనకున్న  పనివారు ఆ రోజులలో సుమారు ౩౦౦౦ మంది. ఇప్పుడు ముఖేష్ అంభాని ఇంట్లో పనిచేసేవారు కేవలం 1600 మాత్రమే! గాని అబ్రాహాము గారింట్లో పనిచేసే వారు ౩౦౦౦ మంది. వీరిలో ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. వీరితో ఎప్పుడూ పాపం చేయలేదు ఆయన! గాని భార్య చెప్పింది అని మొదటిసారిగా దాసితో సంసారం చేశారు. దేవుడు దానికి ప్రతిఫలంగా సుమారు 13 సంవత్సరాలు అబ్రాహాముగారిని దర్శించడం, మాట్లాడటం మానేశారు. దేవుడు దుష్టత్వమును, చెడుగును, అపవిత్రతను చూడలేడు. అందుకే అంటున్నారు- అబ్రాహామా! నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు!

దేవునితోనే నా ఇష్టానుసారుడైన మనిషి అని పిలువబడిన దావీదుగారిని పాపం చేసినప్పుడు- తన ప్రవక్తను పంపించిఆ మనిషివి, హంతకుడవు నీవే! నీవే దోషివి అని చెప్పి దండించినట్లు చూస్తాం! 2 సమూయేలు 12;

1రాజులు 4 వ అధ్యాయంలో దేవుడు సొలోమోనును ఎంతో పొగుడుతారు. అదే 11  అధ్యాయంలో సొలోమోను తప్పు చేస్తున్నప్పుడు- కామాతురత గలవాడై ఉంచుకోనుచు వచ్చెను అని సిగ్గు తీస్తున్నారు. అది దేవుని తీర్పులు! మంచిగా పవిత్రంగా ఉంటే దేవుడు ఎంతైనా దీవించేవారు, ఆశీర్వదించేదేవుడు. అదే తప్పుచేస్తే వెంటనే ఖండించేదేవుడు. దేవునికి మొగమాటం లేదు! పక్షపాతం ఎంతైనా లేదు. ప్రియ సహోదరి/ సహోదరుడా! దేవునిచేతనే శభాస్ అనిపించుకున్నవారినే తప్పుచేస్తే దండించిన దేవుడు- నిన్ను నన్ను దండించరా? జాగ్రత్త! దేవుడు పరిశుద్ధుడు! నీవు చేస్తున్న అపవిత్రమైన పనులు చూసి సహిస్తారా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి అని చెప్పిన దేవుని ఆజ్ఞా మరచిపోతున్నావా? లేవీ 11:44,45;  పరిశుద్దులుగా ఉండటానికే దేవుడు మనలను ఎన్నుకొన్నారు అని మరచిపోయావా? రోమా 1:2; 1కొరింథీ 1:2;

 యాకోబు పత్రిక 1:27 లో భక్తికి నిర్వచనం చెబుతూ అంటున్నారు: ఇహలోకమాలిన్యము తన ఘటముకు అంటకుండా చూసుకోవాలి. అదే నిజమైన భక్తి. అపవిత్రము అంటే మీ దృష్టిలో  వ్యభిచారము, హత్యలు లాంటివే కాదు- పౌలుగారు మాటలలో చూద్దాం- అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు- 1 తిమోతి 4:7;  ఇవికూడా అపవిత్రమే ప్రియ సహోదరీ/ సహొదరులారా! ఎవరూ లేరుకదా అని నీవు మొబైల్ లో ఎవరితో చాట్ చేస్తున్నావు. పనిలేదు కదా అని నీవు పొరుగింటివారితో కలిసి ఏమి సోది చెబుతున్నావు. ముసలమ్మ ముచ్చట్లు చెబుతున్నావు? ఇది అపవిత్రమైన పని అని బైబిల్ సెలవిస్తుంది. అపవిత్రమైన సీరియల్లు, అపవిత్రమైన సినిమాలు, సెల్ ఫోన్లో భూతు సినిమాలు, ఫోటోలు చూసి నిన్నునీవు అపవిత్రం చేసుకోవద్దు ప్రియ చదువరీ! దేవుని కన్నులు ఇలాంటి వాటిని సహించలేవు!! 

 

ప్రకటన గ్రంధంలో ఇలా అసహ్యకరమైన పనులు చేసేవారు దేవునిరాజ్యములో ప్రవేశించరు అని ఖరాఖండిగా చెబుతున్నారు. కాబట్టి భయమునొంది ఇలాంటి అపవిత్రమిన పనులు మానేద్దాం!

 దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉంటే అన్నిటిని వదిలేద్దాం!

 

ఇక రెండవదిగా

రోమా 1:2932

29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును

31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.

32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.....

  

 *సమస్తమైన దుర్నీతి*: ఇక్కడ పౌలుగారు దుర్నీతి అనడం లేదు, సమస్తమైన దుర్నీతి అంటున్నారు అనగా చాలా రకాలైన దుర్నీతులు ఉన్నాయన్నమాట! అది ఏ రకమైన దుర్నీతియైనా సరే అది నిన్ను మరణానికి దారితీస్తుంది. 1:18 లో ఈ కోవకు చెందినవారు ఏం చేస్తున్నారంటే దుర్నీతిచేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. యేసుప్రభులవారు చెబుతున్నారు: నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నారు. యోహాను 14:6; అనగా దీనిప్రకారం ఇప్పుడు సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగిస్తున్నారు అనగా వీరు అనగా దుర్నీతిచేత యేసుప్రభులవారిని అడ్డగిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు జీవము కాబట్టి, జీవమును అడ్డగిస్తే మరణమే ఎదురవుతుంది కాబట్టి వీరంతా మరణపాత్రులు!  ఒకసారి అపోస్తలులు కార్యములుకి వెళ్దాం! అక్కడ 8వ అధ్యాయంలో పేతురు గారు వాక్యము చెబుతూ ఉంటే సీమోను అనే గారడీ వాడు రక్షింపబడిన తర్వాత దేవుని పరిశుద్దాత్మను ద్రవ్యం అనగా డబ్బిచ్చి కొనాలని ఆశిస్తాడు. అప్పుడు పౌలుగారు చెబుతున్నారు: 8:23

నీవు ఘోర దుష్టత్వములోను (మూలభాషలో- చేదైన పైత్యములోను) దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.

అది నిన్ను నిత్య నాశనానికి నడిపిస్తుంది అంటున్నారు. రోమా 6:13లో పౌలుగారు చెబుతున్నారు:

మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

 

 చూశారా ఎంత శ్రేష్టమైన మాటలో! 2 తిమోతి 2:19 లో పౌలుగారు అంటున్నారు ప్రభువు నామమును ఒప్పుకొనేవాడు తప్పకుండా దుర్నీతి నుండి తొలగిపోవాలి అంటున్నారు. ఇంకా 1 కొరింథీ 13:6 లో  దుర్నీతి విషయంలో సంతోపడక సత్యమునందు సంతోషపడమంటున్నారు పౌలుగారు. 

ఇంతకీ దుర్నీతి అనగా ఏమిటి? అవినీతి అని చెప్పుకోవచ్చు! అది ఎలాంటి దుర్నీతి అయినా సరే అది నిన్ను మరణానికి నడిపిస్తుంది. దుర్నీతి పాపము! పాపమునకు వచ్చు జీతం మరణం! రోమా 6:23; కాబట్టి ఈ దుర్నీతి శారీరకమరణానికి కాకుండా ఆత్మీయ మరణానికి వెంటనే నడిపిస్తుంది! నీవు తీసుకునే లంచాలు అవినీతి, దుర్నీతి, అబద్దాలు చెప్పడం అవినీతి. ఇలాంటివి ఏవైనా సరే నీవు దేవుని న్యాయ సింహాసనం ఎదుట లెక్క అప్పగించాలి అని మరచిపోవద్దు!

 

 ఇక తర్వాత లక్షణం: *దుష్టత్వం*: మరలా మనం అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయానికి వెళ్తే ఈ సీమోనుతో అపోస్తలుడైన పేతురుగారు అంటున్నారు నీవు సమస్త దుష్టత్వముతోను, దుర్నీతి తోనూ నిండి ఉన్నావు అంటున్నారు. అనగా ఈ దుర్నీతి, దుష్టత్వము అక్కాచెల్లెళ్లు లాంటివి. ఒకటి వస్తే రెండోది ఫ్రీ! దుష్టత్వము అనగా దుష్ట ఆలోచనలు! దేవునికి దుష్టులుదుష్టత్వము అంటే అసహ్యము! హబక్కూకు 1:13లో భక్తుడు చెబుతున్నాడు :

నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

కాబట్టి దుష్టత్వము, దుర్నీతి దేవునికి అసహ్యమైనది. చివరికి ఇవి మరణానికి దారితీస్తాయి! అందుకే దుష్టులు దవడ పళ్ళు విరుగగోట్టేవాడు దేవుడు అని సెలవిస్తుంది బైబిల్!

కీర్తనలు 1: 4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

కీర్తనలు 9: 16

దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు.

కీర్తనలు 10: 4

దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు

కీర్తనలు 12: 8

నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

సామెతలు 29: 16

దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు.

యోబుగారు చెబుతున్నారు వివేకము అంటే దుష్టత్వము విడచిపెట్టడమే! 28:28;  1కొరింథీ 14:20 లో పౌలుగారు చెబుతున్నారు మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి అంటున్నారు.  చిన్న పిల్లలకు దుష్టత్వము అనేది ఉండదు. ఒకవేళ కొట్టుకున్న చిన్నపిల్లలు వెంటనే మరచిపోయి కలసిపోతుంటారు. ఒకవేళ స్త్రీలు పిల్లలకోసం తగవులాడుకుంటే, కాసేపటికి పిల్లలు కలసిపోతారు వారి కోసము తగవులాడుకున్న తల్లులు  సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలకి దుష్టత్వం అనేది ఉండదుఅందుకే యేసయ్య అంటున్నారు చిన్న పిల్లల వంటి వారిదే పరలోకరాజ్యం! మత్తయి 19:14; ఇక ఎఫెసీ 4:31 లోను, కొలస్సీ 3:8 లోను ఈ దుష్టత్వమును విసర్జించండి అంటున్నారు పౌలుగారు.

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

 

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

ఎవరైతే విసర్జిస్తారో వారే పరలోక వాసులుగా దేవుని పిల్లలుగా ఉంటారు. ఎవరైతే దుష్టత్వాన్ని, దుర్నీతిని ప్రాక్టీస్ చేస్తారో, అనుసరిస్తారో వారు ఆధ్యాత్మిక మరణాన్ని, కాలం గడిచేకొద్దీ శారీరక మరణాన్ని చవిచూస్తారు!

 

   ప్రియ దేవునిబిడ్డా! నీకు ఏది కావాలి? జీవమా లేక మరణమా? జీవం కావాలి అంటే దుష్టత్వాన్ని దుర్నీతిని విసర్జించాలి.  ఏదికావాలో చూసుకో!

దైవాశీస్సులు! 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*43వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-2*

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈరోజు విశ్వాసికి ఉండకూడని రెండవ లక్షణం చూసుకుందాం! అది *సమస్తమైన కపటము*

 

రోమా 1:29

29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై .....

 

*కపటము*: కపటము అంటే మనస్సులో, హృదయంలో పగ-కక్ష్య- క్రోధం ఉంచుకొని ఏమీ ఎరుగనట్టు నటించడం! వీరు చాలా డేంజర్! పైకి చాలా మృదువుగా, ఎక్కడలేని ప్రేమా-ఆప్యాయతలు ఒలకబోస్తారు. గాని వారి అంతరంగలో ఎంతో పగ, ఈర్ష్య ఉంటాయి. ఇలాంటివారు దేవునికి అసహ్యులు!

2రాజులు 17:9 –22 ప్రకారం ఇశ్రాయేలీయులు, వారి రాజులు దుర్భోదలు అనుసరించి కపటం కలిగి, దుర్భోదలు బోధిస్తూ విగ్రహాలు నిలుపుకుని అన్యజనుల ఆచారాలు జరిగించినందున దేవుడు వారిని దాస్యమునకు అప్పగించారు.

 

కీర్తనలు 5:6 ప్రకారం కపటం చూపి నరహత్య చేయువారు యెహోవాకు అసహ్యులు!

 

పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకోనును సామెతలు 26:24;  ఇలాంటివారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది!

 

ఇలా కపటముతో మాట్లాడటం కోసం బైబిల్ ఏమి చెబుతుందో చూద్దాం!

దావీదుగారి అన్న కొడుకు ఒకడు యెహోనాదాబు. వీడి వలన అమ్నోను చేయరానికార్యము చేయగా అబ్షాలోము హంతకుడిగా మారిపోయాడు.

2సమూయేలు 13:3

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు

 

ఇక భక్తిహీనులు దుష్టుల కోసం చూస్తే

యోబు 15:35

వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును.

 

కీర్తనలు 5:6

అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

 

కీర్తనలు 10:7

వారి నోరు శాపముతోను కపటముతోను వంచన తోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

 

కీర్తనలు 36:3

వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.

 

సామెతలు 26:24

పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.

 

యిర్మియా 5:27

పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.

 

అయితే ఎలా ఉండాలి విశ్వాసి?!

కీర్తనలు 32:2

యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

 

కీర్తనలు 24:4

వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.

 

ఎందుకు అంటే మన రక్షకుడు మన గురువు మన దేవుడు కపటము లేనివాడు కాబట్టి!!

యెషయా 53:9

అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

 

1పేతురు 2:22

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

 

కాబట్టి మన హృదయంలో గాని నోటిలో గాని కపటము ఉండకూడదు. అదే కపటము యాకోబు గారి కుమారులు షిమ్యోను లేవీలను హంతకులుగా మార్చింది.

యెహోషువ 24:14

కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*44వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-3*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈరోజు విశ్వాసికి ఉండకూడని మూడవ లక్షణం చూసుకుందాం! అది *వేషధారణ*

వేషధారణ అనగా నటించడం అని నా ఉద్దేశం!

ఇది బహుశా రెండు రకాలుగా విభజించవచ్చు.

మొదటిది: వేషధారణ భక్తి! అనగా నిజానికి భక్తిహీనుడు భక్తిశూన్యుడు! గాని గొప్ప భక్తిపరులుగా ప్రార్థనా పరులుగా నటించేవారు!

రెండవది: వేషధారణతో కూడిన వస్త్రధారణ!

 

మొదటి వేషధారణ కోసం చూసుకుందాం!

దేవుడు ఇశ్రాయేలు ప్రజలు, నాయకులు, కాపరులు, యాజకుల కోసం అనేకసార్లు చెప్పారు మీరు పెదాలతో నన్ను స్తుతించుచున్నారు గాని మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటూ!!

యెషయా 29:13

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.

 

మత్తయి 15:8

ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

మత్తయి 15:9

మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

 

మార్కు 7:5

అప్పుడు పరిసయ్యులును శాస్త్రులునునీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.

మార్కు 7:6

అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.

మార్కు 7:7

వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.

మార్కు 7:8

మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.

మార్కు 7:9

మరియు ఆయనమీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.

 

యెషయా 19: 13 వచనంలో మరో మాట చెబుతున్నారు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు గాని పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు! వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే కానీ నేను చెప్పిన మాటలు వారు చేయడం లేదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అందుకే వీళ్ళ మీదకి ఇలాంటి గాఢ నిద్ర ఆత్మ దేవుని వాక్యాన్ని గ్రహించలేనంటే స్థితి చివరికి దేవుని వాక్యమే కరువయ్యే స్థితి యెరూషలేము ప్రజల మీదకి రాబోతుంది!

 

  13వ వచనం బైబిల్ లో యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా దీనిని అనేకసార్లు ఉపయోగించారు అపోస్తులుడైన పౌలు గారు ఇంకా కొత్త నిబంధన భక్తులు ఈ మాటను ఉపయోగించారు! మత్తయి సువార్త 15: 8, 9 వచనాల్లో ఏసుప్రభుల వారు పరిసయ్యులను వారి కపట భక్తిని ఖండిస్తూ ఇదే వచనాన్ని పలికారు, ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి వస్తున్నారు గాని తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది! ఇలా వారు నాకు దూరమైపోయారు పెదాలతో మాత్రం నన్ను గౌరవిస్తున్నారు తప్ప వారు చాలా దూరంగా ఉన్నారు! మనుషులు ముందు భక్తిపరులుగా దేవుడు అంటే ఎంతో ఆసక్తి ఉన్నవారుగా ప్రజలు తమను గౌరవించాలి అనుకుంటారు! అందుకే నటన చేస్తారు! అయితే వారి పెదవులు పలికే దానికి వారి హృదయస్థితికి ఎంతో తేడా ఉంది!

 ఇదే రాయబడింది భక్తి ఉన్నట్లు నటన చేస్తారు గాని వారి హృదయం ఎంతో దూరంలో ఉందని యిర్మియా 12:1,2 లో కూడా ఇదే అంటున్నారు. చివరికి యెహేజ్కేలు 33వ అధ్యాయంలో కూడా దేవుడు ఇదే చెప్తున్నారు! నా నిజమైన కట్టడలను పాటించకుండా మానవ కల్పితమైన కట్టడలే దేవుని కట్టడాలని బోధిస్తూ వాటిని ఆచరిస్తున్నారు! వారి హృదయము నా నుండి ఎంతో దూరంగా ఉం!ది అందుకే ఈ ప్రజల మీదకి శిక్ష అని దేవుడు చెబుతున్నారు!

 

సంఘములో అందరిముందు పరిశుద్ధ పరిశుద్ధ అని పాటలు పాడుతూ ధీర్ఘప్రార్ధనలు చేస్తూ ఇంట్లో సమాధానం లేకుండా దేవునితో సమాధానం లేకుండా వేషధారణ భక్తి చేస్తూ అవసరమైతే ఘనమైన కానుకలు ఇస్తూ నటిస్తున్నావేమో భక్తిపరునిలా!

 

 ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు కూడా అదే స్థితిలో ఉంటే నీ మీద కూడా దేవుని శిక్ష న్యాయముగా దిగబోతుంది! ప్రజల ముందు పరిసయుల వలె నటన చేస్తున్నావేమో! శాస్త్రులు వలే కపట వేషం వేస్తున్నావేమో! జాగ్రత్త దేవుని నోటి నుండి అగ్ని వచ్చి నిన్ను దహించబోతుంది! దాన్ని తప్పించుకోవాలంటే నేడే మార్పు నొంది మారుమనస్సు పొంది ఆయన పాదాలను పట్టుకో!!

 

ఇక రెండవది: వేషధారణతో కూడిన వస్త్రధారణ!!!

 

** ఇక అన్యులు, సినిమా తారలు వేసుకునే వస్త్రధారణనే క్రైస్తవ సంఘం వేసుకుంటుంది. ఇది దేవుడు మేచ్చేదా? ఇంకా కొంతమంది స్త్రీలు స్త్రీ పురుషవేషం ధరించకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు అని చెబితే (ద్వితీ 22:5), స్త్రీలు జీన్స్ పేంట్, టీ-shirts వేసుకుని తిరుగుతున్నారు, మరీ ఘోరమేమిటంటే అవి వేసుకుని, ముసుగువేసుకోకుండా స్టేజిమీద పాటలు పాడుతున్నారు! ఇది పరిశుద్దాత్మునికి దుఃఖపరుస్తున్నారని తెలియదా??!!

 

ప్రసంగీ 5:1

  నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వస్త్రధారణ అన్ని జాగ్రతగాచూసుకోవాలి. ఎందుకు? ముందు చెప్పిన విధంగా దేవుడు మనమధ్య వున్నారు, ఆయన రాజులరాజు, ప్రభువుల ప్రభువు, భయంకరుడైన దేవుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి.

దయచేసి ఒక విషయం గమనించాలి. మనం వెళ్ళేది మార్కెట్ కి కాదు, సినిమా హాల్ కి కూడా కాదు. క్రిస్టియన్ గెట్ టుగెదర్ కి అంతకన్నా కాదు, పెళ్ళికో , ఫంక్షన్ కో, వ్యాపారానికో కూడా కాదు. రారాజుని పూజించటానికి వెళ్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన, మన వస్త్రధారణ  క్రమబద్ధంగా వుండాలి . కొంతమంది యువతి యువకులు నేటి కాలంలో ఘోరమైన వస్త్రధారణతో సంఘానికి వస్తున్నారు. Tight T-shirt వేసుకొని, ఖండలు, 6 pack చూపించేవారు కొంతమంది. స్త్రీలు పెదాలకి రంగు, కనుబోమలకి రంగు, ఇంకా భయంకరమైన వస్త్రధారణతో వస్తున్నారు. విచారం ఏమిటంటే, మాదిరిగా ఉండాల్సిన సేవకుల భార్యలు, పిల్లలు సంఘస్తుల కంటే భయంకరంగా తయారై , బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేషం వేసుకొని సంఘానికి వస్తున్నారు. ఇక సంఘస్తులు ఇంక ఎలా వుంటారు.

CHURCH IS NOT A FASHION SHOW.

మన వస్త్రధారణ, నడక దేవునికి అనుకూలంగా వుండాలి గాని, లోకస్తులు చేసినట్టు, లోకాన్ని మరియు ఇతరురలను ఆకర్షించేదిగా ఉండరాదు. ఒక కలెక్టర్ ఆఫీస్ కి ఆ రకమైన వస్త్రధారణతో వెళ్ళగలవా? దయచేసి గమనించమని మనవి.

 

ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన జనము. మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగాలిగారు! దానియేలు 3; నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!! పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . . 

 

చివరిగా ఏలియా గారిని చూసుకుని ముగించుకుందాం!

ఏలియా మహాగొప్ప దైవజనుడు ప్రవక్త! చివరికి మరణం రుచి చూడకుండా పరలోకం వెళ్లిన రెండవ వ్యక్తి! కాని ఈయన వస్త్రధారణ చాలా సింపుల్! 2రాజులు 1:8

అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను.

అక్కడ సీదోనుకి సంబంధించిన విధవరాలితో మాట్లాడిన విధానం చూసుకుంటే:

విధవరాలు సీదోను దేశానికి చెందినది. ఈమె ఎప్పుడూ ఏలియా గారిని చూడలేదు మరి నీ దేవుడైన యెహోవా జీవముతోడు అని ఎలా చెబుతుంది? మొదటగా ఆయన మాట్లాడే విధానం వలన కావచ్చు.

ఇంకా ఆయన వేష భాష వలన కావచ్చు. కొందరు మాట్లాడుతుంటే దేవదూత మాట్లాడుతున్నట్లు ఉంటుంది. పెట్టాలనిపిస్తుంది. అదే కొందరు మాట్లాడుతుంటే కొట్టాలనిపిస్తుంది. ఇక్కడ ఈయన మాటలు ఇట్టే అర్ధమైపోయాయి ఆయన దైవజనుడని. ప్రియ విశ్వాసి/సేవకుడా! నీ మాటలు/ వేషధారణ ఎలా ఉన్నాయి? నీ మాటలలో, చేతలలో, వస్త్రధారణలో క్రీస్తు కనిపిస్తున్నారా లేక నీ హంగు ఆర్భాటాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ క్రీస్తుని మాత్రమే చూపిస్తూ ఉంటే నీవు ధన్యుడవు! నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితమే ఒక పత్రికగా మారిపోవాలి. ఏలియా గారి జీవితం కరపత్రికగా మారిపోయింది. చదువులేని విధవరాలుకి ఏలియాలో దేవుడు కనిపించారు. మరి నీ జీవితం/ ప్రవర్తన ద్వారా యేసయ్య కనిపిస్తున్నారా?

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*45వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-4*

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈరోజు విశ్వాసికి ఉండకూడని నాల్గవ లక్షణం చూసుకుందాం! అది *అసూయ*

  

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

 “శరీరంఅనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఎదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

  *అసూయ అంటే? *

మనము యిష్టపడి కోరుకొనేది మరొకరి దగ్గర వుంటే, వానిపై అయిష్టత కలిగియుండడం.

 

మనము బైక్ మీద వెళ్తుంటే?

వేగంగా దూసుకు పోతున్న కారు వైపు చూస్తాము గాని, మన ప్రక్కనే చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము. 

మన ఆశలన్నీ మన పైవాటి మీదే వుంటాయి. నేను ఆ స్థితిలో ఎందుకు లేను? అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని, మనకంటే ఉన్నత స్థితిలో వున్నవారిపైన 'అసూయను' కలిగిస్తుంది. 

అసూయ కలిగిన నీవు సంతోషముగా వుండలేవు. ఎదుట వారిని సంతోషముగా వుండనివ్వవు.

 

🔺 *అసూయకు ముఖ్య కారణం*

* సంతృప్తి లేని జీవితం

* ఇతరుల బాగును సహించుకోలేని స్థితి 

* ఇతరుల నైపుణ్యాలను అభినంధించలేని స్థితి 

 

అపోస్తలుడైన పౌలు జైలులో ఖైదీగా వున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. 

 

నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. ఫిలిప్పి  4:11

 

సంతృప్తి కలిగియుంటే? అసూయకు తావే లేదు. 

 

🔺 *అసూయ మరణానికి దారి తీస్తుంది :*

బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.             యోబు 5:2

 

🔺 *అసూయలేకుండా జీవించాలి.*

ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.        గలతియులకు 5:26

 

🔺 *అసూయ కలిగియుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము.*

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.       గలతియులకు 5:21

 

🔺 *అసూయను విసర్జించాలి: *

ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.  1పేతురు 2:1-3

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

అసూయను వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం! అసూయను వీడి, తిరిగి జన్మించిన అనుభవం కలిగి కక్షలు క్రోదాలు లేకుండా చిన్న బిడ్డలా  పరలోకాన్ని చేరుకొందాము!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21వ వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*46వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-5*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఈరోజు విశ్వాసికి ఉండకూడని నాల్గవ లక్షణం చూసుకుందాం! అది *దూషణ మాటలు*

 

కొలస్సీ 3:8

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

 

    ప్రియులారా! తర్వాత విసర్జించవలసినది దూషణ! దూషణ అనగా విమర్శిస్తూ తిట్టడం, గెలిచేయడం, చెడ్డమాటలు పలకడం. ఇలాంటివి విశ్వాసి ఎట్టి పరిస్తితులలో కూడా చేయకూడదు!

 

   ఒకవేళ ఇతరులు/ అన్యులు మన దేవుని నామము నిమిత్తం మనల్ని విమర్శిస్తే మారుమాట్లాడకుండా సహించమని చెప్పారు దేవుడు. మనముకూడా వారిని దూషించమని విమర్శించమని చెప్పలేదు దేవుడు! నా నిమిత్తము ప్రజలు మిమ్మును నిందించి, హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు! సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పారు యేసుప్రభులవారు! మత్తయి 5:11-12. అదేసమయంలో దూషించేవారి నోరుమూయించగల సమర్ధుడు మనదేవుడు! వారి దవడపల్లు రాలగొట్టేవాడు మన దేవుడు! కీర్తనలు 3:7;  అందుకే పగతీర్చుట నాపని అంటున్నారు. హెబ్రీ 10:30; కాబట్టి ఆయననే పగతీర్చుకోనిద్దాం!

 

   సరే ఇప్పుడు *దూషణ* కోసం చూసుకుందాం! ఇశ్రాయేలీయులను అన్యులు/ విరోధులు దూషించినప్పుడు దేవుడు స్పందించిన రీతి అమోఘం!

 

మొదటగా: దావీదుగారిని, ఇశ్రాయేలీయులను గొల్యాతు తిరస్కరించిదూషించినప్పుడు దావీదుగారు తిరిగి దూషించలేదు! నీవు కత్తిని, ఈటెను తీసుకొని వస్తున్నావు గాని, నేను యెహోవాపేరిట వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అని వడిసెలతో ఒక్క దెబ్బకొడితే దిమ్మదిరిగి, బోర్లపడి, నేలనాకాడు. చచ్చాడు. 1 సమూయేలు 17; దేవుణ్ణి, దేవుని ప్రజలను విమర్శించేవారికి దక్కేఫలం ఇదే!

 

 రెండవదిగా: హిజ్కియా భక్తుడు రాజుగా ఉన్నప్పుడు, అష్శూరు రాజైన సన్హేరీబు యేరూషలేము మీదకు దండెత్తినా చేతిలోనుండి తప్పించే దేవుడెవడు? ఆ దేవత తప్పించగలిగేనా? ఈ దేవుడు తప్పించగలిగేనా? మీ దేవుడు నా చేతిలోనుండి తప్పించగలడా అంటూ ప్రగల్భాలు పలికినప్పుడు, రాజైన హిజ్కియా ఆ పత్రిక దేవాలయంలో పరచి, తన హృదయాన్ని అక్కడే దేవునిముందు కుమ్మరించినప్పుడు యెషయా 37వ అధ్యాయం, దేవుడు అంటున్నారు నీవు ఎవర్ని తిరస్కరిస్తున్నావు? ఎవరిని దూషిస్తున్నావు? ఎవరిని భయపెడతావు? (23)

28. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

29. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

  అందుకు దేవుడు

36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా ఉండిరి. . . . . . చివరికి సన్హేరీబు అవమానంతో తనదేశానికి తిరిగి వెళ్ళిన వెంటనే తన కడుపున పుట్టిన కుమారులే అతనిని చంపివేశారు.

 

మూడవదిగా: పైన ఉదాహరించిన వారిలాంటి వారు చాలామంది ఉన్నారు, అయితే జెఫన్యా గ్రంధంలో 2:8,9లో

8. మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.

9. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.  . .

 

  కాబట్టి ఎవరైతే దూషణమాటలు పలుకుతారో వారిగతి ఇంతే!

దేవుని బిడ్డలను దూషిస్తే అంతే!! అదేవిధంగా దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకొని, నీవుకూడా అదేపని చేస్తే నీ గతికూడా అంతే!!!

 

అందుకే ఎఫెసీ 4:31లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అంటున్నారు.;

 

పేతురుగారు కూడా అంటున్నారు: 1 పేతురు 2:2,3లో

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.  . . . కాబట్టి విశ్వాసులైన వారు ఇలాంటి దూషణమాటలు వదలాల్సి ఉంది.

 

    అంతేకాకుండా మనం చేసే పనులను బట్టి దేవునినామం దూషణపాలు అవుతుంది. అయినా దేవుడు మనలను ఎందుకు క్షమిస్తున్నారంటే మనలను శిక్షించి, తన నామమునకు దూషణ/ చెడ్డపేరు రాకూడదు అని. యేహెజ్కేలు 20:9, 14, 22; 39:7;

 

   ఎన్నోసార్లు దేవుడు మనవల్లనే తన నామం దూషణపాలు అవుతుంది అని భాదపడ్డారు. యేహెజ్కేలు 36:20.   యెహేజ్కేలు 36: 21

కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.

 

చివరికి దేవునికి కోపం వచ్చి వారిని నాశనం చేశారు యేహెజ్కేలు 43:8

నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువు లైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.

 

    కాబట్టి ఇశ్రాయేలీయులను శిక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా శిక్షిస్తారు. కారణం యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడు! హెబ్రీ 13:8;

కాబట్టి నేడే నీ దూషణమాటలు వదిలేసెయ్!

అంతేకాకుండా నీ ప్రవర్తన వలన దేవుని నామమునకు దూషణ కలగకుండా జాగ్రత్త పడు!

 

అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*47వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-11*

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి!!

అనగా చిన్న పిల్లల వలె కక్షలు కోపతాపాలు లేకుండా అన్నీ మర్చిపోతూ క్షమించేస్తూ ఉండాలి!

 

దీనికోసం జాగ్రత్తగా ఆలోచిస్తే

మొదటగా: మీదన చెప్పనట్లు పిల్లలు కొట్టుకున్నా తిట్టుకున్నా వెంటనే మర్చిపోయి కలిసిపోతూ ఉంటారు. తల్లులు పెద్దలు మద్యలోకి వెళ్లకూడదు. వెళ్తే పిల్లలు కలిసిపోతారు గాని పెద్దలు కలవడానికి టైం పడుతుంది.

అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు అన్నారు పేతురుతో

మత్తయి 18:21

ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారుల మట్టుకా? అని అడిగెను.

మత్తయి 18:22

అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

 

మరో సందర్భంలో లూకా 18:16

అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.

లూకా 18:17

చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 

కాబట్టి అలాంటి చిన్న పిల్లల వంటి మనస్తత్వము విశ్వాసులకు ఉండాలి.

ఇక రెండవ కోణంలో చూసుకుంటే: మరల మనం మానవ సంభందాల నుండే అలోచిద్దాం. చిన్న పిల్లలు చిన్నచిన్న మాటలు, క్రొత్తగా నేర్చుకున్న మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు కదా! అలాగే మన పరమ తండ్రికి మనము చిన్నపిల్లల లాంటి వారము. దేవుడు మనము మాట్లాడే చిన్న చిన్న మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. మన నుండి వినాలని ఆశిస్తున్నారు. అయితే ఆమాటలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా లేదా!! మన మాటలు దేవున్ని సంతోషపెడుతున్నాయా లేక దుఃఖ పెడుతున్నాయా!!

 

మోషే గారు పెద్ద ప్రవక్త, భూమిమీద నున్నవారిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేతనే పొగడబడిన వాడు. సంఖ్యా 12:3; కాని ప్రజలమాటలు భరించలేక కానిమాట పలికారు. ద్రోహులారా అన్నారు. 20:10; అంతే, వాగ్ధాన దేశం చేరలేక పోయారు. దేవునికి ఇష్టుడుపిలువబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు, నమ్మకమైన వాడు, ఎన్నో అసాధారణ అద్భుతాలు చేసిన వాడే గాని చిన్న మాట వలన వాగ్ధానదేశాన్ని పోగొట్టుకున్నాడు. అంత గొప్ప వ్యక్తే పొందుకోలేకపోతే నీవునేను ఎంత?!! కాబట్టి మనమాటలు కాచుకోవలసిన అవసరం ఉంది అప్పుడే దేవునికి ఇష్టులుగా జీవించగలము.

 

  మనమాటలు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది.

1. మృదువుగా ఉండాలి:

మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును."       సామెతలు 15:1

 

2) ఉప్పు వేసినట్లు ఉండాలి కొలస్సీ 4:6

 

3. కృపాసహితంగా ఉండాలి:

ఉప్పు రుచిని కలిగిస్తుంది. అట్లానే మన మాటలు కూడా రుచికరంగా వుండాలి. ఉప్పు తక్కువైనా రుచించక పోవచ్చు. ఎక్కువైనా తినడానికి పనికి రాకుండా పోవచ్చు. మన మాటలు సమపాళ్ళలో ఉంటూ దేవుని కృపను గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావించే విధంగా వుండాలి.

 

"ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి."             కొలస్సి 4:6

 

4) . క్షేమకరంగా ఉండాలి:

వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి."         ఎఫెసి 4:29

 

5) కృతజ్ఞతతో కూడినవై ఉండాలి:

బూతులుగాని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గాని, అపార్ధమునకు తావిచ్చే మాటలుగాని, పాపమునకు ప్రేరేపించే మాటలుగాని మనము మాట్లాడడానికి వీల్లేదు. కృతజ్ఞతతో నిండిన మాటలై ఉండాలి. అట్టి మాటలు హృదయ పూర్వకమైనవి కాబట్టి, ఎటువంటి అపార్ధాలకు తావిచ్చే అవకాశం ఉండదు.

 

"కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు." 

            ఎఫెసి 5:4

 

6)  ఆలోచించి మాట్లాడేవిగా ఉండాలి:

మాటలాడుటకు నిదానించువాడునై యుండవలెను."              యాకోబు  1:19

 

7)  కొద్దిగా ఉండాలి:

"దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను."             ప్రసంగి 5:2

 

దేవుని పిల్లలముగా మనమాటలు ఎట్లా వున్నాయి? మనలను తృణీకరింపచేసేవిగా ఉన్నాయా? దేవునికి ఇష్టుడుగా చేసేవిగా ఉన్నాయా లేక కోపం తెచ్చేలా ఉన్నయా? ఒకసారి అలోచిద్దాం! సరిచేసుకొందాం!

 

ఇక కొత్తగా పుట్టిన బిడ్డలలాగా/ శిశువుల వలె అంటే కొత్త విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని రాసినది కావచ్చు. లేక క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుపడిన పాత విశ్వాసులను ఉద్దేశించి రాసినది కావచ్చు (1 కొరింతు 3:1-2; హెబ్రీ 5:11-14). లేక, క్రీస్తు తిరిగి వచ్చిన తరువాతి స్థితిలో పోల్చుకుంటే మనందరం ఆధ్యాత్మికంగా పసి పాపలమే అని పేతురుగారి ఉద్దేశం కావచ్చు (మత్తయి 18:3). పసితనంలో ఉన్న మూడు లక్షణాలను మనమెప్పుడూ నిలుపుకోవాలి ఆధ్యాత్మిక పోషణను ఆశించాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి, దేవునిపై ఆధారపడాలి. ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుని వాక్కు గురించిన ఆశ బొత్తిగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవం లేదనడానికి అంతకన్నా వేరే రుజువు ఏమి కావాలి?

 

కాబట్టి మనం పసిపిల్లల వంటి క్షమించే గుణం, పిల్లలు మాట్లాడే చక్కనిమాటలు అనగా దేవునికిష్టమైన మాటలు పలుకుతూ ఆధ్యాత్మికముగా దేవునిలో ఎదుగుతూ గురివద్దకు చేరుదాం!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*48వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-12*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: నిర్మలమైన ఆత్మ సంబంధమైన  పాలవలన రక్షణలో ఎదిగేలా వాక్యమును ఆపేక్షించాలి!!

పాలవలన అంటే దేవుని వాక్యోపదేశాలు. మనం పాత విశ్వాసులమైనా కొత్త విశ్వాసులమైనా మనందరం ఆశించవలసినది ఇదే దేవుని వాక్యమునే!!

 

కీర్తనాకారుడు అంటారు:

కీర్తనలు 119:40

నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రదికింపుము.

కీర్తనలు 119:131

నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.

ఈవిధంగా దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోవాలి!

ఈ అధ్యాయంలో మొత్తం దీనికోసమే అనగా దేవుని వాక్యము మీద ఎలా ఆశ పడ్డారో చెబుతున్నారు!

దీనినే వాక్యము, ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశములు, శాసనములు అని చెబుతున్నారు ఈ అధ్యాయంలో!!

 

ఎందుకు వాక్యము మీద ఆశ పెట్టుకోవాలి అనేది విభిన్న కోణాలలో చూసుకుందాం!

కీర్తనలు 119:11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

కీర్తనలు 119:16

నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.

కీర్తనలు 119:17

(గీమెల్‌) నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును.

కీర్తనలు 119:28

వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.

కీర్తనలు 119:38

నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.

కీర్తనలు 119:43

నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను.

కీర్తనలు 119:50

నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

కీర్తనలు 119:72

వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.

కీర్తనలు 119:81

(కఫ్‌) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశపెట్టుకొని యున్నాను

కీర్తనలు 119:89

(లామెద్‌) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.

కీర్తనలు 119:98

నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.

కీర్తనలు 119:99

నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

కీర్తనలు 119:101

నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొల గించుకొనుచున్నాను

కీర్తనలు 119:103

నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.

కీర్తనలు 119:105

(నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.

కీర్తనలు 119:130

నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును

కీర్తనలు 119:133

నీ వాక్యమును బట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.

కీర్తనలు 119:160

నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.

 

ద్వితియోపదేశకాండము 30:20

నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.

 

కాబట్టి ఆయన వాక్యములో జీవము, వెలుగు ఆశ ఉంది. అంతేకాకుండా యోహాను 1:1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1:2

ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,

యోహాను 1:3

కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

యోహాను 1:4

ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

ఆయన ఎవరంటే వాక్యమైయున్న యేసుక్రీస్తు ప్రభులవారు!!

 

ఇక రెండవది: వాక్యము మనలను పాపము చేయకుండా ఆపుతుంది!

కీర్తనలు 119:11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*49వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-12*

 

1 పేతురు 2:1-3

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: నిర్మలమైన ఆత్మ సంబంధమైన  పాలవలన రక్షణలో ఎదిగేలా వాక్యమును ఆపేక్షించాలి!!

 

         (గతభాగం తరువాయి)

 

మూడవది: వాక్యము మన కుటుంబాలను కడుతుంది:

వాక్యము మరియు ప్రార్థనతో యిల్లు కట్టుట అవసరము*......

 

*''జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును.'' (సామెతలు 14:1).*

 

*"ఇల్లు కట్టుకొనుట"*

👉 అనగా తమ పిల్లలను సరిగా ప్రభువులో పెంచి పెద్ద చేయట. *అదే జ్ఞానము.*

👉 *అనగా తల్లులైన వారు తమ పిల్లలను వాక్యముతోను ప్రార్థనతోను కట్టుకొనుటయే జ్ఞానము.*

 

*"బిడ్డలకు, వారు కూర్చుండి నప్పుడు, వారు వీధులలో నడచుచుండి నప్పుడు, వారు నిద్రించుటకు పడకకు వెళ్లుచుండి నప్పుడు మరియు వారు ఉదయమున నిద్రలేచి నప్పుడు ఆయన గూర్చి చెప్పవలెనని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పెను". (ద్వితీయో 6:7).*

 

👉మన బిడ్డలకు ఆత్మీయ నియమములను అన్ని సమయములలో మరియు అన్ని సందర్భములలో బోధించుట ముఖ్యమని ఇది చెప్పుచున్నది.

 

👉 *ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చిన అనేక మంది పిల్లలు అవిశ్వాసులు కూడా చెయ్యని పనులు చేయుట చూచుట ఎంతో విచారకరమైన విషయం!*

 

👉దీనికి కారణము ఏమిటి?

🔺 వారి తల్లిదండ్రులు వారి విషయంలో తప్పిపోవుటయే. అటువంటి పిల్లల తల్లిదండ్రుల యెడల జాలిపడాలి.

 

👉అయితే నిరాశ పడవలసిన పనిలేదు. వారు నమ్ముకున్న యెడల దేవుడు ఏదో ఒక అద్భుతము చేసి వారి జీవితములో మార్పు తేగలడని నమ్ముమని వారిని ప్రోత్సాహించుచున్నాను.

 

🔺కాని మన చుట్టూ చూస్తున్న వైఫల్యాలను బట్టి మనము కూడా నేర్చుకోవాలి. లేనట్లయితే అవే పొరపాట్లు చేసి మన పిల్లలను యిబ్బందులకు గురి చేయుదుము.

 

  *దేవుని వాక్యము*

  *ప్రార్థన*

*ద్వారా మాత్రమే మనము మన పిల్లలను నాశనము నుండి కాపాడగలము. అది తప్ప వేరొక మార్గము లేదు.*

 

1 *వాక్యం:*

 

🔹పిల్లలకు చదువుకొన గలిగే వయసు లేనపుడు కూడా మనము *''పిల్లల బొమ్మల బైబిలు''*ను వారికి చదివి విన్పించడం ఒక మంచి అలవాటు.

🔹అలాచేయుట ద్వారా తరువాత సంవత్సరాల్లో వారికి వారే చదువుటకు యిష్టపడుదురు.

🔹 వాక్యములను కంఠస్థము చేయుట మన బిడ్డలను ప్రోత్సహించవలసిన మరియొక మంచి అలవాటు.

👉 ఆ విధముగా మనము కూడా బైబిలు వచనములను కంఠస్థము చేయుటకు ఒక మంచి మార్గము.

 

*మనము మన పిల్లలతో ఎల్లప్పుడు దేవుని వాక్యమును మాట్లాడుతు ఉండినట్లయితే, వారితో మనము సంభాషించుటకు అవకాశములను తెరచి యుంచుకొని నట్లవుతుంది.*

👉 అప్పుడు మనము వారిలో ఏదైనా చెడు అలవాట్లు లేక మాటలు, వారు చదువుకొనే చోట లేక వారి స్నేహితుల నుండి నేర్చుకొనినట్లయితే మనము వెంటనే తెలుసుకొన వచ్చును. అట్లు మనము వాటిని పోగొట్టుటకు వారికి సహాయము చేయగలము.

 

👉 *మన బిడ్డలను దేవుని వాక్యము నిషేధించిన విషయములకు దూరముగా ఉంచవలెను.*

 

👉ఉదాహరణకు,

మన బిడ్డలను క్రైస్తవేతర పండుగలకు తీసుకు వెళ్లకూడదు. మనము కూడా వాటికి వెళ్లకూడదు.

మన బిడ్డలు వారి స్నేహితులతో కలసి క్రైస్తవేతర పండుగలలో పాలుపొందునట్లు మనము ఒప్పుకొన కూడదు.

అన్య పండుగలకు అటువంటి వాటికి వెళ్లుటకు అనుమతించ కూడదు.

 

👉మన బిడ్డలు చీకటికి సంబంధించిన అన్ని విషయాల నుండి వేరుపడాలని నేర్పించినట్లయితే,

👉 వారు దేవునికి మరియు ఆయన వాక్యమునకు భయపడుతూ జీవించుట నేర్చుకొందురు.

 

*మన పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలన్నియు వారి మేలుకొరకు అని మనము చెప్పాలి.*

🔺 అందువలన వారు వాటికి సంతోషముతో విధేయత చూపుదురు. దేవుని వాక్యమునకు పట్టబడుదుమేమో అను భయముతోను లేక శిక్షింపబడుతామేమో అని భయముతోను కాక ప్రేమతోను గౌరవ భావముతోను ప్రేమించి విధేయతను చూపాలని చెప్పాలి.

 

 ఇక తప్పిపోయి దొరికిన చిన్నకుమారుని ఉపమానం ప్రకారం ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా, ప్రార్ధనలో పెంచినా, వాక్యంలో పెంచినా సరే, మీరుకూడా ఎంత భక్తిగా జీవించినా సరే, మీ పిల్లలు మీలాగే భక్తిలో, సత్యములో, ప్రార్ధనలో జీవిస్తారనే గ్యారంటీ లేదు. మీరు వారికోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్ధన చేసినా వారు పడిపోకుండా ఉండరు అని గ్యారంటీ లేదు. దానికి చిన్న కుమారుడే గొప్ప ఉదాహరణ. అందుకే భక్తుడైన యోహాను గారు

3 John(మూడవ యోహాను) 1:4

4.నా పిల్లలు సత్యమును అనుసరించి(సత్యములో) నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు. అని పొంగిపోతున్నారు.

   అయితే మీరు చేస్తున్న ప్రార్ధన, మీ భక్తి, మీరు మీ పిల్లలను ప్రార్ధనలోను, భక్తిలోను, వాక్యానుసారంగా పెంచడం వేస్ట్ అని నేను ఎంతమాత్రము చెప్పడం లేదు.

1. బాలుడు నడువ వలసిన మార్గం వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలిగిపోడు అంటున్నారు సోలోమోను గారు. (సామెతలు 22:6 )

 2. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడింది యెషయా 40:30ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నాయి గాని రెండూ కరెక్టేఎందుకంటే మీరు మీ పిల్లలను ఎంత భక్తిలో పెంచినా బాలుని హృదయంలో దుష్టత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని తొలగించును అని వ్రాయబడింది. (సామెతలు 22:15)  కాబట్టి బాలుడు పెద్దవాడైనప్పుడు, శిక్షాదండము తగ్గినప్పుడు, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు, తనమిత్రులతో కలిసి చాలామంది లోకంలో పడిపోతుంటారు (అందరు యవ్వనస్తులు పడిపోతారు అనికాదు). ఎందుకంటే దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును (1 కొరింథీ 15:33) ఇది సహజం!

అయితే మీ పిల్లలు లోకంలో జారిపోయినప్పుడు మీరు మీ ఆశ వదిలివేయ వద్దు. మీరు పెంచిన మంచి పెంపకం అనగా వాక్యంలో, ప్రార్ధనలో పెంచినందువలన వారు పెద్దవారైనప్పుడు, జీవితంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు, వారు తమ తప్పు తాము తెలిసికొని తిరిగి తప్పకుండా యేసయ్య వద్దకు, మీ దగ్గరకి వస్తారు. మీ ప్రార్ధన తప్పకుండా ఒకరోజు వారిని పట్టుకొంటుంది. మీరు చెప్పిన వాక్యాలు వారిని గద్దిస్తూ ఉంటాయి. నీఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీవాక్యమును ఉంచుకొంటాను అంటున్నారు దావీదు గారు కీర్తన 119:11. ఒకరోజు కార్యరూపం దాల్చి తప్పకుండా వస్తారు. దానికి చిన్న కుమారుడే ఉదాహరణ. మనం నిశితంగా ఈ ఉపమానం పరిశీలిస్తే చిన్న కుమారునికి ఎవరూ బుద్ధిచెప్పలేదు, ఎవరూ తండ్రియొద్దకు రమ్మని చెప్పలేదు. తనకుతానుగా తప్పుతెలిసికొని పశ్చాత్తాప పడి అంటున్నాడు: తండ్రి నేను పరలోకమునకు విరోదముగాను, నీ ఎదుటను పాపము చేసాను నన్ను క్షమించు అని అడిగాడు(18). పరలోకంలో ఎవరుంటారు? దేవుడు! అనగా నేను దేవుని వ్యతిరేఖంగా పాపం చేసాను అని తండ్రిదగ్గర, దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని తిరిగి దేవునిరాజ్యములోనికి వచ్చాడు. కాబట్టి మీపిల్లలుకూడా తప్పకుండా తమ తప్పులు తెలిసికొని దేవుని దగ్గరకు, మీ దగ్గరకు వస్తారు.

 

    ఒకవేళ ఓ తల్లీ/తండ్రీ! మీ పిల్లలను భక్తిలో పెంచకుండా, మీరు మాత్రమే ఆరాధనకు వెళ్తూ, మీ పిల్లలను వారికిష్టమొచ్చినట్లు వదిలేశారా? జాగ్రత్త! దుష్టసాంగత్యము మంచినడవడికను చెరిపివేయును. *ఒకవేళ నీ పిల్లలు నిన్ను ఏడిపిస్తున్నారా? నీమాటలు వినడం లేదా? త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, శీలం కోల్పోయినవారిగా పాపులుగా తిరుగుతున్నారా? దానికి కారణం ఓతల్లీ/తండ్రీ! ముమ్మాటికి నీవే*!!!

 

ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసేద్దుము గాని ఒక ముస్లింని ప్రేమించినది అని భాదపడే వారున్నారు, ఒక అన్యుడిని/అన్యురాలిని ప్రేమించి పెళ్ళి చెయ్యమంటున్నారు అని భాదపడే తల్లిదండ్రులు ఉన్నారు. త్రాగిన మైకంలో మాకొడుకు మమ్మల్ని కొడుతున్నాడు అని ఏడ్చేవారున్నారు. డ్రగ్స్ ఎడిక్ట్గా మారిపోయాడు అని కన్నీరుకార్చేవారున్నారు. నా కూతురు/కొడుకు మా పరువు దేవుని పరువు తీసేసింది/తీసేసాడు అని ఏడుస్తున్నారు కదా! మీ పిల్లలు అలా మారడానికి కారణం ముమ్మాటికి నీవే! *ఎందుకంటే వారికోసం మీరు ఏడవాల్సిన సమయంలో, వారి బాగుకోసం ప్రార్ధించాల్సిన సమయంలో మీరు ఏడవలేదు. కావున ఇప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు*!!!

అందుకే భక్తుడైన యిర్మియా గారు రాస్తున్నారు: స్త్రీలారా! యెహోవా మాట వినుడి,. . . . మీ కుమార్తెలకు రోదనం చేయు విద్య నేర్పుడి, . . .వీదులలో పసిపిల్లలు లేకుండా, వారిని నాశనం చేయుటకు మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, ,మన గదులలో ప్రవేశించుచున్నది. యిర్మీయా 9:20,21.

మన పిల్లలు ఆత్మీయంగా /శారీరకంగా చనిపోయేలా సాతానుగాడు వాడి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడు. దానిని ఎదుర్కోవాలంటే : మన కన్నులు కన్నీళ్ళు విడచునట్లు గాను, మన కన్నులనుండి నీళ్ళు ఒలుకునట్లు గాను,త్వరపడి రోదన చేయవలెను. యిర్మియా 9:18. మన దేశంలో ఎంతో మంది యవ్వనస్తులు అకాలమరణం చెందుతున్నారు అతివేగం వలన, త్రాగుడు వలన, అక్రమ సంభందాల వలన, ప్రేమ వైఫల్యాల వలన, సాతాను ప్రేరేపణవలన! వారు క్షేమంగా ఉండాలంటే ప్రియమైన తల్లీ తండ్రీ! *ప్రతీరాత్రి కొన్ని నిమిషాలైనా వారు పడుకున్న తర్వాత వారి పడక దగ్గర మోకరించి ప్రార్ధించాలి. నీ కళ్ళనుండి నీరు వారి పడకల దగ్గర కారాలి*!!!.

      భక్తురాలు, తల్లి సూసన్నగారు తనకున్న 13మంది పిల్లల పడక దగ్గర ప్రార్ధన మొదలుపెడితే పదముగ్గురి దగ్గర ప్రార్ధన ముగించేసరికి తెల్లవారిపోయేదంట. ఆమె ప్రార్ధన ఆమె బిడ్డలనందరిని దైవసేవకులను చేసింది. జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఆమె సంతానమే!

నా తల్లి కన్నీటిప్రార్ధనా ప్రవాహంలో దేవునిరాజ్యానికి  కొట్టుకొని వచ్చాను అంటున్నారు భక్తుడైన అగస్టీన్. కాబట్టి నీబిడ్డలకోసం ప్రార్దిస్తున్నావా? వారిని వాక్యంలో ప్రార్ధనలో పెంచుతున్నావా?

 

     ఈరోజు నేను, మా అన్నయ్యలు, అక్కలు అందరూ భక్తిలో ఉండటానికి, అనేకమందికి సాక్ష్యార్ధముగా ఉండటానికి మా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్దనే!!! రాత్రిళ్ళు మా తల దగ్గర ఏడ్చి ప్రార్ధన చేస్తుంటే *ఇప్పుడు ఎవడు పోయాడంటూ విసుక్కునే వారం*! కాని ఆ ప్రార్ధన మమ్మల్ని పట్టుకొంది, మా ప్రవర్తనను కాచింది. నేడు దేవునికి సాక్ష్యార్ధమైన జీవితానికి కృషి చేసింది.

కావున ప్రియ తల్లిదండ్రులారా!

మీరు ప్రార్దిస్తున్నారా?

 అయితే మీ ఆశ వదులుకోవద్దు!

ఇంకా ప్రార్ధించడం లేదా?

నేడే మీ పిల్లలకోసం ప్రార్ధించడం మొదలుపెట్టండి.

వాక్యమును మీ బిడ్డలకు నేర్పండి!

వాక్యముతో మీ కుటుంబాలను కట్టండి!

కుటుంబ ప్రార్థన తప్పకుండా చేయండి!

 

అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*50వ భాగము*

1 పేతురు 2:4--5

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక 4--7 వచనాలలో క్రీస్తు యేసు ఎవరో ఆయన మనలను ఎవరినిగా చేశారో చాలా వివరంగా చెబుతున్నారు!!

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

చూడండి మొదటగా యేసుక్రీస్తు ప్రభులవారు మొదటగా ఈ లోకంలో మనుష్యుల చేత విసర్జించబడ్డారు గాని దేవుని చేత ఏర్పరచబడి ప్రేమించబడ్డారు.

మత్తయి 21:42

మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

 

మార్కు 8:31

మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.

 

మార్కు 9:12

అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?

 

లూకా 17:25

అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరమువారిచేత ఉపేక్షింపబడవలెను.

 

యోహాను 1:11

ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

 

అపో.కార్యములు 4:10

మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

అపో.కార్యములు 4:11

ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

అపో.కార్యములు 4:12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

 

యేసుక్రీస్తు ప్రభులవారు అందరిచేత విసర్జించబడినా సర్వలోకజనులకు రక్షకుడయ్యారు. ఈ రోజు నీవు నేను జనులతో త్రోసివేయబడినా వారి రక్షణకు కారణమవ్వాలి! వారందరినీ మన ప్రవర్తన ద్వారానే రక్షణ లోనికి తేవాలి!!

 

ఇక రెండవదిగా: యేసుక్రీస్తు ప్రభులవారు  మనుష్యలతో విసర్జించబడినా దేవునిచేత ప్రేమించబడ్డారు!

మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. మనుషులు తాము నిర్మిస్తున్న కట్టడానికి క్రీస్తు పనికిరాడనుకున్నారు.

మత్తయి 3:16

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

మత్తయి 3:17

మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

 

లూకా 9:35

మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, (అనేక ప్రాచీన ప్రతులలో- నా ప్రియకుమారుడు అని పాఠాంతరము) ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

 

ఇక మూడవదిగా: యేసుక్రీస్తు ప్రభులవారు అమూల్యమును సజీవమునైన రాయి!

రాయి అంటే యేసుప్రభువు. విశ్వాసులు ప్రాణం లేని విగ్రహాలను ఆశ్రయించరు. సజీవుడైన వ్యక్తినే ఆశ్రయిస్తారు. ఆయన సజీవమైన రాయి! అందుకే

1) మోషేగారు ఆ బండను కొట్టగా లక్షలమందికి, లక్షల పశువులకు దాహం తీర్చగలిగారు ఆనాడు!

నిర్గమకాండము 17:6

ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

 

సంఖ్యాకాండము 20:11

అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.

 

కీర్తనలు 78:20

ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.

 

1కోరింథీయులకు 10:4

అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

 

ఈ బండ సజీవమైనది! ఆనాడు వారి దాహాన్ని తీర్చగలిగెను. ఈరోజు మానవాళి రక్షణకు కారణమాయెను. అదే బండ ఈరోజు అనేకుల ఆత్మ దాహాన్ని తీరుస్తుంది!!!

అలాంటి సజీవమైన రాయియైన క్రీస్తు యేసుని మనము కలిగియున్నాము!!

 

 ఈ సందర్భంగా మరోమాట చెప్పనీయండి! ఇదే పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభులవారు నీవు కేఫా అనబడుదువు అనగా రాయి అనబడుదువు. ఈ బండమీద నా సంఘమును కడతాను అన్నారు!

యోహాను 1:42

యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని (మూలభాషలో-క్రీస్తు) అర్థము. యేసు అతనివైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

 

మత్తయి 16:18

మరియు నీవు పేతురువు (పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

మత్తయి 16:19

పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే సజీవమైన రాయియైన యేసుక్రీస్తు ప్రభులవారు, సీమోను అనే రెల్లు గడ్డిని మరో సజీవమైన రాయి కేఫా లేదా పేతురు గా చేసి, ఆ సజీవమైన రాయిని ఉపయోగించుకుని సజీవమైన సంఘాన్ని కడుతున్నారు!!!

 

నీవు నేను ఆ సజీవమైన సంఘంలో సజీవమైన రాళ్లుగా ఉన్నాము! మరి నీలో జీవము ఉందా?! ఉంటే ఆ రోజు అనేకులకు ఆ రాయి దాహము తీర్చగలిగింది కదా మరి నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావు? ఎంతమందిని క్రీస్తు వద్దకు నడిపించావు? నీలో జీవము ఉంటే ఫలాలు ఫలిస్తావు. ఆత్మఫలము, వరములు ఫలములు ఉన్నాయా లేదా గొడ్డు జీవితం జీవిస్తున్నావా?! తోటకాపరి ఫలములేని వృక్షమును నరికివేయుము అని తోటకు అధికారి చెప్పే సమయం ఆసన్నమైంది అని గుర్తు చేసుకో!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*51వ భాగము*

 

1 పేతురు 2:4--5

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా ఇక ముందుకు పోతే 5వ వచనంలో: మనము అమూల్యమైన సజీవమైన రాయియైన ప్రభువువద్దకు వచ్చిన వారమై

1) మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

2) యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

ఈరోజు మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం!

 

మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

సజీవమైన రాళ్ళు సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా (1 కొరింతు 14:15). మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలోనుంచే జీవ జలం పారుతూ ఉంది.

1కోరింథీయులకు 14:15

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

 

ఆ ఆత్మ జీవము నిస్తుంది!

రోమీయులకు 8:2

క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

 

కారణం యేసే జీవము!

యోహాను 14:6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

 

యోహాను 17:3

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

 

యోహాను 4:10

అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.

యోహాను 4:14

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

 

కాబట్టి ఆయన సజీవమైన రాయి. ఆ రాతిని పొందిన నీవుకూడా సజీవమైన రాయివి!

 

అయితే నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నావు!

దేవుడు నమూనా తయారు చేసేవాడు, కట్టేవాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాట్లు చేశారు, దానిని చక్కగా తీర్చి దిద్దుతున్నారు అన్న విషయంలో మనకు సందేహం అవసరం లేదు. ప్రతి రాయీ ఏ స్థానంలో ఉండాలో ఆయనకు చక్కగా తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్ళను తీసేసి వేరే రాళ్ళను అక్కడ పెట్టవలసిన అవసరం ఆయనకు కలగదు. దేవుడు ఒక చేత్తో రాళ్ళను తీసేస్తూ ఒక చేత్తో నిర్మిస్తూ ఉండడం జరగడం లేదు.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:19,20,21,22

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

హెబ్రీయులకు 3:6

అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

1కోరింథీయులకు 3:9

మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

1కోరింథీయులకు 3:10

దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

1కోరింథీయులకు 3:11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

1కోరింథీయులకు 3:12

ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

1కోరింథీయులకు 3:13

వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

1కోరింథీయులకు 3:14

పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

1కోరింథీయులకు 3:15

ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

1కోరింథీయులకు 3:16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

1కోరింథీయులకు 3:17

ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

సంఘాన్ని దేవుని పొలముతోను లేక వ్యవసాయముతోనే కాకుండా మీరు దేవుని గృహము అంటున్నారు 9వ వచనంలో!! అయితే మనము బుర్రలు పాడుచేసుకోకుండా 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడు అనియు మీరెరుగరా అంటున్నారు! అనగా మనము ఏ గృహముగా కట్టబడుచున్నాము అంటే దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము! ఇంకా ఎఫెసీ 2:22 లో కూడా అంటున్నారు మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు....

ఎఫెసీయులకు 2: 22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

అయితే పేతురు గారు ఆత్మావేశుడై అంటున్నారు మీరు దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయనకోసం పరిశుద్ధమైన యాజకులుగా ఉండేలాగున మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు!

 

(గమనించాలి: గతభాగాలలో లేఖనాలు పరిశీలించడం అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి అని చెబుతూ లేఖనాలు పరిశీలించడం ఇలానే చెయ్యాలి అని చెప్పడం జరిగింది! పౌలుగారు మనము దేవుని ఆలయముగా దేవుని గృహముగా కట్టబడుచున్నాము అని ఆత్మావేశుడై ఇక్కడ చెబితే అనగా కొరింథీ పత్రికలో చెబితే అదే పరిశుద్దాత్ముడు పేతురు గారిని ఉపయోగించుకుని పరిశుద్ధ యాజకులుగా ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని దేవునిచేత మీరు ఆత్మ సంబంధమైన మందిరము అనగా దేవాలయముగా కట్టబడుచున్నారు అని రాశారు! లేఖనం- లేఖనము తో పోల్చబడి సరిగా ఉంది! ఇదీ లేఖనాలు పరిశీలించే విధానం!!!)

 

కాబట్టి ఇక్కడ మనకు మనము దేవునికి ఆలయముగా దేవుడు నివశించే మందిరముగా కట్టబడుచున్నాము అని అర్ధం అవుతుంది! మరి ఇలా కట్టబడాలంటే కొద్దిగా కట్టడాల కోసం ధ్యానం చేద్దాం!

 

ప్రియులారా! గతభాగములో కొలస్సీ పత్రిక 2:6-7 ధ్యానం చేసుకుంటూ, క్రీస్తులో వేరుపారడం కోసం ధ్యానం చేసుకున్నాం!

ఇక ఈరోజు ఇంటివలె కట్టబడటం కోసం ధ్యానం చేద్దాం!

 కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.. .

 

 మనం పౌలుగారు విశ్వాసులను మొక్కలతో/ చెట్లతో పోల్చడం చూశాం!

నేడు ఈ భాగంలో పౌలుగారు విశ్వాసులను ఇంటితో/ కట్టడంతో పోలుస్తున్నారు! అయితే అది ఏ ఇల్లు? దేవుని ఇల్లు! ఎఫెసీ 2:19-22 వరకు చూసుకుంటే చాల విపులంగా కనిపిస్తుంది మనకు!

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిమీద కట్టబడియున్నారు అంటున్నారు.

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

ఇక్కడ వారు ఏ పునాది మీద కట్టబడుతున్నారు? క్రీస్తుయేసు అనే పునాదిమీద! ఆ పునాది క్రీస్తే!! 1కోరింథీయులకు 3: 11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 1పేతురు 2: 4,5

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

   ఇక ఇల్లు కట్టాలి అంటే పునాది వేయాలి! ఆ పునాది దేనిమీద కట్టబడింది అనేది చూసుకోవాలి.  ఇప్పుడు మనమూ యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మరో ఉపమానం: .......

Matthew(మత్తయి సువార్త) 7:24,25,26,27

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

 

బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కట్టిన ఇల్లుకోసం యేసయ్య చెప్పిన ఉపమానంలో చూసుకుంటే, ఒకడు తన ఇల్లు ఇసుకమీద కట్టాడు; మరొకడు బండమీద కట్టాడు. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడి నందువలన గాలి, తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!!

 

 ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను! నీవు కేవలం Material Blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలి పోక తప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోధనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు!!

 

అయితే గతంలో చెప్పిన విధముగా క్రీస్తుమీద ఆనుకొన్న వారికి బండమీద కట్టబడిన వారికి- గాలి, వాన లాంటి శ్రమలు రాకతప్పవు! వాటిని తట్టుకొంటేనే పరలోకం!

 

ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంతలోతుగా తీసి కడితే, అంత బలంగా ఉంటుంది ఆ ఇల్లు! అలాగే శ్రమలయందు వేరుపారినప్పుడునీకు ఎన్ని కష్టాలు, శోధనలు వస్తాయో, నీవు అంత విశ్వాసంలో లోతుకు వేరుపారుతావు! అప్పుడు నీ విశ్వాస స్థాయి / పరిమాణం పెరిగి ఎన్ని కష్టాలు,శోధనలు వచ్చినా ధైర్యంగా ఉండగలవు!

కేవలము Material Blessings కోసం చూస్తే, కష్టనష్టాలలో సోలిపోక తప్పదు!

 

  ఇక పునాది తీసేటప్పుడు రాళ్ళు, చిల్లపెంకులు, గాజుపెంకులు, ఎముకలు లాంటివి ఉంటే తీసిపారేస్తారు! అలాగే నీలో ఉన్న బండలాంటి హృదయం,

లోకాశలు, లోకాచారాలు అన్నీ తీసి పారేస్తే, ఆ పునాది దిట్టంగా ఉంటుంది!

 

    ఇక చివరగా, 1 కొరింథీ 3:11-17 వరకు చూసుకుంటే క్రీస్తు అనీ పునాది మీద కాకుండా ఎవడైనా మరో పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివాటితో కడితే- ఆ పనితనం అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ అగ్ని- శ్రమలు అనే పరీక్షలు! ఇక బంగారం, వెండి వెలగల రాళ్ళు అనేవి వివిధ రకాలైన బోధలు!!

 

   అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు!

 

  ప్రియ చదువరీ!  నీ పునాది దేనిమీద? క్రీస్తుమీదనా?

ధనం మీదా?

శ్రమలలో తట్టుకొంటున్నావా? సోలిపోతున్నావా?

 పరీక్షించుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*52వ భాగము*

1 పేతురు 2:4--5

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా ఇక ముందుకు పోతే 5వ వచనంలో: మనము అమూల్యమైన సజీవమైన రాయియైన ప్రభువువద్దకు వచ్చిన వారమై

1) మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

2) యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

ఈరోజు రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం!

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

మొదటగా పరిశుద్ధ యాజకులుగా చేశారు అంటున్నారు!

 విశ్వాసులు దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండడమే కాదు. ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యాజకులుగా కూడా ఉండబోతున్నారు 9;

 

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ప్రకటన 1:6;

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

Hebrews(హెబ్రీయులకు) 10:19,20,21,22

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21 .దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాస విషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

క్రొత్త నిబంధనలో విశ్వాసులలో ప్రత్యేకమైన యాజక వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యాజకులే. యేసుప్రభు శిష్యులలో, లేక రాయబారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూయాజకుడుఅని బైబిల్లో పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చినవారిలోయాజకుడుఅనే ప్రత్యేకమైన పదవి లేదు

 

ఎఫెసీయులకు 4:13

పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 

1కోరింథీయులకు 12:28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

 

కనుక విశ్వాసులంతా యాజకులుగా ఉండదగినవారే! వారికున్న సామర్థ్యం బట్టి వారిని ఏలేవారిగా దేవుడు చేశారు. కాబట్టి దేవుడైతే రాజులుగాను యాజకులుగాను మనలను చేశారు. అయితే నీ విశ్వాస సామర్థ్యం బట్టి నీవు కేవలం రాజుగా ఉంటావా, యాజకునిగా ఉంటావా లేదా రెండు కలిగిన వానిగా ఉంటావా అనేది నిర్ణయించబడుతుంది లేక వాడబడతావు!!!

 

 ఇక రెండవది: యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు...

దేవునికి అనుకూలమైన ఆత్మసంబంధమగు బలులు అర్పించాలి!

యాజకులు అంటే దేవునికి ఏదో ఒకటి అర్పించవలసినవారు. పూర్వకాలంలో జంతు బలులు ఉండేవి. ఇప్పుడు దేవుడు ఆ అహరోను యాజక ధర్మమును అనగా జంతుబలి వ్యవస్థ ను కొట్డివేసి యేసుక్రీస్తు ద్వారా మెల్కీసెదకు క్రమము ఏర్పాటు చేశారు. దీనిలో జంతుబలులు లేవు! మరి ఇప్పుడు విశ్వాసులు బలులుగా ఏమి అర్పించాలి?!!!!

ఇప్పుడు  యాజకులుగా ఉన్న విశ్వాసులు తమను, తమ స్తుతులను, తాము ప్రేమతో దయతో చేసే క్రియలను దేవునికి అర్పించాలి.

Romans(రోమీయులకు) 12:1,2

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

Hebrews(హెబ్రీయులకు) 13:15,16

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.

 

కీర్తనలు 141:2

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

 

గమనించాలి మనకు  ప్రత్యక్ష గుడారములో ఆవరణంలో గంగాళం కనిపిస్తుంది. దీనిలో యాజకులు యాజకత్వము చేసేముందుగా, ఇంకా పరిచర్య చేసేముందు కడుగుకుంటారు. అయితే ఇది భూమిమీద మనుష్యులు దేవుని సన్నిధిని సమీపించి తమ పాపములను కడుగుకోవడాన్ని సూచిస్తుంది. దానిలో గల నీరు విశ్వాసులు కార్చే కన్నీరు లేక పశ్చాత్తాపంతో చేస్తే కన్నీటి ప్రార్దన అనిగ్రహించాలి! దేవుని వాక్యపువెలుగులో ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మన రహస్యపాపములు కనబడినప్పుడు వాక్యం మనలను గద్దించినప్పుడు వెంటనే ఆ గద్దింపుకు లోబడి పాపిని ప్రభువా నన్ను క్షమించమని నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్ధన చేస్తే ఆ కన్నీటితో దేవుని పాదములను తడిపితే తడిచిన పాదాలతో ఆయన నిన్ను దాటుకుని పోలేరు! ఆ గంగాళములో నీ పాపములు శుద్ధి అయిపోతాయి!

 

ఇంకా అక్కడ మనకు కనబడేది ఇత్తడి బలిపీటం! ఇది యేసుక్రీస్తుప్రభులవారు చేసిన యేసుక్రీస్తుప్రభులవారు ఆ కల్వరి గిరిలో చేసిన బలియాగమునకు గుర్తు! ఎందుకంటే ఈ బలిపీటం మీదనే రక్తమును చిందించి అర్పిస్తారు. అలాగే ఆ కల్వరికొండమీద యేసుక్రీస్తుప్రభులవారి బలియాగం వలననే నీకు నాకు విమోచన కలిగింది. దానికి సూచనగా వారు ఇత్తడి బలిపీటము చేసారు. గమనించాలి! ఆ ప్రత్యక్ష గుడారం గాని, ధర్మశాస్త్రము గాని రాబోయే లేక జరుగబోయే వాటికి సూచన మాత్రమే గాని నిజమైనది క్రీస్తుయేసులో ఉంది అని పౌలుగారు చాలాసార్లు చెప్పారు! కాబట్టి ఇవన్నీ అనగా బలిపీటం గాని, ఇత్తడి బలిపీటం గాని, కరుణా పీఠం గాని, సువర్ణదూపార్తి గాని, కెరూబులు గాని, ఇవన్నీ దేవుని సన్నిధిని సూచించే యేసుక్రీస్తుప్రభులవారినే సూచిస్తున్నాయి! వాటిని వారు ఆ చాయలు తయారుచేసుకుని ఆరాధించేవారు! ఇవన్నీ దేహశుద్ధి కోసమే తప్ప ఆత్మశుద్ధి కోసం కాదు!

 

అయితే ఈ నూతన నిబంధన సంఘంలో గల మెల్కీసెదెకు క్రమంలో జరిగే ఈ కార్యక్రమాలు అన్నీ మనస్సును, ఆత్మను హృదయాన్ని శుద్ధిచేస్తాయి! పాత నిబంధనలో ఉన్నవి క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నాయి! వాటిని దేవుడు కొట్టివేయలేదు- పూర్తిచేసి లేక నెరవేర్చి- వాటిని క్రొత్త పోలికలో కేవలం దేహాన్ని మాత్రమే కాకుండా తనువూ మనస్సు ఆత్మ కూడా శుద్ధి అయ్యేలా, ఇకను పాపం చేయకుండా చేసేలాగా దేవుడు క్రొత్త నిబంధనలో ఏర్పాటుచేశారు. ఈ క్రమమే మెల్కీసేదేకు క్రమము!

 

అయితే మీరనవచ్చు మరి వారు నైవేద్యాలు ధూపాలు వేసేవారు కదా మనం వేయడం లేదు కదా! వారు బలి అర్పించేవారు కదా మనం చేయడం లేదు కదా అంటే మనం కూడా వాటిని చేస్తున్నాము!

ఎలా అనొచ్చు మీరు!

 

మనం కూడా యాగములు చేస్తున్నాము. అదే స్తుతియాగం! కీర్తనలు 50: 14, 23

దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

స్తుతియాగం చెల్లించేవాడు నన్ను మహిమ పరుస్తున్నారు అంటున్నారు దేవుడు!.

 

బలి!! మనం కూడా బలులు అర్పిస్తున్నాము. ఏమిటవి? విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలి అని కీర్తన 51:17 సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో ప్రార్ధన చేయడమే ఆయనకు ఇష్టమైన బలి!

 

మరి ధూపము! కీర్తన 141:2 నా ప్రార్ధన ధూపము వలెను, నేను చేతులెత్తుట అనగా మనం చేతులెత్తి ప్రార్ధన చెయ్యడమే ఆయనకు సాయంకాల నైవేద్యంలా ఉంటుంది. అందుకే పౌలుగారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయమని చెప్పారు. 1తిమోతి 2:8;

 

  కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! ఇవన్నీ మనం కూడా చేస్తున్నాము! అవి అనగా పాత నిబంధన ఆచారాలు ఇప్పుడు మనం చేసేవాటి యొక్క సూచనలు మాత్రమే! వారు చేసినది సూచనలు! మనం చేసేవి యధార్ధమైనవి! కాబట్టి విరిగినలిగిన హృదయం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే ఆయన మనలను పరిశుద్ధాత్మతో నింపి ఆయన మహిమలో మనలను నింపుతారు. అంతేకాకుండా మనం చేసే ఆరాధన ఇశ్రాయేలువారు చేసినట్లు ఆచారపరంగా చేస్తే ఉపయోగం లేనేలేదు! ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని ఆయన సెలవిచ్చారు. యోహాను 4:24;

 

 కనుక ప్రియ స్నేహితుడా! పెదాలతో దేవుణ్ణి ఆరాధించకుండా నిజంగా హృదయ పూర్వకంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చెయ్యాలి. అంతేకాకుండా నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ బలముతోనూ ఆయనను ఆరాదించ బద్ధులమై ఉన్నాము!

ప్రియ స్నేహితుడా! నీవెలా ఆరాధన చేస్తున్నావు?

ఒకసారి నిన్నునీవు పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*53వ భాగము*

1 పేతురు 2:6--8

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

8.కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఆరవ వచనంలో ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

ఆ రాయి కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!

యెషయా 28:16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

జెకర్యా 1:4

మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

 

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

కాబట్టి ఆ రాయి యేసుక్రీస్తు ప్రభులవారు!! ఈయనయందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు!

పౌలుగారు అంటున్నారు:

రోమీయులకు 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

రోమీయులకు 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

ఇక ఏడవ వచనంలో అంటున్నారు విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

గమనించాలి ఆయనలో నమ్మకం విశ్వాసము ఉంచిన వారికే క్రీస్తు ప్రియమైనవాడు. వారే ఆయన విలువను చూడగలుగుతారు, ఆయన్ను ప్రేమించగలుగుతారు.

అందుకే మొదటి అధ్యాయంలో అన్నారు 1 పేతురు 1:8

8 మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు.

 

ఇక నిషేదించిన రాయి కూడా యేసుక్రీస్తు ప్రభులవారే!

కీర్తనలు 118:22

ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.

కీర్తనలు 118:23

అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము

ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభులవారిని రక్షకునిగా మెస్సయ్యగా నిరాకరించారు కాబట్టి ఆ రక్షణ భాగ్యం మనకు దొరికింది!

మత్తయి 21:42

మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

మత్తయి 21:43

కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

ఈ ఉదాహరణలోని ఆధ్యాత్మిక వివరణను యేసుప్రభువు ఇక్కడ చెప్తున్నారు. కీర్తన 118:22-23లో ఉన్నకట్టేవారు తీసి పారవేసిన రాయిఆయనే. దేవుడు తన ద్రాక్షతోటను (తన రాజ్యాన్ని) తన కుమారుణ్ణి నిరాకరించినది యూదా జాతి! (యోహాను 1:11) ఇప్పుడు ఆ రాజ్యమును వారి దగ్గర్నుంచి తీసివేసి ఇతరులకిస్తాడు. ఇతరులంటే క్రీస్తును స్వీకరించే ఇతర జాతులవారు. కొద్ది కాలంలోనే సంఘాల్లో ఇతర జాతులవారే అధిక సంఖ్యాకులయ్యారు (ఇప్పటికీ ఇలానే ఉంది). యేసుప్రభువును అభిషిక్తుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించనివారి గతిని వ 44 వెల్లడిస్తున్నది. అపొ కా 4:11; రోమ్ 9:32-33; 1 పేతురు 2:6-8 కూడా చూడండి.

అపో.కార్యములు 4:11

ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

అపో.కార్యములు 4:12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

 

ఇక ఎనిమిదవ వచనంలో కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

దేవుని సత్యానికి లోబడనివారు సత్యం విషయంలో తొట్రుపడుతారు. ఆ సత్యం క్రీస్తే (లూకా 2:34). ఆయనను కోరుకున్నవారు పై స్థాయికి లేస్తారు. ఆయనను కోరుకోనివారు పడిపోతారు.

యెషయా 8:14

అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

యెషయా 8:15

అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

 

రోమీయులకు 9:33

ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

 

ఇక దానికే వారు నియమించబడ్డారు అనగా నాశనమునకు యూదులు నియమించబడ్డారు. దీని అర్థం బహుశా యూదాజాతి క్రీస్తును తిరస్కరించడం గురించి పేతురు గారు చెప్తున్నారు. యేసుప్రభువు, ఆయన అపొస్తలుడు పౌలుగారు కూడా దీనిని వివరించేందుకు కీర్తనలు, యెషయా గ్రంథాల్లో నుంచి రిఫరెన్సులను వాడుకున్నారు. ఈ అంశం గురించి రోమ్ 911 అధ్యాయాలు చూడండి.

ముఖ్యంగా రోమ్ 9:14-24, 30-33; 11:7-12, 22-32 చూడండి.

 

9:30,31,32,33

30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;

31. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు,

32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.

33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

౩౦౩౩ వచనాలు ప్రకారం . . .

చూడండి నీతిని వెంటాడని అన్యజనులు అనగా మనం నీతిని, విశ్వాసపు మూలమైన నీతిని పొందుకున్నాం! అయితే ఇశ్రాయేలు వారు నీతిని వెంటాడక, ఆ నీతికి కారణమైన నియమాన్ని అనగా ధర్మశాస్త్రమును వెంటాడి అ నీతిని పొందుకోలేకపోయారు అంటున్నారు.

యూదులు తమ మతం విషయంలో కష్టపడ్డారు. వారికి దేవుని ధర్మశాస్త్రం ఉంది. దాన్ని పాటించడానికి ప్రయత్నించడమనే మార్గం ద్వారా దేవునికి అంగీకారం కావాలని చూశారు. కానీ తమ క్రియలను బట్టి నిర్దోషులూ న్యాయవంతులూ కావాలన్న ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు (3:9, 19, 20). ఇతర ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం లేదు. నిర్దోషత్వం గురించి అంతగా పట్టింపు లేదు. కానీ వారు క్రీస్తు శుభవార్తను విన్నప్పుడు నమ్మకం ఉంచి నిర్దోషులయ్యారు/ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నమ్మకం మూలంగానే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచారన్నమాట (3:22, 26, 28; 5:1).

32,౩౩.... యూదులైతే అలా కాకుండా దేవుడు యెరూషలేములో ఉంచిన రాయియైన యేసుప్రభువును నిరాకరించారు (యోహాను 1:11

ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

; మత్తయి 21:42; అపొ కా 4:11; 1 పేతురు 2:6-8).

 

   కీర్తనలు 118:22లో భక్తుడు ప్రవచించారు: ఇల్లు కట్టువారు నిషేదించిన రాయి మూలకు తలరాయి ఆయెను! దానినే యేసుక్రీస్తు ప్రభులవారు మత్తయి 21:42లో , లూకా 20:17 లో ఎత్తి చెబుతున్నారు. ఆ మూలరాయి, ఆ అడ్డురాయి యేసుక్రీస్తు ప్రభులవారు! ఇశ్రాయేలీయులు ఆ రాయిని తిరస్కరించారు. పతనమయ్యారు.

యూదులు అలా పతనం కావాలని దేవుడు ముందుగా నిర్ణయించినందువల్ల వారలా అయ్యారని పౌలు అనడం లేదని గమనించండి. వారి సొంత విధానాలవల్లే పతనమయ్యారు.

     ప్రియ దైవజనమా! ఆ మూలరాయిని తెలుసుకున్న నీ పరిస్తితి ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. పతనమయ్యారు. నీవు తెలుసుకుని కూడా తిరస్కరించావా? నీవుకూడా పతనమైపోతావు జాగ్రత్త!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*54వ భాగము*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

దేవుడు చీకటి నుండి మనలను పిలుచుకున్నారు.

ఏం చీకటి అది?

లోకమనే చీకటి! ఆత్మీయ అంధకారం!

 

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

యెషయా 9:12

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

 

మొదటి వచనం అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన ఈ సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు....

 

 ఇక్కడ మబ్బు అనగా శ్రమలు వేదన మరియు క్రీస్తుయేసు కోసం నిజమైన వెలుగు రాకుండా చేస్తున్న /అడ్డుకుంటున్న చీకటిని లేకుండా చేస్తారు అంటున్నారు!   ఇంకా చీకటి అనగా ఆధ్యాత్మిక అంధకారమని గ్రహించాలి! దీనిని లేకుండా చేస్తున్నారు.

 యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు: నేను లోకమును వెలుగునై యున్నాను, మీరు కూడా లోకానికి వెలుగులా ఉండాలి అన్నారు!

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

యోహాను 9:5

నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

 

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31

నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన....

 

యోహాను 12:35

అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు

యోహాను 12:36

మీరు వెలుగు సంబంధులగునట్లు (మూలభాషలో- వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

యోహాను 12:40

వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

యోహాను 12:46

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

 

 ఇంకా వెలుగుకోసం అనేక రిఫరెన్సులు ఉన్నాయి గాని కొన్నిమాత్రం చెప్పడం జరిగింది, యోహాను గారు సువార్త వ్రాయడం మొదలుపెట్టి నిజమైన వెలుగు ఉంది దానిని లోకము గ్రహించడం లేదు, ఆ వెలుగు యేసుక్రీస్తుప్రభులవారే అని మొదటి అధ్యాయంలో చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది. ఆయనను రక్షకునిగా అంగీకరించడమే వెలుగులోకి రావడం అని గ్రహించాలి!

పౌలుగారు అంటున్నారు అపో.కార్యములు 26:18

వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

 

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

ఎఫెసీయులకు 5:8

మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.

ఎఫెసీయులకు 5:9

వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.

ఎఫెసీయులకు 5:10

గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి

ఎఫెసీయులకు 5:11

నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.

ఎఫెసీయులకు 5:12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.

ఎఫెసీయులకు 5:13

సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్ష పరచబడును; ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గదా

ఎఫెసీయులకు 5:14

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.

 

కొలస్సీయులకు 1:13

ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క (మూలభాషలో- తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

 

అయితే యోహాను గారు అంటున్నారు 1యోహాను 1:5

మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

1యోహాను 1:6

ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

కాబట్టి వెలుగై యున్న నీవు మొదటగా: వెలుగు పనులే చేయాలి గాని చీకటి పనులు చీకటి కార్యాలు చేయరాదు! లోకస్తులు చేసే పనులు నీవు ఎంత మాత్రము చేయకూడదు కారణం ఆయన మనం చీకటిగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుచుకున్నారు!

 

ఇక రెండవది: ఒకసారి ఆలోచిద్దాం! ఒకవేళ దొంగ ఈ రాత్రికి రాబోతున్నాడు అని ముందుగా తెలిసింది అనుకుందాం! లేక మీ వీధిలో ప్రతీరోజు ఏదో ఒక గృహంలో దొంగతనం జరుగుతుంది అనుకుందాం! అప్పుడు రాత్రులు మీరు పడుకుంటారా? ఏమాత్రం అశ్రద్ధ ఏమరుపాటు లేకుండా రాత్రంతా ఎవరో ఒకరు కాపలాకాస్తూ సిద్ధంగా ఉంటారు దొంగను ఎదుర్కోడానికి!

 

అలాగే విశ్వాసి కూడా చీకటిలో లేడు వెలుగులో ఉన్నాడు గాబట్టి పరలోకం నుండి దేవుడు వచ్చే సమయం కోసం విశ్వాసి కూడా ఏమరపాటు లేకుండా ఎంతో సిద్ధపాటుతో ఎంతో జాగ్రత్తగా ఎదురుచూస్తూ ఉండాలి!

 

బుద్ధిలేని కన్యకల ఉపమానం ప్రకారం సిద్ధపాటు లేకపోతే బుద్ధిలేని కన్యకలను దేవుడు వదిలి వెల్లిపోయినట్లు నిన్ను కూడా వదిలిపెట్టేస్తారు జాగ్రత్త!... ఆ తర్వాత నీ పేరిట నేను ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా! నీకు కోటిరూపాయలు కానుక ఇవ్వలేదా అంటే అక్రమము చేసే వారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటారు జాగ్రత్త!

 

ఇక మూడవదిగా: కాబట్టి వెలుగై ఉన్న నీవు ఆ వెలుగును అందరికీ పంచాలి! ఎలా అంటే నీలో ఉన్న వెలుగు ఫలము అనబడే ఆత్మఫలము ఫలిస్తే ప్రేమ సంతోషము సమాధానం మంచితనము ఆశానిగ్రహము దయాలత్వము దీర్ఘశాంతము ఇవన్నీ పనిచేస్తే ప్రజలు నీ వెలుగులోనికి నిన్నుచూసి వస్తారు! నీలో పనిచేస్తున్న వెలుగుతున్న వెలుగే అనగా నీలో పనిచేస్తున్న ఈ ఆత్మఫలము అనేకమందిని నీ దగ్గరకు ఆకర్షిస్తుంది. అప్పుడు అనేక జనాలకు నీవే ఒక కరపత్రికగా మారి దేవుని వెలుగులోనికి వస్తారు! నీవే చీకటి అయితే నీవే వ్యభిచారివి త్రాగుబోతువి మధ్యపానివి దొంగవు దోచుకొనువాడవు అయితే ఎవరు నీ దగ్గరికి వస్తారు??? దేవుని నామానికి అవమానం తెచ్చి నీవే చీకటిలో ఉన్నవాడవుగా ఉన్నావు! 

 

ప్రియమైన సహోదరీ సహోదరుడా! నీ కుమారుడు కుమార్తె/ నీ భర్త/ బంధువులు/ ఇరుగుపొరుగు వారు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా అన్యులుగా చీకటిలో జీవిస్తున్నారు కదా, మరి వారికోసం ప్రార్దిస్తున్నావా?

వారికి సువార్త వెలుగును రుచి చూపించావా? వారికి రక్షణ వార్తను ప్రకటించావా?!!

లేకపోతే వారి ఆత్మలయొక్క లెక్క దేవుడు నిన్ను అడుగుతారు అని మర్చిపోకు!

నీవు వెలుగుగా జీవించి అనేకులకు నీ వెలుగును క్రీస్తుని అందరికీ పంచు!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*55వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-13*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

 

      (గతభాగం తరువాయి)

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం చూసుకుందాం!

ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము....

మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము:

 

ఎలా ప్రచురము చేయాలి?

నాకు రెండు విధాలుగా అని తోస్తుంది!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

 

గుణాతిశయమునే ఉత్తమ గుణాలు అని కూడ అంటారు:  ఈ గ్రీకు పదానికి సుశీలత, మంచితనం, ఘన బుద్ధి, పొగడదగినవి అని అర్థం. ఇదే పదాన్ని ఫిలిప్పీ 4:8లోశ్రేష్ఠమైనవిఅనీ, 2 పేతురు 1:3, 5లోసుగుణంఅనీ తర్జుమా చేశారు. యూదా క్రైస్తవులైనా ఇతర జనాల్లోని క్రైస్తవులైనా ఇప్పుడు విశ్వాసులందరి విద్యుక్త ధర్మం, విశేష అవకాశం ఏకైక నిజ దేవుని శ్రేష్ఠతనూ మంచితనాన్నీ లోకానికి ప్రకటించడమే. మనం మన ఘనత గురించి చూడకూడదు. మన మంచితనం గురించి ప్రకటించుకోకూడదు. ఆయన మంచితనాన్నే చాటాలి (కీర్తన 40:10; 71:16; యెషయా 42:12; 43:7; ఎఫెసు 1:6, 12, 14 పోల్చి చూడండి).

 

సరే ఈ రోజు మొదటి విధానాన్ని ధ్యానం చేసుకుందాం!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

 

Luke(లూకా సువార్త) 4:17,18,19,20,21

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

అంతేకాదు ద్వితీయోపదేశకాండంలో 18:1719 లో చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తుప్రభులవారే అని గ్రహించాలి....

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 18:17,18,19

17. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పినమాట మంచిది;

18. వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.

19. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

 

ఈ గొప్ప దేవుడు ప్రవక్త రక్షకుడు తన పరిచర్యను సువార్తతోనే ప్రారంభించారు! అయితే ప్రారంభించే ముందు దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని పరిశుద్ధాత్మ పూర్నుడుగా చేసి అప్పుడు తన సువార్తను ప్రకటింపజేశారు.  కాబట్టి సువార్తను ప్రకటించేవారు పరిచర్య చేసేవారు ముందుగా తాము తమ పాపముల నుండి విముక్తులై పరిశుద్ధాత్మ పూర్నులై అప్పుడు సువార్త ప్రకటిస్తే అనేకమంది ప్రభువు దగ్గరకు వస్తారు!

 

కాబట్టి ముందుగా సువార్త అంటే ఏమిటి? ఎవరు ఎలా ప్రకటించాలి అనేది చూసుకుని అప్పుడు ముందుకుపోదాం!

కొలస్సీయులకు 1: 5

మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

 

   ప్రియులారా! ఇక్కడ  సువార్త సత్యము అని సంభోదిస్తూ ఆ నిరీక్షణ గూర్చి ఇంతకుముందు వింటిరి అంటున్నారు. ఈ నిరీక్షణ మనుష్యులు దేనికోసమో ఎదురుచూస్తున్న నిరీక్షణకోసం చెప్పడం లేదు! అది తీతుకు 2:13 లో చెప్పబడిన శుభప్రదమైన నిరీక్షణకోసం వ్రాయబడింది. ఇంకా కొలస్సీ 1:12లో చెప్పబడిన తేజోవాసులైన పరిశుద్ధులస్వాస్త్యములో పాలివారగుటను గూర్చిన నిరీక్షణకోసం వ్రాయబడింది!!!

 

   మీయొద్దకు వచ్చిన సువార్త సత్యము గూర్చిన బోధ అంటున్నారు. . అనగా సువార్త సత్యమైనది. అది కల్పిత కధకాదు! గలతీ 2:5;14;  మొదటగా సువార్తకోసం ధ్యానం చేస్తే- బైబిల్ లో చాలాచోట్ల సువార్తకోసం వ్రాయబడింది. కేవలం యేసుప్రభులవారు వచ్చిన తర్వాతనే సువార్తకోసం వ్రాయబడింది అనుకుంటే పొరపాటు.  యెషయా గ్రంధం నుండి ఈ సువార్తకోసం చూసుకోవచ్చు! యెషయా 40:9 సీయోనూ- సువార్త ప్రకటించుచున్నదానా! . . . బలముగా ప్రకటించుము! భయపడక ప్రకటించుము అని వ్రాయబడింది.

 

  ఇంతకీ *సువార్త అంటే మంచివార్త. ఆ మంచివార్త భౌతికసంభందమైన వార్తకాదు*! *యేసుక్రీస్తుప్రభులవారు నీకోసం నాకోసం ఈ భూలోకానికి వచ్చి, మన పాపములకోసం బలియాగమై, పాపములను కడిగి, మరణించి తిరిగి లేచారు. ఒకరోజు ఆయన తిరిగివచ్చి ఆయనయందు విశ్వాసముంచిన వారిని తనతోపాటు ఉండటానికి వారిని తీసుకుని పోతారు! ఇదే సువార్త*! ఇదే విషయాన్ని పౌలుగారు చెబుతున్నారు:

1 కొరింథీ 15: 3-10; లేఖనముల ప్రకారం క్రీస్తు మనకోసం చనిపోయి, లేఖనముల ప్రకారం పాతిపెట్టబడెను, మూడవరోజున సజీవంగా లేచారు, లేచిన తర్వాత పేతురుకి కనబడ్డారు, 12మందికి ఒకసారి, తర్వాత 500 మందికంటే ఎక్కువైన వారికి కనబడెను అంటున్నారు. ఇక్కడ 500 మంది అని క్లియర్ గా చెప్పడానికి కారణం ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా విషయం దృవీకరించాలంటే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులుండాలి! ఇక్కడ 500 మంది సాక్షులను చూపెడుతున్నారు పౌలుగారు- అంటే ఇది కధ కాదురా నిజంగా జరిగింది అని నొక్కివక్కానించి చెబుతున్నారు! ఇంకా అంటున్నారు అకాలమందు పుట్టిన నాకు కూడా కనబడ్డారు! ఆయన కల్పిత కధలు కాకుండా తన సజీవసాక్ష్యం చెబుతున్నారు. అదే మనకు కూడా మాదిరి!!

 

 సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను దెలుపటయే! సాక్ష్యమిచ్చేటందుకు స్వామి రక్షించేననుచు సాక్ష్యమిచ్చెద!!!... 

కాబట్టి మన సాక్ష్యాన్ని, యేసయ్య రక్షణసువార్తను ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన అవుసరం ఉంది! అయితే ఇది పౌలుగారు చెప్పినట్లు : వాక్చాతుర్యం లేకుండా, నేను సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తున్నాను అంటున్నారు! 1 కొరింథీ 1:17-21; ఇంకా అంటున్నారు: సిలువను గూర్చిన వార్త (సువార్త), నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తుంది, అయితే రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి!! కాబట్టి ఆ శక్తిగల సువార్తను ఆసక్తితో ప్రకటన చేద్దాం! పౌలుగారు సిలువను గూర్చిన భారం నామీద ఉంది. నన్ను భక్షిస్తుంది అంటున్నారు! సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నారు! 1 కొరింథీ 9:16.

 

    సరే ఇప్పడు సువార్త కోసం బైబిల్ లో ఎక్కడ వ్రాయబడిందో చూద్దాం! మీద చెప్పినట్టు యెషయా 40:9 బలము గాను, భయంలేకుండా ప్రకటించమంటున్నారు! అవును నిజవార్తను చెప్పడానికి భయమెందుకు? అన్య దేవతలను దూషించకుండా, మన దేవునివార్తను ధైర్యంగా ప్రకటిద్దాం! ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శాసనాలు వచ్చినా దేవునివార్తను చాటిద్దాం!

 

 ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక! దేవుని దయవలన నా 6వ సంవత్సరం నుండే మా తండ్రిగారితో కలసి సువార్తప్రకటనలో పాల్గొనుట మొదలుపెట్టాను. 6వ సంవత్సరంలోనే దేవుని పాటలు గట్టిగా పాడుచున్నందుకు రాళ్ళదెబ్బలు తిన్నాను, సువార్త చెబితే చంపుతామని గ్రామస్తులు- నేను బ్రతికినంతకాలం సువార్త ప్రకటన మాననని  మా తండ్రిగారు చెప్పడం జరిగింది. అయితే చంపుదామని అనుకున్నప్పుడు రాళ్లదెబ్బలకు నా నుదిటిమీద రక్తం కారుచున్న నన్ను చూసి, ఏమనుకున్నారో- గ్రామం నుండి మమ్మల్ని బయటకు గెంటివేసారు. ఆ రోజు మరలా సాతానుగాడు నన్ను చంపాలని చూశాడు! పెద్ద వర్షం వలన బురదలో సైకిల్ జారిపోయి (ఆకాలంలో (1982) ఇప్పటిలా పక్కా రోడ్లు లేవు, మట్టిరోడ్డులే) నేను పీకలలోతు బురదలో కూరుకుపోవడం జరిగింది. ఆ నిషీదరాత్రిలో నా ఏడ్పు ప్రక్కనున్న కాలువ నీటి ప్రవాహానికి వినబడటం లేదు. 5 నిమిషాల తర్వాత దేవుడు గొప్ప మెరుపును పంపించి నేను మా తండ్రిగారికి కనబడేలా చేసారు. అప్పుడు మా తండ్రిగారు, మరో దైవసేవకుడు కలసి నన్ను బురదలో నుండి తీయడం జరిగింది. అప్పుడు ప్రారంభమైన ప్రస్థానం నేటికీ ఆగకుండా జరుగుతుంది. ఎన్నోసార్లు అవమానాలు, హేళనలు, తిట్లు ఎదురైనా, గ్రామములనుండి గెంటివేయబడినా సరే, ఎన్నో ప్రాంతాలలో, దేశాలలో కూడా దేవుని రక్షణ వార్తను ప్రకటించడం జరుగుతుంది! ఇన్ని ఆపదల నుండి నన్ను తప్పించిన దేవుడు మీకు కూడా తోడుగా ఉంటారు! కాబట్టి భయపడొద్దు! జడియవద్దు!

 

  ఇంకా యెషయ 52:7 లో సువార్త ప్రకటిస్తూ సమాధాన సువార్తను ప్రకటించువారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటున్నారు. అదే విషయాన్ని నహూము 1:15లో దృవీకరించడం జరిగింది. యేసయ్య తన సువార్త పరిచర్య సువార్తతోనే ప్రారంభమయ్యింది. ప్రభువు ఆత్మ నామీద నున్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని చెబుతున్నారు.

 లూకా 4:18;  ప్రభువురాజ్యము సమీపించినది, గనుక మారుమనస్సు పొంది రక్షణపొందుడి అంటూ సువార్త ప్రారంభించారు యేసయ్య! మార్కు 1:15; అందరికీ సువార్త ప్రకటించాలి అని చెబుతూ- మొదట సకలజనులకు అనగా సమస్త దేశాలకు సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అని చెప్పారు!

మార్కు 13:15; చివరకు ఆయన చనిపోయి, తిరిగి లేచి చివరి ఆజ్ఞను ఇచ్చారు: మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి భాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. . . మార్కు 16:15-18

పౌలుగారు అదే ఆజ్ఞను పాటిస్తూ అనేక దేశాలలో సువార్తను ప్రకటించారు. దానికోసం ఎన్నోచోట్ల దెబ్బలు, చెరశాల అనుభవించారు. పౌలుగారే కాదు ఆదిమ అపోస్తలులు, ఆదిమ సంఘము ఎన్నో అగచాట్లు పడ్డారు. తమ మానప్రాణాలను అర్పించారు. అందుకే ఆ రక్షణ సువార్త మనవరకు చేరగలిగింది!! నీవు నేను నిజదేవున్ని తెలిసికోగలిగాము. ఈ సువార్తకోసము/ యేసయ్య కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును, ప్రాణం రక్షించుకోవాలి అనుకొనువాడు దానిని (పరలోకం) పోగొట్టుకోనును అని చెప్పారు యేసయ్య! మార్కు 8:35; ఇక రోమా 10వ అధ్యాయం మొత్తం సువార్తకోసమే చాలా deep గా వ్రాయబడింది! ప్రకటించకపోతే ప్రజలు ఎలా వింటారు? . . అంటూ వినుటవలన విశ్వాసం కలుగును వినుట దేవుని వాక్యం వలన కలుగును అంటున్నారు! కాబట్టి దేవుని సువార్తను మనం అందరికీ ప్రకటించాలి! క్రొత్త నిభందన మొత్తం సువార్త ప్రకటించాల్సిన అవసరంకోసం వ్రాయబడింది.

 

   ఈరోజుల్లో: వదినా! ఈరోజు పనిమీద బయటికి వెళ్ళిపోయాను- ఫలానా సీరియల్ చూడలేకపోయాను, ఏమైందో కాస్త చెప్పవూ అని అడగడం తరువాయి- కధ- స్క్రీన్ ప్లే దర్శకత్వం తో పాటు frame to frame తప్పకుండా చెబుతావు కదా పనికిమాలిన సీరియళ్ళ కోసం! నిజదేవుని కోసం, యేసుప్రభువు నీజీవితంలో చేసిన మేలులు, అద్భుతాలు రోజుకొకటి ఎప్పుడైనా చెప్పావా ఆ వదినకు?!!! ఆ వదిన/ అక్క నరకానికి పోతే ఆ ఆత్మకు నీవే లెక్క అప్పగించాలని తెలియదా? ఇక ఈ మరదళ్ళుకూడా పనికిమాలిన సీరియల్లుకోసం అడుగుతారు గాని- ఈరోజు నేను మందిరానికి రాలేకపోయాను- ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పారో కాస్త చెప్పవూ అనిమాత్రం అడగరు!! ఎందుకంటే వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు! 

 

కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరులా! లోకవార్తలు చెప్పుకోకుండా యేసయ్య సిలువ సువార్తను చెబుదాం!

 అందరికీ ప్రకటిద్దాం!

 సాక్షిగా నిలబడుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*56వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-14*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం చూసుకుందాం!

ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము....

మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము:

 

ఎలా ప్రచురము చేయాలి?

నాకు రెండు విధాలుగా అని తోస్తుంది!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

          

          (గతభాగం తరువాయి)

 

ఇక రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

 

ఎఫెసీ 1:3

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

 

ఈ మూడో  వచనంలో అంటున్నారు: మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక అంటున్నారు! పౌలుగారి పత్రికలలో అన్నింటిలో తప్పకుండా దేవునికి స్తుతి చెప్పకుండా ఏ పత్రిక వ్రాయరు! ఇక్కడ కూడా దేవునికి స్తుతులు చెబుతున్నారు!  కీర్తనల గ్రంధంలో స్తుతిచేయుట యధార్ధ వంతులకు శ్రేయస్కరం అంటున్నారు!

కీర్తనల గ్రంథము  33

నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

అందుకే ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయమంటున్నారు! దావీదు గారు కేవలం చెప్పి వదిలేయడం లేదు! తనకు కష్టమొచ్చి నప్పుడు స్తుతించారు! ఆనందం వచ్చినప్పుడు స్తుతించారు పాటలు పాడారు! తన జీవితమంతా స్తుతిస్తూనే ఉన్నారు!

 

ఈ కీర్తన మొత్తం స్తుతులే ఉంటాయి! ఇంకా కీర్తనల గ్రంధం మొత్తం దేవునికి స్తుతులే ఉంటాయి! కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 8:2; కీర్తనల గ్రంథము 9:1; కీర్తనల గ్రంథము 16:7; కీర్తనల గ్రంథము 18:3; కీర్తనల గ్రంథము 42:5; కీర్తనల గ్రంథము 100:4; కీర్తనల గ్రంథము 150:6;

 

ఇంకా కీర్తనల గ్రంధంలోనే కాదు అనేక గ్రంధాలలో స్తుతులు చెల్లించమని చెబుతున్నారు:  యెషయా 12:1; మత్తయి 5:16; మత్తయి 11:25; లూకా 1:68; రోమీయులకు 15:7 రోమీయులకు 15:11; 2 కోరింథీయులకు 1:3; ఎఫెసీయులకు 1:3 ఎఫెసీయులకు 1:6 ఎఫెసీయులకు 1:12 ఎఫెసీయులకు 1:14; ప్రకటన గ్రంథం 5:12-13; ప్రకటన గ్రంథం 19:5. ఆదికాండము 24:27; నిర్గమకాండము 15:2; లేవీయకాండము 19:24; ద్వితీయోపదేశకాండము 8:10; ద్వితీయోపదేశకాండము 32:3; 1 దినవృత్తాంతములు 16:4 1 దినవృత్తాంతములు 16:9 1 దినవృత్తాంతములు 16:25 కూడా చూడండి.

 

    నిజానికి  తనకు స్తుతులు కరువయ్యాయని దేవుడు మనలను స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని కూడా దేవుడు  తాపత్రయ పడడానికి ఆయనేమీ మనిషి కాదు. ఆయన తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెపుతున్నారన్న మాట. స్తుతి అంటే మాటలతో వెల్లడి చేయబడిన మెప్పు మరియు  ఆమోదం. మనుషులు తమకు ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపిస్తాయో వాటిని పొగడుతారు మామూలుగా . తమకు యోగ్యంగా అనిపించినదానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు. అతి ఉన్నతమైన మంచితనం, అందం, బలప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో గల వస్తువులు, మనుషులు జీవులన్నిటిలో అందరికంటే మిన్నగా స్తుతికి పాత్రుడు ఆయన. మనం దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన కోసం కాదు, మన మేలుకే. మనం అంతటిలో, అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైనవాణ్ణి గుర్తించి స్తుతించేవారమై ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన యోగ్యతను గమనించడమే. అంటే, అతి శ్రేష్ఠమైన, ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడమన్నమాట. ఇలా చెయ్యడం మనకు సమంజసం, తగినది (1 ). తమ స్తుతికి తగని అనేక రకాల వస్తువులనూ వ్యక్తులనూ మనుషులు స్తుతిస్తారు. అయితే దేవుణ్ణి ఎరిగినవారు స్తుతికి పాత్రుడైన ఆయన్నే స్తుతించడం తగిన పని కాదా.

 

 మూర్ఖులు, తృప్తి లేనివారు, స్వార్థపరులు, నమ్మకం లేనివారు, నైతికంగా, ఆధ్యాత్మికంగా అంధులు. ఆత్మలో, సత్యంలో దేవుణ్ణి ఆరాధించరు. వినయ మనస్కులు, న్యాయవంతులు, జ్ఞానప్రకాశం పొందినవారు, సత్యాన్ని గ్రహించినవారు అలా చెయ్యగలరు, చేస్తారు.

 

కొన్ని ఉదాహరణలు చూసుకుంటే

 

దుర్మార్గులు తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధమైనవాటినే పొగడుతూ ఉంటారు (ఫిలిప్పీయులకు 3:19).

 

న్యాయవంతులైతే దేవునిలోను తమ రక్షకుడైన క్రీస్తులోను ఆనందిస్తారు (1 కోరింథీయులకు 1:31; 2 కోరింథీయులకు 10:17; గలతియులకు 6:14; 1 తిమోతికి 1:17).

 

దేవుణ్ణి స్తుతించకపోవడం, కృతజ్ఞతలు చెప్పకపోవడం నిందాపాత్రం. ఇది మనిషి స్వభావంలోనే ఒక లోపాన్ని చూపెడుతుంది. ఈ లోపం తన ప్రజలలో ఉండకూడదని దేవుని ఉద్దేశం. స్తోత్రాలు చెల్లించడం, పాటలు పాడడం, దేవుణ్ణి కీర్తించడం ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి. ఇవి వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి. దేవుణ్ణి బాగా ఎరిగినవారు, అందరికంటే ఎక్కువ జ్ఞానప్రకాశం, వినయం ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా స్తుతిస్తారు.

 

148 వ కీర్తనలో ఎవరెవరు స్తుతించాలో ఉంది! 150 వ కీర్తనలో ఎలా స్తుతించాలి ఏఏ వాధ్యములతో స్తుతించాలో వ్రాయబడి ఉంది! 148....

కీర్తనలు 148:1

యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి

కీర్తనలు 148:2

ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి

కీర్తనలు 148:3

సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 148:4

పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 148:5

యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక

కీర్తనలు 148:7

భూమి మీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి

కీర్తనలు 148:8

అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,

కీర్తనలు 148:9

పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా,

కీర్తనలు 148:10

మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,

కీర్తనలు 148:11

భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.

కీర్తనలు 148:12

యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు

కీర్తనలు 148:13

అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.

150...

కీర్తనలు 150:1

యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:2

ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:3

బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:4

తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:5

మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:6

సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.

 

ఇక కీర్తనలు 6:5 ప్రకారం, యెహేజ్కేలు 38:18-19; ప్రకారం ఎవడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు అంటే వాడు చచ్చినోడే!!! సజీవులు దేవుణ్ణి స్తుతిస్తారు!!

 

  చివరికి యేసుప్రభులవారు కూడా తను రొట్టెలు ఆశీర్వదించి అందరికీ పంచినప్పుడు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! మత్తయి 15:36; మార్కు 8:6; యోహాను 6:11;

 ఆయన చనిపోయేముందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! మత్తయి 26:27; మార్కు 14:23; లూకా 22:17, 19;

 

మరో విషయం చెప్పనా? యేసయ్య 10మంది కుష్టరోగులను స్వస్తపరచినప్పుడు వారిలో ఒకే ఒకడు- అతను కూడా సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లూకా 17:16; అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వాడు సచ్చినోడు, మృతుడే కాకుండా కృతఘ్నుడు, విశ్వాసఘాతకుడు!

 

   నీవు ఇంతవరకు బ్రతికి ఉన్నావంటే అది ఆయన కృపయే కదా! ఆయన దయయే కదా! నీకున్న ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, కుటుంబం కోసం, మరీ ముఖ్యంగా నీకున్న రక్షణభాగ్యం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా ప్రియ చదువరీ!!?

 

    అందుకే పౌలుగారు తను రాసిన ప్రతీ పత్రికలలోను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! దేవునికి కృతజ్ఞతలు చెల్లించని పత్రిక లేనేలేదు! అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్తితులలోను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు! ఎఫెసీయులకు 5: 4

కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

 

 కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 ఫిలిప్పీ 4:6,.

1థెస్సలొనికయులకు 5: 18

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

 

ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తము అంటున్నారు.

హెబ్రీ 13:15. ఆయనకు ఎప్పుడూ స్తుతి యాగం అనే జిహ్వా ఫలము అర్పిద్దాం అంటున్నారు.

 

విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం దేవున్ని స్తుతించడం!  కాబట్టి నిజదేవుడైన ఆ పరాత్పరునీ స్తుతిద్దామా!!! కారణం దేవుడు మానవుని చేసింది మానవుడు తనను స్తుతిస్తాడని మరియు తనతో సహవాసం చేస్తాడని! మరి నీవు చేస్తున్నావా?!!!

 

  కాబట్టి ప్రియ సహోదరీ! సహోదరుడా! ప్రతీ విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం నేర్చుకుందాం! శ్రమలలో విసుక్కోక స్తుతిద్దాం పౌలుగారిలా!

 ఆయనకు తగినట్లు జీవిద్దాం!

దైవాశీస్సులు!!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*57వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-1*

 

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు మొదటి ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*విశ్వాసి ఏర్పరచబడిన వంశము*

దీనికోసం పౌలుగారు చెబుతున్నారు ఎఫెసీయులకు 1:4

ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

ఎఫెసీయులకు 1:5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

ఎఫెసీయులకు 1:6

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

 

ఎఫెసీయులకు 1:11

మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

ఎఫెసీయులకు 1:12

దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

 

యోహాను 15:16

మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

 

చూడండి మనము ఆయనను ఏర్పరచుకోలేదు గాని ఆయనే మనలను ఏర్పరచుకొన్నారు!

ఎన్నుకొన్నాడు మార్కు 13:20; యోహాను 15:16, 19; రోమ్ 8:33; 2 తెస్స 2:13; 1 పేతురు 2:9. యోహాను 6:37; 17:6

 విశ్వాసులు పుట్టకముందే, లోకం ఉనికిలోకి రాకముందే దేవుడు భవిష్యత్తులోకి దృష్టి సారించి ప్రతి విశ్వాసినీ చూచి క్రీస్తులో ఎన్నుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరినీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా పూర్వ నిర్ణయం చేశాడు.

 

ఇక్కడ రోమా 8: 4-6లో దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి మూడు కారణాలు చెప్తున్నారు పౌలుగారు.

ఒకటి, మనంపవిత్రంగా, నిర్దోషంగాఉండాలని దేవుని కోరిక 4; 5:22-27; యోహాను 17:17-19; ఫిలిప్పీ 2:15; తీతు 2:14.

రెండు, మనం ఆయన సంతానంగా ఉండాలని ఆయన కోరిక ( 5). యోహాను 1:12-13; రోమ్ 8:15; 2 కొరింతు 6:17-18; 1 యోహాను 3:1-2  చూడండి.

 

ఇది బాగా అర్ధం కావాలంటే  రోమా 8:29-30 చూసుకోవాలి!

రోమా 8:2930.

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. .  . 

 

ఏర్పరచుకోవడానికి ముఖ్య ఉద్దేశం: విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (హెబ్రీ 2:10-11

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక.... ; 

 

1 యోహాను 3:1-2

1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో (మనకెట్టిప్రేమ చూపెనో) చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. ).

 

 ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం, గొప్ప లక్ష్యం వేరొకటి ఉండబోదు. ఈ ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన ఐదు మెట్లను పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. వీటిలో రెండు లోక సృష్టికి ముందున్నవి. రెండు క్రీస్తులో విశ్వాసి జీవితం ఆరంభంలో ఉన్నవి. ఒకటి ఇకముందు రాబోయేది. వీటిలో ప్రతి మెట్టుకూ మిగతా నాలుగింటితో సంబంధం ఉంది. అన్ని మెట్లూ దేవుడు వాటినెంత ఖచ్చితంగా చేయగలడో అంత ఖచ్చితమైనవి.

 

     *ప్రియులారా! ఆమెట్లు లేక రక్షణ ప్రణాళిక విధానం ఏమిటంటే: మొదటగా తన కుమారుని సారూప్యం గలవారవుటకు ముందుగ నిర్ణయించెను. ఎవరిని ముందుగ నిర్ణయించేనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమ పరిచెను*!

 

"ముందుగానే...తనకు తెలిసిన తనవారు విశ్వాసులు తన కుమారుని పోలికలోకి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించడం వారిని గురించి ఆయనకున్న భవిష్యత్ జ్ఞానంపై ఆధారపడిన సంగతి. 

1 పేతురు 1:1-2

1. యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

 

ఈ భవిష్యత్ జ్ఞానం ఏమిటో పౌలుగారు ఇక్కడ వివరించడం లేదు. దీనికీ దేవుడు విశ్వాసులను ముందుగానే నిర్ణయించడానికీ గల సంబంధమేమిటో చెప్పలేదు

 

"ముందుగానే నిర్ణయించాడు గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పదం ఆరు సార్లు మాత్రమే కనిపిస్తున్నది (ఇక్కడ, 30; అపొ కా 4:28; 1 కొరింతు 2:7; ఎఫెసు 1:5, 11). దీనికీ కర్మ సిద్ధాంతానికీ ఏ సంబంధమూ లేదు. జరిగేదానంతటికీ అదృష్టమే కారణమనే భావనకూ దీనికీ ఏ పోలికా లేదు. ఏమి జరగాలో ముందుగానే తెలిసిన దేవుడు అలా జరగాలని నియమించాడని దీని అర్థం. సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు అయిన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమి జరగాలని నియమిస్తాడో అది తప్పక జరిగి తీరుతుందని ఏమీ అనుమానం లేకుండా నమ్మవచ్చు. ఒక సంఘటన గురించి చెప్పిన అపొ కా 4:28 మినహా క్రొత్త ఒడంబడిక గ్రంథమంతట్లో దేవుని పూర్వ నిర్ణయాన్ని గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తున్నవి. దేవుడు ఎవరినైనా శాశ్వత నరక శిక్షకు పూర్వమే నిర్ణయించినట్టు ఎక్కడా చెప్పలేదు. కొత్త నిబంధనలో పూర్వ నిర్ణయం సిద్ధాంతం విశ్వాసులకు గొప్ప ఆదరణను, గొప్ప ఆశాభావాన్ని ఇవ్వాలి. తనను పాపవిముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడో లేదోనని ఎవరూ భయ సందేహాలకు తావియ్యనక్కర లేదు. యోహాను 6:37, 44 . ఇష్టమున్న వారెవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు (ప్రకటన 22:17, )

యోహాను 3:37;45

37.మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని.

45.నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. .

ఆయన చెంతకు రావడం, ఆయనలో నమ్మకముంచడం అన్న చర్యలే దేవుడు ఆ వ్యక్తిని పూర్వం ఎన్నుకున్నాడని రుజువు.

 

"పిలిచాడు 28; 1:5. అంటే క్రీస్తుదగ్గరకు వచ్చి ఆయన్ను నమ్ముకునేలా పిలవడం. దేవుని పిలుపు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది రిఫరెన్సులు చూడండి: గలతీ 1:6; 5:13; 1 కొరింతు 1:9, 24; కొలస్సయి 3:15; 2 తెస్స 2:14; 1 తిమోతి 6:12; 2 తిమోతి 1:9; హీబ్రూ 3:1; 1 పేతురు 2:9, 20, 21; 3:9; యూదా 1; రోమ్ 11:29. దేవుడు తమను పిలిచాడని ఖచ్చితంగా తెలుసుకోవలసిన బాధ్యత విశ్వాసులది – 2 పేతురు 1:10-11. దేవుడు తమను ఎన్నుకున్నాడని, పిలిచాడని, నిర్దోషులుగా తీర్చాడని విశ్వాసులు తెలుసుకోగలగడం సాధ్యమే. వారు అలా తెలుసుకోవాలి.

 

"నిర్దోషులుగా ఎంచాడు దేవుని పిలుపు అనే పదాన్ని ఉపయోగించడంలో పౌలు ఉద్దేశాన్ని బట్టి చూస్తే దేవుడు పిలిచినవారంతా దేవుని చెంతకు వచ్చి యేసుప్రభువులో నమ్మకం ఉంచుతారు. వెంటనే దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించి వారిని లోపం లేని న్యాయవంతులుగా ఎంచుతాడు. 1:16-17; 3:21-28; 4:5; 5:1; 10:10 చూడండి

 

ప్రియులారా! ఈవిధంగా నీవు దేవునిచేత ఏర్పరచబడిన వంశములోనికి చేర్చబడ్డావు అని తెలుసుకోవాలి!  మీ పిలుపు సామాన్యమైనది కాదు. దేవుడు నిన్ను తన ప్రణాళికలో నిన్ను పిలిచారు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దానిని నీవు తెలుసుకోవాలి. అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటున్నారు భక్తుడు! ముందు నీ పిలుపు ఏమిటో తెలుసుకో! ఆ తర్వాత నీవు దేవుని రక్షణ ప్రణాళిక లో ఉన్నావని గుర్తెరిగి భయమునొంది పాపం చేయకుండా దేవుడు చెప్పిన పనిని చేయు!

అప్పుడు అబ్రాహముగారిని వాడుకున్న దేవుడు, సమూయేలుగారిని వాడుకున్న దేవుడు, సంసోనును వాడుకున్న దేవుడు, నోరులేని గాడిదను వాడుకున్న దేవుడు, ఎందరినో వాడుకున్న దేవుడు నిన్నుకూడా బలంగా వాడుకోగలరు!

మరి నీవు సిద్ధమా!

దైవాశీస్సులు! 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*58వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-2*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు రెండవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

 

*రాజులైన యాజక సమూహము*

దీనికోసం 5వ వచనం ధ్యానం చేసుకునేటప్పుడు చూసుకున్నాము!

అసలు దీని అర్థం ఏమిటి?

ఈ పదము కొన్ని ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది: పరలోక రాజుకు చెందిన యాజక సమూహము!

గ్రీకులో ఈ మాటలకు మూడు అర్ధాలు ఉన్నాయి:

1) రాజు కొలువులో ఉన్న యాజకులు,

2) రాజ్యంగా ఏర్పడిన యాజకుల సమూహం,

3) యాజకులందరూ రాజులై వున్న యాజక వ్యవస్థ అని అర్థం వస్తుంది.

 లేక ఈ మూడు అర్థాలు కూడా రావచ్చు.

అసలు రాజుగా ఉన్న యాజకుడు లేదా రాజే యాజకుడిగా ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ లో అక్షరార్ధంగా ఒకాయన ఉన్నారు! ఆయన పేరు మెల్కీసెదెకు!

 

ఆదికాండము 14:18

మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

చూడండి ఈయన మొదట రాజు, రెండు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు!!

 

కీర్తనలు 110:4

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

మరి ఈయన ఎవరూ?!

ఈయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు!

 

హెబ్రీయులకు 5:6

ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 5:7

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.

హెబ్రీయులకు 5:8

ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

హెబ్రీయులకు 5:9

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

హెబ్రీయులకు 5:10

తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

 

దీని ప్రకారం యేసుక్రీస్తు ప్రభులవారు యాజకుడు కదా!

మరి రాజు ఎలా అయ్యారు?

ప్రకటన గ్రంథం ప్రకారం ఆయన రాజులరాజుగా రాబోతున్నారు కదా!

మరి ఇప్పుడు ఆయన రాజు మరియు యాజకుడు కదా!

అలాగే తన పిల్లలు తనతో సమాన సారూప్యత పొందాలని ఆయన రక్తము చేత మనలను విమోచించి తన పిల్లలుగా చేసుకుని తనవారుగా ఏర్పరచబడిన వంశముగా చేసుకుని తనతోపాటు ఏలడానికి అధికారమిచ్చారు.

మత్తయి 25వ అధ్యాయం ప్రకారం మరియు ప్రకటన గ్రంథం ప్రకారం జయించిన వారు క్రీస్తుతోపాటు పరిపాలన చేస్తారు!

ప్రకటన గ్రంథం 20:4

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

ప్రకటన గ్రంథం 20:6

ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

 

మరి ఇప్పుడు విశ్వాసి తన విశ్వాసమును కాపాడుకుంటే, జయజీవితం కలిగి ఉంటే రాజులైన యాజకసమూహములో చేర్చబడినట్లే కదా!

 

నిర్గమకాండము 19:6

సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా....

ఇది దేవుడు ఆదిలోనే ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన!!

ప్రకటన గ్రంథం 1:6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

ప్రకటన గ్రంథం 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, (లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

ప్రకటన గ్రంథం 5:10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

 

ఈ వచనముతో అనుమానాలన్నీ పోయాయని తలస్తున్నాను!!

విశ్వాసి సామాన్యుడు కాదు! నీ పిలుపు ఏర్పాటు ఎంతో ఉన్నతమైనది మహత్తరమైనది! అందుకే నీవు సామాన్యలు అన్యులు జీవిస్తున్నట్లు జీవించకూడదు! ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితం జీవించాలి!

ప్రియ సహోదరి సహోదరుడా! మరి నీ జీవితం ఎలా ఉంది!???

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*59వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-3*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు మూడవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*పరిశుద్ధ జనము*

దీనికోసం ముందుకు వెళ్లేముందు ఒకమాట చెప్పనీయండి. ప్రియులారా మనలో చాలా మంది మొబైల్ వాక్యము చదువుతున్నారు. మంచిది! గాని మొబైల్ లో android version లో చాలా తప్పులున్నాయి. ఈ పరిశుద్ధ జనము అనేమాట మొబైల్ లో పరిశుద్ధ జననము అని ఉంటుంది. అది తప్పు ప్రియులారా! ఇది వారికి చాలా మంది చెప్పినా ఇంకా దానిని కరెక్ట్ చేయలేదు! పరిశుద్ధ జనము అనేదే సరియైనది. మన బైబిల్ లో అనగా హార్డ్ కాపీలలో అలాగే ఉంటుంది అని గమనించాలి!

 

పరిశుద్ధ జనము లేదా పవిత్ర జనము భూమిపై ఇతరులందరిలోకీ ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమ 19:5-6

నిర్గమకాండము 19:5

కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.

నిర్గమకాండము 19:6

సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

 

యోహాను 17:6

లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

 

పేతురు గారు సంఘాన్నినూతన ఇజ్రాయేల్ అని గానీఆధ్యాత్మిక ఇజ్రాయేల్ అని గానీ పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నారు. నిజమైన ఇజ్రాయేల్ అంటే వారే, క్రీస్తును తిరస్కరించినవారు కాదు. ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురుగారు చెప్పడం లేదు (అపొ కా 1:6-7  చూడండి). క్రొత్త నిబంధన గ్రంథం రాసిన వారిలో ఎవరూ సంఘాన్ని కొత్త ఇజ్రాయేల్ అని పిలవలేదు. ఇతర ప్రజలలో విశ్వాసులైనవారిని పాత ఇజ్రాయేల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. ఇది రోమా 11వ అధ్యాయంలో కనిపిస్తుంది;

రోమీయులకు 11:2

తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?

రోమీయులకు 11:5

ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది.

రోమీయులకు 11:7

ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

రోమీయులకు 11:8

ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

రోమీయులకు 11:15

వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

రోమీయులకు 11:17

అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

రోమీయులకు 11:18

నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

రోమీయులకు 11:19

అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

రోమీయులకు 11:20

మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

రోమీయులకు 11:21

దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

రోమీయులకు 11:22

కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

రోమీయులకు 11:23

వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

రోమీయులకు 11:24

ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

రోమీయులకు 11:25

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

రోమీయులకు 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

రోమీయులకు 11:27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

ఎఫెసు 2:11-19 చూడండి.

ఎఫెసీయులకు 2:11

కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

ఎఫెసీయులకు 2:12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

ఎఫెసీయులకు 2:13

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

ఎఫెసీయులకు 2:14

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

ఎఫెసీయులకు 2:15

ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

ఎఫెసీయులకు 2:16

తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

ఎఫెసీయులకు 2:17

మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

ఎఫెసీయులకు 2:18

ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

ఎఫెసీయులకు 2:19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

కాబట్టి స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన వారే విశ్వాసులు! ఈవిధంగా పరిశుద్ధ జనముగా చేయబడ్డాము!

 ద్వితియోపదేశకాండము 4:20

యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండు టకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.

 

1సమూయేలు 12:22

యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

 

యిర్మియా 13:11

నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

మీకా 4:7

కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలము వరకు వారికి రాజుగా ఉండును.

 

ప్రకటన గ్రంథం 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

ప్రకటన గ్రంథం 5:10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

 

కాబట్టి మనము పరిశుద్ధ జనము! అందుకే దేవుడు అంటున్నారు

లేవీయకాండము 11:44

నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.

లేవీయకాండము 11:45

నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

లేవీయకాండము 20:26

మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

 

1పేతురు 1:14

నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

1పేతురు 1:16

మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

1కోరింథీయులకు 3:16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

1కోరింథీయులకు 3:17

ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక-

మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

యెషయా 52:11

పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.

 

2కోరింథీయులకు 6:17

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

 

కాబట్టి ప్రత్యేకంగా ఉందాము! పరిశుద్ధముగా పవిత్రంగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*60వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-4*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు నాల్గవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*దేవుని సొత్తైన ప్రజలు*

మనము దేవుని సొత్తు! ఈ మాట దేవుడే చెప్పారు అనేక చోట్ల!!

 

యెషయా 43:1

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

 

1కోరింథీయులకు 6:19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

1కోరింథీయులకు 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

చూడండి ఈ రెండు రిఫరెన్సులు ప్రకారం  మనము మన సొత్తుకాదు! మనము దేవునిసొత్తు! దేవుని సొత్తు ఎలా అయ్యామంటే విలువ పెట్టి కొనబడ్డాము! ఏ విలువ?

అమూల్యమైన రక్తము చేత!

ఎవరు కొన్నారు?

దేవుడు!

ఎవరి దగ్గర నుండి కొన్నారు?

సాతాను గాడి దగ్గర నుండి!!!

ఏం వాడి సొత్తు కాదు కదా మనము?

పాపము చేయు ప్రతీవాడు పాపమునకు దాసుడు!

రోమీయులకు 3:23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

రోమీయులకు 3:24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

తీతుకు 2:14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

కీర్తనలు 100:3

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

 

యిర్మియా  12:4,10,11

4. భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? . . .

10. కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.

11. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను. . . . .

 

ఈ విధంగా మనము క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి దేవునిచేత కొనబడి అయన సొత్తుగా మారిపోయాము!

అందుకే మనము మన సొత్తు కాదు కాబట్టి మన దేహముల చేత దేవున్ని మహిమ పరచమంటున్నారు!

 

వివరంగా చెబుతాను!

మనిషి పాపం చేసి దేవుని నుండి దూరమై- దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దోషాన్ని పాపాన్ని శాపాన్ని సంపాదించుకున్నాడు. మనిషి దేవుని సొత్తు! గాని మనిషి దేవునికి నచ్చే పనులు చేయకుండా సాతానుతో సహవాసం చేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేసి ద్రోహిగా పాపిగా మారిపోయాడు! ఈ సృష్టి మొత్తం ఆయన ఇల్లు! మనమే ఆయన ఇల్లు! దానిని ఇప్పుడు మనిషి పాడు చేసేసాడు. ప్రకృతిని పాడు చేసేశాడు! దేవుని ఇంటిని వాడు తగులబెట్టేశాడు అన్నమాట! అయితే ఇప్పుడు దేవుడు కనికరించి వారిని విడుదల చెయ్యాలి అనుకున్నారు! మరి వారు పాపం చేశారు కదా! దానికి శిక్ష ఎవరు భరిస్తారు? పాపం చేస్తే శిక్ష, మరణం అనుభవించాలి అనే రూల్ చేసింది ఆయనే కదా! మరి దీనిని ఎవరు భరిస్తారు? పాపం చేసింది మనిషి! శిక్ష అనుభవించేది జంతువా? అది నిజంగా భరించగలదా ఆ శిక్షను? భరించలేదు! ఇది అసాధ్యం! ఇక ఎవరూ దీనిని భరించలేరు కాబట్టి దేవుడే ఆ శిక్షను తనమీదను వేసుకుని మానవులకు బదులుగా మరణించి ఆ శిక్షను తను పొందడానికి వచ్చారు. పాపం లేని వ్యక్తిగా జీవించారు. ఆయన మొదట దేవుడు- ఇప్పుడు మానవుడు- అనగా దైవ మానవుడు కాబట్టి దేవుడు- మనిషి స్థానంలో ఉండి మానవుల పొందవలసిన శిక్షను ఆ సిలువలో పొందారు! శిక్షను సంతోషంగా అనుభవించారు! ప్రేమను చూపించారు. తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు! క్షమించమని క్షమాభిక్ష పెట్టారు! మానవుల పాపం కోసం ఆయనే ప్రాయశ్చిత్తం చేశారు!

 

ప్రియ స్నేహితుడా! ఆయన నీకొరకు చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నీకోసం పొందిన దెబ్బలను ఆ గాయాలను ఎప్పుడైనా ఆలోచించావా? నిజంగా దానిని గ్రహిస్తే నీవు ఇకను పాపం చేసేవాడవు కావు! ఇక లోకంలో తిరిగే వాడవు కావు! ఇప్పుడైనా ఆ కలువరి సిలువను గుర్తుకు చేసుకో! ఆ సిలువయొక్క విలువ ఏమిటో గ్రహించు! ఫిలిప్పీయులకు 2: 8

మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

  ..... మరి ఇంత గొప్ప ప్రేమ చూపించిన దేవునికి నీవిచ్చే ప్రతిఫలం ఏమిటి? ఇంకా ఆయన గాయాలు రేపుతావా?

 Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో *దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు* గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

మరి ఇంకా ఆయనను భాద పెడతావా? ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేస్తే తప్పించుకోగలవా?

ఒకసారి ఆలోచించి మారుమనస్సు పొంది నేడే ఆయనను క్షమాపణ వేడుకుని ఆయన యొద్దకు తిరిగి రమ్మని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*61వ భాగము*

1పేతురు 2:10

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక పదవ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

ఒకప్పుడు అనగా దేవున్ని ఎరుగక మునుపు!

ప్రజగా అనగా దేవుని జనులైయుండక, సాతాను కబంధహస్తాలలో ఉన్న అన్య ప్రజగా ఉన్నారు!

కనికరింపబడక అనగా పాపముచేసి నరకానికి పోయే స్తితిలో ఉండగా, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడి పాపవిముక్తి పొంది నరకానికి పోకుండా కనికరించబడి పరలోక ప్రాప్తులయ్యారు అని అర్థం!!

 

వివరంగా చూసుకుందాం! క్రీస్తులో నమ్మకం ఉంచకముందు యూదులు, ఇతర ప్రజలు కూడా దేవుని ఆధ్యాత్మిక ప్రజ కారు. హోషేయ 1:9-10;

9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనైయుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

10. ఇశ్రాయేలీయుల జన సంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

 

హోషేయా 2:23

నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.

 

రోమా 9:24-26;

23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,

24. అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?

25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.

26. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:11,12,13,14,15,16,17,18,19,20

11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

మనుషులను చీకటిలోనుంచి వెలుగులోకి పిలవడంలో దేవుడు చూపినది కల్తీ లేని కరుణ మాత్రమే తీతు 3:5

తీతుకు 3:5

మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

 

కొలస్సీ 1:21-22

మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధ భావముగలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.

 

    గతకాలమందు దేవునికి దూరస్తులు, పాపులుగాను, మీ దుష్క్రియల చేత దేవునితో విరోధభావం గలవారమైయుండిన మిమ్మును/ మనలను దేవుని సన్నిధిని పరిశుద్దులనుగాను, నిర్దోషులనుగాను, నిరపరాధులనుగాను నిలబెట్టుటకు ఆయన మరణము ద్వారా మాంసయుక్తమైన దేహమును చంపి, మనలను/ మిమ్మును దేవునితో సమాధానపరిచెను అంటున్నారు.

   అవును కదా, ఒకప్పుడు మనం దేవునికి దూరముగా ఉన్నవారమే! దేవుడంటే తెలియనివారమే! మనలో చాలామంది దేవునితో వైరముగలవారమే! గాని ఇప్పుడు దేవుని కృపాసమృద్ధి వలన మనము రక్షింపబడి, ఆయనలో చేర్చబడ్డాము! ఎఫెసీ 2:12.

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

 అదే 13వ వచనము

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

 14వ వచనము

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

చూశారా దేవుడు మనకోసం ఏం చేశారో!

 

సరే, మనమైతే దేవునితో సమాధానపడి, దేవునితో ఐక్యమయ్యాము మరి మన పొరుగు వారో? ఎఫెసీ 4:18

వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

కాబట్టి వారినికూడా క్రీస్తు వెలుగులోనికి , క్రీస్తు సత్యములోనికి నడిపించాల్సిన భాద్యత మనకుంది. కారణం వారు ఇంకా ఎఫెసీ 6:12 లో చెప్పబడిన విధముగా అంధకార సంభంధమైన లోకనాధుల వశములో ఉన్నారు. సాతానుగాడి కోరలలో చిక్కుకుపోయి, పాప బంధకాలలో ఉన్నారు. వారికోసం ప్రార్ధించి, వారిని విడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి!

   ఇక వారేకాదు, క్రైస్తవులు అని పేరుపెట్టుకొని, దేవుణ్ణి సంతోషపెట్టకుండా, తమకుతామే సంతోషపెట్టుకుంటూ, లోకాచారాలలో మునిగిపోయి, లోకస్తులులా జీవిస్తున్న వారి హృదయాలు బండబారిపోయి, దేవునికి దూరమై నామకార్ధబ్రతుకు జీవిస్తున్నారు. వారినికూడా తిరిగి క్రీస్తులోనికి, ఆయన వెలుగులోనికి నడిపించడానికి మనవంతు ప్రయత్నం చేయాలి!

 

       క్రీస్తుకు దూరంగా ఉన్న మనుష్యులందరి పరిస్తితి ఏమిటంటే, వారికి నిజదేవుడు లేడు, సత్యము తెలియదు, పాపవిముక్తికోసమైన ఆశ వారికి లేదు, తీర్పు అనేది ఒకటి ఉంది అనేది కూడా తెలియని వారున్నారు. పాపానికి వచ్చు జీతంఆధ్యాత్మిక మరణమని, అది నిత్యనరకానికి తీసుకుపోతుంది అని తెలియదు వారికి. గలతీ 4:8

ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని 

సరే అన్యులకోసం చూసుకున్నాం! రక్షింపబడిన మనము ఏం చెయ్యాలి? గలతీ 4:9.

యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

గాబట్టి మరలా మూలపాఠాలు అనగా పాత లోకాచారాలు, అన్యాచారాలు చేసి, అన్యులు ప్రవర్తించినట్లు పరవర్తించకూడదు! అలా చేస్తే అనగా పాత లోకాచారాలు చేస్తే, మరలా (పాప)దాస్యమనే కాడిక్రిండ మరలా చిక్కుకొన్నట్లే!పాప దాస్యంలో ఉన్నట్లే!

 కాబట్టి ఆ దాస్యమనే కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు అని పౌలుగారు హెచ్చరిస్తున్నారు గలతీ సంఘాన్ని, ఇంకా మనలను కూడా! గలతియులకు 5: 1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

    కొలస్సీ 1:21 ప్రకారం దేవునినుండి మనలను దూరం చేసేవి, మన దుష్క్రియలే అనగా మన చెడుకార్యాలు, పాపాలు. అందుకే యెషయా 59: 1

రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను.

గాబట్టి, దేవుని నుండి మనలను దూరం చేసేవి మన పాపాలు, అతిక్రమ క్రియలు,. వాటిని మననుండి మనం తీసివేస్తే, దేవునికి దగ్గరగా చేరి, మన ప్రార్ధనలు దేవునికి చేరేలా చేద్దాం! ఇలా కాకుండా ఊరికినే దేవుడు నా ప్రార్ధనలు వినడం లేదు, నాకు జవాబివ్వడం లేదు అని లబోదిబో మని ఏడవడం వ్యర్ధము! మొదట నీయందు దేవునికి అభ్యంతరకరమైన క్రియలు, పాపాలు మానివేయు, పరితాపంతో, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని, దేవుణ్ణి మన్నించమని అడుగు. దేవుడు కరుణామయుడు గనుక నిన్ను మన్నించి, నిన్ను క్షమిస్తారు.  అప్పుడు నీ ప్రార్ధన దేవుని దగ్గరకు డైరెక్టుగా జ్ఞాపకార్ధముగా చేరుతాయి కొర్నేలు గారి ప్రార్ధనలు చేరినట్లు (అపొ 10).!

అప్పుడు నీ ప్రార్ధనలు దేవునికి వినబడతాయి!

నీవు తండ్రీ అని పిలిస్తేకుమారుడా అని ఆయన జవాబిస్తారు!!!

 

  కాబట్టి దేవునినుండి మనలను దూరం చేసే సమస్త చెడు పనులు, పాపాలు వదిలేద్దాం!

దేవునితో/లో ఐక్యమవుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*62వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-6*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక పదకొండవ వచనంలో అంటున్నారు ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. మనము పరదేశులము యాత్రికులము. దీనికోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాము!

చూడండి మనము పరదేశులము యాత్రికులము గనుక మన ఆత్మకు విరుద్ధంగా పోరాడే శరీరాసలను విసర్జించమంటున్నారు పేతురు గారు!

ఈ శరీరాసలు అనేవి మనలో దేవుడుపెట్టిన ఆత్మకు మరియు మనలో తన సంచకరవు లేదా మీరు నావారు, నేను మీకు పరలోకం ఇస్తున్నాను దానికి ఇది గ్యారంటీ అని బజానాగా లేక డిపాజిట్ గా మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఈ శరీరాసలు పోరాడుతుంటాయి కాబట్టి ఈ శరీరాసలను విసర్జించ మంటున్నారు.

 

ఉదాహరణకు రాత్రికి తోటి విశ్వాసుల గృహంలో గృహకూటము ఉంది. అయితే ఆ సమయంలోనే నీకు నచ్చిన సీరియల్ గాని, ప్రోగ్రామ్ గాని, క్రికెట్ మ్యాచ్ గాని వస్తుంది అనుకో, ఆత్మ అంతరాత్మ అంటాయి మీటింగ్ కి వెళ్ళి ఆరాధనలో పాల్గొందాము అని! గాని శరీరము మరియు మనస్సు అంటుంది ఈ ప్రోగ్రామ్/ సీరియల్ కోసం ఇన్ని రోజులు నుండి ఎదురు చూస్తున్నాను గనుక మిస్ చేయకూడదు. ఇదీ పోరాటం!

 

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందమైన అమ్మాయి లేదా అర్ధనగ్న సినిమా పోష్టర్ కనిపించింది. మన కళ్ళు ఆటోమేటిక్ గా చూస్తాయి. అయితే ఆ అమ్మాయిని క్యాజువల్ గా ఒకసారి చూసి వదిలెయ్యడం సామాన్యం అయితే ఆ అమ్మాయిని పట్టి పట్టి చూడటం , కళ్లతోనే ఆమె శరీర సౌష్టవం లెక్కకట్టడం, కావాలనుకోవడం తప్పు. అది కామాభిలాష! ఇది పాపం! సినిమా పోష్టర్ చూసి వదిలెయ్యాలి పదే పదే చూడటం నేత్రాస! ఇది సాతానిగాడి కుట్ర! నీ ఆత్మకు విరుద్ధంగా ఇవి పోరాడుతున్నాయి.

ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో! అననీయ సప్పీరలను చంపింది ధనాశ, దేవున్ని మోసం చేయాలనుకోవడం! సమ్సోను గారిని సొలొమోను గారిని నాశనం చేసింది కామాభిలాష వ్యభిచారం! కాబట్టి ఇలాంటి శరీరాసలను విసర్జించ మంటున్నారు! ఇంకా వివరంగా చెప్పాలంటే శరీరాస నేత్రాస జీవపుఢంభములను విసర్జించాలి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ఈ రోజు విసర్జించవలసినది జారత్వము!

        *జారత్వము- వ్యభిచారము*

    మీరు పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;

మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2.     1 ధెస్సలో 4: 3,4

    ప్రియ సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు, పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ 6:16. ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టుపట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు దానముగా  దయచేయబడింది. 19 వచనం.

అది విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) .

ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ 3:16,17;  6:19-20 వచనాలు) 

*మీరు దేవుని ఆలయము.  దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. ఖభడ్దార్. దేవునిలో వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు,అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు  -దేవుని అలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?*

 

   1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వముకొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది.

 

 1 కొరింథీ 6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం- నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.

 

    ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.

 

ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.

 

22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.

 

      చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది?  వ్యభిచారం, జారత్వం  దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.

 

1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ యవ్వనస్తుని మోహించి కామించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం చేయలేను అనడం లేదు ,దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి  కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?

 

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త,  సోదెగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ఆ ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రతమండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తె తో పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు అది చూసి ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............

దేవుడు ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?

 

3. ఇక మరో వ్యక్తి దేవునిచే  నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ  భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె ఆ సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2 సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది ...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై "ఆ మనుష్యడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే" దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవునాకే చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.

 

  ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా? జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా? ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా? నీ బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*63వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-7*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ఈ రోజు విసర్జించవలసినది అపవిత్రత!

 

దీనికి మరో అర్ధం కల్మషం అని తర్జుమా చేయబడింది. అపవిత్రత అనగా మనభాషలో మలినం అంటుకోవడం. మలిన పడటం. దీనికోసం పాత నిబంధన గ్రంధంలో చాలాచోట్ల పవిత్ర జంతువులూ, అపవిత్ర జంతువులు, పక్షులు, పవిత్రుడు, అపవిత్రుడు ఇలాంటివి చాలా చెప్పబడ్డాయి. చనిపోయిన కలేభరాన్ని ముట్టుకొంటే అపవిత్రత కలుగుతుందని, ఆ అపవిత్రత ఎలా పోతుందో వ్రాయబడియుంది.

 ఇంకా జారత్వం లాంటి పనులు చేస్తే అపవిత్రులు అనియు, కుష్టురోగులు అపవిత్రులు అనియు వ్రాయబడింది. అయితే ఇవన్నీ శారీరక అపవిత్రత!

 

 అదేకాకుండా ఆత్మీయ అపవిత్రత కూడా ఉంది. యేహెజ్కేలు 20:23 ప్రకారం దేవుడు విధించిన కట్టడల ప్రకారం జీవించకపోతే అపవిత్రులు. ఇంకా యేహెజ్కేలు, యిర్మియా గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేస్తే అపవిత్రులు!

 

   అయితే యేసుప్రభులవారు చెప్పిన ప్రకారం అపవిత్రులు ఎవరనగా లేదా అపవిత్రత ఎలా కలుగుతుంది మానవునికి:- మార్కు సువార్త 7:15,16. .

15. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,

16. లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.  . . .

 

దీని అర్ధం వివరంగా 18-23 వచనాలలో ఉంది.

18. *ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?*

19. *అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును*.

20. *మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.*

21. *లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును*

22. *నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో-చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును*.

23. *ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను*.  . . .

 

కాబట్టి పై వచనాల ప్రకారం మనిషిని నిజంగా అపవిత్రతకు దారితీసేవి  మనిషి హృదయంలో గల చెడ్డ తలంపులు, దురాశలు, దురాలోచనలు!!!

 

ప్రియ చదువరీ! నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నీ పడక మీద ఏం ఆలోచిస్తున్నావ్? దైవనామస్మరణా? లేక చెడు తలంపులతో, స్త్రీల మీద, సినిమా యాక్టర్ల మీద కామం కోసం ఆలోచిస్తున్నావా?

 

రేపు ఎవడ్ని ముంచాలి, ఎవడి నెత్తిమీద చేయి వేయాలి అని ఆలోచిస్తున్నావా? ఎవడ్ని చంపుదామా? నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

పక్కవాడి పొలాన్ని, ధనాన్ని ఎలా లాక్కుందామా అని ఆలోచిస్తున్నావా? పొరుగువాడి భార్యను, లేక పొరుగునున్న అమ్మాయిని ఎలా ట్రాప్ చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

ఇవే నిన్ను ముఖ్యంగా అపవిత్ర పరిచేవి! జాగ్రత్త! హృదయమును, అంతరంగమును పరిశీలించు నీతిగల దేవుడు మనదేవుడు. యిర్మియా 11:20; 20:12; 

వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడు మన దేవుడు! ఒక్కట్టిచ్చారా నేల నాకేస్తావు జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడటం బహు భయంకరం! హెబ్రీ 10:31;

 

   గమనించాలి:  ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

 

     అపవిత్రమైనదేదీ/ అపవిత్రుడు ఎవడూ దేవుని పరలోకంలో/ పరలోకరాజ్యంలో స్థానం లేదు అని గ్రహించు! ఎఫెసీ 5:5; పరలోకంలో కేవలం పరిశుద్దులు మాత్రమే ఉంటారు గాని అపవిత్రులు ఎవరూ ఉండరు! నీకు పరలోకం కావాలా అయితే నీలో ఉన్న అపవిత్రత, అపవిత్ర తలంపులు అన్నీ చంపివేసేయ్!

 

ఈలోకంలో పవిత్రులు ఎవరూ లేరు, కేవలం దేవుని దయనొందిన వారు మాత్రం పవిత్రులుగా జీవించగలరు.

ఇంతవరకు అపవిత్రమైన తలంపులతో అపవిత్రుడుగా జీవిస్తున్నట్లు అయితే, నేడే యేసయ్య పాదాలు పట్టుకొని, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ క్షమాపణ వేడుకో!

ఆయన జాలి గలవాడు గనుక నిన్ను క్షమించుటకు సిద్దమనస్సుతో ఉన్నారు. నేడే ఆయన వద్దకు రా!

ఇకను పాపము చేయకు!

పరలోకాన్ని స్వతంత్రించుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*64వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-8*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియదైవజనమా! విసర్జించవలసిన/ చంపవలసిన/ నిర్మూలించవలసిన/ ఉండకూడని మరో అలవాటు *కామాతురత* లేక *కాముకత్వము*! దీనినే కామోద్రేకం అని కూడా అంటారు. దీనిని తప్పకుండా విసర్జించాలి. లేకపోతే దాని పరిమాణాలు ఏమిటో ఈరోజు చూసుకుందాం!

 

    కామాతురత/ కామోద్రేకం అనేది మనుష్యులను పిచ్చివారిని చేస్తుంది. నిద్రను, సుఖాన్ని దూరం చేస్తుంది. చివరికి ఆస్తిని పరులకు దారాదత్తం చేస్తుంది. చివరికి నిన్ను

1) దిక్కులేని బికారిగా గాని,

2) ఏకాకినిగా గాని,

3)  అనారోగ్యం పాలు చేస్తుంది. 

దీర్ఘకాలిక జబ్బులు లేక సుఖవ్యాధులు లేక HIV లాంటి మందులేని జబ్బులతో కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తుంది ఈ కామాతురత!

 

      గతంలో చెప్పిన విధంగా వీటన్నిటికీ  ఒకదానితో ఒకటి లింక్ కలిగివున్నాయి.

*నీకు కామాతురత ఉంది గాబట్టే వ్యభిచారం, జారత్వం చేస్తున్నావు!

 

*కామాతురత ఉంది గాబట్టే అక్రమ సంభంధాలు కలిగిఉన్నావు!

 

*నీకు కామాతురత ఉంది గాబట్టే పరస్త్రీలవంక / పరపురుషుల వంక మోహపుచూపు చూస్తున్నావు.

 

*కామాతురత ఉంది గాబట్టే బిగుతైన బట్టలు వేసుకుని ప్రజలను నీవైపు చూసేలా చేస్తున్నావు.

 

*కామాతురత ఉంది కాబట్టే ఇంటర్నెట్ లో బూతు బొమ్మలు, బూతు సినిమాలు, బూతు సాహిత్యం చూస్తున్నావు.

 

*ఎవరూ చూడటం లేదు కదా అని అనుకుంటున్నావు గాని, నిన్ను నన్ను చేసిన దేవుడు, నీకోసం నాకోసం చాడీలు చెప్పే సాతానుగాడు CCTV కెమెరా లో చూస్తున్నారు అని మరచిపోతున్నావు.

 

      ఈ కామాతురత వలననే ఒక మహా గొప్పవ్యక్తి ఎలా పతనమైపోయాడో- మహా జ్ఞాని ఎంతటి బుద్ధిహీనుడయ్యాడో చూసుకొందాం! బైబిల్ గ్రంధం ఎవరినీ ముఖస్తుతి చేయదు. పాపిని పాపి అన్నది, నీతిమంతుడిని నీతిమంతుడు అని వ్రాయబడింది.  మహాజ్ఞాని, మహాచక్రవర్తి అని సోలోమోనును పొగడిన బైబిల్ గ్రంధమే, ఆవ్యక్తి నీతి తప్పి ప్రవర్తించినప్పుడు ఏమని వ్రాయబడిందో చూద్దాం!

 1రాజులు 11: 2

కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

1 రాజులు 11వ అధ్యాయం మొత్తం చూసుకుంటే ఎంతగా సోలోమోను పతనమయ్యాడో చూడవచ్చు! 1,2 వచనాలలో : ఇంకనూ అనేక పరస్త్రీలను మోహించి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను.

చూసారా దేవునికి ఇష్టం లేనిపని ఏదైనా ఉందంటే అది వ్యభిచారమే!

 3వ వచనం 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, ౩౦౦ మంది ఉపపత్నులు . జాగ్రత్తగా పరిశీలిస్తే సోలోమోనుకి ఎంతటి status పిచ్చి ఉందో మనకు తెలుస్తుంది. రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు కాకపోతే- నచ్చినదానిని ఉంచుకుంటూ వచ్చాడు. ఎంత ఘోరమండి ఇది?

ఈరోజుల్లో ఒక భార్యతో కాపురం చేయలేక కుడితిలో పడిన ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు చాలామంది పురుషులు. మరి ఈ వ్యక్తి వెయ్యిమందితో ఎలా ఏగాడో కదా!  చివరికి ఏమైయ్యింది? 3వ వచనం వీరు అతని హృదయాన్ని విగ్రహారాధన తట్టు, విగ్రహాలు తట్టు తిప్పివేశారు. అందుకే దేవుడు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని ఖరాఖండిగా చెబితే (ద్వితీ 7:3,4) వినకుండా చేసుకున్నందుకు బ్రష్టుడై పోయాడు సోలోమోను. ప్రియ దేవుని బిడ్డా! నీవు బైబిల్ మాట వినకుండా అన్యస్త్రీలను పెళ్ళిచేసుకుంటే, అన్యుల అమ్మాయిని/ అబ్బాయిని మీ సంతానానికి ఇచ్చి పెళ్లి చేస్తేమహాజ్ఞానియైన సోలోమోనే బ్రష్టుడైపోయాడు నీవెంత, నీ పిల్లలెంత! జాగ్రత్త! వీరు నీ పిల్లలను ఇట్టే బ్రష్టులు చేయగలరు.

 

 ఇక 4-8 వచనాలలో సోలోమోను కోసం ఇంకా వివరంగా వ్రాయబడింది

4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.

5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.

8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. . . . .

దానికి బదులుగా దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై మాట్లాడినా, హెచ్చరించినా వినలేదు. బహుశా సోలోమోను తనకు నచ్చిన దావీదుగారి కుమారుడని రెండుసార్లు వార్నింగ్ ఇచ్చిఉండొచ్చు.

ప్రియ చదువరీ నీకు నాకు ఆ అవుకాశం లేకపోవచ్చు!

11. సెలవిచ్చినదేమనగా-నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. . . . .

చివరికి దేవుడిచ్చిన శాపం ఈ అధ్యాయం పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! కామాతురత వలన కలిగే ప్రలోభాలు, నష్టాలను మహాజ్ఞానియైన సొలొమోనే తప్పించుకోలేకపోయాడు, నీవు నేను ఎంత?!!! నీకు నాకు సోలోమోనుకు ఉన్నంత జ్ఞానంలో 5% కూడా ఉండి ఉండదు. కాబట్టి నీవు నేను కూడా తప్పించుకోలేము జాగ్రత్త!

 

  అందుకే పౌలుగారు ముందుగానే మనలను హెచ్చరిస్తున్నారు ఈ కొలస్సీ, గలతీ, కొరింథీ పత్రికలు ద్వారా! అందుకే రోమీయులకు 12: 1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఎఫెసీయులకు 5: 1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు నీ పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నావా? ఎందుకూ పనికిరాని నిన్ను నన్ను దేవుడు రాజులయిన యాజక సమూహంలో చేర్చారు కదా , మరి అందుకు తగిన జీవితం జీవిస్తున్నావా? దేవుడు విశ్వాసులకు క్రీస్తుతోపాటు క్రొత్త జీవితంతో పాటు, తన మహిమను కూడా ఇచ్చారు. ఇలాంటి పాడుపనులు చేస్తే నీవు మహిమను పోగొట్టుకొంటావని మర్చిపోకు! కాబట్టి మన జీవితంలో పాపాన్ని తప్పకుండా నిర్మూలించాలి!

 

    మనం మానవులము, కంట్రోల్ చేసుకోవడం కష్టం; చిన్న చిన్న పాపాలు చేసినా పర్వాలేదు; జారత్వం, వ్యభిచారం తప్పులేదు, అవి మన ఆత్మకు అంటవు అని చెప్పే తప్పుడుబోధకులుచీడపురుగులు మాట విని మోసపోకు!

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

 అంతేకాకుండా మనం ఈ పాపాలను జయించగలం! అది మనకు సాధ్యమే! అందుకే పౌలుగారిద్వారా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయించారు. మనం చేయలేని పనులు, మోయలేని భారం దేవుడు మనమీద ఎప్పుడూ మోపేదేవుడు కాదు మనదేవుడు!! ఆయన పవిత్రుడు గాబట్టి మనం కూడా పవిత్రంగానే ఉండాలి.

 

 ఎలా?

క్రీస్తుద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మద్వారా, ఆత్మలో నింపబడటం ద్వారా, ఆయన ఆత్మ శక్తిద్వారా సమస్తము సాధ్యమే!

రోమీయులకు 8: 14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా ఎదుట నీ వాక్యము ఉంచుకొందును! కీర్తనలు 119:11;

 మరచిపోకు ఇలాంటివాటిని చేసేమారి మీదకు, అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. 6వ వచనం! ఎఫెసీ 5:5

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

 

   కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నేడే నీ పాపాన్ని/ వ్యభిచారం/జారత్వం / కామాతురత/ pornography విడచిపెట్టి, దేవునిపాదాలు పట్టుకో!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*65వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-9*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన లక్షణం

          *విగ్రహారాధన!*

*విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.

*విగ్రహారాధన అంటే? 

విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.!

 

బైబిల్ చెబుతుంది నీవు ఏ రూపంలో కూడా విగ్రహాలు చేసుకోకూడదు! ఇది దేవదేవునికి అసహ్యమైన క్రియ! కారణం జీవము గల దేవుడు, పౌరుషం, అధికారం, శక్తి, మహిమ, ప్రభావాలు గల దేవుడు, సర్వసృష్టికర్తయైన దేవునికి రావలసిన ఘనత, జీవములేని విగ్రహాలు చేసుకుని వాటినే దేవుళ్ళుగా పూజించడం అనేది నిజ దేవునికి ఇష్టం లేని పని!

 

అదేనా? 

ఇంకా ఏవైనా విగ్రహారాధన ఉందా?

నీవు చెప్తావ్. నేను అట్లా విగ్రహారాధన చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని. 

 

కాని, ఒక్క విషయం!

విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు. 

దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

 

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? 

నీ హృదయం దేనితో నిండిపోయింది? 

గాళ్ ఫ్రెండా? 

బాయ్ ఫ్రెండా? 

మోటార్ బైక్సా? 

వస్త్రాలా?

సెల్ ఫోన్సా?

బంగారమా? 

ధనమా? 

ఆస్థులా? 

అంతస్తులా? 

నీ పిల్లలా? 

అసూయా? 

ద్వేషమా? ఏది? 

ఇవన్నీ విగ్రహాలే. 

 

ఇప్పుడు చెప్పగలవా? 

నేను విగ్రహారాధికుడను కాదని. 

 

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? 

ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా? 

 

అందుకే కదా! 

సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద (బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది. 

 

నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా? 

 

*లేకపోతే ఏమవుతుందో తెలుసా? 

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

                ప్రకటన 21:8

గమనించాలి:  ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

వద్దు! 

ఇది వినడానికే భయంకరం. 

సరి చేసుకుందాం.

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*51వ భాగము*

 

1 పేతురు 2:4--5

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా ఇక ముందుకు పోతే 5వ వచనంలో: మనము అమూల్యమైన సజీవమైన రాయియైన ప్రభువువద్దకు వచ్చిన వారమై

1) మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

2) యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

ఈరోజు మొదటి విషయాన్ని ధ్యానం చేద్దాం!

 

మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

సజీవమైన రాళ్ళు సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా (1 కొరింతు 14:15). మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలోనుంచే జీవ జలం పారుతూ ఉంది.

1కోరింథీయులకు 14:15

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

 

ఆ ఆత్మ జీవము నిస్తుంది!

రోమీయులకు 8:2

క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.

 

కారణం యేసే జీవము!

యోహాను 14:6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

 

యోహాను 17:3

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

 

యోహాను 4:10

అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.

యోహాను 4:14

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

 

కాబట్టి ఆయన సజీవమైన రాయి. ఆ రాతిని పొందిన నీవుకూడా సజీవమైన రాయివి!

 

అయితే నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నావు!

దేవుడు నమూనా తయారు చేసేవాడు, కట్టేవాడు. తన ఇంటి గురించి ఆయన బాగా ఆలోచించి ఏర్పాట్లు చేశారు, దానిని చక్కగా తీర్చి దిద్దుతున్నారు అన్న విషయంలో మనకు సందేహం అవసరం లేదు. ప్రతి రాయీ ఏ స్థానంలో ఉండాలో ఆయనకు చక్కగా తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్ళను తీసేసి వేరే రాళ్ళను అక్కడ పెట్టవలసిన అవసరం ఆయనకు కలగదు. దేవుడు ఒక చేత్తో రాళ్ళను తీసేస్తూ ఒక చేత్తో నిర్మిస్తూ ఉండడం జరగడం లేదు.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:19,20,21,22

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

హెబ్రీయులకు 3:6

అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

1కోరింథీయులకు 3:9

మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

1కోరింథీయులకు 3:10

దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

1కోరింథీయులకు 3:11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

1కోరింథీయులకు 3:12

ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

1కోరింథీయులకు 3:13

వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

1కోరింథీయులకు 3:14

పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

1కోరింథీయులకు 3:15

ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

1కోరింథీయులకు 3:16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

1కోరింథీయులకు 3:17

ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

సంఘాన్ని దేవుని పొలముతోను లేక వ్యవసాయముతోనే కాకుండా మీరు దేవుని గృహము అంటున్నారు 9వ వచనంలో!! అయితే మనము బుర్రలు పాడుచేసుకోకుండా 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడు అనియు మీరెరుగరా అంటున్నారు! అనగా మనము ఏ గృహముగా కట్టబడుచున్నాము అంటే దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము! ఇంకా ఎఫెసీ 2:22 లో కూడా అంటున్నారు మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు....

ఎఫెసీయులకు 2: 22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

అయితే పేతురు గారు ఆత్మావేశుడై అంటున్నారు మీరు దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయనకోసం పరిశుద్ధమైన యాజకులుగా ఉండేలాగున మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు!

 

(గమనించాలి: గతభాగాలలో లేఖనాలు పరిశీలించడం అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి అని చెబుతూ లేఖనాలు పరిశీలించడం ఇలానే చెయ్యాలి అని చెప్పడం జరిగింది! పౌలుగారు మనము దేవుని ఆలయముగా దేవుని గృహముగా కట్టబడుచున్నాము అని ఆత్మావేశుడై ఇక్కడ చెబితే అనగా కొరింథీ పత్రికలో చెబితే అదే పరిశుద్దాత్ముడు పేతురు గారిని ఉపయోగించుకుని పరిశుద్ధ యాజకులుగా ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని దేవునిచేత మీరు ఆత్మ సంబంధమైన మందిరము అనగా దేవాలయముగా కట్టబడుచున్నారు అని రాశారు! లేఖనం- లేఖనము తో పోల్చబడి సరిగా ఉంది! ఇదీ లేఖనాలు పరిశీలించే విధానం!!!)

 

కాబట్టి ఇక్కడ మనకు మనము దేవునికి ఆలయముగా దేవుడు నివశించే మందిరముగా కట్టబడుచున్నాము అని అర్ధం అవుతుంది! మరి ఇలా కట్టబడాలంటే కొద్దిగా కట్టడాల కోసం ధ్యానం చేద్దాం!

 

ప్రియులారా! గతభాగములో కొలస్సీ పత్రిక 2:6-7 ధ్యానం చేసుకుంటూ, క్రీస్తులో వేరుపారడం కోసం ధ్యానం చేసుకున్నాం!

ఇక ఈరోజు ఇంటివలె కట్టబడటం కోసం ధ్యానం చేద్దాం!

 కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.. .

 

 మనం పౌలుగారు విశ్వాసులను మొక్కలతో/ చెట్లతో పోల్చడం చూశాం!

నేడు ఈ భాగంలో పౌలుగారు విశ్వాసులను ఇంటితో/ కట్టడంతో పోలుస్తున్నారు! అయితే అది ఏ ఇల్లు? దేవుని ఇల్లు! ఎఫెసీ 2:19-22 వరకు చూసుకుంటే చాల విపులంగా కనిపిస్తుంది మనకు!

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిమీద కట్టబడియున్నారు అంటున్నారు.

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

ఇక్కడ వారు ఏ పునాది మీద కట్టబడుతున్నారు? క్రీస్తుయేసు అనే పునాదిమీద! ఆ పునాది క్రీస్తే!! 1కోరింథీయులకు 3: 11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 1పేతురు 2: 4,5

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

   ఇక ఇల్లు కట్టాలి అంటే పునాది వేయాలి! ఆ పునాది దేనిమీద కట్టబడింది అనేది చూసుకోవాలి.  ఇప్పుడు మనమూ యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మరో ఉపమానం: .......

Matthew(మత్తయి సువార్త) 7:24,25,26,27

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

 

బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కట్టిన ఇల్లుకోసం యేసయ్య చెప్పిన ఉపమానంలో చూసుకుంటే, ఒకడు తన ఇల్లు ఇసుకమీద కట్టాడు; మరొకడు బండమీద కట్టాడు. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడి నందువలన గాలి, తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!!

 

 ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను! నీవు కేవలం Material Blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలి పోక తప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోధనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు!!

 

అయితే గతంలో చెప్పిన విధముగా క్రీస్తుమీద ఆనుకొన్న వారికి బండమీద కట్టబడిన వారికి- గాలి, వాన లాంటి శ్రమలు రాకతప్పవు! వాటిని తట్టుకొంటేనే పరలోకం!

 

ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంతలోతుగా తీసి కడితే, అంత బలంగా ఉంటుంది ఆ ఇల్లు! అలాగే శ్రమలయందు వేరుపారినప్పుడునీకు ఎన్ని కష్టాలు, శోధనలు వస్తాయో, నీవు అంత విశ్వాసంలో లోతుకు వేరుపారుతావు! అప్పుడు నీ విశ్వాస స్థాయి / పరిమాణం పెరిగి ఎన్ని కష్టాలు,శోధనలు వచ్చినా ధైర్యంగా ఉండగలవు!

కేవలము Material Blessings కోసం చూస్తే, కష్టనష్టాలలో సోలిపోక తప్పదు!

 

  ఇక పునాది తీసేటప్పుడు రాళ్ళు, చిల్లపెంకులు, గాజుపెంకులు, ఎముకలు లాంటివి ఉంటే తీసిపారేస్తారు! అలాగే నీలో ఉన్న బండలాంటి హృదయం,

లోకాశలు, లోకాచారాలు అన్నీ తీసి పారేస్తే, ఆ పునాది దిట్టంగా ఉంటుంది!

 

    ఇక చివరగా, 1 కొరింథీ 3:11-17 వరకు చూసుకుంటే క్రీస్తు అనీ పునాది మీద కాకుండా ఎవడైనా మరో పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివాటితో కడితే- ఆ పనితనం అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ అగ్ని- శ్రమలు అనే పరీక్షలు! ఇక బంగారం, వెండి వెలగల రాళ్ళు అనేవి వివిధ రకాలైన బోధలు!!

 

   అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు!

 

  ప్రియ చదువరీ!  నీ పునాది దేనిమీద? క్రీస్తుమీదనా?

ధనం మీదా?

శ్రమలలో తట్టుకొంటున్నావా? సోలిపోతున్నావా?

 పరీక్షించుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*52వ భాగము*

1 పేతురు 2:4--5

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

     ప్రియులారా ఇక ముందుకు పోతే 5వ వచనంలో: మనము అమూల్యమైన సజీవమైన రాయియైన ప్రభువువద్దకు వచ్చిన వారమై

1) మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

2) యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

ఈరోజు రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం!

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ప్రభువు చేశారు!!

 

మొదటగా పరిశుద్ధ యాజకులుగా చేశారు అంటున్నారు!

 విశ్వాసులు దేవునికి ఇల్లుగా కట్టబడుతూ ఉండడమే కాదు. ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యాజకులుగా కూడా ఉండబోతున్నారు 9;

 

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ప్రకటన 1:6;

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

Hebrews(హెబ్రీయులకు) 10:19,20,21,22

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21 .దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాస విషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

క్రొత్త నిబంధనలో విశ్వాసులలో ప్రత్యేకమైన యాజక వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యాజకులే. యేసుప్రభు శిష్యులలో, లేక రాయబారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూయాజకుడుఅని బైబిల్లో పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చినవారిలోయాజకుడుఅనే ప్రత్యేకమైన పదవి లేదు

 

ఎఫెసీయులకు 4:13

పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 

1కోరింథీయులకు 12:28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

 

కనుక విశ్వాసులంతా యాజకులుగా ఉండదగినవారే! వారికున్న సామర్థ్యం బట్టి వారిని ఏలేవారిగా దేవుడు చేశారు. కాబట్టి దేవుడైతే రాజులుగాను యాజకులుగాను మనలను చేశారు. అయితే నీ విశ్వాస సామర్థ్యం బట్టి నీవు కేవలం రాజుగా ఉంటావా, యాజకునిగా ఉంటావా లేదా రెండు కలిగిన వానిగా ఉంటావా అనేది నిర్ణయించబడుతుంది లేక వాడబడతావు!!!

 

 ఇక రెండవది: యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు...

దేవునికి అనుకూలమైన ఆత్మసంబంధమగు బలులు అర్పించాలి!

యాజకులు అంటే దేవునికి ఏదో ఒకటి అర్పించవలసినవారు. పూర్వకాలంలో జంతు బలులు ఉండేవి. ఇప్పుడు దేవుడు ఆ అహరోను యాజక ధర్మమును అనగా జంతుబలి వ్యవస్థ ను కొట్డివేసి యేసుక్రీస్తు ద్వారా మెల్కీసెదకు క్రమము ఏర్పాటు చేశారు. దీనిలో జంతుబలులు లేవు! మరి ఇప్పుడు విశ్వాసులు బలులుగా ఏమి అర్పించాలి?!!!!

ఇప్పుడు  యాజకులుగా ఉన్న విశ్వాసులు తమను, తమ స్తుతులను, తాము ప్రేమతో దయతో చేసే క్రియలను దేవునికి అర్పించాలి.

Romans(రోమీయులకు) 12:1,2

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

Hebrews(హెబ్రీయులకు) 13:15,16

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.

 

కీర్తనలు 141:2

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

 

గమనించాలి మనకు  ప్రత్యక్ష గుడారములో ఆవరణంలో గంగాళం కనిపిస్తుంది. దీనిలో యాజకులు యాజకత్వము చేసేముందుగా, ఇంకా పరిచర్య చేసేముందు కడుగుకుంటారు. అయితే ఇది భూమిమీద మనుష్యులు దేవుని సన్నిధిని సమీపించి తమ పాపములను కడుగుకోవడాన్ని సూచిస్తుంది. దానిలో గల నీరు విశ్వాసులు కార్చే కన్నీరు లేక పశ్చాత్తాపంతో చేస్తే కన్నీటి ప్రార్దన అనిగ్రహించాలి! దేవుని వాక్యపువెలుగులో ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మన రహస్యపాపములు కనబడినప్పుడు వాక్యం మనలను గద్దించినప్పుడు వెంటనే ఆ గద్దింపుకు లోబడి పాపిని ప్రభువా నన్ను క్షమించమని నిజమైన పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్ధన చేస్తే ఆ కన్నీటితో దేవుని పాదములను తడిపితే తడిచిన పాదాలతో ఆయన నిన్ను దాటుకుని పోలేరు! ఆ గంగాళములో నీ పాపములు శుద్ధి అయిపోతాయి!

 

ఇంకా అక్కడ మనకు కనబడేది ఇత్తడి బలిపీటం! ఇది యేసుక్రీస్తుప్రభులవారు చేసిన యేసుక్రీస్తుప్రభులవారు ఆ కల్వరి గిరిలో చేసిన బలియాగమునకు గుర్తు! ఎందుకంటే ఈ బలిపీటం మీదనే రక్తమును చిందించి అర్పిస్తారు. అలాగే ఆ కల్వరికొండమీద యేసుక్రీస్తుప్రభులవారి బలియాగం వలననే నీకు నాకు విమోచన కలిగింది. దానికి సూచనగా వారు ఇత్తడి బలిపీటము చేసారు. గమనించాలి! ఆ ప్రత్యక్ష గుడారం గాని, ధర్మశాస్త్రము గాని రాబోయే లేక జరుగబోయే వాటికి సూచన మాత్రమే గాని నిజమైనది క్రీస్తుయేసులో ఉంది అని పౌలుగారు చాలాసార్లు చెప్పారు! కాబట్టి ఇవన్నీ అనగా బలిపీటం గాని, ఇత్తడి బలిపీటం గాని, కరుణా పీఠం గాని, సువర్ణదూపార్తి గాని, కెరూబులు గాని, ఇవన్నీ దేవుని సన్నిధిని సూచించే యేసుక్రీస్తుప్రభులవారినే సూచిస్తున్నాయి! వాటిని వారు ఆ చాయలు తయారుచేసుకుని ఆరాధించేవారు! ఇవన్నీ దేహశుద్ధి కోసమే తప్ప ఆత్మశుద్ధి కోసం కాదు!

 

అయితే ఈ నూతన నిబంధన సంఘంలో గల మెల్కీసెదెకు క్రమంలో జరిగే ఈ కార్యక్రమాలు అన్నీ మనస్సును, ఆత్మను హృదయాన్ని శుద్ధిచేస్తాయి! పాత నిబంధనలో ఉన్నవి క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నాయి! వాటిని దేవుడు కొట్టివేయలేదు- పూర్తిచేసి లేక నెరవేర్చి- వాటిని క్రొత్త పోలికలో కేవలం దేహాన్ని మాత్రమే కాకుండా తనువూ మనస్సు ఆత్మ కూడా శుద్ధి అయ్యేలా, ఇకను పాపం చేయకుండా చేసేలాగా దేవుడు క్రొత్త నిబంధనలో ఏర్పాటుచేశారు. ఈ క్రమమే మెల్కీసేదేకు క్రమము!

 

అయితే మీరనవచ్చు మరి వారు నైవేద్యాలు ధూపాలు వేసేవారు కదా మనం వేయడం లేదు కదా! వారు బలి అర్పించేవారు కదా మనం చేయడం లేదు కదా అంటే మనం కూడా వాటిని చేస్తున్నాము!

ఎలా అనొచ్చు మీరు!

 

మనం కూడా యాగములు చేస్తున్నాము. అదే స్తుతియాగం! కీర్తనలు 50: 14, 23

దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

స్తుతియాగం చెల్లించేవాడు నన్ను మహిమ పరుస్తున్నారు అంటున్నారు దేవుడు!.

 

బలి!! మనం కూడా బలులు అర్పిస్తున్నాము. ఏమిటవి? విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలి అని కీర్తన 51:17 సెలవిస్తుంది. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో ప్రార్ధన చేయడమే ఆయనకు ఇష్టమైన బలి!

 

మరి ధూపము! కీర్తన 141:2 నా ప్రార్ధన ధూపము వలెను, నేను చేతులెత్తుట అనగా మనం చేతులెత్తి ప్రార్ధన చెయ్యడమే ఆయనకు సాయంకాల నైవేద్యంలా ఉంటుంది. అందుకే పౌలుగారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయమని చెప్పారు. 1తిమోతి 2:8;

 

  కాబట్టి ప్రియ సహోదరీ సహోదరుడా! ఇవన్నీ మనం కూడా చేస్తున్నాము! అవి అనగా పాత నిబంధన ఆచారాలు ఇప్పుడు మనం చేసేవాటి యొక్క సూచనలు మాత్రమే! వారు చేసినది సూచనలు! మనం చేసేవి యధార్ధమైనవి! కాబట్టి విరిగినలిగిన హృదయం కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే ఆయన మనలను పరిశుద్ధాత్మతో నింపి ఆయన మహిమలో మనలను నింపుతారు. అంతేకాకుండా మనం చేసే ఆరాధన ఇశ్రాయేలువారు చేసినట్లు ఆచారపరంగా చేస్తే ఉపయోగం లేనేలేదు! ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని ఆయన సెలవిచ్చారు. యోహాను 4:24;

 

 కనుక ప్రియ స్నేహితుడా! పెదాలతో దేవుణ్ణి ఆరాధించకుండా నిజంగా హృదయ పూర్వకంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధన చెయ్యాలి. అంతేకాకుండా నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ బలముతోనూ ఆయనను ఆరాదించ బద్ధులమై ఉన్నాము!

ప్రియ స్నేహితుడా! నీవెలా ఆరాధన చేస్తున్నావు?

ఒకసారి నిన్నునీవు పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*53వ భాగము*

1 పేతురు 2:6--8

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

8.కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఆరవ వచనంలో ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

ఆ రాయి కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!

యెషయా 28:16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

జెకర్యా 1:4

మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

 

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

కాబట్టి ఆ రాయి యేసుక్రీస్తు ప్రభులవారు!! ఈయనయందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు!

పౌలుగారు అంటున్నారు:

రోమీయులకు 5:2

మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

రోమీయులకు 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

ఇక ఏడవ వచనంలో అంటున్నారు విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

గమనించాలి ఆయనలో నమ్మకం విశ్వాసము ఉంచిన వారికే క్రీస్తు ప్రియమైనవాడు. వారే ఆయన విలువను చూడగలుగుతారు, ఆయన్ను ప్రేమించగలుగుతారు.

అందుకే మొదటి అధ్యాయంలో అన్నారు 1 పేతురు 1:8

8 మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు.

 

ఇక నిషేదించిన రాయి కూడా యేసుక్రీస్తు ప్రభులవారే!

కీర్తనలు 118:22

ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.

కీర్తనలు 118:23

అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము

ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభులవారిని రక్షకునిగా మెస్సయ్యగా నిరాకరించారు కాబట్టి ఆ రక్షణ భాగ్యం మనకు దొరికింది!

మత్తయి 21:42

మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

మత్తయి 21:43

కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

ఈ ఉదాహరణలోని ఆధ్యాత్మిక వివరణను యేసుప్రభువు ఇక్కడ చెప్తున్నారు. కీర్తన 118:22-23లో ఉన్నకట్టేవారు తీసి పారవేసిన రాయిఆయనే. దేవుడు తన ద్రాక్షతోటను (తన రాజ్యాన్ని) తన కుమారుణ్ణి నిరాకరించినది యూదా జాతి! (యోహాను 1:11) ఇప్పుడు ఆ రాజ్యమును వారి దగ్గర్నుంచి తీసివేసి ఇతరులకిస్తాడు. ఇతరులంటే క్రీస్తును స్వీకరించే ఇతర జాతులవారు. కొద్ది కాలంలోనే సంఘాల్లో ఇతర జాతులవారే అధిక సంఖ్యాకులయ్యారు (ఇప్పటికీ ఇలానే ఉంది). యేసుప్రభువును అభిషిక్తుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించనివారి గతిని వ 44 వెల్లడిస్తున్నది. అపొ కా 4:11; రోమ్ 9:32-33; 1 పేతురు 2:6-8 కూడా చూడండి.

అపో.కార్యములు 4:11

ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

అపో.కార్యములు 4:12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

 

ఇక ఎనిమిదవ వచనంలో కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

దేవుని సత్యానికి లోబడనివారు సత్యం విషయంలో తొట్రుపడుతారు. ఆ సత్యం క్రీస్తే (లూకా 2:34). ఆయనను కోరుకున్నవారు పై స్థాయికి లేస్తారు. ఆయనను కోరుకోనివారు పడిపోతారు.

యెషయా 8:14

అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును

యెషయా 8:15

అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.

 

రోమీయులకు 9:33

ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

 

ఇక దానికే వారు నియమించబడ్డారు అనగా నాశనమునకు యూదులు నియమించబడ్డారు. దీని అర్థం బహుశా యూదాజాతి క్రీస్తును తిరస్కరించడం గురించి పేతురు గారు చెప్తున్నారు. యేసుప్రభువు, ఆయన అపొస్తలుడు పౌలుగారు కూడా దీనిని వివరించేందుకు కీర్తనలు, యెషయా గ్రంథాల్లో నుంచి రిఫరెన్సులను వాడుకున్నారు. ఈ అంశం గురించి రోమ్ 911 అధ్యాయాలు చూడండి.

ముఖ్యంగా రోమ్ 9:14-24, 30-33; 11:7-12, 22-32 చూడండి.

 

9:30,31,32,33

30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;

31. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు,

32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.

33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.

౩౦౩౩ వచనాలు ప్రకారం . . .

చూడండి నీతిని వెంటాడని అన్యజనులు అనగా మనం నీతిని, విశ్వాసపు మూలమైన నీతిని పొందుకున్నాం! అయితే ఇశ్రాయేలు వారు నీతిని వెంటాడక, ఆ నీతికి కారణమైన నియమాన్ని అనగా ధర్మశాస్త్రమును వెంటాడి అ నీతిని పొందుకోలేకపోయారు అంటున్నారు.

యూదులు తమ మతం విషయంలో కష్టపడ్డారు. వారికి దేవుని ధర్మశాస్త్రం ఉంది. దాన్ని పాటించడానికి ప్రయత్నించడమనే మార్గం ద్వారా దేవునికి అంగీకారం కావాలని చూశారు. కానీ తమ క్రియలను బట్టి నిర్దోషులూ న్యాయవంతులూ కావాలన్న ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు (3:9, 19, 20). ఇతర ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం లేదు. నిర్దోషత్వం గురించి అంతగా పట్టింపు లేదు. కానీ వారు క్రీస్తు శుభవార్తను విన్నప్పుడు నమ్మకం ఉంచి నిర్దోషులయ్యారు/ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నమ్మకం మూలంగానే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచారన్నమాట (3:22, 26, 28; 5:1).

32,౩౩.... యూదులైతే అలా కాకుండా దేవుడు యెరూషలేములో ఉంచిన రాయియైన యేసుప్రభువును నిరాకరించారు (యోహాను 1:11

ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

; మత్తయి 21:42; అపొ కా 4:11; 1 పేతురు 2:6-8).

 

   కీర్తనలు 118:22లో భక్తుడు ప్రవచించారు: ఇల్లు కట్టువారు నిషేదించిన రాయి మూలకు తలరాయి ఆయెను! దానినే యేసుక్రీస్తు ప్రభులవారు మత్తయి 21:42లో , లూకా 20:17 లో ఎత్తి చెబుతున్నారు. ఆ మూలరాయి, ఆ అడ్డురాయి యేసుక్రీస్తు ప్రభులవారు! ఇశ్రాయేలీయులు ఆ రాయిని తిరస్కరించారు. పతనమయ్యారు.

యూదులు అలా పతనం కావాలని దేవుడు ముందుగా నిర్ణయించినందువల్ల వారలా అయ్యారని పౌలు అనడం లేదని గమనించండి. వారి సొంత విధానాలవల్లే పతనమయ్యారు.

     ప్రియ దైవజనమా! ఆ మూలరాయిని తెలుసుకున్న నీ పరిస్తితి ఎలా ఉంది? ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. పతనమయ్యారు. నీవు తెలుసుకుని కూడా తిరస్కరించావా? నీవుకూడా పతనమైపోతావు జాగ్రత్త!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*54వ భాగము*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

దేవుడు చీకటి నుండి మనలను పిలుచుకున్నారు.

ఏం చీకటి అది?

లోకమనే చీకటి! ఆత్మీయ అంధకారం!

 

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

యెషయా 9:12

1. అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.

2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.

 

మొదటి వచనం అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు, పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన ఈ సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు....

 

 ఇక్కడ మబ్బు అనగా శ్రమలు వేదన మరియు క్రీస్తుయేసు కోసం నిజమైన వెలుగు రాకుండా చేస్తున్న /అడ్డుకుంటున్న చీకటిని లేకుండా చేస్తారు అంటున్నారు!   ఇంకా చీకటి అనగా ఆధ్యాత్మిక అంధకారమని గ్రహించాలి! దీనిని లేకుండా చేస్తున్నారు.

 యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు: నేను లోకమును వెలుగునై యున్నాను, మీరు కూడా లోకానికి వెలుగులా ఉండాలి అన్నారు!

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

 

యోహాను 9:5

నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

 

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

లూకా 2:31

నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన....

 

యోహాను 12:35

అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు

యోహాను 12:36

మీరు వెలుగు సంబంధులగునట్లు (మూలభాషలో- వెలుగుకుమారులగునట్లు) మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

యోహాను 12:40

వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

యోహాను 12:46

నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.

 

 ఇంకా వెలుగుకోసం అనేక రిఫరెన్సులు ఉన్నాయి గాని కొన్నిమాత్రం చెప్పడం జరిగింది, యోహాను గారు సువార్త వ్రాయడం మొదలుపెట్టి నిజమైన వెలుగు ఉంది దానిని లోకము గ్రహించడం లేదు, ఆ వెలుగు యేసుక్రీస్తుప్రభులవారే అని మొదటి అధ్యాయంలో చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది. ఆయనను రక్షకునిగా అంగీకరించడమే వెలుగులోకి రావడం అని గ్రహించాలి!

పౌలుగారు అంటున్నారు అపో.కార్యములు 26:18

వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.

 

2కోరింథీయులకు 4:5

అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.

 

ఎఫెసీయులకు 5:8

మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.

ఎఫెసీయులకు 5:9

వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.

ఎఫెసీయులకు 5:10

గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి

ఎఫెసీయులకు 5:11

నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.

ఎఫెసీయులకు 5:12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.

ఎఫెసీయులకు 5:13

సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్ష పరచబడును; ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గదా

ఎఫెసీయులకు 5:14

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.

 

కొలస్సీయులకు 1:13

ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క (మూలభాషలో- తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను.

 

అయితే యోహాను గారు అంటున్నారు 1యోహాను 1:5

మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

1యోహాను 1:6

ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

1యోహాను 1:7

అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

కాబట్టి వెలుగై యున్న నీవు మొదటగా: వెలుగు పనులే చేయాలి గాని చీకటి పనులు చీకటి కార్యాలు చేయరాదు! లోకస్తులు చేసే పనులు నీవు ఎంత మాత్రము చేయకూడదు కారణం ఆయన మనం చీకటిగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుచుకున్నారు!

 

ఇక రెండవది: ఒకసారి ఆలోచిద్దాం! ఒకవేళ దొంగ ఈ రాత్రికి రాబోతున్నాడు అని ముందుగా తెలిసింది అనుకుందాం! లేక మీ వీధిలో ప్రతీరోజు ఏదో ఒక గృహంలో దొంగతనం జరుగుతుంది అనుకుందాం! అప్పుడు రాత్రులు మీరు పడుకుంటారా? ఏమాత్రం అశ్రద్ధ ఏమరుపాటు లేకుండా రాత్రంతా ఎవరో ఒకరు కాపలాకాస్తూ సిద్ధంగా ఉంటారు దొంగను ఎదుర్కోడానికి!

 

అలాగే విశ్వాసి కూడా చీకటిలో లేడు వెలుగులో ఉన్నాడు గాబట్టి పరలోకం నుండి దేవుడు వచ్చే సమయం కోసం విశ్వాసి కూడా ఏమరపాటు లేకుండా ఎంతో సిద్ధపాటుతో ఎంతో జాగ్రత్తగా ఎదురుచూస్తూ ఉండాలి!

 

బుద్ధిలేని కన్యకల ఉపమానం ప్రకారం సిద్ధపాటు లేకపోతే బుద్ధిలేని కన్యకలను దేవుడు వదిలి వెల్లిపోయినట్లు నిన్ను కూడా వదిలిపెట్టేస్తారు జాగ్రత్త!... ఆ తర్వాత నీ పేరిట నేను ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా! నీకు కోటిరూపాయలు కానుక ఇవ్వలేదా అంటే అక్రమము చేసే వారలారా నా యొద్దనుండి తొలగిపొండి అంటారు జాగ్రత్త!

 

ఇక మూడవదిగా: కాబట్టి వెలుగై ఉన్న నీవు ఆ వెలుగును అందరికీ పంచాలి! ఎలా అంటే నీలో ఉన్న వెలుగు ఫలము అనబడే ఆత్మఫలము ఫలిస్తే ప్రేమ సంతోషము సమాధానం మంచితనము ఆశానిగ్రహము దయాలత్వము దీర్ఘశాంతము ఇవన్నీ పనిచేస్తే ప్రజలు నీ వెలుగులోనికి నిన్నుచూసి వస్తారు! నీలో పనిచేస్తున్న వెలుగుతున్న వెలుగే అనగా నీలో పనిచేస్తున్న ఈ ఆత్మఫలము అనేకమందిని నీ దగ్గరకు ఆకర్షిస్తుంది. అప్పుడు అనేక జనాలకు నీవే ఒక కరపత్రికగా మారి దేవుని వెలుగులోనికి వస్తారు! నీవే చీకటి అయితే నీవే వ్యభిచారివి త్రాగుబోతువి మధ్యపానివి దొంగవు దోచుకొనువాడవు అయితే ఎవరు నీ దగ్గరికి వస్తారు??? దేవుని నామానికి అవమానం తెచ్చి నీవే చీకటిలో ఉన్నవాడవుగా ఉన్నావు! 

 

ప్రియమైన సహోదరీ సహోదరుడా! నీ కుమారుడు కుమార్తె/ నీ భర్త/ బంధువులు/ ఇరుగుపొరుగు వారు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా అన్యులుగా చీకటిలో జీవిస్తున్నారు కదా, మరి వారికోసం ప్రార్దిస్తున్నావా?

వారికి సువార్త వెలుగును రుచి చూపించావా? వారికి రక్షణ వార్తను ప్రకటించావా?!!

లేకపోతే వారి ఆత్మలయొక్క లెక్క దేవుడు నిన్ను అడుగుతారు అని మర్చిపోకు!

నీవు వెలుగుగా జీవించి అనేకులకు నీ వెలుగును క్రీస్తుని అందరికీ పంచు!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*55వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-13*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

 

      (గతభాగం తరువాయి)

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం చూసుకుందాం!

ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము....

మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము:

 

ఎలా ప్రచురము చేయాలి?

నాకు రెండు విధాలుగా అని తోస్తుంది!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

 

గుణాతిశయమునే ఉత్తమ గుణాలు అని కూడ అంటారు:  ఈ గ్రీకు పదానికి సుశీలత, మంచితనం, ఘన బుద్ధి, పొగడదగినవి అని అర్థం. ఇదే పదాన్ని ఫిలిప్పీ 4:8లోశ్రేష్ఠమైనవిఅనీ, 2 పేతురు 1:3, 5లోసుగుణంఅనీ తర్జుమా చేశారు. యూదా క్రైస్తవులైనా ఇతర జనాల్లోని క్రైస్తవులైనా ఇప్పుడు విశ్వాసులందరి విద్యుక్త ధర్మం, విశేష అవకాశం ఏకైక నిజ దేవుని శ్రేష్ఠతనూ మంచితనాన్నీ లోకానికి ప్రకటించడమే. మనం మన ఘనత గురించి చూడకూడదు. మన మంచితనం గురించి ప్రకటించుకోకూడదు. ఆయన మంచితనాన్నే చాటాలి (కీర్తన 40:10; 71:16; యెషయా 42:12; 43:7; ఎఫెసు 1:6, 12, 14 పోల్చి చూడండి).

 

సరే ఈ రోజు మొదటి విధానాన్ని ధ్యానం చేసుకుందాం!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

 

Luke(లూకా సువార్త) 4:17,18,19,20,21

17. ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18. ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

 

అంతేకాదు ద్వితీయోపదేశకాండంలో 18:1719 లో చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తుప్రభులవారే అని గ్రహించాలి....

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 18:17,18,19

17. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పినమాట మంచిది;

18. వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.

19. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

 

ఈ గొప్ప దేవుడు ప్రవక్త రక్షకుడు తన పరిచర్యను సువార్తతోనే ప్రారంభించారు! అయితే ప్రారంభించే ముందు దేవుడు యేసుక్రీస్తుప్రభులవారిని పరిశుద్ధాత్మ పూర్నుడుగా చేసి అప్పుడు తన సువార్తను ప్రకటింపజేశారు.  కాబట్టి సువార్తను ప్రకటించేవారు పరిచర్య చేసేవారు ముందుగా తాము తమ పాపముల నుండి విముక్తులై పరిశుద్ధాత్మ పూర్నులై అప్పుడు సువార్త ప్రకటిస్తే అనేకమంది ప్రభువు దగ్గరకు వస్తారు!

 

కాబట్టి ముందుగా సువార్త అంటే ఏమిటి? ఎవరు ఎలా ప్రకటించాలి అనేది చూసుకుని అప్పుడు ముందుకుపోదాం!

కొలస్సీయులకు 1: 5

మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

 

   ప్రియులారా! ఇక్కడ  సువార్త సత్యము అని సంభోదిస్తూ ఆ నిరీక్షణ గూర్చి ఇంతకుముందు వింటిరి అంటున్నారు. ఈ నిరీక్షణ మనుష్యులు దేనికోసమో ఎదురుచూస్తున్న నిరీక్షణకోసం చెప్పడం లేదు! అది తీతుకు 2:13 లో చెప్పబడిన శుభప్రదమైన నిరీక్షణకోసం వ్రాయబడింది. ఇంకా కొలస్సీ 1:12లో చెప్పబడిన తేజోవాసులైన పరిశుద్ధులస్వాస్త్యములో పాలివారగుటను గూర్చిన నిరీక్షణకోసం వ్రాయబడింది!!!

 

   మీయొద్దకు వచ్చిన సువార్త సత్యము గూర్చిన బోధ అంటున్నారు. . అనగా సువార్త సత్యమైనది. అది కల్పిత కధకాదు! గలతీ 2:5;14;  మొదటగా సువార్తకోసం ధ్యానం చేస్తే- బైబిల్ లో చాలాచోట్ల సువార్తకోసం వ్రాయబడింది. కేవలం యేసుప్రభులవారు వచ్చిన తర్వాతనే సువార్తకోసం వ్రాయబడింది అనుకుంటే పొరపాటు.  యెషయా గ్రంధం నుండి ఈ సువార్తకోసం చూసుకోవచ్చు! యెషయా 40:9 సీయోనూ- సువార్త ప్రకటించుచున్నదానా! . . . బలముగా ప్రకటించుము! భయపడక ప్రకటించుము అని వ్రాయబడింది.

 

  ఇంతకీ *సువార్త అంటే మంచివార్త. ఆ మంచివార్త భౌతికసంభందమైన వార్తకాదు*! *యేసుక్రీస్తుప్రభులవారు నీకోసం నాకోసం ఈ భూలోకానికి వచ్చి, మన పాపములకోసం బలియాగమై, పాపములను కడిగి, మరణించి తిరిగి లేచారు. ఒకరోజు ఆయన తిరిగివచ్చి ఆయనయందు విశ్వాసముంచిన వారిని తనతోపాటు ఉండటానికి వారిని తీసుకుని పోతారు! ఇదే సువార్త*! ఇదే విషయాన్ని పౌలుగారు చెబుతున్నారు:

1 కొరింథీ 15: 3-10; లేఖనముల ప్రకారం క్రీస్తు మనకోసం చనిపోయి, లేఖనముల ప్రకారం పాతిపెట్టబడెను, మూడవరోజున సజీవంగా లేచారు, లేచిన తర్వాత పేతురుకి కనబడ్డారు, 12మందికి ఒకసారి, తర్వాత 500 మందికంటే ఎక్కువైన వారికి కనబడెను అంటున్నారు. ఇక్కడ 500 మంది అని క్లియర్ గా చెప్పడానికి కారణం ధర్మశాస్త్ర ప్రకారం ఏదైనా విషయం దృవీకరించాలంటే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులుండాలి! ఇక్కడ 500 మంది సాక్షులను చూపెడుతున్నారు పౌలుగారు- అంటే ఇది కధ కాదురా నిజంగా జరిగింది అని నొక్కివక్కానించి చెబుతున్నారు! ఇంకా అంటున్నారు అకాలమందు పుట్టిన నాకు కూడా కనబడ్డారు! ఆయన కల్పిత కధలు కాకుండా తన సజీవసాక్ష్యం చెబుతున్నారు. అదే మనకు కూడా మాదిరి!!

 

 సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను దెలుపటయే! సాక్ష్యమిచ్చేటందుకు స్వామి రక్షించేననుచు సాక్ష్యమిచ్చెద!!!... 

కాబట్టి మన సాక్ష్యాన్ని, యేసయ్య రక్షణసువార్తను ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన అవుసరం ఉంది! అయితే ఇది పౌలుగారు చెప్పినట్లు : వాక్చాతుర్యం లేకుండా, నేను సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తున్నాను అంటున్నారు! 1 కొరింథీ 1:17-21; ఇంకా అంటున్నారు: సిలువను గూర్చిన వార్త (సువార్త), నశించుచున్న వారికి వెర్రితనముగా కనిపిస్తుంది, అయితే రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి!! కాబట్టి ఆ శక్తిగల సువార్తను ఆసక్తితో ప్రకటన చేద్దాం! పౌలుగారు సిలువను గూర్చిన భారం నామీద ఉంది. నన్ను భక్షిస్తుంది అంటున్నారు! సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నారు! 1 కొరింథీ 9:16.

 

    సరే ఇప్పడు సువార్త కోసం బైబిల్ లో ఎక్కడ వ్రాయబడిందో చూద్దాం! మీద చెప్పినట్టు యెషయా 40:9 బలము గాను, భయంలేకుండా ప్రకటించమంటున్నారు! అవును నిజవార్తను చెప్పడానికి భయమెందుకు? అన్య దేవతలను దూషించకుండా, మన దేవునివార్తను ధైర్యంగా ప్రకటిద్దాం! ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శాసనాలు వచ్చినా దేవునివార్తను చాటిద్దాం!

 

 ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక! దేవుని దయవలన నా 6వ సంవత్సరం నుండే మా తండ్రిగారితో కలసి సువార్తప్రకటనలో పాల్గొనుట మొదలుపెట్టాను. 6వ సంవత్సరంలోనే దేవుని పాటలు గట్టిగా పాడుచున్నందుకు రాళ్ళదెబ్బలు తిన్నాను, సువార్త చెబితే చంపుతామని గ్రామస్తులు- నేను బ్రతికినంతకాలం సువార్త ప్రకటన మాననని  మా తండ్రిగారు చెప్పడం జరిగింది. అయితే చంపుదామని అనుకున్నప్పుడు రాళ్లదెబ్బలకు నా నుదిటిమీద రక్తం కారుచున్న నన్ను చూసి, ఏమనుకున్నారో- గ్రామం నుండి మమ్మల్ని బయటకు గెంటివేసారు. ఆ రోజు మరలా సాతానుగాడు నన్ను చంపాలని చూశాడు! పెద్ద వర్షం వలన బురదలో సైకిల్ జారిపోయి (ఆకాలంలో (1982) ఇప్పటిలా పక్కా రోడ్లు లేవు, మట్టిరోడ్డులే) నేను పీకలలోతు బురదలో కూరుకుపోవడం జరిగింది. ఆ నిషీదరాత్రిలో నా ఏడ్పు ప్రక్కనున్న కాలువ నీటి ప్రవాహానికి వినబడటం లేదు. 5 నిమిషాల తర్వాత దేవుడు గొప్ప మెరుపును పంపించి నేను మా తండ్రిగారికి కనబడేలా చేసారు. అప్పుడు మా తండ్రిగారు, మరో దైవసేవకుడు కలసి నన్ను బురదలో నుండి తీయడం జరిగింది. అప్పుడు ప్రారంభమైన ప్రస్థానం నేటికీ ఆగకుండా జరుగుతుంది. ఎన్నోసార్లు అవమానాలు, హేళనలు, తిట్లు ఎదురైనా, గ్రామములనుండి గెంటివేయబడినా సరే, ఎన్నో ప్రాంతాలలో, దేశాలలో కూడా దేవుని రక్షణ వార్తను ప్రకటించడం జరుగుతుంది! ఇన్ని ఆపదల నుండి నన్ను తప్పించిన దేవుడు మీకు కూడా తోడుగా ఉంటారు! కాబట్టి భయపడొద్దు! జడియవద్దు!

 

  ఇంకా యెషయ 52:7 లో సువార్త ప్రకటిస్తూ సమాధాన సువార్తను ప్రకటించువారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటున్నారు. అదే విషయాన్ని నహూము 1:15లో దృవీకరించడం జరిగింది. యేసయ్య తన సువార్త పరిచర్య సువార్తతోనే ప్రారంభమయ్యింది. ప్రభువు ఆత్మ నామీద నున్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని చెబుతున్నారు.

 లూకా 4:18;  ప్రభువురాజ్యము సమీపించినది, గనుక మారుమనస్సు పొంది రక్షణపొందుడి అంటూ సువార్త ప్రారంభించారు యేసయ్య! మార్కు 1:15; అందరికీ సువార్త ప్రకటించాలి అని చెబుతూ- మొదట సకలజనులకు అనగా సమస్త దేశాలకు సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అని చెప్పారు!

మార్కు 13:15; చివరకు ఆయన చనిపోయి, తిరిగి లేచి చివరి ఆజ్ఞను ఇచ్చారు: మీరు సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి భాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. . . మార్కు 16:15-18

పౌలుగారు అదే ఆజ్ఞను పాటిస్తూ అనేక దేశాలలో సువార్తను ప్రకటించారు. దానికోసం ఎన్నోచోట్ల దెబ్బలు, చెరశాల అనుభవించారు. పౌలుగారే కాదు ఆదిమ అపోస్తలులు, ఆదిమ సంఘము ఎన్నో అగచాట్లు పడ్డారు. తమ మానప్రాణాలను అర్పించారు. అందుకే ఆ రక్షణ సువార్త మనవరకు చేరగలిగింది!! నీవు నేను నిజదేవున్ని తెలిసికోగలిగాము. ఈ సువార్తకోసము/ యేసయ్య కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును, ప్రాణం రక్షించుకోవాలి అనుకొనువాడు దానిని (పరలోకం) పోగొట్టుకోనును అని చెప్పారు యేసయ్య! మార్కు 8:35; ఇక రోమా 10వ అధ్యాయం మొత్తం సువార్తకోసమే చాలా deep గా వ్రాయబడింది! ప్రకటించకపోతే ప్రజలు ఎలా వింటారు? . . అంటూ వినుటవలన విశ్వాసం కలుగును వినుట దేవుని వాక్యం వలన కలుగును అంటున్నారు! కాబట్టి దేవుని సువార్తను మనం అందరికీ ప్రకటించాలి! క్రొత్త నిభందన మొత్తం సువార్త ప్రకటించాల్సిన అవసరంకోసం వ్రాయబడింది.

 

   ఈరోజుల్లో: వదినా! ఈరోజు పనిమీద బయటికి వెళ్ళిపోయాను- ఫలానా సీరియల్ చూడలేకపోయాను, ఏమైందో కాస్త చెప్పవూ అని అడగడం తరువాయి- కధ- స్క్రీన్ ప్లే దర్శకత్వం తో పాటు frame to frame తప్పకుండా చెబుతావు కదా పనికిమాలిన సీరియళ్ళ కోసం! నిజదేవుని కోసం, యేసుప్రభువు నీజీవితంలో చేసిన మేలులు, అద్భుతాలు రోజుకొకటి ఎప్పుడైనా చెప్పావా ఆ వదినకు?!!! ఆ వదిన/ అక్క నరకానికి పోతే ఆ ఆత్మకు నీవే లెక్క అప్పగించాలని తెలియదా? ఇక ఈ మరదళ్ళుకూడా పనికిమాలిన సీరియల్లుకోసం అడుగుతారు గాని- ఈరోజు నేను మందిరానికి రాలేకపోయాను- ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పారో కాస్త చెప్పవూ అనిమాత్రం అడగరు!! ఎందుకంటే వాక్యం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు! 

 

కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరులా! లోకవార్తలు చెప్పుకోకుండా యేసయ్య సిలువ సువార్తను చెబుదాం!

 అందరికీ ప్రకటిద్దాం!

 సాక్షిగా నిలబడుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*56వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-14*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం చూసుకుందాం!

ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము....

మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము:

 

ఎలా ప్రచురము చేయాలి?

నాకు రెండు విధాలుగా అని తోస్తుంది!

మొదటిది: ఆయన సువార్త ప్రకటించడం ద్వారా!

రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

          

          (గతభాగం తరువాయి)

 

ఇక రెండవది: ఆయన కీర్తిని స్తుతించడం ద్వారా!!

 

ఎఫెసీ 1:3

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

 

ఈ మూడో  వచనంలో అంటున్నారు: మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక అంటున్నారు! పౌలుగారి పత్రికలలో అన్నింటిలో తప్పకుండా దేవునికి స్తుతి చెప్పకుండా ఏ పత్రిక వ్రాయరు! ఇక్కడ కూడా దేవునికి స్తుతులు చెబుతున్నారు!  కీర్తనల గ్రంధంలో స్తుతిచేయుట యధార్ధ వంతులకు శ్రేయస్కరం అంటున్నారు!

కీర్తనల గ్రంథము  33

నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.

అందుకే ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయమంటున్నారు! దావీదు గారు కేవలం చెప్పి వదిలేయడం లేదు! తనకు కష్టమొచ్చి నప్పుడు స్తుతించారు! ఆనందం వచ్చినప్పుడు స్తుతించారు పాటలు పాడారు! తన జీవితమంతా స్తుతిస్తూనే ఉన్నారు!

 

ఈ కీర్తన మొత్తం స్తుతులే ఉంటాయి! ఇంకా కీర్తనల గ్రంధం మొత్తం దేవునికి స్తుతులే ఉంటాయి! కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 8:2; కీర్తనల గ్రంథము 9:1; కీర్తనల గ్రంథము 16:7; కీర్తనల గ్రంథము 18:3; కీర్తనల గ్రంథము 42:5; కీర్తనల గ్రంథము 100:4; కీర్తనల గ్రంథము 150:6;

 

ఇంకా కీర్తనల గ్రంధంలోనే కాదు అనేక గ్రంధాలలో స్తుతులు చెల్లించమని చెబుతున్నారు:  యెషయా 12:1; మత్తయి 5:16; మత్తయి 11:25; లూకా 1:68; రోమీయులకు 15:7 రోమీయులకు 15:11; 2 కోరింథీయులకు 1:3; ఎఫెసీయులకు 1:3 ఎఫెసీయులకు 1:6 ఎఫెసీయులకు 1:12 ఎఫెసీయులకు 1:14; ప్రకటన గ్రంథం 5:12-13; ప్రకటన గ్రంథం 19:5. ఆదికాండము 24:27; నిర్గమకాండము 15:2; లేవీయకాండము 19:24; ద్వితీయోపదేశకాండము 8:10; ద్వితీయోపదేశకాండము 32:3; 1 దినవృత్తాంతములు 16:4 1 దినవృత్తాంతములు 16:9 1 దినవృత్తాంతములు 16:25 కూడా చూడండి.

 

    నిజానికి  తనకు స్తుతులు కరువయ్యాయని దేవుడు మనలను స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని కూడా దేవుడు  తాపత్రయ పడడానికి ఆయనేమీ మనిషి కాదు. ఆయన తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెపుతున్నారన్న మాట. స్తుతి అంటే మాటలతో వెల్లడి చేయబడిన మెప్పు మరియు  ఆమోదం. మనుషులు తమకు ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపిస్తాయో వాటిని పొగడుతారు మామూలుగా . తమకు యోగ్యంగా అనిపించినదానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు. అతి ఉన్నతమైన మంచితనం, అందం, బలప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో గల వస్తువులు, మనుషులు జీవులన్నిటిలో అందరికంటే మిన్నగా స్తుతికి పాత్రుడు ఆయన. మనం దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన కోసం కాదు, మన మేలుకే. మనం అంతటిలో, అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైనవాణ్ణి గుర్తించి స్తుతించేవారమై ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన యోగ్యతను గమనించడమే. అంటే, అతి శ్రేష్ఠమైన, ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడమన్నమాట. ఇలా చెయ్యడం మనకు సమంజసం, తగినది (1 ). తమ స్తుతికి తగని అనేక రకాల వస్తువులనూ వ్యక్తులనూ మనుషులు స్తుతిస్తారు. అయితే దేవుణ్ణి ఎరిగినవారు స్తుతికి పాత్రుడైన ఆయన్నే స్తుతించడం తగిన పని కాదా.

 

 మూర్ఖులు, తృప్తి లేనివారు, స్వార్థపరులు, నమ్మకం లేనివారు, నైతికంగా, ఆధ్యాత్మికంగా అంధులు. ఆత్మలో, సత్యంలో దేవుణ్ణి ఆరాధించరు. వినయ మనస్కులు, న్యాయవంతులు, జ్ఞానప్రకాశం పొందినవారు, సత్యాన్ని గ్రహించినవారు అలా చెయ్యగలరు, చేస్తారు.

 

కొన్ని ఉదాహరణలు చూసుకుంటే

 

దుర్మార్గులు తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధమైనవాటినే పొగడుతూ ఉంటారు (ఫిలిప్పీయులకు 3:19).

 

న్యాయవంతులైతే దేవునిలోను తమ రక్షకుడైన క్రీస్తులోను ఆనందిస్తారు (1 కోరింథీయులకు 1:31; 2 కోరింథీయులకు 10:17; గలతియులకు 6:14; 1 తిమోతికి 1:17).

 

దేవుణ్ణి స్తుతించకపోవడం, కృతజ్ఞతలు చెప్పకపోవడం నిందాపాత్రం. ఇది మనిషి స్వభావంలోనే ఒక లోపాన్ని చూపెడుతుంది. ఈ లోపం తన ప్రజలలో ఉండకూడదని దేవుని ఉద్దేశం. స్తోత్రాలు చెల్లించడం, పాటలు పాడడం, దేవుణ్ణి కీర్తించడం ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి. ఇవి వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి. దేవుణ్ణి బాగా ఎరిగినవారు, అందరికంటే ఎక్కువ జ్ఞానప్రకాశం, వినయం ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా స్తుతిస్తారు.

 

148 వ కీర్తనలో ఎవరెవరు స్తుతించాలో ఉంది! 150 వ కీర్తనలో ఎలా స్తుతించాలి ఏఏ వాధ్యములతో స్తుతించాలో వ్రాయబడి ఉంది! 148....

కీర్తనలు 148:1

యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి

కీర్తనలు 148:2

ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి

కీర్తనలు 148:3

సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 148:4

పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 148:5

యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక

కీర్తనలు 148:7

భూమి మీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి

కీర్తనలు 148:8

అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,

కీర్తనలు 148:9

పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా,

కీర్తనలు 148:10

మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,

కీర్తనలు 148:11

భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.

కీర్తనలు 148:12

యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు

కీర్తనలు 148:13

అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.

150...

కీర్తనలు 150:1

యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:2

ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:3

బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:4

తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:5

మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

కీర్తనలు 150:6

సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.

 

ఇక కీర్తనలు 6:5 ప్రకారం, యెహేజ్కేలు 38:18-19; ప్రకారం ఎవడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు అంటే వాడు చచ్చినోడే!!! సజీవులు దేవుణ్ణి స్తుతిస్తారు!!

 

  చివరికి యేసుప్రభులవారు కూడా తను రొట్టెలు ఆశీర్వదించి అందరికీ పంచినప్పుడు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! మత్తయి 15:36; మార్కు 8:6; యోహాను 6:11;

 ఆయన చనిపోయేముందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! మత్తయి 26:27; మార్కు 14:23; లూకా 22:17, 19;

 

మరో విషయం చెప్పనా? యేసయ్య 10మంది కుష్టరోగులను స్వస్తపరచినప్పుడు వారిలో ఒకే ఒకడు- అతను కూడా సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లూకా 17:16; అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వాడు సచ్చినోడు, మృతుడే కాకుండా కృతఘ్నుడు, విశ్వాసఘాతకుడు!

 

   నీవు ఇంతవరకు బ్రతికి ఉన్నావంటే అది ఆయన కృపయే కదా! ఆయన దయయే కదా! నీకున్న ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, కుటుంబం కోసం, మరీ ముఖ్యంగా నీకున్న రక్షణభాగ్యం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా ప్రియ చదువరీ!!?

 

    అందుకే పౌలుగారు తను రాసిన ప్రతీ పత్రికలలోను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు! దేవునికి కృతజ్ఞతలు చెల్లించని పత్రిక లేనేలేదు! అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్తితులలోను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు! ఎఫెసీయులకు 5: 4

కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

 

 కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 ఫిలిప్పీ 4:6,.

1థెస్సలొనికయులకు 5: 18

ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

 

ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తము అంటున్నారు.

హెబ్రీ 13:15. ఆయనకు ఎప్పుడూ స్తుతి యాగం అనే జిహ్వా ఫలము అర్పిద్దాం అంటున్నారు.

 

విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం దేవున్ని స్తుతించడం!  కాబట్టి నిజదేవుడైన ఆ పరాత్పరునీ స్తుతిద్దామా!!! కారణం దేవుడు మానవుని చేసింది మానవుడు తనను స్తుతిస్తాడని మరియు తనతో సహవాసం చేస్తాడని! మరి నీవు చేస్తున్నావా?!!!

 

  కాబట్టి ప్రియ సహోదరీ! సహోదరుడా! ప్రతీ విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం నేర్చుకుందాం! శ్రమలలో విసుక్కోక స్తుతిద్దాం పౌలుగారిలా!

 ఆయనకు తగినట్లు జీవిద్దాం!

దైవాశీస్సులు!!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*57వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-1*

 

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు మొదటి ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*విశ్వాసి ఏర్పరచబడిన వంశము*

దీనికోసం పౌలుగారు చెబుతున్నారు ఎఫెసీయులకు 1:4

ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

ఎఫెసీయులకు 1:5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

ఎఫెసీయులకు 1:6

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

 

ఎఫెసీయులకు 1:11

మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

ఎఫెసీయులకు 1:12

దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

 

యోహాను 15:16

మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

 

చూడండి మనము ఆయనను ఏర్పరచుకోలేదు గాని ఆయనే మనలను ఏర్పరచుకొన్నారు!

ఎన్నుకొన్నాడు మార్కు 13:20; యోహాను 15:16, 19; రోమ్ 8:33; 2 తెస్స 2:13; 1 పేతురు 2:9. యోహాను 6:37; 17:6

 విశ్వాసులు పుట్టకముందే, లోకం ఉనికిలోకి రాకముందే దేవుడు భవిష్యత్తులోకి దృష్టి సారించి ప్రతి విశ్వాసినీ చూచి క్రీస్తులో ఎన్నుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరినీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా పూర్వ నిర్ణయం చేశాడు.

 

ఇక్కడ రోమా 8: 4-6లో దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి మూడు కారణాలు చెప్తున్నారు పౌలుగారు.

ఒకటి, మనంపవిత్రంగా, నిర్దోషంగాఉండాలని దేవుని కోరిక 4; 5:22-27; యోహాను 17:17-19; ఫిలిప్పీ 2:15; తీతు 2:14.

రెండు, మనం ఆయన సంతానంగా ఉండాలని ఆయన కోరిక ( 5). యోహాను 1:12-13; రోమ్ 8:15; 2 కొరింతు 6:17-18; 1 యోహాను 3:1-2  చూడండి.

 

ఇది బాగా అర్ధం కావాలంటే  రోమా 8:29-30 చూసుకోవాలి!

రోమా 8:2930.

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. .  . 

 

ఏర్పరచుకోవడానికి ముఖ్య ఉద్దేశం: విశ్వాసులను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం (హెబ్రీ 2:10-11

10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక.... ; 

 

1 యోహాను 3:1-2

1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో (మనకెట్టిప్రేమ చూపెనో) చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. ).

 

 ఇంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం, గొప్ప లక్ష్యం వేరొకటి ఉండబోదు. ఈ ఉద్దేశం నెరవేరడానికి అవసరమైన ఐదు మెట్లను పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. వీటిలో రెండు లోక సృష్టికి ముందున్నవి. రెండు క్రీస్తులో విశ్వాసి జీవితం ఆరంభంలో ఉన్నవి. ఒకటి ఇకముందు రాబోయేది. వీటిలో ప్రతి మెట్టుకూ మిగతా నాలుగింటితో సంబంధం ఉంది. అన్ని మెట్లూ దేవుడు వాటినెంత ఖచ్చితంగా చేయగలడో అంత ఖచ్చితమైనవి.

 

     *ప్రియులారా! ఆమెట్లు లేక రక్షణ ప్రణాళిక విధానం ఏమిటంటే: మొదటగా తన కుమారుని సారూప్యం గలవారవుటకు ముందుగ నిర్ణయించెను. ఎవరిని ముందుగ నిర్ణయించేనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమ పరిచెను*!

 

"ముందుగానే...తనకు తెలిసిన తనవారు విశ్వాసులు తన కుమారుని పోలికలోకి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించడం వారిని గురించి ఆయనకున్న భవిష్యత్ జ్ఞానంపై ఆధారపడిన సంగతి. 

1 పేతురు 1:1-2

1. యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్జ్ఞానమునుబట్టి,

2. ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

 

ఈ భవిష్యత్ జ్ఞానం ఏమిటో పౌలుగారు ఇక్కడ వివరించడం లేదు. దీనికీ దేవుడు విశ్వాసులను ముందుగానే నిర్ణయించడానికీ గల సంబంధమేమిటో చెప్పలేదు

 

"ముందుగానే నిర్ణయించాడు గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ పదం ఆరు సార్లు మాత్రమే కనిపిస్తున్నది (ఇక్కడ, 30; అపొ కా 4:28; 1 కొరింతు 2:7; ఎఫెసు 1:5, 11). దీనికీ కర్మ సిద్ధాంతానికీ ఏ సంబంధమూ లేదు. జరిగేదానంతటికీ అదృష్టమే కారణమనే భావనకూ దీనికీ ఏ పోలికా లేదు. ఏమి జరగాలో ముందుగానే తెలిసిన దేవుడు అలా జరగాలని నియమించాడని దీని అర్థం. సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు అయిన దేవుడు పూర్వ నిర్ణయం ప్రకారం ఏమి జరగాలని నియమిస్తాడో అది తప్పక జరిగి తీరుతుందని ఏమీ అనుమానం లేకుండా నమ్మవచ్చు. ఒక సంఘటన గురించి చెప్పిన అపొ కా 4:28 మినహా క్రొత్త ఒడంబడిక గ్రంథమంతట్లో దేవుని పూర్వ నిర్ణయాన్ని గురించిన మాటలు విశ్వాసుల విషయంలో మాత్రమే కనిపిస్తున్నవి. దేవుడు ఎవరినైనా శాశ్వత నరక శిక్షకు పూర్వమే నిర్ణయించినట్టు ఎక్కడా చెప్పలేదు. కొత్త నిబంధనలో పూర్వ నిర్ణయం సిద్ధాంతం విశ్వాసులకు గొప్ప ఆదరణను, గొప్ప ఆశాభావాన్ని ఇవ్వాలి. తనను పాపవిముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడో లేదోనని ఎవరూ భయ సందేహాలకు తావియ్యనక్కర లేదు. యోహాను 6:37, 44 . ఇష్టమున్న వారెవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు (ప్రకటన 22:17, )

యోహాను 3:37;45

37.మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని.

45.నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. .

ఆయన చెంతకు రావడం, ఆయనలో నమ్మకముంచడం అన్న చర్యలే దేవుడు ఆ వ్యక్తిని పూర్వం ఎన్నుకున్నాడని రుజువు.

 

"పిలిచాడు 28; 1:5. అంటే క్రీస్తుదగ్గరకు వచ్చి ఆయన్ను నమ్ముకునేలా పిలవడం. దేవుని పిలుపు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ క్రింది రిఫరెన్సులు చూడండి: గలతీ 1:6; 5:13; 1 కొరింతు 1:9, 24; కొలస్సయి 3:15; 2 తెస్స 2:14; 1 తిమోతి 6:12; 2 తిమోతి 1:9; హీబ్రూ 3:1; 1 పేతురు 2:9, 20, 21; 3:9; యూదా 1; రోమ్ 11:29. దేవుడు తమను పిలిచాడని ఖచ్చితంగా తెలుసుకోవలసిన బాధ్యత విశ్వాసులది – 2 పేతురు 1:10-11. దేవుడు తమను ఎన్నుకున్నాడని, పిలిచాడని, నిర్దోషులుగా తీర్చాడని విశ్వాసులు తెలుసుకోగలగడం సాధ్యమే. వారు అలా తెలుసుకోవాలి.

 

"నిర్దోషులుగా ఎంచాడు దేవుని పిలుపు అనే పదాన్ని ఉపయోగించడంలో పౌలు ఉద్దేశాన్ని బట్టి చూస్తే దేవుడు పిలిచినవారంతా దేవుని చెంతకు వచ్చి యేసుప్రభువులో నమ్మకం ఉంచుతారు. వెంటనే దేవుడు వారి పాపాలన్నిటినీ క్షమించి వారిని లోపం లేని న్యాయవంతులుగా ఎంచుతాడు. 1:16-17; 3:21-28; 4:5; 5:1; 10:10 చూడండి

 

ప్రియులారా! ఈవిధంగా నీవు దేవునిచేత ఏర్పరచబడిన వంశములోనికి చేర్చబడ్డావు అని తెలుసుకోవాలి!  మీ పిలుపు సామాన్యమైనది కాదు. దేవుడు నిన్ను తన ప్రణాళికలో నిన్ను పిలిచారు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దానిని నీవు తెలుసుకోవాలి. అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అంటున్నారు భక్తుడు! ముందు నీ పిలుపు ఏమిటో తెలుసుకో! ఆ తర్వాత నీవు దేవుని రక్షణ ప్రణాళిక లో ఉన్నావని గుర్తెరిగి భయమునొంది పాపం చేయకుండా దేవుడు చెప్పిన పనిని చేయు!

అప్పుడు అబ్రాహముగారిని వాడుకున్న దేవుడు, సమూయేలుగారిని వాడుకున్న దేవుడు, సంసోనును వాడుకున్న దేవుడు, నోరులేని గాడిదను వాడుకున్న దేవుడు, ఎందరినో వాడుకున్న దేవుడు నిన్నుకూడా బలంగా వాడుకోగలరు!

మరి నీవు సిద్ధమా!

దైవాశీస్సులు! 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*58వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-2*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు రెండవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

 

*రాజులైన యాజక సమూహము*

దీనికోసం 5వ వచనం ధ్యానం చేసుకునేటప్పుడు చూసుకున్నాము!

అసలు దీని అర్థం ఏమిటి?

ఈ పదము కొన్ని ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది: పరలోక రాజుకు చెందిన యాజక సమూహము!

గ్రీకులో ఈ మాటలకు మూడు అర్ధాలు ఉన్నాయి:

1) రాజు కొలువులో ఉన్న యాజకులు,

2) రాజ్యంగా ఏర్పడిన యాజకుల సమూహం,

3) యాజకులందరూ రాజులై వున్న యాజక వ్యవస్థ అని అర్థం వస్తుంది.

 లేక ఈ మూడు అర్థాలు కూడా రావచ్చు.

అసలు రాజుగా ఉన్న యాజకుడు లేదా రాజే యాజకుడిగా ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ లో అక్షరార్ధంగా ఒకాయన ఉన్నారు! ఆయన పేరు మెల్కీసెదెకు!

 

ఆదికాండము 14:18

మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.

చూడండి ఈయన మొదట రాజు, రెండు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు!!

 

కీర్తనలు 110:4

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

మరి ఈయన ఎవరూ?!

ఈయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు!

 

హెబ్రీయులకు 5:6

ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకుయొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 5:7

శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.

హెబ్రీయులకు 5:8

ఆయన,కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.

హెబ్రీయులకు 5:9

మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీ సెదెకుయొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి,

హెబ్రీయులకు 5:10

తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.

 

దీని ప్రకారం యేసుక్రీస్తు ప్రభులవారు యాజకుడు కదా!

మరి రాజు ఎలా అయ్యారు?

ప్రకటన గ్రంథం ప్రకారం ఆయన రాజులరాజుగా రాబోతున్నారు కదా!

మరి ఇప్పుడు ఆయన రాజు మరియు యాజకుడు కదా!

అలాగే తన పిల్లలు తనతో సమాన సారూప్యత పొందాలని ఆయన రక్తము చేత మనలను విమోచించి తన పిల్లలుగా చేసుకుని తనవారుగా ఏర్పరచబడిన వంశముగా చేసుకుని తనతోపాటు ఏలడానికి అధికారమిచ్చారు.

మత్తయి 25వ అధ్యాయం ప్రకారం మరియు ప్రకటన గ్రంథం ప్రకారం జయించిన వారు క్రీస్తుతోపాటు పరిపాలన చేస్తారు!

ప్రకటన గ్రంథం 20:4

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

ప్రకటన గ్రంథం 20:6

ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

 

మరి ఇప్పుడు విశ్వాసి తన విశ్వాసమును కాపాడుకుంటే, జయజీవితం కలిగి ఉంటే రాజులైన యాజకసమూహములో చేర్చబడినట్లే కదా!

 

నిర్గమకాండము 19:6

సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా....

ఇది దేవుడు ఆదిలోనే ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధన!!

ప్రకటన గ్రంథం 1:6

మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

 

ప్రకటన గ్రంథం 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, (లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

ప్రకటన గ్రంథం 5:10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

 

ఈ వచనముతో అనుమానాలన్నీ పోయాయని తలస్తున్నాను!!

విశ్వాసి సామాన్యుడు కాదు! నీ పిలుపు ఏర్పాటు ఎంతో ఉన్నతమైనది మహత్తరమైనది! అందుకే నీవు సామాన్యలు అన్యులు జీవిస్తున్నట్లు జీవించకూడదు! ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితం జీవించాలి!

ప్రియ సహోదరి సహోదరుడా! మరి నీ జీవితం ఎలా ఉంది!???

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*59వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-3*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు మూడవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*పరిశుద్ధ జనము*

దీనికోసం ముందుకు వెళ్లేముందు ఒకమాట చెప్పనీయండి. ప్రియులారా మనలో చాలా మంది మొబైల్ వాక్యము చదువుతున్నారు. మంచిది! గాని మొబైల్ లో android version లో చాలా తప్పులున్నాయి. ఈ పరిశుద్ధ జనము అనేమాట మొబైల్ లో పరిశుద్ధ జననము అని ఉంటుంది. అది తప్పు ప్రియులారా! ఇది వారికి చాలా మంది చెప్పినా ఇంకా దానిని కరెక్ట్ చేయలేదు! పరిశుద్ధ జనము అనేదే సరియైనది. మన బైబిల్ లో అనగా హార్డ్ కాపీలలో అలాగే ఉంటుంది అని గమనించాలి!

 

పరిశుద్ధ జనము లేదా పవిత్ర జనము భూమిపై ఇతరులందరిలోకీ ప్రత్యేకంగా ఉన్న జాతి. నిర్గమ 19:5-6

నిర్గమకాండము 19:5

కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగు దురు.

నిర్గమకాండము 19:6

సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

 

యోహాను 17:6

లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

 

పేతురు గారు సంఘాన్నినూతన ఇజ్రాయేల్ అని గానీఆధ్యాత్మిక ఇజ్రాయేల్ అని గానీ పిలవడం లేదు. అతడు యూదుల్లోని విశ్వాసులకు రాస్తున్నారు. నిజమైన ఇజ్రాయేల్ అంటే వారే, క్రీస్తును తిరస్కరించినవారు కాదు. ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఇకపై పట్టించుకోబోవడం లేదని పేతురుగారు చెప్పడం లేదు (అపొ కా 1:6-7  చూడండి). క్రొత్త నిబంధన గ్రంథం రాసిన వారిలో ఎవరూ సంఘాన్ని కొత్త ఇజ్రాయేల్ అని పిలవలేదు. ఇతర ప్రజలలో విశ్వాసులైనవారిని పాత ఇజ్రాయేల్ అనే చెట్టుకు అంటుకట్టడం జరిగింది. ఇది రోమా 11వ అధ్యాయంలో కనిపిస్తుంది;

రోమీయులకు 11:2

తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?

రోమీయులకు 11:5

ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది.

రోమీయులకు 11:7

ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

రోమీయులకు 11:8

ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

రోమీయులకు 11:15

వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

రోమీయులకు 11:17

అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

రోమీయులకు 11:18

నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

రోమీయులకు 11:19

అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

రోమీయులకు 11:20

మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

రోమీయులకు 11:21

దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

రోమీయులకు 11:22

కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

రోమీయులకు 11:23

వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

రోమీయులకు 11:24

ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

రోమీయులకు 11:25

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

రోమీయులకు 11:26

వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;

రోమీయులకు 11:27

నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.

 

ఎఫెసు 2:11-19 చూడండి.

ఎఫెసీయులకు 2:11

కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

ఎఫెసీయులకు 2:12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

ఎఫెసీయులకు 2:13

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

ఎఫెసీయులకు 2:14

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

ఎఫెసీయులకు 2:15

ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

ఎఫెసీయులకు 2:16

తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

ఎఫెసీయులకు 2:17

మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

ఎఫెసీయులకు 2:18

ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

ఎఫెసీయులకు 2:19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

ఎఫెసీయులకు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

కాబట్టి స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన వారే విశ్వాసులు! ఈవిధంగా పరిశుద్ధ జనముగా చేయబడ్డాము!

 ద్వితియోపదేశకాండము 4:20

యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండు టకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.

 

1సమూయేలు 12:22

యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

 

యిర్మియా 13:11

నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

మీకా 4:7

కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్లగొట్టబడినవారిని బలమైన జనముగాను నేను చేతును, యెహోవా సీయోను కొండ యందు ఇప్పటినుండి శాశ్వతకాలము వరకు వారికి రాజుగా ఉండును.

 

ప్రకటన గ్రంథం 5:9

ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి,(లేక, రక్తములో) ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

ప్రకటన గ్రంథం 5:10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

 

కాబట్టి మనము పరిశుద్ధ జనము! అందుకే దేవుడు అంటున్నారు

లేవీయకాండము 11:44

నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.

లేవీయకాండము 11:45

నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

లేవీయకాండము 20:26

మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

 

1పేతురు 1:14

నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

1పేతురు 1:16

మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

1కోరింథీయులకు 3:16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

1కోరింథీయులకు 3:17

ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక-

మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

యెషయా 52:11

పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.

 

2కోరింథీయులకు 6:17

కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

 

కాబట్టి ప్రత్యేకంగా ఉందాము! పరిశుద్ధముగా పవిత్రంగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*60వ భాగము*

*విశ్వాసి ప్రత్యేకత-4*

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు లోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి గల ప్రత్యేకత ఏమిటి అనేవి  చూసుకుందాం!

మొదటగా: ఏర్పరచబడిన వంశము;

రెండు: రాజులైన యాజక సమూహము;

మూడు: పరిశుద్ధ జనము;

నాలుగు: దేవుని సొత్తైన ప్రజలు!

 

ప్రియులారా ఇవీ ఈ వచనంలో విశ్వాసికి గల ప్రత్యేకతలు!

ఈరోజు నాల్గవ ప్రత్యేకత ధ్యానం చేసుకుందాం!

*దేవుని సొత్తైన ప్రజలు*

మనము దేవుని సొత్తు! ఈ మాట దేవుడే చెప్పారు అనేక చోట్ల!!

 

యెషయా 43:1

అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

 

1కోరింథీయులకు 6:19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

1కోరింథీయులకు 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

చూడండి ఈ రెండు రిఫరెన్సులు ప్రకారం  మనము మన సొత్తుకాదు! మనము దేవునిసొత్తు! దేవుని సొత్తు ఎలా అయ్యామంటే విలువ పెట్టి కొనబడ్డాము! ఏ విలువ?

అమూల్యమైన రక్తము చేత!

ఎవరు కొన్నారు?

దేవుడు!

ఎవరి దగ్గర నుండి కొన్నారు?

సాతాను గాడి దగ్గర నుండి!!!

ఏం వాడి సొత్తు కాదు కదా మనము?

పాపము చేయు ప్రతీవాడు పాపమునకు దాసుడు!

రోమీయులకు 3:23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

రోమీయులకు 3:24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

తీతుకు 2:14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

కీర్తనలు 100:3

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

 

యిర్మియా  12:4,10,11

4. భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? . . .

10. కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.

11. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను. . . . .

 

ఈ విధంగా మనము క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి దేవునిచేత కొనబడి అయన సొత్తుగా మారిపోయాము!

అందుకే మనము మన సొత్తు కాదు కాబట్టి మన దేహముల చేత దేవున్ని మహిమ పరచమంటున్నారు!

 

వివరంగా చెబుతాను!

మనిషి పాపం చేసి దేవుని నుండి దూరమై- దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దోషాన్ని పాపాన్ని శాపాన్ని సంపాదించుకున్నాడు. మనిషి దేవుని సొత్తు! గాని మనిషి దేవునికి నచ్చే పనులు చేయకుండా సాతానుతో సహవాసం చేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేసి ద్రోహిగా పాపిగా మారిపోయాడు! ఈ సృష్టి మొత్తం ఆయన ఇల్లు! మనమే ఆయన ఇల్లు! దానిని ఇప్పుడు మనిషి పాడు చేసేసాడు. ప్రకృతిని పాడు చేసేశాడు! దేవుని ఇంటిని వాడు తగులబెట్టేశాడు అన్నమాట! అయితే ఇప్పుడు దేవుడు కనికరించి వారిని విడుదల చెయ్యాలి అనుకున్నారు! మరి వారు పాపం చేశారు కదా! దానికి శిక్ష ఎవరు భరిస్తారు? పాపం చేస్తే శిక్ష, మరణం అనుభవించాలి అనే రూల్ చేసింది ఆయనే కదా! మరి దీనిని ఎవరు భరిస్తారు? పాపం చేసింది మనిషి! శిక్ష అనుభవించేది జంతువా? అది నిజంగా భరించగలదా ఆ శిక్షను? భరించలేదు! ఇది అసాధ్యం! ఇక ఎవరూ దీనిని భరించలేరు కాబట్టి దేవుడే ఆ శిక్షను తనమీదను వేసుకుని మానవులకు బదులుగా మరణించి ఆ శిక్షను తను పొందడానికి వచ్చారు. పాపం లేని వ్యక్తిగా జీవించారు. ఆయన మొదట దేవుడు- ఇప్పుడు మానవుడు- అనగా దైవ మానవుడు కాబట్టి దేవుడు- మనిషి స్థానంలో ఉండి మానవుల పొందవలసిన శిక్షను ఆ సిలువలో పొందారు! శిక్షను సంతోషంగా అనుభవించారు! ప్రేమను చూపించారు. తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు! క్షమించమని క్షమాభిక్ష పెట్టారు! మానవుల పాపం కోసం ఆయనే ప్రాయశ్చిత్తం చేశారు!

 

ప్రియ స్నేహితుడా! ఆయన నీకొరకు చేసిన త్యాగాన్ని, బలియాగాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నీకోసం పొందిన దెబ్బలను ఆ గాయాలను ఎప్పుడైనా ఆలోచించావా? నిజంగా దానిని గ్రహిస్తే నీవు ఇకను పాపం చేసేవాడవు కావు! ఇక లోకంలో తిరిగే వాడవు కావు! ఇప్పుడైనా ఆ కలువరి సిలువను గుర్తుకు చేసుకో! ఆ సిలువయొక్క విలువ ఏమిటో గ్రహించు! ఫిలిప్పీయులకు 2: 8

మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

  ..... మరి ఇంత గొప్ప ప్రేమ చూపించిన దేవునికి నీవిచ్చే ప్రతిఫలం ఏమిటి? ఇంకా ఆయన గాయాలు రేపుతావా?

 Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో *దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు* గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

మరి ఇంకా ఆయనను భాద పెడతావా? ఇంతగొప్ప రక్షణను నిర్లక్షం చేస్తే తప్పించుకోగలవా?

ఒకసారి ఆలోచించి మారుమనస్సు పొంది నేడే ఆయనను క్షమాపణ వేడుకుని ఆయన యొద్దకు తిరిగి రమ్మని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*61వ భాగము*

1పేతురు 2:10

ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక పదవ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

ఒకప్పుడు అనగా దేవున్ని ఎరుగక మునుపు!

ప్రజగా అనగా దేవుని జనులైయుండక, సాతాను కబంధహస్తాలలో ఉన్న అన్య ప్రజగా ఉన్నారు!

కనికరింపబడక అనగా పాపముచేసి నరకానికి పోయే స్తితిలో ఉండగా, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడి పాపవిముక్తి పొంది నరకానికి పోకుండా కనికరించబడి పరలోక ప్రాప్తులయ్యారు అని అర్థం!!

 

వివరంగా చూసుకుందాం! క్రీస్తులో నమ్మకం ఉంచకముందు యూదులు, ఇతర ప్రజలు కూడా దేవుని ఆధ్యాత్మిక ప్రజ కారు. హోషేయ 1:9-10;

9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనైయుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

10. ఇశ్రాయేలీయుల జన సంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

 

హోషేయా 2:23

నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.

 

రోమా 9:24-26;

23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,

24. అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?

25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.

26. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:11,12,13,14,15,16,17,18,19,20

11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

మనుషులను చీకటిలోనుంచి వెలుగులోకి పిలవడంలో దేవుడు చూపినది కల్తీ లేని కరుణ మాత్రమే తీతు 3:5

తీతుకు 3:5

మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

 

కొలస్సీ 1:21-22

మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధ భావముగలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.

 

    గతకాలమందు దేవునికి దూరస్తులు, పాపులుగాను, మీ దుష్క్రియల చేత దేవునితో విరోధభావం గలవారమైయుండిన మిమ్మును/ మనలను దేవుని సన్నిధిని పరిశుద్దులనుగాను, నిర్దోషులనుగాను, నిరపరాధులనుగాను నిలబెట్టుటకు ఆయన మరణము ద్వారా మాంసయుక్తమైన దేహమును చంపి, మనలను/ మిమ్మును దేవునితో సమాధానపరిచెను అంటున్నారు.

   అవును కదా, ఒకప్పుడు మనం దేవునికి దూరముగా ఉన్నవారమే! దేవుడంటే తెలియనివారమే! మనలో చాలామంది దేవునితో వైరముగలవారమే! గాని ఇప్పుడు దేవుని కృపాసమృద్ధి వలన మనము రక్షింపబడి, ఆయనలో చేర్చబడ్డాము! ఎఫెసీ 2:12.

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

 అదే 13వ వచనము

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

 14వ వచనము

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

చూశారా దేవుడు మనకోసం ఏం చేశారో!

 

సరే, మనమైతే దేవునితో సమాధానపడి, దేవునితో ఐక్యమయ్యాము మరి మన పొరుగు వారో? ఎఫెసీ 4:18

వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

కాబట్టి వారినికూడా క్రీస్తు వెలుగులోనికి , క్రీస్తు సత్యములోనికి నడిపించాల్సిన భాద్యత మనకుంది. కారణం వారు ఇంకా ఎఫెసీ 6:12 లో చెప్పబడిన విధముగా అంధకార సంభంధమైన లోకనాధుల వశములో ఉన్నారు. సాతానుగాడి కోరలలో చిక్కుకుపోయి, పాప బంధకాలలో ఉన్నారు. వారికోసం ప్రార్ధించి, వారిని విడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి!

   ఇక వారేకాదు, క్రైస్తవులు అని పేరుపెట్టుకొని, దేవుణ్ణి సంతోషపెట్టకుండా, తమకుతామే సంతోషపెట్టుకుంటూ, లోకాచారాలలో మునిగిపోయి, లోకస్తులులా జీవిస్తున్న వారి హృదయాలు బండబారిపోయి, దేవునికి దూరమై నామకార్ధబ్రతుకు జీవిస్తున్నారు. వారినికూడా తిరిగి క్రీస్తులోనికి, ఆయన వెలుగులోనికి నడిపించడానికి మనవంతు ప్రయత్నం చేయాలి!

 

       క్రీస్తుకు దూరంగా ఉన్న మనుష్యులందరి పరిస్తితి ఏమిటంటే, వారికి నిజదేవుడు లేడు, సత్యము తెలియదు, పాపవిముక్తికోసమైన ఆశ వారికి లేదు, తీర్పు అనేది ఒకటి ఉంది అనేది కూడా తెలియని వారున్నారు. పాపానికి వచ్చు జీతంఆధ్యాత్మిక మరణమని, అది నిత్యనరకానికి తీసుకుపోతుంది అని తెలియదు వారికి. గలతీ 4:8

ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని 

సరే అన్యులకోసం చూసుకున్నాం! రక్షింపబడిన మనము ఏం చెయ్యాలి? గలతీ 4:9.

యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

గాబట్టి మరలా మూలపాఠాలు అనగా పాత లోకాచారాలు, అన్యాచారాలు చేసి, అన్యులు ప్రవర్తించినట్లు పరవర్తించకూడదు! అలా చేస్తే అనగా పాత లోకాచారాలు చేస్తే, మరలా (పాప)దాస్యమనే కాడిక్రిండ మరలా చిక్కుకొన్నట్లే!పాప దాస్యంలో ఉన్నట్లే!

 కాబట్టి ఆ దాస్యమనే కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు అని పౌలుగారు హెచ్చరిస్తున్నారు గలతీ సంఘాన్ని, ఇంకా మనలను కూడా! గలతియులకు 5: 1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

    కొలస్సీ 1:21 ప్రకారం దేవునినుండి మనలను దూరం చేసేవి, మన దుష్క్రియలే అనగా మన చెడుకార్యాలు, పాపాలు. అందుకే యెషయా 59: 1

రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను.

గాబట్టి, దేవుని నుండి మనలను దూరం చేసేవి మన పాపాలు, అతిక్రమ క్రియలు,. వాటిని మననుండి మనం తీసివేస్తే, దేవునికి దగ్గరగా చేరి, మన ప్రార్ధనలు దేవునికి చేరేలా చేద్దాం! ఇలా కాకుండా ఊరికినే దేవుడు నా ప్రార్ధనలు వినడం లేదు, నాకు జవాబివ్వడం లేదు అని లబోదిబో మని ఏడవడం వ్యర్ధము! మొదట నీయందు దేవునికి అభ్యంతరకరమైన క్రియలు, పాపాలు మానివేయు, పరితాపంతో, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని, దేవుణ్ణి మన్నించమని అడుగు. దేవుడు కరుణామయుడు గనుక నిన్ను మన్నించి, నిన్ను క్షమిస్తారు.  అప్పుడు నీ ప్రార్ధన దేవుని దగ్గరకు డైరెక్టుగా జ్ఞాపకార్ధముగా చేరుతాయి కొర్నేలు గారి ప్రార్ధనలు చేరినట్లు (అపొ 10).!

అప్పుడు నీ ప్రార్ధనలు దేవునికి వినబడతాయి!

నీవు తండ్రీ అని పిలిస్తేకుమారుడా అని ఆయన జవాబిస్తారు!!!

 

  కాబట్టి దేవునినుండి మనలను దూరం చేసే సమస్త చెడు పనులు, పాపాలు వదిలేద్దాం!

దేవునితో/లో ఐక్యమవుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*62వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-6*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక పదకొండవ వచనంలో అంటున్నారు ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. మనము పరదేశులము యాత్రికులము. దీనికోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాము!

చూడండి మనము పరదేశులము యాత్రికులము గనుక మన ఆత్మకు విరుద్ధంగా పోరాడే శరీరాసలను విసర్జించమంటున్నారు పేతురు గారు!

ఈ శరీరాసలు అనేవి మనలో దేవుడుపెట్టిన ఆత్మకు మరియు మనలో తన సంచకరవు లేదా మీరు నావారు, నేను మీకు పరలోకం ఇస్తున్నాను దానికి ఇది గ్యారంటీ అని బజానాగా లేక డిపాజిట్ గా మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఈ శరీరాసలు పోరాడుతుంటాయి కాబట్టి ఈ శరీరాసలను విసర్జించ మంటున్నారు.

 

ఉదాహరణకు రాత్రికి తోటి విశ్వాసుల గృహంలో గృహకూటము ఉంది. అయితే ఆ సమయంలోనే నీకు నచ్చిన సీరియల్ గాని, ప్రోగ్రామ్ గాని, క్రికెట్ మ్యాచ్ గాని వస్తుంది అనుకో, ఆత్మ అంతరాత్మ అంటాయి మీటింగ్ కి వెళ్ళి ఆరాధనలో పాల్గొందాము అని! గాని శరీరము మరియు మనస్సు అంటుంది ఈ ప్రోగ్రామ్/ సీరియల్ కోసం ఇన్ని రోజులు నుండి ఎదురు చూస్తున్నాను గనుక మిస్ చేయకూడదు. ఇదీ పోరాటం!

 

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందమైన అమ్మాయి లేదా అర్ధనగ్న సినిమా పోష్టర్ కనిపించింది. మన కళ్ళు ఆటోమేటిక్ గా చూస్తాయి. అయితే ఆ అమ్మాయిని క్యాజువల్ గా ఒకసారి చూసి వదిలెయ్యడం సామాన్యం అయితే ఆ అమ్మాయిని పట్టి పట్టి చూడటం , కళ్లతోనే ఆమె శరీర సౌష్టవం లెక్కకట్టడం, కావాలనుకోవడం తప్పు. అది కామాభిలాష! ఇది పాపం! సినిమా పోష్టర్ చూసి వదిలెయ్యాలి పదే పదే చూడటం నేత్రాస! ఇది సాతానిగాడి కుట్ర! నీ ఆత్మకు విరుద్ధంగా ఇవి పోరాడుతున్నాయి.

ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో! అననీయ సప్పీరలను చంపింది ధనాశ, దేవున్ని మోసం చేయాలనుకోవడం! సమ్సోను గారిని సొలొమోను గారిని నాశనం చేసింది కామాభిలాష వ్యభిచారం! కాబట్టి ఇలాంటి శరీరాసలను విసర్జించ మంటున్నారు! ఇంకా వివరంగా చెప్పాలంటే శరీరాస నేత్రాస జీవపుఢంభములను విసర్జించాలి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ఈ రోజు విసర్జించవలసినది జారత్వము!

        *జారత్వము- వ్యభిచారము*

    మీరు పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;

మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2.     1 ధెస్సలో 4: 3,4

    ప్రియ సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు, పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ 6:16. ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టుపట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు దానముగా  దయచేయబడింది. 19 వచనం.

అది విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) .

ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ 3:16,17;  6:19-20 వచనాలు) 

*మీరు దేవుని ఆలయము.  దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. ఖభడ్దార్. దేవునిలో వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు,అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు  -దేవుని అలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?*

 

   1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వముకొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది.

 

 1 కొరింథీ 6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం- నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.

 

    ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.

 

ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.

 

22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.

 

      చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది?  వ్యభిచారం, జారత్వం  దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.

 

1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ యవ్వనస్తుని మోహించి కామించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం చేయలేను అనడం లేదు ,దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి  కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?

 

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త,  సోదెగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ఆ ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రతమండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తె తో పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు అది చూసి ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............

దేవుడు ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?

 

3. ఇక మరో వ్యక్తి దేవునిచే  నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ  భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె ఆ సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2 సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది ...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై "ఆ మనుష్యడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే" దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవునాకే చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.

 

  ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా? జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా? ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా? నీ బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*63వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-7*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ఈ రోజు విసర్జించవలసినది అపవిత్రత!

 

దీనికి మరో అర్ధం కల్మషం అని తర్జుమా చేయబడింది. అపవిత్రత అనగా మనభాషలో మలినం అంటుకోవడం. మలిన పడటం. దీనికోసం పాత నిబంధన గ్రంధంలో చాలాచోట్ల పవిత్ర జంతువులూ, అపవిత్ర జంతువులు, పక్షులు, పవిత్రుడు, అపవిత్రుడు ఇలాంటివి చాలా చెప్పబడ్డాయి. చనిపోయిన కలేభరాన్ని ముట్టుకొంటే అపవిత్రత కలుగుతుందని, ఆ అపవిత్రత ఎలా పోతుందో వ్రాయబడియుంది.

 ఇంకా జారత్వం లాంటి పనులు చేస్తే అపవిత్రులు అనియు, కుష్టురోగులు అపవిత్రులు అనియు వ్రాయబడింది. అయితే ఇవన్నీ శారీరక అపవిత్రత!

 

 అదేకాకుండా ఆత్మీయ అపవిత్రత కూడా ఉంది. యేహెజ్కేలు 20:23 ప్రకారం దేవుడు విధించిన కట్టడల ప్రకారం జీవించకపోతే అపవిత్రులు. ఇంకా యేహెజ్కేలు, యిర్మియా గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేస్తే అపవిత్రులు!

 

   అయితే యేసుప్రభులవారు చెప్పిన ప్రకారం అపవిత్రులు ఎవరనగా లేదా అపవిత్రత ఎలా కలుగుతుంది మానవునికి:- మార్కు సువార్త 7:15,16. .

15. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,

16. లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.  . . .

 

దీని అర్ధం వివరంగా 18-23 వచనాలలో ఉంది.

18. *ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?*

19. *అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును*.

20. *మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.*

21. *లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును*

22. *నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో-చెడ్డ కండ్లును) దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును*.

23. *ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను*.  . . .

 

కాబట్టి పై వచనాల ప్రకారం మనిషిని నిజంగా అపవిత్రతకు దారితీసేవి  మనిషి హృదయంలో గల చెడ్డ తలంపులు, దురాశలు, దురాలోచనలు!!!

 

ప్రియ చదువరీ! నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నీ పడక మీద ఏం ఆలోచిస్తున్నావ్? దైవనామస్మరణా? లేక చెడు తలంపులతో, స్త్రీల మీద, సినిమా యాక్టర్ల మీద కామం కోసం ఆలోచిస్తున్నావా?

 

రేపు ఎవడ్ని ముంచాలి, ఎవడి నెత్తిమీద చేయి వేయాలి అని ఆలోచిస్తున్నావా? ఎవడ్ని చంపుదామా? నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

పక్కవాడి పొలాన్ని, ధనాన్ని ఎలా లాక్కుందామా అని ఆలోచిస్తున్నావా? పొరుగువాడి భార్యను, లేక పొరుగునున్న అమ్మాయిని ఎలా ట్రాప్ చేద్దామా అని ఆలోచిస్తున్నావా?

ఇవే నిన్ను ముఖ్యంగా అపవిత్ర పరిచేవి! జాగ్రత్త! హృదయమును, అంతరంగమును పరిశీలించు నీతిగల దేవుడు మనదేవుడు. యిర్మియా 11:20; 20:12; 

వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడు మన దేవుడు! ఒక్కట్టిచ్చారా నేల నాకేస్తావు జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడటం బహు భయంకరం! హెబ్రీ 10:31;

 

   గమనించాలి:  ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

 

     అపవిత్రమైనదేదీ/ అపవిత్రుడు ఎవడూ దేవుని పరలోకంలో/ పరలోకరాజ్యంలో స్థానం లేదు అని గ్రహించు! ఎఫెసీ 5:5; పరలోకంలో కేవలం పరిశుద్దులు మాత్రమే ఉంటారు గాని అపవిత్రులు ఎవరూ ఉండరు! నీకు పరలోకం కావాలా అయితే నీలో ఉన్న అపవిత్రత, అపవిత్ర తలంపులు అన్నీ చంపివేసేయ్!

 

ఈలోకంలో పవిత్రులు ఎవరూ లేరు, కేవలం దేవుని దయనొందిన వారు మాత్రం పవిత్రులుగా జీవించగలరు.

ఇంతవరకు అపవిత్రమైన తలంపులతో అపవిత్రుడుగా జీవిస్తున్నట్లు అయితే, నేడే యేసయ్య పాదాలు పట్టుకొని, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ క్షమాపణ వేడుకో!

ఆయన జాలి గలవాడు గనుక నిన్ను క్షమించుటకు సిద్దమనస్సుతో ఉన్నారు. నేడే ఆయన వద్దకు రా!

ఇకను పాపము చేయకు!

పరలోకాన్ని స్వతంత్రించుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*64వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-8*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియదైవజనమా! విసర్జించవలసిన/ చంపవలసిన/ నిర్మూలించవలసిన/ ఉండకూడని మరో అలవాటు *కామాతురత* లేక *కాముకత్వము*! దీనినే కామోద్రేకం అని కూడా అంటారు. దీనిని తప్పకుండా విసర్జించాలి. లేకపోతే దాని పరిమాణాలు ఏమిటో ఈరోజు చూసుకుందాం!

 

    కామాతురత/ కామోద్రేకం అనేది మనుష్యులను పిచ్చివారిని చేస్తుంది. నిద్రను, సుఖాన్ని దూరం చేస్తుంది. చివరికి ఆస్తిని పరులకు దారాదత్తం చేస్తుంది. చివరికి నిన్ను

1) దిక్కులేని బికారిగా గాని,

2) ఏకాకినిగా గాని,

3)  అనారోగ్యం పాలు చేస్తుంది. 

దీర్ఘకాలిక జబ్బులు లేక సుఖవ్యాధులు లేక HIV లాంటి మందులేని జబ్బులతో కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తుంది ఈ కామాతురత!

 

      గతంలో చెప్పిన విధంగా వీటన్నిటికీ  ఒకదానితో ఒకటి లింక్ కలిగివున్నాయి.

*నీకు కామాతురత ఉంది గాబట్టే వ్యభిచారం, జారత్వం చేస్తున్నావు!

 

*కామాతురత ఉంది గాబట్టే అక్రమ సంభంధాలు కలిగిఉన్నావు!

 

*నీకు కామాతురత ఉంది గాబట్టే పరస్త్రీలవంక / పరపురుషుల వంక మోహపుచూపు చూస్తున్నావు.

 

*కామాతురత ఉంది గాబట్టే బిగుతైన బట్టలు వేసుకుని ప్రజలను నీవైపు చూసేలా చేస్తున్నావు.

 

*కామాతురత ఉంది కాబట్టే ఇంటర్నెట్ లో బూతు బొమ్మలు, బూతు సినిమాలు, బూతు సాహిత్యం చూస్తున్నావు.

 

*ఎవరూ చూడటం లేదు కదా అని అనుకుంటున్నావు గాని, నిన్ను నన్ను చేసిన దేవుడు, నీకోసం నాకోసం చాడీలు చెప్పే సాతానుగాడు CCTV కెమెరా లో చూస్తున్నారు అని మరచిపోతున్నావు.

 

      ఈ కామాతురత వలననే ఒక మహా గొప్పవ్యక్తి ఎలా పతనమైపోయాడో- మహా జ్ఞాని ఎంతటి బుద్ధిహీనుడయ్యాడో చూసుకొందాం! బైబిల్ గ్రంధం ఎవరినీ ముఖస్తుతి చేయదు. పాపిని పాపి అన్నది, నీతిమంతుడిని నీతిమంతుడు అని వ్రాయబడింది.  మహాజ్ఞాని, మహాచక్రవర్తి అని సోలోమోనును పొగడిన బైబిల్ గ్రంధమే, ఆవ్యక్తి నీతి తప్పి ప్రవర్తించినప్పుడు ఏమని వ్రాయబడిందో చూద్దాం!

 1రాజులు 11: 2

కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

1 రాజులు 11వ అధ్యాయం మొత్తం చూసుకుంటే ఎంతగా సోలోమోను పతనమయ్యాడో చూడవచ్చు! 1,2 వచనాలలో : ఇంకనూ అనేక పరస్త్రీలను మోహించి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను.

చూసారా దేవునికి ఇష్టం లేనిపని ఏదైనా ఉందంటే అది వ్యభిచారమే!

 3వ వచనం 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, ౩౦౦ మంది ఉపపత్నులు . జాగ్రత్తగా పరిశీలిస్తే సోలోమోనుకి ఎంతటి status పిచ్చి ఉందో మనకు తెలుస్తుంది. రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు కాకపోతే- నచ్చినదానిని ఉంచుకుంటూ వచ్చాడు. ఎంత ఘోరమండి ఇది?

ఈరోజుల్లో ఒక భార్యతో కాపురం చేయలేక కుడితిలో పడిన ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారు చాలామంది పురుషులు. మరి ఈ వ్యక్తి వెయ్యిమందితో ఎలా ఏగాడో కదా!  చివరికి ఏమైయ్యింది? 3వ వచనం వీరు అతని హృదయాన్ని విగ్రహారాధన తట్టు, విగ్రహాలు తట్టు తిప్పివేశారు. అందుకే దేవుడు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని ఖరాఖండిగా చెబితే (ద్వితీ 7:3,4) వినకుండా చేసుకున్నందుకు బ్రష్టుడై పోయాడు సోలోమోను. ప్రియ దేవుని బిడ్డా! నీవు బైబిల్ మాట వినకుండా అన్యస్త్రీలను పెళ్ళిచేసుకుంటే, అన్యుల అమ్మాయిని/ అబ్బాయిని మీ సంతానానికి ఇచ్చి పెళ్లి చేస్తేమహాజ్ఞానియైన సోలోమోనే బ్రష్టుడైపోయాడు నీవెంత, నీ పిల్లలెంత! జాగ్రత్త! వీరు నీ పిల్లలను ఇట్టే బ్రష్టులు చేయగలరు.

 

 ఇక 4-8 వచనాలలో సోలోమోను కోసం ఇంకా వివరంగా వ్రాయబడింది

4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.

5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను.

8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. . . . .

దానికి బదులుగా దేవుడు రెండుసార్లు ప్రత్యక్షమై మాట్లాడినా, హెచ్చరించినా వినలేదు. బహుశా సోలోమోను తనకు నచ్చిన దావీదుగారి కుమారుడని రెండుసార్లు వార్నింగ్ ఇచ్చిఉండొచ్చు.

ప్రియ చదువరీ నీకు నాకు ఆ అవుకాశం లేకపోవచ్చు!

11. సెలవిచ్చినదేమనగా-నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. . . . .

చివరికి దేవుడిచ్చిన శాపం ఈ అధ్యాయం పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! కామాతురత వలన కలిగే ప్రలోభాలు, నష్టాలను మహాజ్ఞానియైన సొలొమోనే తప్పించుకోలేకపోయాడు, నీవు నేను ఎంత?!!! నీకు నాకు సోలోమోనుకు ఉన్నంత జ్ఞానంలో 5% కూడా ఉండి ఉండదు. కాబట్టి నీవు నేను కూడా తప్పించుకోలేము జాగ్రత్త!

 

  అందుకే పౌలుగారు ముందుగానే మనలను హెచ్చరిస్తున్నారు ఈ కొలస్సీ, గలతీ, కొరింథీ పత్రికలు ద్వారా! అందుకే రోమీయులకు 12: 1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

ఎఫెసీయులకు 5: 1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.

 

  ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు నీ పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నావా? ఎందుకూ పనికిరాని నిన్ను నన్ను దేవుడు రాజులయిన యాజక సమూహంలో చేర్చారు కదా , మరి అందుకు తగిన జీవితం జీవిస్తున్నావా? దేవుడు విశ్వాసులకు క్రీస్తుతోపాటు క్రొత్త జీవితంతో పాటు, తన మహిమను కూడా ఇచ్చారు. ఇలాంటి పాడుపనులు చేస్తే నీవు మహిమను పోగొట్టుకొంటావని మర్చిపోకు! కాబట్టి మన జీవితంలో పాపాన్ని తప్పకుండా నిర్మూలించాలి!

 

    మనం మానవులము, కంట్రోల్ చేసుకోవడం కష్టం; చిన్న చిన్న పాపాలు చేసినా పర్వాలేదు; జారత్వం, వ్యభిచారం తప్పులేదు, అవి మన ఆత్మకు అంటవు అని చెప్పే తప్పుడుబోధకులుచీడపురుగులు మాట విని మోసపోకు!

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

 అంతేకాకుండా మనం ఈ పాపాలను జయించగలం! అది మనకు సాధ్యమే! అందుకే పౌలుగారిద్వారా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయించారు. మనం చేయలేని పనులు, మోయలేని భారం దేవుడు మనమీద ఎప్పుడూ మోపేదేవుడు కాదు మనదేవుడు!! ఆయన పవిత్రుడు గాబట్టి మనం కూడా పవిత్రంగానే ఉండాలి.

 

 ఎలా?

క్రీస్తుద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మద్వారా, ఆత్మలో నింపబడటం ద్వారా, ఆయన ఆత్మ శక్తిద్వారా సమస్తము సాధ్యమే!

రోమీయులకు 8: 14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా ఎదుట నీ వాక్యము ఉంచుకొందును! కీర్తనలు 119:11;

 మరచిపోకు ఇలాంటివాటిని చేసేమారి మీదకు, అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. 6వ వచనం! ఎఫెసీ 5:5

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

 

   కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నేడే నీ పాపాన్ని/ వ్యభిచారం/జారత్వం / కామాతురత/ pornography విడచిపెట్టి, దేవునిపాదాలు పట్టుకో!

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*65వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-9*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన లక్షణం

          *విగ్రహారాధన!*

*విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.

*విగ్రహారాధన అంటే? 

విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.!

 

బైబిల్ చెబుతుంది నీవు ఏ రూపంలో కూడా విగ్రహాలు చేసుకోకూడదు! ఇది దేవదేవునికి అసహ్యమైన క్రియ! కారణం జీవము గల దేవుడు, పౌరుషం, అధికారం, శక్తి, మహిమ, ప్రభావాలు గల దేవుడు, సర్వసృష్టికర్తయైన దేవునికి రావలసిన ఘనత, జీవములేని విగ్రహాలు చేసుకుని వాటినే దేవుళ్ళుగా పూజించడం అనేది నిజ దేవునికి ఇష్టం లేని పని!

 

అదేనా? 

ఇంకా ఏవైనా విగ్రహారాధన ఉందా?

నీవు చెప్తావ్. నేను అట్లా విగ్రహారాధన చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని. 

 

కాని, ఒక్క విషయం!

విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు. 

దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

 

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? 

నీ హృదయం దేనితో నిండిపోయింది? 

గాళ్ ఫ్రెండా? 

బాయ్ ఫ్రెండా? 

మోటార్ బైక్సా? 

వస్త్రాలా?

సెల్ ఫోన్సా?

బంగారమా? 

ధనమా? 

ఆస్థులా? 

అంతస్తులా? 

నీ పిల్లలా? 

అసూయా? 

ద్వేషమా? ఏది? 

ఇవన్నీ విగ్రహాలే. 

 

ఇప్పుడు చెప్పగలవా? 

నేను విగ్రహారాధికుడను కాదని. 

 

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? 

ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా? 

 

అందుకే కదా! 

సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?

ఆయన నీ హృదయమనే తలుపునొద్ద (బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది. 

 

నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా? 

 

*లేకపోతే ఏమవుతుందో తెలుసా? 

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

                ప్రకటన 21:8

గమనించాలి:  ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!

వద్దు! 

ఇది వినడానికే భయంకరం. 

సరి చేసుకుందాం.

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*66వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-10*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన /విసర్జించవలసినది  *అల్లరితో కూడిన ఆట పాటలు*!

శరీరంఅనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

  అల్లరితో కూడిన ఆట పాటలు అంటే?

* సినిమాలు, సీరియల్స్

* అధికంగా వినోదించడం

* తిండిబోతుతనం

* మత్తు పానీయాలు

* మాదక ద్రవ్యాలు

* లైంగిక సంభోగాలతో కూడిన సమావేశాలు మొదలైనవి.

 

సినిమాలు చూడకూడదని ఎక్కడ వ్రాయబడి వుంది? అని ప్రశ్నించేవారు నేటి దినాలలో కోకొల్లలు. అవును! అట్లా వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడే దినాలకు సిమాలు లేవు కాబట్టి, దానిని ప్రత్యక్షంగా వ్రాయవలసి అవసరం లేకపోయింది. కానీ, ఒక్క విషయం! పరోక్షంగా అవన్నీఅల్లరితో కూడిన ఆటపాటలలోచేర్చడం జరిగింది.

 

* సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు గాని, వేషధారిని క్షమించడు.

 

* సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది.

 

* సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాటo సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు.

ఇట్లా చెప్పకుంటూపోతే, చెప్పలేనన్ని.

 

చాలా ఎక్కువమంది సినిమాలు చూడకూడదు గాని, సీరియల్స్ చూసినా ఏమి కాదు. అని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు. అయితే ఒక్క విషయం! సినిమాయైతే, మూడు గంటలలో అయిపొతుందేమో గాని, ఈ సీరియల్ అయితే? మూడు సంవత్సరాలైనా సమాప్తం కాదు. వీటికి అలవాటుపడిన నీవు, శరీరకార్యాలనే నెరవేర్చుతున్నావనే విషయం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.

 

తాగి తందనాలాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, శరీరవాంఛలను రేకెత్తించే పదజాలం, ఇవన్నీ అల్లరితోకూడిన ఆటపాటలే.

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

అల్లరితో కూడిన ఆట పాటలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

 

ప్రియ దైవజనమా! ఈ శరీరకార్యాలు అన్నీ నిన్ను నరకానికి నడిపిస్తున్నాయి! ఇవి గనుక నీలో పనిచేస్తే నీవు పరలోకం దరికూడా చేరలేవు! ఈ శరీరకార్యాలు తప్పకుండా నీలో కాలిపోవలసినదే! అయితే నీకు నీవుగా వీటిని వదలలేవు కాల్చలేవు! దానికి తప్పకుండా ఆత్మశక్తి కావాలి! పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుంటే ఆ ఆత్మశక్తి ద్వారానే వీటిని నీవు దహించగలవు! ఆత్మావేషం, ఆత్మాభిషేకం లేకుండా నీవు వీటిపై జయం పొందడం అసాద్యం! కాబట్టి ప్రియమైన స్నేహితుడా! నీకు శరీరకార్యాలు వదిలెయ్యాలని ఉన్నా సరే, వాటిని వదలలేని పరిస్థితిలో ఉన్నావు కదా, నేడే ఆ పరిశుద్ధాత్మయొక్క శక్తి కోసం ప్రార్ధించి పొందుకో! అప్పుడు వీటిని చీకొట్టగలవు! కాల్చివేయగలవు!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21వ వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పొతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*67వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-11*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన /విసర్జించవలసినది  *శరీరాస, నేత్రాస, జీవపుఢంభము*

2తిమోతి 2:22 ..

నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

 

     ప్రియ దైవజనమా! మనం విశ్వాసి దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!

 ముఖ్యంగా శరీరాస, నేత్రాస, జీవపుఢంభం వీరిమీద చాలాబాగా పనిచేస్తుంది.

 

   *శరీరాస*: వ్యభిచారం, lust/ కామపుకోరికలు, త్రాగుడు, సిగరెట్లు లాంటి వ్యసనాలు,;

*నేత్రాస*: మోహపు చూపు, అందమైన స్త్రీని చూసి కావాలని అనుకోవడం ; *జీవపుఢంభము*: మంచి మోపెడ్లు, కారులు, బంగళాలు కొనుక్కోవాలి, వాటిపై తిరగాలి! స్టేటస్ మైంటైన్ చెయ్యాలి! 6 పాక్స్ చూపించాలి. నేను అందగాడినని అందరూ నన్ను పొగడాలి. ఏ రకంగానైనా ప్రజలు నన్ను గుర్తించాలి!  

    ఇలాంటి కోరికలు యవ్వనస్తులకు సామాన్యంగా వస్తుంటాయి. ఇలాంటి కోరికలును జయించాలి అనడం లేదు పౌలుగారు- వీటినుండి పారిపోవాలి! అనగా ఏదైనా భయంకర అత్యవసర పరిస్తితులలోఉన్నదంతా విడిచి ప్రాణాలు కాపాడుకోడానికి పరుగెత్తినట్లు- ఉదా: భూకంపం కలిగితే ఇంటినుండి బయటకు పరుగెత్తినట్లు యవ్వనేచ్చలనుండి కూడా విడిచిపెట్టి పారిపో అంటున్నారు పౌలుగారు!

 

   ప్రతీ దైవజనుడు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్న సేవకులు గాని, డాక్టర్లు, మ్యుజీషియన్స్ గాని స్త్రీలకు చాలా దగ్గరగా ఉండాల్సి వస్తుంది. సేవకులకు ముఖ్యంగా ఇంట్లో పురుషులు లేనప్పుడు వారి గృహాలను దర్శించవలసి వస్తుంది. కాబట్టి దైవసేవకులు తప్పకుండా ఈ యవ్వనేచ్చలను విసర్జించి ఇలాంటి లైంగిక పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది! అందుకే అనేకమంది బైబిల్ పండితులు గాని, కొన్ని సంఘాల పాష్టరేట్ కమిటీలు గాని,  కొన్ని ఆర్గనైజేషన్ పెద్దలు చెప్పేదేమిటంటే దయచేసి దైవసేవకులు, కాపరులు ఎవరి ఇంటినైనా దర్శించినప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దు! ముఖ్యంగా స్త్రీలు ఒంటరిగా ఉండే ఇంటికి మీ భార్యతోనే వెళ్ళాలి! ఒకవేళ వివాహం కాకపొతే తనకుతండ్రి వయస్సున్న పెద్ద వ్యక్తితో పాటు అలాంటి గృహాలను దర్శించాలి తప్ప ఒంటిగా వెళ్ళకూడదు! అలా ఎవరితోనైనా వెళ్ళినప్పుడు ఈ రకమైన లైంగిక పాపం నుండి తప్పించుకోవచ్చు!

 

      *తిమోతిగారు యవ్వనస్తుడు కాబట్టి పారిపో అన్నారు! మరినేను యవ్వనస్తుడను కాను కదా! నేనెందుకు పారిపోవాలి అని అనుకోవద్దు! అబ్రాహాము గారు గొప్ప విశ్వాసవీరుడు! దైవభక్తుడు: గాని 99 సంవత్సరాల వయస్సులో అబ్రాహామా నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు అని దేవునిచేతనే హెచ్కరించబడిన పరిస్తితిలోనికి వచ్చారు.* ఆదికాండం17:1;  కారణం దేవుడు చెప్పని పని, భార్యమాటకు లోబడి పరస్త్రీతో కాపురం చేసారు అబ్రాహాముగారు! *ఇక మహాభక్తుడు, ప్రవక్త దైవజనుడు దావీదుగారు నడివయస్సులో చూడరాని దృశ్యం చూసి, తన భటుడి భార్యతో పాపం చేసి, శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ యవ్వనేచ్చలు ఎవరికైనా ఏ వయస్సులోనైనా వస్తాయి!*

 కాబట్టి ప్రియ దైవజనుడా! ఈ యవ్వనేచ్చలనుండి పారిపో అంటున్నారు పౌలుగారు! 1తిమోతి 6:11లో దైవజనుడా! వీటిని విసర్జించి, భక్తిని, విశ్వాసమును సాధకం చేసుకోమని హితవుపలికారు! ఇంకా పేతురు గారు కూడా చెబుతున్నారు: 2పేతురు 1:29

2. తన మహిమను బట్టియు, గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయు చున్నందున,

3. దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చి నట్టియునైన అనుభవ జ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

4. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను

5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,

6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,

7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను(ప్రేమను) అమర్చుకొనుడి.

8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.

9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.  ... కాబట్టి యవ్వన సేవకులు ఈ యవ్వనకోరికలకు లొంగిపోయి, వాటిని తృప్తిపరచుకోవడం మానేసి, వాటికి దూరంగా పారిపోతేనే దేవుడు వారిని బలంగా వాడుకుంటారు!

 

   ప్రసంగి 11:910 ధ్యానం చేసుకుంటే: నీ యవ్వనమందు సంతోషపడు! నీ కోరికచోప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున చెయ్యు! అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో! అంటున్నారు!  కారణం లేతవయస్సు, నడిప్రాయం కూడా గతించిపోతుంది. అనగా నీ బాల్యం, నీ యవ్వనం కూడా గతించిపోయి, నడిప్రాయానికి వెళ్తావు, చివరికి నడిప్రాయం కూడా గతించిపోయి, వృద్దుడవైపోతావు! చివరికి చనిపోతావు! కాబట్టి

మొదటగా నీవు చేసిన క్రియలకు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తారని మరచిపోకు! రెండవది: కాబట్టి నీ హృదయంలోనుండి వ్యాకులమును తొలగించుకో!

మూడవది:నీ దేహాన్ని చెరిపేదాన్ని నీనుండి తొలగించుకో!

ఇక ఆ తర్వాత అధ్యాయంలో చెబుతున్నారు 12:12 ...

1. దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

2. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. .... నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నారు భక్తుడు!

 

      విలాపవాక్యములు ౩:27లో యిర్మియా ప్రవక్త గారు చెబుతున్నారు: యౌవనకాలనున దేవుని కాడి మోయుట నరునికి మేలు! గమనించండి! మీద వచనంలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను గుర్తుకు చేసుకో అంటేఇక్కడ యవ్వనకాలమందు ఆయన కాడి మోయాలి! అనగా బాల్యదినములలోనే దేవునికి సమర్పించుకొనియవ్వనకాలము వచ్చింది అంటే వెంటనే దేవుని కాడి అనగా సువార్తభారం కలిగి దేవుని సేవ చెయ్యాలి! ఇదీ అర్ధం!  చాలామంది అంటుంటారు కదా నీవుకూడా దిగిపోయావా? ఇప్పుడే దిగిపోయావేటి? ఇంకా అనుభవించాల్సింది బోలెడుంది కదా! ముసలోడివి అయ్యాక దేవుణ్ణి నమ్ముకుందువులే అంటుంటారు! గమనించాలి: దేవునికి గాని, దయ్యానికి గాని, దేశానికి గాని, దేశద్రోహులకు గాని యవ్వనస్తులే కావాలి! కారణం యోహానుగారు చెబుతున్నట్లు యవ్వనస్తులారా! మీరు బలవంతులు!  మీ యవ్వనబలం దేవునికి కావాలి! దేశానికి కావాలి! అలా కాకుండా కాళ్లుచేతులు పోయాక, ఊడిపోయిన మంచం కోడిలా అయ్యాక, పళ్ళు ఊడిపోయిన తర్వాత చంకలో బైబిల్ బేగ్ వేసుకుని స్తోత్రం చెల్లింతుము అని పాడుదాం అనుకుంటే అప్పుడు నీవు దేవునికి అక్కరలేదు! నీ జీవితాన్ని మొత్తం సాతానుగాడు, లోకము పీల్చిపీల్చి పిప్పుచేశాక మిగిలిన శేషజీవితం దేవునికే ప్రభువా అంటే, ఆ కాలంలో నీవు, అనగా పిప్పి దేవునికి అక్కరలేదు! దేవునికి పనిచేసే యవ్వనస్తులు కావాలి!

 

      దేవుడు యోసేపుగారిని బాల్యమందే, యవ్వనప్రాయంలోకి అడుగుపెట్టినప్పుడే ఎన్నుకున్నారు! దావీదుగారిని బాల్యమందే ఎన్నుకున్నారు! సమూయేలు గారిని బాల్యమందే ఎన్నుకున్నారు! యిర్మియాగారిని బాల్యమందే ఎన్నుకున్నారు! యేహెజ్కేలు గారిని బాల్యమందే ఎన్నుకున్నారు! దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగో వీరందరినీ బాల్యమందే ఎన్నుకుంటే: యవ్వనములో వారికి ఎన్ని శోధనలు కలిగినా దేవునికోసం నిలబడి- దేవునికి సాక్షిగా నిలబడ్డారు! చివరకు వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారో మీ అందరికీ తెలుసు!

 కాబట్టి దేవునికి నీ యవ్వనం కావాలి!

 యవ్వనంలోనే దేవుని సేవ చేయాలి!

 మరినీవు సిద్దమా?

*పేతురు వ్రాసిన పత్రికలు*

*68వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-12*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన /విసర్జించవలసినది  *శరీరాస, నేత్రాస, జీవపుఢంభము*

 

మొదటగా సాతానుడు లోకాన్ని చూపించి లోకాశలు చూపించి తిరిగి పాపములోనికి లోకము లోనికి లాగాలని ప్రయత్నిస్తాడు! వీటిని జయించాలి! దీనికోసం వాడు ఉపయోగించే ఆయుధాలు: మొదటివి: శరీరాస, నేత్రాశ, జీవపు డంభము! హవ్వమ్మ గారికి సాతాను గాడు అవునా ఇది నిజమా అని చెప్పి, మీరు చావనే చావరు మీరు వాటిని తింటే మీ కన్నులు తెరువబడి మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవతలై పోతారు అనబోసరికి (జీవపు డంభము), ఆ తినవద్దన్న ఫలాలు చూపునకి అందమైనవి, (నేత్రాశ), ఆహారానికి మంచివి (శరీరాస) అని చెబితే వెంటనే తను తిని తన పెనిమిటికి ఇచ్చేశారు ఆవిడ! ఈ రకంగా వారిని బ్రష్టులను చేసేసింది! (ఆదికాండం 3వ అధ్యాయం).

 

ఇక రెండవ ఆయుధము: గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వివరించిన శరీర కార్యాలు మనలో పనిచేసి మనలను బ్రష్టులను చేసేస్తాయి! వ్యభిచార క్రియలు, కోపం ద్వేషం, లాంటివి అన్ని పనిచేస్తాయి! నీవు భక్తిపరుడవే! గాని లోకం నిన్ను ఆకర్షించేలా చేస్తాడు వాడు! దారిన పోతున్నప్పుడు నీ కళ్ళు ఆటోమేటిక్ గా గోడమీద అంటించిన సినిమా వాల్ పోష్టర్ కనిపిస్తుంది. దానిలో స్త్రీలు సగం సగం గుడ్డలు వేసుకుని కనిపిస్తారు, వెంటనే నీలో ఏదో అలజడి మొదలవుతుంది. ఆ స్త్రీని ఇంకా చూడాలని సినిమా చూడాలని కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తప్పించుకోవాలి? మొదట నీ కన్నులు సూటిగా  తిన్నగా చూడాలని బైబిల్ చెబుతుంది.

సామెతలు 4: 25

నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

సామెతలు 4: 27

నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

 ఇంకా , ఇటూ అటూ చూసేది కేవలం సాతాను గాదే అని గ్రహించాలి యోబు మొదటి రెండు అధ్యాయాల ప్రకారం! ఇంకా కీర్తనలు 119:11 ప్రకారం నీ ఎదుట పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అని వ్రాయబడినట్లు వాక్యము మనలను ఏలనియ్యాలి అప్పుడు ప్రతీ విషయంలో వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటె పరిశుద్ధాత్ముడు వెంటనే నిన్ను సరిచేసి వాటిని చూడకుండా, చూసినా పాపం నిన్ను ఆకర్షించకుండా నిన్ను చేయగలడు!

 

ఇంకా దుష్ట సాంగత్యము వలన వారు మాట్లాడుకునే మాటలలో కలిపి నవ్వడం వలన వారు చేసే దానిలో నిన్నుకూడా పాలిభాగస్తులను చేస్తాడు!

1కోరింథీయులకు 15: 33

మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

 

చాలామంది స్త్రీలకు నీటి కొళాయి దగ్గర ఎంత నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలన్నా ఇతరుల వలన నోరు పారేసుకుంటారు! ఇది కూడా సాతాను గాడి కుట్రయే! దావీదు గారు అంటారు నేను కోరేది సమాధానమే గాని మాట నా నోటినుండి బయటకు రాకముందే వారు నాతో యుద్ధానికి సిద్ధమైపోతున్నారు అంటున్నారు!చాలాసార్లు మనం అందరితో సమాధానంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే వారే నీమీదకు తగవుకు యుద్ధానికి వస్తారు! కీర్తనలు 120: 7

నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

వెంటనే నీవు నన్ను అంతమాట అంటావా అని కచ్చా భిగించి తగువులాడితే నీ భక్తీ నీ విశ్వాసం అన్ని బూడిద పాలైపోతుంది!  నీవు ఏమీ అనకపోతే వారికి తిట్టే అవకాశం లేకపోతే కుక్కమీద, కాకిమీద చేటమీద పెట్టి తిడుతుంటారు! అది నిన్నే తిడుతున్నారు అని నీకు తెలిసినా నీవు ఏమీ అనలేవు! నన్నెందుకు తిడుతున్నావు అని ఒకవేళ అడిగితే అక్కడ రణరంగమే అవుతుంది! ఇలాంటప్పుడు మరి ఏమిచెయ్యాలి? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖము లేదు అన్నట్లు మిన్నకుండి పోవాలి! దీర్ఘశాంతము చూపించాలి! లేకపోతే దేవునికి స్తోత్రము! దేవుడు నిన్ను దీవించును గాక అని వారిని దీవించి చూడండి! వారికి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది! లేకపొతే యేసురక్తం యేసురక్తం దేవా నీకు వందనాలు అని చెప్పండి! కొన్నిరోజులకు వారే సిగ్గుపడి పోతారు! లేకపోతే ఆ ఇంటివారితోనే వారికి బుద్ధి చెప్పిస్తారు దేవుడు! ఒక పదిహేను సంవత్సరాల క్రితం బహుశా తూర్పు గోదావరి జిల్లాలో అనుకుంటాను- ఒక విశ్వాసిని ప్రక్కింటి ఒకామె అలానే తిడుతుంటూ ఉండేదట! వెంటనే ఈమె కూడా తిట్టేసేదట! ఒకరోజు పాష్టర్ గారు చూసి ఇది తప్పు అని చెబితే నేను ఏమి చెయ్యాలి అంటే ఆయన యేసురక్తం యేసురక్తం అనమని చెప్పారట! ఇలా కొన్నిరోజులు జరిగాక నన్ను రక్తానికి అప్పగించేస్తావా అంటూ బయటకు వచ్చి రక్తం రక్తం అంటూ రక్తం కక్కుకుని చనిపోయింది అక్కడే! ఆ తర్వాత జరిగింది మనకు అప్రస్తుతము గాని ఈ రకంగా ఆమెకు దేవుడు బుద్ధిచెప్పారు! నీవు వారిని తిట్టకుండా దీవిస్తూ ఉంటే ఒకరోజు వారు పశ్చాత్తాపం కలిగి తప్పకుండా మారతారు అని నా ఉద్దేశం!

 

ఇంకా అనేకమంది విశ్వాసులకు లంచం లాంటి విషయాలు ద్వారా శోధిస్తాడు వాడు!

 

*ఇంకా దురభిమాన పాపం మనలను ఏలేలా చేస్తాడు!  మొగమాటానికి కొన్ని ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వస్తుంది! నీకు ఇష్టం లేకపోయినా నీ బాస్ నిన్ను బార్ కి తీసుకుని పోతాడు, సినిమాకు తీసుకుని పోతారు నీ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్! నీవు ఏమీ అనలేవు! గాని నిజంగా వారి వెనుక వెళ్తే నీవు నరకానికి పోతావు! ఇదే దురభిమాన పాపం! నీవు చర్చికి బయలుదేరి వస్తున్నప్పుడే నీ చుట్టాలు ఇంటికి వస్తారు! వారిని వదిలి రాలేవు నీవు! దురభిమాన పాపం! గాని ఇలాంటప్పుడే నీవు దీనిని జయించాలి! ఎలా కుదురుతుంది అని అడగవచ్చు! అందరికీ ఫోన్లు చేసి చెప్పండి! మీరు ఎప్పుడైనా రండి పర్వాలేదు Always Welcome అని చెప్పండి! అయితే ఆదివారం మాత్రం రావద్దు అని ఖచ్చితంగా చెప్పండి! ఎవడు ఏమనుకుంటే నీకనవసరం! నీవు దేవునికి లెక్కచెప్పవలసిన అవసరం లేదు! గాని నీవు అలా చెప్పలేకపోతే దురభిమాన పాపంలో పడిపోయి నరకానికి పోతావు! ఒకవేళ నీవు చెప్పినా నీ చుట్టాలు కావాలని వచ్చారో అనుకో- సింపుల్ గా ఇదిగో అక్కడ ఉప్పుంది ఇక్కడ పప్పుంది, వండుకొని తినండి, నేను ఆరాధన అయ్యాక వస్తాను అని వారికి అప్పజెప్పి మందిరానికి పొండి! తర్వాత ఎప్పుడూ వారు రారు! ఇక మరికొంతమంది అదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు! ఏమంటే ఆదివారం నాడే అందరికి సెలవుంటుంది అంటున్నారు! అన్యులు అన్నా పర్వాలేదు గాని ప్రభువును అంగీకరించిన కొంతమంది పాపాత్ములు కూడా ఆదివారం నాడే ఫంక్షన్ లు పెట్టుకుంటున్నారు! ఇలా ఫంక్షన్ లకు వెళ్ళేవారు. దేవుని బిడ్డలు ఆదివారం నాడు ఫంక్షన్ లు పెట్టేవారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి వస్తుంది! ఎవడు ఏమనుకుంటే నాకనవసరం! చెప్పవలసిన భాద్యత నాకుంది! ఇలాంటి బేచ్ నరకానికి పోతారు! ఏమి అలా అంటావు అని నన్ను అడిగితే నా జవాబు- వారు దొంగలు దోచుకొనువారు కాబట్టి నరకానికి పోతారు అంటాను! ఎలా అంటే దేవునికి ఇవ్వాల్సిన ధనము, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వాలి! ఆదివారం దేవుని మందిరంలో ఉండాల్సిన అవసరం ప్రతీ విశ్వాసికి ఉంది! దానిని ఎగ్గొట్టి నీ ఫంక్షన్ లకు, సినిమాలకు బీచ్ లకు పార్కులకు టూర్ లకు తిరిగితే దేవుడు నిన్ను లెక్క అడగరా! నీవు దేవుని సమయాన్ని దొంగలించి దొంగయు దోచుకొనువాడవు కావా????? ఇప్పుడు  చాలా సంఘాలలో ముఖ్యంగా పట్టణాలలో ఉదయం ఆరుగంటల ఆరాధనకు కాళీ ఉండటం లేదు! ఎందుకంటే ఎనిమిదిన్నర లోగా ఆరాధన అయిపోతుంది! అది అయ్యాక వారు చుట్టాలింటికి పార్టీలకు ఫంక్షన్ లకు బీచ్ లకు వెళ్ళిపోతున్నారు! ఏమంటే ఆరాధన ఎగ్గోట్టడం లేదు కదా! ఆరాధనకు వెళ్లి ఆయన సమయం ఆయనకు ఇచ్చేశాము అంటున్నారు!  అయ్యా అమ్మా! నాకు తెలిసినది నేను బైబిల్ లో అర్ధం చేసుకున్నది నేను చెబుతున్నాను: ఇదికూడా చెయ్యకూడదు! కారణం యెషయా గ్రంధంలో చెబుతున్నారు: విశ్రాంతి దినము అనగా మనము నేడు ఆచరిస్తున్న పునరుత్థాన దినాన్ని పవిత్రంగా ఆచరించాలి! ఆరోజు లోకవార్తలు చెప్పుకోకూడదు! లోకానికి చెందినా ఏ పని చెయ్యకూడదు! వ్యాపారం చెయ్యకూడదు! ఏ పని చెయ్యకూడదు! నీకిష్టమైన పని ఏమాత్రము చెయ్యకూడదు.* యెషయా 58: 13

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యెషయా 58: 14

నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.

 

 కనీసం సాయంత్రం వరకు ఇలాంటివి ఏవీ చెయ్యకూడదు అని నా ఉద్దేశం! ఇది కేవలం  బైబిల్ ని చదివి నాకు అర్ధమయిన విషయం ప్రియులారా! కాబట్టి ఇలాంటివి చెయ్యవద్దు! నీకు కావలసిన చుట్టాలు బంధువులు మిత్రులు ఆదివారం ఫంక్షన్ అంటే దయచేసి ఏమీ అనుకోవద్దు- ఆరోజు మేము ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పండి! మరో రోజు వస్తాము అని చెప్పండి. దురభిమాన పాపంలో పడిపోవద్దు! ఇది సాతాను గాడి కుట్ర! ఒకవేళ సాయంత్రం వెల్లవచ్చేమో! నాకు తెలియదు! గాని పగటివేళలో వెళ్ళినవారు ఫంక్షన్ పెట్టిన వారు తప్పకుండా దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అని మర్చిపోవద్దు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*69వ భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-13*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

గలతీ 5వ అధ్యాయంలో చెప్పిన శరీరకార్యములలో గల శరీరాసలు విసర్జించాలి అనగా

Galatians(గలతీయులకు) 5:17,18,19,20,21

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

ఇక వీటిలో శరీరాసలు లెక్కలోనికి వచ్చేవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని తప్పకుండా విసర్జించాలి!

 

ప్రియులారా! తర్వాత ఉండకూడని/చంపాల్సిన /విసర్జించవలసినది  *శరీరాస, నేత్రాస, జీవపుఢంభము*

శరీరాసలు, నేత్రాస, జీవపుడంభము, కామవాంచ, అధికార కాంక్ష, ధనాశ లాంటివి.

 

ఒక రెండు బ్యాచ్ లను పరిశీలిద్దాం!

 *బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీరా*!

 

నలుగురిమీద పనిచేసిన శోధన: ధనాశ!

 

బిలాము మహా గొప్ప ప్రవక్త!

దేమా పిలువబడ్డవాడు, ఏర్పరచబడిన వాడు సువార్తకై! సువార్తికుడు!

గేహజీ- గొప్ప ప్రవక్త అయిన ఎలీషాగారి శిష్యుడు!

అననీయ-సప్పీరాలు మంచి విశ్వాసులు!

 

ధనాశ నలుగురిని లాగుకుంది! బయటకు రాలేకపోయారు! జయించలేకపోయారు! వీరంతా భయంకరమైన చావులు, కుక్కచావులు దిక్కులేని చావులు చచ్చారు!

 

 అననీయ సప్పీరలు దేవుని మందిరంలోనే చచ్చారు! నలుగురు అట్టర్ ఫ్లాప్! ప్రియ దేవుని బిడ్డా! ధనాశ నిన్ను ఆకర్షిస్తుందా? జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త! అంతటి గొప్పవారు జయించలేక పోయారు- బొక్కబోర్లాపడి చచ్చారు. ఈలోకము నైనను దాని ఆశలను గాని ప్రేమించకుడి అన్నారు దేవుడు! 1యోహాను 2: 15

ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.

ఇక యేసయ్య ధనమును ప్రేమించకుడి భూమిమీద మీ కొరకు ధనమును సంపాదించకండి గాని పరలోకంలో సంపాదించుకోమంటే, భూలోకంలో సంపాదించుకోవాలని చూశారు! జీవితాలు నాశనమై పోయాయి!

దేవుడు చెప్పిన వాక్యానికి లోబడు! వాక్యమనే ఆత్మఖడ్గము వాడి ఈ శోధనను జయించు!

 

తర్వాత బ్యాచ్: *దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నేగో*

వీరి నలుగురి మీద పనిచేసిన శోధనలు:

 మొదటిది: బోజనపానములు! రాజు భుజించు ఆహారం, రాజు త్రాగే పానము అనగా సురాపానం! అనగా మందు ముక్క! వీరు నలుగురు రాజు భుజించే ఆ ఆహారం రాజు త్రాగే ఆ పానము అనగా మందు ముక్క మనం మానెయ్యాలి! మన జీవితాలు కట్టుకోవాలి! సాక్ష్యాన్ని కాపాడుకోవాలి! తమ ఘటాన్ని శీలాన్ని కాపాడుకోవాలి అనుకున్నారు! సత్యం కోసం నిలబడ్డారు! వాక్యపు వెలుగులో నడిచి వాక్య ఖడ్గాన్ని వాడి శోధనను జయించారు! దానియేలు గారు ప్రపంచానికి ప్రధానమంత్రి అయ్యారు! , షడ్రక్, మేషక్, అబెద్నేగోలు పెద్ద మంత్రులు గవర్నర్ లు అయ్యారు! అంతేకాకుండా దేవుని సాక్షాత్కారం కలిగించారు అందరికీ!

 

రెండవ శోధన! నిజం చెప్పాలంటే ఇవి సాతానుతో పోరాటం క్రిందన కూడా  వస్తాయి!

దానియేలు గారిని ప్రార్ధన ఆపుతావా? సింహాల బోనులో పడేయ్యాలా అన్నారు!!

 షడ్రక్, మేషక్, అబెద్నేగోలను బంగారుబొమ్మకు మ్రొక్కుతారా అగ్నిగుండములో త్రోసేయ్యాలా అన్నారా?

 

వీరంతా మేము మ్రొక్కమంటే మ్రొక్కం, చావనైనా చస్తాం గాని మ్రొక్కం! అసలు మా దేవుడు రక్షించడానికి సమర్ధుడు అన్నారు!

దానియేలు గారు నేను ప్రార్ధన మానమంటే మానను! నీ దిక్కున్నవాడితో చెప్పుకో అన్నారు!

 

ఫలితం:దానియేలు గారిని సింహాలబోనులో వేసేశారు!

ఆ ముగ్గురిని అగ్నిగుండములో త్రోసేశారు!

పరలోకం పరవశించిపోయింది! పరమునుండి దూతలు వచ్చి నలుగురిని కాపాడారు!

 

అక్కడ నెబుకద్నేజర్ రాజు షడ్రక్, మేషక్, అబెద్నేగోల దేవునివంటి దేవుడు మరో దేవుడు లేడు అన్నాడు!

 

దర్యావేషు దానియేలు దేవుని లాంటి దేవుడు లేడు! అన్నాడు! నలుగురు రక్షించబడటమే కాదు-దేవుణ్ణి వారికి చూపించారు!

 

వీరు వాడింది విశ్వాసమనే డాలు! దేవుడు తోడున్నాడు అనే వాగ్దానాలు! ప్రార్ధన!

 

ఇక్కడ కేవలం కొన్ని మాత్రమే పాపంతో చేసే ఆత్మీయ పోరాటాలు చెప్పాను! గలతీ 5:1921 వ్రాయబడిన శరీరకార్యాలులో సగం అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, చివరిది అల్లరితోకూడిన ఆటపాటలు! ఇవన్నీ లోకం-లోకాశాలను మనకు చూపించి ఎరవేసి మనం పాపము చెయ్యడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు! వీటన్నిటిని...

 

మొదటగా: సర్వాంగకవచం ద్వారా జయించాలి!

రెండు: వాక్యమును అనుదినం చదువుతూ ఆదిమ భక్తులు ఆ పాపములను శోధనలను ఎలా జయించారో ధ్యానం చెయ్యాలి!

 

మూడు: కూడా వాక్యమే! వాక్యం ద్వారా పాపం చెయ్యకుండా ఉండగలము! ఎలా అంటే నీ ఎదుట నేను పాపం చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొందును అన్నారు భక్తుడు! కీర్తన 119:11;  ఇది నేను ప్రాక్టీస్ చేశాను! పాపం చెయ్యకుండా వాక్యం నన్ను ఆపుతుంది!

 

ఏమైనా పాపపు ఆలోచన గాని, పాపపు చూపు గాని నా హృదయంలో మెదిలితే ఒరేయ్ నీవు ఎవడవో తెలుసా! దేవుని బిడ్డవు! విలువపెట్టి కొనబడిన వాడవు! ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చూపులు మనం చూడవచ్చా? నరకానికి పోతావు జాగ్రత్త! ఖబడ్దార్ అని నన్ను హెచ్చరిస్తుంది వాక్యము! వాక్యపు రిఫరెన్సులు ఫలాని చోట ఏమన్నారో తెలుసా అని గుర్తుకు చేస్తుంది వాక్యము! వెంటనే సరిచేసుకుని దేవుడా క్షమించు అని వేడుకుంటాను!

 

  ఒకవేళ వాక్యపు గద్దింపు కూడా వినకపోతే మెల్లని చల్లని దుఃఖస్వరముతో పరిశుద్ధాత్ముడు అంటాడు నాతో: ఇందుకోసమేనా నీకోసం సిలువ మోసింది! ఇందుకేనా నీకోసం రక్తం కార్చింది! అంతే నా గుండె బ్రద్దలయిపోతుంది! కన్నీటితో ఒప్పుకుంటాను: ప్రభువా ఇంకెప్పుడు చెయ్యను- పాపపు చూపు గాని, పాపపు ఆలోచన గాని నాలో రానియ్యను అని ఒప్పుకుంటాను! ఈవిధంగా మొదటగా వాక్యము నన్ను పాపం చెయ్యకుండా ఆపుతుంది, రెండు పరిశుద్ధాత్ముడు నన్ను పాపం చెయ్యకుండా ఆపుతున్నాడు!

కాబట్టి పాపం చెయ్యకుండా ఉండాలంటే మన హృదయం నిండా వాక్యముతో నిండిపోవాలి! అనగా ప్రతీరోజు వాక్యముతో ఉదకస్నానం చెయ్యాలి!

అలాగే ప్రతీరోజు ఆత్మతో నింపబడుతూ ఆత్మపూర్ణులుగా ఉండాలి! అపుడు పాపము చెయ్యనే చెయ్యవు! అందుకే గలతీ 5:16,17 లో మీరు ఆత్మతో నడిపించబడితే లేక ఆత్మానుసారంగా నడచుకుంటే శరీరకార్యాలు చెయ్యనే చెయ్యరు!

 

నాల్గవది: ఇలాంటి పాపం నుండి నీవు తప్పించుకుని ఆత్మీయపోరాటం లో విజయం సాధించాలి అంటే ప్రార్ధనాజీవితం కావాలి! నీవు చేసేప్రతీవిషయం లోను ప్రార్ధించి దేవుని సహాయం తీసుకో! నీకు నీవుగా పరిశుద్దుడుగా పవిత్రుడుగాఉండటం  అసాధ్యం! దేవుని సహాయం అడుగు! అది ప్రార్ధనతోనే మనం అడుగగలం!

5. పైన చెప్పిన నలుగురు తమ భక్తిని కాపాడుకున్నట్లు మన భక్తిని కాపాడుకోవాలి! సాఖ్యాన్ని కాపాడుకోవాలి! లేకపోతే సాతాను గాడు వచ్చి అంటాడు- చాలుచాలులే గొప్పగా ప్రార్ధనచేసేస్తున్నావ్ గాని ఫలాని తారీకున అక్కడ ఏంచేశావ్? ఇక ఆపు నీ ప్రార్ధన! ఆపు నీ విశ్వాసం! చాలు నీ బడాయి భక్తి అని నిన్ను దెప్పి పొడుస్తూ నిన్ను డీమోరలైజ్ చేసేసి నిన్ను భ్రష్టుడను చేసేస్తుంది!  కాబట్టి భక్తిని- సాక్షాన్ని-శీలాన్ని కాపాడుకోవాలి!

6. పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి!

ఈ రకంగా ఈ ఆయుధాలు ఉయోగించి పాపంతో యుద్ధం చేసి గెలుద్దాము!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*70వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-15*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 12వ వచనంలో అంటున్నారు అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

క్రీస్తును తిరస్కరించేవారు విశ్వాసులను దూషించాలనీ వారిలో తప్పులు పట్టుకోవాలనీ లేనివాటిని కల్పించాలనీ చూస్తారు. ఇతరులు మనల్ని దూషించడం అనేది మనం మరింత మంచిగా ప్రవర్తించాలన్న నిశ్చయాన్ని మనలో కలిగించాలి. ఈ దుర్మార్గత మన మేలుకే పని చేయాలి.

 

యేసు క్రీస్తు ప్రభులవారు అంటున్నారు మత్తయి 5:16

16 అలాగే మనుషులు మీ మంచి పనులు చూచి, పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతించేలా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనియ్యండి.

 

ఇక దర్శనదినము అనగా ఇది దేవుని దీవెన, లేదా తీర్పు వచ్చే ఒక ప్రత్యేకమైన దినం కావచ్చు.

 

సరే, ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం ధ్యానం చేద్దాం! అది సత్క్రియలు కలిగి ఉండాలి!

ఎఫెసీ 2:10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటున్నారు! ఇంతకీ  వేటియందు నడుచుకోవాలి అంటే దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు!! అవి బైబిల్ లో చాలా విస్తారంగా ఉన్నాయి! ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుప్రభులవారు రెండు ఆజ్ఞలుగా చేశారు! సువార్తలలోను పత్రికలలోనూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని, దిక్కులేనివారికి విధవరాల్లకు వారి అవసరాలు తీర్చాలని, ఇంకా సోదరులకు సోదరీమణులకు సహాయం చెయ్యాలని...ఇలాంటి సత్క్రియలు చెయ్యాలని, మనలో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆత్మఫలము ఫలించాలే గాని శరీరక్రియలు ఉండకూడదు అని, అలా జరగాలంటే ఆత్మచే నడిపించబడాలని చెప్పారు! అయితే ఇవన్నీ దేవుడు ముందుగానే మనకోసం సిద్ధం చేశారు అని భక్తుడు చెబుతున్నారు ఇక్కడ! ఇంకా ఇవి చేయడానికే మనం క్రీస్తుయేసు నందు సృష్టించబడ్డామని మనము ఆయన చేసిన పనియై ఉన్నామని చెబుతున్నారు! అందుకే కీర్తనాకారుడు మనము ఆయన ఆయన పిల్లలమని ఆయన మేపు గొర్రెలమని చెబుతున్నారు! కీర్తన 95:6 లోను, 100:౩ లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు!

ఆయన మన దేవుడు! మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము! ఇంకా ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నారు! 

కాబట్టి మనము ఆయన చూపిన చెప్పిన సత్క్రియలు చేయాలి! కయీను సత్క్రియలు చేయలేదు! తన తమ్మున్ని చంపేశాడు! ఆ తర్వాత బాధపడ్డాడు! దూరంగా పారిపోతుంటే దేవుడు అన్నారు: నీవు సత్క్రియలు చేస్తే నీ తలను ఎత్తుకొనవా!!!!

ఆదికాండము 4:7

7. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

కాబట్టి మనము సత్క్రియలు చేయాలి వాటిని చేయడానికే దేవుడు మనలను చేశారు అని గ్రహించాలి!

 

గమనించాలి: విశ్వాసుల నూతన ఆధ్యాత్మిక జన్మ అనేది  వారు సంపాదించుకొనేది కాదు. ఈ భూమిపై తల్లి గర్భాన పుట్టడంలో ఒకడు చేసే ప్రయత్నం ఎలా ఉండదో ఇదీ అంతే. అది వారిలో దేవుడు మాత్రమే జరిగించగలిగేది. అది సృష్టి కార్యం అందుకే యిర్మియా గ్రంధంలో భక్తుడు అంటున్నారు: 10:23 లో యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.

కాబటి దేవుడే మనలను చేశారు, తన పనికోసం చేశారు అని గ్రహించాలి!

 

2 కోరింథీయులకు 5:17; యాకోబు 1:18; యోహాను 1:13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

 దేవుడు మనలో నూతన జీవాన్ని ఎందుచేత సృష్టించారో ఇక్కడొక కారణం ఉంది గమనించండి. మనకు మంచి పనుల వల్ల విముక్తి, రక్షణ కలగలేదు గానీ మనం మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాపవిముక్తి ఇచ్చారు

తీతుకు 2:14;

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

 

 మత్తయి 5:16.

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

 

యాకోబు గారు ఇంకా తెగించి క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నారు!

యాకోబు 2: 13.

కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?

15. సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

 

కాబట్టి  దేవుడు మంచి పనులను మన కోసం, మనలను మంచి పనుల కోసం సిద్ధం చేశారు. మనందరి ఎదుట మంచి పనులు చేసేందుకు అవకాశాలను ఉంచుతారు. మంచి పనులు పాపవిముక్తి వల్ల కలిగే ఒక ఫలం. మనం మంచి పనులు చేయకపోతే మనం దేవుని చేతులతో  చేయబడినవారము కాదని చూపించుకుంటున్నాం అన్నమాట

(మత్తయి 7:16-20; మొ।।).

 16. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?

17. ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.

18. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.

19. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.

21. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

 

మంచి చెట్టుకు మంచి కాయలు కాయడం ఎంత ఖాయమో, మనలోని నూతన జీవం మంచి పనులనే ఫలాలుగా చూపించడం అంతే ఖాయం. విశ్వాసులు దేవుని చేతి పని కాబట్టి ఆయన ఈ పనిని మధ్యలో ఎక్కడో ఆపివెయ్యకుండా ముగింపు వరకూ తెస్తారని అనుమానం లేకుండా నమ్మాలి!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*71వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-16*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 12వ వచనంలో అంటున్నారు అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

        (గతభాగం తరువాయి)

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం ధ్యానం చేద్దాం! అది మంచి ప్రవర్తన కలిగి ఉండాలి!

 

  కొలస్సీయులకు 2: 5

నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతో కూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను (మూలభాషలో- యుద్ధసన్నద్దులై నిలుచుటను) క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.

 

  ప్రియులారా! పౌలుగారు నేను మీ ముఖం చూడకపోయినా, శరీరవిషయంలో మీకు దూరంగా ఉన్నా, ఆత్మవిషయంలో మీతోకూడా ఉండి, మీ యోగ్య ప్రవర్తన క్రీస్తునందు మీ స్తిరవిశ్వాసమును చూసి సంతోషిస్తున్నాను అంటున్నారు!

  మీరు మీ యోగ్యమైన ప్రవర్తనను కొనసాగిస్తున్నారు, ఇంకా క్రీస్తునందు మీ స్థిరవిశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను అంటున్నారు! అందుకే సెహబాస్ అంటున్నారు పౌలుగారు!

 

  ప్రతీవిశ్వాసికి ఈరెండు లక్షణాలు కావాలి. యోగ్యమైన ప్రవర్తన మరియు స్థిర విశ్వాసం!

 *మంచి ప్రవర్తన* లేదా *యోగ్యమైన ప్రవర్తన*: మనకు మంచిపేరు తెచ్చేది గాని, చెడ్డపేరు తెచ్చేదిగాని, మేలుచేసేది గాని, శరీరానికి/ ఆత్మకు కీడుతెచ్చేది గాని మన ప్రవర్తనే!! ప్రియ సహోదరి/ సహోదరుడా! నీ ప్రవర్తన ఎలా ఉంది? సంఘంలో చాలామంది విశ్వాసులు/ సంఘపెద్దలు/ చివరికి దైవసేవకులు మా పిల్లలు మామాట వినడం లేదు, ప్రార్ధన చేయండి అంటూ విలపిస్తుంటారు. కారణం వారి ప్రవర్తన సంఘంలో ఒకలాగా, ఇంటిదగ్గర మరోలాగా ఉంటుంది. ఇంటిదగ్గర వారి ప్రవర్తన/ బ్రతుకు పిల్లలు జాగ్రత్తగా గమనిస్తున్నారు! వారి బ్రతుకు బాగోలేక వారి పిల్లలు వారి మాటలు వినడం లేదు! మీ పిల్లలముందే తల్లిదండ్రులు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే, పిల్లల మీద ఆ ప్రభావం పడదా? పిల్లలముందే సిగరెట్లు, త్రాగుడూ చేస్తుంటే పిల్లలు చేయరా? మీరే ప్రార్ధన, వాక్యం లేకుండా అన్యులులా బ్రతుకుతూ, ఎప్పుడూ టీవీ సీరియల్లో ఉండి, పిల్లలను పట్టించుకోకుండా ఉంటే, పిల్లలు మీ మాట వింటారా?

మరికొంతమంది వారి సాక్ష్యం ద్వారా పై ప్రాంతాలలో అనేకమందిని ప్రభువు దగ్గరకు నడిపిస్తున్తారు. గాని వారి ఇంటివారు గాని, ఇరుగుపొరుగు వారుగాని మారరు. కారణం ఆ వ్యక్తికి, ఎక్కడో సాక్ష్యం ఉంది గాని సొంత ఇంట్లో, సొంత గ్రామంలో సాక్ష్యం లేదు. సొంత ఇంట్లో, గ్రామంలో, ఆఫీస్ లో వాని ప్రవర్తన అసలు ఏమీ బాగోలేదు. అందుకే వారు రక్షింపబడటం లేదు!

*నీకు మంచి సాక్ష్యం నీ మంచి ప్రవర్తన వలెనే వస్తుంది*!!  కాబట్టి యోగ్యమైన ప్రవర్తన అందరికీ కావాలి!

అట్టి సాక్ష్యం పొందినవారిలో యోసేపుగారున్నారు. అతని యోగ్యమైన ప్రవర్తన మొదట ఆ గృహానికి గృహ నిర్వాహకుణ్ణి చేసి, చివరకు ఆ దేశానికి గవర్నర్ గా చేసింది! అదే యోగ్యమయిన ప్రవర్తన దానియేలు గారిని ప్రధానమంత్రిని చేసింది! అటువంటి యోగ్యమైన ప్రవర్తన నీకుందా? కొలస్సీయులకు ఆ యోగ్యమైన ప్రవర్తన ఉంది అని పౌలుగారు సర్టిఫికేట్ ఇస్తున్నారు!

 

ఫిలేమాను  1:56

5. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

6. క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.

 

ఇక్కడ పౌలుగారు ప్రార్థన చేస్తున్నాను అని చెబుతూ సహోదరుడా నేను నీకోసం ఏమని ప్రార్ధన చేస్తున్నాను అంటే: మీ యందున్న ప్రతీ శ్రేష్టమైన వరము విషయమై నీవు ఆ వరమును అనుభవపూర్వకముగా తెలిసికుని , నీ వరముల మూలముగా ఇతరులు నీ విశ్వామందు పాలివారు అవ్వాలనే దేవుని ఉద్దేశం కార్యకారి అనగా సఫలము కావాలని ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారు.  అనగా నీవు పొందుకున్న వరములు, నీవు పొందుకున్న ఆత్మఫలమును, నీ ప్రవర్తనను చూసి అనేకులు నీ విశ్వాసములో పాలివారు కావాలి. అనగా నీ ప్రవర్తన, నీ వరములు అనేకులను నీ విశ్వాసము అనగా- నీవు ఏ విధమగా యేసుక్రీస్తుప్రభులవారు నిజమైన రక్షకుడని, దేవుడని, త్వరగా రానైయున్నాడు అని ఎలా నమ్ముతున్నావో, అదేవిధంగా నీవు పొందుకున్న వరముల ద్వారా నీవు ప్రవర్తిస్తున్న నీ జీవిత విధానము ద్వారా అనేకులు నిన్ను చూసి ఆకర్షించబడి నీవు పొందుకున్న క్రీస్తుయేసు విశ్వాసములోనికి వారు కూడా రావాలనే దేవుని సంకల్పము సఫలము కావాలి అని నీ కోసం ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారు! చూశారా పౌలుగారి కోరిక మరియు ప్రార్ధన ఎంత ఉన్నతమైనదో!!!

 

  ఇక్కడ ప్రతీ శ్రేష్టమైన వరము అంటున్నారు. క్రొత్త నిబంధన గ్రంధంలో వరము అనేది వేటికోసం ఉపయోగించ బడింది అంటే:

మొదటగా అపోస్తలుల కార్యములో పరిశుద్ధాత్మ అనేది వరము అన్నారు.

అపో.కార్యములు 2: 38

పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

 

రోమా 5:15 ప్రకారము మనము పొందుకున్న రక్షణ అనేది దేవుని కృపావరము!!!..

 

అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృ పచేతనైన దానమును,అనేకులకు విస్తరించెను.

 

1కొరింథీ 14:1 లో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అంటున్నారు.....

1కోరింథీయులకు 14: 1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 

ఇంకా అవి ఏమిటో కొద్దిగా ఆ అధ్యాయములో వివరించినా 12వ అధ్యాయములో చాలా వివరముగా చెబుతున్నారు. 14వ అధ్యాయం ప్రకారం- పరిశుద్ధాత్మ వరములో భాగంగా- భాషలు , దానికి అర్ధం చెప్పేవరము , ప్రవచన వరము వివేచనా వరము

ఇక 12వ అధ్యాయం ప్రకారం వరములు వివరాలు ఉన్నాయి,

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,8,9,10

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

 

అయితే పౌలుగారి ప్రార్ధన ఏమిటంటే ఈ వరాలన్నీ ఉపయోగించడం ద్వారా, ఇంకా నీవు పొందుకున్న ఆత్మఫలము ద్వారా అనేకులను క్రీస్తుకొరకు ఆకర్షించాలి. పౌలుగారు కోరింథీయుల కోసం చెబుతూ మీ హృదయాలలో వ్రాయబడిన మా పత్రికలు మీరు కారా అంటున్నారు. 2 కొరింథీ 3:3; అనగా విశ్వాసుల ప్రవర్తన మరియు వారి జీవితాలు క్రీస్తు యొక్క సువార్త కరపత్రికలుగా మారిపోవాలి!  అలా మారి ఆకర్షించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇద్దరికోసం గతంలో చెప్పడం జరిగింది.

 

మొదటి వ్యక్తి- దైవజనురాలైన శ్రీ మధర్ థెరీసా గారు. ఆమె ఎప్పుడు ఎక్కడా సువార్త ప్రకటించలేదు. యేసయ్యని నమ్ముకోమని వీధి సువార్త చెయ్యలేదు. ప్రసంగాలు చెయ్యలేదు గాని అనేకులను క్రీస్తుకోసం ఆకర్శించింది ఆమె ప్రవర్తన మరియు ఆమె పరిచర్య! ఆమెను చంపడానికి వెళ్ళిన వ్యక్తులు చంపకుండా ఇచ్చిన స్టేట్మెంట్ ఆమెలా ఎవరూ చెయ్యలేరు. ఆమె మనిషి కాదు- ఆమెలో ఉన్న దేవుడు అని చెప్పారు.  అటువంటి గొప్ప పరిచర్య చేసి అనేకులను క్రీస్తువైపు నడిపించారు ఆవిడ!

 

మరోవ్యక్తి- దైవజనుడైన డేవిడ్ లివింగ్స్టన్. ఈయన నరమాంస భక్షుకుల మధ్య ఆఫ్రికా ఖండంలో సేవచేసి ఆఫ్రికా ఖండాన్ని క్రీస్తువైపు నడిపించారు. ఆయన స్నేహితుడు నాస్తికుడు ఒకాయన ఆయన అబద్దికుడు, మందు రాసి మారుస్తున్నాడు అని నేను నిరూపిస్తాను అని చాలెంజ్ చేసి వెళ్లి వచ్చి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు. పదిరోజుల తర్వాత ప్రజలు పట్టుకుని గట్టిగా అడిగితే చెప్పాడు- నీవు ఆ దైవజనునితో ఏమి మాట్లాడావు అంటే ఏమి మాట్లాడలేదు. మరి ఎందుకు వచ్చేశావు అంటే- ఆయన చెప్పిన మాట: అక్కడ తొమ్మిది రోజులున్నాను- ఏమి మాట్లాడలేదు, మరోరోజు ఉంటే నేనుకూడా క్రైస్తవుడను అయిపోతాను అని భయమేసి వచ్చేశాను అన్నాడు. ఏమి? ఏమి చూశావు అంటే ఆయన చేస్తున్న పరిచర్య సామాన్య మానవుడు చెయ్యలేడు. అతనిలో ఏదో ఉంది.

అదే దేవుని కృపావరము! ఆ కృపావరము ఉపయోగించి- పరిచర్య చేసి లక్షలమందిని క్రీస్తువైపు నడిపించారు ఆయన!

 

ప్రియ దైవజనమా నీ ప్రవర్తన నీవు పొందుకున్న వరములు- అనేకులను ఆకర్శిస్తున్నాయా లేక వీడా- వీడి బ్రతుకు మనకు తెలియదా అని దేవునికి అవమానం తెచ్చేలా ఉన్నావా? నీవే ఫుల్లుగా తాగి పందిలా దొర్లితే ఏమంటారు? దేవుడి బిడ్డ అట- పందిలా దొర్లుతున్నాడు అంటారు. నీవే లంచగొండిగా, అబద్దికుడిగా దొంగగా, వ్యభిచారిగా బ్రతికితే ఇక దేవునికి ప్రజలను నీ విశ్వాసములోనికి ఎలా నడిపించగలవు??!!!

 

ఈ భక్తులు నడిపించారు క్రీస్తువైపుకి! మరి నీవు నడిపించగలవా?

ఇదే పౌలుగారి ప్రార్ధన! అటువంటి మంచి ప్రవర్తన శ్రేష్టమైనవరములు కలిగి అనేకులను క్రీస్తువైపుకి నడిపిద్దాం!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*72వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-17*

1పేతురు 2:11,12

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక 12వ వచనంలో అంటున్నారు అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

        (గతభాగం తరువాయి)

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం ధ్యానం చేద్దాం! అది మంచి ప్రవర్తన కలిగి ఉండాలి!

 

ప్రియులారా ఈ వచనంలో పేతురు గారు మిమ్మల్ని దూషించేవారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండమని బతిమాలు కొనుచున్నాను అంటున్నారు!

గమనించాలి పేతురు ఆదిమ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు నాయకుడు మొదటి శిష్యుడు అనుభవజ్ఞులు! సంఘమును ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నారు అయినా గాని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను అంటూ మంచి ప్రవర్తనకు మాదిరిగా మాట్లాడుతున్నారు!

అందుకే పేతురు గారు అంటున్నారు మందకు యజమానులైనట్టు ఉండక మాదిరిగా ఉండమని రాశారు. మొదట ఆయన మాదిరి చూపి అప్పుడు రాశారు దీనిని!

1పేతురు 5:1

తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.

1పేతురు 5:2

బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

1పేతురు 5:3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;

 

అలా చేస్తే

1పేతురు 5:4

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

 

ఇక పౌలుగారు కూడా చూడండి: ఇక 1కొరింథీ 16:15వ వచనంలో స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రధమఫలమై ఉన్నారు వారు పరిశుద్దులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించు కున్నారు కాబట్టి అట్టివారికి ఇంకా దేవునిపనిలో సహాయం చేయుచు దేవుని సేవలో ప్రయాసపడే వారికందరికీ విధేయులై ఉండాలని మిమ్మును ఆజ్ఞాపిస్తున్నాను అనడం లేదు మిమ్మును బ్రతిమాలుతున్నాను అంటున్నారు! పౌలుగారు ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నా గాని ప్రేమను చూపించాలి అని రాశారు కాబట్టి తానే మాదిరిగా, దయచేసి వారికి లోబడి ఉండమని బ్రతిమాలుకొంటున్నాను అంటున్నారు!

 

ఇక 2కొరింథీ 2:8 లో కూడా అంటున్నారు కావున వానియెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బ్రతిమిలాడుతున్నాను అంటున్నారు! ఆ దుర్మార్గున్ని వెలివేయమని మొదటి పత్రికలో అంత కోపంగా చెప్పిన పౌలుగారు ఇప్పుడు ఎంతో క్షమాగుణంతో ప్రేమతో అంటున్నారు- నేను వ్రాసిన పత్రిక వలన అతనిని వెలివేశారు కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ వ్యక్తిని క్షమించండి అంటూ బ్రతిమాలుతున్నారు! పౌలుగారు వారికి ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నా గాని ఎల్లప్పుడూ తన మాటల్లోనూ చేతలలోను మాదిరి చూపుతున్నారు!

 

ఇదీ మాదిరిగల జీవితం!

ఇక మరోచోట

1 థెస్సలోనిక 5:1213

12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి

13. వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.

 

          ప్రియులారా! ఈ రెండు వచనాలలో మీకోసం ప్రయాసపడుతూ దేవుని సేవచేస్తున్న మీ పెద్దలను అనగా మీ సంఘకాపరులను నాయకులను సేవకులను మన్ననచేస్తూ వారిని ఘనపరచమని నేను మిమ్మును వేడుకుంటున్నాను అంటున్నారు! దేవునిసేవ చేస్తున్న దైవజనులను పెద్దలను ఎలా గౌరవించాలో ఇక్కడ చెబుతున్నారు పౌలుగారు!

 

     ఇక్కడ చూడండి - మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి అనగా మీ సంఘంలో మీకు పెద్దలుగా ఉన్నవారు, ఇంకా  కాపరులుగా ఉన్న మీ నాయకులను మీకు బుద్ధిచెప్పుచున్నవారిని మన్నన చేయమంటున్నారు ఎందుకు? వారు చేసే పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని మీకు ఆజ్ఞాపిస్తున్నాను అనడం లేదు! ఏం ఆజ్ఞాపించే అధికారం లేదా పౌలుగారికి? ఉంది గాని తన అధికారం చూపించకుండా మొదటినుండి వారిని సహోదరులుగా భావించి వారికి మార్ఘనిర్దేశం చేస్తూ వచ్చారు పౌలుగారు! అందుకే సంఘము ఇంత శోభాయమానంగా వర్ధిల్లింది! అందుకే మీ పెద్దలను గౌరవించమని మిమ్మును వేడుకుంటున్నాను అని వారికి చెప్పి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అంటున్నారు! ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన ముఖమైన మాట ఏమిటంటే మీకు బుద్ధిచెప్పుచున్న వారిని మన్నన చేయమంటున్నారు ఇది గమనించాలి! ప్రజలు మెచ్చ్చుకునే బోధలు చేసినవారిని కాదు! తప్పుచేస్తే బుద్ధిచెప్పే వారిని మన్నన చేసి గౌరవించమంటున్నారు !

 

ఇక మంచి ప్రవర్తన కలిగి ఉంటే కొన్ని మాటలు విశ్వాసులు పలుకకూడదు!

ఎఫెసీయులకు 5:3

మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

ఎఫెసీయులకు 5:4

కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక,వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

 

కొలస్సీయులకు 3:8

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

కొలస్సీయులకు 3:9

ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీన స్వభావమును (ప్రాచీన పురుషుని) దాని క్రియలతో కూడ

కొలస్సీయులకు 3:10

మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.

 

సరే ఇక ఈ వచనం మరోసారి చూసుకుంటే అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

మిమ్మల్ని దూషించే వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి.

యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు నా నిమిత్తము ... ఆనందించండి.

మత్తయి 5:11

నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

మత్తయి 5:12

సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

 

పౌలుగారు అంటున్నారు కొలస్సీయులకు 3:13

ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు) మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

రోమీయులకు 12:14

మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

 

రోమీయులకు 12:20

కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

రోమీయులకు 12:21

కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

 

కాబట్టి అలాంటి మంచి ప్రవర్తన కలిగి మనలను దూషించే వారిని క్షమిస్తూ ప్రేమిస్తూ మాదిరిగా ఉందాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*73వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-18*

1పేతురు 2:13-14

13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

14. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: అధికారులకు ప్రభుత్వానికి లోబడియుండాలి మరియు పన్నులు సుంకాలు తప్పకుండా కట్టాలి!

 

ఇక 13వ వచనంలో అంటున్నారు 13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

14. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.

అనగా గవర్నమెంట్ వారు, మన భారతదేశంలో ఉన్న అధికారిక లేదా ప్రభుత్వం చేసిన రూల్స్ రెగ్యులేషన్ లు అన్నీ తప్పకుండా పాటించమంటున్నారు. చివరకు రోడ్డు నియమనిబంధనలతో సహా! చాలా మంది క్రైస్తవులు కూడా రెడ్ సిగ్నల్ వేసి ఉండగా ఎవరూ లేరని రూల్ పాటించకుండా వెళ్ళి పోతున్నారు. ఇలా చేయకూడదు!  Income Tax కట్టకుండా దొంగ పెట్టుబడులు చూపి తప్పించుకుంటున్నారు. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ఒకరోజు క్రీస్తు న్యాయ పీఠము ఎదుట లెక్కచెప్పాలి అని మర్చిపోవద్దు!

 

దీనికోసం పౌలుగారు చెప్పింది కూడా ఒకసారి ధ్యానం చేద్దాం!

 

కొలస్సీయులకు 1: 16

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.

 

అనగా దృశ్యమైనవి: ఈలోక ప్రభుత్వాలు, అధికారులు, సింహాసనాలు, ఇవన్నీ దేవుని వలననే కలిగాయి! ప్రస్తుతం అధికారం లోనున్న ప్రతీవ్యక్తికి ఆ అధికారం దేవుడే ఇచ్చారు! కాబట్టి

1. అధికారులు: వీరందరికీ అధికారి దేవుడు ఉన్నాడని ఎరిగి, విర్రవీగకుండా నీతిన్యాయములతో పాలించాలి!

2. ప్రజలు: ఈ అధికారం దేవుని నుండే వారికి కలిగింది అని గ్రహించి, అధికారులకు, ప్రభుత్వాలకు లోబడి ఉండాలి! అలాకాకుండావీడా! వీడి బ్రతుకు నాకు తెలియదా? వీడెలా అధికారంలోకి వచ్చాడో , ఎలా ప్రెసిడెంట్ అయ్యాడో, ఎలా అధికారి అయ్యాడో నాకు తెలియదా!” అనుకోకూడదు! వాడు ఎలాంటివాడైనా, వాడికి అధికారం ఇచ్చింది దేవుడే కాబట్టి అన్ని విషయాలలో లోబడియుండాలి! ఇది దేవుని ఆజ్ఞ! ప్రతీ పౌరుడు/ క్రైస్తవుడు గవర్నమెంటు రూల్స్ పాటించాలి! రోమా 13:3 ప్రకారం అధికారులు= దేవుని పరిచారకులు! ఇంకా ప్రతీ అధికారం దేవునినుండే కలిగింది. రోమా 13:1.

 

   కాబట్టి అది ఏ అధికారమైన, గ్రామంలో గాని, మండలంలో గాని, రాష్ట్రంలో, దేశంలో , చివరికి నీ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, నీ దైవసేవకుడు ఎవరైనా సరే ఆధికారం, హోదా దేవుడిచ్చినదే అని గుర్తెరిగి లోబడియుండాలి!

 

   అందుకే పౌలుగారు చెబుతున్నారు: ఇవన్నీ ఆయనద్వారా, ఆయనబట్టి, ఆయనకోసం సృజింపబడ్డాయి కాబట్టి అట్టి సర్వాధికారి, సర్వసృష్టికర్తయైన దేవుణ్ణి కలిగియున్నందుకు వినయ విధేయతలు కలిగి, భయభక్తులతో, దేవునికి లోబడియుండాలి. ప్రభుత్వానికి కూడా లోబడి యుండాలి!

 

రోమా 13:17 .

1. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.

2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

3. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.

4. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.

5. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి. 

 

      ప్రతీ విశ్వాసి ప్రతీ ఒక్కరు వారివారి ప్రభుత్వాలకు, అధికారులకు, చట్టాలకు లోబడిఉండాలి అనియు,  అక్కడ స్థానిక నియమ నిబంధనలు (Rules and Regulations) పాటించాలి!

 

 1..ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.... క్రీస్తులో విశ్వాసులు దేవుని రాజ్యంలోకి వచ్చారు. రారాజు యేసు క్రీస్తు పట్ల వారికి మొదటగా భక్తి ఉండాలి. అయితే వారింకా లోకంలోనే ఉన్నారు కనుక ఏదో ఒక మానవ రాజ్యంలోనే ఉన్నారు కనుక ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి.

 

       13:1 ప్రకారం పాలకులంతా, ప్రభుత్వాధికారులంతా మంచివారేనని, దేవునికి విధేయులేననీ దీని ఉద్దేశం కాదు (పౌలుగారు ఈ మాటలు రాసిన సమయంలో రోమన్ చక్రవర్తులందరిలోకీ అధముడు నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు). కానీ వాటిలో తప్పులు, పాపాలు, అన్యాయాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వాలను నియమించినది దేవుడే (కీర్తన 75:2-7; దాని 4:34-35). కొన్నిసార్లు ప్రజల పాపాలకు శిక్షగా దుర్మార్గులైన పాలకులు అధికారంలోకి వచ్చేందుకు దేవుడు అనుమతిస్తారు. అసలు ప్రభుత్వమే లేకపోవడం కంటే కనీసం చెడ్డ ప్రభుత్వమన్నా ఉండడం మంచిది. అరాచకం, ప్రభుత్వం దానికి ఎవరూ లోబడకపోయేటంత బలహీనమైపోవడం అనేది ఏ దేశానికైనా, ఏ రాజ్యానికైనా రాగల ఘోరమైన  పరిస్థితి, ఎందుకంటే అప్పుడు దుర్మార్గతను, Law and Order ను  అదుపులో ఉంచడానికి ఏదీ ఉండదు. దేవుడు ప్రభుత్వాన్ని నియమించారు కాబట్టి దానికి లోబడి నడుచుకోవడం క్రైస్తవుల బాధ్యత ( 2,5,7). ఒక విషయంలో మాత్రమే ఈ నియమం చెల్లదు ఒక దేశంలోని చట్టాలు, లేక అధికారుల ఆజ్ఞలు దేవుని వాక్కుకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం విశ్వాసులు ఆ మనుషుల మాటలు లెక్క చెయ్యకుండా దేవునికే లోబడాలి. అపొ కా 4:18-20; 5:28-29.

 

  అందుకే ప్రతీవాడు తమ పై అధికారులకు లోబడియుండాలి అంటున్నారు. ఎందుకు అంటే కలిగిఉన్న అధికారం ఏదైనా సరే, అది దేవుని నుండే కలిగింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రభుత్వం కూడా దేవుని నుండే కలిగింది కాబట్టి ప్రభుత్వానికి లోబడటమే కాదు వారు చేసిన చట్టాలకు కూడా లోబడి ఉండాలి బైబిల్ ప్రకారం! అదంతే! ఆ చట్టాలు మంచివి అయినా చెడ్డవి అయినా! క్రైస్తవులను బాదించేవి అయినా బాగుచేసేవి అయినా , చట్టాలకు లోబడాల్సిందే గాని ప్రొటెస్ట్ చేయడానికి వీలులేదు! ఇది నేను చెప్పడం లేదు! బైబిల్ చెబుతుంది.

 

   2వ వచనం ప్రకారం ఎవడైనా ఇలా ప్రొటెస్ట్ చేస్తే లేదా ఎదిరిస్తే  ఆ అధికారానికి, ఆ చట్టాలకు, వాడు దేవుడు చేసిన నియమాన్ని ఎదిరిస్తున్నారు అని ఘంటాపదంగా చెబుతున్నారు ఆత్మావేశుడై పౌలుగారు! ఇంకా ఇలా ఎదిరించేవాడు తమ మీదకు తామే శిక్షను తెచ్చుకుంటున్నాడు అనికూడా చెబుతున్నారు. ఈవిషయంలో నేటి మోడరన్ క్రైస్తవులు అపవాదిని ఎదురించుడి అన్నారు కదా ఎదిరిస్తే తప్పేంటి అని అంటున్నారు. దేవుడు అపవాదిని ఎదిరించమన్నారు గాని అధికారాన్ని, అధికారులను కానేకాదు. అతితెలివి చూపించి దేవుని వాక్యాన్ని కలిపి చెరపకు! ఆదిమ భక్తులు ఎవరూ అలా ఎదిరించలేదు. లోబడ్డారు. నీవుకూడా లోబడే ఉండాలి!

 

    ౩వ వచనం: ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు. ......  సింపుల్ గా చెప్పాలంటే అధికారులు తప్పులు, చెడుకార్యాలు చేసేవారినే శిక్షిస్తారు తప్ప మంచి చేసేవారిని, నీతిగా బ్రతికేవారిని ఎప్పుడూ శిక్షించరు!  4వ వచనం కూడా ఇదే చెబుతుంది. నీవు మేలు/ మంచి చేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు! తప్పుచేసినా, తప్పుడు పనులు చేసినా లోకానికి భయపడాలి, అధికారులకు కూడా భయపడాలి. దేవుడు కయీనుతో ఏమంటున్నారు? నీవు సత్క్రియ చేస్తే తలనెత్తుకొనవా? తప్పు చేశావు కాబట్టి తలదించుకుని నిలబడ్డావు అన్నారు తన తమ్ముడైన హేబెలును చంపినప్పుడు! ఆదికాండం 4:6--7;  ఇక ఇక్కడదేవుని పరిచారకుడు అంటే పరిపాలకులు ఉద్దేశపూర్వకంగా, తెలిసి తెలిసి దేవునికి సేవ చేస్తున్నారని కాదు (కొందరు అలా చెయవచ్చు, అది వేరే విషయం). ఈ భూమిపై దేవుడు సాగిస్తున్న పరిపాలనలో వారు ఆయన చేతిలో సాధనాలు మాత్రమే. కాబట్టి వారు దేవుని సేవకులు కాబట్టి లోబడి ఉండాలి అంటున్నారు.

 

     ఇక 5వ వచనం ప్రకారం: కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ..... వారు దండిస్తారు అని కాదుగాని నీ మనస్సాక్షిని బట్టి లోబడియుండమని అంటున్నారు, ఎందుకు మనస్సాక్షి అంటున్నారు అంటే: ఇంత వివరంగా అధికారులకు లోబడియుండమని బైబిల్ చెప్పినప్పుడు నీ అధికారులను, అధికారిని ఎదిరిస్తే, Rules and Regulations పాటించకపోతే, ఉదాహరణ రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోతే, హెల్మెట్ పెట్టుకోకపోతే నీ మనస్సాక్షి గద్దించదా నిన్ను! అందుకే నీ మనస్సాక్షి నిమిత్తం లోబడియుండాలి అంటున్నారు.

 

     ఇక 67 ప్రకారం:

6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.  .... 

ఎవరికీ పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించండి! ఎవరికీ సుంకం చెల్లించాలో వారికి సుంకం చెల్లించండి. ఎవరికీ భయపడాలో వారికి భయపడండి. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించండి అంటున్నారు. అంతేకాదు మత్తయి 22:21; 1 పేతురు 2:17 ప్రకారం పన్నులు చెల్లించడం మొదలైన విషయాల్లో ఏ విశ్వాసి అయినా నమ్మకంగా లేకపోతే అతడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడన్న మాట. ఎవరైనా Income Tax ఎగ్గోడుతున్నారు అంటే ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు అన్నమాట! ఇంటిపన్ను కట్టడం లేదు అంటే పాపి అన్నమాట! అందరికీ వారివారి ఋణములు తీర్చండి అంటున్నారు.

 

       ప్రియ చదువరీ! నీవు పన్నులు సక్రమంగా కడుతున్నావా? అధికారులు అధికారానికి, చట్టాలకు లోబడి ఉంటున్నావా? పరీక్షించుకో!

అలాకాకపోతే నీవు నేరస్తుడవు, దేవుని దృష్టిలో దోషివి అని గుర్తుపెట్టుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*74వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-19*

1పేతురు 2:15

15. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై (మేలు చేయువారై), అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించాలి అది దేవుని చిత్తము.

 

దీనికి ముందు యుక్త ప్రవర్తన అనగా మేలు చేయువారై ఉండాలి అంటున్నారు! దీనికోసం ముందు భాగాలలో ధ్యానం చేసుకున్నాము. గనుక ముందుకు పోదాం! అయితే ఇక్కడ పేతురు గారు మూడవ సారి కూడా యోగ్యమైన లేదా మంచి ప్రవర్తన ఇంకా సత్క్రియలు చేసే మనస్సు అని ఎందుకు చెబుతున్నారు అనేది అర్థం కావాలంటే ఈ వచనం మొత్తం కలిపి చదువుకుంటే దాని అసలు అర్థం మనకు గోచరిస్తుంది!

మంచి చేయడం అనేది వాదాల ద్వారా చెయ్యలేనిదానిని మంచి పనుల ద్వారా చెయ్యవచ్చు. క్రీస్తు సువార్త తరుఫున దానిని నమ్మినవారి పవిత్ర జీవితాలే అన్నిటి కంటే గట్టి వాదన, రుజువు. అనగా మన మంచి ప్రవర్తన మంచి పనుల ద్వారా మనము అపహాసకులతో వాదించడం కంటే ఎక్కువగా ప్రజలను క్రీస్తు వైపుకి త్రిప్పగలము! అలా చేసింది అమ్మలకు అమ్మ దైవజనురాలు మధర్ థెరీసా గారు, మహా గొప్ప దైవజనుడు మరియు మిషనరీ డేవిడ్ లివింగ్ స్టన్ గార్లు! తమ ప్రవర్తన ద్వారా కొన్ని వేలమందిని క్రీస్తు కోసం గెలిచారు. అపహాసకులను కూడా మార్చగలిగారు!

అయితే  అపహాసకుకు లేదా తెలివి తక్కువగా మాట్లాడేవారు క్రీస్తును గురించీ, ఆయన శుభవార్త గురించీ, ఆయన ప్రజల గురించీ తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతారు. ఎందుకంటే నిజ దేవుడు వారికి తెలియదు

1:14 విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి.

 

 2 పేతురు 3:16

16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు (వక్రముగా త్రిప్పుదురు).

 

Ephesians(ఎఫెసీయులకు) 4:17,18,19

17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.

18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామేకాముకత్వమునకు అప్పగించుకొనిరి.

 

రోమా 1:21-22

21 ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి.

22 తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు.

 

పౌలుగారు ఇక్కడ మానవజాతి చరిత్రను తీసుకుని విగ్రహపూజ ఎలా ఆరంభమైందో చెప్తున్నారు. మొదట్లో మనుషులకు ఏకైక నిజ దేవుడు, సృష్టికర్త తెలుసు. అలా తెలిసినందుకు వారు దేవునికి కృతజ్ఞత చూపలేదు. తమను సృష్టించడంలో దేవుని ముఖ్యోద్దేశం ప్రకారం నడుచుకోలేదు. దేవునికి మహిమ, పేరుప్రతిష్ఠలు తేవడమే వారి విషయంలో దేవుని ఉద్దేశం (యెషయా 43:7; 1 కొరింతు 10:31; ప్రకటన 4:11). దేవుణ్ణి తెలుసుకోవడం ( 28) అనే అతి శ్రేష్ఠమయిన అవకాశాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞత అర్పించలేదు (“కృతజ్ఞతగురించి లేవీ 7:12-13; కీర్తన 7:17; 50:14-15; 56:12; మొ।। చూడండి). దానికి బదులు వారు ఊహాగానాలను మొదలు పెట్టి ఏవేవో వేదాంతాలు, మత వ్యవస్థలు కల్పించుకోవడం ప్రారంభించారు. ఇదంతా చీకటిలో మొదలై వారి మనసులను ఇంకా చీకటిమయం చేసేసింది (ఎఫెసు 4:18). అది గర్వానికీ విగ్రహపూజకూ దారితీసింది. ఈ అధ్యాయంలో 23,25 వచనాలు విగ్రహపూజ అంటే ఏమిటో తెలియజేస్తున్నాయి. కీర్తన 115:2-8; యెషయా 40:18-26; 44:12-26 కూడా చూడండి.

 

అంతేకాకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారు సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకే వారు అపహాస్యం చేస్తున్నారు!

2కోరింథీయులకు 4:4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 అయితే ఇప్పుడు ఇలాంటి అపహాసకుల నోరు మూయించాలి. ఇది విశ్వాసికి ఉండవలసిన లక్షణం! అయితే ఈ క్రమంలో వారి నోరు మూయించే క్రమంలో వారి దేవతలను దేవుళ్ళను మనము దూషిస్తూ, వారు చేసిన తప్పులను ఎండగట్టడం అనేది చేయకూడదు! తద్వారా ద్వేషమే కలుగుతుంది గాని ఆత్మలను రాబట్టలేదు. యేసుక్రీస్తు ప్రభులవారు గాని, శిష్యులు గాని ఎవరూ ఆ పని చేయలేదు. మనము కూడా చేయకూడదు! అందుకే దైవజనులు దేవదాసు అయ్యగారు సాక్ష్యమిచ్చెద అనే పాటలో ఒక మంచి మాట రాశారు. *పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల  నాకు తెలిసినంతవరకు నాధుడేసు రాజుకొరకు సాక్ష్యమిచ్చెద*

అవును యేసుక్రీస్తు ప్రభులవారి కోసం చెప్పడానికి మనకు బోలెడంత ఉంది!

కాబట్టి అపహాసకుల నోరు మూయించాలి గాని వారి దేవతలను దూషించడం ద్వారా ఎంతమాత్రమూ కాదు! మన యేసురాజు చేసినట్లు, ఆయన చేసిన త్యాగముకోసం,  మన భక్తులు చేసినట్లు చేసిన పనుకు వారు ఎవరైనా చేశారా ఇలాంటివి చెబుతూ చెప్పాలి!

ఇది విశ్వాసికి ఉండవలసిన లక్షణం మరియు దేవుని చిత్తము కూడా!

 

దేవుని చిత్తమేమిటి?

 పరిశుద్దులుగా ఉండాలి; జారత్వం నుండి దూరముగా ఉండాలి.1థెస్స 4:;

 

పరిశుద్ధత యందు ఘనతయందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తము. 1థెస్స 4:5

 

ప్రతీ విషయమందు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము. 1థెస్స 5:18

 

అజ్ఞానముగా మాటలాడు వారి నోళ్ళు మూయించడమే దేవుని చిత్తము. 1పేతురు 2:15

దైవాశీస్సులు!

 

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*75వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-20*

1పేతురు 2:16

16. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం:

 నీవు స్వతంత్రుడవైనా నీ స్వతంత్రాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వాడవద్దు. గాని నీవు దేవునికి దాసుడవు అని ఎంచి అందరికీ అనగా అధికారులకు దేవునికి సంఘానికి దైవ సేవకులకు నీ భర్తకు నీ తల్లిదండ్రులకులోబడి ఉండాలి!

ప్రియులారా ఇక్కడ స్వతంత్రత అనగా పూర్వకాలంలో అనగా ఈ పత్రిక రాసే కాలంలో బానిస వ్యవస్థ చలామణిలో ఉండేది. కాబట్టి బానిసలు కాని వారిని ఉద్దేశించి చెబుతున్నారు అని గ్రహించాలి!

నీవు స్వతంత్రుడవు అయినా , నీవు ఎవరికీ దాసుడవు కావుగాని దేవునికి దాసుడవు కాబట్టి, దేవునికి లోబడినట్లే ఈ లోకంలో నీవు పైన చెప్పిన వారందరికీ లోబడాలి. అంతేకాకుండా నీ స్వతంత్రతను నీ దుష్టత్వమును అహంకారాన్ని (Arrogance) ని కపగపిపెట్డానికి వాడవద్దు అంటున్నారు!

 

గలతియులకు 5:1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

గలతియులకు 5:13

సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

 

Romans(రోమీయులకు) 6:16,17,18,22

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

 

కాబట్టి దేవునికే దాసులుగా ఉండాలి. మీ శరీరాత్మలను మనస్సును దేవునికి అర్పించుకోవాలి. బానిసలు తన యజమానులకు ఎలా లోబడియుంటారో, చివరకు యజమాని కొట్టినా ఎలా సహిస్తారో అలా దేవునికి లోబడి యుండాలి. అంతేకాకుండా గత భాగాలలో చెప్పినట్లు

1) ఈలోక ప్రభుత్వాలు, అధికారులు, సింహాసనాలు, ఇవన్నీ దేవుని వలననే కలిగాయి! ప్రస్తుతం అధికారం లోనున్న ప్రతీవ్యక్తికి ఆ అధికారం దేవుడే ఇచ్చారు! కాబట్టి

1. అధికారులు: వీరందరికీ అధికారి దేవుడు ఉన్నాడని ఎరిగి, విర్రవీగకుండా నీతిన్యాయములతో పాలించాలి!

2. ప్రజలు: ఈ అధికారం దేవుని నుండే వారికి కలిగింది అని గ్రహించి, అధికారులకు, ప్రభుత్వాలకు లోబడి ఉండాలి! అలాకాకుండావీడా! వీడి బ్రతుకు నాకు తెలియదా? వీడెలా అధికారంలోకి వచ్చాడో , ఎలా ప్రెసిడెంట్ అయ్యాడో, ఎలా అధికారి అయ్యాడో నాకు తెలియదా!” అనుకోకూడదు! వాడు ఎలాంటివాడైనా, వాడికి అధికారం ఇచ్చింది దేవుడే కాబట్టి అన్ని విషయాలలో లోబడియుండాలి! ఇది దేవుని ఆజ్ఞ! ప్రతీ పౌరుడు/ క్రైస్తవుడు గవర్నమెంటు రూల్స్ పాటించాలి! రోమా 13:3 ప్రకారం అధికారులు= దేవుని పరిచారకులు! ఇంకా ప్రతీ అధికారం దేవునినుండే కలిగింది. రోమా 13:1.

 

   కాబట్టి అది ఏ అధికారమైన, గ్రామంలో గాని, మండలంలో గాని, రాష్ట్రంలో, దేశంలో , చివరికి నీ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, నీ దైవసేవకుడు ఎవరైనా సరే ఆధికారం, హోదా దేవుడిచ్చినదే అని గుర్తెరిగి లోబడియుండాలి!

 

   అందుకే పౌలుగారు చెబుతున్నారు: ఇవన్నీ ఆయనద్వారా, ఆయనబట్టి, ఆయనకోసం సృజింపబడ్డాయి కాబట్టి అట్టి సర్వాధికారి, సర్వసృష్టికర్తయైన దేవుణ్ణి కలిగియున్నందుకు వినయ విధేయతలు కలిగి, భయభక్తులతో, దేవునికి లోబడియుండాలి. ప్రభుత్వానికి కూడా లోబడి యుండాలి!

 

2) స్త్రీ పురుషునికి లోబడి ఉండడం అనేదిప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది! ఇదే విషయాన్ని ఎఫెసీ 5:22-24 లో వివరంగా రాసియున్నారు.

22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

23. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. . . . . . .

 

1పేతురు 3:1

అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

 

స్త్రీ తన సొంత పురుషుడు అనగా భర్తకు లోబడి ఉండాలి. స్త్రీ దేవునికి ఎలా లోబడుతుందో అలా స్త్రీతన భర్తకు లోబడిఉండాలి. కొలస్సీ పత్రికలో విధేయత కలిగియుండాలి అని వ్రాయబడితే ఇక్కడ లోబడియుండాలి అని వ్రాయబడింది. ఇంకా దీనిని క్రీస్తుసంఘము తో పోల్చారు. సంఘానికి శిరస్సు క్రీస్తు! పురుషునికి శిరస్సు క్రీస్తు! అలాగే స్త్రీకి శిరస్సు- పురుషుడు! సంఘము క్రీస్తుకు లోబడినట్లుగానే స్త్రీప్రతి విషయములోనూ పురుషునికి లోబడియుండాలి,. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి *ప్రతీ విషయములోను లోబడియుండాలి*. ఇదీ వాక్యం చెబుతుంది. స్త్రీ భర్తమీద ఎట్టి పరిస్తితులలోను పెత్తనం చెయ్యకూడదు! అలా చేస్తే వాక్యవిరుద్ధము!

 

3) స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగిందో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలంగా కలిగాడు గాని ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఇంకా సమస్త సృష్టి కూడా దేవుని మూలంగా కలిగాయి కాబట్టి ఇద్దరూ దేవునికి లోబడి ఉండాలి, అనగా స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి రక్షించాలి పోషించాలి, ఇప్పుడు ఇద్దరూ కలిసి తమను చేసిన దేవునికి లోబడియుండాలి! 

అంతేతప్పదేవుడు పురుషునికి స్త్రీపై ఆధిపత్యం ఇచ్చాడు కదా అని భార్యను కాళ్లక్రింద త్రొక్కమని కాదు దీనర్థం!!!

 

4) సంఘం- సంఘకాపరికి, సేవకులకు, పెద్దలకు లోబడియుండాలి.

1థెస్సలొనికయులకు 5:12

మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పువారిని మన్ననచేసి

1థెస్సలొనికయులకు 5:13

వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.

 

హెబ్రీయులకు 13:17

మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.

 

5) 1పేతురు 5:5

చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

 

అట్టి విధంగా మనము లోకములో దేవునికి అధికారులకు పెద్దలకు లోబడుతూ దేవునిలో సాగిపోదాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*76వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-21*

1పేతురు 2:

17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: అందరినీ సన్మానించాలి!

సన్మానించడం అనగా కుర్చీలో కూర్చోబెట్టి సాలువా కప్పి ఇంకా పూలదండవేసి సన్మానించడం కాదండి. ఇంగ్లీషు లో Honour everyone అని ఉంది. అనగా అందరినీ గౌరవించండి.

దీనికి మన ఇంగ్లీష్ లో మంచి సామెత ఉంది Give Respect and Take Respect. అవును మనము అందరినీ గౌరవించి మాట్లాడితే అందరూ కూడా మనతో గౌరవంగానే నడుచుకుంటారు. నీవు ఎవరికీ గౌరవం ఈయకపోతే నీవు అందరినుండి గౌరవాన్ని ఆశించవద్దు! ఎవరినీ వారి కులాన్ని బట్టి, వారి ఆస్తి అంతస్తులు బట్టి గౌరవించడం కాకుండా మనిషిని మనిషిగా గౌరవిద్దాం!

ఇది విశ్వాసికి ఉండవలసిన మరో మంచి గొప్ప లక్షణం!

 

పేద గొప్ప తారతమ్యం, ఉచ్ఛ నీచ స్థితిగతులు, విద్య మొదలైనవాటితో నిమిత్తం లేకుండా అలా చేయాలి. జాతి గర్వం, దురభిమానం, తామే అధికులమన్న భావం పరిత్యజించాలి. విశ్వాసులు ఎవరినీ తృణీకరించకూడదు. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.

 

యాకోబుగారు అంటున్నారు

యాకోబు 2:1-4, 9;

1. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటముగలవారై యుండకుడి.

2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?

8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.

9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

 

పౌలుగారు అంటున్నారు విశ్వాసులు కూడా అలాగే అందరినీ గౌరవిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ కలిసిమెలిసి ఉండాలి అంటున్నారు

1 కొరింతు 12:14-27

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

22. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.

23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

 

అపొ కా 6:1;

1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.

 

Romans(రోమీయులకు) 12:9,10

9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

ఇదీ విశ్వాసికి ఉండవలసిన సరియైన లక్షణం! సంఘములో కూడా మనము తారతమ్యాలు లేకుండా ప్రేమకలిగి ఐక్యభావంతో ఉంటే సంఘము బాగా వృద్దిచెందుతుంది. ఏ సంఘములో కులభేదాలు అంతస్తు భేధాలు ఉంటాయో ఆ సంఘములో పరిశుద్ధాత్మ కార్యాలు కాకుండా రాజకీయ కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవునిప్రేమకు పరిశుద్ధాత్మకు చోటిచ్చి లోకాన్ని ద్వేషిద్దాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*77వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-22*

1పేతురు 2:17-18

17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: దేవునికి భయపడాలి!

సహోదర ప్రేమ కోసం గతంలో ధ్యానం చేసుకున్నాము గనుక తరువాత లక్షణం ధ్యానం చేద్దాం!

 

దేవునికి భయపడాలి!

ఎందుకు దేవునికి భయపడాలి?

1) నిన్ను నన్ను చేశారు కాబట్టి! కీర్తన 119:73, ఆదికాండం మొదటి రెండు అధ్యాయాలు;

2) తన అరచేతుల మీద చెక్కుకున్నారు కాబట్టి! యెషయా 49:15,16;

3) ముదిమి వచ్చేవరకూ నిన్ను ఎత్తుకుని మోస్తున్నారు కాబట్టి! యెషయా 46:4;

 

4) యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు:

మత్తయి 10:28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

కాబట్టి మన క్రియల ప్రకారం మనకు తీర్పుతీర్చి మనలను నరకంలో పడవేసే దేవునికి భయపడుతూ ఆయనకు ఇష్టమైన విధంగా నడుచుకోవాలి!

 

5) భక్తుడైన సొలొమోను గారు మరో కోణంలో దేవునికి ఎందుకు భయపడాలో చెబుతున్నారు:

సామెతలు 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

 

సామెతలు 9:10

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.

 

సామెతలు 14:26

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

 

సామెతలు 15:33

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.

 

సామెతలు 19:23

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.

 

కీర్తనలు 111:10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

యోబు 28:28

మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

 

1సమూయేలు 12:14

మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును.

 

ఇంకా అనేకమైన రిఫరెన్స్ లు ఉన్నాయి గాని దేవుడంటే భయములేకుడా పేలాపనలు పేలిన ఇద్దరి గతి చూసుకుని ముగించుకుందాం!

 

మొదటి వాడు అష్షూరురాజు:

2 Kings(రెండవ రాజులు) 18:28,29,30,31,32,33,34,35

28. గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెను-మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా

29. హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

30. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి- యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

31. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా-నాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టుఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.

32. అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున-యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.

33. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలో నుండి విడిపించెనా?

34. హమాతు దేవతలు ఏమాయెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా?

35. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను.

 

2 Kings(రెండవ రాజులు) 19:9,10,11,12,13,14,35,36,37

9. అంతట కూషురాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడి నప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞఇచ్చెను.

10. యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి- యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా?

12. నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారాను వారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదె నీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

13. హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వియీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?

14. హిజ్కియా దూతలచేతిలో నుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి .......

35.ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.

36. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు

37. వచ్చి నివసించిన తరువాతఒఅతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

ఇక మరో రాజు: నెబుకద్నెజరు

Daniel(దానియేలు) 3:14,15,16,17,18,19,20,22,23,24,25,26,28,29

14. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?

15. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు?

16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.

17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా

24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగ లేచి -మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదాయని తన మంత్రుల నడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.

25. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

28. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడు వారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

 

కాబట్టి దేవునికి భయపడదాం! ఆయన మాటలకు లోబడదాం! ఇది విశ్వాసికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*78వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-23*

1పేతురు 2:18-20

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

19. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; 

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: పనివారలారా మీ మంచి యజమానులకు చెడ్డ యజమానులకు కూడా లోబడిఉండాలి!

ఎలా లోబడియుండాలి?

పూర్ణ భయంతో లోబడియుండాలి!

 

పనివారు అనగా servants అని మాత్రమే కాకుండా ఉద్యోగులు కూడా ఈ కోవక్రిందకే వస్తారు!

ఇక్కడ మనకు తెలుగులో పనివారలారా అని ఉంది గాని ప్రాచీన ప్రతులలో ఇంటిదాసులారా అని ఉంది! అనగా మరొకరి ఇంటిలో దాసులుగా పనిచేసే స్త్రీ పురుషుల కోసం చెబుతున్నారు! మరియు బానిసల కోసం చెబుతున్నారు!

కాబట్టి ఇంట్లో పనిచేసే దాసులు పనివారు, ఇంకా వివిధ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీ లలో పనిచేసే ఉధ్యోగులు, నాలా షిప్ లలో పనిచేసే ఉద్యోగులు వీరంతా తమ యజమానులకు లోబడియుండాలి. వారు అనగా వారి యజమానులు మంచి వారైనా చెడ్డ వారైనా గాని మనము వారికి ఇంకా మన పైఅధికారులకు లోబడియుండాలి!

ఇంటి పనివారలు కోవలోకి ప్రతీ దైవసేవకుడు వస్తారు అని గ్రహించాలి! పౌలుగారు మొదటి కొరింథీ పత్రికలో అంటున్నారు

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,9

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

కాబట్టి దైవ సేవకులు మన రక్షణ కర్తయైన యేసుక్రీస్తు ప్రభులవారికి లోబడియుండాలి!

ఇదీ విశ్వాసికి ఉండవలసిన మరో ముఖ్య లక్షణం!

 

  ఇంకా వివరంగా ధ్యానం చేసుకుందాం! పౌలుగారు అంటున్నారు

ఎఫెసీ 6:58

5. దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.

6. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,

7. మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.

 

   ప్రియ దైవజనమా!  ఇక రక్షించబడిన  దాసులు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా తమ యజమానులు పట్ల ఎలా ఉండాలి? యజమానులు దాసుల పట్ల ఎలా ఉండాలో చూసుకుందాం!

 

5వ వచనం నుండి అంటున్నారు దాసులారా యదార్ధమైన హృదయంతో భయముతోను వణుకు తోనూ క్రీస్తుకి మీరు ఎలా లోబడుతున్నారో అలాగే శరీరం విషయంలో మీ యజమానులకు లోబడి ఉండండి అంటున్నారు! ఇంకా ఆరవ వచనంలో మీరుచేసేది మనుష్యులకు చేసినట్లు కాక, మీరు మొదట క్రీస్తుకు దాసులు అనిగుర్తెరిగి ఇది మీ పట్ల దేవునిచిత్తము అని గ్రహించి మనఃపూర్వకముగా పనిచేయండి ఎలా చేయమంటున్నారు అంటే మీరు చేసేది మనుష్యులకు చేస్తున్నాము అని ఆలోచించకుండా నేను దేవునికి చేస్తున్నాను అని తలంచి అప్పుడు చేయండి అంటున్నారు!

 

కొలస్సీ పత్రికలో కూడా ఇదే రాశారు:

కొలస్సీ 3:22-25

22. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.

23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక,

24. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.

25. అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.

 

  3:22 దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.   చూశారా, దాసులారా అంటున్నారు. అనగా బానిసలకు మాత్రమే రాయడం లేదు. అన్ని రకాల పనిచేసేవారికోసం అనగా కూలిపనిచేసేవారి కోసం, ఉద్యోగం చేసేవారికోసం అది గవర్నమెంట్ ఉద్యోగం గాని, ప్రైవేట్ ఉద్యోగం గాని, ఏమిచేసినా ఒక యజమాని క్రింద పనిచేసేవారు ఎవరైనా సరే; వారంతా మనుష్యులను సంతోషపెట్టేవిధంగా కాకుండా అనగా వారు ఉన్నప్పుడు ఒకలాగా , బాస్ లేనప్పుడు ఒకలాగా కాకుండా, దేవునికి భయపడుచూ శుద్ధహృదయం గలవారై మీ యజమానులకు *అన్ని విషయములలో* విధేయులై ఉండుడి. ఇక్కడ మరో అనుమానం రావచ్చు! మరి షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు యజమాని ఆజ్ఞకు లోబడలేదు కదా, మరి దేవుడు వారిని దీవించారు కదా! ప్రియులారా! వారు యజమానిని ఎదిరించింది నిత్యత్వం కోసం, వారి విశ్వాసం కోసం, దైవత్వం కోసం. అందుకే వారు ఎదిరించారు. ఆ విషయంలో తప్ప మిగిలిన విషయంలో వారు యజమాని మాటలు గౌరవించి నమ్మకముగా పనిచేసినందువలన గొప్ప ప్రమోషన్లు పొందుకున్నట్లు చూస్తాం!

 

  ఈ వచనం కొన్ని తర్జుమాలలో ఇలా ఉంది. దాసులారా, శరీరసంబంధంగా మీ యజమానులపట్ల అన్ని విషయాలలో విధేయత చూపండి. మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుటే కాక, దేవుని మీది భయభక్తులతో, కపటం లేని మనసులతో విధేయత చూపండి.

చూసారా మనుష్యులకు కనబడేలా వారి కళ్ళెదుటే కాకుండా, దేవునియందు భయభక్తులతో కపటం లేని మనస్సులతో విధేయత చూపండి అంటున్నారు. అవును మనం మన బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు మరోలాగా పనిచేస్తుంటాం. అలా కాదు ఎప్పుడూ ఒకేలాగా పనిచేయాలి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు పనిచేసేటప్పుడు బాస్ చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పనిచేయాలి. అందుకే ప్రభువునకు భయపడుచు, శుద్దాంతఃకరణము గలవారై పనిచేయమంటున్నారు. ప్రియ విశ్వాసి! నీవు మనఃస్పూర్తిగా పనిచేస్తున్నావా లేక కేవలము డ్యూటీ చేస్తున్నావా? డ్యూటీ చేస్తే దేవుని నుండి మెప్పురాదు గాని మనఃస్పూర్తిగా చేస్తే బాస్ నుండి, ఇంకా దేవునినుండి మెప్పుకలుగుతుంది.

 

   ఇక 23వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇలా పనిలో నమ్మకముగా పనిచేస్తే కేవలం యజమాని నుండి ప్రతిఫలమే కాదుదేవుని వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుతాము.  అది ఏ స్వాస్థ్యము అనేది గతభాగాలలో చూసుకున్నాం! కాబట్టి ప్రియ విశ్వాసి! నమ్మకముగా పనిచేస్తున్నావా? 

ఇక 24వ వచనం: మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం చేసినట్లు తలంచకుండా అది ప్రభువుకోసం చేసినట్లు తలంచి, మనఃస్పూర్తిగా పనిచేయమంటున్నారు. కారణం మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులు అంటున్నారు. ఏం చేసినా అది దేవునికోసమని తలంచి, దేవుని సేవ చేస్తున్నట్లు అంకితభావంతో, లాభాపేక్ష లేకుండా చెయ్యమంటున్నారు. ఇదే విషయం ఎఫెసీ 6:5-8 లో వివరంగా వ్రాయబడింది.

5. దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.

6. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,

7. మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.

8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.  . . . . .   చూశారా ఇక్కడ యదార్ధ హృదయం తోను, భయంతోనూ, వణకుతోనూ, క్రీస్తుకు వలే అంటున్నారు అనగా క్రీస్తుయేసుకు భయపడినట్లు మీ యజమానులకు కూడా భయపడి పనిచేయమంటున్నారు. ఇక 6వ వచనం మనుష్యులను సంతోషపెట్టినట్లు కాకుండా 1) క్రీస్తు దాసులమని, 2) మీరు చేసేది దేవుని చిత్తమని తెలుసుకొని మనఃస్పూర్తిగా పనిచెయ్యమంటున్నారు.

 

ఇక 7వ వచనం  . మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.. . ..   మీరు చేసే పని దేవునికి చేస్తున్నట్లు తలంచి కష్టపడే కాకుండా, ఇష్టపడి పనిచెయ్యమంటున్నారు, అప్పుడు యజమాని నుండే కాకుండా ప్రభువు వలన కూడా బహుమానం పొందుతారు. కావున ప్రియవిశ్వాసి! నీవు చేసేపని నమ్మకముగా, ఇష్టపూర్వకముగా పనిచెయ్యమని మనవి చేస్తున్నాను.

 

   ఇక దాసులు అనగా దేవుని సేవ చేసేవారు కూడా దేవుని సేవకులు/ దాసులు కూడా మనుష్యులను సంతోషపెట్టడానికి కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది సేవకులు కొన్ని సంఘాలలో జీతానికి సేవచేస్తుంటారు. అటువంటి వారు సంఘపెద్దలను, సభ్యులను సంతోషపెట్టడానికి కాకుండా, దేవుడు మెచ్చేవిధంగా, దేవుడు భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిచేవిధంగా సేవ చేయాలి. వారు జీతం కోసం కాకుండా, ఆత్మలభారంతో, కన్నీటితో ప్రార్ధిస్తూ, తన సంఘం ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదిగేలా మంచి ఆత్మీయ ఆహరం పెట్టాలి. వారి కానుకలకు ఆశించి ఎప్పుడూ వారిని మెప్పించే బోధలే కాకుండా, తప్పుచేసినప్పుడు ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ఉండాలి. కారణం వారు నరకానికి వెళితే ప్రియ దైవజనుడా! వారి ఆత్మలకు నీవే ఉత్తరవాదివని మరచిపోకు!

 

కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు చేసే పని దేవునికోసం చేస్తున్నట్లు నమ్మకముగా చేయు!

ప్రియ దేవుని సేవకుడా! నీ పని నమ్మకముగా దైర్యంగా చేయు!

అప్పుడు దేవుడు ప్రతీవానికి వాని వాని క్రియల చొప్పున జీతము ఇవ్వబోవుచున్నారు.

ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*79వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-24*

1పేతురు 2:18-20

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

19. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; 

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: అన్యాయాన్ని కూడా సహించాలి!

దీనికోసం గతభాగాలలో శ్రమలలో ఆనందం అనే పీఠిక లో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!

19. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; 

 

ఇలా అన్యాయాన్ని సహించేవారిని దేవుడే అలాంటివారిని మెచ్చుకుంటాడు. ప్రతిఫలమిస్తాడు అంటున్నారు పేతురు గారు! తప్పుచేసి దెబ్బలు తిని బాధను సహించడం వలన నీకు ఫలము లేదు గాని అన్యాయంగా నీవు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తే నీకు ఫలము అంటున్నారు! ఉదాహరణకు కొన్ని రోజుల క్రితం మన ప్రియతమ దైవజనుడు అన్న ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా చంపేశారు. ఆ అన్నగారు వారి ఆస్తిని దోచుకున్నాడా లేక వారిని ధూషించారా లేదా వారితో పూర్వ ఆస్తి తగాదాలు కుటుంబ కలహాలు ఉన్నాయా? ఏమీ లేకుండా క్రీస్తు కోసం హతస్సాక్షి అయ్యాడు భక్తుడు! తన భార్య బిడ్డలు అన్యాయాన్ని సహించి క్షమించారు. ఇదీ బహుమానమునకు పాత్రులు కావడం!

నేటి దినాల్లో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో క్రీస్తు కోసం ఆయన నామముకోసం చేయని నేరానికి చిత్రహింసలు పడుతున్నారు, అవమానాలకు నిందలకు పాత్రులవుతున్నారు. అయితే పేతురు గారు పౌలుగారు బైబిల్ వీటిని సహించమంటున్నారు.

1 Peter(మొదటి పేతురు) 2:20,21

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

21. ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 3:3,4

3. మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;

4. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.

 

ఇంకా నాలుగో అధ్యాయంలో పేతురు గారు అంటున్నారు

1 Peter(మొదటి పేతురు) 4:14,15,16

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

 

ఈ భాగంలో పేతురు గారు అంటున్నారు

1) క్రీస్తు నిమిత్తం నిందలపాలైతే దేవుని పరిశుద్ధాత్మ మనమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటున్నారు!

2) ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడకూడదు, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అంటున్నారు!

హల్లెలూయ! ఇదీ విశ్వాసికి ఉండవలసిన మరో దృడ సంకల్పం!!!

 

క్రీస్తు పేరును ధరించినందుచేత క్రైస్తవులెందుకు సిగ్గుపడాలి? మనం జీవిస్తున్న లోకం అలాంటిది (యోహాను 15:18-25; 16:1-4). లోకం తన ఇష్ట పూర్వకంగా చీకటిలో ఉంటూ, ఆధ్యాత్మిక వెలుగును తిరస్కరిస్తూ ఉంది. (యోహాను 3:19-20).

కాబట్టి విశ్వాసి తన విశ్వాసం కోసం క్రీస్తు కోసం సిగ్గుపడకూడదు.

 

ఆది అపొస్తలులు ఏం చేశారో తెలుసా!!!

Acts(అపొస్తలుల కార్యములు) 5:40,41,42

40. వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

41. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

ఇదీ తెగింపు! ఇదీ శ్రమలలో ఆనందం! ఇదీ క్రీస్తులో ఆనందం!

ఇట్టి కృప నీకు కావాలా?! అయితే క్రీస్తు కోసం ఆయన నామముకోసం అన్యాయాన్ని సహించు!

దైవాశీస్సులు!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*80వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-24*

1పేతురు 2:21--25

21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

25. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన లక్షణం: అన్యాయాన్ని కూడా సహించాలి!

చూడండి తన ప్రత్యేక ప్రజగా ఉండేందుకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మంచి చేసినందువల్ల బాధలు అనుభవించడం కూడా ఆ పిలుపులో భాగమే. ఈ విధంగా బాధలు పడిన వారిలో యేసుక్రీస్తే గొప్ప ఉదాహరణ. ఆయన మంచి తప్ప మరేదీ చెయ్యలేదు గానీ మనందరికంటే ఎక్కువగా బాధలు పడ్డారు.

ఎందుకంటే, క్రీస్తు సహా మనకోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయారు అంటున్నారు!

మత్తయి 4:19 లో ఆయన నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులనుగా చేస్తాను అని పిలిస్తే ఆది అపొస్తలులు ఆయన అడుగుజాడలలో నడుస్తూ వారు కూడా శ్రమలగుండా సువార్త ను వ్యాపించారు!

మత్తయి 16:24

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

 

పౌలుగారు అంటున్నారు 1కోరింథీయులకు 11:1

నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

 

కాబట్టి మనము క్రీస్తుని పోలి ఆయన అడుగుజాడలలో నడచిపోవాలి! అయితే నమ్మామని అనుకుంటూ క్రీస్తును అనుసరించకుండా ఉండేవారు అనగా శ్రమలబాట కాకుండా సుఖాల వెంట నడుస్తూ, లోకంలో లోకస్తులను అనుకరిస్తూ నడిస్తే తమను తాము మోసపుచ్చుకుంటున్నారు.

 

ఇక క్రింద వచనాలలో యేసుక్రీస్తుప్రభులవారు మనకోసం అనుభవించిన బాధలు సహించిన విధానాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు పేతురు గారు!

22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

 

యెషయా 53:9

అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

 

మత్తయి 27:23

అధిపతిఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

 

యోహాను 8:46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

 

యోహాను 19:4

పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

 

2కోరింథీయులకు 5:21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

హెబ్రీయులకు 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

 

హెబ్రీయులకు 7:26

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. (లేక, తగినవాడు)

 

యెషయా 53:7

అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

యెషయా 53:8

అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?

 

మత్తయి 27:11

యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

మత్తయి 27:12

ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

మత్తయి 27:13

కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

మత్తయి 27:14

అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

మనం కూడా అదే విధంగా ప్రవర్తించాలి. దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు, బాధలకు గురి అయినప్పుడు బెదరించలేదు గాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకొన్నాడు.

 

24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

25. మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.

 

చూడండి మన స్థానంలో మనకు బదులుగా క్రీస్తుయేసు బాధల పాలై మరణించాడన్న స్పష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. 3:18; యెషయా 53:5; మత్తయి 20:28; యోహాను 1:29; 10:11, 14; రోమా 3:25; 2 కొరింతు 5:14, 21; హెబ్రీ 9:28 కూడా చూడండి. క్రీస్తు బాధల్లో మరణంలో గల ఉద్దేశం ఇక్కడ రాసి ఉంది.

 

సరే ఎందుకు ఇలా చేశారు, మనము ఏమి చెయ్యాలి అంటే

Romans(రోమీయులకు) 6:10,11,12,13,14

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా (లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

 

గలతియులకు 2:20

నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.

 

గలతియులకు 5:24

క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

గలతియులకు 5:25

మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

 

కొలస్సీయులకు 3:5

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

కొలస్సీయులకు 3:6

వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి (అవిధేయత కుమారులమీదికి)వచ్చును.

 

ఇక 25 ఎందుకంటే మీరు గొర్రెలలాగా త్రోవ తప్పిపోయారు గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా, పై విచారణకర్తగా ఉన్న ఆయన దగ్గరకు మళ్ళుకొని వచ్చారు.

గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు యెషయా 53:6

ఇక కాపరి కోసం చూసుకుంటే యోహాను 10వ అధ్యాయంలో ఆయన నేను గొర్రెలకు మంచికాపరిని అంటూ మనలను కాచే విధానం చెబుతున్నారు!

అయితే ఇక్కడ మరియు 5వ అధ్యాయంలో ఆయన ప్రధానకాపరి మరియు ఆత్మలకాపరి అంటున్నారు!

కాబట్టి ఆయన చూపిన బాటలో మనము నడిచిపోదాం! మనకొరకు ఎంతో బాధను అనుభవించారు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా సహించి తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అడిగి మన పాపములకు క్షమాభిక్ష దయచేశారు. మనము ఆ క్షమాపణ పొందుకున్నాక క్రీస్తు చూపిన బాటలో నడుస్తూ పవిత్రమైన జీవితం జీవించాలి. ఇదే విశ్వాసికి ఉండవలసిన లక్షణం!!

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*81వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-25*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:1--2

1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంతవరకూ రెండు అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము. ఇక మూడవ అధ్యాయంలో మొదటగా పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి? తరువాత పెండ్లయిన పురుషులు ఎలా ఉండాలి? చెబుతూ మరలా శ్రమల ద్వారానే సంఘం వెళ్లాలి అని చెబుతూ చివరలో కొన్ని మర్మములు భోదిస్తున్నారు!

 

మొదటగా పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలో ధ్యానం చేద్దాం!

మొదట వచనంలో స్త్రీలారా అని మొదలుపెట్టారు గాని నిజానికి ప్రాచీన ప్రతులలో గాని గ్రీకు భాషలో గాని పెండ్లయిన స్త్రీలారా అని వ్రాయబడింది.

1. అలాగే పెండ్లయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనమూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు.

2 భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు.

 

దీనికోసం గతంలో కొద్దిగా చూసుకున్నాము! గమనించాలి వీటిని వ్రాసింది వేరు వేరు వ్యక్తులైనా వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి పేతురు గారు ఏమి వ్రాసారో, పౌలుగారు కూడా అదే వ్రాసారు! Ephesians(ఎఫెసీయులకు) 5:22,23,24

22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

23. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

 

ఇక వాక్యమునకు అవిధేయులు అనగా రక్షణ పొందని వారి భర్తలు అన్న మాట! వీరు తమ భార్యల మంచి ప్రవర్తన ద్వారా రక్షించబడవచ్చు అంటున్నారు! మాటలు, వాదనలు అన్నీ విఫలం అయినప్పటికీ నమ్మకం ఉంచని భర్తలు ఈ పద్ధతి ద్వారా క్రీస్తు చెంతకు రావచ్చు. నిజానికి భార్యలు భర్తలకు ఎప్పుడూ ప్రకటించడానికి పూనుకోవడం ఆ భర్తలను క్రీస్తుకు మరింత దూరం చేయడానికే దారి తీయవచ్చు. అయితే ఈ మంచి ప్రవర్తన అనేది భర్తలను మార్చి క్రీస్తు చెంతకు నడిపిస్తుంది. మంచి ప్రవర్తన గల స్త్రీ భర్తను మోసం చెయ్యదు. గయ్యాళిగా జగడమాడదు. భర్తమీద పెత్తనం చేయదు! భర్తను కొట్టదు (ఈ రోజుల్లో అనేకమంది స్త్రీలు తమ భర్తలను అత్తమామలను కొడుతున్నారు). భర్తను అస్తమాను వేదించదు. సర్దుకుపోతుంది.

 

పిలుపుకి తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త భాధ్యత ఎంతో గొప్పది! ప్రాముఖ్యమైనది! కారణం సాతాను గాడు ఎప్పటినుండో సంఘాన్ని పాడుచేద్దాం అనుకుంటున్నాడు- ఓడిపోతున్నాడు! సంఘాన్ని డైరెక్ట్ గా ఎటాక్ చేయలేక సంఘంలో గల కుటుంబాలను కుటుంభ వ్యవస్తను పాడుచేస్తున్నాడు! కారణం కుటుంబాలు పాడై పోతే సంఘములు దెబ్బతింటాయి! అందుకే సాతాను గాడు కుటుంబాలనే పాడుచేసి సంఘాలను పాడుచేస్తున్నాడు!

 

అసలు వివాహ వ్యవస్త ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారో చూసుకుని అప్పుడు స్త్రీ పురుషులు సంఘంలో పిలుపుకి తగిన జీవితం ఎలా జీవించాలో మనం ధ్యానం చేసుకుందాం!

 

అసలు వివాహం దేనికోసం చేసుకుంటారు?

 

ఈ ప్రశ్న యవ్వనస్తులను అడిగితే సెక్స్ కోసం అని సమాధానం చెబుతారు!

 

పెద్దవారిని అడిగితే సంతానోత్పత్తి కి అని సమాధానం చెప్పారు!!

 

నిజానికి దేవుడు వివాహ వ్యవస్తను ఎందుకు ఏర్పాటుచేశారు అంటే సెక్స్ కోసం కాదు, సంతానోత్పత్తికి కూడా కాదు గాని ఆదికాండం 2:20 ప్రకారం చూసుకుంటే సాటియైన సహాయం కోసం దేవుడు వివాహ వ్యవస్తను ఏర్పాటు చేశారు! అనగా స్త్రీకి తోడుగా పురుషుని, పురుషునికి తోడుగా స్త్రీని అన్నీ విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండటానికే దేవుడు ఈ వివాహ వ్యవస్తను ఏర్పాటు చేశారు!

 

20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు *సాటియైన సహాయము* అతనికి లేక పోయెను.

 

కాబట్టి దేవుడు కేవలం సాటియైన సహాయం కోసమే వివాహాన్ని ఏర్పాటుచేశారు! ఇప్పుడు స్త్రీ అన్నీ విషయాలలోనూ భర్తకు సహకరించాలి! కుటుంబ విషయాలలో ఇంకా ఆర్ధిక విషయాలలోనూ అన్నీ విషయాలలోనూ సహకరించాలి! అలాగే భర్త కూడా స్త్రీకి అన్నీ విషయాలలోనూ సహకరించాలి! చివరకు పిల్లలను పెంచడం లోకూడా సహకరించాలి!

 

సరే, సాటియైన సహాయం చేయడానికి స్త్రీని దేవుడు చేసి ఇచ్చారు ! ఎలా అంటే దేవుడు

 

21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.

22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.

23. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.

24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

 

దేవుడు ప్రక్కనుండే ఎముకను ఎందుకు తీశారు? కారణం దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే! ఇద్దరూ సమానంగా ఉంటూ వారి వారి భాధ్యతలు నిర్వహించాలని! ఒకవేళ దేవుడు తలనుండి ఎముకను తీసి ఉంటే స్త్రీ పురుషుని నెత్తిమీద కూర్చుండునేమో, ఇక కాలు నుండి తీస్తే పురుషుడు ఎక్కడ స్త్రీని తన కాలి క్రింద వేసి త్రొక్కుతాడు ఏమో అని దేవుడు తెలివిగా ఆలోచించి ప్రక్కటెముక నుండే తీశారు. ఆ ప్రక్కటెముక తోనే స్త్రీని చేసి సాటియైన సహాయముగా ఆదాముగారికి ఇచ్చారు! కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు దేవునికి సమానమే! గాని ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి! ఇలా కలిసిమెలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి! ఇదే బైబిల్ చెబుతుంది!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*82వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-25*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:1--2

1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 

పిలుపుకి తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము! స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని దృష్టిలో సమానమే మరియు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలని ఇంతవరకు ధ్యానం చేశాము!

 

ఇక ఎఫెసీ 5: 22 వ వచనంలో అంటున్నారు స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. ఎలాగంటే క్రీస్తు సంఘానికి శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. ఇంకా సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను అంటున్నారు! పేతురు గారు అంటున్నారు 3:1 లో

 1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; ప్రతీ భార్య తన స్వంత భర్తకు లోబడి ఉండాలి! ఈరోజులలో చాలామంది స్త్రీలు తమ స్వంత పురుషులకు లోబడటం లేదు! ఇతర పురుషులకు లోబడుతున్నారు! స్వంత పురుషుడు అనగా భర్త వారికి ఎందుకు పనికిరాని దద్దమ్మగా కనిపిస్తున్నాడు గాని వారి బావ గారు గాని లేక కుటుంబంలో మరో వ్యక్తి ఎంతో ఘనమైన వాడు గాను గౌరవించ తగిన వాడు గాను కనిపిస్తున్నాడు! ఓ స్త్రీ మొదట నీవు నీ భర్తను గౌరవిస్తే ఇతరులు కూడా నీ భర్తను గౌరవిస్తారు! నీవే పుల్లముక్కలా తీసిపడేస్తే ఇతరులు ఈడ్చి ఈడ్చి కొడతారు నీ భర్తను! అప్పుడు పోయేది నీ పరువే! మా పల్లెటూర్లలో అనేకమంది తమ భర్తలను సోదోడా దద్దమ్మ అని పిలుస్తూ వారి పరువు వారే తీసుకుంటున్నారు! బైబిల్ చెబుతుంది శారమ్మ గారి గురించి ఎల్లప్పుడూ తన భర్తను నా యజమానుడా అని పిలిచి గౌరవిస్తూ ఉండేది! అందుకే ఆదర్శవంతమైన దంపతులు అయ్యారు ఇద్దరూ!

 

అయితే ఒక విషయం చెప్పనీయండి- పురుషులు కూడా తమ భార్యలను చూసేవిధంగా చూడాలి! హుందాగా ప్రవర్తించాలి. చిల్లర పనులు చేయకూడదు! భార్యలను ప్రేమించాలి! క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో పురుషులు కూడా తమ భార్యలను అలా ప్రేమించాలి అంటున్నారు! సంఘము ప్రతీ విషయంలో క్రీస్తుకు లోబడినట్లు ప్రతీ విషయంలో తమ స్వంత భర్తకు స్త్రీ లోబడాలి! అది నీకు నచ్చినా నచ్చక పోయినా నీవు లోబడాలి అంతే! అయితే మరి నీ ఉద్దేశం చెప్పుకునే అవకాశం లేదా అంటే ఉంది- ఒకవేళ ఆ పని నీకు నచ్చకపోతే ముందు ఆ పని చేసి తర్వాత ఏమండీ ఇది మంచిపద్దతి కాదు అంటూ నెమ్మదిగా నీ భర్తకు కోపం రాకుండా నచ్చచెప్పుకుని ఆ పనిచేయకుండా ఆపాలే తప్పా భర్త మీద తిరుగబడ కూడదు! ఇదే బైబిల్ చెబుతుంది! మా స్త్రీలకు హక్కులున్నాయి అంటూ పోరాటం చేయకూడదు! స్త్రీలు ఏమైనా అనుకుంటే అనుకోండి గాని నేను చెప్పేది బైబిల్ లో వ్రాయబడినదే చెబుతున్నాను! ప్రతీ విషయంలోనూ స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి! కుటుంబ యజమాని భర్త మాత్రమే! స్త్రీ ఎంతమాత్రమూ కాదు! మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఒరిస్సాలో కొంత భాగం, తమిళనాడులో, ఇంకా బీహారలో కొంతభాగంలో స్త్రీలే ఇంటికి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు శతాబ్దాల నుండి! గాని దీనిని బైబిల్ ఒప్పుకోదు! ప్రతీ విషయంలో స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి! ఇంకా తన భాధ్యత నిర్వహించాలి!

 

నిజానికి స్త్రీ యొక్క భాధ్యత ఏమిటి? అది మన దేశమైన పశ్చిమ దేశాలైనా ఏ దేశంలో నైనా స్త్రీ యొక్క భాద్యతలు ఏమంటే మొదటగా: భర్తకు లోబడాలి! రెండు: పిల్లలను కనాలి ! నేను కలెక్టర్ ని, నేను ఈ ఆఫీసర్ ని నాకు కాళీ ఉండదు, నా ఉద్యోగానికి పిల్లలు కనడం సూట్ అవ్వదు అని నీవు వాదించినా అది కుదరదు! నోరుమూసుకుని  పిల్లలు కనాలి! ఇది దేవుని శాసనం! ఆదికాండం లోనే స్త్రీకి దేవుడిచ్చిన  మార్గం ఇది! నీవు ప్రయాస పడి పిల్లలను కంటావు అని చెప్పారు దేవుడు! ఒకవేళ నీ మీద అత్యధిక ప్రేమతో నీ భర్త పిల్లలను కందామన్న అతను కనలేడూ ఎందుకంటే ఆ శరీర వ్యవస్త దేవుడు స్త్రీలకే పెట్టాడు! కాబట్టి స్త్రీ పిల్లలను కనీ తన వంశం/కుటుంబం యొక్క సంతానాన్ని వృద్ది పొందించాలి!

 

మూడవది: వంట చేయడం: మరలా మీద సేమ్ డైలాగ్! నేను కలెక్టర్ ని, మా నాన్న కోట్లు లక్షలు ఇచ్చాడు నీకు, లేక మరో కారణం చెప్పి నేను వంట వండను! నీవే వండుకో లేక పని మనిషితో వండించుకో అంటే కుదరదు! నోరు మూసుకుని వంట చేయాలి! దయచేసి స్త్రీలు నా భాషను క్షమించండి గాని దీనియొక్క విశిష్టత అర్ధం కావాలనే ఈ భాషను ఉపయోగిస్తున్నాను! స్త్రీలు తప్పకుండా వంట చేసి తన భర్తకు పిల్లలకు తన కుటుంబానికి పెట్టాలి! ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ! స్త్రీ యొక్క ముఖ్య విధి! అది ఏ దేశమైనా సరే! అలాగని పురుషులు ఎట్టి పరిస్తితులలో వంటచేయకూడదు అని నేను అనడం లేదండోయ్! ఒకవేళ నీ భార్యకు ఆరోగ్యం బాగోలేక పోతే నీవు వంట చేయడం తప్పుకాదు. సరికదా చాలామంచిది! నీ భార్య మంచి పొజిషన్ లో ఉంది! ఉద్యోగ ఒత్తిడి వలన కొంచెం ఆలస్యంగా రావచ్చు! అంతవరకు నీవు నీ పిల్లలు ఆకలితో ఉండకుండా నీవు వంట చేయడం తప్పుకాదు! ఇంకా ప్రతీ భర్త తన భార్యకు వంటలో సహాయం చేస్తే నిజంగా భార్య ఎంతో సంతోషపడుతుంది! కొంతమంది భర్తలు ఏం పనిచేస్తున్నావు, కాళీగా ఉన్నావు కదా ఇది ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అంటూ భార్యను పూచిక పుల్లలా తీసేస్తూ అవమానిస్తూ సతాయిస్తూ ఉంటారు! భర్తలే కాదు పిల్లలు కూడా తల్లిని అంటూ ఉంటారు! ఇలాంటి పనికిమాలిన వారు ఒక వారం రోజులు తల్లి లేక భార్య చేసే పనులు ఉదయం నుండి సాయంత్రం వరకు  చేస్తే అప్పుడు అర్ధమవుతుంది ఇంట్లో స్త్రీలు ఎంతగా కష్టపడుతున్నారో! నిజానికి పురుషులు కంటే స్త్రీలే ఎక్కువగా కష్టపడుతున్నారు! కొంతమంది స్త్రీలు ఇంట్లో పనులు చేసుకుని ఉద్యోగం కూడా చేస్తున్నారు! వీరికి నిజానికి మరింత శ్రమ! కాబట్టి భార్య వంటపని ఇంటిపని చేస్తుంది కాబట్టి మరింత గౌరవించాలి భార్యను!

 

నాల్గవది: పిల్లలను కనడమే కాకుండా వారిని సరియైన రీతిగా పెంచాలి! భర్త సంపాదించి డబ్బులు తీసుకుని రాగలడు గాని వారిని కనిపెడుతూ అన్నీ విషయాలలో సహకరిస్తూ పిల్లలను పెంచే భాధ్యత ముఖ్యంగా స్త్రీలకు లేక తల్లులకు ఉంది ఇది మరిచిపోవద్దు! అలాగని పిల్లలను పెంచే బాధ్యత పురుషులకు లేక తండ్రికి లేదు అని నేను చెప్పడం లేదు ఇద్దరిదీ భాద్యతే! గాని స్త్రీకి ఎక్కువ భాధ్యత అంటున్నాను! ఎందుకంటే పిల్లలు తమ ఊహలు ఉద్దేశాలు అభిప్రాయాలు తల్లితోనే ఎక్కువగా పంచుకోగలరు!!

(సశేషం)

*పేతురు వ్రాసిన పత్రికలు*

*83వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-25*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:1--2

1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 

పిలుపుకి తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము!

 ఇక ఎఫెసీ 5:22 వ వచనంలో అంటున్నారు స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.  అంటూ స్త్రీ తమ భర్తకు అన్నీ విషయాలలో లోబడి ఉండాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

ఇంకా కొలస్సీ పత్రికలో అంటున్నారు

 

కొలస్సీయులకు 3: 18

భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.

 

   ఈ వచనంలో మొదటగా పౌలుగారు భార్యల కోసం/ స్త్రీల కోసం రాసారు. భార్యలారా! మీ భర్తలకు విధేయులైయుండుడి , ఇది ప్రభువునందు యుక్తమై యున్నది. మొదటగా స్త్రీలను భర్తకు విధేయులై ఉండమంటున్నారు. ఎందుకు? ఇది ప్రభువును బట్టి యుక్తమై యున్నది. ఎలా? దీనికోసం మరల మనం ఆది దంపతులు ఆదాము-హవ్వల దగ్గరకు వెళ్ళాలి. హవ్వమ్మ సర్పము-సాతాను ద్వారా మోసగించబడి, తినవద్దన్న ఫలం తాను తిని, తన భర్తతో కూడా తినిపించి, మానవాళికి పాపాన్ని శాపాన్ని తీసుకుని వచ్చింది. అప్పుడు పశ్చాత్తాపపడకుండా ఆ తప్పు- సర్పము (సాతాను) మీద నెట్టాలని ప్రయత్నం చేసింది. ఆదాముగారు హవ్వమ్మ మీదకు నెట్టారు. ఈ విధంగా హవ్వమ్మ, ఆదాముగారు, సర్పము, భూమి శపించబడ్డారు. అప్పుడు దేవుడు హవ్వమ్మతో అంటున్నారు:

ఆదికాండం 3:16

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

 

   చూశారా నీ భర్త యెడల నీకు వాంఛకలుగును, అతడు నిన్ను ఏలును. ఇది దేవుడు విధించిన శిలాశాసనం. దీనిని మార్చే అధికారం ఎవరికీ లేదు! ఇదీ వాక్యం సెలవిస్తుంది. నేను కాదు! మహిళా సంఘాలు దీనిని గమనించాలి. అయితే దేవుని దృష్టికి స్త్రీ- పురుషుడు ఇద్దరూ సమానమే! స్త్రీ నిర్వర్తించవలసిన విధులుభాద్యతలు స్త్రీ నిర్వర్తించాలి! పురుషుని భాద్యత- విధి పురుషుడు నిర్వర్తించాలి. స్త్రీ పురుషునికి బానిస ఎంతమాత్రము కాదు!! ఇద్దరూ సమానమే! అందుకే దేవుడు ఆమెను ప్రక్కటెముక తీసి చేశారు. ఒకవేళ స్త్రీ- పురుషునికి బానిసగా ఉండాలంటే దేవుడు బహుశా కాలు నుండి తీసియుండునేమో!!

 

  కాబట్టి స్త్రీ పురుషునికి లోబడి ఉండడం అనేదిప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది! ఇదే విషయాన్ని ఎఫెసీ 5:22-24 లో వివరంగా రాసియున్నారు.

 

22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

23. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. . . . . . .

 

స్త్రీ తన సొంత పురుషుడు అనగా భర్తకు లోబడి ఉండాలి. స్త్రీ దేవునికి ఎలా లోబడుతుందో అలా స్త్రీతన భర్తకు లోబడిఉండాలి. కొలస్సీ పత్రికలో విధేయత కలిగియుండాలి అని వ్రాయబడితే ఇక్కడ లోబడియుండాలి అని వ్రాయబడింది. ఇంకా దీనిని క్రీస్తుసంఘముతో పోల్చారు. సంఘానికి శిరస్సు క్రీస్తు! పురుషునికి శిరస్సు క్రీస్తు! అలాగే స్త్రీకి శిరస్సు- పురుషుడు! సంఘము క్రీస్తుకు లోబడినట్లుగానే స్త్రీప్రతి విషయములోనూ పురుషునికి లోబడియుండాలి,. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి *ప్రతీ విషయములోను లోబడియుండాలి*. ఇదీ వాక్యం చెబుతుంది. స్త్రీ భర్తమీద ఎట్టి పరిస్తితులలోను పెత్తనం చెయ్యకూడదు! అలా చేస్తే వాక్యవిరుద్ధము! భర్తమీద పెత్తనం చేసిన యెజెబేలు రాణి కుటుంబం ఏమయ్యిందో మన చూడగళం రాజుల గ్రంధంలో!

 

     పరిశుద్ధాత్ముడు ఏమి రాసినా దానిని కనీసం రెండుచోట్ల వ్రాయించారు. ఈ విషయాన్ని మూడుచోట్ల ప్రస్తావించడం జరిగింది. అనగా ఇది పరిశుద్దాత్ముని స్తిరమైన నిర్ణయం అన్నమాట! 1 పేతురు 3:1-6 చూసుకుంటే దీనికోసం చాలా వివరంగా వ్రాయబడింది. అటువలె స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడియుండుడి. చూసారా ఇక్కడ కూడా స్త్రీభర్తకు లోబడి యుండాలని వ్రాయబడింది. భర్త ఎలాంటివాడైనా సరే!, అలా లోబడి ఉండినప్పుడు తన మంచి ప్రవర్తన ద్వారా తన భర్తను రక్షించుకోగలదు అంటున్నారు. ఇంకా జడలు అల్లుకోవడం, బంగారునగలు పెట్టుకోవడం, ఖరీదైన వస్త్రాలు ధరించుకోవడం లాంటి షోకులు చేయడం కాదుగాని, సాదువైన, మృదువైన గుణాలనే అక్షయాలంకారాలుగా ధరించుకోవాలి అంటున్నారు. కాబట్టి స్త్రీలారా! మీరు ఏమి అలంకరించుకొంటున్నారు? బంగారమా? రోల్డ్ గోల్డా? మెటలా? ఇవికాదు గాని సాధువైన, మృదువైన, భక్తిగల స్త్రీలకూ తగినట్లుగా అక్షయాలంకారాలు ధరించుకోవాలి.

 

     ఇంకా 6వ వచనంలో శారమ్మ అబ్రాహాముగారిని నా యజమానుడా! అని పిలిచింది. మీరు కూడా అలా పిలిస్తే మీరు కూడా ఆమె సంతానము అవుతారు అంటున్నారు. స్తీలారా! మీరు మీ భర్తలకు లోబడియుంటున్నారా శారమ్మ లా! అంత ముసలమ్మ కూడా దేవదూతలు వచ్చారని అబ్రాహాముగారు రొట్టెలు కాల్చమని చెబితేఅంతమంది పనివారున్నా భర్తమాట గౌరవించి తనే స్వయముగా రొట్టెలు చేసి పెట్టారు ఆవిడ! దేవుడు నన్ను ఈ ఊరు వదలి వెల్లిపోమంటున్నారు, ఉదయాన్నే మనం వెళ్ళిపోతున్నాం అంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు అడుగకుండా భర్తను వెంబడించింది ఆ తల్లి! అందుకే ఆమె విశ్వాసులకు తల్లి అయ్యింది. ఇలాంటి విధేయత ప్రతీ స్త్రీకి ఉండాలని పరిశుద్ధాత్ముడు పౌలుగారి ద్వారా, పేతురు గారి ద్వారా వ్రాయించారు. శారమ్మ తనభర్తను నా యజమానుడా! అని పిలిచేది. మీరు ఏమని పిలుస్తున్నారు మీ భర్తలను? ఒరేయ్ అనా? పేరు పెట్టా? నీ భర్తను గౌరవిస్తున్నావా ? దూషిస్తున్నావా? వేదిస్తున్నావా? సాధిస్తున్నావా చీరల కోసం, నగలు కోసం!! శారమ్మ తన భర్తకు లోబడింది అందుకే రాజకుమారి అని పిలువబడింది.  రాణియైన వస్తి, తన భర్తకు లోబడలేదు. విందుకు రమ్మని కబురు పెట్టినా రాలేదు. అందుకే పట్టపురాణిగా ఉండకుండా త్రోసివేయబడింది. విడాకులు ఇవ్వబడింది. ఎస్తేరు 1; ఎస్తేరు తనభర్తకు లోబడి నడచుకొంది. తద్వారా తన జనాంగాన్ని మరణం నుండి తప్పించింది.

 

   అననీయ భార్య సప్పీర భర్తకు ఏం చెప్పిందో తెలియదు. సగం దాచుకొనిసగం తెచ్చారు. దేవుని సన్నిధిలోనే చచ్చారు.

 

   ప్రియ రక్షించబడిన స్త్రీలారా! మీ భర్తలకు లోబడియుంటున్నారా? శారమ్మలా లోబడుతున్నారా? వస్తిలా తిరగబడుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొనండి! మీ భర్తకు లోబడి శారమ్మ పిలిచినట్లు నా యజమానుడా అని పిలిచి, గౌరవించి, శారమ్మ గారు పొందుకున్నట్లు దీవెనలు పొందుకోండి!

 

   అంతేకాకుండా నగలు ధరించుకోవడంలాంటివి కాదు గాని, అక్షయాలంకారాలు ఐన సాదువైన, మృదువైన మనస్సులను, స్వభావాలనే అలంకారాలుగా ధరించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*84వ భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-26*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:3--6

3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 

ఇక తరువాత జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం వెలగల వస్త్రాలు వేసుకోవడం కాకుండా సాధువైన మృదువైన స్వభావమే అక్షయాలంకారముగా ఉండాలి స్త్రీకి అంటున్నారు!

ఒకసారి మూడవ వచనం చూసుకుందాం!

జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, .... అనగా జడలు అల్లుకోవడం- ఆఫ్రికా మరియు అమెరికా దేశాలలో ఇప్పటికీ స్త్రీలు ఒకటి కంటే ఎక్కువ జడలు, వివిధ రకాలైన జడలు వేసుకుంటారు. వాటికోసం పేతురు గారు చెబుతున్నారు!

ఇక బంగారు నగలు పెట్టుకోవడం చేయకూడదు అంటున్నారు!

వస్త్రాలు ధరించుకోవడం అనగా తిమోతి పత్రికలో వ్రాసిన విధంగా వెలగల వస్త్రాలు ధరించి షోకు చెయ్యకూడదు అని అర్థం!

అలాంటివి మీకు అలంకారాలుగా ఉండక అనగా అలాంటివి చేయకూడదు అని అర్థం!

 

Isaiah(యెషయా గ్రంథము) 3:16,17,18,19,20,21,22,23,24

16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.

18. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

 

1 Timothy(మొదటి తిమోతికి) 2:9,10

9. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

10. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

 

స్త్రీలు జడలు వేసుకోవడం వల్ల తమ భర్తల్ని క్రీస్తుకోసం సంపాదించలేరు. తమ హృదయాలను సరిచేసుకుని అలంకరించుకోవడమే దానికి మార్గం. బంగారు నగలవల్ల అది సాధ్యపడదు గానీ దేవుని పట్ల భయభక్తులే దానికి ఉపాయం. మంచి బట్టలవల్ల కాదు, వారిలోని మనో సౌందర్యం వల్లే అలా చేయగలరు. బయటి సౌందర్యం అంతటికన్నా మిన్న అయిన అంతరంగ సౌందర్యం వేరొకటి ఉంది. ఆ అందం ఎప్పుడూ వాడిపోనిది.

సామెతలు చివరి అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. నిజంగా ఈ స్త్రీ చాలా అందమైనది

 

Proverbs(సామెతలు) 31:10,11,12,13,14,15,16,17,18,19,20,21,22,23,24,25,26,27,28,29,30,31

10. గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

11. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

12. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.

13. ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.

14. వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.

15. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.

16. ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.

17. ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును

18. తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.

19. ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.

20.దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును

21. తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.

22. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.

23. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.

24. ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును.

25. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.

26. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

27. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి

29. యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.

30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును

31. చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

 

కాబట్టి స్త్రీలు ఇలాంటి అంతరంగ సౌందర్యం కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది గాని నగలు వేసుకుని వెలగల వస్త్రాలతో సంగారించుకోమని చెప్పడం లేదు!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*85 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-26*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:3--6

3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం వెలగల వస్త్రాలు వేసుకోవడం కాకుండా సాధువైన మృదువైన స్వభావమే అక్షయాలంకారముగా ఉండాలి స్త్రీకి అంటున్నారు!

 

బంగారు నగలకోసం ఇంకా వివరంగా చూసుకుందాం!

ముందుగా ఒక సన్నివేశం చూసుకుని ముందుకు పోదాం!

            

ఆదికాండం 35:110

1. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా

2. యాకోబు తన యింటివారితోను తనయొద్ద నున్న వారందరి తోను మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

3. మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నాశ్రమ దినమున నా కుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.

4. వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.

5. వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణములమీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.

6. యాకోబును అతనితో నున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి.

7. అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి చోటికి ఏల్బేతేలను పేరుపెట్టిరి.

8. రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్అను పేరు పెట్టబడెను.

9. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను.

10. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను.

 

  దేవుడు చెప్పిన మాట విని యాకోబు గారు వచ్చి తన భార్యలతో తన పిల్లలతో తన పనివారితో అంటున్నారు- బయలుదేరండి మనం ప్రాంతం వదిలేసి బేతెలు వెళ్తున్నాము! అక్కడ మన దేవునికి అనగా నా ఆపదలో నేను మ్రొక్కుకున్నప్పుడు నా శ్రమ దినమందు నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండి నన్ను నడిపించిన దేవునికి బలిపీటం కడదాము! అయితే మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారేయాలి, ఇది మొదటిది, రెండు మిమ్మును మీరు శుద్ధి చేసుకోవాలి, మూడు: మీ వస్త్రాలు మార్చుకోవాలి! మూడు పనులు చెయ్యమంటున్నారు!

 

ఇక్కడ తన జీవితంలో మొట్టమొదట సారిగా యాకోబు గారు- తన తప్పును తాను తెలిసికొని తన భార్యలతో, తన పిల్లలతో ఇంకా తన పనివారితో చెబుతున్నారు- మీరు మీ దగ్గర నున్న అన్యదేవతలను తీసి పారెయ్యండి! ఇక మీ సిరియా బొమ్మలు విగ్రహాలు పారెయ్యండి! ఏకైక నిజ దేవుడైన యెహోవా దేవుణ్ణి మనం ఆరాధించాలి! ఇప్పుడు ఆయనకు బలిపీటం కట్టాలి! అలా చెయ్యాలంటే ముందుగా మీ దగ్గరనున్న, మీరు సిరియా నుండి మోసుకుని వచ్చిన అన్య విగ్రహాలు తీసిపారెయ్యండి! మనిషి జీవితంలో దేవుని దగ్గరకు చేరాలంటే మొదటగా మనిషి- తన దగ్గర ఉన్న విగ్రహం ఏదైనా కాని దానిని తీసి పారెయ్యాలి! దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక??? మనము దేవుని ఆలయమై ఉన్నామని బైబిల్ చెబుతుంది...

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17

16. మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:15,16

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

 

దైవజనుడైన యెహోషువా గారు తానూ చనిపోయే ముందు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నారు 24:15, 23  ఇలాంటి స్తిరమైన నిర్ణయం మీరు కూడా తీసుకోవాలి!

Joshua(యెహొషువ) 24:15,23

15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; *మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను*.

23. అందుకతడు ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.

 

 దేవుణ్ణి కలుసుకోవాలంటే ఇది ప్రధమ మెట్టు!

మనకు తెలుసు- లాబాను వచ్చి నీవు పోతే పోయావు గాని నా గృహదేవతను ఎందుకు దొంగిలించి పట్టుకుపోతున్నావు అని అడిగాడు, అప్పుడు అర్ధమై ఉంటుంది, ఎవరో అన్య విగ్రహాలు తీసుకుని వచ్చారు అని! అందుకే మొట్టమొదటసారిగా గట్టిగా స్తిరమైన నిర్ణయం తీసుకుని అందరికీ చెబుతున్నారు- మీరు మీ విగ్రహాలు తీసి పారెయ్యండి!

 

ఇక తర్వాత: మీ వస్త్రాలు మార్చుకొనండి! వస్త్రములు అనగా వేషధారణ! ఇంతవరకు వారు సిరియా వేషదారణలో ఉన్నారు! ఇప్పుడు మీరు ఇశ్రాయేలు దేశం వచ్చారు! హెబ్రీయులు! మీరు హెబ్రీయులు గానే ఉండాలి గాని సిరియనుల భాష గాని సిరియనుల వేషధారణ గాని ఉండకూడదు! దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారణ మాత్రమే చెయ్యాలి అన్యుల వలే, సినిమా యాక్టర్ల లాగ పనికిమాలిన వస్త్రధారణ చెయ్యకూడదు! బిగుతుగా ఉండే బట్టలు వేసుకుని మీ శరీర సౌష్టవం పూర్తిగా కనిపించే పనికిమాలిన బట్టలు వేసుకోకూడదు! అది స్త్రీ గాని పురుషుడు గాని! అదేవిధంగా ద్వితీ 22:5 లో చెప్పినట్లు స్త్రీ పురుషు వేషం వెయ్యకూడదు, పురుషుడు స్త్రీ వేషం వెయ్యకూడదు అని చెప్పినట్లు స్త్రీలు టీ-షర్ట్ జీన్ పేంటులు వెయ్యకూడదు! అలా చేస్తే దేవుని దృష్టిలో శాపగ్రస్తులు అని చెబుతుంది బైబిల్! ద్వితియోపదేశకాండము 22: 5

స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.

అన్యుల ఆచారాలు అన్యుల అలవాట్లు మనం చెయ్యకూడదు! గడ్డం ప్రక్కన కత్తిరించుకోవడం అనగా ఫ్రెంచ్ కటింగ్ లు, ఇంకా హిప్పీ కటింగ్ జిప్పీ కటింగ్లు చేసుకోకూడదు! దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉండాలి! లోకస్తులను చూసి లోకస్తుల వలే వస్త్రాలు వేషాలు వెయ్యకూడదు! ఇదీ దేవుని నియమం! ఇదే చెబుతున్నారు యాకోబు గారు!

నేడు అనేకమంది దైవసేవకుల పిల్లలు ఇలా పనికిమాలిన వేషధారణ వస్త్రధారణ చేసుకుంటూ మందిరాలను సంఘాలను పాడుచేస్తున్నారు! దైవ సేవకులారా! ఇది గమనించండి! సరిచెయ్యండి! ముందు మీ పిల్లలకు చెప్పి అప్పుడు సంఘములో చెప్పమని బ్రతిమాలుతున్నాను!!!

 

సరే, వారేమి చేశారు చూద్దాం!

మొదటగా తన యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తీసివేశారు! దేవునికి స్తోత్రం! రెండు: తమ చెవులకు ఉన్న పోగులను తీసి యాకోబు గారికి ఇచ్చేశారు ఏమి చేస్తావో అది చెయ్యు! వెంటనే యాకోబు గారు అన్య విగ్రహాలను వారి చెవులకున్న పోగులను తీసేసి- వాటిని మస్తకి వృక్షం క్రింద అనగా సిందూర వృక్షం క్రింద గొయ్యి తీసి లోతుగా పాతేశారు. ఇక వాటిని ఎవరూ తీసుకోకుండా!

 

 చూడండి ఇక్కడ వారి విగ్రహాలు తీసేశారు! ఇంకా వారి చెవులకున్న పోగులను తీసేశారు! గమనించండి- సిరియనులు రోజులలో చెవులకు చెవుల చుట్టూ చిన్న చిన్న పోగులు లేక రింగులు లా పెట్టుకునే వారు. నేడు అనేకమంది అమెరికా వారు ఆఫ్రికన్లు పెట్టుకుంటున్నారు- చెవికి కనీసం మూడు నుండి ఐదు చిన్న చిన్న రింగులు ఉంటాయి. అలాంటివి వారు పెట్టుకునే వారు, వాటిని తీసేసి యాకోబు గారికి ఇస్తే ఆయన వాటిని శాస్వతంగా వాటిని పాతేశారు!!!

 

ఆగుదాం ఒకసారి! మీ విగ్రహాలు తీసెయ్యండి,  మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి- మనము దేవుని మందిరానికి వెళ్తున్నాము! అక్కడ బలిపీటం కట్టాలి అంటే వారు మొదటగా విగ్రహాలు తీసేశారు రెండవదిగా వారికున్న నగలు తీసేశారు! ఎందుకు నగలు తీసేశారు అంటే మొదటగా చెవి పోగులు సిరియనుల విగ్రహారాధనకు చెందినవి కాబట్టి! విగ్రహాల ఆరాధన నుండి చెవి పోగులు వచ్చాయి కాబట్టి వారి నగలు తీసిపారేశారు.  అనగా ఏమని అర్ధమవుతుంది అంటే దేవుని ఆరాధనకు వెళ్ళినప్పుడు- దేవుణ్ణి ఆరాదించేటప్పుడు, దేవునికి బలిపీటం అనగా ప్రార్ధనా బలిపీటం కట్టినప్పుడు గాని, స్తుతుల బలిపీటం- స్తుతుల సింహాసనం కట్టేటప్పుడు గాని స్త్రీల ఒంటిమీద గాని పురుషుల ఒంటిమీద గాని నగలు అనేవి ఏవీ ఉండకూడదు! చివరికి మ్యారేజ్ రింగు కూడా ఉండకూడదు! ఇదీ నాకు అర్ధమయ్యింది! నగలు వేసుకుని మందిరానికి రాకూడదు! అవి మీ ఒంటిమీద ఉండగా మందిరంలోకి వచ్చి ప్రార్ధన చెయ్యకూడదు!  ఇదే కాదుసార్- ఇదే పాత నిబంధనలో మరోసారి ఇదే చెబుతున్నారు! ఎవరూ? మోషేగారా! కాదుకాదు సార్! దేవుడే స్వయంగా చెబుతున్నారు! ఇది మనకు నిర్గమ కాండం ౩౩:5 లో ఉంటుంది. మోషేగారు సీనాయి కొండమీద 40 రోజులు దేవునితో ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉంటే - ఈలోగా వారు తమకోసం పోత విగ్రహం చేసుకుని మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దేవుడివి నీవే అంటూ భయంకర విగ్రహరాధన చేస్తూ, భయంకరమైన వ్యభిచారం చేస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటె దేవుడు మోషే గారిని పంపించి- నీ ప్రజలు చెడిపోయారు వారిని చంపేస్తాను అన్నారు! మోషేగారు ఇశ్రాయేలీ ప్రజలకు అడ్డుగా నిలబడి చంపకుండా అడ్డుపడ్డారు! తర్వాత మోషేగారు అయ్యా ప్రజల దోషమును అపరాదాన్ని పాపములు క్షమించండి అని సాష్టాంగనమస్కారం చేస్తూ దేవుని పాదాలు పట్టుకుంటే అప్పుడు అంటున్నారు-  ఇశ్రాయేలీయులు లోబడనొల్లని ప్రజలు, ఒక్కసారి మీ మధ్యకు వచ్చానా, మిమ్మును నిర్మూలం చేసేస్తాను, నేను వారిమీద కోప పడకుండా ఉండాలంటే మీ ఒంటిమీద ఉన్న ఆభరణాలు తీసివేయండి అంటున్నారు దేవుడే!!!!!!

నిర్గమకాండము 33: 5

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు *మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి* అని చెప్పుమనెను.

 

వెంటనే 6 వచనంలో హోరేబు కొండ యెద్ద తమ ఆభరణములు తీసివేసిరి!!

 

ఇక్కడ కూడా ఇశ్రాయేలు వారు తమ నగలను ఆభరణాలు తీసి వేశారు! *దేవుణ్ణి ఆరాధించాలి అంటే మీ ఒంటిమీద ఆభరణాలు ఏవీ ఉండకూడదు*! అదే కదా క్రొత్త నిబంధనలో కూడా చెబుతున్నారు రెండుసార్లు...

1పేతురు 3: 3

జడలు అల్లుకొనుటయు, *బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక*,

1పేతురు 3: 4

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

 

1తిమోతికి 2: 9

మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను *బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక*,

1తిమోతికి 2: 10

దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

 

బంగారు నగలు ఆభరణాలు వెలగల వస్త్రాలు ఇవిమీకు అలంకారముగా ఉండక అంటే వేసుకోకూడదు అని అర్ధం! అలా కాకుండా ఆభరణాలు వేసుకోకూడదు అని ఎక్కడుంది అనే అడిగే భయములేని క్రైస్తవులారా, భిషప్ లారా, కాపరులారా, దైవసేవకులారా, ఆడ పాష్టర్ లారా, ఆడ భిషప్ లారా! ఇది మీరు చదువలేదా! ఇది మీకు అర్ధం కాలేదా?? దేవుని వాక్యాన్ని లేఖనాలను మీకు అనుకూలంగా బోధించుకుంటూ మీ పొట్టలు పోసుకుంటున్న సేవకులారా, జాగ్రత్త! ఉన్నది ఉన్నట్లు బోధించండి! *నగలు ఆభరణాలు వేసుకుని దేవుని ఆరాధించడం ఖండించండి! ఇది దేవునికి అనుకూలం కాదు అని గ్రహించండి! ఆరాధనకు వెళ్లినప్పుడు ఒంటిమీద విధమైన విగ్రహము గాని నగలు గాని ఉండకూడదు*! సిరియా దేశంలో ఆభరణాలువిగ్రహారాధన నుండి వచ్చినట్లే మన దేశంలోను అన్ని ఆభరణాలు నగలు  వివిధ దేవతల పూజలనుండి వచ్చినవే! కాబట్టి ఆభరణాలు ధరించకూడదు. మంగళసూత్రం కూడా ధరించకూడదు!

 

విధంగా గానే యాకోబు గారు ఆయన పరివారం వెళ్లి అక్కడ బలిపీటం కట్టి ఆరాధించారు! అలా ఆరాదించినప్పుడే దేవుడు మరోసారి యాకోబు గారితో మాట్లాడి దీవిస్తున్నారు!

 

మరి నీవు నీ విగ్రహాలను వదిలేస్తావా? అన్యుల విగ్రహారాధన నుండి వచ్చిన నగలను ఆభరణములు విసర్జించి దేవుణ్ణి నిజంగా ఆరాదిస్తావా!

*మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే మీ నగలను తీసి పారెయ్యమని! మీరు నగలతో ఆభరణములతో ఆరాధన చేస్తే మీరు అశుచిగా అపరిశుద్ధంగా ఆరాదిస్తున్నట్లు అర్ధమవుతుంది*! కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాదిద్దాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*86 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-26*

*పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి?*

1పేతురు 3:3--6

3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 

 జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం వెలగల వస్త్రాలు వేసుకోవడం కాకుండా సాధువైన మృదువైన స్వభావమే అక్షయాలంకారముగా ఉండాలి స్త్రీకి అంటున్నారు!

 

1తిమోతి 2:810

8. కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

9. మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

10. దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.

 

      ప్రియ దైవజనమా! ఇక్కడ 1) పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చెయ్యాలి; 2). స్త్రీలు అణుకువ, స్వస్తబుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతో వేసుకోవాలి తప్ప వెలగల వస్త్రములు గాని బంగారు వెండినగలు ధరించుకోకుండా దైవభక్తిగల స్త్రీలకు మాదిరిగా సత్క్రియలు అనే అలంకారాలు వేసుకోవాలి అంటున్నారు!

 

   స్త్రీలు ఎలా ఉండాలి అనేది చూసుకుని తద్వారా దైవసేవకురాళ్ళు ఎలా ఉండాలో ధ్యానం చేసుకుందాం! స్త్రీలు అణుకువయు, స్వస్తబుద్ధిగలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని ....మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకోగూడదు; ఇది మొదటిది. సాధారణంగా మన భారతదేశ స్త్రీలకూ వెలగల చీరలు, రెండవదిగా బంగారునగలు అంటే చాలా ఇష్టం! దానికోసం ఎంతో ఆరాటపడుతూ భర్తను సాధిస్తూ ఉంటారు! అయితే బైబిల్ సెలవిస్తుంది వెలగల చీరలు ధరించనే కూడదు! ఎందుకు అనేది చివరలో చెబుతాను వాక్యాధారముగా! కాని దురదృష్టం ఏమిటంటే అనేకులు వెలగల వస్త్రముల వెనుక పరుగెత్తుచున్నారు, విచారం ఏమిటంటే దైవసేవకురాళ్ళు చాలా ఎక్కువగా వెలగల బట్టలు వేసుకుంటున్నారు. ఇది కేవలం స్త్రీలకోసమే చెప్పారా దేవుడు? పురుషులకు చెప్పలేదా అంటే పురుషులకు కూడా కలిపి చెప్పారు పరిశుద్ధాత్ముడు! అనేకమంది సేవకులు నేడు వారు వేసుకునే కోట్లు వేలు, లక్షలు కూడా ఖర్చుచేస్తున్నారు. అనేకమంది సేవకులు/ సేవకురాండ్రు నేడు టివీలో గాని, బహిరంగ సభలలో గాని ప్రసంగం చేసేముందు బ్యూటీ పార్లర్ కి వెళ్లి, సింగారించుకుని ప్రసంగాలు చేస్తున్నారు. నేనంటాను వీరిలో యెజెబెలు ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ నాశనానికి దారితీస్తుంది. గమనించాలి! పౌలుగారు పెళ్లి చేసుకోలేదు అలాగే అంటారు, అనవచ్చు, మరి అదే పరిశుద్ధాత్ముడు పెళ్లి పిల్లలు గల పేతురు గారిద్వారా కూడా అదే వ్రాయించారు కదా! ఏమీ తేడా లేదు! 1పేతురు :--4..

3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,

4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. .

 

   కాబట్టి ప్రియ దైవసేవకులారా! దైవసేవకురాలులారా! దయచేసి దేవుడు/ బైబిల్ చెప్పినట్లు వెలగల వస్త్రములు వేసుకోవద్దు!

ఇక రెండవదిగా బంగారములతో గాని ముత్యములతో గాని అలంకరించుకోవద్దు! అనగా ఆభరణాలు పెట్టుకోవద్దు! గమనించాలి కొంతమంది ఆభరణములు ధరించుకోగూడదు అని బైబిల్ లో ఎక్కడుంది అని అడుగుతున్నారు. దయచేసి వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ఇది అర్ధం అవుతుంది తప్ప నిర్గమ కాండంలో దేవుడిచ్చిన పదిఆజ్నల మాదిరిగా నీవు ఆభరణములు పెట్టుకోగూడదు అని డైరెక్టు ఆజ్నకోసం చూడకూడదు! మరికొంతమంది నన్ను అడిగారు, ముఖ్యంగా దైవసేవకుల కుమార్తెలు దేవుడు మన బయట అలంకారాలు పట్టించుకుంటాడా? మన ఆత్మ శుద్ధిని చూస్తాడు తప్ప అంటున్నారు! మరి యెషయా :1623 లో ఎందుకు పట్టించుకున్నారు దేవుడు?..... Isaiah(యెషయా గ్రంథము) 3:16,17,18,19,20,21,22,23,24,25,26

16. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;

17. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.

18. దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను

19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను

20. కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను

21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను

22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను

23. చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

24. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

25. ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు

26. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.

 

అందుచేతనే దేవుడు పౌలుగారిని, పేతురుగారిని ఉపయోగించుకుని మాటలు రాసారు! విశ్వాసులైన స్త్రీపురుషులు సామాన్యమైన దుస్తులు ధరించి, మర్యాద పూర్వకంగా మెలగాలి అనేది దేవుని ఉద్దేశ్యం! అంతేతప్ప బిగుతైన బట్టలు ధరించి, తమ శరీర శౌష్టవం అందరికీ కనబడాలి అని తలంచి వస్త్రధారణ చేస్తే దేవుడు యెజెబెలును శిక్షించి నట్లు స్త్రీ-పురుషులను తప్పకుండా శిక్షిస్తారు! వెలగల బట్టలు వేసుకుని స్టేటస్ సింబల్ అంటే నీకు స్టేటస్ లేకుండా చేస్తారు దేవుడు జాగ్రత్త! మరొక సేవకుడంటాడు మనం రారాజు కొడుకులం కుమార్తెలం! రారాజుల్లాగా రాజకుమారుడులాగా అలంకరించుకోవాలి అంటున్నారు. దయచేసి దీనికి వాక్యాధారమేదైనా చూపించగలరా ఇలా చెప్పే దైవసేవకుడైనా? తగుమాత్రపు వస్త్రములే వేసుకోమన్నారు.  తిమోతికి చెబుతూ పౌలుగారు అన్నివిషయాలలోనూ మితంగా ఉండమన్నారు. అన్ని విషయాలు అనగా వస్త్రధారణ మరియు అలంకరణ కూడా వస్తుంది.

 

   *దైవభక్తిగల స్త్రీలు పురుషులు బంగార నగలు పెట్టుకోగూడదు, ఆభరణములు పెట్టుకోగూడదు! పురుషులు ఉంగరాలు కూడా ధరించకూడదు! వెలగల వస్త్రములు , వెలగల చీరలు, వెలగల సూట్లు, బూట్లు వేసుకోగూడదు. ఎందుకంటే లోకంలో అనేకమంది పేదవారు, మధ్యతరగతి వారు సరైన తిండిలేక,బట్టలు లేక భాధపడుతున్నారు కదా! వారికి వీటికి ఖర్చుపెట్టేసొమ్మును ఖర్చుచేసి వారికి అన్నవస్త్రాలు కలిగించాలి! ఇదే దేవుని ఉద్దేశ్యం! అందుకే వెలగల వస్త్రాలు, వెండిబంగారాల ఆభరణాలు ధరించడం మానేయడం! దానికి ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తుప్రభులవారు!* 2కొరింథీ 8:9 .... చూడండి

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

 

 ఆయన అంత ధనవంతుడు ప్రకాశమానుడై ఉండి కూడా మనకోసం దరిద్రుడై పోయారు. పశువుల శాలలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి, కాయకష్టం చేసి బ్రతికారు. నక్కలకుబొరియలు, ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని నాకు తలవాల్చుకొనుటకు స్థలం లేదు అన్నారు.మత్తయి 8:20; లూకా 9:58; చివరకు ఆయన చనిపోయినప్పుడు అద్ది సమాధిలో ఉన్నారు. ఆయనే అంత దరిద్రుడుగా, సింపుల్ గా జీవిస్తే మనం కూడా సింపుల్ గా జీవించాల్సిన అవసరం ఉందా లేదా? ఫిలిప్పీయులకు 2: 7

మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

 

 కాబట్టి యేసయ్య జీవించినట్లే మనం కూడా మనకోసం, మన స్టేటస్ చూపించుకోడానికి, మన శరీరాస, నేత్రాస, జీవపుఢంభం నెరవేర్చుకోడానికి కాకుండా దేవునికోసం సమస్తము వదలుకుని ఆయనకోసం బ్రతక బద్దులమై ఉన్నాము! మత్తయి 10:3839 ..

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. .;

లూకా 14:౩౩...

33. ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ..;

 

     కాబట్టి వెండిబంగారు ఆభరణాలు, వెలగల వస్త్రాలమీద పెట్టే ఖర్చు మొదటగా పేదలకు ఖర్చుపెట్టి, రెండవదిగా పేదలకు అన్యులకు సువార్త ప్రకటించడానికి ఖర్చుపెట్టడం ఎంతో శ్రేష్టం!

1తిమోతి 6:68...

6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది.

7. మన మీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.

8. కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. . 

భూమిమీద కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకోడానికి విశ్వాసులంతా/ దైవజనులు కూడా ప్రయత్నించాలి మత్తయి 6:1921

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ;

 

  అయితే ఏమి ధరించుకోవాలి? అణకువ, స్వస్తబుద్ధి, ఇంకా దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకూ తగినట్లుగా సత్క్రియలు అనే ఆభరణములను ధరించుకోవాలి అని హితవు చెబుతున్నారు పౌలుగారు!

 

  చివరిగా నగలు పెట్టుకోవడం దేవునికి వ్యతిరేఖమా అని అడిగితే నా ఉద్దేశంలో అది దేవునికి వ్యతిరేఖమే! ఎలాగో చెప్పనీయండి! స్త్రీలు ఎప్పుడూ మరి రిబ్కాకు ముక్కు కమ్మి నగలు ఎందుకిచ్చారు అని అడుగుతారు తప్ప పౌలుగారు, పేతురు గారు వ్రాసినది గ్రహించరు, వీరిద్దరూ బంగారు ఆభరణాలు దరించకూడదు అని వ్రాసారు. ఇక ఆదికాండం .35:1--4.. ప్రకారం ఆభరణాలు పెట్టుకోవడం అనేది దేవుని దృష్టిలో అపవిత్రత! యాకోబుగారు మిమ్మును మీరు శుద్ధిచేసుకోండి అంటే వారు శుద్ధిచేసుకుని ఆభరణాలు తీసివేశారు. అంటే ఆభరణాలు ఉంటే అపవిత్రులు అనిఅర్ధం వస్తుంది కదా!

ఇక నిర్గమకాండం 33:4--6 లో దేవుడు చెబుతున్నారు మీ ఒంటిమీదున్న ఆభరణములు తీసివేయుడి! .Exodus(నిర్గమకాండము) 33:4,5,6

4. ప్రజలు దుర్వార్తను విని దుఃఖించిరి; ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.

5. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.

6. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ....

మరి దేవునికి ఇష్టం లేనివి ఎందుకు వేసుకోవడం!

 

గమనించండి ఆభరణములు వేసుకుని మొదటగా మీ సోకు ప్రదర్శించకూడదు! మీ మాటలలో చేతలలో దేవున్నే ప్రతిబింభించాలి!

ఇక రెండవదిగా మన భారతదేశంలో పెట్టుకునే ప్రతీ ఆభరణం కూడా ఏదో ఒక అన్యదేవతారాధన బట్టి వచ్చింది. ప్రతీ ఆభరణం ఒక దేవతకు చెందినది. అందుకే వేసుకోకూడదు!

మూడవదిగా దేవుడు తన రూపులో మనిషిని చేసుకున్నారు. అయితే ఆభరణాలు అనేవి ప్రతీ విగ్రహానికి ఏదో ఒక ఆభరణం ఉంటుంది. దేవుడు నేను మనిషిని నా రూపులో చేసుకుంటే వీరు విగ్రహాల మీదనుండే నగలు / ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అని దేవుడే అక్కడ ఆభరణాలు తీసివేయమన్నారు. అవి వేసుకుంటే దేవుని రూపులో ఉండే మీరు కనబడకుండా మీమీదనున్న విగ్రహాలు కనిపిస్తాయి! అందుకే ఆభరణాలు పెట్టుకోగూడదు! గమనించాలి ఆభరణాలు విడచిపెట్టడం వ్యక్తిగత సమర్పణకు సాదృశ్యం కాదుగాని వ్యక్తిగత పరిశుద్ధతకు నిదర్శనం!

 

కాబట్టి ప్రియ దైవసేవచేసే స్త్రీలారా! విశ్వాసులారా! ఇది మిమ్ములను బాధపెడుతుండవచ్చు గాని ఒకసారి సత్యమును గ్రహించాలని,  దయచేసి వెండిబంగారాలు పెట్టుకోవద్దనియు, తగుమాత్రపు వస్త్రములే ధరించుకోమని ప్రభువు పేరిట వినయపూర్వకంగా మనవి చేస్తున్నారు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*87 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-27*

*పెండ్లయిన పురుషులు ఎలా ఉండాలి?*

1పేతురు 3:5--7

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

7. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.

8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

   *పెండ్లయిన స్త్రీ ఎలా ఉండాలి*

 

        *గతభాగం తరువాయి*

 

పెళ్లయిన స్త్రీల కోసం ఇంకా పేతురు గారు చెబుతున్నారు 5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

 

వచనాలు జాగ్రత్తగా చూసుకుంటే దేవున్ని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సొంత భర్తలకు లోబడి ఉండటం చేత అలంకరించుకున్నారు అంటున్నారు.  మొదటగా దేవున్ని ఆశ్రయించిన స్త్రీలు, రెండవదిగా పరిశుద్ధ స్త్రీలు!

స్త్రీ అయితే తమ భర్తకు లోబడుతుందో ఆమె దేవున్ని ఆశ్రయిస్తుంది, ఎందుకంటే పౌలుగారు రాస్తున్నారు స్త్రీకి యజమాని భర్త, భర్తకు యజమాని యేసుక్రీస్తు ప్రభులవారు, యేసుక్రీస్తు ప్రభులవారికి తండ్రియైన దేవుడు! కాబట్టి స్త్రీ మొదట భర్తకు, తర్వాత దేవునికి లోబడియుండాలి. భర్తకు లోబడకుండా, దేవునికి లోబడటం అనగా దేవున్ని ఆశ్రయించడం లేదు అని అర్థం!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 11:3

3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

 

ఎఫెసీయులకు 5:22

స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.

ఎఫెసీయులకు 5:24

సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

 

తీతుకు 2:4

యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు,

 

తరువాత ఇలా భర్తకు లోబడి ఉండటమే స్త్రీ కి నిజమైన అలంకరణ!!! మీదన జడలు అల్లుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం కాకుండా మృదువైన స్వభావం సాధువైన స్వభావమే అలంకరణ అని ఇలా చెబుతూ శారమ్మ గారు తన భర్తను యజమానుడా అని పిలిచేవారు. అలా పిలుస్తూ తననుతాను అలంకరించుకున్నారు అని చెబుతున్నారు!

పవిత్రత, దేవునిలో నిరీక్షణ, విధేయత గల మనసు ఇవే ఒక విశ్వాసురాలైన స్త్రీలో దేవుడు చూడగోరే సౌందర్య లక్షణాలు. శారమ్మగారు అలా చేశారు. కాబట్టి ఎవరైతే అలా భర్తలకు లోబడిఉంటారో వారు 1) దేవున్ని ఆశ్రయిస్తున్నారు, 2) పరిశుద్ధత కలిగిఉన్నారు, 3) నిజమైన అలంకరణ కలిగి ఉన్నారు. 4) ఇలా చేసే స్త్రీలు శారమ్మగారి సంతానం!!!

అలా భర్తకు లోబడకుండా, ఇంకా బంగారు నగలు పెట్టుకోవడం లాంటివి చేస్తే శారమ్మ సంతానం కాకుండా హాగరు సంతానమో దయ్యం సంతానమో అవుతారేమో!!!!!

 

   *పెండ్లయిన పురుషులు ఎలా ఉండాలి?*

 

7. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.

ఇంతవరకూ పెళ్లయిన క్రైస్తవ స్త్రీలతో మాట్లాడారు ఇప్పుడు పెళ్లయిన క్రైస్తవ పురుషులతో చెబుతున్నారు!

జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.

 

Ephesians(ఎఫెసీయులకు) 5:25,26,27,28,29,33

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.

 

కొలస్సీయులకు 3:19

భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.

 

మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తమ ప్రార్థనలకు జవాబు రావాలని భార్యాభర్తలు అనుకుంటే ఒకరిపట్ల ఒకరు ప్రవర్తించే విషయంలో చాలా జాగ్రత్తపడాలి. తన భార్యపట్ల చెడుగా ప్రవర్తించే భర్త గానీ తన భర్తకు విధేయురాలు కావడానికి ఇష్టపడని భార్య గానీ చేసే ప్రార్థనలు దేవుడు వినకపోవచ్చు. ఇది ఒక కోణం!

 

మరొక కోణం కూడా కనిపిస్తుంది నాకు! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ప్రియులారా!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:3,4,5,6

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

6. ఇది నా హితోపదేశమేగాని (లేక,సెలవేగాని) ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.

 

ఇక్కడ భార్యాభర్తల యొక్క శారీరక సంసారం కోసం చెబుతున్నారు పౌలుగారు! కాబట్టి పేతురు గారు కూడా దీనికోసమే చెబుతున్నారు అనిపిస్తుంది నాకు! నా అభిప్రాయం మాత్రమే! యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.  అలాగే దేవునికి ప్రార్థన కూడా చెయ్యండి అంటున్నారు!

 

ఇకబలహీనమైన ఘటము స్త్రీలు శారీరకంగా బలహీనులు గాని మానసికంగా కాదు. వారి స్థితి కూడా బలహీనమైనదే. లోబడి విధేయత చూపడం వారి వంతు.

 

ఇక జ్ఞానము చొప్పున కాపురము చేయడం అంటే!!!!!!????

ఇది తెలియకే ప్రపంచంలో పురుషులు పెనం మీదన వేసిన అట్టులా కాలిపోతున్నారు భార్యల చేత!!! 😂😀

ఒక దైవభక్తుడు ఏమని చెప్పారు అంటే జ్ఞానము చొప్పున కాపురమంటే ఏమీ కాదు భార్య చెప్పినట్లు చేయడమే! అంత గొప్ప భక్తుడైన అబ్రాహాము గారు విలవిలలాడుతుంటే, దేవుడే అబ్రాహాము గారితో చెప్పారు- కొడుకా నీ భార్య శారా చెప్పినట్లు చేయమని! అదే జ్ఞానము! ఇది నవ్వుకోడానికి అనుకోండి!

నా ఉద్దేశం ప్రకారం జ్ఞానం చొప్పున కాపురం అనగా భార్యాభర్తలు మంచి ప్రేమానురాగాలు కలిగి, ఒక అవగాహనకు వచ్చి జీవించడమే! భర్తకు ఏది నచ్చదో భార్య అది చేయకూడదు! భార్యకు ఏది నచ్చదో భర్త అది చేయకూడదు! ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు!

చాలా మంది స్త్రీలకు భర్తకు నచ్చినట్లు ఉంటారు భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా చేసుకుంటూ చాలా సాక్రిఫైస్ చేస్తారు గాని అత్తమామలను చూడటానికి ఇష్టపడరు. అయితే కొంతమంది అత్తమామలు కోడలిమీద పెత్తనం చేస్తూ పనిమనిషిలా చూస్తూ ఉంటారనుకోండి. అయితే మంచి అత్తమామలను కూడా చూడటానికి కొంతమంది కోడల్లు ఇష్టపడటం లేదు తమ ప్రైవసీ కి అడ్డువస్తున్నారు అని! ఇక్కడే భర్తలకు భాద కలుగుతుంది! ఇందాక పెనం మీద కాలుతున్న అట్టు అన్నాను కదా! ఇలాంటి పరిస్తితులలోనే! నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా అంటే భర్త ఏం చెబుతాడండి! నీకు నేను కావాలా నీ పెళ్లాం కావాలా అంటే కొడుకు ఏం చెబుతాడండి!!! ఇద్దరూ కావాలి! అలాంటప్పుడే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి!

నేనైతే అమ్మ చెప్పింది సగం, భార్య చెప్పింది సగం చేసేవాడిని 😂😂😀.

 

    మరో విషయం కూడా చెప్పి ముగిస్తాను. నేను కూడా జ్ఞానము ఉపయోగించాను ఒకసారి! నా పెళ్లయిన మొదట్లో నా భార్యకు, మా అమ్మగారికి మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పేతురు గారు జ్ఞానము చొప్పున కాపురం చెయ్యమన్నారు కదా ఒక చిన్న టెక్నిక్ వాడాను. అప్పుడు నాది చాలా చిన్న ర్యాంకు షిప్ లో! నేను పనిచేసే షిప్ చాలా ప్రమాదకరమైన ఇంకా క్రూసియల్ జాబ్ చేసేది. అప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నా భార్యను, మా అమ్మగారిని దగ్గర పెట్టి నేను ఎలాంటి షిప్ లో పని చేస్తున్నాను నా జాబ్ ఏమిటి అని వివరించి, నేను ఏమాత్రము ఏమరపాటుగా ఉన్న నేను అయినా స్పాట్ లో చనిపోతాను. డెక్ మీద ఉన్నవారైనా చనిపోతారు. మరి నేను బ్రతికిఉండాలా వద్దా అని అడిగాను! నేను బ్రతికి ఉండాలి అంటే మీకు మీకు మధ్య ఏమైనా ఉంటే మీరే తేల్చుకోండి, నా దగ్గరకు వచ్చిందా నాకేమైనా అయిపోతుంది అన్నాను! ఇంకా నేను కుటుంబంలో ఎలా భాగస్వామినో నా భార్యకూడా అంతే! భార్యలు ఇంట్లో పని మనుషులు తక్కువ వారు కాదు అన్నాను! అంతే రోజు నుండి నా భార్య దగ్గర నుండి గాని నా తల్లి దగ్గర నుండి గాని ఎలాంటి కంప్లైంట్ రాలేదు, సరికదా నా తల్లిదండ్రులను నా భార్య వారు బ్రతికి ఉన్నంతకాలం సొంత తల్లిదండ్రులుగా చూసుకుంది. ఎంతగా అంటే మా అక్కలు కంటే, చివరికి నాకంటే ఎక్కువగా నా భార్య నా తల్లిదండ్రులు ను చూసుకుంది. నా తల్లిదండ్రులు కూడా నా భార్యను నేను ఇంటిదగ్గర ఉన్నప్పుడే కాదు షిప్ లో ఉన్నప్పడు కూడా సొంత కుమార్తె కంటే ఎక్కువగా నిజం చెప్పాలంటే సొంత మనవరాలిని ఎలా ముద్దుగా చూసుకుంటారో అలా చూసుకున్నారు. చివరకు మా అమ్మగారు ప్రాణాపాయం లో ఉన్నప్పుడు ఇంటి తాళాలు వివరాలు అన్నీ అంతమంది ఉన్నా నా భార్యను పిలిచి ఆమె చేతికి ఇచ్చారు.

 

చివరికి నేను చెప్పేది ఏమిటంటే

 1) నీ కోడలిని నీవు నీ సొంత కుమార్తెను ఎలా ప్రేమిస్తావో అలా చూసుకుని ఆమెకు విలువనిస్తే నీ కోడలు నిన్ను సొంత తల్లిదండ్రులు వలే గౌరవించి ఆదరిస్తుంది!

2) నీ భర్తకు నీవు లోబడి గౌరవిస్తే, ఇతరులు కూడా నీ భర్తకు గౌరవం ఇస్తారు. నీవు నీ భర్తకు గౌరవం ఇవ్వకుండా అవమానిస్తే ఇతరులు నీ భర్తను ఈడ్చి ఈడ్చి కొడతారు!

3) నీవు నీ భర్తను రాజులా చూసుకుంటే, నిన్ను నీ భర్త మహారాణిలా చూసుకుంటాడు! నీవు భర్తను గౌరవించకుండా చవటలా చూస్తే నీ భర్తా పిల్లలు నిన్ను ఇంట్లో బట్టలుతికి, వంట వండే పనిమనిషిలాగా  పిల్లలు కనే మెషీన్ లాగ చూస్తారు!

 

చివరకు భర్తలారా! నా అన్నలారా తమ్ముల్లారా! మీ భార్యలను (కేవలం మీ పెళ్ళి భార్యలను మాత్రమే) ప్రేమించండి! వారితో జ్ఞానము చొప్పున కాపురం చేయండి.  వారు మనలను సాధించడం మొదలుపెట్టారా ఇక ఇల్లు నరకమే అయిపోతుంది! మహా దైవజనుడు భక్తుడు అబ్రాహాము గారే తాళలేక పోయారు. మహా జ్ఞాని విద్వాంసుడు చక్రవర్తి సొలొమోను గారే తట్టుకోలేక సరెండర్ అయిపోయారు! నీవు నేను ఎంత?!!!

ప్రార్థనతో వాక్యముతో కుటుంబాలను కట్టుకోండి! ఇంటిలో పనికిమాలిన టీవీ బందుచేసి, సెల్ఫోన్ పీకనొక్కి  ప్రేమానురాగాలను వెలికితీయండి!

దేవుడు మీ కుటుంబానికి యజమానిగా చేయండి!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*88 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-27*

*పెండ్లయిన పురుషులు ఎలా ఉండాలి?*

1పేతురు 3:8

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

7. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.

8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    *పెండ్లయిన పురుషులు ఎలా ఉండాలి?*

 

        *గతభాగం తరువాయి*

 

ఎఫెసీ 5: 2233

22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.

23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.

30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

31. హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.

32. మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.

33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.          

 

     ఇక 25 వచనంలో అంటున్నారు పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అంటున్నారు ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధంగా పురుషుడు స్త్రీని ప్రేమించాలి! క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారు అంటే అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, 26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

28. అటువలెనే పురుషులుకూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

 

ఇంకా అంటున్నారు తమ స్వంత శరీరం లాగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి అంటున్నారు! చూడండి ప్రతీ మనిషి తన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు! దీనికోసం ఉదయాన్నే టిఫిన్, టీలు కాఫీలు, మధ్యాహ్నం బోజనం, రాత్రికి బోజనం, బిరియాణీలు మటన్ చికెన్ పఫ్ లు బూరెలూ గారెలు ఇంకా అబ్బోబ్బో చెప్పలేము! హార్లిక్స్ బోర్న్ విటా చెత్తాచెదారం అన్నీ పెడతాము! దేనికోసం? అంటే మన దేహాన్ని పోషించుకోవడం కోసం ఆరోగ్యం కోసం! ఇంకా జిమ్ కి వెళతాడు వ్యాయామం చేస్తాడు! ఎన్నెన్నో చేస్తారు! నీవు నీ దేహాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి అంటున్నారు! ఎందుకంటే బైబిల్ చెబుతుంది వారిద్దరూ ఏక శరీరమై ఉందురు!

 31 వచనం హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు. కాబట్టి నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే!

 

*ఒకవేళ నీ భార్యను నీవు కొడితే తిడితే నిన్నునీవు కొట్టుకున్నట్లే నిన్ను నీవు తిట్టుకున్నట్లే! అయ్యా ఒకసారి గమనించండి : ఎవడైనా తన దేహాన్ని తానే కొట్టుకుంటే లేక తన వ్రేలిని తానే రాతితో కొట్టేసుకుంటూ ఉంటే వారు ఏమై ఉండాలి? అయితే వాడు దయ్యం పట్టిన వాడైనా అయి ఉండాలి, లేకపోతే పిచ్చోడు అయినా అయి ఉండాలి! కాబట్టి ఇప్పుడు ఎవడైనా తన భార్యను కొడితే, తిడితే వాడు తప్పకుండా రెండు కేటగిరీ లలో ఏదో ఒక గ్రూపు కి చెంది ఉండాలి! పురుషులకు కోపమొస్తే రానియ్యండి నేను చెప్పేది నిజము మరియు బైబిల్ దీనికి రుజువు చెబుతుంది!*

 

   కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి! తప్ప శిక్షించ కూడదు! ఒకవేళ ఆమె ప్రవర్తన బాగోలేక పోతే అప్పుడు ఆమెతో మాట్లాడి ఆమెను సరిచేయాలి అంతేతప్ప ఇలా కొట్టకూడదు అని గ్రహించాలి! (అయితే కొంతమంది స్త్రీలు తమ భర్తలను ఏమంటారో ఎలా మాట్లాడతారో తెలియదు. మరి అలాంటి వారిని శిక్షించాలేమో నాకు పూర్తిగా తెలియదు. మా సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఒకసారి అన్నయ్య గృహ దర్శనాలకు వెళ్తే ఆమె మూతి బాగా వాచిపోయి ఉంది. ఏమ్మా మూతి అలా వాచిపోయిందే ఎక్కడైనా పడిపోయావా అని అడిగాడంట అన్నయ్య! ఇంకేముంది అన్నయ్యా- వాడున్నాడు కదా వాడు కొట్టేశాడు అన్నది. ఏమయ్యా ఎందుకు కొట్టేశావు మీ ఆవిడను అని అడిగితే ఆయన చెప్పాడు: అన్నయ్యా- నేను షేవింగ్ చేసుకుంటున్నాను, అద్దం మరిచిపోయాను దయచేసి తెచ్చి ఇవ్వు అని బాత్రూమ్ నుండి పిలిచాను! నీకు కాళ్ళు చేతులు లేవా, వెళ్ళి తెచ్చుకో అన్నది, కొంచెం తీసుకురా అంటే గీర సమాధానం చెప్పింది, నేను వస్తే బాగుండదు అన్నాను, నీవు మగాడివైతే వచ్చి కొట్టరా అన్నాది! నన్ను నేను తడిమి చూసుకున్నాను, మూతిమీద మీసం, ఇంకా మగాడి కున్నవన్నీ నాకున్నాయి, వెళ్ళి ఒక్కటిచ్చాను అంతే మూతి వాచిపోయింది అని చెప్పాడు. మరి ఇలాంటి వారిని ఏమి చేయాలో ఎలా హేండిల్ చేయాలో మీ విజ్నతకే వదిలేస్తున్నాను!)

 

కాబట్టి భర్త భార్యను ప్రేమించాలి!

 

ఇంతకీ భర్త భాధ్యతలు ఏమిటి?

 

మొదట భర్త అంటే భరించేవాడు. ఇంకా పోషించే వాడు, ఇంకా సంరక్షించే వాడు! అనగా భార్యను పోషించాలి! భరించాలి! అనగా ఆమె సూటిపోటు మాటలు భరించాలి! ఊరికనే ఏడ్చేస్తూ ఊరికనే ఉడికిపోతూ ఉంటుంది! ఓర్పుతో ఆమెను భరించాలి! ఆమె ప్రేమను తట్టుకోలేం ఆమె కోపాన్ని తట్టుకోలేము! అందుకే ఆమెతో జ్ఞానంతో కాపురం చేయమని చెబుతుంది బైబిల్! ఒక బైబిల్ పండితుడు అన్నాడు- జ్ఞానంతో కాపురం చేయడమంటే ఎక్కడో ట్రైనింగ్ తీసుకుని పట్టా తీసుకోవడం కాదు, ఆమె చెప్పింది చేసేయడమే జ్ఞానంతో కాపురం చేయడం! లేదంటే నీకు ఫుడ్ బెడ్ రెండూ కట్ అన్నాడు! కాబట్టి అన్నింటినీ భరించాలి!

   ఇంకా ఆమెను సంరక్షించాలి! ఆమె మానాన్ని కాపాడాలి! ఆమె ప్రాణాన్ని కాపాడాలి! ఇంకా ఆమె యొక్క గౌరవాన్ని కాపాడాలి! ఎవరో నీ భార్యను తిడితే నీవు: నేను ఎలాగూ తిట్టలేక పోతున్నాను వారైనా తిట్టనీ అని అనుకోగూడదు! వెంటనే ఆమెకు తోడుగా ఉండాలి! నీవు ఎవడివి రా నా భార్యను అనడానికి అంటూ ఆమెకు సపోర్ట్ చేయాలి! అలాగని ఆమె బుద్ధిలేకుండా  వివేకం లేకుండా షార్ట్ టెంపర్ తో అందరిమీద నోరువేసుకుని పడిపోతూ ఉంటే ఆమెకు సపోర్ట్ చేయమని చెప్పడం లేదు! అప్పుడు ఆమెను సరిచేయాలి! అలా కాకుండా ఆమె న్యాయమైన కారణంతో ఎవరితోనైనా వాదిస్తున్నా తగవాడు తున్నా ఆమెకు వెంటనే సహాయం చేయాలి!

 

ఇంకా ఆమెకు కావాల్సిన ప్రతీదీ ఆమెకు తెచ్చి ఇవ్వాలి!

 

  ఇక తర్వాత భాధ్యత: కుటుంబాన్ని పోషించాలి! ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించి నీ డబ్బులతో నీ భార్యను నీ కుటుంబాన్ని పోషించాలి! ఒకవేళ నీ  భార్య ఉద్యోగం చేస్తున్నా సరే, నీవు మాత్రం నీ చేతులతో కష్టపడి లేక వ్యాపారం చేసి గాని స్వయంగా ధనము సంపాదించి డబ్బులతోనే నీ భార్యను నీ కుటుంబాన్ని పోషించాలి. నీ భార్య సంపాదించిన ధనమును మరో పనికి ఉపయోగించు గాని నీవు మాత్రం నీ డబ్బులతోనే నీ భార్యను పోషించాలి! ఇది ఆదికాండంలో దేవుడు రాసిన శిలా శాసనం!!

 

ఇంకా చివరిది: నీ పిల్లలను సరియైన విధంగా పెంచాలి!

 

*మరో విషయం చెప్పనీయండి: పురుషులకు కోపం వచ్చినా పర్వాలేదు గాని నిజాన్ని చెప్పనీయండి: కేవలం పిల్లలని పుట్టించడం, భార్యకు సంసార సుఖం ఇవ్వడం మాత్రమే పురుషుడి విధి కానేకాదు! రెండు పంది చేయగలదు, ప్రతీ పశువు జంతువూ చేయగలదు! మరి మగాడికి పశువుకి/జంతువుకి తేడా ఏమిటి అంటే మగాడు రెంటితో పాటుగా భార్యను సంరక్షించాలి, పోషించాలి, పాలించాలి! కుటుంభ అవసరాలు కష్టపడి తీర్చాలి! లేకపోతే అలాంటి పురుషునికి- పందికి లేక పశువుకి తేడా లేదు అని నా ఉద్దేశం*!!!

(సశేషం)

*పేతురు వ్రాసిన పత్రికలు*

*89 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-28*

1పేతురు 3:8

8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే 8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

అందరూ ఏక మనుష్కులై ఒకరి సుఖదుఃఖాలలో ఒకరు సాయం చేసుకోవాలని చెబుతున్నారు!

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: ఏక మనస్సు కలిగి ఉండాలి

యోహాను 13:35

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

 

Romans(రోమీయులకు) 12:10,12,13,14,15,16,17,18

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

12. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

13 .పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

15. సంతోషించు వారితో సంతోషించుడి;

16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి.

18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

 

Ephesians(ఎఫెసీయులకు) 4:2,3,32

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3.  ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

32.ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

 

Philippians(ఫిలిప్పీయులకు) 2:2,3,4

2. మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

3. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

4. మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

 

Colossians(కొలొస్సయులకు) 3:12,13,14,15

12. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.

14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.

15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

 

1థెస్సలొనికయులకు 5:15

ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి (మేలైన దానిని వెంటాడుడి).

 

ఇక రోమా 12:15 వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చేవారితో ఏడవండి అంటున్నారు పౌలుగారు. దీని సామాన్య అర్ధం ఏమిటంటే ఇతరుల సుఖ దుఃఖాలను పంచుకోమంటున్నారు.  గాని జ్ఞానియైన సొలోమోను గారు అంటున్నారు విందు జరుగుచున్న ఇంటికి పోవుటకంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటున్నారు. ప్రసంగి 7:2;  ఎందుకు వారు ప్రలాపిస్తున్నారు అంటే ఆవచనంలోనే జవాబుంది. మరణం అందరికీ వస్తుంది. మరణించారు కాబట్టి ప్రలాపిస్తున్నారు. కాబట్టి వచనంలో సంతోషించే వారితో సంతోషించండి అయితే ఏడ్చేవారితో ఏడ్వమని చెప్పారు పౌలుగారు ఆత్మావేశుడై! ఇలా పౌలుగారు రాయడానికి కారణం దేవుని సారత్రిక సంఘంలో , క్రీస్తు శరీరము అనే సంఘంలో విశ్వాసులంతా వివిధ భాగాలు. గాని అందరూ ఒకే శరీరానికి చెందిన వారు.  1 కొరింతు 12:25-27;

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు 

గలతీ 6:2

ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.

 

విశ్వాసులు కఠినంగా, సానుభూతి లేకుండా, స్వార్థంగా ఉండకూడదు. ఇతరుల ఆనందంలో, దుఃఖంలో పాలుపంచుకోవాలి.

 

           16 వచనంలో ఒకనితోనొకడు మనస్సు కలిసికొని యుండుడి. హెచ్చువాటియందు మనస్సునుంచక తగ్గువాటియందు ఆసక్తి కలిగియుండుడి. అంటున్నారు. మనస్సు కలిసిపోవడం అంటే ఏకమనస్కులై ఉండాలి. ఏక మనస్సు లేకనే కుటుంబాల్లో సంఘాల్లో తగువులు తగాదాలు వస్తున్నాయి. ఏకమనస్సు ఎందుకు లేదంటే వారి మధ్య ప్రేమలేదు! సమాధాన బంధం లేదు! దేవుడే ప్రేమై యున్నాడు కాబట్టి వీరిమధ్య ప్రేమ లేదు అంటే వీరిమధ్య దేవుడు లేడు అని అర్ధం! బైబిల్ గ్రంధంలో ఏకమనస్సు కలిగి ప్రార్ధించిన వారంతా, ఏకమనస్సు కలిగియుంటే ఎన్నెన్నో అధ్బుతాలు జరిగాయి. న్యాయాధిపతులు 20:1; ఎజ్రా :1;

అపో 5:12.

ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.

 

అందుకే పేతురుగారు కూడా :8లో

తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి....... 

చూశారా మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఃఖములో మరొకరు పాలుపంచుకుని ,సహోదర ప్రేమ గలవారై , వినయ మనస్కులై యుందండి అంటున్నారు.

 అపొ కా 4:32;  ఎఫెసు 4:2--3. 

 

గర్వం, దురహంకారం, తనను ఇతరులకంటే హెచ్చించుకోవడం, విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్నా తక్కువ స్థితిలో ఉన్నా క్రీస్తులో అందరూ ఒకటే, అలానే ప్రవర్తించాలి అపొ కా 6:1; 1 కొరింతు 12:13;

ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

 గలతీ 3:28

ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

 

 కులాన్ని బట్టీ, సమాజంలో, లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థానాలను బట్టీ అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం.

 

ఒకసారి ఫిలిప్పీ సంఘంలో కలహాలు కలిగితే పౌలుగారు చెబుతున్నారు 4:2

ప్రభువునందు ఏక మనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను.;

ఇంకా 1కొరింథీ :..

మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?..

 

కాబట్టి ఏకమనస్సు లేకపోతే మీరు శరీరసంభందులే గాని ఆత్మ సంబంధులు కానేకాదు! కీర్తన 133లో సహోదరులు ఐక్యత కలిగి నివశించుట ఎంతమేలు! ఎంతమనోహరము అంటూ వర్ణిస్తున్నారు! ఆశీర్వాదం, శాశ్వత జీవం అనగా నిత్యజీవం కావాలి అంటే ఐక్యత, ఏకమనస్సు, ఏకభావం, ఏకాత్మ కలిగియుండాలి.

 

ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీవు మీ సంఘస్తులతో ఐక్యంగా సమాధానంగా ఉంటున్నావా? లేక గొడవపడుతున్నావా? యోహాను గారు చెబుతున్నట్లు కనబడే సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? ఇక్కడే సంఘంలో కలసిమెలసి ఉండలేని నీవు పరలోకంలో అంతమందితో కలసిమెలసి ఉండగలవా? ఉండలేవు గాబట్టి "అమ్మా! అయ్యా! నీవు, నీలాంటి వాడు అక్కడికి వస్తే అందరిని పాడుచేస్తావు, అందరితో తగవులాడుతుంటావు, నీవు అక్కడికి/ పరలోకం రాకు! ఇక్కడే ఉండు అంటారు దేవుడు"!!!

నీవు ఎప్పుడైతే సమాధానంగా ఏకంగా లేవో, దేవునికి మహిమ రాదు, కారణం సాతానుగాడు మిమ్మల్ని చూసి వికట్టాట్టహాసం చేస్తాడు.

కాబట్టి మీ కలహాలు, కక్షలు అన్నీ ఇక్కడే వదిలేసి 7 వచనం ప్రకారం క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారం మనం కూడా ఇతరులను చేర్చుకుని సమాధానంగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది!

 

    తమ్ముడి మీద కక్ష్య కట్టిన అన్నలు చివరికి ఎంతవరకు తెగించారు అంటే తమ్ముడ్ని హత్యచేసే వరకు వచ్చారు. యోసేపు చంపేద్దాం అనుకున్నారు గాని దేవుని మహాకృప, దేవుని మహా గొప్ప ప్రణాళిక యోసేపుని కాపాడింది. అందరిపట్ల కృప ప్రణాళిక లేదు కదా, అలాంటప్పుడు మిమ్మును హంతకులుగా నేరస్తులుగా చేసేది కక్షలు, కోపాలు, తాపాలు మాత్రమే! మీ యొక్క అక్రమ సంభంధాలు, మీయొక్క ధనాశ మాత్రమే! వాటిని వదిలి అందరితో సమాధానం అనే భంధంతో ఉంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును వస్తాయి. దేవుని అభిషేకం సీయోను కొండలమీద దిగు హెర్మోను మంచులా కురుస్తుంది.

 

ప్రియ సహోదరుడా! నీకు ఏమికావాలి?

 ఆశీర్వదమా? శాపమా?

దీవెనా? తీర్పా?

ఏదికావాలో ఇప్పుడే నిర్ణయించుకో!

1 పేతురు 3:10,11

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

 

మేలైనదానిని చేపట్టి కీడును విసర్జించు!

పరలోకం పట్టు!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*90 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-29*

1పేతురు 3:8

8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే 8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: కరుణాచిత్తము కలిగి ఉండాలి!

కరుణాచిత్తము అంటే జాలిగల మనస్సు!

 

 కొలస్సీ 3:12

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

 

1) *జాలిగల మనస్సు*: జాలిగల మనస్సు అంటే ఇంగ్లీష్లో merciful bowels or merciful hearts. గతబాగాలలో వివరించినట్లుచేయరానిపనులకు ఒకదానితో ఒకటి ఎలా సంభంధం కలిగిఉన్నాయో, అలాగే చేయవలసిన పనులకు కూడా ఒకదానికొకటి సంభంధం కలిగిఉన్నాయి. ఇక్కడ పౌలుగారు దేవునిచేత ఏర్పరచబడిన వారికీ, పరిశుద్ధులకు, ప్రియులైన వారికీ తగినట్లుగా జీవించాలి అంటూఅందులో మొదటగా జాలిగల మనస్సు కలిగి ఉండాలి అని చెబుతున్నారు.

ఇది ఎలా వస్తుంది?

సింపుల్!

రాతిగుండెను వదలి- మాంసపు గుండెను ధరించడం, ఇంకా క్రీస్తుయేసు ప్రేమ మన గుండెల్లో తన్నుకొచ్చినప్పుడు తోటివారిని ప్రేమిస్తావు. పేదవారిమీద జాలిపడి, సహాయం చేస్తావు. కేవలం జాలిపడటం తోనే ఆగలేవువారికోసం నీ చేతనైనంత సహాయం చేస్తావు. ఒకవేళ సహాయం చేయలేని పక్ష్యంలో వారికోసం కన్నీటితో ప్రార్ధన చేస్తావు. దిక్కులేని అనాధలను, విధవరాండ్రను, పరామర్శిస్తావు.

యాకోబు 1:27.

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే. . . .

 

     కేవలం మనుష్యులమీదనే కాదు జంతువులను, పక్షులను కూడా ప్రేమిస్తావు, జాలితో ఆదరిస్తావు, ఆదుకొంటావు. అప్పుడు అందరిలోనూ నీకు దేవుడు కనిపిస్తారు.  జాలిగల మనస్సు లేకపోతే నీవు ఒక నంబర్ 1. మెటీరియలిస్ట్ వి. పిల్లికి భిక్షం వేయరు అంటారు కదా, ఎంగిలి చేతితో కాకిని తగలడు అంటారు కదా దానికి నమూనాగా మారుతావు. 

ఎప్పుడైతే ఇలా మెటీరియలిస్ట్ గా మారావో,  దేవునిప్రేమ నీలోనుండి తొలగి, సైతాను స్వభావం నీకు వస్తుంది. అప్పుడు నీవు దేవునికి ప్రియుడవు కాకుండా దేవునికి ఇష్టం లేనివాడివిగా మారతావు. పవిత్రుడవుపాపిగా మారిపోతావు.

 

 దేవుడు కొంతమంది మీద జాలి చూపించమని చెప్పారు.

1. పరదేశుల మీదద్వితీ 10:19; 2.

2.  పేదలు, విధవరాళ్ళు, దిక్కులేని వారు యాకోబు 1:27, లూకా గొర్రెలు- మేకలు ఉపోద్గాతం, మత్తయి 25;

 

   యేసుప్రభులవారు దీనికోసం ఒక ఉపమానం కూడా చెప్పారు. లూకా 10 అధ్యాయంలో మంచి సమరయుడు ఉపమానంలో. కాబట్టి యాజకుడు, లేవీయుడు గాయపడినవాడిని ఆదుకోకుండా, వానిమీద జాలిపడి సహాయం చేయకుండా వెళ్ళిపోతారు. వేషధారులుగా ప్రవర్తించారు.  మంచి సమరయునిలాగా నీవు నేను కూడా అక్కరలో ఉన్నవారిని, దిక్కులేని వారిని ఆదరిస్తే, సహాయం చేస్తే సమరయునిలా నీతిమంతుడవు కాగలవు. దేవునికి ఇష్టుడవు కాగలవు, దేవునికి ప్రియుడవు కాగలవు.

 

  ప్రియ చదువరీ! నీవు ఇతరులమీద జాలి చూపిస్తేనీ మీద కూడా దేవుడు జాలి చూపిస్తారు. పాతనిభందనలో తండ్రియైన దేవుడు పదేపదే ఇశ్రాయేలీయుల మీద జాలిపడి వారి చెరనుండి విడిపించేవారు. ఇప్పుడు నీవు పాపపు చెరలోనికి పోయావా? నిన్ను విడిపించగలవారుకేవలం యేసయ్య మాత్రమే!

 

 యేసుప్రభులవారు అనేకసార్లు ప్రజలమీద కనికర పడి, వారు తప్పు చేసిన క్షమించి వారిని స్వస్తపరచడం చూస్తున్నాం!  ప్రియ చదువరీ! జాలిగల మనస్సు నీకుందా?

 

2) దయాళత్వము: దీనికి మరోపేరు దయ! అనగా దయగల హృదయం. ప్రేమ ఉంటే జాలి ఉంటుంది. జాలి ఉంటే దయ ఉంటుంది.  దయ అనగా kindness- మంచితనము అని మరో నానార్ధం ఉంది. ఇది దేవుని గుణాతిశయములలో ఒకటి. నిర్గమకాండము 34: 6

అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.

 

దేవుడు దయగలవాడు  2 దిన వృత్తాంతాలు 30:19;

దేవుని ఆత్మ దయగలది కీర్తన 143:10;

ఇలాంటి దయగల మాటలు దేవుని దృష్టికి పవిత్రములు సామెతలు 15:26;

 

 మరో విషయం ఏమిటంటే ఆత్మఫలములో ఇది ఒక భాగము!

మరి దయాళత్వము- దయ ఎలా వస్తుంది?

యేసయ్య ప్రేమ నీ మదిలో మెదలినప్పుడు.

 

   ప్రియ స్నేహితుడా! దేవునికున్న గుణాతిశయములలో ఒకటి దయ! అందుకే నీవు నేను ఎన్నిసార్లు తప్పిపోయినా, దయచూపించి మరలా నిన్ను నన్ను చేర్చు కుంటున్నారు. దయను, కృపను, వాత్సల్యతను చేతకానితనముగా తీసుకోవద్దు!

అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఆశిస్తున్నారు ఆయన!

కాబట్టి నేడే పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువద్దకు రా!

అంతేకాదు, నీవు కూడా దయగల మనస్సుని పొందుకో!

కనికరం గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7;   అలాగే దయగలవారు ధన్యులు వారికి దయ చూపించబడును అని కూడా వస్తుంది.

నీవు దయ చూపించకపోతే దేవుడు కూడా నీకు దయ చూపించరు!

నేడే మార్పుపొందు!

దయ గల హృదయాన్ని, జాలిగల మనస్సును పొందుకో!

దైవాశీస్సులు!

      

*పేతురు వ్రాసిన పత్రికలు*

*91 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-30*

1పేతురు 3:8

8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే 8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: వినయమనష్కులై ఉండాలి!

 

ఎఫెసీ 4:13

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

ప్రియులారా! రెండవ  వచనంలో  కనబడే మరో గొప్ప విషయము  : వినయము  ! అయితే ఇక్కడ పౌలుగారు సంపూర్ణ వినయముతో ఉండాలి అంటున్నారు అనగా complete submission!

 

కొలస్సీ 3:12

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

 

   ప్రియులారా! 3:12-16 వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే , గలతీ 5:22-23 లో గల ఆత్మఫలములో గల ముఖ్యమైన భాగములే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. వీటికి ఒకదానితో ఒకటి సంభందం కలిగియున్నాయి.

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: *వినయం* కోసం ధ్యానం చేసుకుందాం!

 

విశ్వాసికి తప్పకుండా వినయం ఉండాలి. కారణం యేసుప్రభులవారు అంటున్నారు తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనువాడు తగ్గించబడును! మత్తయి 23:12;  లూకా 14:11; 18:14; కాబట్టి ప్రతీ ఒక్కరు తమకుతాము తగ్గించుకోవాలి. ఇతరులను హెచ్చించాలి! అంతేకాదు సామెతలు గ్రంధం ప్రకారం ఘనతకు ముందు వినయము ఉంటుంది. పడిపోయే ముందు గర్వం ఉంటుంది. సామెతలు 18:12;

 

కాబట్టి విశ్వాసికి ఉండవలసిన ప్రశస్త లక్షణం: *వినయం*.

 

     నేటిరోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు వినయ విధేయతలు నేర్పించడం లేదు. పెద్దలను ఎలా గౌరవించాలో కూడా నేర్పించడం లేదు. అందుకే వారు పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు, చివరకు తల్లిదండ్రులకు- తాతలకు బంధువులకు గౌరవం ఇవ్వడం లేదు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు దేవునికి- తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇవ్వడు! బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైన తర్వాత దానినుండి తొలగిపోడు అని బైబిల్ గ్రంధం సెలవిస్తుంది. సామెతలు 22:6; బాలుడైన సమూయేలు కి నడువ వలసిన విధానం, వినయ విధేయతలు దైవజనుడైన ఏలీ గారు నేర్పించినట్లు చూస్తాం! అందుకే ఎంత గొప్ప దైవజనుడయ్యారో ఆయన మనం చూసుకోవచ్చు!

 

కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా! మీ పిల్లలకు వినయం నేర్పించండి.

 

   పిల్లలే కాదు పెద్దలు కూడా వినయముతో ప్రవర్తించాలి. ఒకసారి పాతనిబంధన గుర్తుచేసుకుంటే ఎందరో రాజులు గర్వించినప్పుడు దేవుడు వారిని శిక్షించారు. తిరిగి వారు తగ్గించుకుంటే / వినయం కలిగి వేడుకుంటే తిరిగి వారిని క్షమించి రక్షించినట్లు చూడవచ్చు!

 

ఉదా: 1. ఆహాబు 1 రాజులు 21:29;

 

2. రెహబాము 2 దిన వృత్తా 2:6;

 

3. మనస్సే 2 దిన 33:12;

 

4. నెబుకద్నేజరు దానియేలు 4

 

  అందుకే మహాజ్ఞానియైన సోలోమోను రాస్తున్నారు:

సామెతలు 22:4

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.

 

  కాబట్టి ఇవి విశ్వాసికి కావాలి.

 

వినయం గలవారిని దేవుడు కృప చూపిస్తారు సామెతలు 3:34;

 

సామెతలు 11:2

అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.

 

   అందుకే దేవుడు ప్రజలతో చెబుతున్నారు యెషయా 66:2

ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

 

ఇంకా మీకా 6:8

మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

 

జెఫన్యా అంటున్నారు 2:3

దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.

 

   అందుకే పౌలుగారు రాస్తున్నారు: వినయమును ధరించుకొనుడి.  3:12;

 

ఎఫెసీ  4:2 .

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . ;

 

ఫిలిప్పీ 2:3 .

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు. . .

 

 తీతుకు 3:2 .

ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.

 

యాకోబు 3:13 .

మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.

 

పేతురు గారు కూడా అంటున్నారు:

1 పేతురు 5:5 .

చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

 

  కాబట్టి ప్రియ దైవజనమా!

 

దేవునికి నచ్చిన, దేవుడు మెచ్చిన లక్షణం *వినయం* ప్రతీ ఒక్కరు ధరించుకొని ప్రవర్తిద్ధాము.

 

హెబ్రీయులకు 12: 28

అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

 

ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*92 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-14*

 

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

 

ఈరోజు విశ్వాసికి ఉండకూడని మరో లక్షణం: కీడుకి ప్రతికీడు చేయకూడదు!

చూడండి ఆశీర్వాదము నకు వారసులవడానికి మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకి ప్రతికీడు దూషణకు ప్రతి దూషణ వద్దు అంటున్నారు! దీనిని మరో విధంగా అర్థం చేసుకొంటే కీడుకి ప్రతికీడు చేసినా దూషణకు ప్రతి దూషణ చేసినా ఆశీర్వాదమునకు వారసులము కానేరము!!!

 

పాత నిబంధన కాలంలో కంటికి కన్ను దెబ్బకి దెబ్బ నియమం ఉండేది.

నిర్గమకాండము 21:24

కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,

నిర్గమకాండము 21:25

వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

 

అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు

మత్తయి 5:38

కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

మత్తయి 5:39

నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

మత్తయి 5:40

ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

మత్తయి 5:41

ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

మత్తయి 5:42

నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

మత్తయి 5:43

నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

మత్తయి 5:44

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

మత్తయి 5:45

ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

మత్తయి 5:46

మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.

మత్తయి 5:47

మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.

మత్తయి 5:48

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

 

కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయకూడదు! ఇంకా 11,12 వచనాలలో ఎందుకు కీడుకి ప్రతికీడు దూషణకు ప్రతి దూషణ చేయకూడదో చెబుతున్నారు

 11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

చూడండి కీడు చేయడం మాని మేలు చేయాలి. సమాధానమును వెదికి వెంటాడమంటున్నారు. ఇంకా ప్రభువు కన్నులు కీడుచేసే వారికి విరోధం గా ఉన్నవి అంటున్నారు!! అందుకే కీడుకి ప్రతికీడు చేయకూడదు!

 

చూడండి ఒకసారి ఇదే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభులవారిని ఒక ప్రశ్న అడిగారు నా సహోదరుడు నా విషయంలో తప్పుచేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసారులా?! అని దానికి దేవుని జవాబు

లూకా 17:3

మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.

లూకా 17:4

అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.

 

మత్తయి 18:21

సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.

మత్తయి 18:22

అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

 

అయితే క్షమాపణ మరియు ప్రేమ విషయంలో దేవుడు మరో అద్భుతమైన మాట అంటున్నారు

రోమీయులకు 12:19

ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

రోమీయులకు 12:20

కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.

రోమీయులకు 12:21

కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

 

లేవీయకాండము 19:17

నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.

లేవీయకాండము 19:18

కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

 

సామెతలు 20:22

కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

 

1థెస్సలొనికయులకు 5:15

ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి (మేలైన దానిని వెంటాడుడి).

1థెస్సలొనికయులకు 5:16

ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;

ఇదీ విశ్వాసికి ఉండవలసిన లక్షణం! కీడుకి ప్రతికీడు చేయడం అనేది విశ్వాసికి ఉండకూడని లక్షణం!

కనుక బైబిల్ బోధించిన విధానంలో సమాధాన ప్రేమలు కలిగి జీవిద్దాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*93 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-14*

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

 

ఈరోజు విశ్వాసికి ఉండకూడని మరో లక్షణం: దూషణకు ప్రతి దూషణ చేయడం! దీనికోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము!

 

ఎందుకు దూషణకి ప్రతి దూషణ చేయకూడదు అంటే గతభాగం లో చెప్పినట్లు

1) ఆశీర్వాదము నకు వారసులు కావాలంటే కీడుకి ప్రతికీడు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు;

2) 10 వచనం ప్రకారం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

3) సమాధానమును వెదకి వెంటాడాలి.

4) ప్రభువు ముఖము అలా కీడుకి ప్రతికీడు దూషణకి ప్రతి దూషణ చేసేవారికి విరుద్ధంగా ఉంది!!!

మనపై ధారగా కురిసిన దీవెనలు, ఇకముందు కలగబోయే దీవెనలు దృష్టిలో ఉంచుకుని మనం కూడా ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించడానికి ఇష్టపడాలి.

దీనికి మొదటి అధ్యాయంలో మరో కారణం కూడా చెప్పారు పేతురు గారు! మనము నూతన జన్మ పొందాము కాబట్టి పాత క్రియలు చేయకూడదు!

1 Peter(మొదటి పేతురు) 1:4,5

4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

 

గలతియులకు 3:13

ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై (మూలభాషలో- శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;

 

ఎఫెసీయులకు 1:3

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

ఎఫెసీయులకు 1:4

ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

ఎఫెసీయులకు 1:5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

ఎఫెసీయులకు 1:6

మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

ఎఫెసీయులకు 1:7

దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

ఎఫెసీయులకు 1:13

మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

 

కాబట్టి ఇప్పుడు కీడుకి ప్రతికీడు దూషణకి ప్రతి దూషణ వద్దు!

        

   కొలస్సీ 3:8

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.

 

ఎఫెసీయులకు 4:31

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.

ఎఫెసీయులకు 4:32

ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

1పేతురు 2:2

సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

1పేతురు 2:3

క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, పాలను అపేక్షించుడి.

 

కాబట్టి దూషణ మాటలు మానేద్దాం! దూషణకి ప్రతి దూషణ చేయవద్దని ప్రభువు పేరిట బ్రతిమలాడుతున్నాను! యేసుక్రీస్తు ప్రభులవారిని ఎంతో దూషించారు గాని ఆయన బదులు చెప్పలేదు! మనము కూడా ఆయన ఉంచిన బాటలో పయనిద్దాం!

దైవాశీస్సులు!    

*పేతురు వ్రాసిన పత్రికలు*

*94 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-31*

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఇంకా ముందుకు పోతే  జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

 

దీనికోసం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం!

     

యాకోబు 3:16

1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

2. అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము (తొట్రిల్లుచున్నాము). ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

4. ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును.

5. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును (అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకము చేత చిచ్చు పెట్టబడును.

 

   నోటిని నాలుకను భద్రముగా ఉంచుకోండి అంటూ  అధ్యాయంలో వివరంగా వివరిస్తున్నారు!

 

ఇక్కడ రెండవ వచనంలో మనమందరం అనేక విషయాలలో తప్పిపోతున్నాము, ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనంలో ఉంచుకొనే శక్తిగలవాడు అంటున్నారు! ఇంకా చెప్పాలంటే ఎవడైనా తన నాలుకను నోటిని భద్రముగా కాచుకుంటూ అదుపులో ఉంచుకొంటే, వాడు లోపం లేనివాడు కనుక  వాడు పరలోకం పోతాడు అంటున్నారు!

దీనిని బట్టి యాకోబుగారు ఏమంటున్నారు అంటే ఒక వ్యక్తికి ఉన్న అవయవాలు అన్నిటిలో నాలుకను అదుపుచేయడం ఎంతో ఎంతో కష్టము అంటున్నారు! తన నాలుకను అదుపులో ఉంచుకున్న వాడు, తన నాలుకను స్వాధీనంలో ఉంచుకున్న వాడు తన నాలుకపై అదుపు సంపాదించిన వాడు పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు అన్నమాట! దేవుడు తనకు ఇచ్చిన బోధించే పనికి సరిగ్గా సరిపోయినవాడు!!! ఇక్కడ లోపము లేనివాడై అనగా అర్ధము ఇదే! పరిపక్వత సాధించిన పరిపూర్ణ మానవుడు!

 

కారణం ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం మనకు యాకోబు 2:10 లో కూడా కనిపిస్తుంది. అలాగే మనకు 2పేతురు 1:10 లో కూడా కనిపిస్తుంది.....

దీనికి అర్ధం- తూలిపడిపోవడం, పడిపోవడం, పొరపాటు పడటం, పాపంలో మరలా పడిపోవడం అనేఅర్ధాలు ఉన్నాయి! యాకోబుగారు అంటున్నారు మనమందరం అనేక సార్లు పడిపోతున్నాము అంటున్నారు, అనగా తనతోపాటుగా అనేకులు పడిపోతున్నారు గాని అలా పడకుండా ఉంటే మనుష్యుడు పరిపూర్ణ మానవుడు అంటున్నారు! అందుకే ఎవడైనా మాటయందు తప్పిపోకుండా ఉంటే వ్యక్తి తన సర్వశరీరమును కూడా అదుపులో ఉంచుకున్నవాడు! అనగా మాటయందు తప్పిపోకుండా ఉంటే చూపులో తప్పిపోడు! నడకలో తప్పిపోడు! ప్రార్ధనలో తప్పిపోడు! శరీరముతో పాపం చెయ్యడు! చివరికి ఆలోచనలలో కూడా తప్పుచెయ్యడు! అప్పుడు వ్యక్తి పరిపూర్ణ మానవుడు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా వీటిలో దేనియందు తప్పిపోలేదు! అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరగలిగారు యేసయ్య! అంటే ఇలా సర్వ అవయవాలను స్వాధీనంలో ఉంచుకున్నాడు అంటే మనిషి క్రీస్తు పోలికలోనికి మారిపోయాడు అన్నమాట! 

 

ప్రియ దైవసేవకుడా! బోధకుడా! సంఘకాపరీ! విశ్వాసి! సంఘపెద్డా! నీవు నీ నోటిమీద, నాలుకమీద గెలిచావా? దానిని స్వాధీనములో ఉంచుకోగలుగుతున్నావా?  క్రీస్తు రూపములోనికి మారాలి అంటే నాలుకను స్వాధీనములో ఉంచుకోక తప్పదు అని గ్రహించమని మనవిచేస్తున్నాను!

 

ఇక మూడు నాలుగు వచనాలలో కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు!

మొదటిది గుఱ్ఱము! గుఱ్ఱము చాలా వేగముగా పరిగెత్తుతుంది! మనిషి కంటే బలమైనది! తొందరగా అలసిపోదు! ఇంతటి వేగవంతమైన బలమైన గుఱ్ఱము కూడా కేవలము దాని నోటికి కల్లెము వేస్తే మొత్తము గుఱ్ఱము మనకు లోబడుతుంది కదా! అనగా ఇంతపెద్ద బలమైన వేగవంతమైన గుఱ్ఱము కేవలం కల్లెము వేస్తె మనకు లోబడుతుంది!

 

రెండు: ఓడలు చూడండి! ఎంతో పెద్ద ఓడలు ఉన్నాయి! ఇప్పుడు అర కిలోమీటర్ పొడవున్న షిప్ లు కూడా చేశారు! ఎనిమిది లక్షలు టన్నులు సామగ్రి తీసుకుని పోగలిగిన ఓడలు (ఓబో కేరియర్), తొమ్మిది లక్షల టన్నులు క్రూడ్ ఆయిల్ మోయగలిగిన సూపర్ టాంకర్లు కూడా ఉన్నాయి! అయితే ఇంతపెద్ద ఓడ, కేవలం చిన్న చుక్కాని (rudder) ద్వారా ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు తిరుగుతుంది! చుక్కాని ఓడ పరిమాణంలో .5% కూడా ఉండదు! గాని ఓడ మొత్తాన్ని త్రిప్పేస్తుంది.

గాని ఐదో వచనం  ఇంతపెద్ద మనిషి కూడా కేవలం చిన్న నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! ఒక పెద్ద కంపెనీను స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, పెద్దపెద్ద క్రేన్లు లారీలు రైళ్ళు తన స్వాదీనంలో ఉంచుకున్న వ్యక్తి, తన శరీరాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తి, కేవలం చిన్న నాలుకను అదుపులో ఉంచుకోలేక పోతున్నాడు! అది మన శరీరంలో చాలా చాలా చిన్నదైనా బహుగా అదిరిపడుతుంది! ఒకచిన్న నిప్పు ఎంతో పెద్ద అడవిని తగులపెట్టేస్తాది! అలాగే ఎంతో పెద్ద మనిషిని ఎంతో పేరుగల వ్యక్తిని చిన్న నాలుక కాల్చేస్తుంది! వాడి పరువు తీసేస్తుంది, చివరకు యుద్ధాలు తెస్తుంది నాలుక అంటున్నారు!

 

ఇక్క యాకోబుగారు చెప్పేదేమిటంటే చిన్నచిన్న విషయాలకు పెద్దపెద్ద ఫలితాలు వస్తున్నాయి. అలాగే దేహంలో చాలాచిన్న అవయవమైన నాలుక ద్వారా శాంతిని పొందవచ్చు అలాగే యుద్ధాన్ని కూడాకొని తెచ్చుకోవచ్చు! మంచైనా చేస్తుంది, కీడునైనా తెస్తుంది! సామర్ధ్యం మన నాలుకకు ఉంది! నాలుక దొర్లిపోతుంది! తొందరగా అదిరిపడి ఏదో ఒకటి అంటుంది, గాని ఫలితం మొదట వీపుకు, మూతికి దెబ్బలు తగులుతాయి! కొన్నిసార్లు మూతిపళ్లు రాలిపోతాయి! అనేకసార్లు నాలుక వలననే పోలీష్ స్టేషన్లకు కోర్టులకు తిరగాల్సి వస్తుంది! నాలుక నిర్మించగలదు -కూల్చగలదు! కట్టగలదు- కూల్చగలదు! ద్వంసం చేయగలదు!

అందుకే సామెతల గ్రంధంలో నాలుక జీవ వృక్షము అని చెప్పారు

సామెతలు 15: 4

సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

 

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

పాము కోరలు లాగ విషం చిమ్ముతుంది

కీర్తన 140:3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

హతమార్చే కత్తిలా ఉంటుంది.

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

వ్యాధిని నయం చేసే మందులా కూడా పనిచేస్తుంది.

సామెతలు 12: 18

కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము.

 

దుర్మార్గతను, కష్టాన్ని తెచ్చిపెట్టగలదు

కీర్తన 10:7

వారి నోరు శాపముతోను కపటముతోను వంచన తోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

 

న్యాయాన్ని నీతిని నిజాయితీని ప్రోత్సహిస్తుంది

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

ఇక ఆరవ వచనంలో నాలుకను నిప్పుతో పోల్చారు యాకోబు గారు ఆత్మావేశుడై! ఇది మన అవయవాలలో ఉన్న పాప ప్రపంచమై సర్వ శరీరమునకు కూడా మాలిన్యము తీసుకొస్తుంది, అంతేకాకుండా ప్రకృతి చక్రానికి చిచ్చు అనగా నిప్పు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెడుతుంది అనగా చివరికి మనిషికి నరకాన్ని తెస్తుంది అంటున్నారు!

 

అనగా అదుపులేని నాలుక అగ్నిలా వాడబడి మనిషికి నరకాన్ని తెస్తుంది, హృదయంలో శాంతి సమాధానాలు లేకుండా చేసి అందరితోను తగవులాడేలా చేస్తుంది నిన్ను!

గమనించాలి  జాగ్రత్తగా బైబిల్ ని  పరిశీలిస్తే హృదయం నిండిన దానిని బట్టి నాలుక మరియు పెదవులు మాట్లాడతాయి! లూకా 6:45; కాబట్టి తప్పంతా నాలుక మీదన కూడా త్రోసివేయ కూడదు!

 

ఇక నిప్పుతో ఎందుకు పోల్చారు అంటే అది గొప్ప వినాశనాన్ని మనిషికి తెచ్చిపెట్టగలదు కాబట్టి!

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

 

దానినుండి ఎగిరే ఒక నిప్పురవ్వ పెద్ద అడవిని తగులబెట్టగలదు! అంతేకాకుండా నాలుక ఒక పాప ప్రపంచం అంటున్నారు! అయితే ప్రపంచం దుర్మార్గమైనది.

కీర్తనలు 58: 3

తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

 

ఇది కోరికలతోను పాపపు ఆలోచనలతోను నిండి నిత్యమూ మండుతూ ఉంటుంది. మంటలు నరకము నుండి వచ్చి నిన్ను నరకానికే తీసుకుని పోతుంది!  అబద్దాలు, మోసపూరితమైన మాటలు, కొండెములు చాడీలు చెప్పడం, దేవుణ్ణి దూషించడం, శాప వచనాలు పలకడం, పరిహాసాలు సరసాలు ఆడటం ఇవన్నీ సాతాను గాడు నాలుకకు నేర్పించి నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడు! కాబట్టి నాలుకను అదుపు చేసుకుంటావా?

 

కాబట్టి నాలుకకు అంత శక్తి ఉంది కాబట్టి దీనిని కట్టడానికి ఉపయోగిస్తావా లేక పడగొట్టడానికి ఉపయోగిస్తావా తగులబెట్టడానికి ఉపయోగిస్తావా లేక వంట వండుకోవడానికి ఉపయోగిస్తావా, శాంతికి ఉపయోగిస్తావా లేక యుద్ధానికి ఉపయోగిస్తావా దేనికి ఉపయోగిస్తావో నీ ఇష్టం! ఉపయోగించే విధానం తెలియలేదా నీకే నష్టం అని మర్చిపోవద్దు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*95 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-31*

 

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

 

           (గతభాగం తరువాయి)

 

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

ఇక ఏడవ వచనంలో మృగాలు పక్షులు పాములు జలచరములు అనగా జలములలో బ్రతికేవి అనగా చేపలు తాబేళ్లు మొసళ్ళు లాంటివి మనిషి చేత సాధువు అనగా మచ్చిక అవుతున్నాయి. మనిషి మాట వింటున్నాయి  గాని మనిషి కూడా ఇంతవరకు తన సొంత నాలుకను సాధువు లేక మచ్చిక చేసుకోలేక పోతున్నాడు అంటున్నారు! నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వముతో నిండిపోయింది అంటున్నారు ఎనిమిదవ వచనంలో!

పై వచనాలలో మొదటగా గుఱ్ఱము మరియు ఓడలు కూడా మనిషి మాట వింటున్నాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు వచనాలలో మనిషిచేత మృగాలు పక్షులు పాములు లాంటి ప్రాకే జంతువులూ సముద్రంలో నివశించే ప్రాణులు కూడా మచ్చిక లేక మనిషి స్వాధీనంలోకి వస్తున్నాయి కాని మనిషి తన సొంత నాలుకను మాత్రం స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాడు అంటున్నారు! తన నాలుకను అన్నివేళలా సంపూర్ణంగా తన స్వాధీనంలో ఉంచుకున్న వాడు ఇంతవరకు యేసుక్రీస్తుప్రభులవారు మాత్ర్రమే , నరులలో ఎవరూ లేరు మానవ చరిత్రలో!

 

అబ్రాహాము గారు అలా చెయ్యలేక పోయారు- శారమ్మతో అబద్దమాడమని రెండుసార్లు చెప్పారు! ఆదికాండం 12:1120; 20:29;

 

మోషేగారు కూడా నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక పోయారు! సంఖ్యా 20:1012 అక్కడ ఇశ్రాయేలు వారిని ద్రోహులారా అని సంభోధించారు కోపం తట్టుకోలేక! అంతేనా బండతో మాట్లాడమని చెబితే బండను కర్రతో కొట్టారు మోషేగారు. బండక్రీస్తు కదా!

కీర్తనలు 106: 33

ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

 

పేతురు గారు కూడా అదుపులో ఉంచుకోలేక పోయారు! మత్తయి 26:6974 లో  యేసుప్రభులవారు ఎవరో నాకు తెలియదు అని అబద్దమాడారు!

 

మరి క్రీస్తుప్రేమ సిద్ధాంతాన్ని బాగా అర్ధం చేసుకున్న వారు ఇద్దరే, మొదటిది యోహాను గారు,రెండవది: పౌలుగారు! పౌలుగారు కూడా తన నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేక ప్రధాన యాజకున్ని నోటిమీద కొట్టమన్నారు! అపో 23:25

 

ఇక దీనిని అనగా పత్రికను రాసిన యాకోబు గారు ముందుగానే ఒప్పుకున్నారు నేను నా స్వాధీనంలో ఉంచుకోలేక పోతున్నాను అని. అందుకే మనమందరం తప్పిపోతున్నాము అన్నారు!

 

ఇది చెప్పడంలో నాఉద్దేశం మనం స్వాధీనంలో ఉంచుకోలేము గనుక మీరు కూడా దానికి అనగా అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించవద్దు అని కానేకాదు! తప్పకుండా ప్రయత్నించాలి! అసలు ప్రయత్నం చేయకుండా పూర్తిగా వదిలెయ్యకుండా కనీసం కొంతవరకైనా ప్రయత్నిస్తే మనకు మన శరీరానికి సమాజానికి కూడా ఎంతో మేలు!

 

అందుకే కీర్తనాకారుడు రాస్తున్నాడు : యెహోవా నా నాలుకకు నా నోటికి కావాలి పెట్టు! 141:

కీర్తనలు 141: 3

యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.

 

సామెతల గ్రంధకర్త అంటున్నారు: అధికమైన మాటలలో దోషాలు ఉంటాయి అందుకే మాటలు తక్కువగా ఉండాలి.

సామెతలు 10: 19

విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.

 

సామెతలు 11: 12

తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

 

సామెతలు 21: 23

నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

 

అయితే మన నాలుకను మన అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యం?

మన హృదయం నిండా మన మనస్సు నిండా దేవుని వాక్యముతో నింపుకుంటే, మనలను పరిశుద్ధాత్ముడు ఏలుతూ ఉంటే ఇది సాధ్యమే! అప్పుడు మన నాలుక మంచి సంగతులే మాట్లాడతాయి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి సువార్తలో అంటున్నారు 12:2437 లో.....

25. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను యిల్లయినను నిలువదు.

28. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

31. కాబట్టి నేను మీతో చెప్పున దేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.

32. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

33. చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

34. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

35. సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

పౌలుగారు కొలస్సీ పత్రికలో అంటున్నారు

కొలస్సీయులకు 3: 16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 

ఇలాచేస్తే మనం మన నాలుకను అదుపులో ఉంచుకోలేక పోయినా దేవుడు మన హృదయాలలో పనిచేసి ఆయన వాక్యము మన నాలుకను మన ప్రవర్తనను స్వాధీనంలో ఉండేలా చేస్తుంది! ఇది పరిశుద్దాత్మునికి, ఆయన వాక్యమునకు సాధ్యమే!

మరి నీ మనస్సు నీ హృదయం ఆయన వాక్యముతో ఆయన ఆత్మతో నింపబడటానికి ఇష్టపడుతున్నావా!!!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*96 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-31*

 

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

 

           (గతభాగం తరువాయి)

 

యాకోబు 3:712

7. మృగపక్షి సర్పజలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.

10. ఒక్కనోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

 

ఇంకా ఎనిమిదో వచనంలో నాలుక విషంతో నిండి ఉంది విషం భయంకరమైన దుష్టత్వము అంటున్నారు! యాకోబు గారే కాదు కీర్తనాకారుడు కూడా ఇది విషంతో నిండి ఉంది అంటున్నారు.

కీర్తనలు 58: 4

వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను

 

కీర్తనలు 140: 3

పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

 

పౌలుగారు కూడా అంటున్నారు.

రోమీయులకు 3: 13

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

 

ఎలాగు విషకరమైనదో మనకు తొమ్మిదో వచనం నుండి 12 వచనం వరకు వివరిస్తున్నారు:

ఇదే నాలుకతో మనం తండ్రియైన దేవుని స్తుతిస్తున్నాము! ఇదే నాలుకతో అదే తండ్రియైన దేవుడు చేసిన మనిషిని శపిస్తున్నాము

ఇంకా ఇదే నోటితో నాలుకతో స్తుతి వస్తుంది శాపం కూడా వస్తుంది. ఇలా ఉండకూడదు అంటున్నారు. పదకొండో వచనంలో ఒకే ఊటనుండి లేక ఒకే నూతినుండి మంచినీరు లేక తియ్యటినీరు, చేదునీరు రావు కదా, పన్నెండో వచనం ఒక అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా అలాగే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యటి నీళ్ళు పుడతాయా? గాని మీ నాలుకల నుండి స్తుతి మరియు శాపం ఎందుకు వస్తున్నాయి? మంచి దేవుని పాటలు మరియు బూతులు ఎందుకు వస్తున్నాయి అని అడుగుచున్నారు పరిశుద్ధాత్ముడు!!!

 

బైబిల్ లో మనిషి దేవుని పోలికలో పుట్టాడు లేక దేవుడు తన పోలికలో మనిషిని చేశారు అని వ్రాయబడింది ఆది కాండం 1:2627, మరియు ఎఫెసీ 4:24

మరి ఇప్పుడు దేవుని పోలికలో పుట్టిన నీవు నేను అదే దేవునిపోలిక పుట్టిన వ్యక్తిని ఎందుకు దూషిస్తున్నాము? ఎందుకు శపిస్తున్నాము? అని అడుగుచున్నారు!

 

ఒక ఊట నుండి మంచి నీరు చెడు నీరు లేక ఉప్పు నీరు తియ్యటి నీరు ఎలా పుట్టవో అలాగే మనిషి నోటినుండి ఆశీర్వాదం - శాపం రాకూడదు అంటున్నారు. కాని సృష్టి అంతటిలో మనిషి నాలుకకు మాత్రమే రెండు రకాల మూల స్థానాలు, రెండు రకాల ప్రవాహాలు ఉన్నాయి! అదే మనిషిని నరకానికి తీసుకుని పోతుంది! లేక పరలోకానికి తీసుకుని పోతుంది!

ఇది కుదరదు అంటున్నారు యాకోబు గారు!

 గతభాగంలో చూసుకున్నాము: మోషేగారు ఎంత దేవునికి నమ్మకమైన భక్తుడో- గాని పెదాలతో కానిమాట పలికారు- ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంతగా కోపం పుట్టించారు! భూమిమీద ఉన్నవారిలో మోషేగారు మాత్రమే సాత్వికుడు అని దేవునిచేత సర్టిఫికేట్ పొందిన మోషేగారు (సంఖ్యాకాండము 12: 3

యెహోవా మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు).

 ఒకరోజు కోపం తట్టుకోలేక ద్రోహులారా అన్నారు! ఈమాట దేవునికి కోపం పుట్టించింది- ఇంతగా ప్రేమించిన మోషేగారిని కనాను దేశాన్ని చూడకుండా చేసేశారు!  తన కోపంలో పలికిన మాట తనను కనాను దేశం వెళ్ళకుండా చేసింది!

 

ఒక్క అబద్దం అననీయ మరియు సప్పీరలను దేవుని మందిరంలోనే చచ్చిపోయేలా చేసింది!

 

ఏలీయా గారు చేసినట్లు మేము కూడా అగ్నిని రప్పించి సమరయులను కాల్చేమంటావా దేవుడా అన్నారు శిష్యులు! అన్నారు గాని పలుకలేదు! వెంటనే యేసయ్యతో గద్దించబడ్డారు!

 

అయితే నాలుక దేనికోసం అంటే దేవుని స్తుతిని ప్రచురించడానికి! దీవెన వాక్యాలు చెప్పడానికి మాత్రమే అని గ్రహించాలి!

కీర్తనలు 35: 28

నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

 

కీర్తనలు 37: 30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

 

కీర్తనలు 45: 1

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది.

 

కీర్తనలు 51: 14

దేవా, నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును.

 

కీర్తనలు 119: 172

నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును.

 

ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి!

అయితే దేవుడు ఒకరోజు నాలుకను కోసేస్తాను అంటున్నారు  ఎందుకంటే నాలుక విషపూరితమైనదే కాదు అది కత్తిలాంటిది కీర్తన

కీర్తనలు 52: 2

మోసము చేయువాడా, వాడిగల మంగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

కీర్తనలు 52: 4

కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

 

కీర్తనలు 57: 4

నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి.

 

అందుకే నిప్పులు పోస్తాను అంటున్నారు:

కీర్తనలు 120: 3

మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

కీర్తనలు 120: 4

తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును

 

సామెతలు 10: 31

నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.

చివరిగా జీవమరణములు నాలుక వశము అంటున్నారు- నీకు జీవం కావాలా లేక మరణం కావాలా నిన్నీ కోరుకోమంటూన్నారు!

సామెతలు 18: 21

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

 

కాబట్టి నీకేది కావాలో నీవే తేల్చుకో!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*97 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-32*

 

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: కీడునుండి తొలిగి మేలుచేయాలి.

వివరంగా చెప్పాలంటే కీడు కలిగించే చెడు మార్గం వదిలి పారిపోవాలి. మేలు చేయాలి.

మీకు నాలుగు గుంపులు చూపిస్తాను. వీరు ఎలా జయించారు? దేనిలో ఓడిపోయారు? తద్వారా మనం ఎలా జయించాలి ఏమి పాఠం నేర్చుకోవాలి అనేది మన ఆధ్యాత్మిక జీవితం ఎలా మలచుకోవాలి అనేది వారి జీవితానుభవాలనుండి చూసుకుందాం!

 

మొదటి బాచ్: *యోసేపు, సంసోను, దావీదు*

రెండు: *సౌలురాజు, దావీదు రాజు*;

మూడో బ్యాచ్: *బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీర*

నాలుగో బ్యాచ్: *దానియేలు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగో*

 

మొదటి బ్యాచ్: *యోసేపు గారు, సంసోను గారు, దావీదు గారు*! మహా గొప్ప భక్తులు- దైవజనులు!

 

ముగ్గురిమీద ఒకే రకమైన శోధన ఎదురైంది! అది కామవాంచ! (Sexual Desires). 

యోసేపు గారి దగ్గరకే అవకాశం వస్తే- పాపము నుండి పారిపోయారు! కీడు నుండి తొలిగిపోయారు.

దావీదు గారు పాపాన్ని పిలిపించుకున్నారు. పాపం దగ్గర ఆగిపోయారు!

సంసోను గారు వాటి దగ్గరకే పోయారు అనగా వాటివెనుక వెళ్లారు! వాటిలో పడిపోయారు!

 

ఫలితం: యోసేపు గారు జయజీవితం జీవించగా, దావీదుగారు సంసోను గారు పతనమైపోయారు!

యోసేపు గారి జయజీవితానికి కారణం లేక యోసేపు గారు తన ఆత్మీయ పోరాటంలో సాతాను మీద, పాపం మీద, లోకం మీద విధముగా జయించగలిగారు అంటే కేవలం వాక్యం వలన! ధర్మశాస్త్రం కూడా లేని మనస్సాక్షి కాలంలో- అబ్రాహాము గారు తన ముత్తాత అయిన నోవాహు గారి దగ్గర వాక్యము-పద్దతులు నేర్చుకుంటే, అబ్రాహము గారి దగ్గర ఇస్సాకు గారు, ఇస్సాకు గారి దగ్గర యాకోబు గారు, యాకోబు గారి దగ్గర యోసేపు గారు నేర్చుకున్నారు! నేర్చుకున్న పాఠమునుండి కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు యోసేపు గారు! అవసరమైతే చెరసాల అనుభవించారు గాని సత్యమునుండి తొలిగిపోలేదు! తన యజమానురాలు తనతో పాపం చెయ్యమని అడిగితే- ఆయన జవాబు చూడండి: కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును...??? అది దేవునికి వ్యతిరేఖమైన కార్యం అని తన తండ్రి చెప్పారు. దానిని నేర్చుకున్నారు యోసేపు గారు! అవును పెండ్లి కాకుండా చేసే సెక్స్ అది వ్యభిచారం! పర పురుషునితో లేక పరాయి స్త్రీతో చేసేది వ్యభిచారం! దేవునికి ఇది ఇష్టం ఉండదు! కాబట్టి యవ్వనస్తునికి శోధన కలిగిన వెంటనే వాక్యమనే ఆత్మఖడ్గమును వాడి శోధనను జయించారు ఇంకా చెప్పాలంటే శోధన పెరగకుండా పారిపోయారు! చివరకు ఒకరోజు దేశానికే గవర్నర్ కాగలిగారు!

 

గాని దావీదుగారు, సంసోను గారు ఇద్దరు- ధర్మశాస్త్రంలో మంచి పట్టున్నవారే, ఇద్దరూ ఆత్మపూర్ణులే! గాని తమ కోరికలు అణచుకోలేక సాతాను వేసిన కామవాంచ అనే అగ్నిబాణం వలన క్లీన్ బౌల్డ్ అయిపోయారు! దావీదుగారు దేవుని శాపం పొందితే, సంసోను గారు కల్లు పీకించుకుని అవమానాలు పొంది కుక్కచావు చచ్చారు! వీరిద్దరూ వాక్యమనే ఆత్మఖడ్గము తమవద్ద ఉన్నా గాని పాపం కమ్మగా ఉంది అని వాడలేకపోయారు! నీవు కూడా నీకిచ్చిన ఆయుధాలు వాడకపోతే నీ ఆత్మీయపోరాటంలో నీవు కూడా ఓడిపోతావు జాగ్రత్త!

 

రెండవ బ్యాచ్: *సౌలురాజు, దావీదు రాజు*!

ఇద్దరు దేవుని చేత ఏర్పాటుచేయబడిన వారే, ఇద్దరు అభిషేకం పొందిన వారే, ఇద్దరు పరిశుద్ధాత్మను పొందినవారే, ఇద్దరు ప్రార్ధనాపరులే! ఇద్దరు ధర్మశాస్త్రం లో దిట్ట! ఇద్దరిమీద పనిచేసిన శోధన- అధికార కాంక్ష!

 

సౌలురాజుగారు- అధికారం కోసం దేనిని చేయడానికైనా రెడీ అయిపోయారు! చివరికి దావీదు గారిని అనగా తనసొంత అల్లుడిని చంపడానికి ప్రయత్నించి  కుక్కను తరిమినట్లు తరిమారు! అధికారం నిలబెట్టుకోవడం కోసం ధర్మశాస్త్రం ద్వారా, సమూయేలు గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞను కాలదన్ని, దేవుణ్ణి వదలి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరకు వెళ్ళాడు! భయంకరమైన చావు చచ్చాడు!

 

దావీదు గారు దేవునిచేత అభిషేకించబడిన వ్యక్తిని తాకకూడదు అని ధర్మశాస్త్రం అర్ధం చేసుకొని వాక్యమనే ఆత్మఖడ్గంవాడి శోధన జయించారు! నిజం చెప్పాలంటే దావీదు గారు వీరుడు! నీకోసం- దేశం కోసం ఇంతాచేస్తే, నన్ను చంపడానికి వస్తావా అని కత్తి పట్టుకుని వెళ్తే పదినిమిషాలలో సౌలురాజుని చంపెయ్యగలరు దావీదు గారు! కాని సత్యం కోసం- పాపం నుండి హత్యా నేరం/దోషము నుండి తప్పించుకోడానికి పారిపోయారు ఆయన! రెండుసార్లు దొరికినా చంపలేదు! కీడుకి ప్రతికీడు చేయక మేలు చేశారు. అది నీతిని కలిగించింది దావీదు గారికి! ఇక్కడ ఆయన ఉపయోగించిన ఆయుధాలు: వాక్యమనే ఆత్మఖడ్గము, దేవునిమీద భయం! ఇంకా పగతీర్చుట నాపని అని వాక్యం చెప్పడం వలన దానిని గౌరవించడం! మనం కూడా దీనినే అనుసరించాలి!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*98 భాగము*

1పేతురు 3:9-12

9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.

11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (అనుసరింపవలెను).

12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక భాగంలో 12 వచనంలో అమోఘమైన మాట జ్ఞాపకం చేస్తున్నారు పేతురు గారు!

ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

 

ఈమాట కీర్తనలు గ్రంథంలో దావీదు భక్తుని ద్వారా వ్రాయబడింది మొదట! దానినే గుర్తు చేస్తున్నారు!

Psalms(కీర్తనల గ్రంథము) 34:15,16,17,18,19

15. యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.

16. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.

17. నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.

18. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.

 

దీనికి నిదర్శనం నోవహు గారు, యోబు గారు, దానియేలు గారు!

ఆదికాండము 6:8

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

ఆదికాండము 6:9

నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

ఆదికాండము 6:12

దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

 

ఆదికాండము 7:1

యెహోవా తరమువారిలో నీవే నా యెదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.

 

వచనాలలో ఆయన కన్నులు నీతిమంతుడైన నోవహు గారిని చూసి కీడు నుండి తప్పించింది!

 

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

యోబు 1:8

అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.

యోబు 2:2

యెహోవానీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచ రించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

యోబు 2:3

అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు, భూమి మీద అతనివంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా

ఇక్కడ కూడా ఆయన కన్నులు యోబుగారిని చూసి సాతాను దగ్గర పందెం కాస్తున్నాయి!

 

ఇక మూడవ వ్యక్తి కోసం కూడా చూద్దాం!

యెహేజ్కేలు 14:13

నరపుత్రుడా, దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును

యెహేజ్కేలు 14:14

నోవహును దానియేలును యోబును ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

ఇక్కడ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా దుష్టులను శిక్షిస్తాను అని కూడా చెబుతున్నారు. దుష్టులకు వ్యతిరేకంగా ఆయన కన్నులు ఉంటాయి అంటున్నారు!

 

ద్వితియోపదేశకాండము 11:12

అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.

 

2దినవృత్తాంతములు 16:9

తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవాకను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.

 

సామెతలు 15:3

యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

 

సామెతలు 15:29

భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.

 

కీర్తనలు 11:4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

 

యోహాను 9:31

దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును.

 

చివరకు నీతిమంతుని ప్రార్థన యొక్క బలము కోసం యాకోబు భక్తుడు అంటున్నారు

యాకోబు 5:16

మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.

 

కాబట్టి జాగ్రత్తగా ఉందాం! ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.

దైవాశీస్సులు!!!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*99 భాగము*

1పేతురు 3:13--17

13. మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?

14. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;

15. నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

16. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.

17. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడు చేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక భాగంలో పేతురు గారు మరలా క్రీస్తు కోసరమైన శ్రమలు హింసలు కోసం గుర్తు చేస్తున్నారు. దీనికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!

13 వచనంలో మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు? అంటున్నారు! మంచి విషయాలలో ఆసక్తి కలిగిఉంటే ఎవడూ మీకు హానిచేయడు అంటూ, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి అంటున్నారు!

అవిశ్వాసులు కూడా కనికరం, దయతో కూడిన ప్రవర్తన, శాపానికి బదులు దీవెన ఇవ్వడం, కీడుకు బదులు మేలు చేయడం చేస్తూ ఉంటే వీటిని గుర్తించి మెచ్చుకోగలరు.

రోమీయులకు 13:3

ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పుపొందుదువు.

రోమీయులకు 13:4

నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.

రోమీయులకు 13:5

కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

 

న్యాయమైన ప్రవర్తనకు బాధలు అనుభవించవలసి రావడం ఇలాంటి లోకంలో సంభవమే 2:19-20; 4:12-13.

1 Peter(మొదటి పేతురు) 2:19,20,21

19. ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

21. ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

 

1 Peter(మొదటి పేతురు) 4:12,13,14

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

 

ఇలా జరిగినప్పుడు మత్తయి 5:10-12లో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి.

Matthew(మత్తయి సువార్త) 5:10,11,12

10. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

 

ఇంకా వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి అంటున్నారు

యెషయా 8:12

12 “ ప్రజలుకుట్రఅని చెప్పే ప్రతిదీ కుట్ర అనుకోవద్దు. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు. దానివల్ల హడలిపోవద్దు.

 

మత్తయి 10:26

26 “కనుక వారికి భయపడకండి. కప్పిపెట్టినది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచినది ఏదీ తెలిసిపోకుండా ఉండదు

 

యోహాను 14:27

27 “శాంతిని నేను మీకిచ్చి వెళ్ళిపోతాను. నా శాంతినే మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే ప్రకారం నేను మీకివ్వడం లేదు. మీ హృదయం ఆందోళన పడనియ్యకండి, భయపడనివ్వకండి.

 

ఇక తరువాత వచనంలో అంటున్నారు నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

నిర్మలమైన మనస్సాక్షి కలిగిఉండాలి. ఇది విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం!

అనగా మన అంతరాత్మ మన మనస్సు మనమీద తప్పు మోపలేనంత శుద్ధమైన హృదయం కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

అలా నిర్మలమైన మనస్సాక్షి కలిగి మన విశ్వాసము మరియు నిరీక్షణకోసం మనలను నిరూపించండి అంటూ మనలను సవాలు చేసేవారికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పమంటున్నారు.

2 తిమోతి 2:24-25

24 ప్రభువు సేవకుడు జగడమాడకూడదు గాని అందరిమీద దయ చూపాలి. ఉపదేశించగలవాడై ఉండాలి. అపకారాన్ని సహించాలి.

25 ఎదిరించేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. సత్యం తెలుసుకోవడానికి దారితీసే పశ్చాత్తాపం వారికి దేవుడు అనుగ్రహిస్తాడేమో.

 

మనం క్రీస్తు విశ్వాసులం అయిన కారణం ఏమిటో, మన నిరీక్షణ పరలోకంలో ఎందుకు ఉన్నదో మొదట మనకు తెలిసి ఉండాలి. అప్పుడు చక్కగా నమ్మించే స్పష్టమైన రీతిలో దీన్ని ఇతరులకు చెప్పగలిగేలా ఉండాలి.

Ephesians(ఎఫెసీయులకు) 5:15,16,17

15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,

16. అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.

 

ఇక తరువాత వచనంలో అంటున్నారు అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడుదురు.

చూడండి క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకొనే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి అని చెబుతున్నారు!

ఇక 17 వచనంలో దేవుని చిత్త మాలాగున్నయెడల కీడు చేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది అంటున్నారు!

1 పేతురు 2:20

20 తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకొంటే మీకేం కీర్తి? గానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకొంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదే.

 

1 Peter(మొదటి పేతురు) 4:14,15,16

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

 

కాబట్టి శ్రమలను ఓర్చుకుందాం! మన నిరీక్షణ కు విశ్వాసాన్ని రుజువు చెయ్యమని క్రీస్తుని చూపించమంటూ హేళనచేసే వారిని సవాలు విసిరేవారికి సాత్వికముతో భయంతో జవాబు చెబుదాం! నిర్మలమైన మనస్సాక్షి కలిగిఉందాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*100 భాగము*

1పేతురు 3:18--19

18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

19. ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 18,19 వచనాలలో రెండవ అధ్యాయంలో చెప్పినట్లు మొదట శ్రమలకోసం తరువాత యేసుక్రీస్తు ప్రభులవారు ఏవిధంగా శ్రమలు సహించారో చెప్పినట్లు మూడవ అధ్యాయంలో కూడా శ్రమలకోసం చెప్పి మరల యేసుక్రీస్తు ప్రభులవారి శ్రమలను గుర్తు చేస్తున్నారు!

ఏలయనగా మనలను దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి, అనీతుమంతులమైన మనకొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు అంటున్నారు!

1 పేతురు 2:24

24 మనం పాపాల విషయంలో చనిపోయి నీతిన్యాయాలకోసం బ్రతకాలని, ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది.

ఇక క్రీస్తు నీతిమంతుడు అతనిలో అన్యాయం లేదు అని క్రింది రిఫరెన్సులలో చూడవచ్చు

లూకా 23:47; అపొ కా 3:14; 7:52; 22:14; 1 యోహాను 2:1.

 

ఇక అనీతిమంతుల కోసం క్రీస్తు ఎందుకు చనిపోయారు అనేది పౌలుగారు వివరంగా చెబుతున్నారు

మనందరం స్వభావ రీత్యా అనీతిమంతులమే

రోమా 1:29-32;

29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును

31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.

32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

 

Romans(రోమీయులకు) 3:9,10,11,12,15,16,17,18,19,20,21,22,23,24

9. ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

11. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

12. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

15. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.

16. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

17. శాంతిమార్గము వారెరుగరు.

18. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

19. ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

పాపులైన మనుషులకోసం క్రీస్తు బాధలు అనుభవించడంలోని ఉద్దేశం : మనల్ని దేవుని చెంతకు చేర్చడమే. ఎఫెసు 2:13-18;

Ephesians(ఎఫెసీయులకు) 2:13,14,15,16,17,18

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

15. ఇట్లు సంధిచేయుచు, యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

16. తన సిలువ వలన ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.

 

హెబ్రీ 10:19-22;

19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

 

ఇక పాపముల విషయమై ఒక్కసారే శ్రమపడెను....

యోహాను 19:30

30 పులిసిపోయిన ద్రాక్షరసం తీసుకొన్న తరువాత యేసుసమాప్తమయిందిఅన్నాడు. అప్పుడు తల వంచి ప్రాణం విడిచాడు.

 

Hebrews(హెబ్రీయులకు) 9:25,26,27,28

25. అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.

26. అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.

27. మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; తరువాత తీర్పు జరుగును.

28. ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.

 

ఇక యేసుక్రీస్తు ప్రభులవారుశారీరకంగా ఆయన చంపబడ్డారు

మత్తయి 16:21; 27:50, 58-60; మార్కు 15:43-45; యోహాను 19:32-34; 1 కొరింతు 15:3.

 

దేవుని ఆత్మచేత సజీవమయ్యాడు.

మత్తయి 28:6; రోమా 1:6.

కాబట్టి ఆయన మన పాపముల విషయమై శ్రమపడి చంపబడి మనలను పాపముల నుండి విమోచించి ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఎందరైతే దీనిని నమ్మి విశ్వసించి ఆయన నామంలో బాప్తిస్మము పొందుతారో వారు తమ పాపముల నుండి కడుగబడి ఆయన పిల్లలు గా మార్చబడి పరిశుద్ధులుగా పరమునకు వారసులవుతారు! ఇందుకే క్రీస్తు మనకోసం శ్రమపడ్డారు!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*101 భాగము*

 

1పేతురు 3:20--22

20. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 20--22 వచనాలలో పేతురు గారు మూడు మర్మములు తెలియజేస్తున్నారు!

మొదటిది: నోవహు గారి కాలంలో 120 సంవత్సరాలు నోవహు గారు జళప్రలయం నాశనం వస్తుంది. మారు మనస్సు పొందమని ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు! అయితే కాలంలో అలా ప్రకటించింది క్రీస్తు యొక్క ఆత్మ అని తెలియజేస్తున్నారు!

 

రెండవది: యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

మూడు: మరణం మీద పాతాళం మీద విజయం పొందిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు!

 

సరే మొదటి మర్మము కోసం చూసుకుందాం!

దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

 

19-22 వచనాలలో భాగం అర్థం చేసుకోవడం కష్టం. క్రీస్తు తన మరణానికీ పునరుత్థానానికి మధ్య కాలంలో ఎక్కడికో వెళ్ళి చెరలో ఉన్న కొన్ని ఆత్మలకు ఏదో ప్రకటించాడని ఇది చెప్తున్నది. ఆత్మలంటే ఏమిటో, చెర ఏమిటో, చాటింపు ఏమిటో పేతురు గారు ఇక్కడ ఏమీ వివరించలేదు. యేసుక్రీస్తు ప్రభులవారు ఆత్మ నోవహు కాలంలో అతనిలో ఉండి ప్రకటించాడని కొందరు పండితులు అంటారు. అయితే అభిప్రాయం 19 వచనంలోని మాటను లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ మరో మర్మం కనిపిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? “అపొస్తులుల విశ్వాస ప్రమాణంఅనే పేరుగల ఒక ప్రతిజ్ఞను కొన్ని సంఘాలవారు వల్లిస్తారు. అందులో ఆయన నరకంలోకి దిగివెళ్ళాడని అర్థాన్ని ఇచ్చే మాటలున్నాయి. శిక్షను అనుభవించడం కోసం క్రీస్తు నరకంలోకి దిగలేదన్నది ఖాయం. ఆయన బాధలన్నీ సిలువ మీదే అంతమయ్యాయి యోహాను 19:30 ప్రకారం. అయితే చనిపోయినవారుండే అదృశ్య లోకానికి (హీబ్రూ భాషలోషియోల్”) ఆయన వెళ్ళినట్టుంది. ఎఫెసు 4:9; కీర్తన 16:10 ప్రకారం!

ఎఫెసు 4:9

9 “ఆరోహణమయ్యాడుఅంటే మొదట ఆయన భూమి క్రింది భాగాలలోకి దిగాడని అర్థమిస్తుంది గదా.

 

క్రింది భాగాలలోకి అంటే చనిపోయినవారు ఉండే అదృశ్య లోకానికి అని పౌలుగారి భావం కావచ్చు.

 

కీర్తనలు 16:10

10 ఎందుకంటే నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు.

నీ పవిత్రుడైన నన్ను కుళ్ళి పోనియ్యవు.

 

మృత్యులోకం ఇక్కడ మొదటి సారిగా హీబ్రూ పదంషియోల్కనిపిస్తున్నది. దీన్నిమృత్యులోకంఅనీసమాధిఅనీపాతాళంఅనీ అనువదించడం జరిగింది. ఇది చనిపోయినవారు వెళ్ళే స్థలం. మరణం, సమాధి తరువాత మనుషుల ఆత్మలు చేరుకునే అదృశ్య లోకం పదంలో వెల్లడి అవుతున్నది. పాత నిబంధన కాలంలో ఉన్నవారు ఇది దుఃఖకరమైన స్థలం అని సాధారణంగా భావించారు (2 సమూ 22:6; కీర్తన 9:17; 18:5; 116:3; యెషయా 14:9-17; యెహె 32:21). పాత నిబంధన విశ్వాసులు గానీ అవిశ్వాసులు గానీ చనిపోయినవారి గురించి ఎక్కువ సమాచారం కనిపించదు. కొత్త నిబంధన గ్రంథంలో వారి గురించి చాలా ఎక్కువగా రాసి ఉంది. జీవం, అమరత్వం గురించి యేసుక్రీస్తు మూలంగానే మనకు వివరంగా తెలిసింది

2 తిమోతి 1:10 ఇప్పుడైతే అది మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కావడంవల్ల వెల్లడి అయింది. ఆయనే చావును రద్దు చేసి శుభవార్త ద్వారా జీవాన్నీ అక్షయతనూ వెలుగులోకి తెచ్చాడు.

 

క్రొత్త నిబంధనలో మృత్యులోకం కోసం చాలినంత వ్యాఖ్యానం ఉంది అపొ కా 2:25-32; 13:34-37 దయచేసి చూడండి!

కాబట్టి మొదటగా ఆయన నోవహు గారి కాలంలో ఆత్మరూపిగా నోవహు గారికి తోడైయుండి సువార్త ప్రకటించారు! గాని ఎవరూ దానిని అంగీకరించలేదు. అయితే నోవహు గారు తన భార్య, కుమారులు ముగ్గురు, కోడళ్లు ముగ్గురు మొత్తం ఎనిమిది మంది మాత్రమే అంగీకరించారు.  ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

మరి నీటి బాప్తిస్మం పొందలేదు అంటారేమో- అదే 1పేతురు :20 మరియు 1కొరింథీ 10:2. ప్రకారం వారు కూడా బాప్తిస్మం పొందారు. మన దృష్టిలో మన లెక్కలో కాకుండా అది దేవుని దృష్టిలో వారుకూడా బాప్తిస్మం క్రిందకు వచ్చేశారు అని నా ఉద్దేశం!

1కోరింథీయులకు 10:2

అందరును మోషేను బట్టి (మోషేలోను) మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;

కాబట్టి రక్షణ పొందటానికి సువార్త ను అంగీకరించాలి. తరువాత యేసుక్రీస్తు ప్రభులవారి నామంలో బాప్తిస్మము పొందాలి. అప్పుడు రక్షణ పొందుతారు! నోవహు గారి కుటుంబం అలాగే రక్షణ పొందింది!

ఇది మొదటి మర్మము!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*102 భాగము*

1పేతురు 3:20--22

20. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 20--22 వచనాలలో పేతురు గారు మూడు మర్మములు తెలియజేస్తున్నారు!

మొదటిది: నోవహు గారి కాలంలో 120 సంవత్సరాలు నోవహు గారు జళప్రలయం నాశనం వస్తుంది. మారు మనస్సు పొందమని ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు! అయితే కాలంలో అలా ప్రకటించింది క్రీస్తు యొక్క ఆత్మ అని తెలియజేస్తున్నారు!

 

రెండవది: యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

మూడు: మరణం మీద పాతాళం మీద విజయం పొందిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు!

 

            (గతభాగం తరువాయి)

 

మూడు వచనాలలో మూడు మర్మముల కోసం ధ్యానం చేస్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది అంటున్నారు కాబట్టి బాప్తిస్మము కోసం కొద్దిగా ధ్యానం చేసుకుందాం!

 

                   *బాప్తిస్మము*

 

బాప్తిస్మము అనగా ముంచబడుట!

వచనాలలో నోవహు గారి కుటుంబం ఉపమాన రీతిగా బాప్తిస్మము పొందినట్లు కనిపిస్తుంది!

బాప్తిసం కోసం మత్తయి 3:6, , మత్తయి 3:13-16, ; మత్తయి 28:19, ; మార్కు 16:16, ; అపో 2:38, .

ఇకబజల ప్రళయం నీటి బాప్తిసానికి సూచన. నోవహు, అతని కుటుంబం ప్రాణాలు దక్కించుకున్నది నీటిలో ఉండడం ద్వారా కాదు, ఓడలో ఉండడం ద్వారానే. ఓడ క్రీస్తును సూచిస్తున్నది (ఆది 7:24, ). బాప్తిసం రక్షణకు సూచన. అది క్రీస్తు మరణ పునర్జీవనాలకూ, ఆయనతో మన ఐక్యతకూ గుర్తు (రోమా 6:3-10, ). కేవలం బాప్తిసం ఆచారం మనుషుల్ని రక్షిస్తుందని చెప్పడం తన ఉద్దేశం కాదని తెలిపేందుకు పేతురుగారు మూడు సంగతులు చెప్తున్నారు.

1) బాప్తిసం అంటే శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు (“శరీర స్వభాపం రోమా 7:5, , రోమా 7:18, ).

2) బాప్తిసందేవునిపట్ల మంచి అంతర్వాణి (మనస్సాక్షి) ఇచ్చే జవాబు” (హెబ్రీ 9:14, పోల్చి చూడండి).

3) అది విశ్వాసాన్నీ, నూతన జీవాన్నీ సూచించే గుర్తు. బాప్తిసం పొందుతున్నవారు తాము దేవుని ఇష్టానికి అనుగుణంగా జీవిస్తామనీ, తమ మనస్సాక్షిని లేక అంతర్వాణిని మరెన్నడూ అశుద్ధం చేసుకోమనీ, దాని నోరు మూయించమనీ బహిరంగంగా ప్రకటించడమే అందులోని ఒక ఉద్దేశం.

మనల్ని దేవుని దగ్గరికి తెచ్చేది క్రీస్తు పడిన బాధలే ( 18). మనలను రక్షించేది క్రీస్తు పునర్జీవనమే. రోమ్ 4:25 చూడండి. బాప్తిసం దాన్నే తెలియజేస్తున్నది. బాప్తిసమంటే జలప్రళయం నీళ్ళకుఅనుగుణమైన చిహ్నంకాబట్టి మనమిలా చెప్పుకోవచ్చు నోవహును రక్షించినది నీరు కానట్టే మనల్ని రక్షించేది బాప్తిసం కాదు ( 20).

 

ఇంకా వివరంగా చూసుకుందాం!

రోమా 6:13

 1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?

2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? . . .

 

          ప్రియమైన దైవజనమా! మూడు వచనాలలో మూడు పాముఖ్యమైన విషయాల గురించి పౌలుగారు చెబుతున్నారు.

1. పాపము- కృప;

2. క్రీస్తుతోపాటు చనిపోవుట;

3. బాప్తిస్మము.

 

ఈరోజు పౌలుగారు ఇదే ప్రశ్న నిన్ను నన్ను అడుగుతున్నారు!!! పాపము విషయమై చనిపోయిన మనం ఇకమీదట పాపములోనే ఎలా జీవిస్తాము? *ఇంకా మనలో పాపం ఉంది అంటే మనం చచ్చేటప్పుడు సరిగ్గా చావలేదన్నమాట*! *అనగా నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన మారుమనస్సు పొందకుండా నీటిలో మునిగేసావన్నమాట*! *లేకపోతే ఏదో ఆవేశంలో, ఉద్రేకంలో తీసుకున్న నిర్ణయమే తప్ప నిజమైన మారుమనస్సు లేదు నీలో*! *లేదా అప్పుడు బాగా వెలిగించబడ్డావు కాని ఇహలోకం నిన్ను ఆకర్షిస్తే పంది బురదకు తిరిగినట్లు, కుక్క తనవాంతినే మరలా తినినట్లు నీవు విసర్జించిన వాటిని మరలా చేస్తున్నావు అంటే కుక్కకు, పందికి నీకు తేడా లేదన్నమాట!*

 

    ఇంతకీ విశ్వాసులు పాపం విషయమై ఎక్కడ, ఎప్పుడు, ఎలా మరణించారు???!!!  దీనికి జవాబు ఇదే అధ్యాయం 3,6,8 వచనాలలో చాలా వివరింగా చెబుతున్నారు పౌలుగారు!

3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, . . .

*క్రీస్తుతో సిలువ మరణం పాలైందని*, *క్రీస్తుతో చనిపోయామని*,  ఇంకా విశ్వాసులు క్రీస్తుతో ఐక్యంగా/ ఏకమై ఉన్నారని వచనాలలో మనం చూడవచ్చు! యేసుక్రీస్తుప్రభులవారు ఇలా మరణించిన అనగా పాపము విషయమై మరణించిన వారికి, తిరిగి క్రీస్తు పునరుత్థానంలో పాలుపొందిన వారికందరికీ నాయకుడు! మరియు ప్రతినిధి! దేవుడు యేసయ్య కి సంభవించినది యేసయ్య శిష్యులు అనగా తనను వెంబడించి, పాపము విషయంలో చనిపోయిన వారికందరికీ జరిగినట్టే భావిస్తారు! కారణం యేసుక్రీస్తుప్రభులవారు వారికి బదులుగా పొందవలసిన శిక్షనంతటినీ భరించారు.  ఇక్కడ దేవుని దృష్టిలో విశ్వాసులు తమ పాత భ్రష్ట స్వభావాన్ని బట్టి ఏమైయున్నారో అదంతా యేసు సిలువ వేయబడి మరణించినట్లుగా చూస్తున్నారు.  కాబట్టి ఇప్పుడు పాపం విషయంలో చనిపోయిన మనం ఇంకా అదే పాపంలో ఎలా జీవించగలం?? క్రీస్తు చనిపోయి తిరిగిలేచినట్లే మనం కూడా పాపం విషయంలో చనిపోయి, యేసయ్య పునరుత్తానుడైనట్లు మనం కూడా నూతన జీవితంతో నూతనంగా పాపం లేని, మచ్చలేని జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి!

 

   అలాకాకుండా ఇంకా నీ బ్రతుకులో వ్యభిచారం ఉంది అంటే నీవింకా సరిగ్గా చావలేదు! నీలో అబద్దాలు, అబద్దపు బ్రతుకు కనబడుతుంది అంటే నీవింకా సరియైన విధంలో చావలేదు.  లోకపు బూతులు, పాపం,  త్రాగుడు, సినిమాలు-షికార్లు, జూదం, చెడు అలవాట్లు ఉన్నాయి ఉంటే నీవింకా పాపం విషయంలో చావలేదు! అందుకే నీలో ఇంకా పాపపు బుద్దులు అలవాట్లు కనిపిస్తున్నాయి. గోధుమ గింజ చనిపోతేనే అది మొలకెడుతుంది. గింజ అయిన మొదటగా అది చస్తుంది,. తర్వాతనే నూతన జన్మ తనకు వస్తుంది. యోహాను 12: 24

గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.

 

మొదటి కొరింథీయులకు 15:36,37,38,42,43,44,45

36. అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.

37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.

38. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

42. మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

44. ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.

 

అలాగే పాపము విషయంలో లోకంలో నీవు చావాలి. పాపం, లోకాశలు, అత్యాసలు చావాలి. అప్పుడు క్రీస్తులో నూతన జీవము, నిత్యజీవం పొందుకోగలవు! పాపపు ఆశలు అనే పేరెన్నికగన్న శరీరాశలు నీలో చావాలి అనగా . గలతీయులకు 5:19,20,21

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.  ఇవి ఎప్పుడైతే చస్తాయో అప్పుడు ఆత్మఫలము వృద్దిపొందుతుంది. అవి 

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. . . . . ..

 

     ప్రియ సహోదరీ/ సహోదరుడా! నిన్ను నీవే పరీక్షించుకో! ఇంకా నీలో శారీరక క్రియలు కనిపిస్తున్నాయి అంటే నీవు ఇంకా చావలేదు. ఒకవేళ చస్తే అవి చేస్తుండేవాడవు/దానవు కాదు! అయితే నీలో ఆత్మఫలములు ఫలిస్తే నీవు లోకంలో చచ్చి, ఆధ్యాత్మికముగా జీవిస్తున్నావు అన్నమాట!   శారీర ఫలాలు ఫలించే వారి అంతము నరకం. అగ్ని ఆరదు పురుగు చావదు! యుగయుగములు అగ్నిలో మాడ వలసినదే!

 

   ఏదికావాలి నీకు?

జీవమా? మరణమా?

లోకమా? దైవమా?

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*103 భాగము*

1పేతురు 3:20--22

20. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 20--22 వచనాలలో పేతురు గారు మూడు మర్మములు తెలియజేస్తున్నారు!

మొదటిది: నోవహు గారి కాలంలో 120 సంవత్సరాలు నోవహు గారు జళప్రలయం నాశనం వస్తుంది. మారు మనస్సు పొందమని ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు! అయితే కాలంలో అలా ప్రకటించింది క్రీస్తు యొక్క ఆత్మ అని తెలియజేస్తున్నారు!

 

రెండవది: యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

మూడు: మరణం మీద పాతాళం మీద విజయం పొందిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు!

 

            (గతభాగం తరువాయి)

 

మూడు వచనాలలో మూడు మర్మముల కోసం ధ్యానం చేస్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది అంటున్నారు కాబట్టి బాప్తిస్మము కోసం కొద్దిగా ధ్యానం చేసుకుందాం!

 

                   *బాప్తిస్మము*

 

బాప్తిస్మము అనగా ముంచబడుట!

 

రోమా 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? . . .

 

            *క్రీస్తుయేసు లోనికి భాప్తిస్మము పొందిన మనమందరమూ ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా*??!!! 

ఇక్కడ పౌలుగారు చెబుతున్నారుయేసుక్రీస్తులో బాప్తిస్మం పొందడం అంటే కేవలము నీటిలో మునిగెయ్యడం కాదు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందేము అని అర్ధము. బాప్తిస్మం పొందేము అంటే మన పాత అలవాట్లు, పాపపు అలవాట్లు, పాప/పాతరోత జీవితమును కూడా సమాదిచేస్తున్నాం అన్నమాట!  మన పాపపు జీవితాన్ని బాప్తిస్మం ద్వారా సమాధి చేశాం అన్నమాట! మరి సమాధిచేయబడ్డ అలవాట్లు మరల కనిపించాయి అంటే నీ అలవాట్లు, నీవు, నీ పాతరోత జీవితం చావలేదు అన్నమాట!

 

    పౌలుగారు 34 వచనాలలో చెబుతున్న బాప్తిస్మం ఏమిటి? బాప్తిస్మం అనేమాట గ్రీకు భాషనుండి వచ్చింది.  ఒకవేళ పదాన్ని తెలుగులోకి డైరెక్ట్ గా గ్రీకునుండి తర్జుమా చేస్తే దాని అర్ధం ఇలా వస్తుంది: *క్రీస్తులోకి ముంచబడిన*, *క్రీస్తులోకి ప్రవేశించిన*, *యేసుక్రీస్తులోనికి తీసుకుని రాబడిన* అని అర్ధాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని చూసుకుంటే ఇలా వస్తుంది *మనం ఆయన మరణంలో ముంచబడ్డాము* లేక *ఆయన మరణం లోనికి ప్రవేశించాము* లేక *ఆయన మరణములోనికి తీసుకుని రాబడితిమి* అని అర్ధం! కాబట్టి ముంచబడటం అంటే క్రీస్తులోనికి మునగడం అని అర్ధము, గాని నీటిలో మునగడం అని మాత్రం కానేకాదు! అంటే ఇక్కడ బాప్తిస్మం అనేది క్రీస్తుతో ఐక్యమవడాన్ని సూచిస్తుంది.  ఆయనతో ఒక ప్రత్యేక సంబంధం లోనికి ప్రవేశించడం, పరిశుద్ధాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మిక దేహంలో ఒక అవయవంగా మారడం అని అర్ధం! దానికి ఉదాహరణ 1కొరింథీ 12:1213

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి..; యోహాను 17:21, 23

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

 

      బాప్తిస్మం అనేది క్రొత్త నిబంధనలో ఇతరచోట్ల కూడా ఒక గుర్తుగా , సాదృశ్యంగా వాడారు. లూకా 12:50, 1కొరింథీ 10:2;  నీటి బాప్తిస్మం అనేది ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా పౌలుగారు చెబుతున్నారు.  *నీటిలోనికి వెళ్ళడం అంటే క్రీస్తుతో కూడా మరణానికి వెళ్లి పాటిపెట్టడాన్ని సూచించడమే కాకుండా 4 వచనం ప్రకారం నీటిలోనుండి బయటికి రావడం అంటే ఆయన పునరుత్తానుడైనట్లు మనం కూడా ఆయనతో పాటు ఆధ్యాత్మికంగా పునరుత్థానులం అయ్యామన్నమాట*! అనగా మన పాప/పాతరోత జీవితాన్ని నీటిలోనే వదిలేసి నూతన జీవన విధానంలో తిరిగి జన్మించాము అన్నమాట! మత్తయి 3:6; 28:19; మార్కు 16:16; అపోస్తలుల 2:38;   ఇక పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం అపోస్తలుల 1:5 లో చూసుకోవచ్చు!

 

    కాబట్టి దీనంతటి ఆర్ధం/ ఫలితార్ధం ఏమిటంటే: క్రీస్తులో దేవుడు మనకోసం చేసిన దానంతటి ఉద్దేశం ఏమిటంటేమనం బాప్తిస్మం పొందాక క్రొత్త జీవితం గడపాలి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను.  పాపం నుండి విడుదల, మరణం అనగా ఆధ్యాత్మిక మరణం నుండి విడుదల, బంధకాల నుండి విడుదల కలిగి పునర్జీవిత సంభంధమైన నూతన జీవితం మనకు కలగాలి, అట్టి జీవితం మనం జీవించాలి అనేది దేవుని ఆశ మనపట్ల! 2కొరింథీ 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

తీతు 2:1114.

11. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై

12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

14. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. ...

 

     కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీ జీవితం ఎలా ఉంది? కేవలం పేరుకు మాత్రం బాప్తిస్మం పొందావు గాని నీ బ్రతుకు ఇంకా అలాగే ఉందా? లేక నూతన జీవిత విధానాన్ని జీవిస్తున్నావా? నీ పాపపు అలవాట్లు మారిపోయాయా? లేక ఇంకా పాపపు ఊభిలోనే మునిగి తెలుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో! ఒకసారి వెలిగించబడిన తర్వాత ఇంకా / మరలా పాపం చేస్తే నిన్ను బాగుచెయ్యడం/ నీవు బాగుపడం దుర్లభం! నేడైనా , నీ దినమందైనా సమాధాన సంభంధమైన సంగతులకోసం ఆలోచిస్తావా?లూకా 19: 42

నీవును నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.

 మరలుతావా పాపం నుండి? రోతనుండి!!!

నేడే అనుకూల సమయం!

ఇదే రక్షణ దినం!

మరో దినం, మరో తరుణం నీ బ్రతుకులో లేదేమో ఒకసారి ఆలోచించు!

నేడు అనే దినం ఉండగానే, సమయం ఉండగానే మార్పునొందు!

భయము నొంది పాపము చేయకు!

దైవాశీస్సులు!

(ఇంకా ఉంది)

 

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*104 భాగము*

1పేతురు 3:20--22

20. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 20--22 వచనాలలో పేతురు గారు మూడు మర్మములు తెలియజేస్తున్నారు!

మొదటిది: నోవహు గారి కాలంలో 120 సంవత్సరాలు నోవహు గారు జళప్రలయం నాశనం వస్తుంది. మారు మనస్సు పొందమని ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు! అయితే కాలంలో అలా ప్రకటించింది క్రీస్తు యొక్క ఆత్మ అని తెలియజేస్తున్నారు!

 

రెండవది: యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

మూడు: మరణం మీద పాతాళం మీద విజయం పొందిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు!

 

ఇక ఈరోజు రెండవ మర్మము కోసం చూసుకుందాం!

యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

గత భాగాలలో చూసుకున్నాము క్రీస్తు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? “అపొస్తులుల విశ్వాస ప్రమాణంఅనే పేరుగల ఒక ప్రతిజ్ఞను కొన్ని సంఘాలవారు వల్లిస్తారు. అందులో ఆయన నరకంలోకి దిగివెళ్ళాడని అర్థాన్ని ఇచ్చే మాటలున్నాయి. శిక్షను అనుభవించడం కోసం క్రీస్తు నరకంలోకి దిగలేదన్నది ఖాయం. ఆయన బాధలన్నీ సిలువ మీదే అంతమయ్యాయి (యోహాను 19:30). అయితే చనిపోయినవారుండే అదృశ్య లోకానికి (హీబ్రూ భాషలోషియోల్”) ఆయన వెళ్ళినట్టుంది. ఎఫెసు 4:9; కీర్తన 16:10 చూడండి.

అదృశ్య లోకమే మృత్యులోకం! యేసుక్రీస్తు ప్రభులవారి పునరుత్థానం వరకు మూడు భాగాలుగా ఉండేది. పాతాళము, అగాదము, పరదైసు!

 

దేవుని పరదైసు అంటే ఏమిటి? అదెక్కడుంది? ఎక్కడ ఉండేది? అందులో గల ఏర్పాట్లు అనగా ఫెసిలిటీస్ ఏమిటి?

 

 ఒకసారి మరలా మనం లేఖనాలకు పోవాలి!

 

పరదైసు అనగా పరిశుద్ధులైన చనిపోయిన ఆత్మల యొక్క గెస్ట్ హౌస్ లేదా రెస్ట్ హౌస్ !

ప్రస్తుతం పాత నిబంధన భక్తుల ఆత్మలు, క్రీస్తునందు నిద్రించిన ఆత్మలు  ఎక్కడ ఉన్నాయి? 

పరదైసులో!

 

పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది?

 పౌలుగారి దర్శనం ప్రకారం 2కొరింథీ 12 ప్రకారము మూడో ఆకాశంలో ఉంది!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 12:2,3,4

2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట *మూడవ ఆకాశమునకు కొనిపోబడెను*; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు *పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను*; మాటలు మనుష్యుడు పలుకకూడదు.

4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

 

దీనిని కాదు అనగలిగిన వాడు ఎవడూ లేడు! మొదట పరదైసు ఎక్కడ ఉండేది! భూమిక్రింద! భూమిక్రింద మొదట భాగము పాతాళము దీనినే హెడేస్ అంటారు!

ఎవరి కోసం ఇది? చనిపోయిన ఆత్మలు, అనగా పాపాత్ములై చనిపోయిన ఆత్మలు ఉండేది, తీర్పు వరకు!

యోబు 24: 19

అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసిన వారిని పట్టుకొనును.

 

దానిక్రింద అగాధము! ఇది ఎవరి కోసం సాతాను గాడి సైన్యం కోసం! దేవునిమీద తిరుగబడ్డ దూతలు కోసం అగాధం ఉంది!

ప్రకటన గ్రంథం 9 మరియు, 20:3ప్రకారం!

 

దానిక్రింద పరదైసు ఉండేది! లాజరు- ధనవంతుడు ఉపమానం ప్రకారం! లూకా 16; లాజరు అబ్రాహాము రొమ్ము అనబడే పరదైసులోను, ధనవంతుడు పాతాళములోను ఉన్నాడు.

అందుకే తండ్రియైన అబ్రాహాము గారు మాకును మీకును మధ్యన మహా అగాధం ఉంచబడింది అన్నారు! ఇది దేవునియందు భయభక్తులు కలిగి భక్తి కలిగిన విశ్వాసుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడింది!

 

      సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయారో   మూడురోజులలో మరణాన్ని సాతానుని జయించి చెరను చెరగా పట్టుకుని పోయారు అని వ్రాయబడింది! .ఎఫెసీయులకు 4: 8

అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.

.. అనగా పరదైసునే దాని అడ్రస్ మార్చివేశారు యేసయ్య! భూమిక్రింద మూడో భాగంలో ఉన్న పరదైసును దానిలో ఉన్న ఆత్మలతో అనగా పాతనిబంధన భక్తుల ఆత్మలతో పాటుగా మూడో ఆకాశంలోనికి తీసుకుని పోయారు!

 

మొదటి ఆకాశం అంతరిక్షం! రెండో ఆకాశంలో అంధకార సంబంధమైన లోకనాధులు, సాతాను శక్తులు ఉన్నారు! యేసుక్రీస్తుప్రభులవారి రెండో రాకడలో మొదటి ప్రస్తానమైన రహస్యరాకడ లో వచ్చేది మధ్యాకాశమునకే! ఆయనరాకడతో అంధకార సంబంధమైన లోకనాధులు సైతాను సమూహం క్రిందకు త్రోయబడతారు! అప్పుడు పరిశుద్ధులకు ఏడేండ్లు మధ్యాకాశంలో విందు! భూమిమీద ఏడేండ్లు మహాశ్రమలు!

 

సరే పైన ఉన్న ఆకాశములోనే ఇప్పుడు పరదైసు ఉంది అని 2కొరింథీ 12 అధ్యాయం చెబుతుంది!

 

సరే, ఇప్పుడు వచనంలో దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములను తిన నిత్తును అంటున్నారు అనగా ఇప్పుడు మృతులైన పరిశుద్ధులందరూ పరదైసులో జీవవృక్షఫలాలు తింటున్నారు! అక్కడ వారు విశ్రాంతిని తీసుకుంటున్నారు! మూడో ఆకాశంలో ఒక భాగమే పరలోకం అని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు! అనగా దేవదూతలతో కలిసి గాన ప్రతిగానాలు చెయ్యడం తప్పించి, దేవదూతలకు ఉన్న  మిగతా ఫెసిలిటీస్ అన్నీ వీరు కూడా అనుభవిస్తున్నారు అన్నమాట! మధ్యమధ్యలో బహుశా దేవుని స్వరాన్ని కూడా వింటున్నారేమో!! ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టాలు నష్టాలు రోగాలు భాధలు లేవు! హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు వారు! మధ్యలో టేస్ట్ కోసం జీవవృక్ష ఫలాలు తింటున్నారు!

గమనించాలి ఇవి కూడా జయించిన వారికి మాత్రమే!

(ఇంకా ఉంది)

*పేతురు వ్రాసిన పత్రికలు*

*105 భాగము*

1పేతురు 3:20--22

20. దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.

21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.

22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇంకా 20--22 వచనాలలో పేతురు గారు మూడు మర్మములు తెలియజేస్తున్నారు!

మొదటిది: నోవహు గారి కాలంలో 120 సంవత్సరాలు నోవహు గారు జళప్రలయం నాశనం వస్తుంది. మారు మనస్సు పొందమని ప్రకటించినట్లు యేసుక్రీస్తు ప్రభులవారు చెబుతున్నారు! అయితే కాలంలో అలా ప్రకటించింది క్రీస్తు యొక్క ఆత్మ అని తెలియజేస్తున్నారు!

 

రెండవది: యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

మూడు: మరణం మీద పాతాళం మీద విజయం పొందిన యేసుక్రీస్తు ప్రభులవారు ఇప్పుడు తండ్రియైన దేవుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు!

 

 రెండవ మర్మము కోసం చూసుకుంటున్నాం!

యేసుక్రీస్తు ప్రభులవారి మరణం మరియు పునరుత్థానం మధ్యలో యేసుక్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి వెళ్ళి ప్రకటించారు!

 

*ఇంతకీ యేసుక్రీస్తు ప్రభులవారికి క్రిందనున్న చెరలో లేదా పరదైసులో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి బోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది*?!

 ఎందుకు చెరను చెరగా తీసుకుని పోవలసి వచ్చింది?

 

పరలోకం వెళ్ళాలి అంటే యేసురక్తమందు కడుగబడాలి, ఇంకా  యేసే మెస్సయ్యా అని నమ్మకుండా అంగీకరించకుండా ఎవరూ పరలోకం వెళ్లరు అది పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా! పాతనిబంధన భక్తులు ధర్మశాస్త్రం అనుసరించి పరలోకం వెళ్దాము అని ప్రయత్నించినా అది వ్యర్ధ ప్రయత్నం అయిపోయింది. ధర్మశాస్త్రము, బలియాగములు అనే అహరోను యాజక ధర్మం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ధర్మశాస్త్రం వలన పరిశుద్దులుగా అవ్వలేకపోతున్నారు అనే మెల్కీసేదేకు క్రమం వచ్చింది అని మనం హెబ్రీ పత్రికలో చూడగలం! మరి వీరు ఎలా మెల్కీసేదేకు క్రమం క్రిందకు వచ్చారు?

 

పాత నిబంధన భక్తులు కూడా మెల్కీసెదెకు యాజక ధర్మం క్రిందకు తేవడానికే ఆయన పరదైసు వెళ్ళారు.

ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు కూడా క్రీస్తు రక్తము క్రిందకు వచ్చేసారు అని నేను అంటున్నాను ! ఎలాగో చెబుతాను! ఇది మీకు అర్ధం కావాలంటే అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో కొన్ని డెఫినిషన్లు తెలియాలి. నేను ఇంటర్నేషనల్ మారిటైమ్ లా చదువుకున్నాను కాబట్టి కేవలం నాలుగు డెఫినిషన్లు చెబుతాను! ఇందులో నేను నా జ్ఞానమును చెప్పడానికి ఇలా చేస్తున్నాను అనుకోవద్దు! నేను మరో కోణంలో మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే!

 

మొదటిది: ట్రీటీ:  అనగా రెండు లేదా మూడు దేశాల మధ్య ఒకే ప్రయోజనం ఆశించి ఇద్దరికీ మేలుకలిగేలా చేసుకునే అంతర్జాతీయ ఒప్పందం! దీనిని ట్రీటీ అంటారు! అయితే ఒప్పందం కేవలం మాటలతో సరిపోదు! దీనికి చట్టబద్దత కల్పించాలి. అనగా పార్లమెంటులో చట్టంచేసి ఆమోదించాలి! అప్పుడే ట్రీటీ అధికారంలోకి వస్తుంది.

 

రెండవది: కన్వెన్షన్: ట్రీటీ చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. మేము కూడా దీనిలో బాగస్తులమవుతాము అని ప్రపంచంలో అనేక దేశాలు వీరితో కలిసి అగ్రిమెంట్ చేసుకుంటే దానిని కన్వెన్షన్ అంటారు! మిగిలిన దేశాలలోను దీనికి చట్టబద్ధత కల్పించాలి మరియు కనీసం 60% దేశాలు ఆమోదించి చట్టబద్దత చేయాలి. అప్పుడే కన్వెన్షణ్ అధికారం లోకి వస్తుంది.

 

మూడు: అమెండమెంట్: కన్వెన్షన్ లో ఏదైనా పేరా గాని రెండు మూడు లైన్లు గాని రెండు మూడు పదాలు గాని లేక అర్ధము గాని మారిస్తే దానిని అమెండ్మెంట్ అంటారు!

 

నాలగవది: ప్రోటోకాల్ : కన్వెన్షన్ చాలా పాతది అయిపోయినా- దాని విధివిధానాలు చాలా పాతవి అయిపోయినా, లేక దానివలన కావాలనుకున్న ఉద్దేశం- ప్రయోజనం నెరవేరక పోయినా కన్వెన్షన్ యొక్క ఉద్దేశము మరియు ప్రయోజనం మారకుండా మొత్తం కన్వెన్షన్ ని మార్చి వ్రాయడం అనేది ప్రోటోకాల్ అంటారు! దీనిలో ఉద్దేశం మరియు ప్రయోజనం మారదు గాని మొత్తం కన్వెన్షన్ దాని టెక్నికాలిటీస్ విధివిధానాలు మొత్తం మారిపోతాయి!

 

అయిపోయింది నా లా సబ్జెక్ట్!

 

దేవుడు- మానవునితో సహవాసం చెయ్యాలని దేవుడు కోరుకున్నారు! గాని మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు! దేవుడు ప్రవక్తలను పంపించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకున్నారు! ఇది ట్రీటీ!

 

దానిని బలపరచడానికి ధర్మశాస్త్రము ఇచ్చి- ఆహారోను యాజకత్వములో బలులు అర్పణలు ద్వారా నీతిమంతులుగాను పరిశుద్దులుగాను మారి పరలోకం చేరాలి. ఇదీ కన్వెన్షన్!

 

అయితే ధర్మశాస్త్రము- మరియు ఆహారోను యాజకధర్మము అనే కన్వెన్షన్ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అని మనము హెబ్రీపత్రిక ప్రకారం చూడవచ్చు! ఇక దేవుడు ఆలోచించి దానివలన ప్రయోజనం లేదు అని- కన్వెన్షన్ మొత్తం మార్చేసి- యేసుక్రీస్తుప్రభులవారి ద్వారా మెల్కీసెదకు యాజకక్రమము తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు- నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు చేరలేడుఇదీ ప్రోటోకాల్! పాతనిబంధన పరిశుద్దుడైనా క్రొత్త నిబంధన పరిశుద్దుడైనా ఎవరైనా సరే క్రీస్తుయేసు యేసు రక్తములో కడుగబడి పరిశుద్దుడిగా మార్చబడి పరలోకం చేరాలి అనే ప్రోటోకాల్ ద్వారానే పరలోకం వెళ్తారు!

 

ఇంతవరకు బాగుంది! క్రొత్త నిబంధన వ్యక్తులకు, ప్రస్తుతము ఉన్న వారికి పర్వాలేదు! మరియు పాత నిబంధన భక్తుల సంగతి ఏమిటి? వారు చనిపోయారు. పరదైసులో ఉన్నారు. మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?? మరి దేవుడు చేసిన రూల్ ని దేవుడే వ్యతిరేఖించి చేయలేరు కదా! మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?

 

రండి ఎఫెసీ 4:8 లో చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులు అనుగ్రహించెను అంటున్నారు.

 

రెండవది: 1పేతురు 3:20 లో అవిదేయులైన ఆత్మలయొద్దకు వెళ్లి, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను అంటున్నారు. తర్వాత ఆయన తర్వాత పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడిపార్శవమున కూర్చెండెను అంటున్నారు.

 

రెండు వచనాలు కలిపి చదువుకుంటే- చెరను చెరగా పట్టుకుపోవడం అనగా మన అందరికీ తెలుసు చెర అనగా పరదైసు! ఎక్కడికి పట్టుకుని పోయారు అంటే సాతాను ఆధ్వర్యంలో భూమిక్రిందన గల పరదైసుని యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయిన వెంటనే రెండు రోజులలో సాతానుని మరణమును జయించి పరదైసుని మధ్యాకాశం లోనికి తీసుకుని పోయారు. పరదైసు యొక్క అడ్రస్ మారిపోయింది. అయితే క్రమంలోనే వచనాలు ప్రకారం చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మస్వరూపి గానే వారికి ప్రకటించెను అనగా ఆత్మస్వరూపిగా పరదైసుకి వెళ్లి  పాత నిబంధన భక్తులకు సువార్త ప్రకటించి ప్రోటోకాల్ క్రిందకు తీసుకుని వచ్చారు అని నాకు అర్ధమవుతుంది. కాబట్టి వెంటనే వారు నమ్మారు! అంగీకరించారు! వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు పరదైసుని మూడో ఆకాశములోనికి తీసుకుని వచ్చారు!

 

ఇదీ జరిగినది రకంగా చెరను చెరగా తీసుకుని పోయి పాత నిబంధన భక్తులకు ఈవులను అనుగ్రహించడానికి పరదైసు అడ్రస్ మార్చి మూడో ఆకాశమునకు తీసుకుని పోయారు అన్నమాట !

 

ఇక మూడవ మర్మము: ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.

 

కీర్తనలు 110:1

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

 

మార్కు 16:19

ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.

 

రోమీయులకు 8:34

శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే

 

హెబ్రీయులకు 12:2

మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

 

ఎఫెసీ 4:810

8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.

9. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా.

10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.

 

సమస్తమును  నింపేలా యిర్మియా 23:24 లో యెహోవాదేవుడు దీన్ని చేసినట్టు రాసి ఉంది. ఇక్కడ క్రీస్తు దీన్ని చేసినట్లు చూస్తున్నాం. క్రీస్తు యెహోవాదేవుని అవతారం అనడానికి ఇది మరో సూచన.  . “ఎక్కిపోయాడు అనగా

 ఎఫెసీయులకు 1:20-21; 20. ఆయన బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, యుగమునందుమాత్రమే

21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.

22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

23. సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

అపో. కార్యములు 2:31-35.

31. క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.

(కీర్తనల గ్రంథము 16:10)

32. యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.

33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.

34. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెనునేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు

(కీర్తనల గ్రంథము 110:1)

35. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.

 

కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు పరమునకు ఎక్కిపోయి తండ్రి కుడి పార్శ్వమున ఉంది సమస్తమును నిర్వహించు చున్నారు అన్నమాట!!

 

మరి ఆయనతో పాటు నీవు ఉండాలి అంటే నీ బ్రతుకు సరిచేసుకోవాలి. దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని పరిశుద్ధమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం వాక్యానుసారమైన జీవితం సాక్ష్యానుసారమైన జీవితం కలిగిఉండాలి!!

అట్టి కృప ధన్యత దేవుడు చదువరులందరికీ దయచేయును గాక!!

ఆమెన్!

దైవాశీస్సులు!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*106 భాగము*

1పేతురు 4:1-5

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకూ మూడు అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము! ఇక నాలుగవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం!

అధ్యాయంలో క్రీస్తు శరీరమందు మనకోసం శ్రమపడ్డారు కాబట్టి అలాగే మనము కూడా క్రీస్తు కోసం శ్రమపడాలి అనే మనస్సు కలిగి ఉండాలి. అలాంటి మనస్సు ఆయుధం గా ఉంటే మనము శరీరాసలు నెరవేర్చక, దేవుని ఇష్టానుసారంగా జీవించగలము అని చెబుతూ మనలో ఎలాంటి శరీరాసలు ఉండకూడదో చెబుతున్నారు! ఇక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు కొన్ని చెబుతూ, మరలా గత మూడు అధ్యాయాలలో చెప్పినట్లు శ్రమలద్వారా సంపూర్ణతను వివరిస్తున్నారు!!

 

ఇక మొదటి రెండు వచనాలలో అంటున్నారు: క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

మనల్ని పాపంనుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించారు (పేతురు 2:24; 3:18). పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో బాధలనెదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి. మనకు మనస్తత్వం ఉంటే అది మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో ఒక ఆయుధంలాగా ఉంటుంది. విశ్వాసులు క్రీస్తుతో తమకున్న ఏకత్వాన్ని గుర్తించి, క్రీస్తులో తాము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించాలి.

 

Romans(రోమీయులకు) 6:5,6,7,8,9,10,11,12,13

5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము (మూలభాషలో- ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా (లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

 

యేసుక్రీస్తుప్రభులవారు పడిన బాధలను దృష్టిలో ఉంచుకుని చూస్తే పాపాల విషయంలో మనకెలాంటి జోక్యమూ ఎప్పుడూ ఉండకూడదు. మన కోరికలను నెరవేర్చుకోవడానికి కాక దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు మనం జీవించాలి (రోమ్ 8:5, 12; 12:1-2; కొలస్సయి 1:9; 4:12; 1 తెస్స 4:3; హీబ్రూ 13:21).

రోమీయులకు 8:5

శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

రోమీయులకు 8:6

ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

రోమీయులకు 8:12

కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము.

 

Romans(రోమీయులకు) 12:1,2

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు లోక (లేక, యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

కొలస్సీయులకు 1:9

అందుచేత సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,

కొలస్సీయులకు 1:10

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

కొలస్సీయులకు 1:11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

 

1థెస్సలొనికయులకు 4:3

మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

1థెస్సలొనికయులకు 4:4

మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

1థెస్సలొనికయులకు 4:5

పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.

 

కాబట్టి క్రీస్తు శరీరమందు మనకోసం శ్రమపడ్డారు కాబట్టి అలాగే మనము కూడా క్రీస్తు కోసం శ్రమపడాలి అనే మనస్సు కలిగి ఉండాలి. అలాంటి మనస్సు ఆయుధంగా ఉంటే మనము శరీరాసలు నెరవేర్చక, దేవుని ఇష్టానుసారంగా జీవించగలము.

 దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని దేవుడే చెబుతున్నారు! ఒకానొకప్పుడు దావీదు గారు కూడా మనుజాశలకు లొంగి వ్యభిచారం చేశారు గాని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలి పోయారు. దేవుని వద్ద క్షమాపణ వేడుకుని, పొందుకుని దేవునితోనే నా ఇష్టానుసారమైన మనుష్యుడు అనిపించుకుని ప్రభువు కోసం స్థిరమైన మనస్సు కలిగి జీవించారు. మనము కూడా క్రీస్తు పడిన శ్రమలను తలచుకుంటూ ఆయన కోసం జీవించడం మొదలుపెడితే శరీరకార్యాలను చేయలేము!

 

హెబ్రీయులకు 13:21

యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో (అనేక ప్రాచీన ప్రతులలో- మీలో అని పాఠాంతరము) జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*107 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-15*

1పేతురు 4:1-5

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక మూడవ వచనంలో విశ్వాసికి ఉండకూడని లక్షణాలు  ఆరు కనిపిస్తున్నాయి! వాటిని చూసుకుందాం!

ఈరోజు విశ్వాసికి ఉండకూడని లక్షణం: పోకిరిచేష్టలు

 

పోకిరి చేష్టలు అనగా పోకిరి పనులు! అల్లరి పనులు! నిజానికి పోకిరి అని ఎవరినంటారు అంటే పనీ పాటు లేకుండా ఊరిమీద పోరంబోకులాగ తిరుగుతూ అల్లరిచిల్లరి పనులు చేస్తూ, అమ్మాయి లను ఏడిపిస్తూ, దారంటపోయేవారిని హేళనచేస్తూ, గేలిచేస్తూ ఉండేవారిని పోకిరీ అంటారు. కోవలోకి సీనియర్ పేరిట ర్యాగింగ్ చేయడం కూడా వస్తుంది! మదుం మీదగాని, బస్ స్టాండ్ లో గాని కూర్చుని అమ్మాయిలను అబ్బాయి లను కామెంట్ చేయడం కూడా పోకిరి కిందనే వస్తుంది! మా పల్లెటూరులలో ఇంటిదగ్గర కుదురుగా కూర్చోకుండా ఊరుమీద బలూదూర్ గా తిరిగే ఆడపిల్లలను కూడా పోకిరీది అంటారు! సరే! ఇలాంటి పనులు విశ్వాసికి ఉండకూడదు!!

ఎందుకంటే విశ్వాసి రక్షణ పొందిన వాడు! క్రీస్తు పిల్లలు! పరిశుద్ధుడు! క్రీస్తు రక్తముచేత కడుగబడి పరిశుద్ధుడిగా చేయబడి మార్పునొంది ప్రత్యేక పరచబడిన వాడు! ఇక క్రీస్తు ఎలా పాపులలో చేరక ప్రత్యేక పరచబడ్డారో అలాగే విశ్వాసి కూడా ప్రత్యేక పరచబడ్డాడు కాబట్టి ఇక మనుజాశలు శరీరాసలు ఉండకూడదు! అందుకే ఇలాంటి పోకిరి పనులు, పోకిరి మాటలు, వెర్రి మాటలు ఉండకూడదు!

తీతుకు 3:3

ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

తీతుకు 3:5

మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన(పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

తీతుకు 3:6

మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,

 

1తిమోతికి 1:12

పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

1తిమోతికి 1:13

నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

 

Ephesians(ఎఫెసీయులకు) 2:1,2,3

1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున (మూలభాషలో- యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.

3. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై (మూలభాషలో- ఉగ్రత పిల్లలమై) యుంటిమి.

 

1కోరింథీయులకు 6:11

మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

 

కాబట్టి ఇప్పుడు కడుగబడిన వారు కనుక ఇక పోకిరి పనులు పోకిరి మాటలు ఉండకూడదు!

అయితే హోషేయ గ్రంథం ప్రకారం భర్తను వదిలి పర పురుషుల వద్దకు వెళ్లడం, వివిధ రకాలైన కామ కలాపాలు కూడా పోకిరితనం పోకిరిపనుల క్రిందకే వస్తుంది!

హోషేయా 2:3

మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయునుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;

హోషేయా 2:10

దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.

 

సరే ఏవిధమైన పోకిరీపనులు పోకిరి చూపులు పోకిరి మాటలు కూడా విశ్వాసికి ఉండకూడదు!

రోమీయులకు 13:12

రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

రోమీయులకు 13:13

అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

రోమీయులకు 13:14

మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

 

2కోరింథీయులకు 12:21

నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.

 

ఎఫెసీయులకు 5:3

మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

ఎఫెసీయులకు 5:4

కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱి మాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

ఎఫెసీయులకు 5:5

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

 

2పేతురు 2:2

మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

2పేతురు 2:18

వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

 

కాబట్టి పోకిరి పనులు మానేద్దాం! పోకిరి మాటలు వదిలేద్దాం!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*108 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-16*

1పేతురు 4:1-5

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక మూడవ వచనంలో విశ్వాసికి ఉండకూడని లక్షణాలు  ఆరు కనిపిస్తున్నాయి! వాటిని చూసుకుందాం! దురాశ కోసం గతభాగాలలో చాలా విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక మద్యపానము- త్రాగుబోతుల విందులు కోసం చూసుకుందాం!

ఈరోజు విశ్వాసికి ఉండకూడని లక్షణం: *మద్యపానము- త్రాగుబోతుల విందులు*

 

     ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).

 

     ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు.  ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).

 

      నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి,  కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు.

 

 గమనించండి  అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది దూషింపబడుతుంది.

ఇంకా ఏమి వస్తాయి?  Sugar, BP, Lever పనిచేయదు, ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము, ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి.

 ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!

 

      కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది?  వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35.

 

 ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా!  దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.

 

1. ఇక్కడ ద్రాక్షారసం (wine)  అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి, పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.

 

2. పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో కాదు). ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.

 

     అందుకే పేతురుగారు అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3). పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).

అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా! మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి" (యోవేలు 1:5)

 

      కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం,  ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు, మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.

 

     అట్టి కృప అందరికీ కలుగును గాక!

     దైవాశీస్సులు.

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*109 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-17*

1పేతురు 4:1-5

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఇక మూడవ వచనంలో విశ్వాసికి ఉండకూడని లక్షణాలు  ఆరు కనిపిస్తున్నాయి! వాటిని చూసుకుందాం!

విశ్వాసికి ఉండకూడని మరో లక్షణం: *అల్లరితో కూడిన ఆటపాటలలో పాలుపుచ్చుకోవడం*

 

 ప్రియులారా దీనికోసం పౌలుగారు కూడా చెబుతున్నారు:

గలతీ 5:1921

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

 

శరీరంఅనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయట పడుతూనే ఉంటుంది.

 

  అల్లరితో కూడిన ఆట పాటలు అంటే?

* సినిమాలు, సీరియల్స్

* అధికంగా వినోదించడం

* తిండిబోతుతనం

* మత్తు పానీయాలు

* మాదక ద్రవ్యాలు

* లైంగిక సంభోగాలతో కూడిన సమావేశాలు మొదలైనవి.

 

సినిమాలు చూడకూడదని ఎక్కడ వ్రాయబడి వుంది? అని ప్రశ్నించేవారు నేటి దినాలలో కోకొల్లలు. అవును! అట్లా వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడే దినాలకు సిమాలు లేవు కాబట్టి, దానిని ప్రత్యక్షంగా వ్రాయవలసి అవసరం లేకపోయింది. కానీ, ఒక్క విషయం! పరోక్షంగా అవన్నీఅల్లరితో కూడిన ఆటపాటలలోచేర్చడం జరిగింది.

 

* సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడు గాని, వేషధారిని క్షమించడు.

 

* సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది.

 

* సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాటo సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు.

ఇట్లా చెప్పకుంటూపోతే, చెప్పలేనన్ని.

 

చాలా ఎక్కువమంది సినిమాలు చూడకూడదు గాని, సీరియల్స్ చూసినా ఏమి కాదు. అని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు. అయితే ఒక్క విషయం! సినిమాయైతే, మూడు గంటలలో అయిపోతుందేమో గాని, సీరియల్ అయితే? మూడు సంవత్సరాలైనా సమాప్తం కాదు. వీటికి అలవాటుపడిన నీవు, శరీరకార్యాలనే నెరవేర్చుతున్నావనే విషయం ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.

 

తాగి తందనాలాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, శరీరవాంఛలను రేకెత్తించే పదజాలం, ఇవన్నీ అల్లరితోకూడిన ఆటపాటలే.

 

శరీరకార్యమేదైనా నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.

 

అల్లరితో కూడిన ఆట పాటలు వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!

 

ప్రియ దైవజనమా! శరీరకార్యాలు అన్నీ నిన్ను నరకానికి నడిపిస్తున్నాయి! ఇవి గనుక నీలో పనిచేస్తే నీవు పరలోకం దరికూడా చేరలేవు! శరీరకార్యాలు తప్పకుండా నీలో కాలిపోవలసినదే! అయితే నీకు నీవుగా వీటిని వదలలేవు కాల్చలేవు! దానికి తప్పకుండా ఆత్మశక్తి కావాలి! పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుంటే ఆత్మశక్తి ద్వారానే వీటిని నీవు దహించగలవు! ఆత్మావేషం, ఆత్మాభిషేకం లేకుండా నీవు వీటిపై జయం పొందడం అసాద్యం! కాబట్టి ప్రియమైన స్నేహితుడా! నీకు శరీరకార్యాలు వదిలెయ్యాలని ఉన్నా సరే, వాటిని వదలలేని పరిస్థితిలో ఉన్నావు కదా, నేడే పరిశుద్ధాత్మయొక్క శక్తి కోసం ప్రార్ధించి పొందుకో! అప్పుడు వీటిని చీకొట్టగలవు! కాల్చివేయగలవు!

 

గమనించాలి: ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21 వచనంలో చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పోతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!

కాబట్టి ఏమికావాలో నిర్ణయించుకో!

శరీరకార్యాలు వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!

 

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*110 భాగము*

1పేతురు 4:1-5

1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.

2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 4-5 వచనాలలో అంటున్నారు 4. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.

5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.

 

 చూడండి గతంలో అనగా ప్రభువును అంగీకరించక మునుపు మారుమనస్సు లేనప్పుడు మీరు కూడా ఇలాంటి  శారీరక పనులే చేశారు గాని ఇప్పుడు మార్పునొంది అలాంటి పనులు అనగా శారీరక క్రియలు చేయకపోవడం వలన మనతోటివారు, మన మిత్రులు, పూర్వం మీతోపాటు క్రియలలో పాలుపొందిన వారు ఇప్పుడు మొదటగా ఆశ్చర్యపడుతున్నారు, రెండవదిగా మిమ్మల్ని గేళి అవహేళన చేస్తున్నారు! దూషిస్తున్నారు. అయితే వారికి తీర్పు ఉంది అంటున్నారు! దేవుని ఎదుట వారు జవాబు ఇవ్వాల్సిన రోజు ఒకటి ఉంది అంటున్నారు పేతురు గారు!

 

పాత జీవితాన్ని వదిలి పవిత్ర జీవనం గడిపే విశ్వాసులు అలా పాత జీవితంలోనే ఉండిపోయినవారికి మందలింపులుగా హెచ్చరికలుగా ఉన్నారు. దేవుడంటే భయభక్తులు లేనివారు, విశ్వాసులను ఇలా తిట్టిపోస్తూ నిందిస్తూ ఉండడానికి కొంతవరకు కారణం ఇదే.

మత్తయి 12:36

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

మత్తయి 12:37

నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

 

అపో.కార్యములు 10:42

ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.

అపో.కార్యములు 17:31

ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

 

రోమీయులకు 2:16

దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

రోమీయులకు 14:11

నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

రోమీయులకు 14:12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

 

2తిమోతికి 4:1

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా

 

హెబ్రీయులకు 4:13

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

 

కాబట్టి అన్ని రిఫరెన్సుల ప్రకారం ఇలా దూషించే వారు ఒకరోజు దేవుని న్యాయపీఠము ఎదుట లెక్కచెప్పాలి. గనుక మీరు నిరుత్సాహ పడవద్దు! అధైర్యపడవద్దు!

 

చివరిగా

ప్రసంగి 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

ప్రసంగి 11:10

లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*111 భాగము*

1పేతురు 4:6

మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడ సువార్త ప్రకటింపబడెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా ఆరవ వచనం చాలా అస్పష్టమైనది. దీనికోసం కొన్ని వివాదాలు ఉన్నాయి!

మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడ సువార్త ప్రకటింపబడెను.

ప్రాచీన ప్రతులలో

6. కారణంచేత చనిపోయినవారు శరీర విషయంలో మానవరీతిగా తీర్పు పొందేలా, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి బ్రతికేలా వారికి కూడా శుభవార్త ప్రకటించబడింది.

ఇక్కడ నిజానికి పాత నిబంధన భక్తులకు యేసుక్రీస్తు ప్రభులవారు మరణం అనంతరం క్రీస్తు ఆత్మరూపిగా సువార్త ప్రకటించిన సందర్భమును మార్చి అనేక విధాలుగా అర్థం చేసుకుంటూ తప్పుడు బోధలొచ్చాయి.

 

వచనం కూడా అర్థం చేసుకునేందుకు కష్టమైనదే. దీని అర్థం బహుశా ఇది కావచ్చు గతంలోనే చనిపోయినవారికి వారు జీవించి ఉన్నప్పుడు వారికి సువార్త ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బ్రతికి ఉన్న మన విషయంలో లాగానే వారి విషయంలో కూడా ఇందులోని ఉద్దేశం ఒకటే ఆత్మ సంబంధమైన జీవం కలగాలనీ, “దేవుని ఇష్టానుసారంగాబ్రతకాలనీ ( 2). వచనాన్ని బట్టి కొందరు పండితులు ఏమని వ్యాఖ్యానించారంటే తమ జీవిత కాలంలో సువార్త విననివారికి చనిపోయిన తరువాత సువార్త ప్రకటన వినే అవకాశం ఉంటుందన్నారు. అయితే బైబిలులో మరి ఎక్కడా ఇలాంటి ఉపదేశం కనిపించదు. ఇలాంటి ఒకటి రెండు సందేహాస్పదమైన, సందిగ్ధమైన వచనాలపై ఆధారపడ్డ ఇలాంటి ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని మనం నమ్మకూడదు. ఒకవేళ అలాంటి అవకాశం గనుక నిజంగా ఉంటే దేవుడు మనకు దాన్ని వెల్లడి చేయలేదు. మనకు తెలిసినదల్లా ఆయన మనకు వెల్లడి చేసినదే ద్వితీ 29:29. మరి కొంతమంది పండితులు ఇక్కడచనిపోయినవారుఅనే మాటకు తమ పాపాల్లో అపరాధాల్లో చనిపోయినవారు అని అర్థం అంటారు (ఎఫెసు 2:1). వ్యాఖ్యానం కూడా ఇక్కడ అంత సరిగా అనిపించడం లేదు.

 

నా చిన్నతనంలో మా ప్రాంతంలో తుని కేంద్రంగా ఒక సంస్థ పనిచేసేది అపొస్తలిక్ ఫెలోషిప్. (సంస్థ పూర్తిపేరు మర్చిపోయాను). వీరు ఏమని భోదించేవారంటే రక్షణ పొందకుండా చనిపోయిన మీ తల్లిదండ్రులు కోసం, తాతలు అమ్మమ్మలు మావయ్యల కోసం, చనిపోయిన మీ పిల్లల కోసం మీరు వారి పేరిట వారికోసం బాప్తిస్మము తీసుకొండి అప్పుడు వారి ఆత్మలు కూడా పరలోకం వెళ్తాయి అనేవారు. దానికి రిఫరెన్సు చూపించమని అడిగితే వారు నాకు చూపించిన  రిఫరెన్సులు ఆరవ వచనము మరియు

1కోరింథీయులకు 15:29

ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?

 

ప్రియులారా ఇలాంటి వివాదాస్పద విషయాలు కోసం ఎక్కువగా ఆలోచన చేయవద్దు! అనేకసార్లు చెప్పాను నేను బైబిల్ పండితున్ని కాదు. అయితే నేను బైబిల్ చదివి ధ్యానం చేసి అర్ధమైన విషయం ఏమిటంటే పాత నిబంధన కాలంలో అలా జరిగినా క్రొత్త నిబంధన కాలంలో మాత్రం, జీవించి ఉన్న దినాలలో నీవు ప్రవర్తించిన జీవితాన్ని ఆధారంగానే నీకు పరలోకమా లేదా నరకమా అనేది నిర్ణయించబడుతుంది! యేసుక్రీస్తు ప్రభులవారిని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకుని పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే పరలోకం తప్ప, నీవు జీవితమంతా తప్పతాగి, వ్యభిచారం చేస్తూ లోకపు కార్యాలు చేసి, నీవు పోయాక నీ పిల్లలు నీకోసం బాప్తిస్మము పొందితే నీవు స్వర్గానికి పోవు! నరకానికే పోతావు! ఇదే బైబిల్ భోదిస్తుంది!

కాబట్టి తప్పుడు బోధలు నమ్మవద్దని మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*112 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-33*

1పేతురు 4:7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా వచనంలో విశ్వాసికి ఉండవలసిన రెండు అమూల్యమైన లక్షణాలు చెబుతున్నారు పేతురు గారు!

మొదటిది స్వస్థ బుద్ది లేదా స్థిర బుద్ధి కలిగి ఉండాలి.

రెండు ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండాలి!

 

అయితే నిజానికి వచనం ప్రాచీన ప్రతులలో ఇలా ఉంది

అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది, గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో, మెళకువగా ఉండండి.

చూడండి అంతము దగ్గరలో ఉంది కాబట్టి ప్రార్థనలో స్థిరంగా మెళకువగా ఉండాలి!

రోమీయులకు 13:12

రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

 

ప్రకటన గ్రంథం 1:3

సమయము సమీపించినది గనుక ప్రవచనవాక్యములు చదువు వాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

 

2 Peter(రెండవ పేతురు) 3:8,9,10,11,12

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు (త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

Matthew(మత్తయి సువార్త) 24:36,42

36. అయితే దినమును గూర్చియు గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

42. కావున దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

 

కడవరి దినాలలో గొప్ప బాధలు, విషమ పరీక్షలు వస్తాయి. గొప్ప మోసకరమైన పరిస్థితులు ఉంటాయి

మత్తయి 24:4-14, 21-25

4. యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.

6. మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.

8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.

9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

10. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.

11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

12. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.

13. అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

14. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

22. దినములు తక్కువ చేయబడక పోయిన యెడల శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము దినములు తక్కువ చేయబడును.

23. కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి.

24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

 

 క్రీస్తుకు విశ్వాస పాత్రంగా, స్థిరంగా నిలవాలంటే ప్రార్థన చాలా అవసరంగా ఉంటుంది. నిజమైన ప్రార్థనకు అవసరమైన రెండు లక్షణాలు ఇక్కడ చూడండి.

లూకా 21:36; 22:40, 46

లూకా 21:36

కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు (కొన్ని ప్రాచీన ప్రతులలో- పాత్రులని యెంచబడునట్లు అని పాఠాంతరము) ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.

లూకా 22:40

తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.

లూకా 22:41

చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి

లూకా 22:46

ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి

లూకా 22:47

మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.

 

ఇక్కడ ప్రార్థన చేయడానికి రెండు ముఖ్య కారణాలు చెబుతున్నారు

మొదటిది జరగబోయే ఆపదలు తప్పించుకుని మనుష్యకుమారుని ఎదుట శక్తిగలవారు కావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెళకువగా ఉండాలి!

రెండు: శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి.

కాబట్టి విశ్వాసికి ఉండవలసిన రెండు లక్షణాలు

1) స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి

2) మెళకువగా ఉండి ప్రార్థన చేయాలి!

 

అయితే స్థిరమైన బుద్ధి, మెళకువ  రెండు విషయాల కోసం గతభాగాలలో విశ్వాసి లక్షణాలు అని చెబుతూ మొట్టమొదటి లక్షణంగా రెండు విషయాలు ధ్యానం చేసుకున్నాము! గనుక ముందుకు పోదాం! ప్రార్థన యొక్క అవసరం కోసం తరువాత భాగం లో కొద్దిగా ధ్యానం చేసుకుందాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*113 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-34*

 

1పేతురు 4:7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా వచనంలో విశ్వాసికి ఉండవలసిన రెండు అమూల్యమైన లక్షణాలు చెబుతున్నారు పేతురు గారు!

మొదటిది స్వస్థ బుద్ది లేదా స్థిర బుద్ధి కలిగి ఉండాలి.

రెండు ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండాలి!

 

           (గతభాగం తరువాయి)

 

ఇక ఈరోజు స్థిరమైన ప్రార్థన మరియు ప్రార్థన విశిష్టత కోసం క్లుప్తంగా చూసుకుందాం!

 

  పౌలుగారు చెబుతున్నారు

ఎఫెసీయులకు 6:18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

చూడండి ఇక్కడ ఆత్మవలన అనగా ఆత్మచేత ప్రతీ సమయమందు ప్రతీ విధమైన ప్రార్ధన చేయమంటున్నారు.

ప్రతీసమయంలో ఎలా ప్రార్ధన చేయడం? అనగా నీవు ఇంటిదగ్గర ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు కూడా ప్రార్ధన చేయాలి!

ఇది సాధ్యమా అంటే సాధ్యమే! ఉదాహరణకు నీవు అన్నం వండటానికి బియ్యం ఏరుతున్నావు అనుకుందాం- దానిలో రాళ్ళు వచ్చాయి వెంటనే నీవు ప్రార్ధన చెయ్యాలి- ప్రభువా బియ్యంలో పనికిరాని రాళ్ళు ఒడ్లు, మట్టి వలె నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు నాలో ఉన్న చెడుగును తీసి పవిత్రపరచండి అనాలి. ఇంకా బియ్యాన్ని కడుగుతున్నప్పుడు ప్రభువా ! బియ్యాన్ని నీళ్ళతో ఎలా కడుగుతున్నావో అలాగే నీవాక్యమనే నీళ్ళతో నాలో ఉన్న మలినాలను కడగండి పవిత్రపరచండి అంటూ ప్రార్ధించాలి! ఇలా నీ మనస్సు ఆత్మ దేవునితో అనుసంధానం అయిపోతే నీవు అనుక్షణం అను నిత్యమూ దేవుని దగ్గర ప్రార్ధన విజ్ఞాపనలు చేయగలవు!

 

6:18 పౌలుగారు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నారు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ విధానాన్నే ఇంకా చూపిస్తున్నారు. ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే సైతాను గజగజ వణకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన సర్వాంగకవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నారు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతో దానితో నిలబడాలి. ప్రార్థన గురించి కీర్తన 66:18; యిర్మీయా 33:3; మత్తయి 6:5-13; 7:7-11; 26:41; మార్కు 11:24-25; లూకా 11:5-13; హీబ్రూ 4:16; 10:19-22; యాకోబు 5:13, 16; 1 పేతురు 4:7.

 

సువార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు కలిగివున్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చెయ్యడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి 2:18; రోమా 8:26; యూదా 20.

ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి.

 అన్నిసమయాల్లోనూఅన్నివిధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలూ ఇతరుల కోసం విజ్ఞాపనలూ చేయాలి, కృతజ్ఞతలూ స్తుతులూ సమర్పించాలి (1 తిమోతి 2:1).

ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోలోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చెయ్యడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది.

 

పరిశుద్దుల కోసం ప్రార్ధన అనగా ఆత్మ సంబంధమైన శత్రువులతో పోరాటంలో విశ్వాసులంతా పాల్గొంటున్నారు. ప్రార్థన ద్వారా అందులో ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయా? తప్పకుండా. విధానాన్ని నియమించినది దేవుడే. ఉపయోగం లేని పనులు చెయ్యాలని దేవుడు చెప్పరు.

 

ఇంకా చేసే ప్రార్ధన ఎలా ఉండాలి అంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలుకువతో చేయాలి! సగం నిద్రపోతూ ఉండకుండా ఎల్లప్పుడూ ఆత్మలో మెలుకువగా ఉండాలి!

 

ఇక చివరిగా ఎవరి కోసం ప్రార్ధన చేయాలి అంటే:

నీ కుటుంబం కోసం ఎలాగూ ప్రార్థన చేస్తావు, అయితే ముఖ్యంగా వీరికోసం ప్రార్థన చేయాలి.

 

*ప్రభుత్వ అధికారుల కొరకు*:     1 తిమోతి 2:1-4

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయ మూర్తులు, సైన్యాధి పతులు, గవర్నర్లు, మేయర్లు మరియు ఇతర ప్రభుత్వాధి కారులు కొరకు ప్రార్ధించాలి.

 

*సంఘ నాయకుల కొరకు*:

సంఘకాపరి, సండేస్కూలు టీచర్స్, సంఘ పెద్దలు, పరిచారకులు మొదలైన స్థానికి సంఘ నాయకులకు అనుదినం ప్రార్ధించాలి.       1 థెస్స 5:12,13

 

మీ సంఘకాపరి ఆరోగ్యాన్ని,, సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి, కుటుంబాన్ని పాడుచేయడానికి సాతాను తీవ్రంగా ప్రయత్నింస్తుంటాడు. కావున ప్రతీరోజూ ప్రార్థన చేయాలి.

 

*ఇతర క్రైస్తవ నాయకుల కొరకు*:

సువార్తికులకోసం, బైబిల్ బోధకుల కోసం, క్రైస్తవ సాహిత్యం కోసం, క్రైస్తవ రచయితల కోసం, ఎడిటర్ల కోసం, బైబిల్ సొసైటీ వంటి ముద్రణాలయాల కోసం, సువార్త గాయకులు, సంగీత కళాకారులు, యూత్ లీడర్స్, చిన్న పిల్లల పరిచర్య చేసే వారి కోసం

 

*మిషనరీ పరిచర్య కొరకు*:

యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు లోకంలో ఎంతో మంది వున్నారు. అయితే, సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన భాద్యత మన మీదుంది.      (మత్తయి 28:18-20)

మనం ఆపని చేయలేకపోయినా, చేసే వారి నిమిత్తం తప్పక ప్రార్ధించాలి.

 

*ఇతర క్రైస్తవ పరిచర్యలు కొరకు*:

రేడియో, టెలివిజన్, కర పత్రికల పరిచర్య, దండయాత్రల పరిచర్య, సువార్త బృందాలు, చెరసాల పరిచర్య, యూత్ పరిచర్య.

 

*దేవుని నామం కోసం హింసించబడుచున్న వారికోసం*

చివరి రోజులలో యేసునామం కోసం మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతోమంది ఎన్నోవిధాలుగా బాదపడుతున్నారు, ఊచకోత కోయబడుచున్నారు, చిత్రహింసలకు గురౌచున్నారు. మానభంగాలకు గురౌచున్నారు. గేలిచేయబడి, చెరసాలలో మగ్గుచున్నారు. కొంతమంది ఇవి తట్టుకోలేక కొండలకు పారిపోయి ఆకలిబాదలతో బాదపడుచున్నారు. వారందరికోసం ప్రార్ధించాల్సిన అవుసరము మనకుంది.

 

*నీ ప్రియమైన వారికోసం*:

వారి రక్షణ, వ్యక్తిగత అవసరాల కొరకు.

 

*ప్రత్యేకమైన అవసరాల కొరకు*:

టి.వి, వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి, వరదలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రమాదాలు, వ్యాధులు, హృదయ విదారకమైన పరిస్థితుల గురించి.

తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి గృహాలు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్న వారి నిమిత్తం, సేద్యం చేస్తున్న రైతుల కోసం, దేశాన్ని కావలి కాస్తున్న సైనికుల కోసం ఇట్లా... అనేక విషయాలను గురించి ప్రార్ధించాల్సిన బాధ్యత మన మీదుంది.

 

భారం నీకుందా?

ప్రార్ధిద్దాం! ప్రభువు చెంతకు నడిపిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

 

             *పేతురు వ్రాసిన పత్రికలు*

                     *114 భాగము*

      *విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-35*

 

1పేతురు 4:8--11

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక ఎనిమిదో వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును గనుక మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండమని చెబుతున్నారు! ప్రేమ కోసం గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాం!

 

ఇక ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో ముఖ్యమైన లక్షణం ధ్యానం చేసుకుందాం: సణుగుకోకుండా ఆతిథ్యం ఇవ్వాలి!

ఆతిథ్యం చేయండి అనడం లేదు గాని సణుగుకోకుండా ఆతిథ్యం చేయండి అంటున్నారు!

 

2 రాజులు 4:811

8. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.

9. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.

10. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.

11. తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి గదిలో చొచ్చి అక్కడ పరుండెను.

 

ఎలీషాగారు ఒక ప్రాంతంలో ఉండకుండా ఇశ్రాయేలు దేశం మొత్తం తిరుగుతూ, అక్కడ ప్రజలను దర్శిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ, అక్కడ ప్రవక్తల శిష్యులను ఏర్పరచి వారిని బలపరుస్తూ ఉండేవారు అని గతంలో చూసుకున్నాం.  పౌలుగారు సంఘాలు స్తాపించి పెద్దలను ఏర్పరచి వారికి సంఘం అప్పగించి, మరో ప్రాంతం వెళ్ళడం ఎలాగో అలాగే ఆకాలంలోనే ఏలియాగారు, ఎలీషాగారు, సమూయేలుగారు మొదలుపెట్టారు.  ఇలా వెళ్ళేటపుడు మార్గమధ్యంలో షూనేము అనే ప్రాంతం ధర్శిస్తున్నారు. అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత స్త్రీ చూసి, దయచేసి మా ఇంట్లో భోజనం చెయ్యండి అని బలవంతం చేసింది . నిజంగా ఇలాంటి వారు నేటి మన సంఘాలలో , ముఖ్యంగా పల్లెటూళ్ళలో చాలామంది ఉన్నారు. అలా చేయాలి కూడా! అందుకే అందుకే పౌలుగారు ఆతిధ్యము చేయ మరవవద్దు. అలాచేసి ఎంతోమంది ఎన్నో మేలులు పొందుకున్నారు అంటున్నారు. హెబ్రీయులకు 13: 2

ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.

 

రోమా 12:114

13. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. .

 

భక్తుడైన ఫిలేమాను గారి గురించి సర్టిఫికేట్ ఇస్తున్నారు పౌలుగారు: పరిశుద్దుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందాయి కారణం నీవిచ్చిన ఆతిధ్యం! 1:7; పౌలుగారు తిమోతిగారికి చార్జి అప్పగిస్తున్నప్పుడు రాస్తున్నారు 1తిమోతి 5:10 లో విధవరాళ్ళు పరదేశులకు ఆతిధ్యమివ్వాలి, పరిశుద్దులకు పరిచర్యచేయాలి. అందుకే అంటున్నారు ఆతిధ్యం చేయ మరువవద్దు.

 

కాబట్టి ప్రియ చదువరీ! నీవు ఆతిథ్యము చేస్తున్నావా లేక తలుపులు మూసివేసి కుంటున్నావా?

 

గమనించాలి ఇదే ఆతిథ్యం చేయడం వలన అబ్రాహాము గారు కుమారుని పొందుకున్నారు. మనోహా అతని భార్య సంసోనుని పొందుకున్నారు. లోతుగారు నాశనాన్ని తప్పించుకున్నారు ఆతిధ్య-మర్యాదల వలననే! అందుకే స్త్రీ ఇలా ఆతిధ్యం చేయడమే కాదు, ఒకరోజు తన భర్తతో చెబుతుంది- మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్న వ్యక్తీభక్తిగల దైవజనుడు! చూసారాఎలీషాగారికి ఉన్న బిరుదు, గుర్తింపు!! ప్రియ సేవకుడా! నిన్నుగూర్చి నీ సంఘం ఏమని అనుకొంటుంది? భక్తిగల వాడివనా? లేక ప్రార్ధనాపరుడవనా? అభిషేకం గలవాడివనా? లేక కానుకలు ఇచ్చేవారి దగ్గరకే వెళ్తాడు అనా? లేక గర్విష్టి అనా? త్రాగుబోతు/ తిట్టుబోతు/ వ్యభిచారి అనా? ఎలీషాగారి కోసం వారు అనుకొంటున్న మాట భక్తిగల దైవజనుడు! ఇంత శ్రేష్టమైన పేరు నీవు కలిగియుండాలి ప్రియ సేవకుడా!  అప్పుడు దేవుడు కూడా భళా నమ్మకమైన మంచిదాసుడా! అని పిలువగలరు! పేరు రాడానికి ఎలీషాగారు చేస్తున్న నిరంతర, స్వలాభం అపేక్షించని పరిచర్య దోహదపడింది. మరి నీ పరిచర్య ఎలాగుంది?

 

    ఇలా చెప్పడమే కాకుండా, తన భర్తతో మాట్లాడి, ఒప్పించి , మేడమీద దైవసేవకునికోసం ప్రత్యేకంగా ఒక గది కట్టి, దానిలో మంచం, బల్ల, దీపం అన్ని ఏర్పాటుచేసింది.  నిజంగా దేవునిపట్ల, దైవసేవకుల పట్ల ఎంత త్యాగం కలిగిందో చూడండి ఘనురాలు. ప్రియ విశ్వాసి! నీ సంఘకాపరి పట్ల, నీకు అలాంటి ఆశక్తి, అభిరుచి, మంచి-మర్యాద ఉన్నాయా? లేక  ఎందుకు వచ్చాడురా బాబు అని అనుకొంటున్నావా? స్త్రీ అలాంటి పరిచర్య చేసింది కనుకనే ఘనురాలు అని అభివర్ణించబడటమే కాకుండా తనకు లేమిగా ఉన్నది పొందుకున్నది.

 

    ఒకరోజు ఎలీషాగారు మరలా షూనేము పట్టణం రావడం ఇంట్లో బసచేయడం చేశారు. గది, మంచం, బల్ల చూసి, తన పరిచారకుడైన గేహాజీని పిలిచి ఘనురాలను పిలువమని చెప్పి అంటున్నారు ఘనురాలుతో: అమ్మా నీకేమి కావాలి? మాకోసం ఇంత కేర్ తీసుకున్తున్నావు. నీకోసం రాజుతోనైనా, అధికారి అనగా అప్పట్లో గవర్నర్ అని అర్ధం అతనితో మాట్లాడాలా అంటే అన్నది ఆమె , అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, అంతేకాకుండా నేను నాస్వజనుల మధ్యనే కాపురముంటున్నాను, నాకు ఏమీవద్దు.  అడిగినందుకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే గేహాజీ అన్నాడు అయ్యా! అన్నీ బాగున్నాయి గాని ఆమెకు పిల్లలు లేరు. అంతేకాకుండా ఆమె భర్త ముసలోడు అని చెబుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఘనురాలు ఆమె తనకు పిల్లలు లేరు, కావాలి అని దైవజనున్ని ఎంతమాత్రము అడగలేదు. గేహాజీయే చెప్పాడు. అందుకు ఎలీషాగారు ఆమెను పిలిచి , వచ్చే సంవత్సరం రోజులలో నీకు కొడుకు పుడతాడు అని దీవించిపోతున్నారు. వెంటనే స్త్రీ అంటుందినాతో అబద్దమాదవద్దు. అంటుంది. గురువుగారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు.

     అయితే దేవుడు ఆమెను దర్శించారు. ఆమె భర్త ముసలివాడైనా సరే, వారిద్దరిని దేవుడు దీవించి ఒక మగ బిడ్డను దయచేశారు. అబ్రాహాము గారికి 100 సం. వయస్సులో ఇస్సాకును దయచేశారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న మనోహా కు దేవుడు సంసోను ని ఇచ్చారు. అలాగే నిండు వృద్ధాప్యంలో ఉన్న జెకర్యాఎలీషబెతులకు బాప్తిస్మమిచ్చు యోహాను ను దయచేశారు. ఇక్కడ ఘనురాలుకి పండంటి మగబిడ్డను దయచేశారు.  బహుశా చదువుతున్న ప్రియ చెల్లీ/ తమ్ముడా నీకుకూడా బిడ్డలు లేరు అని భాధపడుతున్నావేమో! బాధపడకు. దేవుడు నిన్నుకూడా దర్శించబోతున్నారు. నీ నిబ్బరాన్ని, ధైర్యాన్ని విడువవద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు.

ప్రియ చదువరీ! నీవు కూడా ఉపకారమును ధర్మమును చేయడం మరచిపోవద్దు! హెబ్రీ 13:16;

సణుగుకోకుండా ఆతిథ్యం చేయడం మర్చిపోకు!

  దేవుని సేవకులను సన్మానించడం మరచిపోకు! తద్వారా దేవుడు నిన్ను దీవిస్తారు.

   అట్టి కృప మన అందరికీ దేవుడు దయచేయును గాక!

ఆమెన్!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*115 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-36*

 

1పేతురు 4:8--11

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తరువాత వచనంలో దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి దైవసేవకునికి ఉండవలసిన మరో లక్షణం: నీవు పొందుకున్న కృపావరమును బట్టి ఒకనికొకడు ఉపచారం చేయాలి!

అనగా సేవలో వాడబడుతూ ఒకరికొకరు సహాయం చేయాలి! ఉపకారం చేయాలి!

 

మొదటగా కృపావరముల కోసం చూసుకుంటే:

Romans(రోమీయులకు) 12:6,7,8

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11,12

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

 

Ephesians(ఎఫెసీయులకు) 4:7,11,12,13

7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.

11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 

గమనించాలి కృపావరాలు తనకుతాను మేలు చేసుకోవడానికి ఇంకా తన ఆస్తులు కూడబెట్టుకోవడానికి కానేకాదు. అవి మొదటగా ఇతరులకు సేవ చేయడానికి ప్రేమగలవారు దేవుడిచ్చిన సామర్థ్యాలను ఇతరులకు సహాయపడేందుకు ఉపయోగిస్తారు గానీ వ్యక్తిగత లాభం, డబ్బు, కీర్తి ప్రతిష్ఠలకోసం కాదు.

రెండవది సంఘ క్షేమాభివృద్ధి కోసము వాడాలి!

 

ఇంకా అంటున్నారు దేవుని ఆయా విధాల కృప విషయంలో మంచి నిర్వాహకులుగా ఉండాలి.

మత్తయి 24:45

యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

 

మత్తయి 25:21

అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 4:1,2

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

 

కాబట్టి నీవు పొందుకున్న కృపావరమును బట్టి ఒకనికొకడు ఉపచారం చేయాలి!

అనగా సేవలో వాడబడుతూ ఒకరికొకరు సహాయం చేయాలి! ఉపకారం చేయాలి! పరిచర్య చేయాలి!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*116 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-36*

 

1పేతురు 4:8--11

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక తరువాత వచనంలో దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి అంటున్నారు!

 

ఈరోజు విశ్వాసికి దైవసేవకునికి ఉండవలసిన మరో లక్షణం: నీవు పొందుకున్న కృపావరమును బట్టి ఒకనికొకడు ఉపచారం చేయాలి!

 

            (గతభాగం తరువాయి)

 

ఇక పరిచర్యలు కృపావరాలు అంటున్నారు కాబట్టి మరికొంత వివరంగా చూసుకుందాం!

 

Tenfold Ministry రెండు భాగాలు:

 

 Fivefold ministry!

వీరు 1. అపోస్తలులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,

 

మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.

రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!

 

Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.

 

తర్వాత *కాపరులు*: Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.

 

తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.

 

తర్వాత *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.

 

పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆధిక్యత గలవారిని అపోస్తలులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.

 ఇది అత్యంత గొప్పవిషయం!

 

Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20

20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.

 

    ప్రియ దైవసేవకుడా! నీవు సువార్తికుడివా? కాపరిగా మారుటకు ప్రయత్నం చేయు.

కాపరివా- ప్రవచనవరం కోసం, అద్భుతాలు చేసే వరం కోసం ప్రయత్నం చేయు.

ప్రవక్తగా, అపోస్తులుడిగా మారడానికి ప్రయత్నం చేయమని ప్రభుప్రేమతో ప్రోత్సాహపరుస్తున్నాను.

అయితే దానికోసం గొప్ప ప్రార్ధనా శక్తి అవుసరం. పరిశుద్దాత్ముని అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసే శక్తిని వాడుతూఉండాలి.(operate చెయ్యాలి) అప్పుడు దేవుడు నీసేవను ఆశీర్వదిస్తారు. నిన్ను ఒక లైట్ హౌస్ లా వాడుకొంటారు!

 

రోమా 12:48 .

4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30

28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను,  కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.

29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?

30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు భాషల అర్థము చెప్పుచున్నారా_?

 

అందరూ ప్రవక్తలు,  అపోస్తలులు,  అద్భుతాలు చేసేవారు, భోదకులు,  సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపావరములు ఎన్నో ఉన్నాయిగాని, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!  మనమంతా సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా,  అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!

 

 గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరుపనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము. అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు.దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*

 

Fivefold ministry తర్వాత విభాగం వారు *అద్భుతాలు చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.

 

    తర్వాత విభాగం *భాషలు మాట్లాడువారు-అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.

 

    తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు 1:27; యెషయా 58

 

   తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక) ఉండాలి.

ఈరోజుల్లో కుర్చీల్లో కూర్చోడానికి చూస్తున్నారు గాని కుర్చీలు, చాపలు ఎత్తడానికి ఇష్టపడటం లేదు. ఆలయాన్ని తుడవటానికి, కడగటానికి ఎవరు సిద్దపడటం లేదు.

కారణం ప్రిస్టేజ్, ఇగో, అయితే వీటిని పక్కన పెట్టి ఎవరైతే పరిచర్యలు చేస్తారో దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తారు.

దానికి ఉదాహరణ నేనే! నా చిన్నతనములో ప్రతీరోజు ఆలయం తుడిచేవాడిని, ఆరాధనకు చాపలు వేయడం,తీయడం, ఎంగిలాకులు ఎత్తడం, నీరు మోయడం ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తాను. ఫలితం- ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆత్మీయంగా, ఆర్దికముగా దీవించారు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటివి చెయ్యాలి.

 

   చివరగా *ప్రభుత్వాలు చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. సంఘపెద్ద! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.

 

    చివరగా రక్షింపబడిన విశ్వాసి అది ఎవరైనా సరే Tenfold Ministry లో ఏదో ఒక పని చెయ్యాలి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఒకటే కాకుండా నాలుగైదు విభాగాలలో భాగస్తులై ఉండాలి. అయితే వీటిలో ఏదీ చెయ్యడం లేదా, అలా అయితే నీవు నులివెచ్చగా ఉన్నావన్నమాట!!! అందుకే యేసయ్య నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు కాబట్టి నానోట నుండి నిన్ను ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నారు. (ప్రకటన 3:15-16)

ఒకవేళ నీకు సువార్త ప్రకటించడం వీలు కాదా- అయితే వెళ్ళేవారిని పంపండి. మీ  ప్రవర్తన ద్వారా సువార్త చెయ్యండి. మరీ ముఖ్యముగా భారముతో కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి. అట్లు జరిగించిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా తనసేవలో వాడుకొంటారు. లేదంటే విడువబడే గుంపులో ఉంటావు.

 

  దయచేసి ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో/సరిదిద్దుకో!

 

   అయితే ఇప్పటికే  కొన్ని వరాలు-ఫలాలు ఉన్నాయా? అయితే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయు.

 

   అట్టి కృప ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*117 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-37*

 

1పేతురు 4:8--11

8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.

10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

11. ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 11 వచనంలో అంటున్నారు: ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌.

 

వచనం స్టడీ బైబిల్ లో ఇలా తర్జుమా చేయబడింది

ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు పలికినట్టే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడిచ్చిన సామర్థ్యంతో అలా చేయాలి. అన్నిటిలో దేవునికి యేసు క్రీస్తు ద్వారా మహిమ కలగాలనే ఉద్దేశంతో ఉండాలి. ఆయనకే మహిమ, అధికారం యుగయుగాలకు చెందుతాయి. తథాస్తు!

 

ఇక్కడ భోధించినా మాట్లాడినా బైబిలు ఆధారంగా మాటలద్వారా చేసే పరిచర్య అయినా కోవకే చెందుతుంది. ఇలా చేసేవాడు తాను క్రీస్తు స్థానంలో ఆయన ప్రతినిధిగా, దూతగా నిలబడివున్నానని గుర్తుంచుకొని అధికారంతో దేవుని వాక్కును బోధించాలి అంటున్నారు!

 

ఇక ఉపచారము పరిచర్య చేసేవారు దేవుడిచ్చిన సామర్థ్యంతోనే చేయాలి. మన స్వంత బలంతో సేవ చేస్తుండే అవకాశం ఉంది. గాని ఇది వ్యర్థం అయిపోతుంది.

 

అయితే భోదించినా పరిచర్య చేసినా అంతిమ లక్ష్యం దేవునికి మహిమ తేవాలి. మన సేవంతటిలోనూ మన ఉద్దేశం ఇదే కావాలి. తమ స్వంత కీర్తి కోసం మాట్లాడేవారు, లేక తమకు మెప్పు కలగాలనే సేవ చేసేవారు దేవునికి చెందవలసిన స్తుతి, మహిమను దోచుకోజూస్తున్నారు. మత్తయి 6:2, 5;

 

1 కొరింతు 10:31

31 అందుచేత మీరు తిన్నా, త్రాగినా, ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి.

విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన ఒక గొప్ప నియమాన్ని పౌలుగారు ఇక్కడ ఇస్తున్నాడు. ఇంతకన్నా ఉత్తమమైన ఉద్దేశం లేదు. విశ్వాసులంతా దీని ప్రకారం జీవిస్తే సంఘంలో చీలికలు, గుంపులు ఉండవు. విశ్వాసుల్లో అవినీతి ఉండదు, ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు. ఇతరుల్ని అనాలోచితంగా బాధపెట్టే పనులు ఉండవు. మన చర్యలన్నిటినీ సూత్రం వెలుగులో పరీక్షిస్తూ ఉంటే, ఫర్వాలేదులే అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం.

 

సరే భోధిస్తే దేవోక్తులు భోధించినట్లు భోధించమంటున్నారు పేతురు గారు!

అయితే పౌలుగారు అంటున్నారు 2తిమోతి 2:15...

    దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.

 

   పైవచనంలో పౌలుగారు తిమోతిగారిని మూడు విధాలుగా దేవునికి నిన్ను నీవు కనపరుచుకో అంటున్నారు.

1. యోగ్యునిగా;

2. సిగ్గు పడనక్కరలేని పనివానిగా;

. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా దేవునికి నిన్ను నీవు కనుపరచుటకు జాగ్రత్తపడు అంటున్నారు పౌలుగారు!

           

    ఇక మూడవ విషయాన్ని మాత్రమే చూసుకుందాం

 *సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా దేవునికి నిన్నునీవు కనపరచుటకు జాగ్రత్తగా ఉండు అంటున్నారు పౌలుగారు*! స్టడీ బైబిల్ లో అయితే: సత్యవాక్కును సరిగా ప్రయోగించేవాడుగా నిన్నునీవు దేవునికి కనబరచుకోవడానికి ఆసక్తితో కృషి చేయుము! అని వ్రాయబడింది. దేవుని వాక్యమును సరిగా ప్రయోగించాలి, సరిగా ఉపయోగించాలి. సరిగా విభజించాలి! అప్పుడే దేవునివాక్య మర్మము నీకు అర్ధం అవుతుంది. నీభోధ వినే ప్రజలకు కూడా బాగా అర్ధం అవుతుంది అని పౌలుగారి భావము ఇక్కడ! అలాగని నీకు అనుకూలంగా మార్చుకుని బోధచేస్తే దేవుని ప్రతిదండన తప్పించుకోలేవు జాగ్రత్త! అందుకని దయచేసి వాక్యాన్ని కలిపి చెరపకు! ఉన్నదిఉన్నట్టు బోధించాలి!

 

  ఇంతకీ ఎందుకు పౌలుగారు సరిగా విభజించు లేక ప్రయోగించు అంటున్నారు? కారణం దేవుని వాక్యం/ వాక్కు కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ విడుదల కాబడింది లేక చెప్పబడింది లేక ప్రత్యక్షపరచబడింది. వాటిని మనం సరిగా విభజించుకుని అన్వయించుకుంటే సత్యవాక్యము సరిగా అర్ధమవుతుంది. ఒకసారి యెషయ 28:914 చదువుకుంటే ఇంకా బాగా అర్ధమవుతుంది......

9. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియ జేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

10. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

14. కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి!

      కాబట్టి ప్రియ దైవజనమా! కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడిన దేవుని వాక్యాన్ని అది ఇదీ కలుపుకుని విభజిస్తూ వివరిస్తే సంఘానికి సరిగా అర్ధమవుతుంది. ప్రియ దైవజనుడా! ఇంతకీ నీవు ప్రతీరోజూ దేవుని సత్యవాక్యాన్ని పటిస్తూ ధ్యానం చేస్తున్నావా? అప్పుడే నీవు దేవుని వాక్యమును సరిగా అర్ధం చేసుకోగలవు. అందరికీ చెప్పగలవు!

 

  పౌలుగారు వాక్యమును సత్యవాక్యము అని చాలాచోట్ల ప్రయోగించారు. ఎఫెసీ 1:13....

మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

చూడండి ఇక్కడ సత్యవాక్యము అనగా క్రీస్టు రక్షణ సువార్త అని చెబుతున్నారు పౌలుగారు. ఇంకా కొలస్సీ 1:5లో....

మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.

 ఇక్కడ ఇదే సత్యవాక్కును సువార్తసత్యము అంటున్నారు. మొత్తానికి ఇక్కడ సత్యవాక్యము అనగా దేవుని రక్షణ సువార్తనే పౌలుగారు సత్యవాక్యము అని వ్రాస్తున్నారు.

 

       మరి ఇప్పుడు దేవుని మెప్పును పొంది ఆయనకు యోగ్యుడుగా మారాలి అంటే మొదటగా దేవుని వాక్యాన్ని విధముగా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి! కొంతమంది సేవకులు వారు వాక్యము చెబుతున్నారో వారికే తెలియకుండా ప్రసంగాలు చేస్తుంటారు. చావుకు వాక్యము చెప్పాలి, పెళ్ళికి వాక్యము చెప్పాలి, సువార్త ఎలా చెప్పాలి, సంఘ ఆరాధనలో వాక్యము చెప్పాలో తెలియకుండా చెబుతుంటారు. మా సంఘంలో ఒక అమ్మాయి పెళ్ళికి మరో ఊరు వెళ్తే సంఘకాపరి చావు వర్తమానం ఇచ్చారు. స్టేజి దిగాక ప్రజలందరూ వ్యక్తిని తిట్టారు. ఎందుకు తిట్టారు అంటే దేవుని వాక్యమును ఎలా ఉపయోగించాలో తెలియకనే! కాబట్టి దేవుని వాక్యమును సరిగా ఉపయోగించడం తెలియకపోతే దేవుడే కాదు ప్రజలకు కూడా యోగ్యుడుగా ఉండలేవు! .

 

ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి: నా భార్యయొక్క తాతగారు పాష్టర్ గారు. కొంతకాలానికి ఆయన బ్రేన్హాం గారి బోధలు అంగీకరించి వారిలో కలసిపోయారు. కాబట్టి నా భార్య బ్రెన్హమైట్ సంఘానికి చెందినది. మరి బంధుత్వం కోసం అప్పుడప్పుడు వారి వివాహాలు, చావులకు వెళ్తూ ఉంటాను. అప్పుడు అక్కడ వారు చెప్పే బోధలలో కొంతమంది అనేకసార్లు పెళ్ళికి ఒకటే ప్రసంగం, చావుకు ఒకటే ప్రసంగం, మామూలు మీటింగులకు ఒకటే ప్రసంగం. అది ఏమిటంటే: అంత్యకాల ప్రవక్త ఎవరు? ఏం చెప్పారు అంటూ.... ఇలాంటి బోధలు అన్యులు వింటే వీరికి ఇకబైబిల్ లో మరో మాటలు దొరకలేదా అంటుంటారు. కాబట్టి దైవజనుడు తప్పకుండా దేవుని సత్యవాక్కును సరిగా ఉపయోగిస్తూ, సరిగా విభజిస్తూ సరిగా ప్రయోగించే వాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు, ప్రజలు మెచ్చుకుంటారు.

 

  కొంతమంది దైవసేవకులు అనొచ్చునేను ఏమీ చదువుకోలేదు. ఎలా వాక్యాన్ని సరిగా బోధించగలను అంటుంటారు. సహోదరి సహోదరుడా! పేతురు, అంద్రేయ, ఇంకా యేసయ్య శిష్యులలో చాలామంది చదువుకొనని వారు. జాలరులు! అందుకే వారిని చూసిన శాస్త్రులు పరిసయ్యులు అధికారులు వారు విద్యలేని పామరులు అని ఇట్టే పసిగట్టేశారు. అపొ 4:16; మరి వారు దేవునివాక్యాన్ని సరిగా ప్రకటించలేదా? ఎందుకు ప్రకటించలేదు.. ఇప్పటి కాలంలో ఉన్న బైబిల్ పండితులకు, ప్రసంగీకులకు మించి ఘనంగా వాక్యమును లేఖనాలను వివరిస్తూ ఘనమైన సువార్తను ప్రకటించారు. వారు ఎక్కడ చదువుకున్నారు? బైబిల్ కాలేజిలో చదువుకున్నారు? అంటే ఎక్కడ లేదు! యేసయ్యతో ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకుని- పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడో ఎలా నేర్పించాడో అదే చెప్పారు! కాబట్టి ప్రియ చదువుకోలేని దైవజనులారా! మీరుకూడా బాగా వాక్య పరిచర్య చేస్తూ వాక్యమును సరిగా ఉపయోగించగలరుఎలా? పరిశుద్దాత్మ పూర్ణులైనప్పుడు! అప్పుడు పరిశుద్ధాత్ముడే మిమ్మును నడిపించి వాడుకుంటారు.

 

సేవకు చదువు ప్రమాణం కాదు. యేసయ్య శిష్యులలో అనేకమంది చదువురాని వారే! ఆయన ప్రవక్తలలో అనేకమంది గొప్పవారు కాదు. సామాన్యులు! అయినా దేవుడు వారిని వాడుకున్నారు. నిన్నుకూడా వాడుకోగలరు! నీకు చదువురాకపోయినా పర్వాలేదు కాని ఆయన పాదాల దగ్గర కనిపెట్టే వాడుగా, నమ్మకమైన వాడుగా ఉంటూ, ఆయన ఆత్మను పొందుకుని ప్రతీదినం ఆత్మాభిషేకాన్ని అనుభవిస్తూ ఉంటే దేవుడే నీకు బోధిస్తారు. ఎటువంటి బైబిల్ తర్ఫీదు పొందుకోకపోయిన నీవు దేవుని వాక్యమును సరిగా ఉపయోగించగలవు. దేవుణ్ణి అడుగు వాక్యమును నేర్పించమని! పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు.

 

  నేటి రోజులలో క్రొత్తగా సేవకు వచ్చిన, వస్తున్న వారు చదువుకోని ఎవరూ ఉండరనే నా ఉద్దేశ్యం! కాబట్టి వారికి చెప్పేదేమిటంటే: దైవజనుడా వాక్యాన్ని అనుదినం ఆసక్తితో పటిస్తూ ధ్యానం చేస్తూ, ప్రార్ధనాపూర్వకంగా ధ్యానం చేస్తే దేవుడు నీకు బోధిస్తారు. ఆయన పాదాల దగ్గర నేర్చుకో! మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి అంటున్నారు భక్తుడు యాకోబుగారు! 1:5; 

మరినీవు కూడా అడిగి పొందుకో!

వాక్యాన్ని బాగా నేర్చుకో!

విభజించడం నేర్చుకో!

వాక్యాన్ని ఉపయోగించడం నేర్చుకో! అప్పుడే దేవుని మెప్పును పొంది దేవునికి ఇష్టుడుగా యోగ్యుడుగా మారగలవు!

 

దైవాశీస్సులు!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*118 భాగము*

 

1పేతురు 4:12--16

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా ఇక అధ్యాయంలో 12 వచనం నుండి మరలా మొదటి పత్రిక ముఖ్యాంశానికి వచ్చేశారు! అదే శ్రమలను ఓర్చుకోవాలి! సహించాలి! శ్రమ కలిగితే ఆనందించాలి! ఎందుకంటే శ్రమలద్వారా మాత్రమే సంపూర్ణత సాధించగలవు!

దానినే మరలా 12--16 వచనాలలో చెబుతున్నారు! దీనికోసం చాలా చాలా విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక భావం చూసుకుని ముందుకు పోదాం!

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

 

అగ్ని వంటి లేదా మంటల్లాంటి అగ్ని పరీక్ష అంటే లోహాలను శుద్ధి చేసే పద్ధతిని దృష్టిలో ఉంచుకుని పేతురు రాస్తున్నారు. పేతురు 1:7; కీర్తన 66:10 చూడండి. మనల్ని పరీక్షించి శుద్ధి చేసేందుకే దేవుడు అగ్నివంటి పరీక్షలను రానిస్తాడు. అయితే వాటిని మనము సహించాలి శుద్ధి చేయబడటానికి, మెరుగు పెట్టబడటానికి!

 

ఇక వచనంలో ఆశ్చర్య పడకండి అంటున్నారు ఎందుకంటే కష్టాలు హింసలు వస్తాయని క్రీస్తు, ఆయన అపొస్తలులు కూడా పదే పదే హెచ్చరించారు

పేతురు 2:20-21; 4:1; యోహాను 10:33; అపొ కా 14:22; రోమా 8:17; 2 తిమోతి 3:12.

వారు చెప్పినట్లు అప్పుడు ఇప్పుడు మనము శ్రమలను ఎదుర్కొంటున్నాము గనుక ఆశ్చర్యపడవద్దు అంటున్నారు!

 

13 వచనం: క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

 

క్రీస్తు మహిమ బయలుపరచ బడేటప్పుడు మన విషమ పరీక్షలకూ బాధలకూ తగిన ప్రతిఫలం లభిస్తుంది అంటున్నారు!

 

తీతుకు 2:12

మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

తీతుకు 2:13

అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

 

Romans(రోమీయులకు) 8:17,18,19

17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

 

2 కొరింతు 4:17-18 కూడా చూడండి!

 

ఇక తరువాత వచనంలో 14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

 

మనం క్రీస్తులో విశ్వాసులం కాబట్టి మన మీదికి నిందలు వచ్చినప్పుడే ఇది నిజం. ఇతర కారణాలవల్ల నిందలు వస్తే ధన్యులం కాము! అనగా తప్పు చేసి నేరము చేసి అవమానాలు పొందితే ప్రయోజనం లేదు గాని క్రీస్తు నామము కోసం నిందలు సహిస్తే ధన్యులము అంటున్నారు!

అలా క్రీస్తు నామము కోసం నిందలు పడితే ఆయన ఆత్మ మనలో ఉన్నట్టు లెక్క అంటున్నారు!

 

ప్రియులారా వచనం తెలుగులో సగమే తర్జుమా చేయబడింది. మిగిలిన వచనం తర్జుమా చేయబడలేదు!

ఇంగ్లీషు లోను ప్రాచీన ప్రతులలో స్టడీ బైబిల్ లో ఇలా ఉంది

1పేతురు 4:14

If ye be reproached for the name of Christ, happy are ye; for the spirit of glory and of God resteth upon you: *on their part he is evil spoken of, but on your part he is glorified*.

 

14 ఒకవేళ క్రీస్తు పేరుకోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీమీద నిలిచి ఉన్నాడన్నమాట. *వారివైపున ఆయన దూషించబడుతున్నాడు, మీవైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది*

 

చూడండి వారివైపున ఆయన ధూషింష బడుతున్నారు , ఆయన! అనగా పరిశుద్ధాత్ముడు! మీరు కాదు! మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అవమానాలు శ్రమలు సహిస్తున్నాడు! అయితే మీవైపున ఆయనకు అనగా పరిశుద్ధాత్మునికి మహిమ కలుగుతూ ఉంది అంటున్నారు!!

కాబట్టి శ్రమలను సహిద్దాం! సంతోషిద్దాం! క్రీస్తుకై నిలబడదాం!

దైవాశీస్సులు!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*119 భాగము*

*విశ్వాసికి ఉండకూడని లక్షణాలు-18*

1పేతురు 4:12--16

12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.

13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.

14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 15,16 వచనాలలో అంటున్నారు

15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

చూడండి విశ్వాసి అనబడిన వాడు ఎవరూ కూడా నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోయేవాడుగా గాని తప్పు చేసి శిక్ష అనుభవించకూడదు అంటున్నారు! కారణం అనేకసార్లు చెప్పడం జరిగింది! అన్యులు అలా చేసినా ఎవడూ పట్టించుకోడు! గాని దేవుని పేరు పెట్టుకున్న వాడు తాగేసి దొర్లుతున్నా, వ్యభిచారం చేస్తూ దొరికిపోయినా ఇంకా మరేదైనా తప్పు చేస్తే పెద్ద రాద్దాంతం చేస్తారు. ఒక్కడు చేసింది క్రైస్తవుల మీద మొత్తానికి మోపుతారు. దేవుడు బిడ్డలంట! కాని సంఘంలో ఏం చేస్తున్నారో చూడండి అంటూ దేవుని పరువు సంఘం పరువు, క్రైస్తవుల పరువు తీస్తారు. అందుకే విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి!

 

రోజు విశ్వాసికి ఉండకూడని మరో లక్షణం: నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

 

మొట్టమొదటి సంఘంలో సభ్యుడు కయీను హేబేలును హత్యచేశాడు. 6000 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా చెప్పుకుంటున్నాము!

దావీదు గారు ఏదో చాటున వ్యభిచారం చేశారు. ఊరియాను హత్య చేయించారు!

ప్రవక్త నాతాను వచ్చి " మనుష్యుడవు నీవే" అంటూ దావీదు పాపం బయటపెట్టాడు. (2సమూ 11 అధ్యా ) అప్పట్లో న్యూస్ పేపర్స్ , టి.వి చానల్స్ , పేస్ బుక్, వ్వాట్సాప్ లు లేవు కాబట్టి దావీదు బ్రతికిపోయాడు అనుకొంటున్నావేమో?  దావీదుగారు చేసిన పాపాన్ని దేవుడు బట్టబయలు చేసి, 2000 భాషల్లోకి తర్జుమా చేయించారు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే విషయంలోనూ అదే జరిగింది. దేవుని స్నేహితుడైన అబ్రాహాము చేసిన మోసం విషయంలోనూ అదే జరిగింది.

ఇప్పటికీ దానికోసం చూసుకుంటున్నాం!

 

నీతిమంతుడైన లోతుగారికి ఇద్దరు పనికిమాలిన కూతుర్లు ఉన్నారు. వారు తండ్రిని మద్యానికి బానిసగా చేసి, మద్యం మత్తులో తండ్రితో పాపం చేసి పిల్లలను కన్నారు. పనికిమాలిన స్త్రీలు చేసిన పాపానికి నేడు కూడా మనము అవమానాలు పొందాల్సివస్తుంది. ఎవరో వ్యభిచారులు చేసిన పనికి మనలను మన దైవగ్రంధాన్ని దూషిస్తున్నారు!

 

సంఘమా! విశ్వాసి! దైవజనుడా! మన నడకలు ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి! మనలను అనేక కళ్లు మరియు సాతానుగాడి CCTV cameras 24x7, 365 days చూస్తూనే ఉంటాయి!

గతంలో చెప్పడం జరిగింది. మా ఊరిప్రక్కన గ్రామంలో మాకు బ్రాంచ్ చర్చి ఉంది. అక్కడ సేవ చేయడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. కారణం ముగ్గురు దైవసేవకులు! ఒకడు పెళ్ళి కాని స్త్రీని లేపుకుపోయాడు, మరొకడు పెళ్ళి అయిన స్త్రీని తీసుకుని పోయాడు. మరొకడు ఆరాధన అయిపోయిన వెంటనే వచ్చిన కానుకలతో మందిరంలోనే సంఘపెద్దలు యవ్వనస్తులతో కలిసి త్రాగి తందనాలాడి చచ్చాడు! మరి దేవునికి విలువ ఎక్కడ? అందుకే సేవ బాగా జరగడం లేదు గ్రామంలో!

 

ఈరోజు దేవుని పరువు పోవటానికి కారణం ముఖ్యంగా క్రైస్తవులే కారణం! పేరుకు తగ్గట్టు జీవించడం లేదు! సంఘాల పరువు పోడానికి వారి మధ్య ఉన్న తగాదాలు రాజకీయాలు. సంఘం తలుపులు మూయబడు కోర్టులకు వెళ్తుంది.

ఇక తరువాత సంఘం పరువు పోవడానికి కారణం సంఘం లో యవ్వనస్తులు! వారి మధ్యలో జరిగే ప్రేమ వ్యవహారాల వలన సంఘం పరువుపోతుంది ఇంకా దేవుని పరువు పోతుంది. యవ్వనస్తులారా! సంఘం బలపడినా, సేవ బాగా జరిగినా సంఘం పరువుపోయినా కారణం మీరే అని తెలుసుకోండి! సంఘానికి వచ్చేది క్రీస్తుని ఆరాధిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి మహిమ తేవడానికి తప్ప, సంఘం లో ప్రేమ వ్యవహారాలు సాగించడం కోసం కాదు!

 

ఇక సంఘంలో అమ్మాయిలు భయంకరమైన వస్త్రధారణ చేసుకుంటూ మేకప్ లు వేసుకుని తిరగడానికి కారణం, సంఘంలో స్త్రీలు దేవునికి ఇష్టం కాని వస్త్రాలు వేషాలు వేయడానికి సగం కారణం దైవసేవకుల కుమార్తెలే! దైవ సేవకుని భార్యలే! ఎవరేమనుకుంటే నాకనవసరం! నేను కూడా దైవసేవకుని కుటుంబం నుండి వచ్చిన వాడనే! అయినా ధైర్యంగా ఉన్నదిఉన్నట్లు చెబుతున్నాను! రోజుల్లో దైవ సేవకుని కూతుర్లు సంఘానికి మాదిరిగా ఉండకుండా సినిమా హీరోయిన్ లు వేసే భయంకరమైన వ్యభిచార దుస్తులు ధరిస్తూ, ముక్కుకి రంగు మూతికి రంగు పెదాలకు రంగు వేసుకుని, దేవుని పరిశుద్ధాత్మ పొందకుండా యెజెబెలు పొందిన వ్యభిచార ఆత్మతో తిరుగుతూ మేకప్పులతోనే సంఘ ఆరాధనలో పాల్గొంటున్నారు. పాటలు పాడుతున్నారు. వర్షిప్ నడిపిస్తున్నారు! వారిని చూసి సంఘానికి వస్తున్న యవ్వన స్త్రీలు అనుసరిస్తున్నారు. వారి తల్లిదండ్రులు ఇది తప్పు అంటే పాష్ట్రగారి కూతురు పాష్ట్రమ్మ చేస్తే తప్పులేదు గాని మేము చేస్తే తప్పా అంటున్నారు! నిజానికి అన్యులు కూడా వేయడానికి సిగ్గుపడే వస్త్రధారణ క్రైస్తవ స్త్రీలు, దైవసేవకుల భార్యలు, కుమార్తెలు చేస్తున్నారు! చాలా మంది దైవసేవకురాళ్లు మేకప్ లేకుండా, బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ఆరాధన కి రావడం లేదు. టీవీ లో ప్రసంగానికి ముందు కేజీ మేకప్ వేసుకుని వచ్చి వాక్యం చెబుతున్నారు! ఏమి నేర్పిస్తున్నారు సంఘానికి? ఏం సందేశం ఇస్తున్నారు! మిమ్మల్ని బట్టి దేవుని నామమను అన్యులు బహిరంగంగా ధూషిస్తున్నారు!

 

సంఘమా! దైవసేవకుడా! విశ్వాసి! మాదిరిగా ఉంటున్నావా?!!!!

పేతురు గారు అంటున్నారు మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.

16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.

కాబట్టి మాదిరిగా ఉందాం! హెచ్చరికగా ఉందాం! దేవుని పేరు నిలబెడదాం!

దైవాశీస్సులు!!!

 

*పేతురు వ్రాసిన పత్రికలు*

*120 భాగము*

1పేతురు 4:17--19

17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?

19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక 17,18 వచనాలలో అంటున్నారు

తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?

 

ప్రియులారా! పేతురు గారు విశ్వాసి అనబడే వాడు ఎవడు నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని శిక్ష మరియు బాధ అనుభవించ కూడదు అంటూ మర్చిపోవద్దు నీవు దేవుని రక్తంలో కడుగబడి ఆయన బిడ్డగా మార్చబడి బాప్తిస్మము పొందినంత మాత్రమే సరిపోదూ, పేరుకు తగ్గట్టు జీవించక పోతే తీర్పు దేవుని ఇంటినుండే ఆరంభమగు కాలం వచ్చింది. అది విశ్వాసులము ప్రార్దించేవారము, ప్రసంగాలు చెప్పేవారము, క్రమంగా తెల్ల బట్టలు వేసుకుని చర్చికి వెళ్లేవారము అని చెప్పుకుంటున్న మనతోనే తీర్పు గనుక ఆరంభమైతే అన్యుల గతి ఏమవుతుంది!! నీతిమంతుడైన వాడే తీర్పు తప్పించుకోలేక రక్షించబడలేకపోతే భక్తిహీనుడు పాపి ఎలా నిలువగలడు అంటున్నారు!

 

మనము దేవుని ఇంటివారము అని బైబిల్ చెబుతుంది!

ఎఫెసీయులకు 2:19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 

హెబ్రీయులకు 2:11

పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము. హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

 

అయితే దేవుని ఇంటివారము ఆయన కుటుంబ సభ్యులమైన మనము తప్పిపోతూ ఉంటే విశ్వాసులకు లోకమంతటితో కలిసి తీర్పు తీర్చే అవసరత లేకుండా చేయడానికి దేవుడు వారికి అస్తమానం తీర్పు తీరుస్తూ వారిని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. అనగా తప్పిపోతున్నప్పుడెల్లా చిన్న చిన్న లెంపకాయలు వేస్తూ ఉంటారు! అయితే సామెతలు 29:1 చెప్పినట్లు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇక దేవునిబిడ్డకు కూడా తీర్పు తప్పదు!

సామెతలు 29:1

ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 11:31,32

31. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.

32. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

 

అయితే సువార్తకు లోబడని వారికి తీర్పు తప్పదు!

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:5,6,7,8

5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

 

మార్కు 16:16

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

 

సరే, ఇప్పుడు దేవుని తీర్పు అనేది అది మనతోనే ఆరంభమయితే దేవుని సువార్తకు విధేయత చూపనివారి అంతం ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు! దేవుని పేరు పెట్టుకుని దాని ప్రకారం జీవించకపోతే  తీర్పు తప్పదు!

ఇక తరువాత వచనంలో మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అంటున్నారు!

సామెతలు 11:31

31 న్యాయవంతులకు ఇహలోకంలో ప్రతిఫలం కలిగితే, దుర్మార్గులకూ పాపులకూ ప్రతిఫలం రావడం మరీ ఖాయం గదా

 

ఇక్కడ నీతిమంతుడైన వాడు రక్షించబడటం ఎందుకు దుర్లభం అవుతుంది?!న్యాయవంతులకు రక్షణ కలగడం ఎందుచేత కష్టం?

వారి శత్రువులు చాలా మంది ఉన్నారు. వారు బలవంతులే పేతురు 5:8; ఎఫెసు 6:11-12 ప్రకారం!

విశ్వాసులేమో బలహీనులు, వారిలో శరీర స్వభావం కూడా ఉంది రోమా 7:18; గలతీ 5:16-17; 1 యోహాను 1:8 ప్రకారం!

 విత్తనాలు చల్లడం, పంట కోయడం అనే దేవుని నియమం విశ్వాసుల విషయంలో కూడా నెరవేరవలసిందే రోమా 2:6-8; గలతీ 6:7-8 ప్రకారం!

 

దేవుడు వారి ప్రవర్తనను న్యాయవంతంగా తీర్చి దిద్దాలి.

దేవుని ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. తన ప్రజల్లో నెరవేరవలసిన కొన్ని సూత్రాలను ఆయన నిర్దేశించారు. వాటిని వారు తప్పకుండా పాటించాలి! వాటిలో కొన్ని

1)  వారు ఇరుకు ద్వారంలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఇరుకు మార్గంలోనే కొనసాగాలి (మత్తయి 7:13-14).

2) తమ స్వంత చిత్తాన్ని చేయడానికి నిరాకరిస్తూ దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి (మత్తయి 7:21).

3) తమకున్నదంతా విడిచి క్రీస్తును అనుసరించాలి (లూకా 14:33).

4) పవిత్రతను అనుసరించడం నేర్చుకోవాలి (యోహాను 10:27; హీబ్రూ 12:6).

5) అగ్ని పరీక్షలు లేక శ్రమలు సహిస్తూ, విస్తారమైన క్రమశిక్షణ ద్వారా వారు భద్రంగా ప్రయాణించాలి (హెబ్రీ 12:5-13).

6) అంతం వరకు నమ్మకాన్ని నిలుపుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి (హెబ్రీ 10:38-39).

ఇవి తప్పకుండా విశ్వాసి పాటించాలి. తప్పిపోతే తీర్పు తప్పదు!!

 

గమనించాలి న్యాయవంతుల రక్షణ కష్టం అయినప్పటికీ అది ఖాయమైనదే (1:5; యోహాను 6:39; 10:28; రోమ్ 5:9-10).

 

ప్రియ చదువరీ! ఇతర ప్రజలకు తీర్పు చెప్పిన దేవుడు తన సొంతప్రజలు పాపము చేస్తే ఊరుకొంటారా? ఊరుకోరు. అందుకే యూదులు, ఇశ్రాయేలీయులు ఎంతగానో, ఎప్పటినుండో భాదలు అనుభవించారు. వారుకదా అనుభవించారు నాకు ఏమీ ఉండదు కదా అనకు. వారిని మొదటగా తన స్వకీయమైన ప్రజగా ఏర్పరచుకొన్నారు. వారు వినలేదు కాబట్టి రక్షణభాగ్యం, స్వకీయజనాంగముగా దేవుడు మనలను- ఆయన కుమారుని రక్తముద్వారా ఏర్పాటుచేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన సొంత బిడ్డవు. ఇప్పుడు నీవు కూడా దేవునిమాటను వినకపోతేఇంతగొప్ప రక్షణను నిర్లక్షము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందువు? .హెబ్రీ 2:3; ఇంకా వివరముగా చెబుతున్నారు పౌలుగారు రోమా 11:7, 8, 12, 13, 15, 1726. ఇంకా 2931

7. ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.

8. ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

11. కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు.

12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!

15. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట యేమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?

16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

17. *అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, కొమ్మలపైన*

18. *నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు*.

19. *అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు*.

20. *మంచిది; వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము*;

21. *దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు*.

22. *కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు*.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

 

30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింప బడితిరి.

31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు 

 

ఇంకా అంటున్నారు 12:12

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు లోక( లేక, యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

కాబట్టి భయమునొంది పాపము చేయకుండా ఉందాము. కీర్తనలు 4:4;

 లేదా ప్రియ స్నేహితుడా! స్వాభావిక కొమ్మలైన యూదులు, ఇశ్రాయేలీయులు నరుకబడినట్లు/ కత్తిరింపబడినట్లు నీవుకూడా దేవునినుండి నరకబడి/కత్తిరించబడి పారవేయబడతావు. యేసుప్రభులవారు అంటున్నారుమీరు నానుండి వేరుపడితే ఫలించలేరు. యోహాను 15:12, 46.

1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.

4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.   . . ..

 

  కాబట్టి మనలని మనం సరిచూసుకుని, మనకు మనమే సరిచేసుకుందాం. ఫలింపని ప్రతీ తీగెను నరికి అగ్నిలో వేస్తాను అంటున్నారు ప్రభువు. ఇదిగో గొడ్డలి వేరున పదును పెట్టబడి యుంది అని మరచిపోవద్దు. మత్తయి 3:10; లూకా 3:9;

మారుమనస్సుకి తగిన ఫలాలు ఫలిద్దాం. దేవుని పేరు పెట్టుకుని, పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం! మత్తయి 3:7; నరకాన్ని తప్పించుకొందాం. లేదా లవొదొకయ సంఘం వలె ఉమ్మివేయబడి- వెలుపట చీకటిలో భాదపడాలి జాగ్రత్త!

 

దేవుని మాటకు లోబడి ఆయనకు ప్రియులైన పిల్లల వలె ఉందుము గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

*పేతురు వ్రాసిన పత్రికలు*

*121 భాగము*

*విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు-38*

1పేతురు 4:17--19

17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?

18. మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?

19. కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

 

     ప్రియమైన దైవజనమా! మనము పేతురు మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!

ఇక చివరి వచనంలో అంటున్నారు కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

 

ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: శ్రమలలో దేవునిమీద భారం వేసి ముందుకు పోవాలి!

 

ఇక్కడ దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు అనగా క్రీస్తు నామం కొరకు శ్రమలను శోధనలను సహించేవారు అని అర్థం! వీరు శ్రమలను సహిస్తూ మంచి ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అంటున్నారు!

అనగా దేవా ఏం జరిగినా నీదే భారమని చెప్పి ఆయన మీద భారం వేసుకుని శ్రమలగుండా పోవాలి అన్న మాట!

 

అనగా హనన్యా మిషాయేలు అజర్యా అనేవారు బంగారమ్మ బొమ్మకు మ్రొక్కకుండా మా దేవుడు మమ్మల్ని మండుచున్న అగ్ని గుండమునుండి తప్పించినా తప్పించకపోయినా మేము మాత్రము నీ బంగారమ్మ బొమ్మకు మ్రొక్కము అని చెప్పి తమ ప్రాణాత్మలను దేవునికి అప్పగించుకుని అగ్నిగుండములోకి ఎలా వేయబడ్డారో అలాగే మన శ్రమలలో దేవుని చిత్తానికి భారము వేసి శ్రమలగుండా వెళ్ళి పోవాలి!

 

ఇంకా దానియేలు గారు దేవుని చేతికి తన ఆత్మను అప్పగించి దేవుని మీద భారం వేసి సింహపు బోనులో ప్రవేశించినట్లు ఉండాలి!

 

యోసేపు గారు శోధనలను శ్రమలను చూసి దేవుణ్ణి నిందించలేదు- ఇంతన్నావ్ అంతన్నావ్, నేను చేయని నేరానికి నేనెందుకు బాధలు శ్రమలు అనుభవించాలి అని అడుగలేదు! దేవునికి పూర్తిగా తనను తానూ అర్పించుకున్నారు. అయ్యా నీదే భారం! నీ ఇష్టమొచ్చినట్లు నన్ను చెక్కు అని దేవుని చేతులకు అప్పగించుకుంటే ఒకరోజు దేశానికే అధికారి అయ్యారు యోసేపు గారు!

 

ప్రభువా! ఏంచేసినా నీదే భారం అని ఆయనమీద పూర్తిగా ఆధారపడడం. ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచడు అనే స్థిరమైన విశ్వాసాన్ని కలిగియుండడం!

హబక్కూకు ప్రవక్తలా చెట్లు ఫలించకపోయినా, పూయకపోయినా, గొర్రెలు పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభువునందు ఆనందించాలి!

 

 యేసుక్రీస్తు ప్రభులవారు తన ఆత్మను దేవునికి అప్పగించినట్లు మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి!

కీర్తనలు 31:5

5 నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.

యెహోవా! సత్యస్వరూపి అయిన దేవా! నీవు నన్ను విమోచించావు.

 

లూకా 23:46

అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

 

దావీదు గారు అంటున్నారు కీర్తనలు 37:5

నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.

 

మనము కూడా ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి!

అంతేకాదు క్రీస్తు నామం కొరకు శ్రమలను అనుభవించేవారు బాధపడుతున్న వారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటున్నారు! దీనికోసం గతంలో ధ్యానం చేసుకున్నాము!

పేతురు 2:12, 15; 3:11; రోమా 2:7; 2 కొరింతు 5:10; 9:8; గలతీ 6:9-10; ఎఫెసీ 2:10; కొలస్సయి 1:10; 2 తిమోతి 3:17; తీతు 2:14.

 

మంచి చేస్తూ కష్టాలూ అవమానాలూ హింసలూ, లేక దేవుని క్రమశిక్షణ ఇవేవీ కూడా మంచి చేయకుండా మనల్ని ఆపే అవకాశం రానియ్యకూడదు.

అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము