గీతములకు గీతము- పరమ గీతము
*గీతాలకు గీతము-పరమగీతము*
*మొదటి భాగము- ఉపోద్ఘాతము-1*
ప్రియ దైవజనమా!
యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభాది వందనములు! ఈ ఆధ్యాత్మిక సందేశాలు- 13 లో భాగంగా మరోసారి మిమ్మల్ని
ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! ఈసారి పరమగీతములు అనే అత్యంత
శ్రేష్టమైన పుస్తకము మరియు అనేకులకు వివాదాస్పదమైన పుస్తకమునుండి పరిశుద్ధాత్మ దేవుడు
మనతో మాట్లాడేది ధ్యానం చేసుకుందాం!
నిజానికి అనేకులు
ఈ పుస్తకాన్ని చదవడానికి ఆలోచిస్తారు, మరికొంతమంది సిగ్గుపడతారు. మరికొంతమంది క్రీస్తు విరోధులు
ఇది ఒక బూతు పుస్తకము అంటారు! మరికొంతమంది బైబిల్ ను పరిశుద్ధ
గ్రంధము అంటారు కదా మరి ఇలాంటి పుస్తకము బైబిల్ లో ఎలా ఉంది అంటారు! మరి కొంతమంది బైబిల్ లో ఉన్న ప్రతీ వచనం ప్రతీ అధ్యాయం ప్రతీ పుస్తకము పరిశుద్ధాత్ముడు
వ్రాయించాడు కదా! మరి ఇలాంటి పుస్తకము ఎందుకు బైబిల్ లో జతచేయబడింది
అంటారు! కాబట్టి మొదట ఈ పుస్తకము యొక్క విశేషము తెలుసుకుని ఆ
తర్వాత నేపధ్యం తెలుసుకుని అప్పుడు ఈ గ్రంధము కోసం ధ్యానం చేద్దాం!
ముఖ్యాంశం:
ఈ పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించినవారు ముఖ్యాంశ విషయంలో గాని, కథలోని ముఖ్య పాత్రధారుల
విషయంలో గాని ఏకీభవించడం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పుస్తకం
రాజైన సొలొమోనుకూ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గీతం రూపంలో చిత్రించిన వర్ణన మాత్రమే.
మరికొందరు ఆధునిక వ్యాఖ్యానకర్తలు ఇలా అంటున్నారు –
మొదటిది: ఈ పుస్తకంలోని ప్రేమకథ పేరు తెలియని
ఒక కాపరికీ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గురించి తెలియజేస్తున్నది. సొలొమోనురాజు దుష్టుని పాత్ర వహించి కాపరి వధువును తాను ఉంచుకోవడానికి ఎత్తుకుపోవాలని
ప్రయత్నించాడు (ఈ వ్యాఖ్యానం సమంజసంగా లేదు).
రెండు: రాజైన సోలోమోను తాను ఇంకా యవ్వనస్తునిగా
ఉన్నప్పుడు రాజ్యమంతా పర్యటించేటప్పుడు షూనేము ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక యవ్వనురాలను చూసి ప్రేమిస్తాడు. అయితే తాను
రాజకుమారుడు అని తెలిస్తే భయపడి తనను ఎక్కడ తిరస్కరిస్తుందోనని భావించి ఒక గొల్ల పిల్లవానిలా
వేషం వేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఈలోగా ఆమె యొక్క అన్నలు
(సవితి అన్నలు అనగా ఆ అన్నలు యొక్క తల్లి చనిపోయిన తర్వాత షూలమ్మితి
తల్లిని పెళ్లి చేసుకుంటాడు తండ్రి) ఆమెకు ఒక వ్యక్తితో ప్రధానం
చేస్తారు! గాని షూలమ్మితి ఈ గొల్లపిల్లవాని వేషంలో ఉన్న సోలోమోనును
ప్రేమిస్తుంది గనుక అన్నలు కోపపడి వారియొక్క ద్రాక్షతోటకు కాపలాదారిగా నియమిస్తారు. దానితోపాటు చిన్న మందను కూడా కాపాలాకాయమని
అప్పగిస్తారు! గాని ఆమె సొంత తోటను, సొంత
మందను పట్టించుకోకుండా సొలోమోను చుట్టూ తిరుగుతుంది. అప్పుడు
సోలోమోను తాను ఎవరో చెబుతాడు. ఈ విషయం తెలిసిన అన్నలు ఆమెను సోలోమోను
పొలములో పనికత్తెగా నియమిస్తారు. అప్పుడు ఆమె షూనేము నుండి యెరూషలేము
వచ్చి సోలోమోను పొలములో ఒక దాసీగా పనిచేస్తుంది. అదికూడా ఎండలో
పనిచేస్తుంది. అప్పుడు ఆమె సౌందర్యము దెబ్బతింటుంది అయినా సోలోమోను
ఆమెనే ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు! ఇది అనేకమంది నిజముగా జరిగింది
అని భావించే గాధ!
మూడు: మరికొందరైతే ఈ పుస్తకం అలంకారిక రీతిలో
దేవునికీ విశ్వాసులకూ మధ్యనున్న ప్రేమను చిత్రించినది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
మరి కొందరైతే ఈ పుస్తకానికి ఇదే ముఖ్యాంశం అంటున్నారు.
ఏదిఏమైనా మెజారిటీ బైబిల్ పండితులు ఈ
ప్రేమ కథలోని ప్రధాన పాత్రధారులు సొలొమోనురాజు, అతని వధువు
అని నమ్ముతున్నాడు. అంతేగాక ఈ కథలో సాదృశ్య రూపంలో ఆత్మ సంబంధంగా
అనేక అంతరార్థాలు ఉన్నాయనీ అలంకార రీతిలో రారాజైన యేసుక్రీస్తుకూ, ఆయన సంఘం, లేక విశ్వాసులైన వ్యక్తులకూ మధ్యనున్న ప్రేమను
వివరిస్తున్నదనీ కూడా నమ్ముతున్నారు. ఇలా నమ్మడానికి గల కారణాలు
ఇవి:
లేఖనాలలోని ఇతర భాగాలన్నిటిలాగానే ఈ పుస్తకం పేరు కూడా దైవావేశం
వల్ల కలిగినదే. పరిశుద్ధాత్మ దేవుడే దీనిని “పరమ” గీతం – అంటే గీతాలన్నిటిలో
ఉత్తమమైనది, సర్వశ్రేష్ఠమైనది (దీని హీబ్రూ
పేరుకు అర్థం ఇదే) అని అంటున్నాడంటే అలా అనడానికి తగిన కారణాలు
తప్పక ఉండాలి. అది కేవలం సొలొమోనుకూ, అతని
వధువుకూ మధ్యనున్న ప్రేమకథను వివరించేదే అయితే దానిని సర్వశ్రేష్ఠమైన గీతం అని ఎలా
అనగలం? అలా అనుకుంటే ఇది ఇస్రాయేల్లో అతి
మధుర కవి దావీదు రచించిన గీతాల కంటే సర్వశ్రేష్ఠమైనదా? అది కీర్తన
22 లేక 45 లేక 69 లేక
119 మొదలైనవాటికంటే శ్రేష్ఠమైనదా? క్రీస్తే దానిలో
లేకుంటే అది గీతాలన్నిట్లోకీ శ్రేష్ఠమైనది కాగలదా?
కొన్ని లేఖనాలు దేవునికీ ఆయన ప్రజలకూ మధ్యనున్న సంబంధాన్ని భార్యాభర్తల
సంబంధంతో పోల్చి చెపుతున్నాయి. కీర్తన 45; యెషయా 54:5; యిర్మీయా 3:14; 31:32; యెహె 16; 23; హోషేయ 2:7, 16 మొదలైనవి;
మత్తయి 22:1-2; రోమ్ 7:4; 2 కొరింతు 11:2; ఎఫెసు 5:25-32; ప్రకటన
19:6-9 చూడండి. దేవుణ్ణి ఇస్రాయేల్ జాతికి భర్తగానూ
క్రీస్తును సంఘానికి వరునిగానూ అభివర్ణిస్తూ ఉంటే బైబిలులోని ఒక పుస్తకం క్రీస్తుకూ
ఆయన సంఘానికి మధ్యనున్న ప్రేమను గురించి మానవ పరిభాషలో రాసివుండడం ఆశ్చర్యమేమీ కాదు.
ఇలాంటి ప్రేమ క్రీస్తుకు ఆయన ప్రజలకు మధ్య ఉండాలి, ఉంది. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే సందర్భంలో పైన తెలిపిన
వాక్యభాగాలను పఠించాలి. అవి బైబిలులోని శ్రేష్ఠమైన అంశాల్లో ఒకదాన్ని
వెల్లడి చేస్తాయి.
భౌతికమైనవాటిలో
ఆధ్యాత్మిక భావాలున్న వేరు వేరు అంశాలు బైబిలులో కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని అంశాలను గమనించండి – ప్రత్యక్ష గుడారం, యాజకులు,
బలియాగాలు, ఇంకా నిర్గమకాండం, లేవీయకాండం గ్రంథాల్లో ఇలాంటి విషయాలను చూడండి. ఆ విషయాలు
అక్షరాలా వాస్తవమైనవే గాని వేరే అంతరార్థం కూడా వాటికి ఉంది. అవి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలకు సూచనలు, నీడలు.
శారా, హాగరుల కథ అలంకార రూపకంగా చెప్పబడినదని పౌలు
అంటున్నాడు (గలతీ 4:21-27)! శారా,
హాగరు చరిత్రలో అలంకార రూపంలో ఆధ్యాత్మిక సత్యం దాగివున్నప్పుడు అదేరీతిగా
ఈ గీతంలో కూడా ఆధ్యాత్మిక భావం అంతర్గతంగా దాగి ఉందని భావించవచ్చు గదా. శారా, హాగరు చరిత్రలో వాళ్ళిద్దరూ అక్షరాలా వాస్తవంగా
జీవించిన వ్యక్తులే. అదే రీతిగా ఈ గీతంలో సూచించిన వధూవరులు వాస్తవంగా
జీవించారన్న దానిని మనం కాదనడం లేదు. సొలొమోనురాజు, షూనేము యువతి నిజంగా జీవించిన వ్యక్తులే. అయినా ఇది పరలోక
సంబంధమైన ప్రేమను గురించి సాదృశ్య రూపంలో వివరిస్తున్న ఒక ఉదాహరణ. చూడగల కన్నులున్నవారు అంతర్గతంగా దీనిలో దాగిన ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించగలుగుతారు.
లూకా 24:27; 2 తిమోతి 3:16-17లోని విషయాలను గమనించండి. పాత నిబంధనలో అన్నిచోట్లా క్రీస్తు
ఉన్నాడని ఈ ఒక్క పుస్తకంలో మాత్రం లేడని అనగలమా? ప్రతి చోటా ఆయనను
చూడడానికి ప్రయత్నించి, ఈ గీతంలో మాత్రం ఆయనను చూడకుండా ఉండడానికి
ప్రయత్నించాలా? ఈ పుస్తకంలో క్రీస్తు లేకుంటే, ఆత్మ సంబంధం, పరసంబంధం అయిన పాఠాలు దీనిలో లేకుంటే దేవుని
మనుషులు (ముఖ్యంగా పెండ్లి కానివారు) “సంసిద్ధులుగా
ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థులై” ఉండడానికి ఈ గీతం ఎలా సహాయపడగలదు?
ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలకు, సన్నివేశాలకు
తప్పక ఆత్మ సంబంధమైన అర్థం లేక అలంకార రూపంలో దాగి ఉన్న భావం ఉంటుందని గుర్తించాలి.
అక్షరాల సొలొమోనురాజు యొక్క వధువు రాత్రిపూట ఒంటరిగా అతన్ని వెతుక్కుంటూ
వీధులలో తిరుగులాడే విషయాన్ని ఊహించుకోవడం కష్టం (3:2-4). ఆమె
అలా తిరుగుతున్నప్పుడు కావలివారు ఆమెను కొట్టి ఆమె ముసుగు తీసుకుపోవడం కూడా ఊహించలేము
(5:6-7). ఆమె అక్షరాలా సొలొమోను మీద ఆనుకొని ఎడారి మార్గంలో వచ్చిందంటే
కూడా ఊహించడం కష్టమే (8:5). క్రీస్తుకు పూర్వమూ తరువాతా కూడా
ఉన్న భక్తిపరులైన వ్యాఖ్యాతలు ఈ పుస్తకాన్ని అలంకార రూపంలో ఉన్నవాటిని వివరించడం అనే
పద్ధతిని శతాబ్దాలుగా వాడుతూ వచ్చారు. ఇది యెహోవా దేవునికి ఇస్రాయేల్కూ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని యూదులూ, క్రీస్తుకూ
తన సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని క్రైస్తవులూ భావిస్తూ వచ్చారు.
అందుచేత ఈ వివరణ పద్ధతి మనం కల్పించినది కాదు, లేక ఇటీవల వాడుకలోకి వచ్చినదేమీ కాదు.
పైన తెలిపిన కారణాలు తృప్తికరంగా లేవు అని పాఠకులు భావిస్తే
వాటిని తిరస్కరించవచ్చు. ఈ గీతాన్ని కేవలం మానవ ప్రేమ స్థాయిలో అర్థం
చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మన ఉద్దేశాల్లో, లేఖన వివరణల్లో తప్పక లోపాలుంటాయి. పరిశుద్ధాత్మ ఇచ్చే
సహాయంతో ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసినప్పుడు క్రీస్తు తన విశ్వాసులను ఎలా ప్రేమిస్తాడు,
వారు ఆయన్ను ఎలా ప్రేమించాలి అనేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి
వీలౌతుంది. అంతేగాక ఈ పుస్తకం విషయంలో అనుభవం అనేది సాటిలేని
బోధకుడని మా అభిప్రాయం. క్రీస్తు ప్రేమను ఎరిగినవారు మాత్రమే
దీనిలో ఏమున్నదో తెలుసుకోగలరు. ఈ పుస్తకమంతా ప్రేమను గురించే.
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*రెండవ భాగము- ఉపోద్ఘాతము-2*
(గతభాగం తరువాయి)
ప్రియులారా దీనిలోని అంశాలను అనేక
విధాలుగా విభజించారు! వాటిలో ముఖ్యమైనవి మాత్రం చూద్దాం!
మొదటిది: *గ్రంథ విభజన*
💚💜❤️❤️🤍🧡
◾మాటల్లో వెల్లడి అయిన ప్రేమ (1:2-4)
◾ఆందోళన చెందిన ప్రేమ (1:5-7)
◾కలయికలోని ప్రేమ (1:9-2:7)
◾ఎదురు చూచి, ఆహ్వానాన్ని పొందిన ప్రేమ (2:8-3:1)
◾పరీక్షకు లోనై నిరూపణ అయిన ప్రేమ (3:1-5)
◾శోభాయమానమైన రీతిలో వ్యక్తపరచిన ప్రేమ (3:6-11)
◾ప్రియురాలిలో ప్రియుని ఆనందం (4:1-16)
◾ప్రేమలోని తృప్తి (5:1)
◾బలహీనపడి బలం తిరిగి పుంజుకున్న ప్రేమ (5:2-8)
◾ప్రియుణ్ణి ప్రశంసించిన ప్రేమ (5:8-16)
◾నిబ్బరం గలిగిన ప్రేమ (6:1-3)
◾ప్రియురాలి సౌందర్యాన్ని పొగిడే ప్రేమ (6:4-12)
◾ప్రేమను వెల్లడించే సంభాషణ (7:1—8:4)
◾ప్రేమకున్న బలం (8:6-7)
◾ప్రేమ ఆలోచనలు (8:8-12)
◾ప్రేమ అభిలాష (8:13-14)
*గ్రంథములోని ప్రత్యేకతలు*
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
1️⃣ . *గ్రంథమును
మూడు భాగములుగా విభజించవచ్చును*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹
🇦.
ప్రేమ యొక్క ప్రారంభం( 1:1-3:5)
🇧.
ప్రేమ వివాహము నందు సఫలీకృతమవుట (3:6-5:1)
🇨.
ప్రేమ వృద్ధిచెందుట (5:2-8:14)
రెండవది: బైబిల్ ను జాగ్రత్తగా స్టడీ చేసిన
గొప్ప దైవజనులు ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు!
మొదటిది:1:1 నుండి 2:7
వరకు- అబ్రాహాము గారిని దేవుడు ప్రత్యేకపరచుకుని
పిలవడం నుండి సోలోమోను రాజై- వైభవముగా పాలించడం వరకు
రెండవది: 2:8 నుండి
5:16 వరకు-- బబులోనూ చెర- చెర విముక్తి- క్రీస్తు పుట్టుక-శిలువ మరణ పునరుత్థానము- సంఘము ప్రారంభము- యూదుల తిరస్కారము- అన్యజనులు రక్షించబడుట-
మూడవది: 5:17 నుండి చివర వరకు:
యేసుక్రీస్తు ప్రభులవారి రెండవ రాకడ మరియు వేయేండ్ల పాలన
సరే- గ్రంధాన్ని లేక గీతమును వ్రాసినది
ఎవరు?
1:1 ప్రకారము సోలోమోను గారు!
ఎప్పుడు రాశారు? క్రీ.
పూ. 970—940 మధ్యలో అనగా సోలోమోను రాజ్య పరిపాలన రాకమునుపు ప్రారంభించి,
రాజుగా పట్టాభిషేకం జరిగాక తన పరిపాలన జరిగే రోజులలో ముగించాడు!
గ్రంధమునకు అర్ధము!
పరమగీతము అనగా పరలోకమునుండి వ్రాయబడిన గీతము కానేకాదు! నిజమైన
అర్ధము- గీతములు అన్నింటికంటే శ్రేష్టమైన గీతము! *హెబ్రీ భాషలో దీనిపేరు SHLR HASHRIM అని, గ్రీకులో ASMA ASMATON అని, లాటిన్
భాషలో CANTICUM అని పిలవబడుతుంది.* *ఈ పేర్లు
అన్నిటికి అర్థము ఒక్కటే పాటలకు పాట అని అర్థము.* అంతేకాదు దీనిని
సొలోమోను పాట అని, వధూవరుల సంభాషణ పాట అని కూడా అంటారు.
పరమగీతము యేసుక్రీస్తు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని వివరించే మృదుమధురమైన
సంభాషణ పాట. *పరమగీతము అంటే అత్యున్నత గీతము అని అర్థం చేసుకోవాలి,
*మానవ వివాహములోని ప్రేమ యొక్క పరిశుద్ధతను గౌరవమును మరియు సంతోషమును
చూపించుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన గ్రంథమిది*. *వరుడు
క్రీస్తు ప్రభువు వారు, వధువు సార్వత్రిక సంఘము..*
*అధ్యాయాలు*
👉
8 ఎనిమిది
*వచనాలు*
👉
116 నూట పదహారు
*మూల వాక్యము*
👉
*(పరమ 7:10)*నేను నా ప్రియునిదానను అతడు నాయందు
ఆశాబద్ధుడు.
*(పరమ 8:6-7)* ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత
కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద
నన్ను నామాక్షరముగా ఉంచుము
నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.
అగాధసముద్ర
జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు
ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.
*ముఖ్యమైన మనుషులు*
👉
సొలొమోను రాజు, షూలమ్మీతి, షూలమ్మీతి యొక్క సహోదరులు, యెరుషలేము కుమార్తెలు.
*భౌగోళిక స్థలాల పేర్లు మరియు వాటికి అర్థాలు ఈ పావురపు పాటలో
15 భౌగోళిక స్థలాలు పేర్కొనబడ్డాయి*
🔹🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
🇦.
కేదారు - నలుపు (1:5)
🇧.
ఐగుప్తు - చీకటి (1:9)
🇨.
ఏన్గేది - మేకపిల్ల యూట (1:14)
🇩.
షారోను - బయలు ప్రాంతం (2:1)
🇪.
యెరుషలేము - శాంతి నిలయం (2:7)
🇫.
లెబానోను - తెల్లనివి (3:9)
🇬.
గిలాదు - కరుకైన (4:1)
🇭.
అమాన – చిరుత (4:8)
🇮.
శేనీరు - కవచము (4:8)
🇯.
హెర్మోను - పరిశుద్ధమైనది (4:8)
🇰.
తిర్సా - సంతోషదాయకం (6:4)
🇱.
హెష్బోను - తెలివి (7:4 )
🇲.
దమస్కు- నిజమైన మారుమనస్సు (7:4)
🇳.
కర్మేలు - తోట లేక వనము (7:5)
🇴.
బయలు హామోను - సమూహములకు ప్రభువు/యజమాని (8:11)
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*మూడవ భాగము- ఉపోద్ఘాతము-3*
ప్రియులారా ఇక ఈ గ్రంధములో గల
ముఖ్యమైన వ్యక్తుల కోసం చూసుకుందాం!
సోలోమోను: దావీదుకు
బత్షెబా అనే అన్యురాలు
(హిత్తీయురాలు) కనిన కుమారులలో రెండవవాడు.
దావీదు పాపాన్ని బట్టి మొదటి బిడ్డను మొత్తగా చనిపోయాడు. ఆమె మరలా కుమారుని కనగా అతనికి సొలోమోను అని పేరు పెట్టాడు (2 సమూ 12:24). దేవుడైతే అతనికి నాతాను ప్రవక్త ద్వారా యదీద్యా
అనగా యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు. కారణం అతని కాలంలో
యుద్ధాలు లేవు శత్రువులు లేరు. బత్షెబా ఇతనికి లెమూయేలు అని పేరు
పెట్టింది. అంటే యెహోవాకు సమర్పించబడినవాడు అని అర్థం.
ప్రజలు అతనికి ప్రసంగి అని పేరు పెట్టారు. నాలుగు
నామధేయాలు కలవాడు ఇతడు. సింహాసనం ఎక్కేటప్పటికి 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరుషలేము దేవాలయాన్ని
7 సంవత్సరాలలో, అతని నగరును 13 సంవత్సరాల్లోనూ కట్టించాడు...
షూలమ్మితి:
షూలమ్మీతి అనే కన్యక ఇశ్శాఖారు గోత్రానికి చెందినది. ఆమె నివాసం షూనేము అనే
గ్రామం. రాజైన సొలొమోను పరిపాలనలో ఈ గ్రామాలు అతని స్వాధీనములో
ఉండేది. షూలమ్మీతిని ఒకనికి ప్రధానం చేశారు. ఈ కన్యక సోదరులు ఈమెను ద్రాక్ష తోటకి కావలిగత్తెగా ఉంచారు. సొలోమోను సేవకులలో ఒకడు షూలమ్మీతిని తెచ్చి రాజనగరిలోనున్న స్త్రీల మధ్య ఉంచాడు.
ఇది షూనేమీయుల అలవాటు. (1 రాజులు
1:1-4) లో దీనికి ఋజువు కలదు. యాకోబు చనిపోకముందు
తన కుమారులు అందరినీ పిలిచి ఒక్కొక్కని భవిష్యత్తును ప్రవచించాడు. "ఇశ్శాఖారు.... భూమి రమ్యమైనదగుట చూచెను. గనుక అతడు మోయుటకు, భుజము వంచుకుని వ్యక్తి చేయు దాసుడగునని"
(ఆది 49:14-15)లో ఆశీర్వదించాడు. ఈ కారణాన ఈ గోత్రికులు దాసత్వం చేసేవారు. షూలమ్మీతి దాసి,
మనము కూడా దాసులము.
పాపానికి బానిసలం. ఆయనే మనలను విమోచించి ఘనపరిచాడు.
*గ్రంథములో ఉన్న ఇతర అంశాలు*
🟠🟢🟤🟣🔴🟡🟡🔵⚫
🇦. *పరలోక వరుడు*
🟣🟣🟣🟡🟡🟡🟢🟢🟢
1️⃣.
వధువులోని లోపాలన్నిటిని అతని ప్రేమ కనిపిస్తుంది
(4:7)
2️⃣.
అతడు ఆమెను చూచి హర్షిస్తాడు యెషయా (65:7)
3️⃣.
ఆమె కోసం తన ప్రాణం ఇచ్చాడు (ఎఫెసీ
5:25 )
4️⃣.
ఆమెను తనదిగా చేసుకునేందుకు వస్తాడు (మత్తయి
25:6)
*🇧.వధువు*
🟠🟠🟠🟠🔵🔵🔵🔵🔴🔴🔴
1️⃣
. వరుణ్ని ప్రేమిస్తున్నది (2:16)
2️⃣.
తన అయోగ్యతను గుర్తించినది (1:5)
3️⃣.
శుద్ధురాలై మచ్చలేని దుస్తులు ధరించింది ప్రకటన (19:8)
4️⃣.
దైవ కృప అనే ఆభరణాలు ధరించినది (యెషయా
61:10)
5️⃣.
వివాహానికి ఆహ్వానం పంపిస్తున్నది (ప్రకటన
22:17)
🇨. *పెండ్లి విందు*
🟡🟡🟡🟢🟢🟢🟢🟢
1️⃣.
తన కుమారుడి కోసం తన సిద్ధపరిచాడు (మత్తయి
20:22)
2️⃣.
ఖరీదైన ఏర్పాట్లు జరిగాయి (మత్తయి
22:4)
3️⃣.
దానికి ఆహ్వానము పొందడం గొప్ప గౌరవం (ప్రకటన
19:9)
4️⃣.
ఆహ్వానాన్ని అనేకమంది తిరస్కరించారు (మత్తయి
20:25)
5️⃣.
అన్ని తరగతుల ప్రజలకు ఆహ్వానాలు అందాయి (మత్తయి 22:10)
6️⃣.
పెండ్లి దుస్తులు లేకపోతే పెండ్లిలో స్థానము లేదు (మత్తయి 22:11-13)
*గ్రంథములను ప్రస్తుత కాలమునకు అన్వయించుట*
1️⃣.
విశ్వాసము మరియు కాముకత్వము*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹🔹
👉 పరమగీతములలోని దేవుని ప్రస్తావన రాలేదు కానీ
తెరవెనుక కనిపించేది యెరుషలేము రాజ భవనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుని
మీద విశ్వాసం ఉంచుకొనవలెను. సమకాలీన వ్యవస్థలో లైంగిక ఉల్లాసము,
ఉత్సాహము, క్రైస్తవ విశ్వాసమునకు సరిపోయింది కాదు.
వివాహము అనే హద్దులో అనే దానిని అనుభవించాలి. తగు
సమయములో శృంగారపరమైన సంబంధము సంతోషించుటకు దేవుడిచ్చిన ఒక బహుమానం.
Sex without marriage is adultery. Sex with unauthorized person
that is with otherthan his/her licensed wife/Husband is also sin and adultery!
Sex with same gender is hateful sin! So sex accepted in the frame of Holy
marriage is accepted and given by God Almighty!!
*2️⃣. ప్రేమలో పాఠములు*
🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
👉
పురాతన పద్యములలో మానవ ప్రేమ విలువలు ఎన్నటికి మారనివి. అందుచేత పరమగీతములు నేటి కాలంలో దాని వివరణ ఎంతో చెప్పవలయును.
*3️⃣. ఓపిక మరియు
శక్తి*
🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹
👉
పరమగీతములలోని ప్రారంభము యవ్వన స్త్రీ చెప్పుచున్నది - ప్రేమ కోరుకున్నంతవరకు లేప వద్దని, కలతపరచవద్దని
(పరమ 2:7;3:5;8:4). ప్రేమ తత్సంబంధమును ఇద్దరు
ప్రేమికులు దగ్గరై వృద్ధి చేసుకొనుటకు ఒక చిన్న సలహా. ఈ సలహా
ఈ పుస్తకం అంతయూ పదేపదే చెప్పబడింది. ప్రేమ సంబంధమైన విషయములయందు
ఓపిక కలిగి ఉండాలి. వివాహము ద్వారానే ఈ సంబంధము పెరగాలి.
అప్పుడా ప్రేమ స్థిరంగా, బలంగా ఉంటుంది.
*4️⃣. స్వచ్ఛత*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹
👉 ఈ యవ్వన స్త్రీ ఒక తాళం
వేసిన ఉద్యానవనము. ఆమె పురుషుడు దానిలోనికి ప్రవేశించుటకు పూర్ణ
స్వాతంత్ర్యము కలవానిగా చెప్పబడుచున్నది (పరమ 8:12). హద్దు మీరిన పరిణామములు స్త్రీపురుషులిద్దరికీ సంబంధించినవి.
*5️⃣. దేవుని క్రీస్తు
యొక్క ప్రేమ*
🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
👉
పరమగీతము మానవ సంబంధము వలె గాక అది దేవునికి, తన
ప్రజలకు గల సంబంధమును కూడా చెప్పుచున్నది. పరమగీతములు యూదుల పస్కా
పండుగ ప్రారంభ సమయంలో దేవుని ఉద్రేకపూరితమైన ప్రేమకు ఆనవాలుగా, దేవుని నిబంధనకు గుర్తుగా చదవబడును. ఇది నూతన నిబంధనలో
వివాహ సంబంధమును గూర్చి చదవబడును (ఎఫేసీ 5:25). అతిశయింపదగిన ప్రపంచము మీద మానవ ప్రేమపై
సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకము చేయునది ఉన్నది ఆయనకు గల పరిపూర్ణమైన, మహోన్నతమైన ప్రేమను తెలియజేయునది..
*గ్రంథములో ప్రభువైనయేసుక్రీస్తు వారి ప్రస్తావన*
🔴🔴🔴🔴🔴🔵🔵🔵��🟠🟠🟠
👉
(హెబ్రీ 13:4) లో ఇలా వ్రాయబడినది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను
ఉండవలెను. వేశ్యాసంగులకును, వ్యభిచారులకును
దేవుడు తీర్పు తీర్చును. దేవునికి, ఇశ్రాయేలునకు
మధ్య ఉన్న సంబంధము మరియు సంఘ వధువునకును వరుడైన క్రీస్తు సంబంధముల ఉపమాలంకారములు అని
కూడా అర్ధము చేసుకొనవచ్చును. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు
వారి ప్రేమ సంఘము పట్ల ఎలా ఉన్నదో అది భార్య భర్తల సంబంధానికి పరిశుద్ధమైన ప్రేమకు
ఉదాహరణలు (2 కొరింధి 11:2) (ఎఫెసీ
5:22-23) (ప్రకటన 19:7-9;21:1,2,9) ఈ గ్రంథములో
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు ప్రియునిగా ఉన్నాడు....
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*నాల్గవ భాగము*
పరమగీతము 1:1—2
1 సొలొమోను రచించిన పరమగీతము.
2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ
ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
ప్రియులారా!
దేవునికి మహిమ కలుగును గాక! ఇంతవరకు మనము ఉపోద్ఘాతములో
అసలు ఈ దివ్యమైన పుస్తకము బైబిల్ లో పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉంచారు? ఈ పుస్తకము యొక్క నేపధ్యము ఏమిటి? విశేషము ఏమిటి?
సోలోమోను ఎవరు? షూలమ్మితి ఎవరు? అనేది చూసుకున్నాము! ఇక ఈ పుస్తకములో గల ఆత్మీయ మర్మాలు
ధ్యానం చేసుకుందాము! గమనించాలి- నేను బైబిల్
స్కాలర్ గాని బైబిల్ పండితుడిని గాని కాను! నాకు వేదాంత విధ్య
డిగ్రీలు కూడా లేవు! గాని నా చిన్నతనములో మరియు యవ్వనములో నా
తండ్రిగారు అపోస్టలులు లూకా గారు, ఇంకా అనేకమంది దైవజనులు చెప్పిన
ప్రసంగాలు విని నేర్చుకున్నాను మరియు అనేకమంది దైవజనులు రచించిన పుస్తకాలు చదివి నేర్చుకుని పరిశుద్దాత్ముని
పాదాలు దగ్గర అడిగి పొందుకుని రాస్తున్నాను తప్ప నాకు ఈ విషయంలో విజ్నానము లేదు!
కాబట్టి నేను రాసిందే నిజమైన వ్యాఖ్యానము అని కాదు! సరియైనదిగా కనిపిస్తే తీసుకోండి! వాక్యము గద్ధిస్తే సరిచేసుకోండి!
హెచ్చరిస్తే హెచ్చరిక పొందండి! ఒకవేళ నేను వ్రాస్తున్నది
వాక్య విరుద్దముగా ఉన్నా, లేక సరియైన అర్ధముగా అనిపించకపోయినా
దయచేసి నాకు తెలియజేయండి. అవసరమైతే సరిదిద్దుకుంటాను!
గమనించాలి- ఉపోద్ఘాతములో చెప్పిన
విధముగా రెండు కోణాలు అనగా వాక్యములో ఉన్న సూటి ఆత్మీయ మర్మము మరియు దేవుడు అబ్రాహాము
గారిని పిలుచుకుని ఆయనకు స్వకీయ జనముగా చేసుకుని- రాజ్యమునిచ్చి-
వారి పాపములకు చెరలోకి బబులోనూ పంపించి తిరిగి రప్పించి- యేసుక్రీస్తు ప్రభులవారిని ఈ లోకానికి పంపించి- పాప పరిహారము
జరిగించి- శిలువ మరణ పునరుత్థానము తర్వాత సంఘమును స్థాపించడం-
రెండవరాకడ – వెయ్యేళ్ళ పాలన కోణములోనూ ఈ గ్రంధమును ధ్యానం చేద్దాం!
ఇక మొదటి వచనములో సోలోమోను రచించిన పరమగీతము అని వ్రాయబడి ఉంది గనుక ఇది సోలోమోను
గారు తన యవ్వనములో ఇంకా పట్టాభిషిక్తుడు కాకముందే ఈ గ్రంధమును వ్రాయడం ప్రారంభించారు! అనేకమంది అపోహపడినట్లు
దీనిని వ్రాసినది ఎవరో గాని సోలోమోను తన పేరు పెట్టుకున్నాడు అనేది సత్యదూరము అని గ్రహించాలీ!
మనము మొదటగా ఈ రోజు సొలోమోను అంటే అర్థం
ఏమిటి దానిద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకుందాము!!!
సోలోమోను అనగా సమాధాన కర్త! సోలోమోనుకు
నాలుగు పేరులు ఉన్నట్లు గతభాగాలలో చూసుకున్నాము! దావీదు గారు
పెట్టిన పేరు సోలోమోను! నిజానికి సమాధాన కర్త ఎవరు అనగా యేసుక్రీస్తు
ప్రభులవారు! యెషయా 9:6 ప్రకారం
6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద
రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు
తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు
ప్రభులవారు సమాధాన కర్త- ఇంగ్లీష్ లో Prince of
Peace. కాబట్టి అక్షరార్ధముగా ఈ ప్రేమ గీతము సోలోమోను గారు షూలమ్మితి
కి వ్రాసిన ప్రేమలేఖ గాని ఆత్మీయముగా ఈ లేఖ యేసుక్రీస్తు ప్రభులవారు తన స్వరక్తమిచ్చి
సంపాదించుకున్న తన సంఘానికి వ్రాసుకున్న ప్రేమలేఖ అని అర్ధమవుతుంది!
ఇక రెండవదిగా దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన పేరు యదీధ్యా! అనగా అనగా
యెహోవాకు ప్రియుడు! దీనికోసం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభులవారి
కోసం దేవాడిదేవుడు తండ్రియైన దేవుడు చెప్పారు మత్తయి మార్కు లూకా సువార్తలలో ఈయన నా
ప్రియ కుమారుడు! మత్తయి 3:17; 12:18; 17:5; మార్కు 1:11; లూకా 3:22 కారణం ఆయన
తండ్రికి ప్రియమైన వ్యక్తిగా జీవిస్తూ దేవుడు ఏమి చేయాలని కోరుకున్నారో అదే పనులు మాత్రమే
చేశారు! మనము కూడా మన జీవితాలలో దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే
చేస్తూ దేవునికి ప్రియులుగా జీవించవలసిన వారమై ఉన్నాము! సామెతలు
16:7 ప్రకారము మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి! కాబట్టి యదీధ్యా అనగా యెహోవాకు ఇష్టుడు లేక ప్రియుడు- గాని నిజానికి సోలోమోను గారు తన జీవిత చరమాంకంలో దేవునికి ఇష్టుడుగా ఉండక దేవునికి
వ్యతిరేఖంగా జీవించి శపించ బడ్డాడు! గనుక ఇక్కడ యదీధ్యా సోలోమోను
కాదు యేసుక్రీస్తు ప్రభులవారే- కనుక ఈ లేఖ యేసుక్రీస్తు ప్రభులవారే
రాశారు అని గ్రహించాలి!
ఇక మూడవదిగా సోలోమోను గారి
తల్లి బత్సెబా సోలోమోనుకి లెమూయేలు అని పేరు పెట్టింది. లెమూయేలు అనగా దేవుణ్ణి హత్తుకునే వాడు! సోలోమోను తన జీవిత ఆరంభములో దేవుణ్ణి హత్తుకున్నాడు గాని చివర్లో విగ్రహాలను
కాముకత్వాన్ని హత్తుకున్నాడు! కానీ యేసుక్రీస్తు ప్రభులవారు కేవలం
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెబుతూ తండ్రికిష్టమైన కార్యాలు
మాత్రము చేస్తూ దేవుణ్ణి హత్తుకున్నారు! మనము కూడా మన జీవితములో
రూతు గారు అత్తగారైన నయోమీ గారిని హత్తుకున్నట్లు మనము యేసుక్రీస్తు ప్రభులవారిని హత్తుకుని
జీవించాలి! రూతు గారు అన్నారు- నీ జనమే
నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు ఎక్కడ మరణిస్తావో అక్కడే నేను కూడా చనిపోవాలి- మరణము
తప్ప మనలను మరి ఏదీ విడదీయ లేదు అని హత్తుకుంది. అలాగే మనము కూడా
జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా! కాబట్టి ఈ పేరును
బట్టి చూసినా ఇది యేసుక్రీస్తు ప్రభులవారే రాసిన ప్రేమలేఖ అని గ్రహించాలి!
ఇక ప్రజలు పెట్టిన పేరు- ప్రసంగి: అనగా అనేకమైన మంచి
ప్రసంగాలు చేసిన వాడు- అవును సామెతలు గ్రంధము ప్రసంగి గ్రంధాలలో
అనేకమైన జీవిత సత్యాలు చెప్పిన వాడు సోలోమోను. అందుకే ఆయనకు ప్రజలు
ప్రసంగి అని పేరు పెట్టారు! అయితే నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు
ప్రభులవారు చేసిన ప్రసంగాలు నిజానికి పరలోకమునకు మనలను నడిపించే సత్యాలు! ముఖ్యంగా కొండమీద ప్రసంగానికి సాటియైన ప్రసంగం ఈ ప్రపంచంలో ఏదీ లేదు!
దానికి మించిన ప్రసంగం ఎవరూ చేయలేరు! కాబట్టి ఈ
రకంగా చూసుకున్నా ఈ పరమగీతము అనేది ప్రేమలేఖ యేసుక్రీస్తు ప్రభులవారు వధువు సంఘానికి
వ్రాసిన ప్రేమలేఖ గా నిర్ధారణ అవుతుంది!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*ఐదవ భాగము*
*నోటిముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టు కొనును గాక!*
పరమగీతము 1:1—2
1 సొలొమోను రచించిన పరమగీతము.
2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ
ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
ప్రియులారా! ఇక రెండవ వచనం చూసుకుంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక!
నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెబుతున్నారు! నిజానికి ఈ మాట షూలమ్మితి తన ప్రియుడైన సోలోమోను కోసం చెబుతున్న మాట ఇది!
నోటి ముద్దులు ఎవరు ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తే- మొదటగా ప్రపంచం మొత్తంలో
తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలకు ఎన్నెన్నో నోటిముద్దులు ఇస్తారు ప్రేమతో! గనుక మొదటగా తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు తన పిల్లలైన మనకు అనగా మానవాళికి
తన అమూల్యమైన నోటితో ముద్దులు ఇస్తున్నారు. అలా నాకు దేవుడు ముద్దులు
ఇవ్వాలి అని షూలమ్మితి కోరుకుంటుంది ఇక్కడ!
ఇక రెండవదిగా ప్రపంచములో అనేక ప్రాంతాలలో తెలిసిన వారిని లేక
ఇంటికి వచ్చిన వారిని గ్రీట్ చేస్తూ ముద్దు పెట్టుకోవడం ఆనవాయితీ! మనకు రెండు
చేతులతో నమస్కారం చేయడం ఎలానో, పాశ్చాత్య దేశాలలో షేక్ హండ్స్
ఇవ్వడం ఎలాగో అలాగే చాలా దేశాలలో ఇంటికి వచ్చిన వారిని తెలిసిన వారిని ముద్దుపెట్టుకోవడం
ఆనవాయితీ! ఇక్కడ దేవుడు అన్యులమైన మనలను తన ప్రేమతో ప్రేమించి
మనలను క్రీస్తు రక్తము ద్వారా మన పాపములను కడిగి పవిత్రులుగా చేసి ఇప్పుడు నా ప్రియమైన
వాడా నా ప్రియురాలా అంటూ మనలను ముద్దు పెట్టుకుంటున్నారు! అబ్రాహాము
గారు పిలువబడిన కోణములో చూసుకుంటే అబ్రాహాము గారు విగ్రహారాధనకు చెందిన కుటుంబంలో పుట్టిన
వాడు! గాని దేవుడు అబ్రాహాము గారిని నీ జనమును విడిచి నీ ప్రజలను
బందువులను విడిచి నేను చూపించే దేశములోకి రా! నిన్ను ప్రత్యేకమైన
జనముగా చేసి నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని పిలువగా ఆ ఆజ్నకు పిలుపుకు అబ్రహాముగారు
లోబడ్డారు! దేవుడు చెప్పినట్లు చేయగా దేవుడు అబ్రాహామును దీవించారు!
ముద్దుపెట్టుకున్నారు! మనలను కూడా అదే పిలుపుతో
పిలిచారు దేవుడు యేసుక్రీస్తు సువార్త ద్వారా! దానికి లోబడి సువార్త
సత్యమును గ్రహించిన సంఘానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ముద్దు పెట్టుకోడానికి
సిద్ధంగా ఉన్నారు!
అయితే మనము ఎందుకు పిలువబడ్డాము గతభాగాలలో విస్తారంగా విశ్వాసులు ఎందుకోసం
పిలువబడ్డారో ధ్యానం చేసుకున్నాము!
ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడడానికి
పిలవబడ్డాము!
రోమా 1:2 ప్రకారము
పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం! కాబట్టి మనం పరిశుద్ధులుగా
జీవించాలి! ఎందుకంటే మన పిలుపు సామాన్యమైనది కాదు భవిష్యత్ జ్ఞానము
బట్టి మనల్ని పిలుచుకున్నారు.
కాబట్టి రాజులైన యాజకులుగా మన పిలుచుకున్నారు
కాబట్టి పిలుపుకు తగిన జీవితము మనము జీవించాలి! పరిశుద్ధులుగా
ఉండాలి!
మనము దేవుని పరిశుద్ధులుగా అపోస్తులుగా
బోధకులుగా కాపరులుగా ఇంకా దేవుని పని చేయడానికి పిలువబడ్డాము!
ఇక 1కొరింథీ
7:22 ప్రకారము స్వాతంత్రం పొందడానికి పిలవబడ్డాము!
హెబ్రీ 9:15 ప్రకారం నిత్యమైన స్వాస్త్యము పొందడానికి పిలవబడ్డాము!
ఇంకా చీకటి నుండి వెలుగులోనికి పిలువబడ్డాము
కాబట్టి ఆయన గుణాతిశయాలు ప్రకటించడానికి కూడా పిలవబడ్డాము!
ఇక తర్వాత దేవుని యొక్క దీవెనకు ఆశీర్వాదాలు
వారసులవ్వడానికి పిలవబడ్డాము మొదటి పేతురు 3:9 ప్రకారం!
మొదటి పేతురు 5:10 ప్రకారం శాశ్వత మహిమకు పిలవబడ్డాము!
ప్రకటన 19:9 ప్రకారం గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డాము!
ఇంకా ఏసుక్రీస్తు ప్రభువుల వారియొక్క
వారుగా, ఆయన వారుగా ఉండటానికి పిలవబడ్డాను!
కాబట్టి విధేయులగు పిల్లలవలే మీ పూర్వపు
అజ్ఞాన దశలో ఉండకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము సమస్త ప్రవర్తనయందు
పరిశుద్ధులై ఉండుడి అని పేతురు గారు ఇదే అధ్యాయంలో చెబుతున్నారు
1
Peter(మొదటి పేతురు) 1:15,16
15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో
మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,
16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు
పరిశుద్ధులైయుండుడి.
యేసయ్య అంటున్నారు పిలువబడిన వారు
అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే!!! మరి నువ్వు పిలవబడ్డావు కదా
మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో!!!
ఇక మూడవది నోటి ముద్దులు పెట్టుకునేది ప్రేమికులు! ప్రియుడైన
సోలోమోను తనను తనివితీరా ముద్దుపెట్టుకోవాలి అని షూలమ్మితి ఆశిస్తుంది ఇక్కడ!
అలాగే సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభులవారు తనను ప్రేమించాలి ముద్దుపెట్టుకోవాలి
అని ఆశించాలి!
ప్రేమను
అనేక రకములుగా వ్యక్తపరచవచ్చును. అందులో నోటి ముద్దుతో వ్యక్తపరచుట
అందులో ఒకటి. మన మూలవచనములో
ప్రియుడు ప్రియురాలిని ముద్దిడి నట్లుగా వ్రాయబడింది. ఈ ముద్దులోని
మాధుర్యమును గూర్చి ప్రియురాలు ద్రాక్షారసము లోని మాధుర్యము కన్నా ప్రియమైనదిగా ప్రియుడి
ప్రేమ తనకు కనబడుచున్నట్లుగా చెప్పబడింది.
ఇందులో అతడు నన్ను ముద్దుపెట్టుకొనునని ప్రియురాలు చెప్పుచున్నది. ఇందులో క్రీస్తు ప్రభువు ప్రియురాలైన
సంఘమును ఏ విధముగా ముద్దు పెట్టుకొనుట జరుగును? ఎఫెసీ
5:27, ''అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైననులేక, పరిశుద్ధమైనదిగాను,
నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తనయెదుట దానని నిలువబెట్టుకొనవలెనని,
వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై
దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.''
ఇందులో క్రీస్తు ప్రభువుకు భార్యగా సంఘమును గూర్చి చెప్పబడింది. ఈ సంఘము పరమయెరూషలేముగా యుగాంతములో
మారి యేసుక్రీస్తు ప్రభులవారి భార్యగా మారును. ప్రకటన 21:9-10, ''అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు
దేవదూతలలో ఒకడు వచ్చి -ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను,
అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న
దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.'' ఈ విధముగా యుగాంతము తరువాత ఈ సంఘము
పరమయెరూషలేముగా మారును గనుక దీనికి ముందు అనగా ఇప్పుడు అనగా ఈ లోక సృష్టి మొదలు యుగాంతము
వరకు ఆమె భార్య కాదు కదా! అంటే ఎవరు కన్య. కన్య పురుషునికి ప్రియురాలుగా ఉండును. అంతేగాని భార్య కాదు. భార్యగా ఎప్పుడు మారును? వివాహము తరువాత. కనుక సంఘము క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగాను
క్రీస్తు ప్రభువును సంఘమునకు ప్రియుడుగాను ఇందులో వర్ణించుట జరిగింది.
ఇందులో
సంఘము అంటే ఎవరు? పరిశుద్ధులు అనగా జీవాత్మలమైన మనమే! ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు
విశ్వాసముంచుకొని సంఘములో భాగస్థులమై జీవిస్తామో, ఎవరి క్రియలు
సంఘములో అంత్య దినములలో పరిశుద్ధాత్మ పరీక్షించినప్పుడు నిలుచునో వారందరు సంఘముగానే
నిర్ణయించబడుదురు. కనుక
మనమందరము ఏకమైనప్పుడు
ప్రియురాలుగాను, విడి విడిగా ఉన్నప్పుడు కన్యలుగాను వర్ణించబడింది. ఎలా? మనము విడివిడిగా ఉంటే కన్యకలుగా లెక్కింపబడుదుము. మనమందరము సంఘములో ఏకమైతే పరమయెరూషలేముగా
మారుదుము గనుక క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగా మారి చివరకు వివాహానంతరము భార్యగా మారుదుము.
ఇందునుగూర్చి ఎఫెసీ 5:22-33 సవివరముగా వివరిస్తున్నది. అందుకే ఈ పరమగీతములోని వర్ణన చదివేవారికి
ఆత్మరీత్యా కొంత ఈ లోకరీత్యా కొంత ఉన్నట్లుగా అర్థమై తికమకకు గురి చేస్తున్నది,
ఎందుకంటే క్రీస్తు ప్రభువు ప్రియునిగా నూతన నిబంధన కాలము వరకు అదృశ్యములోఉన్నాడు,
నూతన నిబంధనకాలములో ఈ లోకములో భూమిపై యున్నారు. అటుతరువాత మరల అదృశ్య రూపములో ఉన్నారు. యుగాంతము తరువాత
రెండవ రాకడలో వచ్చి సంఘమును
తన భార్యగా చేసుకొనును. అలాగే ఈ సృష్టి మొదలు సంఘము ఈ లోకములో
ఉన్నది. ఈ సంఘము యుగాంతము
వరకు ఈ లోకములో క్రియ జరిగించును. కాని సంఘము రెండుగా విడిపోయి కొందరు పరదైసులలోను కొందరు ఈ లోకములో ఉన్నారు. ఎలా? మనకు ముందు తరములవారు ఈ లోకములో సంఘములో
కన్యకలుగా ఉండి వారి మరణానంతరము పరదైసులలో చేర్చబడుచున్నారు. కనుక సంఘము అనగా ప్రియురాలు రెండు ప్రాంతాలలో తన కార్యములు కొనసాగించుచున్నది.
అందులో పరదైసులో చీకు చింత లేక ఆనందముగా ఉంటే ఈ లోకములో సాతాను సమాజము
క్రీస్తు సంఘముతో నిరంతరము పోరాటము కొనసాగుచున్నది. ఇలాంటి ప్రియురాలిని క్రీస్తు ప్రభువు
తన నోటి ముద్దులుతో తన ప్రేమను ఆమెకు చూపుట బహు ఆశ్చర్యముగా లేదా!
ఈ ప్రేమను
గూర్చి మనము ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి మనకోసము ఈ లోకములో కన్యక
ద్వారా జన్మించి సిలువ బలియాగమునకు ముందు తన ప్రేమను వ్యక్తపరచుట బల్ల భోజనము ద్వారా
చూపుట జరిగింది. అంత
ఉన్నత స్థానములోని రాజు మనకోసము సాధారణ వ్యక్తిగా ఈ లోకములో జన్మించి జీవించుట ప్రేమకు
నిదర్శనము కాదా! ఈ ప్రేమ ప్రభు భోజనమును పుచ్చుకొనునప్పుడు ఆయన
మనలను ముద్దిడుచున్నట్లుగా భావించుకొనుచు ఆ మధురమును మనము ఆస్వాదించాలి. ఈ మధుర ద్రాక్షారసమును బల్ల ఆరాధనలో
త్రాగుట కన్న మధురమైనది. కొద్దిగా పులియని ద్రాక్షారసము నోటికి తగిలినప్పుడు అది చాలా మధురముగా అనిపిస్తుంది
కాని ఆయన ప్రేమను మనము ఇందులో ఆస్వాదిస్తే అత్యంత మధురమైనదిగా తెలుస్తుంది. ఈ విధముగా ప్రియుడు ప్రియురాలిని
విడరాని బంధముగా ముద్దు పెట్టుకోవాలని, ప్రియురాలైన సంఘము అందులోని
కన్యకలమైన మనము ఆశించాలి.
మరి నీవు అలా ఆశించడానికి ఇష్టపడుతున్నావా?
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*6వ భాగము*
*నీ పేరు పోయబడిన పరిమళతైలము*
పరమగీతము 1:3
నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో
సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.
ప్రియులారా! ఇక మూడవ వచనం చూసుకుంటే నీవు పూసికొను పరిమళతైలము
సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని
షూలమ్మితి చెబుతుంది సోలోమోను కోసము!!
ఇక్కడ “పేరు” ఒక వ్యక్తి స్వభావాన్నీ లక్షణాలనూ సూచిస్తున్నది.
పాత నిబంధనలో యెహోవా అనే పేరు, క్రొత్త నిబంధనలో
యేసు అనే పేరు పరలోకం నుంచి భూమిమీదికి ఒలికి ప్రపంచవ్యాప్తంగా పరిమళాలను విరజిమ్మిన
సుగంధ తైలాలు. నిర్గమకాండము 30:22-38, ; కీర్తనల గ్రంథము 45:8, ; మత్తయి 26:6-13, పోల్చిచూడండి. ఆధ్యాత్మికంగా పవిత్రులు (ఇక్కడ “కన్యలు” ఇలాంటివారికి సూచన)
దేవుణ్ణే అన్నిటికంటే పైగా, ఎక్కువగా ప్రేమిస్తారు.
సరే, ఇక్కడ నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది అంటుంది షూలమ్మితి! అది ఆయన పేరే అని మీద చెప్పుకున్నాము!
యేసునామము పవిత్రమైనది పరిశుద్ధమైనది అమూల్యమైనది. పాపిని పరిశుద్ధినిగా
చేసేది. దయ్యాలు భయపడి వణికి పోయేది. ముఖ్యంగా
నిరాశలలో ఉన్నవారికి ఆశ కలిగించేది- ఆదరణ లేనివారికి ఆదరణ ఇచ్చేదీ
ఏసునామమే! అట్టివారికి ఈ యేసు నామము పరిమళ తైలమే!
నిజానికి అబ్రాహాము గారి తర్వాత యాకోబు సంతానములో ఆహారోను వచ్చాడు- ఆ ఆహారోను
తలమీద పరిమళ తైలము ప్రోక్షించ బడింది దేవునికి యాజకునిగా అభిషేకించ బడ్డాడు ఆహారోను!
నిర్గమ 29:7 లో చెప్పబడినట్లు! ఇదే అభిషేకమునకు సాదృశ్యముగా ఈ అంత్య దినాలలో తన సేవకుల మీద పరిశుద్ధాత్మ అభిషేకము
తైలము వలె కుమ్మరించ బడింది కుమ్మరించబడుతుంది! పాత నిబంధనలో
ఆహారోను ప్రధాన యాజకునిగా ఉంటే ఈ క్రొత్త నిబంధనలో మెల్కీసేదేకు క్రమంలో యేసుక్రీస్తు
ప్రభులవారు ఉన్నారు! ఈయన మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె
వ్రాలి నట్లు యోహాను 1:32 లో చూడగలము! అప్పటినుండి
యేసుక్రీస్తు ప్రభులవారు దేవుని పనికి తనను తాను సమర్పించు కున్నట్లు మనము చూడగలము!
ఆదేవిధముగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న ప్రతీ విశ్వాసి దేవుని
పనికోసం పాటుపడాలి! కష్టపడాలి!
అదే పరిమళ తైలముతో ప్రభువు పాపులను విమోచన చేశారు రక్షించారు, ఇంకా తన పేరు కొరకు ప్రతిష్టించారు
అదే పరిమళ తైలముతో మానవులను తన ప్రజలుగా అభిషేకించారు దేవుడు! మనము కూడా ఇదే పరిమళ తైలము పొందుకుని అనేకులను ప్రభు చెంతకు రప్పించాలి!
ఇక పరిమళ తైలము ఎంతో సువాసనగా ఉంటుంది. పరిమళ తైలము అనగా సెంటు!
ఈ సువాసన మనము అందరికీ వెదజల్ల వలసి ఉంది! క్రీస్తు
కూడా మనకొరకు నీళ్ళ వలె పోయబడి మనకు సువాసనగా అప్పగించబడ్డాడు కీర్తన 22:14 ప్రకారం!
14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు
స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
మనలో
ఉన్న అవినీతి ఆక్రమము పాపము, చేదు జీవితం, వ్యభిచారం లాంటి చెడుగు
కడిగి పరిశుద్ధ పరచి మనలను జీవపు వాసనగా మార్చి యున్నాడు దేవుడు! అందుకే ఆయన పరిమళ తైలము గా ఉన్నారు మనకు !
2 కోరింథీ 2 చూసుకుంటే
15 రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి
క్రీస్తు సువాసనయై యున్నాము.
16 నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి
జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
కాబట్టి
మన పాపపు దుర్వాసన తొలిగించి క్రీస్తు సువాసనతో దేవుడు మనలను నింపారు! అదే సువాసనను మనము మన
పొరుగువారికి బందుమిత్రులకు నింప వలసిన అవసరం ఎంతైనా ఉంది!
ఎఫెసీ 5: 2 క్రీస్తు మిమ్మును ప్రేమించి,
పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను
అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
3 మీలో జారత్వమే గాని, యే విధమైన
అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను
ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4 కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు;
ఇవి మీకు తగవు.
ఇక ఇదే పరిమళ తైలము సహోదరులు మధ్య ఐక్యతను తీసుకుని వచ్చి తద్వారా అభిషేకమును
ఆశీర్వాదమును తీసుకుని వచ్చినట్లు మనము కీర్తనల గ్రంధము 133 లో చూడగలము!
కాబట్టి సహోదరులమైన మనమంతా ఐక్యతతో ఉండాలి! నిజమైన
సహోదరుల మద్య ఐక్యత ఉండాలి! మన సంఘాలలో విశ్వాసుల మధ్య మరియు
సంఘముల మధ్య సంఘ కాపరుల మధ్య ఐక్యత వర్ధిల్లాలి! అప్పుడే ఆశీర్వాదము
అభిషేకము కలుగుతుంది మనకు! అప్పుడు ఆహారోను తలమీదుగా ఆ అభిషేకము
– యేసుక్రీస్తు ప్రభులవారి
నుండి మనమీదకు కారుతుంది! అప్పుడు మన గిన్నె నిండి పొరలి పారుతుంది!
ఇలా ఐక్యతతో ఉన్నప్పుడే ఏసునామము పరిమళ తైలముగాను పరిమళ వాసనగాను ఉంటుంది!
మనలో మనకు సమాధానం ఐక్యత లేకపోతే మన నుండి దుర్వాసన వ్యాపించి క్రీస్తు
నామము అవమాన పరచబడుతుంది!
అలాగే ''నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము.'' ఎంత వివరముగా ఈ వచనములో అలంకార ప్రాయముగా
వర్ణించబడింది. నీ పేరు
అనగా ప్రియుని పేరు. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువును ప్రియునిగా వర్ణించారు. ఈ వచనములో నీ పేరు అంటే యేసుక్రీస్తు
పేరే. యేసుక్రీస్తు పేరు
పోయబడిన పరిమళతైలముతో సమానమని చెప్పబడింది. ఎలా? ఈ పోయబడిన పరిమళతైలమును ప్రతిష్ఠాభిషేక
తైలముగా పాతనిబంధనలో పిలువబడింది. అలాగే ఈ లోకములో జన్మించిన దైవకుమారుని పేరు ఏమిటి? క్రీస్తు లేక యేసు. యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు.
లూకా
2:11, ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు,
ఈయన ప్రభువైన క్రీస్తు.''
యోహాను 1:42, ''యేసునొద్దకు అతని తోడుకొని
వచ్చెను. మెస్సీయ అను
మాటకు అభిషిక్తుడని అర్థము.'' ఇది
అందరికి తెలిసినదే. ఈ
విధముగా ప్రియుని పేరు పోయబడిన పరిమళతైలముతో సమానమైనది.
ఇలాంటి
అభిషిక్తుడైన యేసును అనగా క్రీస్తు ప్రభువును కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చెప్పబడింది. కన్యకలు ఎవరు? అంటే పరిశుద్ధులమైన మనమే. ఎవరైతే దేవునిలో పరిశుద్ధులుగా జీవిస్తారో
వారు కన్యకలు. వారు మగవారు
కావచ్చు లేక ఆడవారు కావచ్చు. వారిలో పెండ్లి అయినవారు కావచ్చు లేక పెండ్లి కానివారు కావచ్చు లేక పసిపిల్లలలో
బాలికలు కావచ్చు లేక బాలురు కావచ్చు.
వీరిలో ఎవరైన రక్షకుని యందు విశ్వాసముంచిన వారు అనగా ఆడ మగ అను
తేడా లేకుండ దేవుని పిల్లలుగా లెక్కింపబడుదురు. యోహాను 1:12, ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.'' వీరంతా యుగాంతములో గొఱ్ఱెపిల్లయైన
క్రీస్తు అను ప్రియునికి వధువుగా మారుదురు. చివరకు వివాహానంతరము భార్యగా మారుదురు
కనుక ఈ లోకరీత్యా వీరు పవిత్ర స్థితిలో ఏ దశలో వారి జీవితము ఉన్నను వారందరు కన్యకలే. కనుక ఈ కన్యకలమైన మనమందరము ఆయనను
ప్రేమించుదుమని వ్రాయబడింది. వీరు ప్రేమ ఎంతవరకు చూపుచున్నారో ఒక్కసారి తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. కన్యకలుగా పిలువబడిన అపొస్తలులు ప్రపంచ
నలుమూలల క్రీస్తును గూర్చి ప్రచారము చేసారు. క్రీస్తు ప్రేమకు దూరమై జీవిస్తున్న
కన్యకలను మీరు చెడిన స్థితిలో ఉన్నారు.
నిజానికి మన ప్రియుడు రక్షకుడు క్రీస్తు ప్రభువేనని వీరు సువార్త
ప్రచారము చేసారు. దైవవ్యతిరేకులచే
చంపబడినారు. అలాగే హతసాక్షులు
ఆయనను అనగా తమ ప్రియుని గూర్చి తాము ఇచ్చు సాక్ష్యమును గూర్చి తమను చంపుచున్నను ఎలాంటి
సంకోచము చూపకుండ వారు తమరీ ప్రేమను వెల్లడి చేసారు. అలాగే విశ్వాసులు హతసాక్షులయొక్క
మరణమును చూస్తూ కూడ విశ్వాసములో చెదరక అలాగే ఉన్నారంటే వారి ప్రేమ అలాంటిది. ఇంతకి ఒక్క విషయము గమనించారా! మనకు ఏ పని పాట లేదనా మనము ఆదివారము
ఆరాధనకు ఖచ్చితముగా వెళతాము? క్రీస్తు ప్రభువుపై ఉన్న ప్రేమతోనే కదా! ఎన్ని పనులున్నను అవన్ని ప్రక్కన
పెట్టో లేక ముందుగా కష్టించి పని చేసేసి సమయానికి ప్రియుని సన్నిధికి వెళ్లుట లేదా! ఈ విధముగా కన్యకలుగా మనము ఆయనను ప్రేమించుచున్నాము.
మరి కన్యకలకు మనలను ఎందుకు
పోల్చబడింది? అని ఆలోచిస్తే
కన్యక అని ఎవని గూర్చి అంటారు? పురుషునితో సంబంధము లేని స్త్రీని
కన్యక అని అంటారు. అంటే
ఈ కన్యక అంటే ఏ దోషము లేని స్త్రీ అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ఎవరిలో అయితే 10 ఆజ్ఞలకు వ్యతిరేక జీవితము ఉండదో వారందరు పాపము లేని కన్యలు. ఇలాంటి కన్యకలు క్రీస్తు ప్రభువును
ప్రేమిస్తారు. పాపపు
జీవితములో జీవించువారు అనగా ప్రకటన 21:8, ''పిరికివారును,
అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును,
విగ్రహారాధకులును, అబద్ధికు లందరును అగ్ని గంధకములతో
మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.'' ఇలా చెప్పబడినవారు మలినముతో నిండిన
కన్యకలు వీరిని ఆత్మ రీత్యా వ్యభిచారులు అని యిర్మీయా ప్రవచించియున్నారు. ఎవరైతే దేవునిలో జీవించుచు ఆయనయందు
మనస్సు కలిగి ఉందురో వారు కన్యకలు గనుక ఆయనను తమ ప్రియునిగా ఆరాధించుట అనగా ప్రేమించుట
జరుగును. మత్తయి 25:10.
అట్టి
కృప ఆరాదన చేసే ధన్యత, యేసుక్రీస్తుప్రభులవారి ని ప్రేమించే భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*గీతాలకు గీతము-పరమగీతము*
*7వ భాగము*
*నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము*
పరమగీతము 1:4
4. నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము
రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము
ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను
ప్రేమించుచున్నారు.
ప్రియులారా! ఇక 4వ
వచనం చూసుకుంటే నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము
అంటున్నారు. గమనించాలి- నన్ను ఆకర్శిస్తే
మేము నీయొద్దకు పరుగెత్తి వస్తాము – షూలమ్మితి అంటుంది అయ్యా
నన్ను నీవు ఆకర్శిస్తే మేము అనగా మొత్తము నా జనమంతా నీ దగ్గరకు పరుగెత్తి వస్తాము అంటుంది.
దీని అర్ధము మామూలుగా చూసుకుంటే ఆత్మీయ కోణంలో పరలోక రాజు తానే వచ్చి
మనలను తనతో ఏకాంత సహవాసానికి ఆకర్షించకపోతే మనం ఎన్నటికీ అందులోకి చేరము (యోహాను 6:44, ). ఆ పనంతా ఆయనదే. అయితే ఆయనతో ప్రేమ పూర్వకమైన సహవాసాన్ని ఆతురతగా, ఇష్టపూర్వకంగా
కోరుకునే మనస్సు మనకు ఉండాలి. “నన్ను...మనం”– ఈ గీతంలో కొన్ని సార్లు విశ్వాసులందరూ ఒకటిగా – ఒక వధువుగానూ,
మరి కొన్ని సార్లు ఒక వ్యక్తుల సమూహంగానూ కనిపిస్తారు. కీర్తనల గ్రంథము 45:14-15, ; ప్రకటన గ్రంథం
19:7-8, పోల్చిచూడండి. “నిన్ను ప్రేమించడం”– పరలోక రాజును ప్రేమించడం
కంటే విశ్వాసులకు తగిన విషయం మరొకటి లేదు.
సరే- అబ్రాహాము గారు పిలువబడిన కోణంలో
చూసుకుంటే మేము అనగా ఇశ్రాయేలు జాతి నన్ను అనగా అబ్రాహాము గారి సంతానంలో రక్షించబడిన
విశ్వాసి! మరి ఇశ్రాయేలు జాతి దేవునితో అంటున్నారు అయ్యా మమ్మల్ని
ఆకర్శించండి మేమంతా నీ వద్దకు పరుగెత్తుకుని వస్తాము అంటున్నారు! మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? ఎందుకంటే ఇంతకు
ముందు ఇది నెరవేరలేదు ఇంతవరకు నెరవేరలేదు! ఎప్పుడు నెరవేరుతుంది
అంటే అన్యజనులలో రక్షించబడవలసిన చివరి వ్యక్తి రక్షించబడిన వెంటనే సంఘము ఎత్తబడిన తర్వాత
ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు
వారిని ఆకర్షిస్తారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు సమకూరుస్తారు! కూర్చబడిన తర్వాత కూడా మొదట వారు క్రీస్తు విరోధి వైపు ఆకర్షించబడినా వాడు
బలి అర్పణ నిలిపివేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల కన్నులు తెరువబడి ఏసుక్రీస్తు ప్రభులవారి
వైపుకి తిరుగుతారు! ఈ విధంగా మహా శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలంతా
క్రీస్తువైపుకి ఆకర్షించ బడతారు! అప్పుడు రోమా పత్రిక ప్రకారం
ఇశ్రాయేలు ప్రజలు మొత్తం రక్షించబడతారు! చివరికి వేఏండ్ల పాలన
నాటికి ఇశ్రాయేలు ప్రజ మొత్తం ప్రభువు వద్దకు ఆకర్షించ బడతారు!
ఇక సంఘకోణంలో చూసుకుంటే ''నన్ను ఆకర్షించుము,'' అని అనుటలో ఎవరిని ఎవరు ఆకర్షించాలి? ప్రియురాలు ప్రియునితో నన్ను ఆకర్షించుము
అని చెప్పుట జరిగింది. అంటే క్రీస్తు ప్రభువు పురుషునిగా సంఘము ప్రియురాలుగా మనము చెప్పుకొన్నాము. క్రీస్తు ప్రభువు సంఘమును ఏ విధముగా
ఆకర్షిస్తాడో తెలుసుకొందము.
ప్రకటన
22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు;
వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని
రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.''
ఇందులో ఆత్మ, పెండ్లి కుమార్తె అయిన ప్రియురాలు, విశ్వసించిన విశ్వాసి
అనగా కన్యక అందరు రమ్ము అని పిలుస్తున్నారు. ఎవరిని? ఎవరిలో నైతే క్రీస్తు ప్రభువునందు
విశ్వాసము లేక జీవిస్తున్నారో వారిని పిలుస్తున్నారు. ఆత్మయైన దేవుడు జీవాత్మను పిలుస్తున్నాడు. సంఘము తనలో అప్పటిదాక చేరిన కన్యల
క్రియలన్నిటిని ఐక్య రీతిన చూపుచు పిలుస్తున్నది. విడివిడిగా సంఘముగా కాకుండ కూడ జీవాత్మయైన
నరుడు అనగా విశ్వాసి అనగా కన్య పిలుస్తుంది. ఈ కన్య అనగా ప్రియురాలు ఎవరిని ఆకర్షించమని
కోరుకొంటున్నది? క్రీస్తు
ప్రభువునే కదా! అందుకే
క్రీస్తు ప్రభువు - సిలువపై నుండి ఆకర్షిస్తేనే గాని ఎవరును ఆయన
యొద్దకు రాలేరని చెప్పుచున్నారు. యోహాను 12:32, ''నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.''
అంటే సిలువపై వ్రేలాడుచు రక్తసిక్తమై
మరి కొద్ది క్షణములలో మరణించబోవు స్థితిలో ఉన్న క్రీస్తు ప్రభువును ప్రియురాలు అనగా
సంఘము తనను ఆకర్షించమని కోరుకొంటుంది.
అంటే రక్షణ ఒక సిలువ బలిలోనే ఉన్నది. ఈ బలిని అర్పించి క్రీస్తు ప్రభువు
ఆకర్షించుట జరిగితే, రక్షణలోనికి రాగలుగుదురు. అందుకే నేను ఇన్ని ఆత్మలను రక్షించాను
అని విర్రవీగుట విశ్వాసికి తగదు.
ఎప్పుడైతే
సిలువపై యున్న క్రీస్తు ప్రభువు ఆకర్షించాడో ప్రియురాలైన కన్యకలు ఆకర్షించబడి మేము
నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము అని చెప్పుచున్నది. నన్ను ఆకర్షించమని సంఘము అను కన్యక
అడిగినందున, తరువాత ప్రియురాలుగా ఆకర్షించబడిన కన్యక లందరు కలిసి
నీయొద్దకు పరుగెత్తి వచ్చెదమని చెప్పుట జరిగింది. ఎఫెసీ
2:19. ఎక్కడికి వస్తారు? మొదటగా రక్షణలోకి, తరువాత ప్రియురాలుగా ఏక సంఘములోనికి, తరువాత క్రీస్తుతో
పాటుగా పరలోకమునకు వెళ్లుటకు పరుగెత్తి వస్తారు. వచ్చేవారు నెమ్మదిగా రావటము లేదు. ఆయన ఆకర్షణ అలాంటిది. ఒక్కసారి ఆకర్షింపబడితే ఇక క్షణమైన
ఆగలేరు. వారి మనస్సు
రక్షణ పొందాలన్న తపనతో పరుగులు తీస్తుంది.
కనుక ఆకర్షించబడిన కన్యకలు ప్రియురాలుగా మారుటకు పరుగెత్తుకొని
వచ్చుట జరుగును.
ఇలా పరుగెత్తుకొని
వచ్చినవారిని రాజు తన అంత:పురములోనికి నన్ను చేర్చుకొనెను అని
చెప్పుచున్నది. అంతేకాకుండా పెండ్లి కుమార్తె గదిలోనుండియు పెండ్లి
కుమారుడు అంతఃపురములోనుండి వచ్చును అని వ్రాయబడింది. యోవేలు
2:16;
ఇక ఇందులో
చెప్పబడిన రాజు / పెండ్లి కుమారుడు ఎవరు? సంఘముయొక్క ప్రియుడైన క్రీస్తు ప్రభువే. ఎలా? లూకా 23:3, ''పిలాతు -నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన-నీవన్నట్టే అని అతనితో చెప్పెను.'' నీవు యూదుల రాజువా? అంటే నీవన్నట్టే అని క్రీస్తు ప్రభువే
స్వయముగా చెప్పుట జరిగింది. ఈ రాజు దావీదు సింహాసనమును యుగయుగములు ఏలునని చెప్పబడింది. లూకా 1:32, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును; ప్రభువైన
దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.'' తూర్పు దిక్కునుండి వచ్చిన జ్ఞానులు
కూడ హేరోదును క్రీస్తు ప్రభువును గూర్చి విచారిస్తూ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని
మత్తయి 2:1-5లో చెప్పబడింది. కనుక పరమగీతములో చెప్పబడిన రాజు క్రీస్తు
ప్రభువు.
ఇలాంటి
రాజు ఎప్పుడైతే తనను ఆకర్షించాడో ఎప్పుడైతే ఆ ఆకర్షణకు ఆకర్షించబడి కన్యలందరు పరుగెత్తుకొని
వచ్చారో వారందరు ఒకే క్రీస్తుయేసు సంఘమైనందుకే ''నన్ను''
అన్న ఏకవచనం ఇందులో చెప్పబడింది. యెరూషలేమను సంఘమును తన అంత:పురములోనికి చేర్చుకొంటాడు.
ఈ అంత:పురము పరలోక రాజ్యమే. ఈ రాజ్యములో అనేక గృహములు ఉన్నట్లుగా
క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. యోహాను 14:2-6, ''నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును;
మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచ
వెళ్లుచున్నాను. నేను
వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద
నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా-ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే;
ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు-నేనే
మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.'' కనుక పరలోక రాజ్యములో జీవాత్మకు సంబంధించిన
నివాసములు ఉన్నాయి. అవి
రాజైన క్రీస్తు ప్రభువునకు సంబంధించినవి గనుక ఆయన తన ప్రియురాలుగా వచ్చుచున్న జీవాత్మలమైన
మనకు వీటిని సిద్ధపరచి మనలను తనతో తీసుకొని పోవును. ఇక్కడ తన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. క్రీస్తు ప్రభువే మన కొరకు మనముండవలసిన
నివాసములను సిద్ధపరచును. ఈ విధముగా ప్రియుడు ఆకర్షించగా పరుగెత్తుకొచ్చిన ప్రియురాలిని పరలోకములో తన
అంత:పురములలో చేర్చుకొని బహు ఆదరణతో చూచుకొనును.
ప్రియమైన
సహోదరీ / సహోదరుడా! ఆయన నిన్నుకూడా ఆకర్షిస్తున్నారు. మరినీవు నీవు ఆకర్షించబడుతున్నావా? ఇంతకీ నిన్ను ఏది
ఆకర్షిస్తుంది? వరుడైన యేసుక్రీస్తుప్రభులవారా లేక లోకమా?
సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*8వ భాగము*
*నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను *
పరమగీతము 1:5
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 5వ
వచనం చూసుకుంటే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు
తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! ఈ వచనం ధ్యానం చేసేముందుగా షూలమ్మితి నల్లగా
మారిపోడానికి కారణం ఏమిటి? యెరూషలేము కుమార్తెలు
ఎవరో అనేది చూసుకుని ఈ వచనం ధ్యానం చేసుకుందాం!
మొదటగా నల్లనిదిగా ఎందుకు మార్చబడింది? కారణం ఆమె మొదట సౌందర్యవంతురాలే
గాని ఇప్పుడు ఎండతగిలి నలుపుగా మారిపోయింది! ఆరవ వచనంలో దానికి
జవాబు చెబుతుంది షూలమ్మితి! నా సహోదరులు నామీద కోపగించి నన్ను
ద్రాక్షతోటకు కావలిదానిగా చేసేశారు అంటున్నది! దీనికి కారణం తెలియాలి
అంటే మొదట భాగంలో చెప్పుకున్న జరిగిన కధ మరలా చెప్పుకోవాలి!
రాజైన సోలోమోను తాను ఇంకా
యవ్వనస్తునిగా ఉన్నప్పుడు రాజ్యమంతా పర్యటించేటప్పుడు షూనేము ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక యవ్వనురాలను చూసి ప్రేమిస్తాడు. అయితే తాను రాజకుమారుడు అని తెలిస్తే భయపడి తనను ఎక్కడ తిరస్కరిస్తుందోనని
భావించి ఒక గొల్ల పిల్లవానిలా వేషం వేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఈలోగా ఆమె యొక్క అన్నలు (సవితి అన్నలు అనగా ఆ అన్నలు
యొక్క తల్లి చనిపోయిన తర్వాత షూలమ్మితి తల్లిని పెళ్లి చేసుకుంటాడు తండ్రి)
ఆమెకు ఒక వ్యక్తితో ప్రధానం చేస్తారు! గాని షూలమ్మితి
ఈ గొల్లపిల్లవాని వేషంలో ఉన్న సోలోమోనును ప్రేమిస్తుంది గనుక అన్నలు కోపపడి వారియొక్క
ద్రాక్షతోటకు కాపలాదారిగా నియమిస్తారు.
దానితోపాటు చిన్న మందను కూడా కాపాలాకాయమని అప్పగిస్తారు!
గాని ఆమె సొంత తోటను, సొంత మందను పట్టించుకోకుండా
సొలోమోను చుట్టూ తిరుగుతుంది. అప్పుడు సోలోమోను తాను ఎవరో చెబుతాడు.
ఈ విషయం తెలిసిన అన్నలు ఆమెను సోలోమోను పొలములో పనికత్తెగా నియమిస్తారు.
అప్పుడు ఆమె షూనేము నుండి యెరూషలేము వచ్చి సోలోమోను పొలములో ఒక దాసీగా
పనిచేస్తుంది. అదికూడా ఎండలో పనిచేస్తుంది. అప్పుడు ఆమె సౌందర్యము దెబ్బతింటుంది నల్లగా మారిపోతుంది శరీరం! అయినా సోలోమోను ఆమెనే ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు! ఇది
జరిగిన సంఘటన! అందుకే నల్లగా మారిపోయింది!
సరే- ఇక యెరూషలేము కుమార్తెలు ఎవరు? దీనికోసం
చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి గాని నేను నమ్మేది వాక్యాధారంగా చెబుతాను!
సంఘకోణంలో నా అభిప్రాయం వీరు నామకార్ధ క్రైస్తవులు! పైకి క్రైస్తవులుగా
నటిస్తారు గాని నిజానికి క్రైస్తవులు విశ్వాసులు కారు! బొట్టు
మాత్రమే పెట్టుకోరు గాని అన్నీ అన్యులు చేసేపనులే చేస్తారు! బైబిల్
చెప్పినట్లు పైకి భక్తిగలవానీలా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు! మందిరానికి వస్తారు గాని ఇంటివద్ద అన్నీ అన్యాచారాలే! ఇదే గ్రంధంలో 7 రకాలైన యెరూషలేము కుమార్తెలు కనిపిస్తున్నారు
లేక వీరి యొక్క 7 గుణాలు ఈ గ్రంధంలో మనకు కనిపిస్తున్నాయి!
వీరు నేటి రోజులలో మనమధ్య కూడా ఉన్నారు! వీరి విషయంలో
మనం జాగ్రత్త కలిగి నడుచుకోవాలి లేకపోతే మనలను కూడా బ్రష్తులుగా చేసేయగలరు వీరు!
మొదటగా ఇదే వచనం ప్రకారం వీరు- ఇతర విశ్వాసులను చాలా చులకనగా చూస్తారు!
ఈ వచనంలో ఈ యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని చులకనగా తక్కువగా చూస్తున్నారు
ఎందుకంటే ఆమె నల్లగా ఉంది! విశ్వాసి జీవితంలో ఎవరికైనా మాటిమాటికి
శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వీరు వాళ్ళను చులకనగా చూస్తారు- వీరేదో మహా భక్తిపరులు అని- వారేదో ఘోరమైన పాపము చేశారు
అందుకే దేవుడు వారిని శిక్షిస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటారు యోబుగారి స్నేహితుల వలె!
గాని నిజానికి వారు పరలోకమునకు పోయే బాచ్ కాబట్టి చిన్న తప్పుచేసినా
దేవుడు లెంపకాయ కొట్టి తిరిగి తన దారిలోనికి తెచ్చుకుంటున్నారు అని వీరికి తెలియదు!
సంఘాలలో ఇప్పటికీ అనేకమందికి కులగజ్జి ఉంది, మరికొందరికి
డబ్బులున్న వారంటే మోజు- పేదవారంటే చిన్నచూపు! ఇలాంటి బేధాలు ఎంచేవారు ఈ మొదటి రకమైన యెరూషలేము కుమార్తెలు!
రెండవ వర్గము: 2:7 ప్రకారం ఇతర విశ్వాసులను కలతపరచి సంఘమునుండి చెదర
గొడతారు! ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని
మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటుంది షూలమ్మితి! వీరు దేవునితో
గడపరు- గడిపే వారిని హేళన చేస్తారు- కలవర
పెడతారు! వీరు ప్రార్ధన చేయరు- చేసేవారిని
వెక్కిరిస్తారు! వీరు పరిచర్య చేయరు చేసేవారికి పేర్లు పెడతారు!
ఈ రకమైన వారు! ముక్యంగా ఎవరైతే దేవునిలో ప్రార్ధనలో
ఎక్కువగా సాగుతారో వారినే విమర్శిస్తూ ఉంటారు వీరు! తాచెడ్డ కోతి
వనమంతా చెరిపినట్లు! కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లు
వీరు చెడగొడుతూ ఉంటారు! ఒకవేళ ప్రియ చదువరీ! ఈ గుంపులో నీఉంటే నీవు చాలా దుష్టత్వములో
ఉన్నావని దేవుని తీర్పుకు పాలవుతావని మరచిపోవద్దు!
మూడవది: 3:4,5 వచనాలు ప్రకారం-ఒక విశ్వాసి
దేవుణ్ణి తెలిసికొని ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే వారిని ఆటంకపరిచే వారు!
ఈ రక్షించబడిన వారికి దేవునితో ఎక్కువగా గడపాలని వాక్యపఠనంలో ప్రార్ధనలో
పరిచర్యలో సాగాలని పరుగులు పెడుతూ ఉంటే వీరు వారి విశ్వాసాన్ని చల్లార్చుతూ లోకము వైపుకు
నడిపించే వారు! వారు చెడిపోయారు- కొత్తగా రక్షించబడిన
వారిని సహితం చెరిపేస్తూ
వుంటారు!
నాలుగు:
3:9,10 వచనాలా ప్రకారం వీరు కూడా అప్పుడప్పుడు దేవుని పని చేస్తారు-
గాని పేరు కోసం ఘనత కోసం చేస్తారు గాని నిజానికి దేవుని మహిమార్ధమై చేయరు!
అక్కడ వారు సోలోమోను రాజు యొక్క మంచమును అలంకరించారు! గాని తర్వాత ప్రభుని ప్రేమించలేదు! కాబట్టి అననీయ సప్పీరాల
వలె గొప్పలు కావాలి వారికి! పేరు ప్రతిష్టలు కావాలి- సంఘ కమిటీలో విశిష్టమైన స్థానం కావాలి గాని వీరుగాని వీరి కుటుంబం గాని దేవునికి
దూరంగా ఉంటారు!
ఐదవది: 5:8—9 ప్రకారం-
షూలమ్మితి దేవునికి దూరమైంది- తన తప్పును తెలుసుకుని
మరలా ప్రభుని కలుసుకోవాలని అనుకుంటుంది.
అయితే ఇప్పుడు ప్రాణప్రియుడైన యేసయ్యను వెదుకుతా ఉంటే ఓస్ నీ
ప్రియుడేనా ప్రియుడు- మా ప్రియులు మాకు గొప్పకాదా అంటూ ప్రభువుని
ప్రేమించక చులకనగా మాట్లాడతారు! షూలమ్మితికి ఉన్న ప్రభుప్రేమ
వీరికి కొంచెమైనా లేదు! మేము భక్తి చేయడం లేదా? మేము ప్రార్ధన చేయడం లేదా? అస్తమాను కూటాలేనా అస్తమాను
ప్రార్ధనలేనా అంటూ మాట్లాడుతో ఉంటారు! వెళ్ళేవారిని నిరుత్సాహ
పరుస్తూ ఉంటారు ఈ యెరూషలేము కుమార్తెలు!!!
ఆరు: 5:16 ప్రకారం షూలమ్మితి ప్రభువుని పొగుడుతూ ఉంటే ఓహో అలాగా
అన్నారు గాని ఆ రాజుని ప్రియున్ని ఆరాధన చేసినవారు కాదు! అనగా
వీరు హృదయ పూర్వకంగా ప్రభువుని ఆరాధించే వారు కాదు గాని పెదాలతో దేవుణ్ణి స్తుతించే
వారు అని అర్ధమవుతుంది!
ఏడు:
8:4 ప్రకారం ఇక్కడ షూలమ్మితి తండ్రియొక్క ఒడిలో సేద దీరుతూ ఉంది అలాంటి
షూలమ్మితిని వీరు లేపుతూ కలత పెడుతున్నారు! అనగా ఎన్ని శ్రమలు
వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ప్రభువుకోసమే నిలబడే స్థిర విశ్వాసులను కలవర పెట్టేవారు-
అలాంటివారిని వారి అవిశ్వాస పూర్వకమైన సలహాలతో దేవుని మీద వారు పెట్టుకున్న
స్థిర విశ్వాసము నిరీక్షణ నుండి తొలగించడానికి ప్రయత్నం చేసేవారు ఈ చివరి రకమైన యెరూషలేము
కుమార్తెలు!
ప్రియమైన దేవుని బిడ్డా!
ఈ ఏడు గుంపులలో నీవున్నావేమో ఒకవేళ సరిచూసుకో! నీవు గాని ఈ గుంపులలో ఏ గుంపులో ఉన్నా నీవు దేవునికి దూరమైపోతున్నావని ఇంకా
దేవుని ఉగ్రతకు త్వరలో పాత్రుడుగా ఉండబోతున్నావని గ్రహించి సరిచేసుకుని దేవునికి ఇష్టమైన
వానిగా మారిపొమ్మని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*9వ భాగము*
*నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను*
పరమగీతము 1:5
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 5వ
వచనం చూసుకుంటే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు
తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! గతభాగమ్లో షూలమ్మితి నల్లగా మారిపోడానికి కారణం ఏమిటి? యెరూషలేము కుమార్తెలు
ఎవరో అనేది ధ్యానం చేసుకున్నాము!
ఇక
ఈ వచనాన్ని ధ్యానం చేసుకుందాము!
యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అంటుంది షూలమ్మితి!
నిజానికి జెరుసలం కుమార్తెలంటే అప్పట్లో
వ3లో కనిపించే “కన్యలు”,
వ 4లో మాట్లాడిన “చెలికత్తెలు”
కావచ్చు. ఇందులో మనమేమీ ఖచ్చితంగా చెప్పలేము.
“నలుపు”– ఆదికాండము 25:12-13, లో కేదారు ప్రసక్తి ఉంది. వారు గుడారాలను నల్ల మేకల బొచ్చుతో
నేసేవారు. విశ్వాసులు పాపాత్ములే గాని పవిత్రులు కూడా.
దేవుడు మనిషిని తన పోలికలో చేశాడు (ఆదికాండము
1:26, ). అందువల్ల ఆరంభంలో వారిలో ఆధ్యాత్మిక సౌందర్యం ఉంది.
అయితే తాము పాపంవల్ల చెడిపోయామనీ తమకిప్పుడున్న ఆధ్యాత్మిక సౌందర్యం
క్రీస్తుతో తమ సంగమం వల్లే అనీ విశ్వాసులకు తెలుసు. వారి సౌందర్యమంతా
దేవుడు ఉచితంగా ఇచ్చినదే (యెషయా 61:10, ; 1 దినవృత్తాంతములు 1:30, ; 2 దినవృత్తాంతములు
5:21, ; ఎఫెసీయులకు 4:22-24, ). ఇక్కడ వధువు అంటున్న
మాటల్లో కొద్దిగా ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తుందా? పరిపూర్ణమైన
ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది అని తరువాత ఆమెకు తెలిసివస్తుంది (1 యోహాను 4:18, ).
గతభాగంలో నిజానికి షూలమ్మితికి నల్లని రంగు ఎందుకు వచ్చింది
అనేది చూసుకున్నాము! ఇక సంఘానికి నల్లని రంగు ఎందుకు వచ్చింది అనేది సంఘకోణంలో
చూసుకుందాము! ఇంతకి నల్లనిదనము ఎందుకు వచ్చింది? పాపము మనిషిలో మురికిగా దేవునికి
కనిపిస్తుంది. అందుకే
ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒడు-తెల్లని
వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?
ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహా శ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో
తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.'' పాపములు మురికిగా చెప్పబడి అది ఉదుకుట
ద్వారా పోగొట్టుకొన్నట్లుగా చెప్పబడింది.
ఈ మురికిగా ఉన్న వ్యక్తి మనకు ఎలాగున కనిపిస్తాడు? నల్లగా మురికిగానే కదా! ప్రకటన 16:8, ''నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు
సూర్యునికి అధికారము ఇయ్యబడెను.'' ఇలా ఎవరిని కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడింది? భూమిపై ఉన్న మనుష్యులను. కనుక భూమిపై యుగాంతములో పాపులే తప్ప
పరిశుద్ధులు ఉండరు కదా! కనుక ఎండ వేడి తగిలి మనుష్యులు నల్లబడుతారు. అలాగే పాపములో ఉన్న నరులను నల్లనిదానిగా
చెప్పుట జరిగింది. ఇలా
ఏకసంఘముగా ఉండవలసిన యెరూషలేము పవిత్రులు అపవిత్రులుగా విడిపోయి, పవిత్రమైనవారిని యెరూషలేము కుమార్తెలుగాను, అపవిత్రమైనవారిని
నల్లనిదియైన బబులోనుగాను వర్ణించుట జరిగింది. యిర్మీయా గ్రంథములోను, యెహెజ్కేలు 16:48-49లో దేవుడు తన ప్రవచనాలలో బబులోను
యెరూషలేమునకు అక్కగా వర్ణించుట యెరూషలేమును చెల్లెలుగా వర్ణించుట ఇద్దరు పాపములో మ్రగ్గుచున్నట్లుగా
చెప్పుచు ఇద్దరిని శిక్షిస్తానని అనేక ప్రవచనాలలో చెప్పబడింది. కనుక రెండుగా విడిపోయినను నరులమైన
మనమే మన క్రియల వలన అలా కనబడుచున్నాము కనుక పరమగీతములతో అలా వర్ణించుట జరిగింది. కాబట్టి ఆత్మరీత్యా ఆ నల్లనిదనము
పాపముల వలన దేవుని నుండి దూరముగా జీవించుట వలన వచ్చిందేగాని శరీరరీత్యా ఆమె చూచుటకు
సౌందర్యవంతురాలే.
ఇక ఇశ్రాయేలు చరిత్ర ప్రకారం చూసుకుంటే యాకోబు సొగసైన వాడే గాని తన
మామగారి ఇంటికి వచ్చాక ధన సంపాదన కోసం ఆస్తి కోసం మందలు కాచి నల్లగా మారిపోయాడు. సొగసు
లేని వాడుగా మారిపోయాడు! యాకోబుగారు 20 సంవత్సరాలు తనకోసం తన భార్యలకోసం సేవచేస్తే మరో 20 సంవత్సరాలు
ఆస్తికోసం మందలు కాచాడు ఆదికాండం 31:38 నుండి 41 వరకు జాగ్రత్తగా
పరిశీలన చేస్తే 40 సంవత్సరాలు హారానులో ఉన్నట్లు చూడగలము!
అక్కడ అనేక బాధలు అనుభవించాడు- ఎండకు ఎండిపోయాడు
వర్షానికి తడిచాడు- అడవి జంతువుల మధ్య క్రూర జంతువుల మద్య నివాసం
చేశాడు! సరియైన తిండి తినలేదు ఆస్తి సంపాదనలో! సౌందర్య వంతుడే గాని ఎండకు నల్లబడ్డాడు! గాని చివరలో
దేవునిచేత ఆశీర్వదించ బడ్డాడు! గొప్ప ఆస్తి మందలతో పనివారితో
తిరిగివచ్చాడు యాకోబు! కాబట్టి అబ్రాహాము- ఇశ్రాయేలు జాతి కోణంలో ఆ నల్లనివాడు యాకోబు! ఆస్తి కోసం
నల్లగా మారిపోయాడు! నల్లగా మారిపోయాడు గాని దేవుని చేత ప్రేమించ
బడ్డాడు దేవునిచేత ఆశీర్వదించ బడ్డాడు! ప్రియ సహోదరి సహోదరుడా
ఒకవేళ నీవు ఈ రోజు కనాను యాత్రలో శ్రమల సంకెళ్లలో నల్లగా మారిపోయావా? భయపడ వద్దు! నీవు దేవునిచేత ప్రేమించబడుతున్న కారణముననే
నీకు శ్రమలు శోధనలు అని మరచిపోవద్దు! ఈ రోజు నల్లగా ఉన్నా సరే-
షూలమ్మితి నల్లగా ఉన్నా ప్రియుడైన సోలోమోను రాజు ప్రేమతో పెండ్లి చేసుకున్నట్లుగా
నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకరోజు నిన్ను వివాహం చేసుకోడానికి నల్లని దానివైనా
సరే- దేవుడు ఇష్టపడుతున్నాడు! యోసేపు కూడా
శ్రమలను అనుభవించాడు చివరికి ఐగుప్తు దేశానికే అధపతి అయ్యాడు! బాధలలోనే తన కుమారుడైన మనస్షే ను కానీ దేవుడు నాశ్రమలను జ్నాపకం చేసుకుని వాటిని
మరిచి పోయేటట్లు చేశాడు అన్నాడు! కాబట్టి విశ్వాసి శ్రమల జీవితమే
ఆ నల్లని రూపము! అయితే నీ జీవితం అలా ఉండాలి అంటే ఎక్కడైతే నిన్ను
నల్లనిది అని వెక్కిరించారో అక్కడే నీ అభివృద్ది చూసి దేవుణ్ణి మహిమపరిచేటంతగ మారిపోవాలి!
నీ మాట ప్రవర్తన అంతా మారిపోవాలి- నీవు ఆశీర్వాద
కారకంగా ఉండాలి-విజయవంతమైన జీవితం జీవించాలి- మనుష్యులను ప్రేమించాలి- క్రీస్తుకోసం ప్రజలను ఆకర్షించాలి!
ఇక కేదారువారి
గుడారములు వలె సొలొమోను నగరు తెరలువలె ఆమె అనగా బబులోను సౌందర్యవంతురాలనని చెప్పుచున్నది. ఇది ఈ లోకము చూచుటకు కనబడు వాటితో
పోల్చి అలంకార ప్రాయముగా చెప్పుట జరిగింది. గుడారములు చేయుటలో కేదారువారు ఆ దినములలో
ప్రసిద్ధిని పొంది యుండాలి, అలాగే సొలొమోను తన నగరమును నిర్మించినప్పుడు
అందులో తెరలు కట్టి ఆ నగరమును సుందరముగా చేసి ఉంటారు. ఆ రోజులలో
యెరూషలేము ఆలయము, సొలొమోను నిర్మించిన నగరము చాలా ప్రసిద్ధి చెందాయి. కనుక అలాంటి అద్భుతముగా కనిపించే
వాటితో పాపపు స్థితిలో ఉండి నల్లగా ఆత్మరీత్యా కనబడుచున్నను విడిపోయిన సంఘమైన బబులోను
సౌందర్యమును పోల్చుట జరిగింది.
దైవాశీస్సులు!!
*గీతాలకు
గీతము-పరమగీతము*
*10వ భాగము*
*నల్లనిదాననని
నన్ను చిన్న చూపులు చూడకుడి*
పరమగీతము 1:5,6
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 6వ
వచనం చూసుకుంటే నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! గతభాగములలో ఎందుకు నల్లగా మారిపోయింది ఎందుకు అన్నలు కోపగించారు అన్నది అక్షరార్ధముగా
చూసుకున్నాము! అయితే ఆత్మీయ కోణంలో అన్నలు అనే సహోదరులు ఎవరు
అనేది చూసుకుందాం!
ప్రకటన గ్రంధము ప్రకారం 6:9—11 ప్రకారం సహోదరులు యూదులు, సహదాసులు శ్రమల కాలంలో చంపబడబోయే విడువబడిన క్రైస్తవులు,
ఇక దానియేలు గ్రంధం ప్రకారం, ప్రకటన గ్రంధం ప్రకారం – సహదాసులు
అనగా దేవుని దూతలు!
మరి
ఈ వచనములో కనబడే సహోదరులు ఎవరు?
నాకు
రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి ప్రియులారా! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే!
మొదటిది: నీ ఎదుగుదల నీ అభివృద్ది ఓర్చుకోలేని
నీ తోటివారు, నీ బంధువులు, నీ ఇరుగుపొరుగు
వారు, చివరకు నీ ఎదుగుదల ఓర్చుకోలేని నీ సంఘసభ్యులు! అందుకే వారు నీకు శ్రమలు శోధనలు కలిగిస్తున్నారు!
రెండవది: నీ ఆత్మీయ యాత్రలో నీవు దారి తప్పేటప్పుడు
నిన్ను ఖండించి గద్ధించి బుద్ధిచెప్పే నీ సంఘ కాపరులు!!
సరే, ఇంకా ముందుకు వెళ్లేముందు
ఇక్కడ నేను నల్లనిదానినని నన్ను చిన్నచూపులు చూపకండి నేను ఎండతగిలిన దానను అని షూలమ్మితి
అంటుంది!
దీనిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని చూసి నీవు
నల్లనిదానివి గాని ప్రియుడు రాజు సోలోమోను వెనుక తిరుగుతున్నావు అని హేళన చేయడం మొదలుపెట్టారు! అప్పుడు ఆమె ఓ స్త్రీలారా
నేను మీకంటే అందమైన దాననే ఒకప్పుడు, ఇప్పుడు నా అన్నలు నామీద
కోపగించి నన్ను తోటకు కాపలాగా పెట్టి నన్ను ఎండలో పనిచేయమన్నారు అందుకే ఇలా నల్లగా
మాడిపోయాను అని చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే నీ విశ్వాసయాత్రలో
అనేకమంది నిన్ను చిన్నచూపు చూసినా నీవు బాధపడకు! గురివద్దకు పరుగెత్తు!
ప్రియుడు తప్పక నిన్ను వరిస్తాడు! అయితే గమనించవలసిన
విషయం ఏమిటంటే యెరుషలేము కుమార్తెలు హేళన చేసినా రాజు సోలోమోను ఏమంటున్నారు-
షూలమ్మితి నీవు అధిక సుందరివి అధిక సుందరివి! సెహబాస్!
మనుష్యులు త్రోసివేసినా యెహోవా నిన్ను త్రోసివేయక చేరదీసే దేవుడు!
ఇక నీవు నల్లనిదానివి అని హేళనచేసిన అదే యెరూషలేము కుమార్తెలే ఒకరోజు
స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటూ పొగిడారు!!! కాబట్టి విమోచించ
బడిన నీవు దేవునిమీద విశ్వాసంతో కనిపెడితే ఎక్కడైతే అవమానించ బడ్డావో అక్కడే రెట్టింపు
ఆశీర్వాదమునకు ఘనతకు అర్హుడవు అవుతావు!! ఆమెన్!
ఆపో 6:1
లో విధవరాండరమీద చిన్నచూపు చూశారు సంఘములో! విశ్వాసి
నీవు అలాంటి చిన్నచూపు చూడవద్దు వారి స్థాయిని బట్టి! నీకు కుల
బేధం, రంగు బేధం, అంతస్తు బేధం ఉండకూడదు!
క్రీస్తు రక్తములో కడుగబడి బాప్తిస్మము పొందిన మనమంతా సహోదరులము ఒక తండ్రి
బిడ్డలము అని మరచిపోవద్దు!!
ఇక ఎండతగిలిన దానను అనగా యోసేపు జీవితం యాకోబు జీవితం ప్రకారం- శ్రమలు పొందిన వాడను/దానను అని అర్ధం! పాతనిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు
దేవుని కోసం అనేక శ్రమలు సహించారు చివరకు మరణమై పోయారు! గాని
చివరకు గొప్ప ఘనత పొందారు! ఎప్పుడు దేవుని మీద నిందలు మోపలేదు!
కాబట్టి శ్రమలు పడుతున్న విశ్వాసులను చూసి హేళన చేయకూడదు తృణీక రించకూడదు!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*11వ భాగము*
*నా సొంత తోటను నేను కాయకపోతిని*
పరమగీతము 1:5,6
5.యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6.నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా
నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 6వ
వచనం చూసుకుంటే నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షూలమ్మితి అంటుంది.
ప్రియులారా!
ఇంకా అంటుంది షూలమ్మితి నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ఈ
మాటలు షూలమ్మితి అంటుంది.
షూలమ్మితి సోలోమోను వెనుక తిరుగుతుంది అని తెలుసుకుని అన్నలు కోపగించి
తమ ద్రాక్ష తోటకు కాపలాగా ఉంచితే ఆమె రాజుగారి తోటను కాయడానికి వెళ్తుంది!
అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని తన బాధను ఇందులో నల్లనిదైన
షూలమ్మితి అనే శ్రమల పాలైన సంఘము చెప్పుట చదువగలము. పాతనిబంధనలో అబ్రాహాము కుమారుడైన
యాకోబును మరల ఎన్నుకొని ఇశ్రాయేలీయులను తన రాజ్యముగా యాజకులుగా ఎన్నుకొన్నాడు.. అప్పుడు తమ స్వంత తోటను కావలి కాస్తుంటే
దానిలో ఉండి తమ స్వంత తోటలను కాయవలసిన నల్లని కుమార్తెలు యెరూషలేమునకు బయట అన్యజాతులుగా
అక్కడ తోటలను కాస్తున్నారు. ఈనాడు క్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘమును యెరూషలేము సంఘముగా ఏర్పరిస్తే క్రైస్తవులు
అను విశ్వాసులు రాజులైన యాజకులుగా చర్చీలను కావలి కాస్తూ దానిలోని ద్రాక్షావల్లియైన
క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ తమ స్వంత తోటను అనుభవిస్తున్నారు. యోహాను 15:1, ''నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.'' నిజమైన ద్రాక్షావల్లిగా క్రీస్తు
ప్రభువు దానిని నాటిన వ్యవసాయకునిగా తండ్రియైన దేవుడు ఉన్న సంఘమే నేటి క్రైస్తవ సంఘము. ఈ సంఘములో అంటుగట్టబడి జీవించమని
మనకు దేవుడు చెప్పుచున్నారు. యోహాను 15:5, ''ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును;
నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.'' ఇందులో చెప్పబడిన విధముగా మనము క్రైస్తవ
సంఘమును కాపు కాస్తూ అందులో అంటుగట్టబడి జీవిస్తే మనము నిజ క్రైస్తవులుగాను రాజులైన
యాజకసమూహముగా ఎన్నిక చేయబడుదుము. కాని అనేకులు విగ్రహారాధనలో అన్య దేవతలు దేవుళ్లను పూజిస్తూ నిజదైవమునకు దూరముగా
ఉంటూ పాపములో మ్రగ్గి నల్లనైన బబులోనుగా ఉంటూ కారు ద్రాక్షలైన అన్యదేవతలను కావలి కాస్తూ
ఉన్నారుగాని తమ స్వంత ద్రాక్ష తోటను కావలి కాయలేకపోవుచున్నారు.
ఇక మరో అర్ధము కూడా చెప్పనీయండి! నేటి రోజులలో ఈ వాక్యము
అనేకమంది దైవజనులను సూచిస్తుంది! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘానికి నిన్ను కాపలాగా పెడితే కొన్నిసార్లు నీ సంఘమును కాయకుండా ఇతరుల సంఘాలను
బలపరుస్తున్నారు కొంతమంది దైవసేవకులు! ముఖ్యంగా మొదటగా మంచి వాక్చాతుర్యము
ఇచ్చి విరివిగా వాడబడే దైవసేవకులు! తమ స్వంత సంఘాలకు కొంత సమయమే
ఇస్తున్నారు గాని ఇతర సంఘాలకు వెళ్ళి బలపరుస్తున్నారు! వీరుకూడ
అనేకసార్లు ఇలాగే బాధ పడుతున్నారు! గాని నేనంటాను – దేవుడు
నీకు అప్పగించిన బాధ్యతను వదలకుండా దానిని కూడా చేయాలి గాని- నీ సంఘాన్ని అశ్రద్ద చేసి కొంతమంది- కానుకలను ఆశించి
కొంతమంది- మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి అని పిలుస్తుంటే మొగమాటంతో
తమ సంఘాలను వదిలి ఇతర సంఘాలలో ప్రకటిస్తున్నారు- ఏమో నాకు తెలియదు
గాని నేను అనుకుంటాను నీ సంఘాన్ని కాయవలసిన బాధ్యత నీది- దానిని
మరొకరికి దేవుడు అప్పగించ మంటేనే నీవు అప్పగించాలి గాని దేవుణ్ణి ఆడగకుండా ఆదివారం
కూడా మరో సంఘములో బోధించడం మంచిది కాదు అని నా ఉద్దేశం! నీ సంఘ
సభ్యులు వారి గృహ కూటములకు ఫంక్షన్ లకు మంచివాటికి చెడ్డవాటికి నీవు రావాలని ఆశ పడతారు-
కాబట్టి వారి ఆశను భంగం చేయడం మంచిది కాదు అని నా ఉద్దేశం!
ఇక మరో గుంపు- పాస్టర్ ఫెలోషిప్ లో ఉంటున్న అనేకమైన కాపరులు!
వీరు – ఫెలోషిప్ వారు పిలుస్తున్నారు అని
వీరి సంఘములో జరిగే పెళ్లి మరియు కధా కార్యక్రమములకు ఇతర సేవకులను పిలుస్తున్నారు.
వారు ఇక్కడికి వీరు అక్కడికి వెళ్తున్నారు. మంచిదే-
గాని కొన్ని సమయాలలో మీ సంఘములో జరిగే కార్యక్రములకు హాజరు అవ్వడం కష్టమవుతుంది
కొంతమంది దైవసేవకులకు! సంఘము లేక సంఘములు పరిచర్య లేని కాపరులకు
ఇబ్బంది లేదు గాని ఒక సంఘము కంటే ఎక్కువ సంఘాలు – మంచి పరిచర్య
ఉన్న సంఘ కాపరులకు ఇది కష్టమవుతుంది- అపుడు వారు తమ స్వంత సంఘాలను
చూడకుండా/ కాయకుండా ఇతర సంఘాలను కాస్తున్నారు! ఇది మంచిది కాదు అని నా ఉద్దేశం! కాబట్టి దేవుడు నీకు అప్పగించిన సంఘమును అశ్రద్ద చేయకుండా ఇతర సంఘాలకు
వెళ్ళడం తప్పులేదు గాని నీ సంఘాన్ని పట్టించు కోకుండా పేరు కోసమో, డబ్బు కోసమో, మొగమాటం కోసమో వెళ్ళడం తప్పు అని నా ఉద్దేశం!
ఇక చివరిగా
షూలమ్మితిని అన్నలు తమ తోటను కాపలా కాయమంటే షూలమ్మితి రాజుగారి తోటను కాచినది అనగా
దేవుని పరిచర్య అంటే సంఘము అంటే షూలమ్మితికి చాలా ఇష్టం! కాబట్టి
విశ్వాసులు కాపరులు రక్షించబడిన వారు ఎవరైనా రాజుగారి తోటలో పరిచర్య తప్పకుండా చేయాలి-
దానికి నీ సమయాన్ని కేటాయించాలి! సేవా పరిచర్యలలో
ముందుకు పరుగెత్తాలి! మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి!
సారెపతు విధవరాలి వలె మొదట రొట్టె దేవునికి ఇవ్వాలి తద్వారా కరువులోనూ
కూడా ఆశీర్వదించ బడి కరువునుండి తప్పించుకుంది! నీకు ఎన్ని ఇబ్బందులు
శ్రమలు శోధనలు ఉన్నా గాని దేవుని పనికోసం విసుకక పరుగెత్తాలి అప్పుడే నీకు దేవుని దీవెనలు
మెండుగా నిండుగా క్రుమ్మరించ బడతాయి! ప్రియ చదువరీ! మరి నీవు రాజుగారి తోటలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నావా? చిన్న కుమారుని వలె వెళ్తాను అని చెపి వెళ్ళకుండా ఉంటావా? లేక పెద్ద కుమారుని వలె మనసు మార్చుకుని ప్రభువు తోటలో పనిచేస్తావా?
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*12వ భాగము*
*నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట
మేపుదువో*
పరమగీతము 1:7
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో
మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల
మందలయొద్ద నేనెందుకుండవలెను?
ప్రియులారా! ఇక 7వ వచనం చూసుకుంటే నా ప్రాణ ప్రియుడా
అని పిలుస్తుంది షూలమ్మితి సోలోమోను రాజును! విశ్వాసులు ఎప్పుడూ
క్రీస్తు సాన్నిహిత్యాన్నీ ప్రేమనూ అనుభవించాలని కోరుతారు. ఆయన
వారినెన్నడూ విడిచిపెట్టడు (హెబ్రీయులకు 13:5, ధనాపేక్షలేనివారై
మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ; యోహాను 14:16-18, ; మత్తయి 28:20, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో
వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి
వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను). అయితే
ఆయన సాన్నిహిత్యం, ప్రేమల గురించి వారి అనుభవానికి ఆటూ పోటులున్నట్టు
కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే వారి అనుభవంలో క్రీస్తు పూర్తిగా
వారిని వదిలివెళ్ళిపోయినట్టుంటుంది. మన స్వంత తోటను కాపాడుకోకపోతే
ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువౌతాయి. ఇలాంటిది సంభవించినప్పుడు
ఆయన్ను హృదయపూర్వకంగా వెతకాలి (హోషేయ
10:12, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి,
యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము
కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి. ; యిర్మియా 29:13, మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు
).
ఇక ఈ గ్రంధములో షూలమ్మితి ప్రియుడా అని
34 సార్లు పిలిచినట్లు చూడగలము! ఎందుకు అన్ని సార్లు
పిలిచింది అంటే షూలమ్మితికి సోలోమోను కంటే తన ప్రాణమునకు ఇష్టుడు గాని ఘనుడు గాని ఎవరూ
లేరు! ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది షూలమ్మితి సోలోమోనుని!
అలాగే సంఘము కూడా ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారిని ప్రాణము కంటే ఎక్కువగా
ప్రేమించవలసిన అవసరం ఉంది. ఎఫెసీ 1:6—7 ప్రకారము
6 మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది
వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి
ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు
క్షమాపణ మనకు కలిగియున్నది.
ఇంతటి ప్రేమ దేవుడు మనయెడల చూపించారు
కాబట్టి మనము కూడా అదే ప్రేమను చూపించవలసిన అవసరం ఉంది!
లోకంలో ఉన్న అందరికంటే ఎక్కువగా క్రీస్తు యేసును నీవు ప్రేమించాలి
సరే, ఈ 7 వ వచనంలో ఒక కాపరి కనిపిస్తున్నాడు! ఆ కాపరిని ఈ షూలమ్మితి
అడుగుతుంది నా ప్రాణ ప్రియుడా నీ మందలను నీవు ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు-
నేను అక్కడికి వస్తాను అంటుంది. గమనించాలి గతంలో
చెప్పడం జరిగినది- సోలోమోను రాజు షూలమ్మితి కోసం కొన్నిరోజు గొల్లపిల్ల
వానివలె నటించి షూలమ్మితికి దగ్గరౌతాడు!
సరే, ఇక్కడ ఆ గొర్రెల కాపరి
ఎవరో కాదు! యేసుక్రీస్తుప్రభులవారే! యోహాను 10 వ అధ్యాయములో ఆయన అంటున్నారు
14 నేను గొఱ్ఱల మంచి కాపరిని.
మొదటనుంది
చూసుకుంటే
2 ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.
3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి
పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
4 మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల
వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి
అతనిని వెంబ డించును.
5 అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును
వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
8 గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.
9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన
లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు
బయటికి వచ్చుచు మేత మేయుచునుండును
ఇంకా
అంటున్నారు 11 నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
అలాగే
చెప్పిన విధంగా గొర్రెలమైన మనకోసం ఆయన తన ప్రాణము పెట్టారు!
అయితే
మిగతా కాపరులు కోసం మత్తయి
10:16 లో అంటున్నారు 16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె
వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
ఇంకా
కీర్తనల గ్రంధంలో 74 లో 1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద
నీ కోపము పొగరాజు చున్నదేమి? ఇక్కడ దేవుడు తన గొర్రెలను మేపుచున్నాడు
73: 13 అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱలమునైన మేము
సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను
మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
అందుకే
23 వ కీర్తనలో ఈ విషయం గ్రహించి దావీదు గారు అంటున్నారు యెహోవా నా కాపరి
నాకు లేమి కలుగదు అంటున్నారు! అయితే ఇట్టి గొర్రెలమైన మనము భళా
నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే విధంగా ఉండాలి గాని సోమరివైన చెడ్డదాసుడా అని
పిలిపించుకో కూడదు! అంతేకాకుండా మత్తయి 25 లో చెప్పబడిన కుడివైపున నిలువబడే గొర్రెల వలె ఉండాలి గాని ఎడమవైపున నిలబడ్డ
మేకలవలే ఉండకూడదు అని గ్రహించాలి! ఫలితం- గొర్రెలు దేవుడు చేసిన పరలోకమునకు వెళ్లారు- మేకలు అపవాదికి
వాడి దూతలకు సిద్దపరచిన నరకానికి పోయారు! మరి ఇప్పుడు నీవు ఎక్కడికి
పోవాలో నీవే నిశ్చయం చేసుకో!! ఆ పరమ కాపరి ఎక్కడ తన మందను కాస్తున్నారో
ఆ మందనే వెంబడించు గాని బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారు అని, పిట్టకధలు
సైన్సు చెబుతున్నారు అని, అంతా ac చర్చే
అని గాని, శ్రావ్యమైన సంగీతం జిగేల్ జిగేల్ మనే లైట్లు ఉన్నాయని
మోసపోయి వెళ్ళావా? నరకానికి పోతావు అని గ్రహించు! అవును నీ కాపరి కాబట్టి సరియైన దారిలో వెళ్లకపోతే సరిగా తినకపోతే నడ్డిమీద
కర్రతో ఒకటిస్తాడు ఎందుకంటే నీవంటే నీకాపరికి ఇష్టం- నీవు పాడై
పోకూడదు! అందుకే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యం చెబుతున్నాడు-
మరొకడు నీకు మసిపూసి నిన్ను పొగడుతూ నీవలన లాభం సంపాదించుకుంటూ నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడు!
ఏది కావాలో తేల్చుకో!!
దైవాశీస్సులు!!!
గీతాలకు గీతము-పరమగీతము
13వ భాగము
నారీమణీ, సుందరీ
పరమగీతము 1: 8 నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ
మేకపిల్లలను మేపుము.
ప్రియులారా! ఇక 8వ వచనం చూసుకుంటే ఈ గ్రంధంలో సోలోమోను రాజు
మొదటగా జవాబు ఇస్తున్నాడు షూలమ్మితి అడిగిన ప్రశ్నకు జవాబుగా! షూలమ్మితి అడిగినది:
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున
నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల
మందలయొద్ద నేనెందుకుండవలెను?
దానికి
జవాబుగా నారీమణీ అని పిలుస్తూ అది నీకు తెలియదా! నా మందల అడుగుజాడలను వెంబడించు, నా మందకాపరులు
వేసుకున్న గుడారాల వద్ద నీ మేకపిల్లలను మేపు అని జవాబు చెబుతున్నాడు సోలోమోను!
దీని ఆత్మీయ అర్ధం సూటిగా: మనం
జాగ్రత్తగా వెతికితే క్రీస్తు తన మందగా ఉన్న విశ్వాసులను ఎక్కడికి తీసుకు వెళ్ళాడో
కనిపిస్తుంది. అప్పుడు ఆ పవిత్రుల అడుగు జాడల్లో మనమూ వెళ్ళవచ్చు. క్రీస్తు
నియమించిన సంఘ కాపరుల సహవాసంలోనూ, ఆయన మందను మేపడం ద్వారానూ ఆయన్ను మనం తిరిగి
కలుసుకుంటాం (యోహాను 21:15-17, ; యోహాను 14:21, ). ఇక్కడ వధువును “అతిలోక సౌందర్యవతీ” అని అభివర్ణించడం గమనించండి (పరమగీతము 1:15, ; పరమగీతము
2:14, ; పరమగీతము 4:1, , పరమగీతము 4:7,
; పరమగీతము 6:4, ; పరమగీతము 7:1, , పరమగీతము 7:6, ; కీర్తనల గ్రంథము 45:11, కూడా చూడండి).
లోకమంతటిలోనూ
క్రీస్తు దృష్టిలో ఆయన సంఘమే అత్యంత సౌందర్యవంతమైనది. ఆయన దానిని ప్రేమ దృక్కులతో
చూస్తాడు. ఇకముందు తన కృప మూలంగా ఆమె ఏమి కానున్నదో చూస్తాడు (ఎఫెసీయులకు 5:26-27, ). దేవుడు ఆమెకిచ్చిన అందాన్ని చూస్తాడు. విశ్వాసులు క్రీస్తులోనివారే. ఆయనతో
ఐక్యమై ఉండడంవల్ల ఆయనకున్నదంతా వారిదే.
గత వచనంలో షూలమ్మితి సోలోమోనును నా ప్రాణ ప్రియుడా అని పిలిస్తే
ఇక్కడ ప్రియుడైన సోలోమోను నారీమణీ అంటూ నా సుందరి అంటు పిలుస్తున్నారు!
సరే, ఒకసారి నారీమణి కోసం ఆలోచిస్తే- ఆదికాండం 2 వ అధ్యాయం ప్రకారం నరుని నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును అని
స్త్రీ కోసం చెప్పబడింది. అయితే ఇలా ఏర్పడిన నారీలలో అందరికంటే మణిగా, మణి భూషణముగా అందరికంటే సుగుణాల సంపన్నగా ఉండేదో నారీమణి! ఆత్మీయ కోణంలో
చూసుకుంటే సంఘములో లోకములో అందరికంటే పాపములేనిదిగా మచ్చలేనిదిగా కళంకము లేనిదిగా
ఉన్నప్పుడే ఆ సంఘములో ఆ వ్యక్తి నారీమణిగా చెలామణి అవుతుంది. అనగా మచ్చలేని
పవిత్రమైన జీవితం జీవించడమే నారీమణిగా ఉండటం! ఇది సంఘము కోసం
యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాట అని గ్రహించాలి!
షూలమ్మితి తన ప్రాణము
కంటే ఎక్కువగా సోలోమోనును ప్రేమించింది! అలాగే సోలోమోను తన ప్రాణముకంటే ఎక్కువగా
షూలమ్మితిని ప్రేమిస్తున్నారు! అలాగే యేసుక్రీస్తుప్రభులవారు సంఘాన్ని ఎంతగానో
ప్రేమించారు
యోహాను 3:16
దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు
ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
ఇంతగా
ప్రేమించారు దేవుడు!
అయితే
ఇంకా లోతుగా ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5 లో
అంటున్నారు పౌలుగారు
25 పురుషులారా, మీరును మీ
భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26 అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట
దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత
దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను
అప్పగించుకొనెను.
ఇంతగా
ప్రేమించారు యేసయ్య!
ఇదే
క్రమము దేవుడు మనకు చూపించారు! యోహాను 13:15 లో యేసుక్రీస్తుప్రభులవారు శిష్యుల
పాదాలను కడిగి వారితో అన్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను- మీరు సంఘాన్ని
ప్రేమించి నేను తగ్గించుకున్నట్లు మీరు తగ్గించుకుని సంఘాన్ని ప్రేమించమని
చెప్పారు! ఈ మాదిరి జీవితం మనం అలవర్చుకోవాలి!
1 తిమోతి 4:11,12 లో తిమోతికి
లేఖ రాస్తూ తిమొతి నీవు మాటలోనూ ప్రవర్తన లోనూ ప్రేమలోనూ విశ్వాసులకు మాదిరిగా
ఉంటూ ప్రేమగా నడుచుకో అన్నారు!
తీతు
2 వ
అధ్యాయములో సత్క్రియలు చేయడంలో మాదిరిగా నడుచుకో అంటున్నారు!
ఇక
మందకాపరుల అడుగు జాడలలో నడచుకో అంటున్నారు! ఫిలిప్పీ 3:17 లో అంటున్నారు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటూ
మేము మీకు మాదిరియై ఉన్న ప్రకారము అలా నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి
అంటున్నారు
2 థెస్స 3:9 లో మీము మమ్మును
పోలి నడుచుకోవాలని మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరుచుకున్నాము అంటున్నారు
ఇక యాకోబు గారు అంటున్నారు 5:10 లో
నా సహోదరులారా ప్రభువు నాముమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును
మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నారు!
కాబట్టి
1 పేతురు 2:21 ప్రకారం క్రీస్తు అడుగుజాడలయందు
నడుచుకొనేలాగా మీకు మాదిరిగా ఉంచిపోయేను అన్నట్లుగా మొదట క్రీస్తును పోలి ఆయన
అడుగుజాడలలో నడుచుకోవాలి!
రెండవదిగా
ఏలీషా గారు ఏలీయాను అనుసరించి నడిచి రెండింతల ఆత్మను పొందుకున్నట్లుగా మనము కూడా ఆ
భక్తుల అడుగుజాడల లోనూ,
మన సంఘ కాపరుల అడుగుజాడలను అనుసరిస్తూ నడుచుకుంటూ గురివద్దకు
పరుగెత్తాలి!
మరి
నీవు సిద్దమా ?
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*14వ భాగము*
*ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను*
పరమగీతము 1: 9 నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
ప్రియులారా! ఇక 9వ
వచనం చూసుకుంటే నా ప్రియురాలా, ఫరోయొక్క
రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటున్నారు!
గతంలో
ఈజిప్ట్ గుర్రాలు చూపులకు ఇంపుగాను, మంచి శిక్షణ గలిగిన ఉత్తమాశ్వాలుగానూ ఉన్నాయి.
వాటిని ఇతర దేశాలవాళ్ళు కొనుక్కొన్నారు (1 రాజులు
10:28-29, ). ఈజిప్ట్ రాజు ఉపయోగించేవి శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన గుర్రాలు.
వాటికి ఎక్కువ అలంకరణ, అందం ఉండేవి.
అలా సంబోధిస్తూనే
ఫరోయొక్క రథాశ్వములతో ఆమెను పోల్చెదను అని చెప్పుచున్నారు. ఐగుప్తు దేశపు రాజును ఫరోగా పిలుస్తారు. రాజు వద్ద అవి బలిష్ఠమైన దృఢమైనవిగా
ఉంటాయి. సాధారణ అశ్వములకు రాజు వద్ద ఉండు అశ్వములకు చాలా తేడా
ఉంటుంది. ఇలాంటి బలమైన
దృఢమైన అశ్వములతో వీరిని పోల్చుచున్నాడు.
అలాగే ఆభరణ హారములతో అలంకరించబడిన స్త్రీ బహుసుందరముగా కనిపిస్తుంది. ఏమి కొదువ లేనివారుగా కనిపిస్తారు. అలా కనిపించినను వారు ఇంకా రాజులైన
యాజకులుగా మారలేదు గనుక వారిని ఫరో రాజు అశ్వములతో పోల్చుట జరిగిందిగాని దావీదు లేక
సొలొమోను వంటి దైవప్రజల రాజుల అశ్వములతో పోల్చలేదు. అంతమాత్రాన వారు తక్కువవారేమి కాదు.
పాపములో ఉన్నారు. మారుమనస్సు కలిగి తిరిగి క్రీస్తు
ప్రభువు వద్దకు వస్తున్నారు. ఇలాంటివారి విషయములో క్రీస్తు ప్రభువు
బహుగా ఆనందించునని గ్రహించాలి.
నేను చదివిన చరిత్ర ప్రకారం ఫారో యొక్క రధమునకు ఉన్న గుర్రాలు చాలా
వడిగా పరుగెత్తుతాయి- ఎందుకు పరుగెత్తుతాయి అంటే- ఫారో
యొక్క రధములకు ఉండే గుర్రాలు రెండూ మగవి కావట! ఒకటి మగది రెండవది
ఆడది! ఈ ఆడ గుర్రము ఎంతో అందంగా ఉంటుంది. తనతోపాటుగా తన జత స్త్రీ గుర్రము వచ్చింది అని ఆ మగ గుర్రము ఎంతో ఉత్సాహముగా
పరుగెత్తుతుంది. ఇక ఆ ఆడ గుర్రానికి ఎన్నెన్నో అలంకారాలు పెడతారు!
ఇదీ ఫారో యొక్క రధము యొక్క గుర్రాల సంగతి!
అదే సమయంలో మర్చిపోకూడానిది ఏమిటంటే ఒక గుర్రమే బలమైనది మరో గుర్రం బలహీనమైనది! కాబట్టి ఎంతో జాగ్రత్తగా
ఉండాలి సంఘము!
సంఘములో కొంతమంది విశ్వాసం లో బలవంతులు మరికొందరు విశ్వాసం లో బలహీనులు ఉంటారు. ఇలాంటి బలహీనులను బలవంతులు
కలుపుకుని వారిని ప్రోత్సాహపరుస్తూ తమతోపాటు తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది!
అందుకే సోలోమోను గారు షూలమ్మితి ని ఫారో యొక్క రధము యొక్క గుర్రముతో
పోల్చడం జరిగింది!
అయితే బైబిల్ చెబుతుంది ఈ రధముల మీద ఆశ పడవద్దని రాజులతో చెప్పడం జరిగింది. ఇదే ఫారో రధములు గర్వించి
నప్పుడు ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు చూడగలము!!
ఇక గుర్రముల కోసం చూసుకుంటే లేవీ 11:1—8 ప్రకారం
గుర్రములు అపవిత్రమైన జంతువులు! కాబట్టి మనలో అపవిత్రత కనబడకూడదు!
కీర్తనలు 20:7 ప్రకారం గుర్రాలు అతిశయం గలవి! మనలో కూడా అతిశయం ఉండకూడదు!
కీర్తనలు 33:17 ప్రకారం గుర్రాలకు విశేష బలం ఉంది, వాటిని చూసి అతిశయ పడకూడదు మనము! అలాగే నీలో ఉన్న తలాంతులు
వరాలు ఫలాలు చూసి అతిశయ పడ్డావా? నాశనమే నీకు అని మరచిపోవద్దు!
యిర్మీయా
8:6 ప్రకారం గుర్రాలకు రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది చెడుగును చూసి పశ్చాత్తాప పడదు, రెండు తనకిష్టమైన
మార్గాన అది ప్రయాణం చేస్తుంది. ఈ రెండు విశ్వాసిలో ఉండకూడదు!
చెడుగును అసహ్యించుకుని దూరంగా ఉండాలి విశ్వాసి! ఇంకా నీకిష్టమైన మార్గములో కాకుండా దేవుని మార్గాలలో వాక్యపు వెలుగులో జీవిస్తేనే
పరలోకం!
అట్టివిధముగా
పాపమునకు దూరంగా, విశ్వాసహీనులను బలపరుస్తూ క్రీస్తులో ముందుకు సాగుదాం!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*15వ భాగము*
*ఆభరణములచేత నీ చెక్కిళ్లును*
పరమగీతము 1: 10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును
హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
11 వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
ప్రియులారా! ఇక 10వ
వచనం చూసుకుంటే ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును
శోభిల్లుచున్నవి అని సోలోమోను షూలమ్మితితో అంటున్నారు!
చెక్కిళ్లు అనగా అనగా బుగ్గలు అంటే బుగ్గల వరకు ఉండే ఏదో ఆభరణం షూలమ్మితి వేసుకుని
ఉంటుంది. ఇక కంఠములో ఏదో మంచి హారము వేసుకుని ఉంది అని అర్ధమవుతుంది. దానివలన నీ అందము ఎంతో శోభిల్లుచున్నది అని అంటున్నాడు సోలోమోను!
దీనికోసం ధ్యానం చేసేముందు – మీరు అనవచ్చు
అక్కడ షూలమ్మితి ఆభరణములు వేసుకున్నట్లు కనిపిస్తుంది కదా- మీరు
ఎందుకు ఆభరణములు వేసుకోవద్దు అంటున్నారు అని నన్ను అడగవచ్చు! తిమోతి పత్రిక ప్రకారం, పేతురు పత్రిక ప్రకారం వెండి
బంగారంతో చేయబడిన ఆభరణాలు మీకు అలంకారాలుగా ఉండక సాధువైనట్టి మృధువైనట్టి గుణమునే అక్షయ
అలంకారముగా చేసుకోండి అంటున్నారు- కాబట్టి ఈ ఆభరణముల వైపు చూడకుండా
అక్షయ అలంకారాలు అయిన ఈ మంచి గుణములు దేవుని వరములు ఫలములతో అలంకరించుకోవడమే ఉండాలి
తప్ప వెండి బంగారు ఆభరణముల మీద మన ఆశ చూపు ఉండకూడదు అని మనవి చేస్తున్నాను!
ఇక ఆ హారములు మరియు ఆభరణములు మరొక ఆత్మీయ అర్ధముతో మాట్లాడటం చేస్తున్నారు
తప్ప అక్షరార్ధమైన హారములు ఆభరణములు కాదు అని మనవిచేస్తున్నాను. ఇక్కడే కాదు ఈ గ్రంధములో కనిపించే ప్రతీ ఆభరణము ఒక ప్రత్యేకమైన గుణమును ఆధ్యాత్మిక
అర్ధమును సూచిస్తుంది అని చదువరులు గ్రహించమని మనవిచేస్తున్నాను!
ప్రియులారా నిజానికి ఈ వచనం ఇశ్రాయేలు
ప్రజల కోణంలో చూసుకుంటే ఐగుప్తు బానిసత్వము నుండి విడుదలను సూచిస్తుంది ఈ 9—11 వచనాలు!
9 నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో
నిన్ను పోల్చెదను.
10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును
శోభిల్లుచున్నవి.
11 వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
ఈ
మాటలు ప్రియుడైన సోలోమోను ప్రియురాలు షూలమ్మితి తో పలికిన మాటలు! ఇశ్రాయేలు జాతికి దేవుడు
మీరు ఐగుప్తు బానిసత్వము విడుదల కలిగి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకుండా వారి వెండి
బంగారు నగలు అడిగి తీసుకుని వారిని దోచుకోండి అని సెలవిచ్చారు నిర్గమ 11:1—2; 12:35;
ఎందుకు వారిని దోచుకున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలచేత ఐగుప్తు వారు జీతం ఇవ్వకుండా
కఠినమైన దాస్యము చేయించుకున్నారు గనుక ఆ జీతముగా దేవుడే ఆ ఆభరణములు అడిగి తీసుకుని
వారిని దోచుకోమన్నారు! ఐగుప్తు ప్రజలకు అనుమానం రాకుండా ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని
వేసుకున్నారు, బయటకు వచ్చేశారు అంతే! ఇక
వారు విగ్రహ సంబంధమైన పూజలకు ప్రతిగా ఉండే ఆ వెండి బంగారు నగలు వేసుకోకూడదు!
ఇలా అడిగి తీసుకుని వేసుకున్న సందర్భమే ఆ ఆభరణముల చేత నీ చెక్కిళ్లు
మరియు నీ కంఠము శోభిల్లుతుంది అన్నారు!
ఇక అలా ఆభరణములు వేసుకున్న ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు వదిలి వచ్చాక
ఎర్ర సముద్రము దాటి ఇంకా సీనాయి అరణ్యము వచ్చాక కూడా వాటిని తీసివేయకుండా ఆభరణములు
పెట్టుకుని సింగారించుకుని ఆ ఆభరణములకు సాదృశ్యముగా ఉన్న ఐగుప్తు దేవతలు పూజలను చేస్తూ
దూడను చేసుకుని వ్యభిచరించిన తర్వాత అదే దేవుడు అనగా వారిని దోచుకోడానికి ఆభరణములు
తీసుకుని రమ్మని చెప్పిన దేవుడే ఉగ్రుడై నిర్గమ 33:5—6 వచనాలలో అంటున్నారు:
మీరు లోబడనోళ్లని పిల్లలు నేను మీ మధ్యకు వస్తానా మిమ్మల్ని నాశనం చేసేస్తాను- ఆ నాశనం
నుండి తప్పించుకోవాలి అంటే మీమీద నున్న ఆభరణములు తీసివేయండి అని చెబితే ఆరవ వచనంలో
ఆ నగలు తీసివేశారు!
నిర్గమకాండము 33:5
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని
ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు
మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
నిర్గమకాండము 33:6
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
మరి ఇంతకు ఆ నగలు దేనిని సాదృశ్యంగా చెబుతున్నాయి అంటే కంఠము చుట్టూ
అందమైన నగలు అనగా దేవుణ్ణి దేవుని గుణగణాలు ప్రజలందరికీ చెప్పే మీ కంఠము మరియు మీ సుగుణాలే
ఆ కంఠహారము అని గ్రహించాలి!
నీవు ఎప్పుడైతే ఈ సుగుణాలతో ఉంటావో 11 వ వచనములో
వెండి పువ్వులు ఉండే బంగారు సరములు మేము నీకు చేయిస్తాము అంటే బంగారు సరములు అనగా బంగారు
ఛైను, అనగా బంగారు హారమ్లు వాటిమీద వెండి పువ్వులు వచ్చేవిధంగా
చేసేవారు పూర్వకాలంలో! అనగా ఒకరకమైన బంగారు హారాలు కాసుల పేర్లు
బంగారు పూసల దండలు కావచ్చు! ఇవన్నీ సోలోమోను గారు మరియు అతని
పరివారము ఎప్పుడైతే నీవు ఇలాంటి సుగుణాలతో ఉంటావు అవన్నీ నీకు వేస్తాము అంటున్నారు!
అనగా నీవు ఇలాంటి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గుణగణాలు ప్రాచుర్యము చేసే
నీ గుణమునకు మెచ్చి దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో అభిషేకముతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నారు
అని అర్ధము ప్రియులారా!
మరి
ప్రియ దేవుని బిడ్డా! షూలమ్మితి కి దేవుని గుణగణాలు ప్రకటించే నోరు మరియు సుగుణము ఉందా? మరి నీకు అటువంటి సుగణములు ఉన్నాయా? లేకపోతే నేడే సంపాదించుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*16వ భాగము*
*రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను*
పరమగీతము 1: 12 రాజు విందుకు కూర్చుండియుండగా
నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.
ప్రియులారా! ఇక 12వ
వచనం చూసుకుంటే 12 రాజు విందుకు కూర్చుండియుండగా
నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను అని షూలమ్మితి అంటుంది!
రాజు విందులో కూర్చున్నప్పుడు
ప్రియురాలి పరిమళ సువాసన అక్కడ వ్యాపించె నని చెప్పబడింది. రాజు విందుకు ఎప్పుడు కూర్చుండును? ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన
యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.'' ఇందులో క్రీస్తు ప్రభువు హృదయమనే
తలుపు వద్ద ఆయన నిలుచుండి నిరంతరము తట్టుచున్నారు. నల్లగా అపరిశుద్ధులుగా ఉన్నను వారిలో
కొందరు ఆ స్వరమును విని తలుపు తెరిచి వారి హృదయములోనికి క్రీస్తు ప్రభువును ఆహ్వానించుట
జరిగింది. ఇలా ఆహ్వానించినవారు
ప్రభువు మందతో కలసి జీవించి చివరకు పరలోక రాజ్యమునకు యోగ్యులైనప్పుడు వారు రాజాధిరాజైన
క్రీస్తు ప్రభువు ఇచ్చెడి విందుకు యోగ్యులు. అక్కడ ఆయనతో కూడ
భుజించు అవకాశము వీరికి కూడ ఇస్తానని అనగా మొదటి నుండి పరిశుద్ధముగా ఉండి పరలోక రాజ్యములో
స్థానము పొందినవారివలె, పాపము నుండి మరల్చుకొని మారుమనస్సు ద్వారా
వచ్చినవారికి ఇద్దరికిని సమానమైన అవకాశము ఇచ్చునని ఈ వచనములో ప్రభువు చెప్పుచున్నారు. ఎఫెసీ 2:19.
ఇక మరో అర్ధము కూడా ఉంది మరో విందు ఉంది
అది గొర్రెపిల్ల పెండ్లి విందు! దీనికోసం ప్రకటన
19:9 లో ఉంది! ఇందులో పాలుపొందిన వారు ధన్యులు
అనియు, పరిశుద్ధులు అనియు, జయజీవితం జీవించిన
విశ్వాస సమూహము అని తెలుస్తుంది. అయితే ఈ గొర్రెపిల్ల పెండ్లి
విందులో ముఖ్యమైన వ్యక్తి గొర్రెపిల్ల అయిన యూదా గోత్రపు సింహము అనబడే రాజుల రాజు ప్రభువుల
ప్రభువు అనబడే యేసుక్రీస్తుప్రభులవారు! మరి ఈ విందులో పాలుపొందే
యోగ్యత నీకుందా? అట్టి విధమైన విశ్వాస జీవితం నీకుందా!!
అయితే ఈ విందుకు వచ్చిన వారి
నుండి వచ్చు పరిమళ తైలపు సువాసన అక్కడ అంతా వ్యాపించినట్లుగా చెప్పబడింది. మూడవ విభాగములో పోయబడిన పరిమళ తైలము క్రీస్తు ప్రభువుగా తెలుసుకొన్నాము. పోయబడిన పరిమళతైలము సువాసన వెద జల్లును
కదా! ఇదే సువాసన మారుమనస్సు పొంది వచ్చినవారిలో నుండికూడ సువాసన
వ్యాపించుట ఆశ్చర్యముగా లేదా! పౌలు అనేక చోట్ల నేను కాదు నాలో నుండి క్రీస్తు ప్రభువే జీవించుచున్నారని చెప్పుట
చదువగలము. గలతీ
2:20 అంటే మారుమనస్సు ద్వారా
పాపము నుండి బయటపడి నిజదైవ విశ్వాసములోకి వచ్చి బాప్తిస్మము ద్వారా తొలి పాపములను కడిగించుకొన్నవారు.
ఆపై జీవితమును పరిశుద్ధముగా జీవించి దేవునికి యోగ్యరీతిలో సువార్తలో
బహుచురుకుగా పొల్గొన్నవారిలో క్రీస్తు ప్రభువు జీవించును. వారి జీవితము క్రీస్తు ప్రభువే! అలాంటివారి ఆత్మ శరీరము నుండి కంపు
వాసన రాదుగాని క్రీస్తు ప్రభువు యొక్క పరిమళతైలము యొక్క సువాసన వచ్చి అక్కడంతా వ్యాపించును. కనుక వారు ధన్యులే.
ఇక ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుంటే ఐగుప్తు దాస్యము నుండి విడుదల పొందిన
ఇశ్రాయేలు జాతి మరో 400 సంవత్సరాల తర్వాత దావీదు గారు రాజుగా అయ్యారు-
అప్పటినుండి ఇశ్రాయేలు జాతికి విందు దినాలు ప్రారంభమయ్యాయి! అయితే సోలోమోను యొక్క 40 సంవత్సరాల పాలన ఇశ్రాయేలు దేశ
చరిత్రలో స్వర్ణయుగము! సోలోమోను వైభవముతో పాటుగా ఇశ్రాయేలు దేశ
వైభవము కూడా వ్యాపించింది! అదే ఇశ్రాయేలు జాతి కోణంలో విందు దినములుగా
చూసుకోవచ్చు!
మరలా అదే వైభవము వేయేండ్ల పాలనలో మరలా ఇశ్రాయేలు జాతికి రాబోతుంది! ఇది సోలోమోను పరిపాలించిన
40 సంవత్సరాల వైభవము కంటే ఎంతో మిన్నగా ఉండబోతుంది! ఈ విందులో అనగా వేయేండ్ల పాలనలో క్రీస్తుతో పాటుగా పాలిస్తూ ఆయనతో విందు బోజనం
చేసేవారు ధన్యులు! మరి దీనికి నీవు సిద్దంగా ఉన్నావా?
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*17వ భాగము*
*నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు*
పరమగీతము 1: 13. నా ప్రియుడు నా రొమ్ముననుండు
గోపరసమంత సువాసనగలవాడు
14. నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు
పూగుత్తులతో సమానుడు.
ప్రియులారా! ఇక 13వ
వచనం చూసుకుంటే 13. నా ప్రియుడు నా రొమ్ముననుండు
గోపరసమంత సువాసనగలవాడు అని షూలమ్మితి అంటుంది! ఇంకా
14 వ వచనంలో నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో
సమానుడు అని కూడా అంటుంది.
దీని
ఆత్మీయ అర్ధం సూటిగా క్రీస్తు తన విశ్వాసుల పాలిట మరింత మధురమైన సువాసన, లోకంలోని అత్యుత్తమ పరిమళం
శరీరానికి ఎలాగో, నిజమైన విశ్వాసులకు క్రీస్తు సన్నిధి వారి ఆత్మకు అలాగే.
ఇందులో చెప్పబడిన
గోపరసమును జాజిపూవు లేక
గులాబీలతో తయారు చేసిన పన్నీరు వంటిది.
ఇది సువాసన కోసము ఉపయోగిస్తారు. ప్రియుడు ప్రియురాలి హృదయమునకు ఆనుకొని
ఉంటే అది వారికి రహస్య వేదికగా మారుతుంది.
ఈ స్థితి ప్రియురాలి విషయములో రోజాలు లేక జాజి పూలతో చేసిన గోపరసమంత
సువాసనగా వర్ణించుట జరిగింది. అలాగే ఏన్గెదీలోని ద్రాక్ష తోట మధ్యలోని కర్పూరపు చెట్టు నుండి పూగుత్తులు
వస్తే ఎలా ఉంటుంది? చాలా
ప్రత్యేకముగా ఆకర్షణీయముగా అది కనిపిస్తుంది కనుక ప్రియురాలికి తన ప్రియుడు అనగా భార్యకు
తన భర్త అలా ప్రత్యేకముగా కనిపిస్తాడు.
అతని స్థానము ఆమె హృదయములో ఉండును గనుక ఆ ఆస్వాదన గోపరసముతో పరిమళముగా
ఉండునని చెప్పబడింది. ఇది ప్రియురాలి దృష్టిలో ప్రియుడు. ఇది ఈ లోకరీత్యా వర్ణన.
ఇక ఆత్మరీత్యా
క్రీస్తు ప్రభువుయొక్క స్థానము విశ్వాసియొక్క హృదయములోనే. ఎప్పుడైతే విశ్వాసి క్రీస్తు ప్రభువును
తన ప్రియునిగా అనగా ఆత్మీయునిగా అనుకొంటారో వారు ఆయనకు ఇచ్చు స్థానము వారి హృదయములో. వారు వారి హృదయపు తలుపులను తెరిచి
అందులో ఆయనకు ఆలయమును నిర్మిస్తారు.
అలాంటి వారి హృదయములో ఆయన నివసిస్తే అభిషిక్తుని పరిమళతైలము యొక్క
సువాసన వారికి ఎప్పుడు వస్తూ ఉండి వారు దానియొక్క ఆధ్యాత్మిక ఆనందములో నిలిచియుందురు. అలాంటివారిని ఈ లోకమనే బబులోను ప్రాంతములో
అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నాగాని వారికి లోబడక క్రీస్తుకోసం నిలబడతారు.. కనుక ఈ లోకరీత్యా ఎంతమంది దేవుళ్లు
దేవతలనబడేవారు ఉన్నను క్రీస్తు ప్రభువు వారందరి మధ్య ప్రత్యేకింపబడినవాడుగా అగుపిస్తాడు. దీనికి కారణము నిజమైన రక్షణ అనునది ఒక క్రీస్తు ప్రభువులోనే
ఉన్నది. ఈ విధముగా ప్రియురాలైన
సంఘము క్రీస్తు ప్రభువును
ఆస్వాదిస్తే, క్రీస్తు ప్రభువు తన ప్రియురాలిని అనగా యెరూషలేమను
వధువును చూచినప్పుడు ఆమె చాలా అందముగా నీతి అను క్రియలతో అలంకరించబడి ఆయనకు కనిపిస్తుంది.
ఇక ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుంటే గతభాగంలో
1:12 నుండి 2:7 వరకు సోలోమోను పరిపాలన రాజ్య వైభవము కోసం చెప్పబడింది అని చూసుకున్నాము!
గతభాగంలో విందు కోసం చూసుకున్నాము! గొర్రెపిల్ల
పెండ్లి విందు! ఆ గొర్రెపిల్ల మొదటగా లోక పాపములు మోసుకుని పోవు
దేవుని గొర్రెపిల్ల! ఆయనే మన ప్రభువైన ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారు!
ఈ ప్రియుడిని నా రొమ్మున ఉండు గోపరసమంత
సువాసన గలవాడు అని వర్ణిస్తుంది సంఘము! ఎందుకంటే
ఆ గొర్రెపిల్ల రక్తము కార్చి మన పాపముల నుండి విమోచన చేయడం జరిగింది. ఇప్పుడు అతని నీడలో జీవించాలి అని, అతనితోనే జీవితం కొనసాగించాలని
ఆశిస్తుంది సంఘము అనబడే షూలమ్మితి! యేసుక్రీస్తుప్రభులవారు ఆకరి
బొట్టు వరకు చివరి నీటి బొట్టువరకు సంఘ విడుదలకు ఏ విధంగా ఖర్చు చేశారో అదే విధంగా ఇప్పుడు సంఘము కూడా
తన చివరి శ్వాస వరకు, అవసరమైతే తన రక్తమును చిందించి కూడా క్రీస్తుకోసమే
జీవించాలని తాపత్రయ పడుతుంది! అతని ఎడబాటును సహించలేక పోతుంది!
ఇక ఏన్గెదీ కోసం చూసుకుంటే: మొదటగా
దినవృత్తా 20:1 లో ఈ అనుభవంలో తగ్గించుకుని ప్రార్ధన చేసినట్లు
కనిపిస్తుంది. మొదటగా ఈ ఏన్గెదీ అనుభవంలో తగ్గింపు ప్రార్ధన-
దేవునిమీద ఆధారపడే జీవితం కావాలి ప్రతీ విశ్వాసికి! ఈ ప్రార్ధన ద్వారా - యెహోషాపాతు రాజు యుద్దం చేయకుండానే గెలిచినట్లు
చూడగలం! ఇలాంటి ప్రార్ధన విశ్వాసి జీవితం గొప్ప విజయాలు తీసుకుని
వస్తుంది!
ఇక యెహేజ్కేలు 47:10 లో ఇక్కడ ఏన్గెదీ అనుభవంలో
జాలరులు తమ వలలు వేసి చేపలు పడతారు!
యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు శిష్యులతో నేను మిమ్మల్ని మనుష్యులను
పట్టే జాలరులుగా చేస్తాను, మీ వలలను వదిలి నన్ను వెంబడించమన్నారు!
వారు అలాగే చేశారు! ఆయన ఆరోహణమునకు ముందుగా ఆయన
అన్నారు: మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి
నమ్మి బాప్తిస్మము తీసుకున్నవారు రక్షించ బడతారు నమ్మని వారు శిక్షించబడతారు అంటు చెప్పారు!
మరి ఈ ఆజ్న దేవుడు వారికే కాదు మనకు కూడా ఇచ్చారు కదా! మరి నీవు ఈ ఏన్గెదీ అనుభవం అనగా సువార్త ప్రకటించే అనుభవంలో- చేపలు పట్టడానికి వల వేసే అనుభవంలో ఉన్నావా? నీ సేవకునికి ఈ విషయంలో సహాయం చేసే
అనుభవంలో ఉన్నావా? ప్రభువు కోసం ఆత్మలు సంపాదించే స్తితిలో ఉన్నావా?
అయితే ప్రియులారా! ఈ వచనంలో కనబడే ఏన్గెదీ
అనుభవం: దేవుణ్ణి ఆరాధించే అనుభవం! కర్పూరపు
పూగొత్తులతో ప్రభువు సమానుడు అనగా కర్పూరము దేవుణ్ణి పూజించడానికి ఆరాధన చేయడానికి
వాడతారు! అలాగే నీవు కూడా దేవుణ్ణి పూజించాలి! ఆరాదించాలి!
గమనించాలి కర్పూరము తాను కరిగిపోతూ మంచి సువాసన ఇస్తుంది! అలాగే
నీవు క్రీస్తును ఆరాదిస్తూ నీవు కరిగిపోతూ క్రీస్తు సువాసనను అందరికీ పంచవలసిన అవసరం
ఉంది! అనగా కష్టాలలోనూ శ్రమలలోనూ కన్నీటి లోనూ కూడా ప్రభువుమీద
నిందలు వేయకుండా నిరాశతో క్రుంగి పోకుండా ధైర్యంగా సంతోషంతో భక్తిలో ఎదిగిపోవాలి!
ఎట్టి పరిస్తితులలోనూ ప్రభువుని విడువకూడదు! ఇదే
నిజమైన ఆరాధన అనుభవం! దావీదు గారు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి
ఆరాధించడం మానలేదు! స్తుతించడం మానలేదు! ఈ ఏన్గెదీ అనుభవంలో నీవు నేను ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు!
మరి నీవు సిద్దమా!!!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*18వ భాగము*
*నా ప్రియురాలా, నీవు సుందరివి
నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు*
పరమగీతము 1: 15 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.
ప్రియులారా! ఇక 15వ
వచనం చూసుకుంటే 15 నా ప్రియురాలా,
నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అని షూలమ్మితితో సోలోమోను అంటున్నాడు!
ప్రియురాలైన సంఘము క్రీస్తు
ప్రభువును ఆస్వాదిస్తే, క్రీస్తు ప్రభువు తన ప్రియురాలిని అనగా
యెరూషలేమను వధువును చూచినప్పుడు ఆమె చాలా అందముగా నీతి అను క్రియలతో అలంకరించబడి ఆయనకు
కనిపిస్తుంది. ఈ ప్రియుడిని
నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు అని వర్ణిస్తుంది సంఘము! ఎందుకంటే ఆ గొర్రెపిల్ల రక్తము కార్చి తన పాపముల నుండి విమోచన చేయడం జరిగింది.
ఇప్పుడు అతని నీడలో జీవించాలి అని, అతనితోనే జీవితం
కొనసాగించాలని ఆశిస్తుంది సంఘము అనబడే షూలమ్మితి! యేసుక్రీస్తుప్రభులవారు
ఆకరి బొట్టు వరకు చివరి నీటి బొట్టువరకు సంఘ విడుదలకు ఏ విధంగా ఖర్చు చేశారో అదే విధంగా ఇప్పుడు సంఘము కూడా
తన చివరి శ్వాస వరకు, అవసరమైతే తన రక్తమును చిందించి కూడా క్రీస్తుకోసమే
జీవించాలని తాపత్రయ పడుతుంది! అతని ఎడబాటును సహించలేక పోతుంది!
ఇలా సంఘము ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారిని ప్రేమిస్తుంది గనుక ఇప్పుడు
ప్రియుడు సంఘముతో చెబుతున్నారు నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి
నీ కన్నులు గువ్వ కండ్లు
సోలోమోను
షూలమ్మితిని సౌందర్యవతి” అని ఇక్కడ, 8 వ వచనంలో “ప్రియసఖీ” అని, పిలుస్తున్నారు!– వ 9; ఇంకా చూసుకుంటే ఈగ్రంధములో
పరమగీతము 2:2, బలురక్కసి చెట్లలో వల్లిపద్మము
కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.;
పరమగీతము 4:1, నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి
నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. ,
పరమగీతము
4:7, నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు
కళంకమేమియు లేదు. ;
పరమగీతము
7:6, నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతిసుందరమైనదానవు
అతి మనోహరమైనదానవు. అని చెప్పడం జరిగింది.
నిజానికి
ఇవి ప్రేమ పెల్లుబికే ఈ మాటలు,
లాలించే ఈ పలుకులు తన సంఘంపైనా, ప్రతి విశ్వాసి
పైనా క్రీస్తుకున్న గొప్ప ప్రేమను సూచిస్తున్నాయి
దయచేసి
ఈ క్రింది వచనాలు కూడా చూడండి
యోహాను 13:1, తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు
వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.
;
యోహాను 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని
గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన
ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను. ;
యోహాను 15:9, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో
నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.;
యోహాను 17:1-26, ;
రోమీయులకు 5:8, అయితే దేవుడు మనయెడల తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు
మనకొరకు చనిపోయెను. ;
గలతియులకు
2:20, ;
ఎఫెసీయులకు 5:1-2, 1 కావున మీరు ప్రియులైన పిల్లలవలె
దేవునిపోలి నడుచుకొనుడి.
2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను;
ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. , ఎఫెసీయులకు
5:25, ; 1 యోహాను 3:16, ; 1 యోహాను
4:16, ).
విశ్వాసికీ
క్రీస్తుకూ మధ్య ఉన్న సంబంధం అంతా పరస్పర ప్రేమ, ఒకరికి ఒకరు ఇచ్చుకొనే మనసు, ఒకరిలో ఒకరు ఆనందించడంతో కూడి ఉంది.
ఇక ఇశ్రాయేలు ప్రజల కోణంలో
చూసుకుంటే ప్రియురాలు అనగా విమోచించ బడిన ఇశ్రాయేలు ప్రజలు! సంఘకోణంలో
విమోచించ బడిన విశ్వాసులు! వీరు ప్రభువునకు ఎంతో ప్రియులుగాను
సౌందర్యము గాను కనిపిస్తున్నారు! యెహేజ్కేలు 16:13,14
ప్రకారం దేవుడే సంఘానికి పరిశుద్ధమైన అలంకారములు పెట్టారు! ఇప్పుడు సంఘము విమోచించ బడి సౌందర్యముగా ఉందని సోలోమోను మెచ్చుకుంటున్నాడు!
షేబ దేశపు రాణి సోలోమోను కాలంలో వచ్చి సోలోమోనుని చూచి నీ ప్రజలు ఎంతో
ఆత్మ సంబంధమైన సౌందర్యముతో ఉన్నారని సోలోమోనును 1 రాజులు
10:6—9 వరకు పొగిడి వెళ్ళిపోయింది!
కీర్తన 149:4 లో ఇట్టి ఆత్మ సౌందర్యము గల
సంఘము నందు ప్రభువు ఆనందిస్తాడు అని వ్రాయబడింది
ఎఫెసీ 5:26 లో 26 అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
అంటూ
సంఘము ఈ విధంగా కళంకమైనా ముడతయినా లేకుండా పరిశుద్దంగా నిరధవశ్యంగా మహిమ గలదీగా
ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు
అందుకే 1 పేతురు 3:3 లో వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండక సాధువైనట్టి యు మృధువైనట్టియు
గుణములతో అలంకరించబడాలి అంటున్నారు! ఇదే నీకు
సౌందర్యము తప్ప- మంచి బట్టలు చీరలు వేసుకుని అందంగా అలంకరించు
కుంటే దానిని అందము అని అనబడదు! నీ బట్టలు కూడా పరిశుద్ధుల నీతి
క్రియలే నీకు ఘనమైన తెల్లని వస్త్రాలుగా ఉండాలని ప్రకటన గ్రంధంలో చెప్పబడింది!
మరి
ఇలాంటి సౌందర్యము నీకుందా!
లేక కేవలం భాహ్య సౌందర్యము కోసమే తపిస్తూ అంతరంగ సౌందర్యమును వదిలేస్తున్నావా?
ఆలోచించుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*19వ భాగము*
*నా ప్రియురాలా, నీవు సుందరివి
నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు*
పరమగీతము 1: 15 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.
ప్రియులారా! ఇక 15వ
వచనం చూసుకుంటే 15 నా ప్రియురాలా,
నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అని షూలమ్మితితో సోలోమోను అంటున్నాడు!
(గతభాగం తరువాయి)
ఇక
గువ్వకళ్ళు కోసం చూసుకుంటే
: నీ కళ్ళు “గువ్వ కండ్లు”– గువ్వ దేవుని పరిశుద్దాత్మకు
గుర్తు (మత్తయి 3:16, ). ఇది పరిశుద్దాత్మ యొక్క దివ్యత్వం, నిర్దోషత్వం, ఆధ్యాత్మిక సౌందర్యాలను సూచిస్తూ ఉంది.
విశ్వాసుల కళ్ళల్లో పవిత్రాత్మ ప్రకాశం కనబడాలి. గువ్వ కండ్లు కలిగి ఉండే ఏకైక మార్గం ఇదే.
గువ్వ
కోసం బైబిల్ లో చాలా చోట్ల వ్రాయబడింది:
మొదటగా
కీర్తన 55:6 లో భక్తుడు తనను తాను గువ్వతో పోల్చుకుంటూ అంటున్నాడు
6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా
నుందునే ! అనగా భక్తుడు ఈ పాపపు లోకంలో ఉండే పాపాన్ని ప్రేమించడానికి
ఎంతమాత్రమూ ఇష్టపడటం లేదు!
తనకు
రెక్కలు గాని ఉంటే ఈ పాపాన్ని చూడకుండా ఎగిరిపోయి గువ్వవలే అరణ్యములో ఏకాంతముగా జీవిస్తాను
అంటున్నాడు! దేవుని బిడ్డలు పరిశుద్దతను ప్రేమించి పాపమును అసహ్యించు కుని ప్రభు సన్నిధిలో
బ్రతకాలి అని ఈ వచనం సూచిస్తుంది!
2. కీర్తన 68:13 లో 13 గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది
వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
గువ్వ రెక్కలు వెండితో పోల్చబడ్డాయి! ఈకలు బంగారముతో పోల్చబడ్డాయి! అనగా ఇక్కడ గువ్వలో రెండు లక్షణాలు కనిపిస్తున్నాయి! ఒకటి వెండి విమోచనకు గుర్తు! బంగారము దైవత్వమునకు గుర్తు! ఇంకా సౌందర్యమునకు గుర్తు!
కాబట్టి విశ్వాసులు విమోచించ బడిన వారై క్రీస్తుయేసు యొక్క దైవత్వములోనికి
అను దినము రూపాంతరము చెందవలసి ఉంది!
3. యెషయా 38:14 లో 14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచ లాడితిని గువ్వవలె మూల్గితిని
ఉన్నతస్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూట బడి యుండుము.
ఇక్కడ
శ్రమల అనుభవము మరియు కన్నీటి ప్రార్ధన అనుభవము కనిపిస్తుంది! మొదటగా శ్రమలు కలిగినప్పుడు
విమోచన కోసం దేవుని సన్నిధిలో గోజాడటం అందుకే మరోచోట భక్తుడు అయ్యా గువ్వలాంటి నన్ను
దుష్టుని పాలు చేయవద్దు అని ఏడుస్తున్నాడు!
ఇక
రెండో అర్ధము గువ్వ వలె మూలుగుతూ పరుల రక్షణ కోసం ప్రార్ధనా విజ్నాపణలు చేయాలి!
4. యెషయా 60:8 లో 8 మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
ఇక్కడ
ఈ వచనము- ప్రభువు రెండో రాకడకు మేఘముల మీద ప్రభువును ఎదుర్కోడానికి రెండో ఆకాశమునకు
ఎగిరి పోయే దేవుని బిడ్డలను సూచిస్తుంది! ఇటువంటి అనుభవం ప్రియ
దేవుని సంఘమా నీకుందా!!!
5. హొషేయా 7:11 లో ఎఫ్రాయీము గువ్వతో పోల్చబడ్డాడు!
ఇతనికి దేవుని యందు విశ్వాసము లేదు తనకు వచ్చిన శ్రమలలో అతడు ప్రభుని
ఆశ్రయించ లేదు సరికదా దేవుని శత్రువులను ఆశ్రయించాడు ఈ అనుభవం- దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా
తమకు గల పలుకుబడిని చూసుకుంటూ, తమకు గల ధనము చూసుకుని తమకున్న
రాజకీయ బ్యాక్ గ్రౌండ్ చూసుకుని దేవునిమీద ఆశ్రయము పెట్టుకోకుండా అధికారులను పోలీసు
వారిని కోర్టు వారిని ఆశించే నామకార్ధ క్రైస్తవులను సూచిస్తుంది ఈ వచనం!
6. మత్తయి 10:16 లో పావురాల కోసం చెప్పబడింది- గువ్వకూడా పావురాల జాతికే చెందుతుంది కనుక దేవుని బిడ్డలు పావురముల వలె నిష్కపటులై
ఉండాలి. లోకస్తుల వలె
చేదు లక్షణాలు ఉండకూడదు! మనము తోడేళ్ల వంటి మనుష్యుల మధ్య నివశిస్తున్న
మరి పరిశుద్ధత కోల్పోకూడదు! ఎవరినీ వంచించకూడదు! ఎవరినీ పాడు చేయకూడదు!
ఈ
పవిత్రమైన లక్షణాలు కలిగి ప్రార్ధన చేస్తూ కన్నీటితో ప్రభు సన్నిధిలో గడిపే అనుభవమే
గువ్వ కళ్ళు! మరినీకు అటువంటి ప్రార్ధించే కళ్ళు- నిష్కపతమైన హృదయం
నీకుందా!!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*20వ భాగము*
*నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు*
పరమగీతము 1: 16 నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు
ప్రియులారా! ఇక 16వ
వచనం చూసుకుంటే నా ప్రియుడా, నీవు సుందరుడవు
అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు షూలమ్మితి సోలోమోనుతో అంటుంది! దీని సూటి అర్ధం క్రీస్తు తమలో చూచే అందం కంటే విశ్వాసులకు ఆయనలోనే ఎక్కువ
సౌందర్యం కనిపిస్తుంది . కీర్తనల గ్రంథము 45:2, నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ
పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.
“పచ్చనిచోటు”– కీర్తనల గ్రంథము 23:2, పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను
నడిపించుచున్నాడు. ;
యెషయా 51:3, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు
దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని
యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు
సంగీతగానమును దానిలో వినబడును.
ఈ
వచనములో షూలమ్మితి నా ప్రియుడా అని పిలవడమే కాకుండా నీవు ఎంతో సుందరుడవు నాకు అతి మనోహరుడవు
అంటుంది! ఈ గ్రంధములో అనేకసార్లు నీవు ప్రియుడవు సుందరుడవు అని షూలమ్మితి చెప్పడం జరిగింది!
అయితే సంఘకోణంలో చూసుకుంటే క్రీస్తు ఎంతో సుందరుడు అని మనకు తెలుసు!
గాని నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సురూపమైనను సొగసైనను లేకుండా పోయింది
ఎవరూ ఆయనను గుర్తు పట్టలేనంతగా ఆయన సిలువలో నలుగగొట్ట బడ్డారు!
యెషయా 53 లో చూసుకుంటే
2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు
ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి,
అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును
వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను.
అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను
వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను
మనమతనిని ఎంచితివిు.
5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి
నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత
కలుగు చున్నది.
7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు
వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు
నోరు తెరువలేదు.
8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా
జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు
కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను
ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును
లేదు.
10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి
వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని
సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
ఇన్ని
శ్రమలు పడి సంఘమును శిలువ రక్తముతో కన్నాడు. ఆపో 20:28లో దేవుడు తన
స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా
ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు
జాగ్రత్తగా ఉండుడి అంటున్నారు!
ఈ సిలువయాతనలు ఆయనను సుందరుడుగా మార్చివేశాయి! ఇప్పుడు ఆయన
దవళ వర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అతని గుర్తించ గలిగే టంత అందముగా మారిపోయారు ఆయన!
అందుకే ఇప్పుడు సంఘము అంటుంది నా ప్రియుడా నీవు సుందరుడవు! అతి మనోహరుడవు!!!
ప్రియ
విశ్వాసి రక్షించబడిన నీకు విమోచించ బడిన నీకు క్రీస్తు మాత్రమే సుందరుడుగా కనబడాలి! ఆయన మార్గములు కష్టమైనా
గాని రమయములుగ ఎంచాలి!
ఇక
తర్వాత మన శయన స్థానము పచ్చని చోటు! శయన స్థానము అనగా విశ్రాంతి తీసుకునే చోటు!
అది పచ్చగా ఉంది అంటుంది షూలమ్మితి! అందుకే దావీదు
గారు కూడా అంటున్నారు కీర్తనలు 23 లో 2 పచ్చికగల చోట్లను
ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
3 నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి
నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
చివరకు
యేసుక్రీస్తుప్రభులవారు కూడా ప్రయాసపడి భారము మోసుకును వారలారా నాయొద్దకు రండి నేను
మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నారు! కాబట్టి మన ఆశ్రయము మన విశ్రాంతి ఆయనలోనే అని
గ్రహించాలి!
నిర్గమ 33:14 లో అంటున్నారు దేవుడు
14 అందుకు ఆయననా సన్నిధి నీకు
తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
ఈలోకములో
ఈలోక యాత్రలో మనము కష్టాలు కడగల్లు దాటి ఒకరోజు ఆయన కుడి పార్శ్వమున ఆయన తొడమీద మనము
విశ్రాంతి తీసుకో బోతున్నాము! అప్పుడు ఆయన మన కనుల నుండి ప్రతీ భాష్ప బిందువుని తన చేతితో
తుడవ బోతున్నారు! ఇదే నిజమైన విశ్రాంతి! అంతేకాకుండా మరణించిన అనంతరం పరదైసులో అబ్రాహాము రొమ్మున కూడా విశ్రాంతి తీసుకోబోతున్నాము!
అయితే
కీర్తన 116:లో తిరిగి నా విశ్రాంతి లో ప్రవేశించు అంటున్నారు- ఇది
మరణ ఆనంతరము పరదైసులో తీసుకునేది అని నా ఉద్దేశం!
అయితే
యెషయా 28:11 లో 11 నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది
ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.
ఇది మనిషి దేవుని నుండి దూరమై పాపపు మార్గములలో అలసి సొలసి ఉన్నప్పుడు
తిరిగి తనతో సమాధాన పడండి అని పిలిచి ఆ మార్గములోనికి రావడమే ఆయన శయన స్థానము నాకు
రావడం అని నా ఉద్దేశం ప్రియులారా!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*21వ భాగము*
*మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు*
పరమగీతము 1: 17 మన మందిరముల దూలములు దేవదారు
మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు!
ప్రియులారా! ఇక 17వ
వచనం చూసుకుంటే మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు
సరళపు మ్రానులు అని షూలమ్మితి సోలోమోనుతో అంటుంది! దీని సూటి
అర్ధం విశ్వాసులకు హాని కలిగించే వాటన్నిటి నుంచీ వారు దాక్కోదగిన చోట ఉంది
కీర్తనల గ్రంథము
121:5-6,
5 యెహోవాయే నిన్ను
కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
6 పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు..
ఆ
చోటు అనంతుడైన దేవుని ఆనందంగా వారితో కలిసి సహ జీవనం చేయడమే .
నిర్గమకాండము 25:8లో అంటున్నారు నేను వారిలో
నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను అన్నారు! చివరకు
పౌలుగారు అంటున్నారు నీ దేహము దేవుని ఆలయము పరిశుద్దాత్మ
నిలయము అన్నారు! 1 కోరింథీ 3:16,17; 6:19;
పేతురుగారు
ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనము దేవుని ఆలయముగా
కట్టబడుచున్నాము అంటున్నారు! 1 పేతురు 2:5;
ఇవే
శయన స్థానము మరియు మందిరములు! ఈ మందిరము యొక్క దూలములు దేవదారు మ్రానులతో చేయబడ్డాయి వాసములు
సరళపు మ్రానులు
ఏన్గెదీ
అనుభవంలో చూసుకున్నాము-
విశ్వాసి దేవుని సన్నిధిలో దేవుని బాటలో నడవాలి అంటు! అలా చేస్తే తన ప్రజలు ఇప్పుడు పచ్చిక గల చోట్ల నివాసం చేయడమే కాకుండా దేవుని
మందిరములో విశ్రాంతి కలిగే చోట ఆయన ఉంచబోతున్నారు! మన విశ్వాస
యాత్రలో మనకు నిజానికి నెమ్మది ఆదరణ విశ్రాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అది దేవుని మందిరములోనే
ప్రియులారా! దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారికి ఆయన సన్నిధిలో
ప్రార్ధించే వారికి మాత్రమే ఇది అర్ధమవుతుంది!
1 కోరింథీ 3:9 లో 9 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును
దేవుని గృహమునై యున్నారు. ఇక్కడ దేవుని గృహము మరియు దేవుని వ్యవసాయముగా
చెప్పబడుతున్నాము! పైన చెప్పిన రిఫరెన్సులు కలుపుకుంటే విశ్వాసులే
దేవుని గృహం! ఈ గృహానికి విశ్వాసుల విశ్వాసమే రాళ్ళు!
విశ్వాసులే సజీవమైన రాళ్ళు! అందుకే సమాజముగా కూడుచు
ఆత్మ సంబంధమైన గృహముగా మనము ప్రభువుతో ఉంటూ ఆయన గృహముగా కట్టబడుతూ ఉండాలి మనము!
ఇక దేవుని వ్యవసాయం- ఆయన ద్రాక్షావళ్ళి మనము తీగలము! ఆయనతో అంటు కట్టబడి ఆయనలోనే నాటబడి ఆయనతోనే ప్రాకాలి! ఆయనతోనే ఎదగాలి వాక్యమనే నీరు తీసుకోవాలి! ఫలములు ఫలించాలి!
ఆత్మల పంట పండించాలి! అంతేకాకుండా ఆయన తోటలో పనిచేయాలి!
చేశాక ఘనత ఆశించకుండా మేము నిష్ఫలమైన పనివారము మేము చేయవలసినదే మేము
చేశాము అని చెప్పాలి! అప్పుడు వ్యవసాయధారుడు సంతోషించి మనలను
దీవించి నప్పుడు మనము అరువాదంతాలు గాను నూరంతల గాను ఫలిస్తాము!
16 మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని
పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
ఇక్కడ
దేవుని బిడ్డలు దేవాలయముగా కట్టబడ్డారు కాబట్టి వీరు ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి
ఆరాదిన దించాలి తప్ప- అపవిత్రమైనది ఏదీ వారిలో ఉండడానికి వీలులేదు! ఆత్మ సంబంధమైన
మాటలు ఆత్మ సంబంధమైన పాటలు మాత్రమే ఉండాలి! అప్పుడే దేవుడు సంతోషిస్తారు!
ఎఫెసీ 1: 23 ఆ సంఘము ఆయన శరీరము;
సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు! కాబట్టి క్రీస్తుకి లోబడి ఆయన వాక్యము
ప్రకారం జీవించవలసిన అవసరం ఉంది! అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ
పాపమునకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది!
సంఘమనే స్త్రీ పరిశుద్ధ యెరూషలేమను
ప్రియురాలు. క్రీస్తు
ప్రభువు విషయములో ఆయన విశ్రాంతి తీసుకొను ప్రదేశాలనే ఆయనకు తనకు ఉండే ప్రదేశాలుగా వర్ణించుట
జరిగింది. క్రీస్తు ప్రభువును
ప్రియునిగా సంబోధించుచు నీవు సుందరుడవని
మనోహరుడు అనగా మనస్సును ఉత్సాహముతో నింపువాడవని చెప్పుచున్నది. ఆయన రూపము విశ్వాసికి ఆకర్షణీయముగాను
తాను ఏ ప్రక్క నుండి చూచిన తన వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే ఆయనను గూర్చిన ఆలోచన విశ్వాసి
హృదయములో నూతనోత్సాహమును నింపుతుంది. గ నుక పై విధముగా ప్రియురాలైన
సంఘము క్రీస్తు ప్రభువుని సంబోధిస్తూ మన శయన స్థానము పచ్చని చోటు అని చెప్పుచున్నది
అలాగే
క్రీస్తు ప్రభువు ఈ లోకములో సాధారణ పరిస్థితులలో జీవించినను, ఆయన రాజులకు రాజు కనుక ఇంకొక కోణములో ఆయన విశ్రాంతి స్థానములు దేవదారు మ్రానులను
దూలములుగా నిర్మించిన మందిరములు సరళ మ్రానులతో నిర్మించిన నివాసాలు. క్రీస్తు ప్రభువుకు యెరూషలేము ఆలయము
ఆయన విశ్రాంతి స్థానమే కదా! ఈనాడు మనము నిర్మించుకొన్న సంఘములు ఆయనకు విశ్రాంతి స్థలములే కదా! కథోలిక సంఘములో ప్రభువు శరీరముగా
పిలువబడు రొట్టెను వారు ఆలయములో మందసము అను పేరుతో భద్రపరుస్తారు. దీనికి ప్రత్యేకముగా ఒక స్థానమును
ఇస్తారు. క్రీస్తు ప్రభువే
అందులో ఉన్నట్లుగా భావించుచుందురు.
అంటే ఆయన తన శరీరము రొట్టె రూపముగ అక్కడ విశ్రాంతిలో ఉన్నట్లే
కదా! ఇలాంటి అద్భుతమైన
కట్టడములు ఆయన నివాసములని సొలొమోను వ్రాయుట జరిగింది.
అంటే పచ్చని చోట బహిరంగ ప్రదేశాలలో
విశ్రాంతి స్థలములుగా మొదలైన క్రీస్తు ప్రభువు సంఘముయొక్క విశ్రాంతి స్థలములు క్రమేణా
వృద్ధి చెంది అత్యంత విలువైన స్థలాలుగా నివాస స్థానాలుగా మారునని ఇందులో చెప్పుట జరిగింది.
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*22వ భాగము*
*నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో
పుట్టు పద్మమువంటిదానను*
పరమగీతము 2: 1 నేను షారోను పొలములో పూయు పుష్పము
వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
ప్రియులారా! ఇంతవరకు పరమగీతము మొదటి అధ్యాయం నుండి
ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను చూసుకున్నాము! ఇక రెండవ అధ్యాయము
నుండి పరిశుద్ధాత్ముడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో చూసుకుందాం!
ఈ
రెండో అధ్యాయములో కూడా షూలమ్మితి మరియు సోలోమోను గారు మాట్లాడుకుంటున్న సంభాషణ కనబడుతుంది
మనకు అక్షరార్ధముగా!
మొదటి
వచనంలో అంటుంది షూలమ్మితి నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు
పద్మమువంటిదానను అని చెబుతుంది.
షారోను కోసం చూసుకుంటే షారోను దేవుని పొలము అని అర్ధము! ఇంకా మేత భూమి అని కూడా
అర్ధము ఇలా చాలా అర్ధాలున్నాయి! అయితే యేసుక్రీస్తుప్రభులవారికి
షారోను రోజా అని పేరు ఉంది!
షారోను
పొలము అంటే భూమిని దున్ని సాగు చేయుటకు ఏర్పరచబడిన స్థలమును షారోను పొలము అంటాము. ఇలాంటి
పొలము షారోనులో ఉన్నదని అక్కడ ఉన్న ఆ పొలములో పూసిన పుష్పముతో ప్రియురాలైన సంఘమును
పోల్చుకొని చెప్పుచున్నది. పొలములో మంచి వాటితో బాటుగా కలుపు మొక్కలు కూడ పెరుగును. కనుక అన్ని రకముల పనికిమాలిన మొక్కలలో
ఒక మొక్కగా ఈ ప్రియురాలు ఉన్నది ఒకప్పుడు.
అంటే ఈ భూమిని దేవుడు ఏర్పరచి అందులో తన ప్రియురాలైన యెరూషలేమును
అందులో ఏర్పరచాడు. కాని
యెరూషలేముతో బాటుగా విగ్రహారాధికులు సాతాను ప్రేరణతో పెరిగి, ఎక్కడ చూచినను విగ్రహాలే అనేకము వాటి సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. వీటి మధ్యన ప్రత్యేకముగా కనిపిస్తూ
వికసించుచున్న పుష్పమువలె యెరూషలేము అను పరిశుద్ధుల సంఘము ఉన్నది.
అలాగే
లోయలో పుట్టు పద్మము వంటిదాననని సంఘము చెప్పుచున్నది. లోయ అంటేనే నీటితో నిండి ఉండగా అందులో
పద్మము ఒకటి ఉంటుంది. దానిలో దిగినవారు బురదలో కూరుకొని మరణించువారు ఉన్నారు. అలాంటి అత్యంత భయంకరమైన కూపమను బబులోను
అను చెడిన సంఘము మధ్యలో యెరూషలేమను పవిత్రమైన సంఘము ఉన్నది. అందుకే చుట్టు బలురక్కసి చెట్లు ఉండగా
వాటి మధ్యలో వల్లిపద్మము కనబడినట్లుగ స్త్రీలలో ప్రభువుయొక్క సంఘము మనకు కనిపిస్తుంది. అంటే సమాజమంతా బబులోను సంఘముగా మారి
ఉంది. అది కూడ నిజదేవుణ్ణి
పూజించక, సృష్టి కర్తను వదిలి సృష్టిని పూజిస్తూ జీవిస్తున్నవారుగా
ఉండగా వారిలో కొందరు క్రీస్తు ప్రభువును తన నాథునిగా ఎన్నిక చేసుకొని మారుమనస్సు బాప్తిస్మము
అను కార్యముల ద్వారా ఈ లోకములో ఉన్నారు.
కనుక వారు ప్రత్యేకించి ఖచ్చితముగా కనిపిస్తారు. ఇప్పుడు అనేక సంఘాలు చర్చిలు ఉన్నాయి గాని వాటిలో మందిరానికి వచ్చేవారు ఎంతమంది?
వారిలో కూడా నిజముగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఎంతమంది?! వారు క్రీస్తు ప్రభువుకు దూరముగా
జీవించు బబులోను సంఘములోని నల్లనిదియైన కుమార్తెలే. వీరిలో సంఘమునకు వచ్చి విశ్వాసముతో
జీవించువారు పై వచనములో చెప్పినట్లుగా వారు ప్రత్యేకముగా కనిపిస్తారు. వీరు అనగా పరమయెరూషలేము క్రీస్తు ప్రభువు అనగా ప్రియుని కంటికి
వికసించు పుష్పముగాను, పద్మముగా - వల్లిపద్మముగా
కనిపిస్తున్నారు!
ఇంకా లోయ అనగా శ్రమల అనుభవము! గనుక లోయలో పుట్టిన పద్మము అనగా
శ్రమలను సహిస్తూ క్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడ్డ విశ్వాసి జీవితాన్ని కూడా ఈ వచనం
సూచిస్తుంది!
కాబట్టి షారోను పొలము అనేది అనేది సంఘమునకు సాదృశ్యముగా ఉంది! షారోను
అనగా మరో అర్ధము మైదానము! మైదానము అనగా సమాభూమి అనగా ఎత్తు పల్లాలు
లేని భూమి! ఎత్తుపల్లములు
మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే ఒడిదుడుకులు! ఇలాంటివి ఎన్ని ఉన్నా
నీవు ప్రభువుమీద ఆనుకుంటే నిన్ను దయగల దేవుడు నిన్ను సమభూమిపై నిన్ను నిలపడానికి సిద్ధంగా
ఉన్నాడు!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*23వ భాగము*
*నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో
పుట్టు పద్మమువంటిదానను*
పరమగీతము 2: 1 నేను షారోను పొలములో పూయు పుష్పము
వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము.
(గతభాగము తరువాయి)
షారోను
పొలము కోసం ఇంకా ధ్యానం చేసుకుంటే
మొదటగా: యెహోషువా
12:9,24 లలో ఇదే షారోను లస్శారోను అని పిలువబడింది! ఇది దేవుని ప్రజల విజయాన్ని సూచిస్తుంది! కనుక షారోను
అనుభవము మొదటగా జయజీవితమునకు సాదృశ్యముగా ఉంది!
మన
జీవితాలలో మనము అనేకసార్లు అనేకచోట్ల ఓడిపోతున్నాము! కొన్నిసార్లు సాతాను చేతిలో కూడా ఓడిపోతున్నాము!
మన చెడు వ్యసనాల వలన చెడు పనుల వలన సాతాను చేతిలో ఓడిపోతున్నాము!
అయితే నీవు క్రీస్తునందు వేరిపారి ఉంటే క్రీస్తునందు జయోత్సవముతో మనలను
ఆయన ఊరేగించ గలరు! అప్పుడు మనస్పూర్తిగా దేవునికి స్తోత్రములు
చెప్పగలము! కాబట్టి దేవుని విశ్వాసులు ఓడిపోయేవారుగా కాకుండా
ప్రభువు కోసం జయాశీలురుగా జీవించాలి!
కొన్ని
రిఫరెన్సులు చూసుకుందాం!
a) 1 కోరింథీ
15:57 ప్రకారం ప్రభువు ద్వారా జయం పొందాలి!
b) యోహాను
2:13 ప్రకారం దుష్టుని జయించాలి
c) రోమా
1:1—2 ప్రకారం పరిశుద్ధ జీవితం జీవించాలి
d) ప్రకటన
12:11 ఇంకా యోహాను 5:5 ప్రకారం లోకాన్ని జయించాలి!
రెండు: దిన వృత్తా 27:29 ప్రకారం షారోను ఇంకా మేత భూమి అని కూడా అర్ధము! అనగా షారోనులో పశువులకు
చక్కటి మేత దొరుకుతుంది! అనగా సంఘములో విశ్వాసికి మేత దొరుకుతుంది!
అలాంటి చక్కటి మేత పెట్టాల్సిన అవసరం సంఘానికి సంఘకాపరులకు ఉంది!
అందుకే దావీదు గారు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు! పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ బెట్టుచున్నాడు శాంతి కరమైన జలముల యొద్ద ఆయన
నన్ను నడిపించు చున్నాడు అని పొంగి పరవశిస్తున్నారు కీర్తన 23 లో! కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ సంఘము అనే షారోను
లో బలమైన మంచి ఆత్మీయ ఆహారము తీసుకుని దేవునిలో విశ్వాసములో బలపడాలి! ఆ తర్వాత పిల్లలను కనాలి! అయితే విచారమేమిటంటే నేటి రోజులలో
విశ్వాసులకు తగిన మంచి ఆహారము కొన్ని సంఘాలలో దొరకడం లేదు! చెత్త
దొరుకుతుంది! అది నేను కాదు మార్కు 5:43 లో యేసుక్రీస్తుప్రభులవారే చెబుతున్నారు! ఆ పిల్లను బ్రతికించాక
ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు!
ప్రియ సంఘకాపరి
నీ సంఘానికి నీ గొర్రెలకు సరియైన మేత, సరియైన వాక్య ఆహారం పెట్టాల్సిన
బాధ్యత నీమీద ఉంది! సైన్సు పిట్టకదలు జబర్దస్ట్ కదలు కాదు!
నిజమైన బలమైన వాక్యము- ఉన్నది ఉన్నట్లు బోధించే
వాక్యము- ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యము బోధించి పెంచాలి
నీ మందను! అదే సమయములలో బలహీనమైన గొర్రెలను ప్రత్యేకముగా పోషించాలి!
వాటికోసం శ్రద్ద తీసుకోవాలి! మరినీవు చేస్తున్నావా?
మూడు: షారోను పొలము- సౌందర్యమునకు కూడా సూచన! యెషయా 35:2 ప్రకారం! 2 అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు
పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును
అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
ఈ అనుభవములో దేవుని బిడ్డలమైన మనము శరీర సౌందర్యమునకు ప్రాధాన్యత
ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన అందము నకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి! లోక సంబంధమైన వికారము యెజెబెలు ఆత్మ మనలో పని చేయకూడదు! క్రీస్తు పరిమళ వాసన అనబడే మంచి ప్రవర్తన మనలో కనబడాలి! ఆత్మ ఫలము ఫలిస్తూ మనలో ఉన్న ప్రేమ సంతోషము సమాధానము మంచితనము దయాళత్వము ఆశానిగ్రహము
లాంటివి మనలోపనిచేస్తూ అనేకమందిని క్రీస్తు కోసం ఆకర్షించే విధముగా ఉండాలి మన జీవితం!
ఈ ఆత్మ సౌంధర్యమే మనలో కనబడాలి! వెండి బంగారు లాంటి
ఆభరణములు కాకుండా సాధువైనట్టి మృధువైనట్టి అక్షయ గుణములు కనబడాలి మనలో అనగా సంఘములో!
అప్పుడు నీ సంఘము నిజముగా షారోను పొలముగా ఉంటుంది! అవసరాలలో ఉన్నవారికి సహాయం చేస్తూ కేవలం క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ పరపక్షం
వారితో మంచివారు మంచి సంఘము అని పేరు తెచ్చుకోవాలి! అప్పుడే నిజమైన
షారోను సంఘము వలె మనము ఉండగలము!
నాలుగు: యెషయా 33:9 లో ఇదే షారోను- ఎడారిగా మారిపోయినట్లు చదవగలము!
ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి లోక కార్యాలకు పేరు
కోసం ప్రాకులాడితే దేవుని కాపుదల దేవుని ప్రేమను తృణీకరిస్తే అప్పుడు దేవుడు ఆ సంఘమును
తృణీకరించి ఆ సంఘమును ఎడారిగా మార్చగలడు! ఇలాంటి సంఘాలను ఖండిస్తూ
ప్రకటన 2,3 అధ్యాయాలలో నీవు జీవిస్తున్నావు అన్న పేరు ఉంది గాని
నీవు మృతుడవే అన్నారు! ఇంకా నీవు చల్లగా నైనను వెచ్చగా నైనను
లేక నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను అంటున్నారు!
కాబట్టి ఓ నామకార్ద సంఘములారా ఇప్పుడైనా మారుమనస్సు నొంది చావనై ఉన్న
ఆ మిగిలిన వాటిని బలపరచమని అదే ప్రకటన గ్రంధ భాగములో చెప్పబడింది! కాబట్టి దేవుని వాక్యాన్ని త్రోసివేయక లోకాచారాలు పాటించక- వాక్యము ఏమి చెబుతుందో అది మాత్రమే చేసే జీవితం లేకపోతే నీ బ్రతుకు కూడా ఇదే
షారోను ఎడారిగా మారినట్లు నీవు కూడా లవొదొకయ సంఘము వలె, సార్ధీష్
సంఘమువలె మారిపోతావు
జాగ్రత్త!
ఐదు: ఇదే ఎడారిగా మారిపోయిన షారోను- ఆకోరుగా ఉన్న పొలాన్ని
మరలా దానిని నిజమైన షారోను లేక మేత పొలంగా మార్చుతాను అంటున్నారు యెషయా
65:10 లో నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱల మేతభూమియగును ఆకోరు
లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.
ఇది జరగాలంటే ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావాలి అంటున్నారు
యిర్మీయా 4 వ అధ్యాయములో! ఈ రోజు నామకార్ధ సంఘాలు ప్రభువు వైపు ఆయన
వాక్యము వైపు తిరిగి- లోకాచారాలు సంఘాల నుండి తీసివేసి పేరు కోసం
ఇంకా దేనికోసమో కాకుండా కేవలం వాక్య ఘనత కొరకు క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టే సంఘముగా
మారిపోతే దేవుడు ఆకోరు లోయను మేత భూమిగా మార్చగలడు! శ్రమలోయను
నిరీక్షణ ద్వారముగా చేయగలరు!
మరి నీవు ఏ విధమైన షారోను అనుభవములో ఉన్నావు!
సరిచూసుకో! సరిచేసుకో!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*24వ భాగము*
*బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో
నా ప్రియురాలు కనబడుచున్నది*
పరమగీతము
2: బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు
కనబడుచున్నది.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము! ఇక రెండో వచనములో
అంటున్నారు సోలోమోను గారు షూలమ్మితి కోసం బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు
స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.
బలురక్కసి చెట్లు అనగా ముళ్లచెట్లు. మన దేశంలో దీనిని బ్రహ్మ దండి, బ్రహ్మజెముడు మొక్క అంటారు!
ఈ బలురక్కసి మొక్క మొత్తం పచ్చగా ఉంటుంది. గాని
ఆకులు మన దేశంలో పచ్చగాను, పూలు పసుపుగాను ఉంటాయి. మరికొన్ని దేశాలలో ఆకులు గులాబీ రంగులోనూ పువ్వులు తెలుపు రంగులోనూ ఉంటాయి.
పచ్చ ఆకులు తెలుపు పూలు కూడా కలిగి ఉంటాయి కొన్ని దేశాలలో! గాని ఏ దేశమైనా చెట్టు మొత్తం ముళ్లతో నిండి ఉంటాయి! వీటినుండి ఆవాలు లాంటి విత్తనములు వస్తాయి! పొరపాటున
ఆవాలు అనుకుని కూరలో వేసుకున్నారా వెంటనే డ్రాప్సీ అనే ప్రాణాంత కరమైన వ్యాది సోకుతుంది!
దీని
సూటి ఆత్మీయ అర్ధం క్రీస్తు దృష్టిలో మనుషుల్లో అందంగా పరిమళంగా ఉన్నది ఆయన సంఘం మాత్రమే! ఇతరులంతా ముండ్లలాగా,
అంటే బాధకరంగా, వికారంగా, హానికరంగా ఉన్నారు (సంఖ్యాకాండము 33:55, ; న్యాయాధిపతులు 2:3, ; 2 సమూయేలు 23:6, ; యెషయా 24:4-5, ; యెషయా 33:12, ; మత్తయి 7:16, ; లూకా 8:14, ; హెబ్రీయులకు
6:8, ; రోమీయులకు 8:7-8, ).
సరే జాగ్రత్తగా గమనిస్తే మొదటి వచనంలో షారోను పొలములో పూసిన అందమైన
తెల్లని పుష్పముతో సంఘమును పోల్చితే ఈ రెండవ వచనంలో క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
సంఘము లోకములో మూర్ఖుల మధ్య పాపుల మధ్య హింసించు వారిమధ్య పవిత్రమైన జీవితం జీవిస్తూ
క్రీస్తు సువాసన వెదజల్లు తున్న పరిశుద్ధ సంఘమును సూచిస్తుంది! అదే బలురక్కసి
చెట్లలో ఉన్న వల్లి పద్మము!
మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని అపోస్టలుల కార్యముల మొదట్లో
అపోస్టలులు చెబితే- మీరు వక్రమైన మనుష్యుల మధ్య సత్యవాక్యము ఛేబూని జ్యోతుల
వలె కనబడు చున్నారు అని పౌలుగారు ఫిలిప్పీ పత్రికలో 2:16 లో చెబుతున్నారు!
ఇదే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము!
మొత్తానికి పాపలోకంలో పరిశుద్ద జీవితం జీవించే సంఘమే వల్లి పద్మము! వ్యక్తిగతంగా
చూసుకుంటే పాపులైన మీ ప్రజలమధ్య నీ ఇరుగుపొరుగు వారిమధ్య క్రీస్తు సువాసన వెదజల్లుతూ
దేవుని బిడ్డారా అంటూ పిలిపించు కుంటున్న ప్రతీ విశ్వాసి బలురక్కసి చెట్లలో వల్లి పద్మమును పోలి ఉన్నారు!
యాకోబు పత్రిక 1:17 లో భక్తికి నిర్వచనం చెబుతూ యాకోబు గారు
చివర్లో అంటున్నారు ఇహలోక మాలిన్యము తన ఘటముకు అంటుకోకుండా జాగ్రత్త పడటమే భక్తి!
పాపము నిన్ను అంటకుండా ఈ పాప లోకములో పరిశుద్ద జీవితం జీవించడమే బలురక్కసి
చెట్ల మద్య వల్లి పద్మముగా జీవించే అనుభవము!
నిజానికి జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు చేసిన సృష్టిలో మొదట్లో
ఈ ముల్లు చెట్లు లేనే లేవు! ఆదాము గారు పాపము చేసి అబద్దమాడిన తర్వాత దేవుడు భూమిని
శపించారు ఆదాము గారికోసం. అప్పుడు ఈ ముళ్లచెట్లు భూమిమీద వ్యాపించాయి!
కాబట్టి ఈ ముల్లు చెట్లు పాపమునకు ప్రతిఫలము అని గ్రహించాలి!
దీనికోసం
అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి గాని నా ఉద్దేశం ఇక్కడ స్పష్టముగా చెప్పడం జరిగింది ప్రియులారా!
ఇక కొంతమంది దీనికోసం షారోను అనగా దేవుని సంఘములో గుచ్చి గుచ్చి చేసే ప్రసంగాలు, ఖండించి గద్దించి బుద్ధి
చెప్పే ప్రసంగాలు విశ్వాసులకు ముల్లులా గుచ్చుకుంటాయి కాబట్టి ఆ ముళ్ళు దైవసేవకులు
విశ్వాసులకు అనుకూలం కానీ ప్రసంగాలుగా కొందరు అభిప్రాయ పడ్డారు! ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యముతో వీరికి ఏ సమస్యనో నాకర్ధం కాలేదు!
మరో వ్యాఖ్యానం:
నా ప్రేయసి అనబడే సంఘము , అనేకమంది స్త్రీలమధ్య నిలుచునివుంది.
అనేకమంది స్త్రీలు నా ప్రేయసిని పరివేష్టించి వున్నారు. ఆ దృశ్యం చూస్తే, అసంఖ్యాకంగా బలురక్కసి చెట్లు,
ఒక వల్లి పద్మాన్ని ఆవరించినట్లు కనిపిస్తున్నది.
నా ప్రియురాలు, వల్లి పద్మం అంత సుందరమైనది. ఆమె చుట్టూ నిలుచున్న ఆ స్త్రీలలో, నన్ను ఆకర్షించగలిగిన
సౌందర్యం ఎంతమాత్రమూ లేదు.
అనేకమంది స్త్రీలు - వారిమధ్య నా ప్రేయసి మాత్రం ఒక్కతే. అనేక మతాలు, అనేక సంఘాలు, మతశాఖలు
- ఇన్ని గుంపులమధ్య, నా వధువు సంఘం మాత్రం ఒక్కతే;
ఆమె సుందరి, ఆమె ఒక వల్లిపద్మం లాంటిది.
నా వధువు కానటువంటి సంఘాలున్నాయి - వాటికి నా వధువుకున్నటువంటి సౌందర్యమూ
పరిమళమూ లేవు. అవి నా దృష్టికి ముళ్ళకంపలు, బలురక్కసి చెట్లవంటివి.
అయితే పరమ పురుషుడనైన నన్ను ఆకర్షింపజేస్తున్న ఒక విశేషం ఏమిటంటే, ఎన్ని బలురక్కసి గుంపులు
తనని ఆవరించినా, నా ప్రేయసి ఇంకా తన సౌందర్యాన్ని, తన పరిమళాన్ని కోల్పోలేదు. ఆమె ఇంకా "వల్లిపద్మం" గానే మిగిలివుంది.
అవును, తన చుట్టూరా బలురక్కసి చెట్లవున్నంత మాత్రాన, వల్లిపద్మం
బలురక్కసి అయిపోలేదు. కొందరు విశ్వాసులు తమ ఆత్మీయ జీవితపు ఆరంభంలో
తమకుండిన సౌరభాన్నీ సౌందర్యాన్ని పోగొట్టుకుంటున్నారేమిటి? ఒకప్పటి
వల్లి పద్మం ఈనాటి బలురక్కసిగా మారిపోతున్నదేమిటి?
అయినా, ఎంతమంది మారిపోయినా, ఎన్ని రక్కసి వృక్షాలు ఆవరించినా,
తన ఆత్మ సౌందర్యం ఈ లోకం చేత ప్రభావితంకాకుండా కాపాడుకునేవాడే చివరకు
నా వధువులో నిలుస్తాడు. ప్రియ విశ్వాసీ! ఈ మాట విన్నావా! నీ చుట్టూవుండే వ్యక్తులనుబట్టి నీ అంతరంగ
స్వభావం ప్రభావితం కాకూడదు!!! ఇదీ మరో వ్యాఖ్యానం!
సరే ఏదిఏమైనా బలురక్కసి చెట్టు మొత్తం ముళ్ళు ఉన్నా గాని పద్మములో ఏ విధమైన
ముళ్ళు కూడా లేదు!
ముళ్ళు శాపమునకు సాదృశ్యం! ఈ పాపపు లోకంలో యధార్ధంగా
నడిచే విశ్వాసి జీవితంలో ఏవిధమైన శాపము కూడా ఉండదు అని ఈ అనుభవం నేర్పిస్తుంది!
లోయలలో పుట్టు పద్మము అనగా తగ్గింపు జీవితం గల జీవితము ఎంతో అందంగా పువ్వులా
ఉంటుంది! లోయ శ్రమలకు శోధనలకు కూడా సాదృశ్యం! కాబట్టి శ్రమల అడుగులలో నుండి సాగే క్రైస్తవ జీవితం వల్లి పద్మము లాంటిది అది
ఎంతో సుందరమైనది! కాబట్టి
ప్రియ విశ్వాసి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సాతానుడు నిన్ను ఎంత ప్రలోభపెట్టినా
నీవు నీ వ్యక్తిగత సాక్ష్యము కోల్పోకూడదు! విశ్వాసాన్ని వదలకూడదూ
అదే బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము లాంటి జీవితం!
అట్టి విశ్వాస జీవితం భక్తి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*25వ భాగము*
*అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో
నా ప్రియుడు అట్లున్నాడు*
పరమగీతము 2:3 అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు
ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము. ఇక మూడవ వచనములో మరలా షూలమ్మితి మాట్లాడుతుంది
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై
నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
దీని
సూటి ఆత్మీయ అర్ధం అడవి చెట్లు – కేవలం వాడిపోయి ఎండిపోయే పువ్వులాంటి వాడు కాదు క్రీస్తు.
యెష్షయి వేరునుంచి పెరిగిన పండ్ల చెట్టులాంటి వాడాయన (యెషయా 11:1, , యెషయా 11:10, ; యెషయా
53:2, ; రోమీయులకు 15:12, ).
ఆయన
ప్రజలకు ఆయనే నీడ (కీర్తనల గ్రంథము 91:1, ; కీర్తనల గ్రంథము
121:5, ; యెషయా 25:4, ; యెషయా 32:2, ).
ఆయన
జీవవృక్షం. ఆ వృక్షఫలం శాశ్వతమైన పాపవిముక్తి, ఆనందం, ఎన్నటికీ తరగని సంతృప్తి. ఆయన ఫలం మన నోటికి రుచించకుండా
పోయేంతగా మన కోరికలు ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా భ్రష్టమైపోయాయి.
ప్రియులారా! ఈ 3—7 వచనాలు షూలమ్మితి మాట్లాడుతుంది!
ఈ వచనాలలో షూలమ్మితి సోలోమోను రాజును ఎంతగా ప్రేమిస్తుందో ఆమె మాటల ద్వారా
వ్యక్త పరుస్తుంది! సంఘము కూడా మన ప్రేమను మన మాటల ద్వారా క్రియల
ద్వారా దేవునికి వ్యక్తపరచ వలసిన అవసరం ఉంది! జల్దరు వృక్షము
అనగా యాపిల్ చెట్లు! ఈ యాపిల్ చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది!
కాబట్టి షూలమ్మితికి సోలోమోను జల్దరు వృక్షపు వంటి వాడు! అలాగే సంఘమునకు క్రీస్తుయేసు యాపిల్ చెట్టు వంటి వానిలా అనగా అందముగా మరియు
ఆకలి తీర్చే ఆరోగ్యమైన ఫలములా ఉండాలి!
అందుకే
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నా యందు విశ్వాస
ముంచువారిని నేను తృప్తి పరుస్తాను అని
చెప్పారు! వానిలో నుండి జీవజల ధారలు పొంగుతాయి అని కూడా చెప్పారు! కీర్తన 107 లో అంటున్నారు 9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. ఇదే
దేవునిలో ఉండే యాపిల్ గుణము!
ఇక యెషయా 58:11, యిర్మీయా 31:14 లలో ప్రభువు తన కృప చేత మనలను తృప్తి పరుస్తాడని వ్రాయబడింది!
సరే, ముఖ్యంగా చూసుకుంటే అడవి చెట్లు విచ్చలవిడిగా అనేక విధాలుగా పెరిగియుంటాయి. వాటికి నిర్థిష్టత లేదు. ఈ అడవి చెట్లు ఈ లోకములోని దేవుళ్ళు
అనబడే వారు. వీరు ఈ సమాజములో ప్రపంచ నలుమూలల వెలుగొందుతున్న వృక్షములే
ఈ పురుషులు. వీటిలో జల్దరు
వృక్షము ప్రత్యేకింపబడి అడవి చెట్లలో కనిపిస్తుంది. ఈ వృక్షము ప్రతి విషయములోను ప్రత్యేకింపబడి
ఉంటుంది. అలాగే జల్దరు
వృక్షముగా పోల్చబడిన సంఘముయొక్క ప్రియుడు అనగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రియులుగా
పిలువబడుచున్న వారిలో ప్రత్యేకింపబడినవారు. అందువల్లనే క్రీస్తు ప్రభువు అకర్షణ వేరు. ఆయన ఇచ్చిన రక్షణ వేరు. ఈ లోకము క్రీస్తు ప్రభువువలె కనబడు
పురుషులు అనేకులు మేము నిజమైనవారమని చెప్పుకొను చున్నారుగాని వారి నుండి పాపికి రక్షణ
రాలేదు. అందుకే పురుషులలో
సంఘముయొక్క ప్రియుడు ప్రత్యేకింపబడి యున్నారు.
ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును
విశ్వాసి గుర్తిస్తాడో ముందు విభాగములో చెప్పుకొన్నట్లుగా ఆయన మంద అడుగుజాడలలో పయనించి,
ఆయన గుడారముల వద్ద మేయుచు వారిని అనుసరించి, చివరకు
బాప్తిస్మము పొంది నీతిని అనుసరించుట ద్వారా సంఘములో స్థానము పొందుట జరుగును. ఈ స్థానమును పొందుట వలన ఆ నల్లనిదానిలో
ఉన్న విశ్వాసి తాను పొందిన రక్షణ ఆనందమునకు పరమానందభరితమై మరల యెరూషలేము సంఘములో వధువుగా
మారి, ఆయన నీడన కూర్చుంటినని చెప్పుట జరిగింది. ఇంతవరకు అన్యదేవతల చెంత కూర్చున్న
ఈ నరుడే - ఇప్పుడు దానిలోని పాప జీవితమును వదలి బాప్తిస్మము ద్వారా
క్రీస్తు నీడన కూర్చునుట జరిగింది.
ప్రకటన 7:15, ''సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము
వారిమీద కప్పును;'' ఈ విధముగా తాను నిజదైవ సంఘములో
చేరుటన్నది క్రీస్తు ప్రభువు నీడలోకి వచ్చుటయే.
ఈ స్థితిలో - ''అతని ఫలము నా జిహ్వకు మధురము,'' అని విశ్వాసి చెప్పుటను
గూర్చి చదువగలము. క్రీస్తు
ప్రభువు ఈ లోకములో ప్రభువు బల్ల ఆరాధనను స్థాపించుట జరిగింది. ఈ ఆరాధనలో అర్పించు రొట్టె, ద్రాక్షారసములు క్రీస్తు
ప్రభువు శరీర రక్తములకు సమానము. దీనిని ఆయన తన శిష్యులకు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది క్రీస్తు ప్రభువు ద్వారా సంఘము
పొందిన ఫలము. దీని ద్వారా
మరో ఫలము రక్షణ రూపములో మనకు వచ్చింది.
ఇలాంటి ఫలమును మనము భక్తి విశ్వాసములతో నోటి ద్వారా పుచ్చుకొనుట
జరుగును. అందువలన రెండవ
ఫలమైన రక్షణను పొందుచున్నాము. ఈ రొట్టెను ద్రాక్షారసమును ఆరాధనలో ఆయనకు గుర్తుగా తీసుకొనుట విశ్వాసి నోటిలోని
జిహ్వకు అనగా నాలుకకు మధురమైనదని ప్రియురాలు చెప్పుట జరుగుచున్నది. ఆరాధన జరుగునప్పుడు రొట్టెను ద్రాక్షారసమును
పుచ్చుకొని దానిని ఎంతో పవిత్రతతో ఏకాగ్రతతో అన్నింటికన్నా మధురముగా పుచ్చుకొంటారు.
కనుక క్రీస్తు ప్రభువు ఈ లోకములో
మానవ జాతి కొరకు ప్రత్యేకింపబడినవారుగా రక్షకునిగా సంఘము గుర్తించినదని ఇందలి భావము.
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*26వ భాగము*
*అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో
నా ప్రియుడు అట్లున్నాడు*
పరమగీతము 2:3 అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు
ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము ఇక మూడవ వచనములో మరలా షూలమ్మితి మాట్లాడుతుంది
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై
నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
(గతభాగము తరువాయి)
ఇక జల్దరు వృక్షము కోసం చూసుకుందాం!
జల్దరు అనగా యాపిల్ పండ్లు లేక అత్తి పండ్లు ఆదరణకు గుర్తుగా ఉన్నాయి
పరమగీతము 2:5 ప్రకారం: 5 ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి
జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి.
దీని
ప్రకారం కేవలం ఆదరణ మాత్రమే కాకుండా అవి బలముకూడా ఇస్తుంది. కాబట్టి మొదటగా జల్దరు
పండ్లు ఆదరణ మరియు బలమునకు సూచనగా ఉన్నాయి! అలాగే యేసుక్రీస్తుప్రభులవారు
సంఘ విశ్వాసులనందరిని బలపరిచేవాడు మరియు ఆపదలలో నిరాశలలో దుఖాలలో శ్రమలలో ఆదరించే వాడు
బలపరిచేవాడు అని గ్రహించాలి! ఆపో కా 9:31 లో పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడని చూడవచ్చు! ఇంకా నీ వాక్యమే
నన్ను బలపరిచెను అని వ్రాయబడింది!
1 కోరింథీ 14:3 లో దేవుడు ఆదరించేవాడు అని వ్రాయబడింది కాబట్టి దేవుడు
లేక యేసుక్రీస్తుప్రభులవారు విశ్వాసులకు యాపిల్ పండు లాంటి వాడు ఆయన మన జీవితయాత్రలో
కలిగే కష్ట సుఖాలలో తోడుగా ఉంటాడు సరికదా మన ఆపద శోధన భాదలలో మనలను బలపరిచేవాడు ముఖ్యంగా
ఆదరించే వాడు!
ఇక
ఇదే పరమగీతము 7:8 లో
ఇదే జల్దరు పండు సువాసన అంటున్నారు. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది అంటున్నాడు సోలోమోను!
ఆవిధముగానే క్రీస్తుప్రభువే మన జీవితాలలో సువాసన తీసుకుని వచ్చేవాడు!
పాపపు దుర్వాసన లో ఉన్నప్పుడు తన సిలువరక్తముచేత కడిగి పవిత్ర పరచి నీతి
అనే వస్త్రాలు ఇచ్చి పరిమళ సువాసన వెదజల్లే దానికి పరిశుద్ధాత్మ మరియు ఆత్మ వరాలు ఫలాలు
ఇచ్చారు! వాటి ప్రకారం జీవించడం ద్వారా మనము క్రీస్తు సువాసనగా
లోకములో పరిమళిస్తాము. కాబట్టి మన మంచి ప్రవర్తన ద్వారా నీతికలిగిన జీవితం ద్వారా మనము క్రీస్తు సువాసన
వెదజల్ల గలము! సువాసన కరమైన జీవితాలు జీవించగలము!
రెండవదిగా
సువాసన కరమైన జీవితాలు ఫిలిప్పీ 4:18—19 వచనాలు
ప్రకారం క్రీస్తు కొరకు సువార్త పరిచర్య కొరకు ఖర్చుచేస్తే అవి దేవునికి సువాసన కరమైనవిగా
పౌలుగారు చెప్పారు!
18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను;
అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును
ఇష్టమునైన యాగమునై యున్నవి.
19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు
మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
ఇక
పరమగీతము 8:5 ప్రకారం ఈ జల్దరు నిరీక్షణకు సూచనగా ఉంది: 5 తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది
ఎవతె? జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి
నీవలన ప్రసవవేదన కలిగెను నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.
ఈ 8 వ అధ్యాయము వేయేండ్ల
పాలనకు సూచనగా ఉంది. ఈ జల్దరు వృక్షము క్రింద నిన్ను లేపితిని
అని దేవుడు చెబుతున్నారు. దీనిభావం సంఘము ఎత్తబడ్డాక పడిపోయిన
ఇశ్రాయేలు జాతిని లేపి వేయేండ్ల పాలనలో మరలా ఘనతను ఇచ్చే మాటలే ఇవి! ఈ దినాలలో పడిపోవు వారినందరిని ఆయన లేవనెత్తుతారు!
ఇక
సామెతలు 25:11 లో
ఈ జల్దరు విలువైనది: 11 సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి
పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది. తెలుగులో బంగారు పండ్ల వంటిది
అని తర్జుమా చేయబడింది గాని ఇంగ్లీష్ లో చూసుకున్నా ప్రాచీన ప్రతులు చూసుకున్నా బంగారు
యాపిల్ పండ్ల వంటివి అని తర్జుమా చేయబడింది! కాబట్టి జ్నానయుక్తమైన మాటలు ఎంతో విలువగలవి అయితే
ఆ జ్నానము యేసుక్రీస్తుప్రభులవారు బోధించారు! సర్వ జ్నానము సర్వ
సంపదలు ఆయన లోనే ఉన్నాయి! అలాగే విశ్వాసులు మాట్లాడే మాటలు బంగారు
యాపిల్ పళ్ళు వలె ఉండాలి!
చివరిగా
ఈ జల్దరు అనుభవము దుఖము నకు సూచన యోవేలు 1:12 ప్రకారం! దేవుని ప్రజలు చేసిన తప్పు పనుల
వలన దేవుణ్ణి దూరం పెట్టి లోకముతో స్నేహం చేసినందు వలన దేవుడు కోపించి తన ఆశీర్వాదాలు
దీవెనలు వర్షము ఇవ్వడం మానేశారు. పంటలు పండలేదు. ఈ యాపిల్ చెట్లు మాడిపోయాయి
వాడిపోయాయి! కాబట్టి విశ్వాసులు దేవునిమీద నమ్మకముంచి ఆయన లోనే
సాగాలి తప్ప లోకాశల పట్ల తిరిగితే ఇదే జల్దరు అనే దుఖము రాగలదు జాగ్రత్త!
కాబట్టి
నీకు ఆదరణ బలము కావాలన్నా నీచేతిలోనే ఉంది, నిరీక్షణ కావాలన్నా నీ చేతిలోనే ఉంది.
దుఖము కావాలన్నా నీ చేతిలోనూ ఉంది! ఏది కావాలో
నిర్ణయం చేసుకో!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*27వ భాగము*
*ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు
మధురము*
పరమగీతము 2:3 అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు
ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము మనము
ఇక మూడవ వచనములో మరలా
షూలమ్మితి మాట్లాడుతుంది అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు
అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
(గతభాగము తరువాయి)
ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము అంటుంది
షూలమ్మితి!!
ఆనందం పొంగిపోయి అతని నీడలో నేను కూర్చున్నాను అంటుంది. అనగా ప్రియుడు ఎండలో కూర్చున్నాడు! అతని నీడలో ప్రియురాలైన
సంఘము కూర్చొంది. నేడు సంఘము క్రీస్తు నీడలో లేక క్రీస్తు రెక్కలో
నీడలో కూర్చోవలసిన అవసరం ఎంతైనా ఉంది! ఇది దావీదు గారికి బాగా
తెలుసు అందుకే కీర్తనల గ్రంధంలో అనేకసార్లు నీ రెక్కల నీడలో నన్ను ఉంచు అనియు నీ రెక్కల
నీడకు వచ్చాను అనియు చెబుతున్నారు!
కాబట్టి విశ్వాస
యాత్రలో ఉన్న ప్రతీ విశ్వాసి క్రీస్తు నీడకు చేరాలి! ఆయన రెక్కల
నీడలోనే ఆశీర్వాదము ఆదరణ నీడ నెమ్మది విశ్రాంతి దొరుకుతుంది!
ఆయన జీవవృక్షం. ఆ వృక్షఫలం శాశ్వతమైన పాపవిముక్తి, ఆనందం, ఎన్నటికీ తరగని సంతృప్తి. ఆయన ఫలం మన నోటికి రుచించకుండా పోయేంతగా మన కోరికలు ఈ లోకంలోని చెడు ఫలాల మూలంగా
భ్రష్టమైపోయాయేమో ఒకసారి పరిశీలన చేసుకో!
కీర్తన 17:9 లో 9 ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను
పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండను నీ రెక్కల నీడక్రింద
నన్ను దాచుము అంటున్నారు! దుష్టులు చుట్టుముట్టి నప్పుడు దావీదు గారు అంటున్నారు అయ్యా నీ కనుపాపను కాపాడినట్లు
నన్ను కాపాడు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు ప్రభువా అంటున్నారు! సాతాను నుండి శత్రువుల నుండి రక్షణ కోసం మనం చేరవలసింది ఆయన రెక్కల నీడకు!
మరి ఆ విధంగా వేడుతావా నీవు!
కీర్తన 36:7 లో 7 దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను
ఆశ్రయించుచున్నారు. దైవ భయము లేని మనుష్యులు దండెత్తి నప్పుడు ఈ కీర్తన వ్రాసి అందులో చెబుతున్నారు
దేవుడితో అయ్యా నీ కృప ఎంతో అమూల్యమైనది కదా అందుకే నేను నీ రెక్కల నీడను ఆశ్రయించు
చున్నాను అంటున్నారు! అవును మనము కూడా దేవుడంటే భయపడని శత్రువులు వచ్చినప్పుడు ఆశ్రయించ వలసినది దేవుని రెక్కలు మాత్రమే! ఆయన రెక్కల నీడ మాత్రమే! అయితే విచిత్రముగా ఆయన రెక్కల
నీడ దేవుని సన్నిధి లేక దేవుని మందిరమే అంటూ తర్వాత వచనంలో చెబుతున్నారు దావీదు గారు!
8 నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి
నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు
చున్నావు. మరినీవు మందిరము నీకు ఇంపుగా ఆశ్రయముగా చేసుకున్నవా?
కీర్తన 57:1 లో: నన్ను
కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు
నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను. ఇక్కడ ఈ ఆపదలు తొలిగిపోయే వరకు నీ రెక్కల
నీడను నేను శరణు జొచ్చి ఉన్నాను అంటున్నారు దావీదు గారు! ఆయన జీవితంలో అనేకమంది
చంపడానికి ప్రయత్నం చేశారు- విచిత్రముగా అందరూ ఆయన సొంతవారే ఎక్కువ!
మొదటగా ఆయనకు పిల్లనిచ్చిన మామగారు సౌలురాజూ, రెండవది
స్వంత కొడుకు అబ్షాలోము. ఇంకా దావీదు గారు చెబుతున్నారు తనతోపాటు
తిన్న వారు తనతో పాటు దేవుని మందిరానికి వచ్చిన వారే తనను చంపాలని చూశారు! అప్పుడు దావీదు గారు దేవుని రెక్కలనే శరణు అడిగారు తప్పించబడి రక్షించ బడ్డారు! నీవు అలాగే అడగాలి- ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల
నీడను శరణుజొచ్చి యున్నాను.
కీర్తన 63:7 ప్రకారం 7 నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. ప్రమాధాలలో ఉన్నప్పుడు
దేవుని రెక్కల నీడను ఆశ్రయించాడు భక్తుడు!
కీర్తన 91:1లో 1 మహోన్నతుని చాటున నివసించువాడే
సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
2 ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని
నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
సర్వశక్తుని
నీడను ఆశ్రయించి నప్పుడు ఏ నరమానవుడు ఏ సాతాను శక్తి అంధకార శక్తి మనలను తాకలేదు! ఆయన నీడలోనే విశ్రాంతి
తీసుకోవాలి విశ్వాసి!
యెషయా
గ్రంధంలో కూడా దేవుని రెక్కల నీడలో ఆశ్రయము తీసుకోమని చూస్తున్నాము! 4:6, 25:3, 32:2 లో!
సరే, ఇలా ఆయన రెక్కల నీడలో
ఆశ్రయము పొందిన తర్వాత ఆయన నిన్ను ఊరికినే వదలరు! అతని ఫలము నా
జిహ్వకు మధురము. అనగా దేవుడు లేక ప్రియుడు మనకు తన విలువైన ఫలములు
తినిపిస్తారు! గలతీ 5లో ఆ ఫలము కనిపిస్తుంది
22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశా నిగ్రహము.
ఇంకా
నిన్ను వరములతో ఫలములతో ఆశీర్వాదాలతో అభిషేకములతో నిన్ను నింపి నిన్ను ఫలింప జేసి నిన్ను
పరమునకు చేర్చుతారు! మరి నీవు ఆయన రెక్కల నీడకు వస్తావా? ఆయనను ఆశ్రయిస్తావా?
లేక లోకాన్ని ఆశ్రయిస్తావా?
తేల్చుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*28వ భాగము*
*అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను*
పరమగీతము 2: 4 అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను
నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానమూ చేస్తున్నాము మనము ఇక 4 వ వచనములో
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అంటున్నారు!
“విందుశాల”– అనగా కీర్తనల
గ్రంథము 23:5, నా శత్రువుల యెదుట
నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
;
ప్రకటన గ్రంథం
3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు
వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. . దేవుని కుమారుడు ఇచ్చే
విందు ఎలా ఉంటుందో చేతనైతే ఊహించుకోండి.
“ప్రేమను పతాకంగా లేక ద్వజముగా”– పతాకం అంటే గర్వంతో లేక
ఉత్సాహంతో అందరికీ కనిపించేలా ఎత్తేది, స్పష్టంగా వెల్లడి అయ్యేది
(రోమీయులకు 5:8, ; గలతియులకు 2:20, పోల్చిచూడండి). క్రీస్తు తన పట్ల చేసేవాటన్నిటిలోనూ ప్రేమ
స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.
ఈ వచనములో - నన్ను, అని ఏక వచనముతో
విశ్వాసిని గూర్చి చెప్పబడింది. ఈ విశ్వాసులందరిని కలిపి వధువు అని మరల ఏక వచనముతోనే సంబోధించబడుచున్నది. ఎందుకు? జీవాత్మ ఒకటే. దాని అణువులు మనలో నివసించుచున్నవి. కనుక మనమంతా జీవాత్మలోని
భాగమే. క్రీస్తు ప్రభువు
ఈ లోకములో క్రైస్తవ సంఘమును ఏర్పరచుటద్వారా మరల అనేకులు రక్షణలోకి వచ్చుట జరిగింది. అలాగే ప్రభువు ప్రభురాత్రి భోజనమును
ఏర్పాటు చేయుట ద్వారా దేవుని వాక్యమనే క్రీస్తు ప్రభువు ఫలమును మనము పొందుచున్నాము.
అయితే ఈ ప్రభువు బల్ల ఏర్పాటు చేయుటకు క్రీస్తు ప్రభువు ఆదేశించిన తరువాత
వారు పట్టణములో ప్రవేశించి, ఒక ఇంటిలో పస్కా విందుకు సిద్ధమైయ్యారు.
లూకా
22:10-13, ''ఆయన-ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు
నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు
ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి -నేను నా శిష్యులతో కూడ
పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో
చెప్పుడి. అతడు సామాగ్రిగల
యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో
చెప్పెను. వారు వెళ్లి
ఆయన తమతో చెప్పినట్టుకనుగొని పస్కాను సిద్ధపరచిరి.'' ఈ విధముగా విందును సిద్ధపరచిన తరువాత క్రీస్తు ప్రభువు విందుశాలకు
అప్పటికి వధువు సంఘములో ఉన్న తన శిష్యులను తోడ్కొని వెళ్లాడు.
అక్కడ ప్రభువుయొక్క శరీర ఫలమును ప్రతిష్ఠించుట జరిగింది.
లూకా
22:14-20, ''ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని
కూర్చుండిరి. అప్పుడాయన-నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు
ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి-మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి;
ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి,
వారి కిచ్చి- ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము;
నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు
పట్టుకొని- ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన
క్రొత్త నిబంధన.'' ఈ విధముగా ప్రియురాలుగా ఉన్న
శిష్యులను విందుశాలకు క్రీస్తు ప్రభువు ప్రియుడుగా కొనిపోయాడు. తనయొక్క మహిమ శరీర ఫలమును ప్రతిష్ఠించి దానిని ప్రియురాలి జిహ్వకు మధురముగా
ఒసగుట జరిగింది.
అటుతరువాత సంఘముపై అనగా తన
ప్రియురాలిపై తనకున్న ప్రేమను ఆయన ధ్వజముగా ఎత్తెను అని వ్రాయబడింది. ధ్వజము అనగా కటవుట్ బ్యానర్ అని గాని అంటారు. ఈ ధ్వజమన్నది స్తంభము రూపములోను లేదా
సైన్యము ముందు వరుసలో పైకెత్తబడిన జెండా రూపముగాను ఉంటుంది. ఈ ధ్వజ స్తంభము నాటిన దగ్గరకు సైన్యములుగాని
విగ్రహారాధికులుగాని కూడుకొను ప్రదేశమైయున్నది. క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క
సిలువ నెత్తికొని ప్రభువును వెంబడించాలని మత్తయి 16:24 వివరిస్తున్నది. ఇందునుగూర్చి అందరికి తెలిసిన విషయమే ప్రభువు బల్ల ఆరాధనను ఏర్పరచిన తరువాత
ఆయనను పట్టించుటకు యూదా ఇస్కరియోతు వెళ్లిపోతాడు. లూకా
22:21-23, ''ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు
పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు-ఈ పనిని
చేయబోవువాడెవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి.'' ఇలా వెళ్లిన యూదా ఇస్కరియోతు యాజకులతో ఒప్పందం కుదుర్చుకొని ఆయనను పట్టించుట
జరిగింది. ఆ తరువాత వారు
ఆయనను దోషిగా తీర్పు తీర్చి సిలువకు గొట్టి చంపారు. ఇది ఒక కోణము.
రెండవ కోణములో దేవుడు క్రీస్తు ప్రభువును సకల మానవాళి పాప పరిహారము కోసము రక్షకునిగా
సిలువ బలియాగము చేయుటకు పంపాడు. ఇలా వచ్చిన క్రీస్తు ప్రభువు సంఘమును ఎంతగానో
ప్రేమించెను గనుక తన ప్రేమను సిలువ రూపములో తన మరణము వరకు చూపారు. ధ్వజస్తంభము అంటే గృహానికి లేక మందిరానికి
ఆధారమైన స్తంభము అని అర్థము లేక ప్రత్యేకింపబడిన స్తంభమని, అలాగే
ధ్వజముగా తన ప్రేమను క్రీస్తు ప్రభువు ఎత్తెను. ఎలా? సంఘము కోసము పాపములోని వారి రక్షణ
కొరకు ఆయన సిలువపై మరణించునప్పుడు కూడ పాపపు నరులపై ప్రేమను చూపుచు రక్షణకు మూలమైన
ధ్వజస్తంభము అనగా సిలువ మ్రానుపై చూపుట జరిగింది. ఈ విధముగా క్రీస్తు ప్రభువు తన రక్షణను
సంఘమునకు ఇచ్చి తన ప్రేమలో సంఘమునకు ఎంత స్థానమున్నదో చూపబడింది. అంతేకాకుండా ఆ సిలువమీద
INRI అని వ్రాయడం జరిగింది అనగా ఈయన నజరేయుడైన యూదులకు రాజు అని!
అయితే ప్రకటన గ్రంధములో టెక్కేములు పట్టుకున్న సైన్యము కనిపిస్తుంది
యేసుక్రీస్తుప్రభులవారికి రాజుల రాజు ప్రభువులకు ప్రభువు అనే టెక్కేము కనిపిస్తుంది! అందుకే పౌలుగారు ఒక మహత్తరమైన మాట
అన్నారు 2 కోరింథీ 2:14 లో 14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు
ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
దేవునికే మహిమ!!
హల్లెలూయ!!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*29వ భాగము*
*ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల
యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి*
పరమగీతము 2:5
ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు
పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి
ప్రియులారా! ఇక 5వ
వచనం చూసుకుంటే ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల
యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి అంటుంది షూలమ్మితి.
ఇది
బహుశా సంపూర్ణమైన క్రీస్తు ప్రేమానుభవానికి మానవ స్వభావం తట్టుకోలేక పోవచ్చు. ఇతరులు (జెరుసలం కుమార్తెలు) చేసే ప్రయత్నాల వల్ల ఇలాంటి అనుభవాలు
రావు. క్రీస్తు నియమించే సమయంలోనే ఆయన పద్ధతి ప్రకారమే అవి కలగగలవు.
నిజానికి ఇవి షూలమ్మితి మాటలు, కారణం ఆమె జీవితాన్ని సోలోమోను
సమృద్ధితో నింపేశాడు. ఆమె జీవితాన్నే విందు శాలగా మార్చేశాడు,
అలాగే ఇశ్రాయేలు జాతిని దేవుడు అన్య జనాంగము నుండి ఏర్పరచుకుని తన సొత్తుగా
మార్చి, శత్రు బానిసత్వము నుండి విడుదల చేసి దావీదు మరియు సోలోమోను
రాజు ఏలుబడిలో వారి జీవితాన్ని ఆనందముతో మరియు విందుశాలగా మార్చివేశారు! అదేవిధంగా విశ్వాసి జీవితంలో క్రీస్తుయేసు ఒకనాడు మరణపు వాసనతో పాపాంధకారంలో
ఉన్నప్పుడు క్రీస్తుయేసు దరికి వచ్చి తన రక్తముతో కడిగి విమోచన దయచేసి తనతో సహవాసం
చేసేవారిగా మార్చి కావలసిన భౌతిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో నింపి వారి జీవితాన్ని విందుశాలగా
మార్చివేసి ఉన్నారు! నిజానికి విశ్వాసులు పొందుకున్న రక్షణ భాగ్యమే
వారి జీవితాలలో పెద్ద విందుశాలగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుప్రేమతో నిండిపోయిన
విశ్వాసి ఆ ప్రేమాతిశయముతో నిండిపోవాలి! ఆయనని మర్చిపోలేనంతగా
ప్రేమించాలి! ఆయనను ఎల్లప్పుడూ ఆశించేవారిగా ఉండాలి. అయితే మన విశ్వాస జీవితంలో ఏమేమి ఆశించాలో బైబిల్ లో చెబుతున్నారు!
కీర్తన 42:1—2 లో అంటున్నారు కోరహు కుమారులు 1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా,
నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల
దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
ఇదీ
నిజమైన విశ్వాసి యొక్క ఆశ-
అభిలాష!! మరి నీకు ఉందా!!!
కీర్తన 63:1—2 లో దావీదుగారు అంటున్నారు 1 దేవా, నా దేవుడవు నీవే,
వేకువనే నిన్ను వెదకుదును
2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు
నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న
దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము
కృశించుచున్నది.
ఇక్కడ
దావీదు గారు దేవుణ్ణి చూడాలని ఆయన ప్రేమను రుచి చూడాలని ప్రేమాతిశయముతో మూర్చిల్లు
తున్నారు! ఆయన సన్నిధి కొరకు ఎదురుచూస్తున్నారు!
119:174 లో భక్తుడు యెహోవా, నీ
రక్షణకొరకు నేను మిగుల ఆశపడు చున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఇక్కడ దేవుని వాక్యము కొరకు ఆశ నిలుపుతున్నాడు
143:6 లో దావీదుగారు అంటున్నారు 6 నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ
పడుచున్నది.
ఇదీ
దేవుని కొరకు- దేవుని ప్రేమ కొరకు ఆయన సన్నిధి కొరకు ఆయన వాక్యము కొరకు ఎదురుచూస్తూ ప్రేమాతిశయముతో
మూర్చిల్లే అనుభవము! ఈ అనుభవము ప్రతీ విశ్వాసి అనుభవించాలి!
మరి
నీవు అనుభవిస్తున్నావా?
ఇంకా కొంచెము వివరంగా ఆలోచన చేస్తే ఇలాంటి
స్థితికి చేరిన ప్రియురాలైన సంఘమును ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడని,
జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడు అని ప్రియురాలు చెప్పుచున్నది. అంటే క్రీస్తు ప్రభువు బలియాగము జరిగిపోయింది.
ఆయనను సమాధి చేశారు.
సంఘము మూర్ఛిల్లు స్థితిలో ఉన్నది. ఈ స్థితిలో సంఘము తిరిగి శక్తిని
పొందుటకు ద్రాక్షపండ్ల యడలును, జల్దరుపండ్లను పెట్టుమని కోరుకొనుచున్నది.
జల్దరు పండ్లు అనగా యాపిల్స్ అని గతంలో చూసుకున్నాము!. యోవేలు 1:12లో ఆహారమునకు ఆరోగ్యమునకు యోగ్యమైన పండ్లలో ఇది యొకటి - ఆహారమునకు యోగ్యమైనదని చూచుటకు అందమైనదని ఆదికాండము 3:6 వివరిస్తున్నది. ఈ కోరుకొనుచు రహస్యస్థితిలో ఆనాటి శిష్యులు
ప్రార్థించారు. క్రీస్తు
ప్రభువును గూర్చి సంఘము రోదించింది.
ఆదివారము తెల్లవారు జామున క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై మగ్దలేనే
మరియకు ఆ తరువాత శిష్యులందరికి ప్రజలకు కనిపించాడు. వారితో కూడ 40 రోజులు ఉన్నారు. ఈస్థితిలో ప్రభువు వారి ముందు రొట్టెను విరిచి ద్రాక్షారసమును పంచి వారికి
మరల తన పునరుత్థానమును గూర్చి గుర్తుకు వచ్చేటట్లు చేశాడు. లూకా 24:28-35, ''ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు
అగపడగా వారు-సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు
గ్రుంకినది, మాతో కూడ ఉండుమని చెప్పి, ఆయనను
బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు,
ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు-ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము
మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకండు గురు శిష్యులును
వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి -ప్రభువు నిజముగా లేచి సీమోనునకు
కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన
తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.''
ఈ విధముగా క్రీస్తు ప్రభువు సంఘము ద్రాక్షపండ్ల యడలుతో చేయబడిన
రసమును తన రక్తముగా జల్దరు పండ్లు అనగా తన శరీరమును రొట్టెగా వారికి పంచి తిరిగి వారిని
బలపరచుట జరిగింది. అడవిచెట్లలో
జల్దరు చెట్టుగా క్రీస్తు ప్రభువును పరమగీతములోనే వర్ణించాడు. కనుక క్రీస్తు ప్రభువు శరీరము ఆహారమునకు మంచివియైన జల్దరు పండ్లతో పోల్చబడి
ద్రాక్షపండ్ల యడలును తెచ్చి ద్రాక్షారసముగా మార్చి, దానిని ఆయన
రక్తమునకు పోల్చి క్రీస్తు
ప్రభువే స్వయముగా గుర్తు చేయుట ద్వారా మూర్ఛిల్లు స్థితిలో ఉన్న సంఘమును తిరిగి బలపరుచుట
జరిగింది. ఈ విధముగా
దేవుని ప్రేమ వలన సంఘము తిరిగి నిర్మించబడి పాపికి రక్షణ లభించింది.
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*30వ భాగము*
*అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను
కౌగిలించుచున్నాడు*
పరమగీతము 2:6
అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.
ప్రియులారా! ఇక 6వ
వచనం చూసుకుంటే అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు
నన్ను కౌగిలించుచున్నాడు
నిజానికి
ఇదే వచనాలు మరలా 8:3—5 వచనాలలో కూడా చెప్పడం
జరిగినది.
యెషయా
గ్రంధంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అంటున్నారు 54: 4 భయపడకుము
నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము
చేసికొనవు.
5 నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు
యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు
సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
6 నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన
భార్యను పురు షుడు రప్పించినట్లును తృణీకరింపబడిన ¸°వనపు భార్యను పురుషుడు
రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో
నిన్ను సమకూర్చెదను
8 మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
9 నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును
జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద
కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా
కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా
సెలవిచ్చు చున్నాడు.
11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా,
నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును
62: 4 విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను
నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును.
యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.
5 యవనుడు కన్యకను వరించి పెండ్లిచేసికొనునట్లు నీ కుమారులు
నిన్ను వరించి పెండ్లిచేసికొనెదరు పెండ్లికుమారుడు పెండ్లికూతురినిచూచి సంతోషించు నట్లు
నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
సరే, ఇప్పుడు సంఘ కోణములో
చూసుకుందాము!
ఇలా
ఎవరు చేస్తారు అంటే మొదటగా
: తల్లి తన చంటి బిడ్డను ఎడమచేతితో బిడ్డ తల క్రింద పెట్టి ఎత్తుకుంటుంది.
కుడిచేతితో కౌగలించు కుంటారు. గనుక ఇలా ఎత్తుకునేది
ముద్దాడేది మొదటగా దేవుడు అని గ్రహించాలి! యెషయా 49: 15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా?
వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.
16 చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను నీ
ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
ఇక రెండవది:
ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని కూడా ఇలాగే ముద్దుపెట్టు కుంటాడు!
నిజానికి ఇవి షూలమ్మితి మాటలు, ఇక్కడ సోలోమోను
కోసం చెబుతూ సోలోమోను తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడో గుర్తుకు తెచ్చుకుని పరవశించి
చెబుతున్న మాటలు! అలాగే క్రీస్తు-ఆయన రక్తము
కార్చి మనలను విమోచించాక సంఘము స్వయముగా గుర్తు చేసుకోవడం
ద్వారా మూర్ఛిల్లు స్థితిలో ఉన్న సంఘమును తిరిగి తన దగ్గరకు తీసుకుని క్రీస్తు బలపరుచుట జరిగింది. ఈ విధముగా దేవుని ప్రేమ వలన సంఘము
తిరిగి నిర్మించబడి పాపికి రక్షణ లభించింది.
ఇలాంటి స్థితిలో ప్రియుడు ప్రియురాలైన
సంఘమును యెడమ చెయ్యి ఆమె తల క్రింద నుంచాడు. కుడిచేత ఆమెను కౌగిలించుకొన్నాడని
వ్రాయబడింది. మత్తయి 25:31, 33-34, 41,
''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు
ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. . . . తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని
చూచి-నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన
రాజ్యమును స్వతంత్రించుకొనుడి. . .
. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని
చూచి-శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని
వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.'' ఇందులో ఎడమ చేతివైపు శపింపబడినవారును పాపులును ఉన్నారు. మన మూలవచనములో ప్రియుడు ప్రియురాలిని
రెండు చేతులతో పట్టుకొనుచు ఎడమ చేతిని తల క్రింద కుడిచేత ఆమెను కౌగిలించుకొన్నాడు అంటే
తల వెనుక ఎడమ చేయి వచ్చినప్పుడు, సంఘమను ప్రియురాలు ఎడమ చేతికి
క్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్నది. కుడిచేత ఆమెను కౌగిలించుకొనెను అనుటలో ఆ ఎడమ చేతికి క్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్న వారందరు పరిశుద్ధులును
ఆశీర్వదింపబడినవారు కనుక ఆయన కుడిచేతితో వారిని ఆశీర్వదించుచున్నారు. అలాగే ఎడమ చేతితో పట్టుకొవాలంటే చేయి
కుడివైపుకు వస్తుంది. కనుక వారు ఎడమ చేతి వైపువారు కారు.
కుడివైపు వారినే ఆయన పట్టు కొనుటయు కౌగిలించుకొనుటలో జరిగింది. అలాగే ఎడమ చేయి ప్రియురాలి తల వెనుక
భాగమున ఉంచుటనుబట్టి సంఘమునకు ఆశీర్వదింపబడినవారికి అది చిహ్నముగా ఉండి ఆ చేయి నుండి
అవతల ప్రక్కన ఉన్నవారు శపింపబడినవారుగాను కుడిచేత కౌగిలించుకొన్నవారు ఆశీర్వదింపబడినవారుగా
మనము గుర్తించాలి.
ఈ విధముగా క్రీస్తు ప్రభువు
తిరిగి సంఘమును బలపరచుట జరిగింది. నశింపు స్థితిలో ఉన్నవారికి రక్షణను ఇచ్చుట జరిగింది దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*31వ భాగము*
*యెరూషలేము కుమార్తెలారా, పొలములోని
యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు*
పరమగీతము 2: 7.యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని
ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
ప్రియులారా! ఇక 7వ
వచనం చూసుకుంటే 7. యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని
ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను
అంటుంది షూలమ్మితి!
అనగా
ఇక్కడ ఈ యెరూషలేము కుమార్తెలు షూలమ్మితి ప్రేమను భంగ పరచువారుగా కనిపిస్తున్నారు! అయితే దీనికోసం గతంలో
ధ్యానం చేసుకున్నాము!
ఇక్కడ
ఇర్రులు లేళ్ళు అంటున్నారు గాని నిజానికి అవి లేళ్లను బట్టియు దుప్పులను బట్టియు అని
మన అచ్చమైన తెలుగులో అర్ధము! ఇవి బైబిల్ లో అందమైన సాధు జంతువులు!! ఆత్మీయ అర్ధములో చూసుకుంటే
మొదటగా: యెరూషలేము కుమార్తెలు షూలమ్మితి
ప్రేమకు ఆటంకం కలుగజేస్తున్నారు గాని ఈ లేడి దుప్పుల కోసం చూసుకుంటే వీరు – దేవుణ్ణి
ఆశించే వారు- ఆయన వాక్యము కోసం ఆశించేవారు కీర్తన 42 ప్రకారం: దుప్పి
నీటి వాగుల కోసం ఆశించినట్లు నేను నీకోసం చూస్తున్నాను అంటున్నాడు భక్తుడు!
అనగా దుప్పి అనుభవం దేవుని వాక్యము కోసం ఆయన సన్నిధి కోసం ఎదురుచూసే
అనుభవం ! అందుకే షూలమ్మితి లేడి తోను దుప్పితోనూ ప్రమాణం చేయిస్తుంది!
రెండవదిగా లేవీకాండం 11:3 లో లేడికి నెమరు వేసే అనుభవం
ఉంది, చీలిన డెక్కలు ఉన్నాయి! ఇవి పరిశుద్ధమైన
జంతువులు! అలాగే దేవుని బిడ్డలకు చీలిన డెక్కలు గల పరిశుద్ధమైన
ప్రత్యేకించబడిన అనుభవం కావాలి! అన్యులు చేసినట్లు దేవుని విశ్వాసులు
చేయకూడదు! అన్యులు చేసిన ఆచారాలు- ఇవి భారత
దేశ ఆచారం అంటూ పనికిమాలిన డైలాగులు కొట్టి ఆ ఆచారాలు సంఘచారాలుగా చేయకూడదు!
అన్యులు తాగినట్లు త్రాగ కూడదు, అన్యులు చేసినట్లు
వ్యభిచారం అబద్దాలు మోసాలు హత్యలు, రాజకీయాలు కుతంత్రాలు కల్మషాలు
ఉండకూడదు. పరిశుద్ధమైన ప్రత్యేకించబడిన అనుభవం కావాలి!
మూర్కులయిన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని అపోస్టలుల మొదటి ఆజ్న ప్రకారం
జీవించాలి! ఇంకా నెమరు వేసే అనుభవం అనగా విన్న వాక్యమును జ్నాపకం
చేసుకుని ధ్యానం చేసే అనుభవం ఉండాలి!
ఇక 2 సమూయేలు
2:18, 22:34; 1 దిన వృత్తా 12:8,9; హబక్కూకు
3:9 ప్రకారం లేళ్ళు దుప్పులు త్వరగా పరుగెత్తుతాయి- అలాగే విశ్వాసి దేవుని పనికోసం సువార్త కోసం ఆరాధన కోసం పరిచర్య కోసం పరుగెత్తే
అనుభవం కలిగి ఉండాలి!
సరే, ఇక పాఠానికి వచ్చేద్దాం!
''యెరూషలేము
కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులను బట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు
కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.''
నల్లనిదియైన బబులోనువలె ఉన్న
సంఘమునకు మారుమనస్సుకు
క్రీస్తు ప్రభువు అవకాశము ఇచ్చారు.
అయితే అప్పటికే క్రీస్తు ప్రభువులో ఉన్న వారి స్థితి ఏమిటి? తాను సిలువ బలియాగము చేసి పాపములో
మ్రగ్గుచున్న సంఘమైన బబులోనుకు అనగా అన్యులకు రక్షణ అవకాశమును ఇచ్చాడు. సిలువ బలియాగము ద్వారా ఇరువర్గాల ప్రియురాళ్లకు రక్షణ అనుగ్రహించాలి. పాపములో ఉన్న యెరూషలేము కుమార్తెలకు రక్షణ ఇచ్చాడు. అన్యురాలైన బబులోనుకు రక్షణ ఇచ్చాడు. ఇచ్చిన రక్షణ అప్పటికప్పుడు ఇశ్రాయేలు
జాతి పొందినారు. పునరుత్థానముద్వారా
లేచి పరిశుద్ధ పట్టణములో కనిపించారు.
మత్తయి 27:50-53, ''యేసు మరల బిగ్గరగా కేకవేసి
ప్రాణము విడిచెను. అప్పుడు
దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను;
బండలు బద్దలాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికివచ్చి ఆయన
లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.'' వీరందరు యెరూషలేము కుమార్తెలే కాని
వీరికి ఉన్న బంధకము వలన ప్రభువునకు ముందుగా పునరుత్థానమును పొందలేక ఆకాశ మధ్యమములో
పరదైసులలో ఉండిపోయారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు తిరిగి పునరుత్థానము ద్వారా లేచాడో వారికి ఆ బంధకాలు
తొలగి పరిశుద్ధులు తమ తమ సమాధుల వద్ద నుండి పునరుత్థానములో పాలివారై క్రీస్తు ప్రభువు
తరువాత తిరిగి లేచి జీవములో ప్రవేశించుట జరిగింది.
కాని అన్యురాలుగా ఉన్న బబులోనుకు
క్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణను వారు కూడ పొందారు. కాని వారిలో ఎందరు విశ్వాసులుగా మారారు? ఎందరు రక్షణలోకి వచ్చారు? లూకా 15:3-7, ''అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను -మీలో ఏ మనుష్యునికైనను
నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో
విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని
తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి -మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని
వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు
సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.'' కనుక క్రీస్తు ప్రభువు రక్షణను రుచి
చూచి అన్యురాలుగా ఉన్న నల్లనిదియైన బబులోనువారిలో మారుమనస్సు కలిగి ప్రభువు సన్నిధికి
వచ్చు వారిని గూర్చిన ఆనందము వారి హృదయములో నిండిపోయి సంతోషముతో ఉన్నారు.
ఇప్పుడు వీరు అనగా అన్యజనులలో
రక్షించబడిన విశ్వాసులు గాని ఇశ్రాయేలు జాతి వారు గాని క్రీస్తుయేసు ప్రేమను పొందకుండా
నిజవిశ్వాసిని ఆటంక పరచకూడదు! ఈ లోకపు ఆశలు చూపించి వారిని దేవుని
ప్రేమకు దూరం చేయకూడదు! పౌలుగారు చెప్పినపట్లు సాగిపోవాలి!
రోమా
8: 35 క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను
మనలను ఎడబాపునా?
36 ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల
మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడిన వారము.
37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము.
38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను
రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
39 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి
మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
అట్టి
కృప ధన్యత దేవుడు ప్రతీవానికి దయచేయును గాక!!!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*32వ భాగము*
*ఆలకించుడి; నా ప్రియుని స్వరము
వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను
అతడు వచ్చుచున్నాడు*
పరమగీతము 2: 8.ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను
ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.
ప్రియులారా! ఇక 8వ
వచనం చూసుకుంటే ఆలకించుడి; నా ప్రియుని
స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు
మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు అంటుంది షూలమ్మితి!
ప్రియులారా! ఈ వచనంలో నాకు నాలుగు
రకాలైన అర్ధాలు కనిపిస్తున్నాయి. గనుక ఆ నాలుగు కోణాలు ధ్యానం
చేసుకుందాం!
మొదటిది: సంఘ కోణము: వధువు సంఘము యొక్క అనుభవం ఇదే. షూలమ్మితి సోలోమోనుతో
సహవాసం కోల్పోయింది వరుడు కోసం వెదుకుతుంది. ఈలోగా ఆయన స్వరము
వినిపించింది అనగా దివ్య
వరుడు దగ్గరగా ఉన్నాడు. తరువాత ఆయన కొండల్లోకి వెళ్ళిపోయాడు అయితే
త్వర త్వరగా తిరిగి వస్తున్నాడు. ఇందుకు కారణమేది ఇక్కడ కనిపించదు.
అయితే క్రీస్తుతో మన సహవాస సంబంధం గనుక తెగిపోతే ఒకవేళ అందుకు కారణం
అంటూ వెదికితే మనలోనే వెదకాలి, ఆయనలో కాదు (యెషయా 59:1-2, ; హోషేయ 5:6, ). విశ్వాసులు తమ కోరిక చొప్పున ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని, సాన్నిహిత్యాన్ని అనుభవించరు. ఒక్క సారి ఆయన్ను చూస్తే
చాలు వారిలో ఆతురత ఎదురు తెన్నులు పెరుగుతాయి.
ఇక రెండవ అర్ధము: రాకడ కోణము: ఇది యేసుక్రీస్తుప్రభులవారి రెండవ రాకడను సూచిస్తుంది. ఆయన దగ్గరగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి
అంటున్నారు! వరుడైన క్రీస్తు స్థలము సిద్దపరచడానికి తండ్రి వద్దకు
పరమునకు వెళ్లారు యోహాను 14 వ అధ్యాయం ప్రకారం! ఇప్పుడు ఆయన త్వరలో రాబోతున్నారు మత్తయి 24 ప్రకారం,
1 కోరింథీ 15 వ అధ్యాయము ప్రకారము, 1 థెస్స 4 వ అధ్యాయం ప్రకారం, ప్రకటన
గ్రంధం ప్రకారం ఆయన త్వరలో రాబోతున్నారు- ఆయన రాకడ గుర్తులు కనిపిస్తున్నాయి-
ప్రియుని స్వరము వినిపిస్తుంది- మరి నీవు విని
ఎత్తబడతానికి సిద్దంగా ఉన్నావా?
ఇక మూడవది సువార్త కోణము: యెరూషలేము కుమార్తెలు అనబడే ఇశ్రాయేలు జాతి విశ్రాంతిలో కలత చెందక యుండగా,
నల్లనిదియైన బబులోను సంఘములో రక్షణ సువార్త కలకలము మొదలైంది. ఏ విధముగా? క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత
తిరిగి తన శిష్యులను చేరదీసి వారిని పరిశుద్ధాత్మచే బలపరచి నల్లనిదియైన బబులోను సంఘములోని
పాపపు స్థితిలో జీవించు వారి మధ్యకు వారిని పంపి ప్రియుని స్వరమును వినిపించుట జరిగింది.
ఇలా పంపబడినవారు ప్రియుని స్వరమును అనగా క్రీస్తు ప్రభువు స్వరమును వినిపింపజేశారు.
దీనినే మన మూల వచనములో ఆలకింపమని ఆమె ప్రియుని స్వరము వినబడుచున్నదని
చెప్పుట జరిగింది. ఆలకించకపోతే
వినబడదు. ఖచ్చితముగా
సువార్తీకులు క్రీస్తు ప్రభువుకు స్వరముగా మారి సువార్తను బోధించుచున్నప్పుడు మనస్సును
కేంద్రీకరించక ఆలకించక పోతే ఆ స్వరము వారిని చేరదు. అందుకే ఆలకించమని
తన సంఘములోని పాపపు స్థితిలో ఉన్న వారికి బబులోను అను అన్యజాతి స్త్రీ తెలియజేయుచున్నది. క్రీస్తు ప్రభుని స్వరమును శిష్యులు
లేక సువార్తీకులు వినిపించగా ఆలకించమని బబులోను సంఘము తనలో మారుమనస్సు పొందగోరువారికి
చెప్పుచు - ఇదిగో అతడు వచ్చుచున్నాడని కొండలను, గుట్టలను దాటుచు అన్యజాతుల మధ్యకు వచ్చుచున్నాడని తెలియజేయుచున్నది. కనుక ప్రపంచ నలుమూలల క్రీస్తు ప్రభువు
శిష్యులు బోధించి అన్యజాతుల మధ్య ప్రియుడైన క్రీస్తు ప్రభుని స్వరము వినిపించుట చేశారు.
ఈ విధముగా స్వరముగా వచ్చిన క్రీస్తు ప్రభువు - ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన
యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.'' అంటే హృదయపు తలుపువద్ద తట్టుచు ఉన్నారు. ఎవరైతే తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తారో
వారు రక్షణ పొందుదురని చెప్పబడింది. అలాగే ప్రియుని స్వరము వినబడగా,
నల్లనిదియైన బబులోను స్త్రీ ఆస్వరము వైపు చూడగా ఆమెకు ప్రియుడైన క్రీస్తు
ప్రభువు కనబడుట జరిగింది. ఆయన చూచుటకు ఇఱ్ఱివలె అనగా జింకవలె లేడిపిల్లవలె ప్రశాంతముగా చూచుచున్నంతసేపు
తన వైపే చూచుచున్నట్లుగా ఆయన కనిపిస్తున్నారు. ఇలా కనిపించిన
క్రీస్తు ప్రభువు తన స్వరముతో వారిని పిలుస్తూ నల్లనిదియైన బబులోను సంఘము గోడకు వెలుపల
నిలుచుని తలుపు తట్టుచు ఎవరైనా ఆ స్వరము విని తలుపు తీయుదురేమోనని ఎదురు చూస్తున్నాడు. కాని ఎంతకి వారు రాక పోవుట వలన కిటికీగుండ
గోడ కంతలగుండ కూడ తొంగిచూచుచు నిరీక్షణ కలిగి యున్నట్లుగా చెప్పబడింది. సహజముగా ఈనాడు భారతదేశములో సువార్త
విరివిగా జరిగినను మారుమనస్సు పొందువారు ఎందరు? కనుక ఆయన బబులోను విషయములో ఆ స్థితిలో
ఉన్నట్లుగా చెప్పుటను అలా వివరించుచు వర్ణించారు.
ఇలా ఆయన నిరీక్షణ
కలిగి ఉండగా కొందరు తన స్వరమును విని తలుపు తెరవగా క్రీస్తు ప్రభువు వారితో వారి గృహములో
చేరి, వారి ప్రియునిగా వారితో మాట్లాడు చున్నట్లుగ చెప్పబడింది. ఇలాంటివారు వారి ప్రార్థనా జీవితములో
అనేక అద్భుతములు సాధించినట్లుగా సంఘములో సాక్ష్యమిచ్చుట మనము చూడగలము. ఈ స్థితిని ఈ వచనములో క్రీస్తు ప్రభువు
వారితో మాట్లాడుటతో సమానమని గ్రహించాలి.
ఈ విధముగా దేవుని రక్షణ అన్యుల మధ్య సువార్తగా ప్రచారము కొనసాగుచున్నది.
మరినీవు
ఈ విధముగా సువార్త ప్రకటిస్తున్నావా? యేసుక్రీస్తుప్రభులవారి చివరి ఆజ్న తెలుసుకదా
నీకు!
మార్కు 16: 15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి
సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును;
నమ్మని వానికి శిక్ష విధింపబడును.
17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు;
క్రొత్త భాషలు మాటలాడుదురు,
18 పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల
మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
మరి
నీవు ప్రకటిస్తున్నావా
? ప్రియుని స్వరము నీ పొరుగువారికి నీ బంధువులకు అన్యులకు వినిపిస్తున్నావా?
ఈ స్వరము మనిషిని మార్చి పరమునకు తీసుకుని వెళ్తుంది కనుక ఒకవేళ ప్రియుని
స్వరమును వినిపించక పోతే నేడే సువార్త చేయడం మొదలుపెట్టు!!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*33వ భాగము*
*ఆలకించుడి; నా ప్రియుని స్వరము
వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు మెట్టలమీదను
అతడు వచ్చుచున్నాడు*
పరమగీతము 2: 8.ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను
ఎగసిదాటుచు మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు.
ప్రియులారా! ఇక 8వ
వచనం చూసుకుంటే ఆలకించుడి; నా ప్రియుని
స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు
మెట్టలమీదను అతడు వచ్చుచున్నాడు అంటుంది షూలమ్మితి!
ప్రియులారా! ఈ వచనంలో నాకు నాలుగు
రకాలైన అర్ధాలు కనిపిస్తున్నాయి. గనుక ఆ నాలుగు కోణాలు ధ్యానం
చేసుకుందాం!
నాల్గవది: ఇశ్రాయేలు జాతి కోణము:
(గతభాగము తరువాయి)
ప్రియులారా గమనించాలి: గతంలో చెప్పిన విధంగా ఈ
2:8 నుండి 5:16 వరకు యూదుల చెర విడుదల,
రక్షకుని మొదటి రాక, బలి అర్పణ , పునరుత్థానము, ఆరోహణము, సంఘము స్థాపించబడుట
వరకు మనకు కనిపిస్తాయి!!!
ఇక్కడ ఇశ్రాయేలు జాతి బబులోనూ చెర లోనికి పోయింది. దానియేలు
గారు, యెహేజ్కేలు నెహెమ్యా, ఎజ్రా లాంటి
భక్తులు కన్నీటి ప్రార్ధన ఇశ్రాయేలు జాతి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్ధనకు జవాబుగా
మరలా ఇశ్రాయేలు జాతికి ప్రియుని స్వరము వినిపించడం జరిగినది! వారితో యెషయా మరియు యిర్మీయా గ్రంధములలో పలుకబడిన ప్రవచనాలు నెరవేర్పు మొదలైంది!
అయితే మొదటగా వారు దేవుని స్వరాన్ని ఆలకించడం మొదలుపెట్టాలి!
ఇంతకుముందు వారు దేవుడు పెందలకడే వారియొద్దకు తన సేవకులను ప్రవక్తలను
పంపగా వారు వినడం మానేశారు తద్వారా చెరలోనికి పోయారు! 2 దిన
వృత్తా 36:15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును
కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
16 పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూత లను
ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ
యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
గనుక
ఇప్పుడు మారుమనస్సు పొంది ఆయన మాటలు వినడం మొదలుపెట్టాలి! సంఘమా నీ శ్రమలకు శోధనలకు
కారణం నీవుకూడ దేవుని మాటను వాక్యమును వదిలి దేవునికి దూరంగా పోవడమే! మరలా దేవుడు నిన్ను కరుణించాలి అంటే ఆయన స్వరమును నీవు వినాలి! ఆయన చెప్పినట్లు చేయాలి! ఆయన ఆజ్నల మార్గమున పయనం చేయాలి!
యెషయా 34 లో అంటున్నారు దేవుడు
1 రాష్ట్రములారా, నాయొద్దకు వచ్చి వినుడి జనములారా, చెవి యొగ్గి ఆలకించుడి
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక.
నీకు
క్షేమము కావాలంటే మరలా దేవుని మాట వినాల్సిందే! అందుకే యిర్మీయా 4 లో దేవుడు
అంటున్నారు ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్ధేశించిన యెడల నావద్దకే రావాలి! మరి నీవు వస్తావా!!!
ఆయన
స్వరానికి లోబడితే ఆశీర్వాదం! లోబడకపోతే శాపము!!
యెషయా 55:1--3 ప్రకారం నీకు
క్షేమము కావాలంటే,
నీకు లోటు దప్పిక ఆకలి తీరాలంటే దేవుని మాట వినాలి!
1 దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు
రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి.
రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును
పాలను కొనుడి.
2 ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు?
సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు
సుఖింపనియ్యుడి.
3 చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు
నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
ఇక యెషయా 55:12 ప్రకారము ఆయన మాట వింటే నీకు
దీవెన!!
12 మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని
పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు
చప్పట్లు కొట్టును.
అంతేకాదు
బైబిల్ చెబుతుంది ఆయన సేవకుల మాట కూడా నీవు వినాలి అప్పుడే నీకు దీవెన శాంతి సమాధానాలు
కలుగుతాయి!
అందుకే కీర్తనలు 34 వ అధ్యాయములో మనము దేవుని మాట
ఆలకిస్తే ఆయన మనము మొర్ర పెట్టినప్పుడు కూడా ఆయన మనమాట వింటాడు 17 నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని
విడిపించును.
18 విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని
ఆయన రక్షించును.
అలాగే
ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెట్టినప్పుడు దేవుడు విన్నారు! ఇది మనకు నిర్గమ మొదటి
అధ్యాయం కనిపిస్తుంది. మొదటగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో
ఉన్నప్పుడు పెట్టిన మొర దేవుడు విన్నారు- మోషే గారిని పంపించి
విడుదల చేశారు!
ఇక
న్యాయాధిపతులు గ్రంధము మొత్తములో అనేకసార్లు వారు దేవునికి దూరంగా పోయి విగ్రహారాధన
చేయడం వారు శ్రమలు పాలు కావడం తర్వాత తప్పు ఒప్పుకుని దేవుని పాదాలు పట్టుకోవడం- దేవుడు ఒక న్యాయాధిపతిని
పంపించి విడుదల చేయడం జరిగినది! ఇదే మనము రాజుల కాలంలో కూడా చూడగలము!
ఈరోజు
నీకు కూడా క్షేమము ఆశీర్వాదం కావాలంటే దేవుని మాటలు విని ఆయన వాక్యానుసారంగా జీవించాలి! లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు
కలిగిన గతే నీకు పడుతుంది. ఆయన మాట వింటే చెప్పినట్లు చేస్తే
ఇశ్రాయేలు ప్రజలు దీవించ బడినట్లు షూలమ్మితి సోలోమోను స్వరాన్ని విని ఆయన కనుగొని ప్రేమను
పొందుకున్నట్లు నువ్వు కూడ పొందుకోగలవు!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*34వ భాగము*
*నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు*
పరమగీతము 2: 9.
నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు
వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ తొంగి చూచుచున్నాడు
ప్రియులారా! ఇక 9వ
వచనం చూసుకుంటే నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు
అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీకంతగుండ
తొంగి చూచుచున్నాడు షూలమ్మితి!!
దీనిని
ఇశ్రాయేలు జాతి కోణములో చూసుకుంటే ఇది రక్షణ సమీపముగా ఉంది ఇంతవరకు మీరు బబులోనూ చెరలో
ఉన్నారు. నా సేవకుడు కోరేషు ని పంపించి మిమ్మల్ని విడిపించబోతున్నారు- అదే నా ప్రియుడు లేడి పిల్ల వలే వస్తున్నాడు గోడకు ప్రక్కన నిలబడ్డాడు కిటికీ
గుండా చూచుచున్నాడు అనగా అర్ధము!
ఇప్పుడు
ప్రియురాలైన షూలమ్మితి ప్రియుని స్వరము విని ఆయనకు తలుపు తీయవలసి ఉంది. తిరిగి ఆయన వద్దకు రావలసి
ఉంది!
ఇదే
యెషయా 52 లో కళ్ళకు కనిపించేటట్టు వ్రాయబడింది
6 కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలిసికొందురు
నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దిన మున తెలిసికొందురు.
7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము
ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు
ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
8 ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా
పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.
9 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును
విమోచించెను.
10 సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును
బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.
11 పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని
ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా
వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు
వెనుకటి భాగమును కావలికాయును
దానియేలు 9 వ అధ్యాయములో ఇశ్రాయేలు
ప్రజలు చెరలో ఉండవలసిన 70 సంవత్సరాలు ముగిశాయి అని 84
సంవత్సరాల వృద్దుడు దానియేలుగారు ఉపవాసముండి ప్రార్ధించగా దేవుడు జవాబిస్తున్నాడు!
2 దిన 36 లో ప్రవచించినది సరిగ్గా ఇక్కడ నెరవేరే సందర్భమే
ఈ వచనం ఇశ్రాయేలు జాతి కోణంలో!
21 యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెర వేరుటకై
విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము
పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.
22 పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున
యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు
మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను
23 పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి
దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న
యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.
సరే, ఇప్పుడు సంఘము కూడా ఆయన
స్వరమును వినాలి!
అందుకే
కీర్తనాకారుడు అంటున్నాడు
85:9 లో మన దేశములో మహిమ నివసించునట్లు
ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
75:1 1 దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు
నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.
119: 151 యెహోవా, నీవు సమీపముగా
ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
145: 18 తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి
కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
19 తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి
మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
20 యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపా డును అయితే
భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము
చేయును
అందుకే
యెషయా 51 లో భక్తుడు ప్రవచిస్తున్నాడు 4 నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్దనుండి బయలుదేరును
జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును.
5 నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు
రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి
నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.
యెషయా 49లో దేవుడు అంటున్నారు
8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని.
బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు
దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా
నియమించితిని.
దేవుడు
అంటున్నారు 2కోరింథీ 6 లో 2 అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను
ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
3 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
మరి
నేడు అనే దినము ఉండగానే మార్పు నొంది పశ్చాత్తాప పడి ఆయన పాదములు పట్టుకుంటావా?
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*35వ భాగము*
*ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు*
పరమగీతము 2: 10
ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు
11 నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
ప్రియులారా! ఇక 10వ
వచనం నుండి చూసుకుంటే ప్రియుని స్వరము షూలమ్మితికి వినిపిస్తుంది.
ఆ మాటలను చెబుతుంది ఇక్కడ
ఇప్పుడు
నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు! ఏమని ? 11 నా ప్రియురాలా,
సుందరవతీ, లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము
తీరిపోయెను వర్షమిక రాదు.
నా ప్రియురాలా! సుందరవతీ అనగా అందమైన దానా! లెమ్ము నా దగ్గరకు రమ్ము అని ప్రియుడైన సోలోమోను షూలమ్మితిని పిలుస్తున్నాడు!
ఇప్పుడు నిజానికి షూలమ్మితికి నిజంగా ప్రియుని స్వరము వినాలని తహతహ
లాడింది కనుకనే ప్రియుని స్వరము వినగలిగింది! అదే విధంగా విశ్వాసికి కూడా ప్రియుని
స్వరమును వినాలని ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారిని చూడాలనే ఆశ ఉన్నప్పుడే సంఘములో
అంగమైన ప్రతీ విశ్వాసి యేసుక్రీస్తుప్రభులవారి ముఖమును చూడగలరు! అలా పిలుపును వినేవారికి దేవుడు లేదా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రేమపూర్వక మైన
ఆహ్వానం ఇస్తున్నారు- నా ప్రియురాలా లెమ్ము రమ్ము!!!
ఇశ్రాయేలు జాతికోణంలో ప్రియుడు పిలుస్తున్నాడు- నా ప్రియమైన
ఇశ్రాయేలు జనాంగమా ఇక చాలు- మీ చెర బాధలు శ్రమలు ఇక చాలు!
నా వద్దకు రండి అంటూ!
సంఘపు కోణంలో అన్యులకు మరియు తన పిల్లలకు దూరమైన పిల్లలకు కూడా ప్రయాసపడి
భారము మోసుకునిపోయే సమస్తమైన ప్రజలారా నావద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను
అంటున్నారు! మత్తయి 11:28
ఇశ్రాయేలు
జాతి కోణంలో : యెషయా 54: 11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను
నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును
12 మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ
గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును.
13 నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు
అధిక విశ్రాంతి కలుగును.
14 నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు,
బాధించువారు నీకు దూర ముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ
దగ్గరకు రానేరాదు.
యిర్మీయా
గ్రంధంలో కూడా అంటున్నారు 30: 15 నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున
నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.
16 నిన్ను మింగువారందరు మింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్ప కుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని
దోపుడు సొమ్ముగా అప్పగించెదను.
17 వారుఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు
నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను
నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుయాకోబు నివాసస్థలములను
కరుణించి వాని గుడారము లను నేను చెరలోనుండి రప్పింతును; అప్పుడు
పట్టణము దాని కొండమీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు
గలదగును.
19 వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును
వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను,
అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
20 వారి కుమా రులు మునుపటివలెనుందురు, వారి సమాజము నా యెదుట స్థాపింపబడును, వారిని బాధపరచువారి
నందరిని శిక్షించెదను.
21 వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును,
వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీప
మునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా
నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
22 అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు నేను మీకు దేవుడనై
యుందును.
యెషయా 28: 16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు
సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి
బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
17 నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను
వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.
60: 1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
2 చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను
కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
3 జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి
వచ్చెదరు.
4 కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు
వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
5 నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును
సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
6 ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద
వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా
స్తోత్రములను ప్రకటించెదరు.
7 నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును?
నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును
నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
8 మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
9 నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను
తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
10 అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు
ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
11 నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో
రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
12 నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు
అట్టి జనములు నిర్మూలము చేయబడును.
ఒకవేళ
దేవునికి దూరమైపోయి కష్టాల కడగండ్లలో కన్నీటి లోయలలో ఉన్నావేమో- నీవు కూడా దేవుని దగ్గరకు
వస్తే నిన్నుకూడ ఆయన తన దారికి చేర్చుకో గలరు!’
మరి
వస్తావా?
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*36వ భాగము*
*నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు*
పరమగీతము 2: 10
ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు
11 నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
12 దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు
కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
13 అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి
సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
ప్రియులారా! ఇక 11వ వచనం నుండి
చూసుకుంటే
11 నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
(గతభాగం తరువాయి)
చూడండి
ఇక్కడ ఏమంటున్నాడో దేవుడు సంఘముతో- షూలమ్మితితో/ ఇశ్రాయేలు
ప్రజలతో- చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక
రాదు ఇక తరవాత వచనంలో అంటున్నారు దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు
కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
13 అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి
సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
మొదటగా
అంటున్నారు నా ప్రియులారా సుందరవతి- ఈ గ్రంధంలో మరోసారి షూలమ్మితి ని ప్రియురాలా అనియు
సుందరవతి అనియు పిలుస్తున్నారు! గమనించాలి రక్షించబడక ముందు ఆమె
ఎంతో చండాలంగా ఉన్నట్లు మనము యెహేజ్కేలు గ్రంధంలో చూడగలము!
16: నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము
కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు,
వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్టచుట్టకపోయిరి.
5 ఈ పనులలో ఒక టైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు,
నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే
బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.
6 అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్త ములో పొర్లియున్న నీవు బ్రదుకుమని
నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని
నీతో చెప్పితిని.
ఇది
ఇశ్రాయేలు జాతి స్థితి అయితే సంఘమైతే నల్లగా పాపపు స్థితిలో అనగా బబులోనూ స్థితిలో
పాపాంధ కారంలో ఉన్నప్పుడు క్రీస్తుయేసు నిన్ను నన్ను పిలుచుకుని తన రక్తములో కడిగి
పరిశుద్ధులుగా చేసి మనమీద ఉన్న పాప భారము తనమీద వేసుకుని నిన్ను ఆత్మీయ వరములతో ఫలములతో
నిన్ను నింపి దేవుని లక్షణాలు అనే అలంకారాలతో నిన్ను నింపారు!
దీనినే
ఎఫెసీ 2 లో
పౌలుగారు చెబుతున్నారు 1 మీ అపరాధములచేతను
పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో
కూడ బ్రదికించెను.
2 మీరు వాటిని చేయుచు, వాయు మండల
సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు
శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు
నడుచుకొంటిరి.
11 కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి,
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన
మీరు
12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును,
నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి,
క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు
క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును,
అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత
మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
15 ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని
తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16 తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని
యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని
సమాధాన సువార్తను ప్రకటించెను.
18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి
చేరగలిగియున్నాము.
19 కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
ఇట్టి
స్థితిలో ఉన్న సంఘము క్రీస్తుయేసు అనే వరుడికి ఎంతో సుందరముగా అందముగా కనిపిస్తుంది. అలా కనబడాలి అంటే నీలో
పేతురు గ్రంధములో చెప్పబడిన అలంకారాలు ఉండాలి గాని పనికిమాలిన బంగారు వెండి నగలు అలంకరించు
కొనడం వలన అందంగా కనబడటం లేదు దేవునికి!!!
1 పేతురు 3: 1 అటువలె స్త్రీలారా,
మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
2 అందువలన వారిలో ఎవరైనను వాక్య మునకు అవిధేయులైతే,
వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము
లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
3 జడలు అల్లుకొనుటయు, బంగారునగలు
పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము
మీకు అలంకార ముగా ఉండక,
4 సాధువైనట్టియు, మృదువైనట్టియునైన
గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను;
అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
5 అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును
తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
పేతురుగారే
కాదు పౌలుగారు కూడా చెబుతున్నారు ఆత్మావేశంతో 1 తిమోతి 2: 9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను
మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10 దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా
సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.
ఎవరైతే
ఇటువంటి ఆత్మీయ అక్షయ అలంకారాలు కలిగి ఉంటారో వారు దేవునికి ఎంతో సుందరముగా కనిపిస్తారు! వారే కాదు సువార్త ప్రకటించే
వారి పాదాలు కూడా దేవునికి దేవుని పర్వతము మీద ఎంతో సుందరముగా కనిపిస్తాయి!
యెషయా 52:7 7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు
సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో
సుందరములై యున్నవి.
ఇటువంటి
స్థితిలో సంఘము తన ప్రవర్తన ద్వారా మరియు తన సువార్త ప్రకటన ద్వారా సువార్త సత్యముతో
లోకమును నింపితే అప్పుడు లోకము స్థితి ఎలా ఉంటుందో 12, 13 వచనాలు చెబుతున్నాయి: దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు
కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
13 అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి
సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
ఈ
సువార్త విన్న అన్యజనులు రక్షించబడి క్రీస్తు రాజ్యముగా కట్టబడి ఎత్తబడే వారుగా కాగలరు!అలా ఉండాలి అంటే నీవు
అక్షయ అలంకారాలు వేసుకోవాలి- సువార్త ప్రకటించాలి!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*37వ భాగము*
*నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు*
పరమగీతము 2: 10
ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు
11 నా ప్రియురాలా, సుందరవతీ,
లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
12 దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు
కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.
13 అంజూరపుకాయలు పక్వమగుచున్నవి ద్రాక్షచెట్లు పూతపట్టి
సువాసన నిచ్చుచున్నవి నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము
ప్రియులారా! ఇక 11వ వచనం నుండి
చూసుకుంటే
11 నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము
రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.
(గతభాగం తరువాయి)
ప్రియులారా
ఇదంతా చూసుకుంటే అనగా ఈ నాలుగు వచనాలలో ఉన్న మర్మము ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకున్నా సంఘపు కోణములో చూసుకున్నా చిగురించే అనుభవము
కనిపిస్తుంది! ఇశ్రాయేలు జాతి చెరలోనికి పోయి మోడుబారిన జీవితం
ఈ వచనాలలో చిగురిస్తుంది. విశ్వాసి దేవునికి దూరమై పోయి ఎండిన
స్థితిలో ఉన్నాడు- ఇప్పుడు దేవుని పిలుపును అందుకుని లెమ్ము రమ్ము
అని పిలువగా పాపపు నిద్ర నుండి మేలుకుని చిగురించే అనుభవం లోనికి విశ్వాసి వస్తున్నట్లు
కనిపిస్తుంది!
ఇశ్రాయేలు
జాతి చెరలో ఉన్న 70 సంవత్సరాలు వారి జీవితంలో చిగురువేసిన స్థితి ఎంతమాత్రమూ లేదు అలాగే విశ్వాసి
దేవుని నుండి దూరమై పోయి దూరంగా ఉన్నాడు. అందుకే దేవుడు యోహాను
సువార్తలో అంటున్నారు
15: 1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును;
ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను
తీసి వేయును.
4 నాయందు నిలిచియుండుడి, మీయందు
నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని
తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని
మీరును ఫలింపరు.
5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు
మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో
వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట
పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో
పార వేతురు, అవి కాలిపోవును.
7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల
మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
కాబట్టి
నీవు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావా? దేవుడు రమ్ము లెమ్ము అని పిలుస్తున్నారు!
ఆ పిలుపును విని ఆయన దగ్గరకు వస్తే నిన్ను మరలా చిగురింప జేయగలరు దేవుడు!
అయితే
అలా చిగురించాలి అంటే నీవు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి!
మొదటగా
దేవుని స్వరము విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెప్పినట్లు చేయాలి!
యెషయా 60: 1 నీకు వెలుగు వచ్చియున్నది,
లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
2 చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను
కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
3 జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి
వచ్చెదరు.
55: 1 దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు
రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి.
రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును
పాలను కొనుడి.
2 ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు?
సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైన
దానియందు సుఖింపనియ్యుడి.
3 చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు
నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
అయితే
తన సేవకులైన ప్రవక్తల ద్వారా తన పరిచారకుల ద్వారా దైవజనుల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు
యిర్మీయా 31:
6 ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసిసీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు
పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.
7 యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా
పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి,
ప్రకటించుడి స్తుతిచేయుడియెహోవా, ఇశ్రాయేలులో శేషించిన
నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.
8 ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను,
గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి
భూదిగంతములనుండి అంద రిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి
తిరిగి వచ్చెదరు
9 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు
నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ
చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు
నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
ఇప్పుడు
ఈ స్వరము విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాలి! అప్పుడే నీవు చిగురించే
స్థితికి చేరుకుంటావు!
అప్పుడు
ఆయన లోనే ఆయనతోనే నీవు అంటుకట్టబడి ఉంటే ఫలిస్తావు. అలా అంటుకట్టుబడక నీ ఇష్టమొచ్చినట్లు చేస్తే
స్వంత తీగలనే పారవేసిన దేవుడు అంటుకట్టబడిన నిన్ను కూడా పారవేస్తాడు!
రోమా 11: 17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి,
అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టుయొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన
18 నీవు అతిశయించితివా, వేరు నిన్ను
భరించుచున్నదిగాని నీవు వేరును భరించుట లేదు.
19 అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి
వేయబడినవని నీవు చెప్పుదువు.
20 మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి
విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు;
గర్వింపక భయపడుము;
21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల
నిన్నును విడిచిపెట్టడు.
22 కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్య మును అనగా పడిపోయిన
వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల
నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును
నరికివేయబడుదువు.
23 వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు;
దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.
24 ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి
కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు
వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవచెట్టున అంటు కట్టబడరా?
25 సహోదరులారా, మీదృష్టికి మీరే
బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు
కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
26 వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి
వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి
కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింప బడుదురు.
అయితే 2 దిన వృత్తా 36:23 ప్రకారం, ఎజ్రా 1:2 ప్రకారం దేవుని
తోడు నీతో ఉంటే నీవు చిగురిస్తావు కాబట్టి సమయమెరిగి ఆయనకు ప్రార్ధన చేయు! ఏ మాత్రమైన అశ్రద్ద చేస్తే ఇశ్రాయేలు ప్రజల వలే నష్టపడతావు జాగ్రత్త!
యిర్మీయా 8:20
ఎప్పుడైతే నీవు చిగురించడం మొదలుపెడతావో నిన్ను మంటిలోనుండీ
మహిమలోనికి తీసుకుని వస్తారు యెషయా 26:19;
కాబట్టి
నిద్రిస్తున్న నీవు మేలుకో!
రోమా
13: 11 మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను
వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము
విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార
క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
ఎఫెసీ 5: 14 అందుచేత నిద్రించుచున్న నీవు
మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని
ఆయన చెప్పు చున్నాడు.
15 దినములు చెడ్డవి గనుక, మీరు
సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
16 అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె
నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*38వ భాగము*
*బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ
ముఖము మనోహరము నీ ముఖము
నాకు కనబడనిమ్ము నీ స్వరము
నాకు వినబడనిమ్ము*
పరమగీతము 2:
14, ''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల
నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
ప్రియులారా! ఇక 14వ వచనం నుండి
చూసుకుంటే
''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా
పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
ఈ మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
బండ
సందులలో ఎగురు పావురమా అంటున్నారు!
ఇందులో పావురము అనగా పరిశుద్ధాత్మ కొండ శిలల మధ్య బండసందులలో ఎగురుచున్నదని
చెప్పబడింది. బండ కఠినత్వమునకు
సూచన. ఈ బండ రెండు అర్ధాలు: మొదటగా విశ్వాసులే
గాని బండబారిన హృదహాయాలు, రెండు: బండవలె
రాటు తేలిన హృదయము కలిగిన జనులు వివిధ రకములుగా మలచబడిన శిలా విగ్రహాలను దేవుళ్లగాను
దేవతలుగాను ఆరాధిస్తూ ఈ లోకములో అన్యులుగా జీవిస్తున్నారు. వీరు ఏ కోశాన దేవునికి మనస్సున స్థానమీయక
విగ్రహారాధన లేదా దేవుడే లేడంటూ జీవిస్తున్నారు. అంటే వీరి హృదయము దేవునికి దూరముగా
కాఠిన్యముతో నిండి కనీసము సువార్త స్వరమును ఆలకించు స్థితిలో ఎవ్వరు లేరు. ఇలాంటివారి మధ్య కొందరు ప్రభువే నిజ
దైవమని గుర్తెరిగి మారుమనస్సు పొంది దేవునికి యోగ్యరీతిలో నీతికి నిలయమై విశ్వాసులుగా
ఉన్నారు. జనులలో జనులుగా
జీవిస్తున్నారు. కనుక
పావుర రూపమైన పరిశుద్ధాత్మ వారి మధ్య ఎగురుచు విశ్వాసిని చేరు ప్రయత్నమును గూర్చి ఇందులో
చెప్పబడింది. కఠినమైన
బండ వంటి మారని స్వభావము కలిగిన జనుల మధ్య పవిత్రాత్మ విశ్వాసి కోసము ఎగురుచున్నట్లుగా
ఎంత అందముగా అలంకార ప్రాసతో వర్ణించాడు.
ఇలా ఎగురుతూ
ఉన్న పావుర రూపమైన పరిశుద్ధాత్మకు పేటుబీటల వంటి అనగా నెర్రెలు విడిచి పగుళ్లతో నిండిన
కొండ బండలవంటి హృదయ విదారకమైన స్థితిలో ఉన్న విశ్వాసులు కనిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉండి మారుమనస్సు ద్వారా విశ్వాసిగా ఎదుగుచు పరిపక్వపు
స్థితికి చేరుచున్న విశ్వాసి నీరు లేక ఎండిన పంట భూమి పగిలినట్లుగా కనిపిస్తున్నారు. కనుక ఈ పావుర రూపైన పరిశుద్ధాత్మ
వారిని కనికరించి వారిని ఆశ్రయించుచున్నట్లుగా ఈ వచనములో చెప్పబడింది.
దేవుని
ప్రేమ ఎంత ఉన్నతముగా ఉన్నదో దీనినిబట్టి మనకు తెలియుచున్నది. ఈ విధముగా విశ్వాసిని ఆశ్రయించిన
పరిశుద్ధాత్మ తన స్వరమును విశ్వాసికి దయచేసి, వాని ద్వారా ఈ లోకములో
తన స్వరమును వినిపించుట జరుగును. అపొస్తలుల కార్యములు 2:4, ''అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.''
ఈ విధముగా వాక్శక్తిని అనుగ్రహించి వారి ద్వారా
తాను మాట్లాడుట జరుగుచున్నది. ఈ స్వరము చాలా మధురమైనదని పవిత్రాత్మ వర్చస్సు అనగా విశ్వాసికి అనుగ్రహించు
బలము శక్తి ప్రభావములే గాక శాంతి సమాధానములు చాలా మనోహరమైనదని చెప్పబడింది,
ఎందుకంటే పరిశుద్ధాత్మ నిష్కపటమైనట్టి పావురము రూపములో వచ్చును.
ఈ రూపములోని పావురపు ముఖము
చూచుటకు చాలా మనోహరముగా ఉంటుంది. వెలుగు నిండగా అగ్నిజ్వాలలతో పావుర
రూపములో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ రూపమును వర్ణించుట అసాధ్యమే అంత మనోహరముగా
ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు
ఇంకొంత సేపు చూడాలని, ఇంకొంతసేపు ఆ మాటలు వినాలని సంఘము కోరుకొనును. విశ్వాసి హృదయము ఆనందోత్సాహాలతో నిండి
మరికొంతసేపు అలాగే ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఆ యొక్క దైవిక అనుభూతిని గూర్చి ఇందులో
వ్రాయుట జరిగింది.
ఈ విధముగా
పేంటుకొస్తు దినాన పరిశుద్ధాత్మ
దిగి వచ్చు విధానమును గూర్చి ఆయన ఎవరిని ఆశ్రయించి తన కార్యములను కొనసాగించునని ఇందులో
వివరించుట జరిగింది.
మరి ఆ పావురం యొక్క స్వరము వినబడుతుంది. ఆయన కార్యములు
కనిపిస్తున్నాయి కదా- మరి ఆ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడా/.
పనిచేస్తున్నాడు
అని ఎలా తెలుస్తుంది? ఒకసారి గలతీ పత్రిక 5 వ అధ్యాయం చూసుకుందాము!
16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి,
అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం
చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ
నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశా నిగ్రహము.
23 ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.
ఒకవేళ
ఆత్మ పనిచేయకపోతే నీలో ఏముంటాయి?
18 మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మ శాస్త్రమునకు లోనైనవారు
కారు.
19 శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత,
కాముకత్వము,
20 విగ్రహారాధన, అభిచారము,
ద్వేషములు, కలహము, మత్సరములు,
క్రోధములు, కక్షలు,
21 భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము
ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
ప్రియ
సహోదరీ సహోదరుడా! నీవు దేవుని రాజ్యమును స్వతంత్రినచ్చుకోవాలి అంటే నీకు కావాలి పరిశుద్ధాత్మ
అభిషేకము! మరి నీవు పొందుకున్నావా?
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*39వ భాగము*
*నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము*
పరమగీతము 2:
14, ''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల
నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
ప్రియులారా! ఇక 14వ వచనం నుండి
చూసుకుంటే
''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా
పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
ఈ మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
బండ
సందులలో ఎగురు పావురమా అంటున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక్కడ
బండ సందులలో నివశించే నా పావురమా నీ ముఖము నాకు కనబడ నీయు! నీ స్వరమును నాకు వినబడనీయు
అంటున్నాడు ప్రియుడు!
అనగా ప్రియురాలు దేవునికి ముఖము చూపించడం తగ్గించింది అన్నమాట! అనగా సంఘములోని
ఈ విశ్వాసి దేవుని మందిరానికి రావడం తగ్గింది అన్నమాట! ఆదివారం
నాడే షికార్లు, ఆదివారం నాడే ఫంక్షన్లు ప్రయాణాలు! పార్టీలు! సీనియారిటీ పెరిగాక విశ్వాశంలో సిన్సియారిటీ
తగ్గిపోయింది! ఇంకా హెబ్రీ 10 లో చెప్పబడినట్లు
సమాజముగా కూడటం మానేశారు. కూటములకు ఉపవాస కూటములకు రావడం మానేశారు!
ఆదివారం నాడు టీవీ లేక సినిమా లేక షికార్లు లేక దురభిమాన పాపము లాగేస్తుంది!
24 కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,
25 ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా
ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు
పురికొల్పవలెనని ఆలోచింతము.
ఇక్కడ
దేవుడు నిన్ను బ్రతిమిలాడుతున్నాడు నా పావురమా నీ ముఖమును నా కనబడ నీయు! నీ స్వరము రేయి మొదటి
జాముననే నాకు వినబడనీయు!! ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను గర్జించు
సింహములా వెదుకుతూ తిరుగుచున్నాడు!
మోషేగారు
దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది- అలాగే నీవుకూడ దేవునితో
గడుపుతూ ఆయన సన్నిధిలో ఉంటే నీ చావు ముఖములో దేవుని కళ కనిపిస్తుంది! నీ జీవితం చిగురిస్తుంది!
శృంగారం
అనబడే దేవాలయంలో స్వస్థత పొందిన రోగి వెంటనే దేవుని మందిరములోనికి పరుగెత్తాడు! అది అతని ఆశ!
మరి నీ ఆశ ఎక్కడకు వెళ్లాలని?
దేవునితో
ఎక్కువగా గడుపుతా ఉంటే మోషే గారి ముఖము మాత్రమే కాదు స్తెఫను గారి ముఖము కూడా ప్రకాశించింది
2 కోరింథీ 3: 17 ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క
ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
18 మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను
అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు,
ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
ప్రభువు
సహవాసంలో ఉంటే ఆయన రూపములోనికి నీవు మార్చబడతావు!
ఇంకా
ఆయనకు నీ స్వరము వినబడనీయు!
కీర్తన 5: 1 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని
ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము
నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
యెషయా 58: 1 తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి
బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి
వారి పాపములను తెలియ జేయుము
మరి
నీ స్వరము ప్రభువుకు వినిపిస్తావా? ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నారు!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*40వ భాగము*
*ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి
గుంటనక్కలను పట్టుకొనుడి*
పరమగీతము 2: 15. మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి
ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము. ఇక
15 వ వచనములో మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు
నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి అంటున్నారు! అయితే ఈ మాటలు ఎవరు పలికారు అనేదాని విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి!
కొంతమంది అంటారు ద్రాక్షతోట కాపరులు , మరికొందరి
అబిప్రాయం ఈ మాటలు పలికింది షూలమ్మితి యొక్క సహోదరులు లేక అన్నలు!! వారి ద్రాక్షతోటలను కాయడానికి షూలమ్మితిని పెడితే ఆమె కాయలేక పోతుంది ఎందుకంటే
గుంటనక్కలు ఎక్కువై పోయాయి! తమ చెల్లెలు వాటిని తోలలేకపోతుంది
అందుకే సహాయం చేసి గుంటనక్కలను పట్టుకొందము రండి అని పిలుస్తున్నారు!
పరమగీతము 1:6 . చేయవలసినది చేయకపోవడం,
చేయకూడనిది చెయ్యడం, ఇలాంటి అన్ని పాపాలూ క్రీస్తులో
విశ్వాసుల జీవితాన్నీ ఆయనతో సహవాసాన్నీ పాడు చేస్తాయి. ఇలాంటివాటి
విషయం విశ్వాసులు జాగ్రత్త వహించాలి. అవి “చిన్న” పాపాలుగానే కనిపించవచ్చు. అయితే అంత పెద్ద నష్టం కలిగించే వాటిని చిన్న పాపాలని ఎలా అనగలం?
“ద్రాక్ష తోట”– కీర్తనల గ్రంథము 80:15, ; యెషయా
5:1-5, ; యిర్మియా 12:10, ; లూకా
20:9-16, (ద్రాక్షతోట ఇంత భయంకరంగా శిధిలమై పోవచ్చు.)
9 అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను ఒక మనుష్యుడు
ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను.
10 పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని
ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.
11 మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి
అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి.
12 మరలనతడు మూడవవాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి
త్రోసివేసిరి.
13 అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమి చేతును?
నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెదరను
కొనెను.
14 అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు;
ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని
15 అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి.
కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
16 అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు
ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.
హేరోదు రాజును గూర్చి క్రీస్తు
ప్రభువు నక్కతో పోల్చి సంబోధించుటనుగూర్చి మనము చదువగలము. లూకా
13:32. హేరోదు జ్ఞానులనుండి క్రీస్తు ప్రభువు యూదుల రాజుగా పుట్టాడని
తెలుసుకొని ఆయనను చంపించుటకు ప్రయత్నించాడు. అటుతరువాత తరములోని హేరోదు యోహానును
తల నరికించి చంపించాడు. ఈ విధముగా క్రీస్తు ప్రభువును కుతంత్రముతో చంపజూచుట యోహానును తల నరికి చంపించుట
ఇలాంటివి సంఘమునకు ఇబ్బందికరమైన సంఘటనలు.
ఇలా చేస్తున్నందుకు క్రీస్తు ప్రభువు హేరోదును నక్కతో పోల్చి
చెప్పుట జరిగింది.
అంటే సంఘాన్ని నాశనము చేయాలని
తిరుగు అలౌకిక లౌకిక శక్తులన్ని కూడ నక్కలతోను గుంటనక్కలు అనగా నక్కల పిల్లలతోను పోల్చుట
జరిగింది. ఇందులో అబద్ధ
క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు
వంటివారు. తమ సమాజములోనే
తిరుగుచు అదే సమాజ వినాశనము కొరకు తిరుగుతారు. ఈ లక్షణములు గల వారిని నక్కలుగా వర్ణించుట
జరిగింది.
అయితే పరిశుద్ధాత్మ రాకడతో
ఆయన స్వరముతో చిగురించి పూతపట్టిన ద్రాక్షతోటలు అనగా నూతనముగా విశ్వాసములోకి వచ్చు
విశ్వాసులను చెదరగొట్టుచు చెరుపు చేయు పై వంటి నక్కలను పట్టుకొనుడి అని చెప్పబడింది. అలాగే పైకి సహాయము చేయు వారివలె కనిపిస్తూ
లోపల గోతులు త్రవ్వి విశ్వాసి నాశనమునకు కారణమయ్యే గుంట నక్కలను కూడ పట్టుకొనుడి అని
చెప్పుచున్నారు. కనుక
మొదటి దినాలలో క్రీస్తు ప్రభువు ప్రియునిగా అకర్షించగా ఆయన స్వరమును విని మారుమనస్సు
పొంది సంఘముగా ప్రియురాలిగా మారినవారికి పరిశుద్ధాత్మ పావురము రూపములో సహకారము అందించును.
అలాగే నక్కలవంటి అపవిత్రుల
వలన చెడు జరుగు అవకాశము ఆ తోటను మొత్తము నాశనము చేయగల సమర్థులు వారని, వారి విషయములో జాగ్రత్త వహించమని తెలియజేయుట జరిగింది.
దీనికోసం
ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తుప్రభులవారు శాశ్త్రులు పరిసయ్యులను కోసం
కూడా ఇలాగే చెప్పారు. కారణం సంఘాన్ని పాడుచేసింది వారే కనుక. వీరు దేవుని యొక్క ద్రాక్ష తోటకు అనగా ఇశ్రాయేలు
ప్రజలకు నాయకులు ఏలికలు! వీరు మాదిరిగా ఉండవలసింది పోయి బ్రష్టులుగా
మార్చుతున్నారు! చివరకు ఆ ద్రాక్షతోటకు నిజమైన యజమానుడు హక్కుదారుడైన
యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేసి చంపారు! కాబట్టి ద్రాక్షతోటను
చెరుపు నక్కలు గుంటనక్కలు వీరే! ఈ రోజులలో సంఘాలను తప్పుడు సిద్ధాంతాలతో
పాడుచేస్తూ తప్పుడు బోధలు చేస్తూ సంఘాన్ని దారి తప్పించేవారే నేటి గుంటనక్కలు!
Prosperity గోస్పెల్ చెబుతూ తమ ప్రాపర్టీ పెంచుకుంటున్న బోధకులే నేటి
సంఘాన్ని చెరిపే గుంటనక్కలు!! సంఘములో వారు తప్పుచేస్తున్నా పాపములో
మ్రగ్గుతున్నా వారి కానుకలు ఆశించి వారిని సరిచేయకుండా సంఘ విశ్వాసులు మెచ్చుకునే పిట్టకధలు
హాస్యకధాలు సైన్సు చెబుతూ వారిని ఖండించక గద్ధించక బుద్ధి చెప్పకుండా సొ సొ గా ప్రసంగాలు
చేస్తున్న దైవజనులు పాస్టర్లు నిజమైన ద్రాక్షతోట చెరిపే నక్కలు! నాకెందుకు నేను జీతం కోసం పనిచేస్తున్నాను అని భావించి బైబిల్ లో ఉన్నది ఉన్నట్లు
చెప్పకుండా సంఘాన్ని దేవునితో సమాధాన పరచి వారిని రాకడకు ఆయత్త పరచకుండా తమ కడుపులు
నింపుకోడానికి పొట్ట పోషించుకోడానికి మాత్రమే కాలం గడుపుతున్న వారే ద్రాక్షతోటను చెరిపే
నక్కలు ప్రియులారా! ఇది చదువుతున్న అనేకమైన దైవసేవకులకు బాధ కలగవచ్చు
నా మీద కోపం రావచ్చు! గాని నేను చెబుతుంది వాక్యానుసారమైతే దయచేసి
సరిచేసుకోమని- మనం సంఘానికి కాపలాదారులమనీ ఒకరోజు ద్రాక్షతోట
యజమాని యేసుక్రీస్తుప్రభులవారికి లెక్క అప్పగించాలని మరచిపోవద్దు!
మత్తయి 5: 19
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును;
అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.
20 శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి
అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
23: 2 శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
3 గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి,
అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే
గాని చేయరు.
4 మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద
వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.
5 మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు;
తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
6 విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను
7 సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు
కోరుదురు.
అందుకే పౌలుగారు వ్రాస్తున్నారు ఆత్మావేశంతో
1 కోరింథీ 1: 19 ఇందు విషయమై జ్ఞానుల
జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి
యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని
ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని
రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
22 యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు,
గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు.
23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
24 ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను
ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి,
పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
25 దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది,
దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
26 సహోదరులారా, మిమ్మును పిలిచిన
పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని
27 ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
28 జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని
దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో
బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
29 ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని,
తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు
ఏర్పరచుకొని యున్నాడు.
30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
కాబట్టి
ఇలాంటి గుంటనక్కల విషయంలో జాగ్రత్తగా ఉందాము! దైవ సేవకులారా! మన బోధలు
సంఘాన్ని కట్టేవిధంగా ఉన్నాయా లేక కూలదోసె విధంగా ఉన్నాయా, సంఘాన్ని
క్రీస్తుతో ఐక్యం చేసి రాకడకు సిద్దపరిచే విధంగా ఉన్నాయా లేక వారిని దోచే విధంగా ఉన్నాయా
సరిచూసుకుని సరిచేసుకుందాం!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*41వ భాగము*
*నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట
అతడు మందను మేపుచున్నాడు*
పరమగీతము 2: 16 నా ప్రియుడు నా వాడు నేను
అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము. ఇక
16వ వచనం చూసుకుంటే నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట
అతడు మందను మేపుచున్నాడు అంటుంది షూలమ్మితి! ఇప్పుడు మరలా షూలమ్మితి
మాట్లాడటం మొదలుపెట్టింది ప్రియులారా!
పరమగీతము 6:3, నేను పద్మములలో మేపుచున్న నా
ప్రియునిదానను అతడును నావాడు. ;
పరమగీతము 7:10, నేను నా ప్రియునిదానను అతడు
నాయందు ఆశాబద్ధుడు
తాము క్రీస్తుకూ, క్రీస్తు తమకూ శాశ్వతంగా చెంది ఉంటారన్న మధురమైన నిశ్చయత విశ్వాసులకు ఉండాలి
(యోహాను 17:6, ; రోమీయులకు 7:4, కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని
చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.;
రోమీయులకు 8:38-39,
38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను
రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,
39 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి
మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ;
1 కోరింథీయులకు 3:21-23. ఇది నిజమో కాదో అనే సందేహంలో
వారు ఉండిపోకూడదు.
షూలమ్మితి
సోలోమోనును నా ప్రియుడు నావాడు అని చెప్పుకుంటుంది అయితే ఇప్పుడు సంఘము అనగా ప్రియురాలు - నా ప్రియుడు నా వాడు
అని చెప్పుచున్నది. ఈనాడు
క్రైస్తవ సంఘములు విస్తరించియున్నవి.
సంఘము పరమగీతములో వలె నా క్రీస్తు ప్రభువు నా వాడు అని చెప్పు
స్థితిలో ఉన్నదా? ఇలా
చెప్పాలి అంటే 1 కొరింథీ
11:1, ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను
పోలి నడుచుకొనుడి.'' వాక్యరీతిగా సంఘము నడవాలి. అలా సంఘ కార్యములు నీతికి సువార్తకు
ప్రతిరూపమైతే ఆనాడు ఆ సంఘము నా ప్రియుడైన క్రీస్తు ప్రభువు నా వాడని ఈ సంఘము అతనిది
అని చెప్పుకొనగలదు. ఇలాంటి
సంఘము అంత్య దినములలో ఆత్మీయ సంఘముగా మారి మొదట వధువుగా నీతి క్రియలతో అలంకరించబడి
తరువాత గొఱ్ఱెపిల్ల భార్యగా పరమయెరూషలేముగా మారును.
ఈ విధముగా సంఘము మారినప్పుడు
క్రీస్తు ప్రభువు అందులోని గొఱ్ఱెలను - ''పద్మములున్నచోట అతడు
మందను మేపుచున్నాడు,'' అని చెప్పబడింది. మందను అనగా గొఱ్ఱెలను అని అర్థము
అనగా విశ్వాసులు. వీరికి
క్రీస్తు ప్రభువు కాపరియై పద్మములున్నచోట మేపును. పద్మములు నీటిలో కదా ఉంటాయి. అంటే నీటి ఊటల వద్ద ఆయన వారిని మేపునని
చెప్పబడింది. ప్రకటన 7:17, ''ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి
కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.'' ఈ విధముగా జీవజలముల బుగ్గల
వద్దకు మందను నడిపిస్తాడు.
ఇంత గొప్ప స్థితిలో నడిపించగల
కాపరి రక్షకుడు ఒక్క క్రీస్తు ప్రభువు మాత్రమే. కనుక తన ప్రియుని వద్దకు రమ్మని ప్రియురాలైన
నల్లనిదియైన బబులోను విశ్వాసులకు చెప్పుచున్నది. ఎలా రమ్మంటున్నదంటే - ఇఱ్ఱి అనగా జింకవలె లేడిపిల్లవలె కొండ బాటలమీద త్వరపడి రమ్ము అని చెప్పుచున్నది. కనుక ఓ విశ్వాసి! జాగు చేయక సాతాను శక్తులను జయించి
మారుమనస్సు పొంది, నిజమైన ప్రియుని వద్దకు త్వరపడి వెళ్లుట శ్రేయస్కరము.
జాగ్రత్తగా గమనిస్తే మొదటగా దేవుడు మనకు తండ్రి ద్వితీ 32:6 ప్రకారం-
గనుక మనం దేవునికి లోబడి ఉండాలి! ఆయన కుమార కుమార్తెలు
గా మనం జీవించాలి తప్ప లోకస్టుల వలె జీవించరాదు!
ఇక రోమా
14:5 ప్రకారం దేవుడు మనకు తండ్రి మాత్రమే కాక ఆయన మన ప్రభువై ఉన్నాడు
గనుక ఆయన పరిపాలన క్రింద ఆయన ఆజ్నల మార్గములో అనగా బైబిల్ చెప్పినట్లు చేయాలి తప్ప
బైబిల్ చెప్పని పనులుగాని బైబిల్ లో లేని ఆచారాలు గాని మనము చేయకూడదు అని గ్రహించాలి!
ఇక 1 కోరింతే 6:19—20 ప్రకారం దేవుడు మన యజమాని కూడా!
అపోస్తలుల కార్యములు ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కొన్నారు
ఇప్పుడు మన దేహముల మీద మన ఆత్మలమీద యజమాని యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే!
గనుక నీ సమస్త విషయాలలో ఆయనకు లోబడి ఉండాలి!
ఇక అదే పత్రిక 3:9 ప్రకారం ఆయన మన గృహ యజమాని గనుక మన విశ్వాసము అనే గృహంలో
దేవునికి సర్వహక్కులు ఇచ్చేసి ఆయన చెప్పినట్లు మనం చేయాలి!
అంతేకాకుండా అదే పత్రిక 3:16 ప్రకారం ఆయన మాత్రమే మన దేవుడు కాబట్టి మన
ప్రార్ధన గాని ఆరాధన గాని స్తుతులు గాని ఆయనకు మాత్రమే చెల్లాలి తప్ప మనుషులకు దైవసేవకులకు
రాజకీయ నాయకులకు మరో ఎవరికో చెందకూడదు!
ఇక యోహాను
10:11 ప్రకారం ఆయన మన కాపరి గనుక కాపరి చెప్పినట్లు కాపరి నడిపించిన
చోట్లకు మాత్రమే వెళ్ళాలి తప్ప నీ ఇష్టప్రకారం నడువకూడదు.
కాబట్టి
ఇలా చేసినప్పుడు మాత్రమే నీవు నా ప్రియుడు నావాడు నేను అతని దానను అని షూలమ్మితి చెప్పినట్లు
చెప్పగలవు!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*42వ భాగము*
*నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట
అతడు మందను మేపుచున్నాడు*
పరమగీతము 2: 16. నా ప్రియుడు నా వాడు నేను
అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము మనము. ఇక
16 వ వచనం చూసుకుంటే నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట
అతడు మందను మేపుచున్నాడు అంటుంది షూలమ్మితి! ఇప్పుడు మరలా షూలమ్మితి
మాట్లాడటం మొదలుపెట్టింది ప్రియులారా!
పరమగీతము 6:3, నేను పద్మములలో మేపుచున్న
నా ప్రియునిదానను అతడును నావాడు. ;
(గతభాగం తరువాయి)
ప్రియులారా
ఇక్కడ మరోసారి అతడు మందను పద్మములు ఉన్నచోట మేపుచున్నాడు అంటుంది!
పద్మములు
అనగా గతంలో చెప్పినట్లు పద్మము లోయలో పుడుతుంది- లోయ అనగా రెండు అర్ధాలున్నాయి ప్రియులారా!
మొదటిది లోయ తగ్గింపు జీవితానికి సాదృశ్యం! రెండు
లోయ శ్రమలకు శోధనలకు ఆటుపోటులకు సాదృశ్యం!
అంతేకాకుండా పద్మములు కొన్ని చెరువులో పుడతాయి! ఇంకా బురదలో
పుడతాయి! అనగా చెరువులో ఉండే బురదలో నుండి పద్మములు పుడుతున్నాయి
అనగా లోకమనే చెరువులో ఆ చెరువులో ఉండే బురద లాంటి మనుష్యులు పాప భూయిష్టమైన మనుష్యుల
మధ్యలో నుండి సంఘము అపురూపంగా అందంగా పుట్టింది అలాంటి చోట్ల ఇప్పుడు ప్రియుడు తన మందను
మేపుచున్నాడు!
అందుకే
కీర్తన 23వ అధ్యాయంలో
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించు చున్నాడు శాంతి కరమైన జలముల యొద్ద నన్ను నడిపించు
చున్నాడు అంటున్నారు దావీదు గారు! దావీదు గారి జీవితం
ఎంతో తగ్గింపు జీవితం కలది! మామ సౌలుతొ నేను మిన్నళ్ళిని,
చచ్చిన కుక్కను అంటూ తగ్గించుకుని చెప్పాడు ఆయన! ఇంకా దేవునితో అంటున్నారు ఆయన అయ్యా నేను దుమ్మును దూళిని అని తగ్గించుకున్నారు!
అందుకే తననుతాను తగ్గించు కొనువాడు హెచ్చించ బడును తనను తాను హెచ్చించు
కొనువాడు తగ్గించబడును అని దేవుడు చెప్పినట్లు తనను తాను దావీదు గారు తగ్గించుకున్నారు
అందుకే దేవుడు అత్యధికంగా హెచ్చించారు- గొర్రెలను కాసుకుంటున్న
దావీదుగారిని రాజుగా చక్రవర్తిగా చేశారు అంతేనా ఒక ప్రవక్తగా ఒక మెంటర్ గా,
ఒక యుద్ధ వీరుడుగా ఒక ఆరాధన నడిపించే నాయకుడుగా ఒక గాయకుడిగా ఒక వాయిధ్యకారుడుగా
ఒక దీర్ఘదర్శిగా ఒక ప్రార్ధనా పరుడిగా ఇలా ఎన్నెన్నో విధాలుగా దేవుడు వాడుకున్నారు!
కాబట్టి
మొదటగా పద్మములున్న చోటు అనగా తగ్గింపు జీవితం అని గ్రహించాలి!
ఇక రెండవదిగా పద్మములు శ్రమలలో శోధనల నుండి పుడతాయి అలాగే పద్మములు
ఉన్నచోటు అనగా శ్రమలను సహించే అనుభవం అని అర్ధము! దావీదు గారి
జీవితమంతా శ్రమలే శోధనలే! గాని ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు
సరికదా ఇన్ని శ్రమలలో శోధనలలో పాటలు పాడి కీర్తించినట్లు మనము చూడగలము! ఇది మరియొక పద్మములున్న చోటు అనుభవం!
ఇక తర్వాత పద్మములు అభివృద్ధిని సూచిస్తుంది!
అనగా పద్మములు ఎక్కడ ఉన్నాయో అక్కడ అభివృద్ధి వుంది! దేవుని ప్రజలు అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి అదే దేవుడు కోరుకుంటున్నట్లు
మనము యోహాను పత్రికల వలన అర్ధమవుతుంది అందుకే ప్రియుడా నీవు అన్నీ విషయాలలోనూ అభివృద్ధి
పొందాలని కోరుకుంటున్నట్లు భక్తుడు వ్రాసున్నాడు!
ఇక
తర్వాత మత్తయి 6:28; లూకా 12:27 ప్రకారం పద్మములకు దేవునిపై ఆధారపడి జీవించే
జీవితాన్ని సూచిస్తాయి!
అడవి
పద్మములు అవి వడకవు కొయ్యవు నూర్చుకోవు సమకూర్చుకోవు గాని దేవుడు వాటిని పోషిస్తున్నాడు
వాటికి కావలసిన ప్రతీదీ దేవుడు ఈ పద్మములకు ఇస్తున్నాడు అందుకే ఆ పద్మములు దేవునిమీద
ఆధారపడుతున్నాయి! వర్షాలు పడతాయా లేదా ఎండలు తగ్గుతాయా లేదా అనేవి ఈ పద్మములు పట్టించుకోవు!
నన్ను పోషించే నా దేవుడు పరలోకంలో ఉన్నారు! ఆయన
నాకు కావలిసిన సమస్తము ఆయనే చూసుకుంటాడు అనే ఒక దేవుని మీద ఆధారపడే స్థితి ఈ పద్మములకు
ఉన్నాయి, ఇది మరో విధమైన పద్మములున్న చోటు అనుభవం!
ప్రియ
సహోదరి సహోదరుడా నీకు ఇటువంటి పద్మములున్న చోటు అనుభవం నీకుందా!! తగ్గింపు జీవితం నీకుందా?
శ్రమలను సహిస్తూ ప్రభువు కోసం బ్రతికే జీవితం నీకుందా! అభివృద్ది చెందుతున్న అనుభవం నీకుందా!! ఎన్ని తలిచినా
ఏది జరిగినా దేవా నీ చిత్తము మాత్రమే జరగాలి అని మన జీవితాలు ప్రభువు చేతులకు అప్పగించుకునే
స్థితి అనుభవం నీకుందా!
అట్టి
అనుభవం దేవుడు మన అందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*43వ భాగము*
*చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను
కొండబాటలమీద త్వరపడి రమ్ము*
పరమగీతము 2: 17 చల్లనిగాలి వీచువరకు నీడలు
లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడి రమ్ము.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానమూ చేస్తున్నాము మనము ఇక 17వ వచనం
చూసుకుంటే చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద
త్వరపడి రమ్ము అంటుంది షూలమ్మితి!
ఇక్కడ
సూటి అర్ధము చూసుకుంటే మళ్ళీ మళ్ళీ క్రీస్తు తనను విడిచి దూర పర్వతాలకు వెళ్ళిపోతూ
ఉన్నట్టు ఉంటే విశ్వాసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రేమను ఒకసారి
రుచి చూశాక ఇది గాక మరింకేది అతణ్ణి తృప్తి పరచగలదు?
సరే, ఇప్పుడు మనం ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుంటే ఇక్కడ సాయంకాలపు నీడ గతించి చీకటి
పడబోతుంది చీకటైన తర్వాత సూర్యుని వెలుగు అనే అరుణోదయం కనిపిస్తుంది! పాత నిబంధన ముగింపులో మలాకి గ్రంధం తర్వాత 400 సంవత్సరాలు
చీకటి అలుముకుంది ఇశ్రాయేలు ప్రజలకు! ఆ రోజులలో దేవుని ప్రత్యక్షత
వారికి లేదు! ఆరోజులలో ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు!
అప్పుడు ఎంతోమంది భక్తిపరులైన యూదులు ప్రార్ధన చేశారు అయ్యా త్వరపడి
రమ్ము!!! ఇదే ఆ అనుభవం!
పరమగీతంలో ఈ ఆధ్యాయం చివర్లో ఉన్న ఈ వచనాలు ప్రత్యేకమైనవి! మొదటిగా షూలమ్మితి అన్నలు
చెప్పిన సహాయపడి గుంటనక్కలను పట్టుకొనండి అనేది- ఇక ఈ చివరి వచనంలో
చీకటి అలుముకున్నప్పుడు భక్తిపరులు అయ్యా త్వరపడి రమ్ము అని పిలుస్తున్నారు!
అయితే ఈ వచనం రెండవరాకడలో అనగా ప్రభువైన యేసు రమ్ము అని పిలిచే పిలుపు ఎంతమాత్రమూ
కాదు! ఇది రెండవరాకడను సూచించే వచనం ఎంతమాత్రమూ కాదు! ఇది యేసుక్రీస్తుప్రభులవారి
మొదటి రాకడకోసం అంటున్న మాటలు! ఆయన అనగా మెస్సయ్య పుడతాడని ఆయన
వచ్చి వారి చెరనుండి విముక్తి చేస్తారని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు! దానిని ఎంతోమంది ఆత్మద్వారా గ్రహించారు!
అలాగే క్రీస్తు వచ్చారు- వారి జీవితంలో వెలుగు ప్రారంభమైంది! పాపపు చీకటి నిజంగా పోయింది. క్రీస్తు యొక్క ప్రేమ సామ్రాజ్యం
మొదలైంది! దేవుని పరలోక రాజ్యం స్థాపించబడినది!
అందుకే
మత్తయి 4 వ అధ్యాయములో అంటున్నారు 13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న
హూమునకు వచ్చి కాపురముండెను.
14 జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును,
యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
15 చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి.
మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
16 అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు
(ఈలాగు జరిగెను.)
17 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక
మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
ఇక్కడ
కూడా మరణచ్చాయ అనే మాట నీడ అనే మాట కనిపిస్తుంది! దానిని క్రీస్తు తన వెలుగుతో నింపినట్లు మనము చూడగలము!
కీర్తన 102:11 లో నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి
గడ్డివలె నేను వాడియున్నాను అంటున్నాడు భక్తుడు!
మానవ
జీవితం సాగిపోతున్న నీడ లాంటిది! గాని నిజమైన జీవితం శాశ్వత జీవితం క్రీస్తులోనే ఉంది!
కీర్తన 109:23 లో మరొక నీడ ఉంది 23 సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. మానవ జీవితంలో కష్టాలు కన్నీరు సుఖాలు
వస్తుంటాయి పోతుంటాయి అయితే ఈ జీవిత యాత్రలో చీకటి కమ్మితే దేవుణ్ణి ప్రార్ధిస్తే దేవుడు
సహాయం చేసే దేవుడై ఉన్నాడు! అప్పుడు ఆయన మన ప్రక్కనే నిలబడి మనలను
బలపరుస్తాడు!
పౌలుగారికి
ఇలాంటివి ఎన్నో వచ్చాయి అప్పుడు ఆయన అంటున్నారు 2 తిమోతి 4:17 లో
6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది.
7 మంచి పోరాటము పోరాడితిని, నా
పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8 ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది.
ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
దానియేలు
గారు అలసి సొలసినప్పుడు దేవుడు తన దూతను పంపించి దానియేలు గారిని బలపరిచాడు దేవుడు!
అలాగే
దేవుడు రాబోయే దినాలలో దేవుడు ఇశ్రాయేలు జాతిని ఆదరించ బోతున్నారు అని అప్పుడే దేవుడు
వాగ్ధానం చేశారు యెషయా యిర్మీయా గ్రంధాలలో! అలాగే దేవుడు వారికి సహాయం చేశారు! నీవుకూడా ఆయన మీద ఆధార పడితే ఆయన మీద ఆనుకుంటే దేవుడు నీకు మేలులు చేసే దేవుడు!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*44వ భాగము*
*రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని
వెదకినను అతడు కనబడక యుండెను*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని
నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. మొదటి రెండు అధ్యాయాలలో అనేకమైన విషయాలు
నేర్చుకున్నాము! ఇక మూడవ అధ్యాయము ధ్యానం చేసుకుందాం!
అయితే గమనించాలి గతంలో చెప్పబడిన విధంగా ఇశ్రాయేలు జాతి కోణంలో ఈ అధ్యాయం
క్రీస్తుయేసు మొదటి రాకడ కోసం ఆయన బెత్లెహేములో జన్మించి సువార్త ప్రకటిన ఆరంభం కోసం
కోసం ఈ అధ్యాయంలో వ్రాయబడింది!
ఇక్కడ
సూటి అర్ధము చూసుకుంటే విశ్వాసి- దేవుడు దూరమైనట్టుగా, క్రీస్తు సన్నిధి
తొలిగి పోయినట్టుగా అనిపించిన వేళ విశ్వాసికి విషమ పరీక్షగా కనిపిస్తుంది.
. అప్పుడేం చేస్తాడు? మళ్ళీ క్రీస్తును వెదకాలి
యోబు 23:3, ఆయన నివాసస్థానమునొద్ద నేను
చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ;
కీర్తనల గ్రంథము 6:1-4, 1 యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
2 యెహోవా, నేను కృశించి యున్నాను,
నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి,
నన్ను బాగుచేయుము
3 నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
4 యెహోవా, తిరిగి రమ్ము,
నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.;
కీర్తనల గ్రంథము 13:1-3, 1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా?
నాకెంతకాలము విముఖుడవై యుందువు?
2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?
3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి
నాకుత్తరమిమ్ము;
కీర్తనల గ్రంథము
28:1-2, 1 యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను
నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా
నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
2 నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు
నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము;
కీర్తనల గ్రంథము 38:21-22, ;
కీర్తనల గ్రంథము
42:1-3, 1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల
దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
3 నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు
నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.;
కీర్తనల గ్రంథము
63:1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును;
కీర్తనల గ్రంథము 77:1-9, ; కీర్తనల గ్రంథము
105:4, ; కీర్తనల గ్రంథము 143:6-7, ;
అయితే దేవుడు అంటున్నారు:
యిర్మీయా 4: 1 ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా
యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా
సన్నిధినుండి తొలగించి
2 సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా
జీవముతోడని ప్రమాణముచేసిన
యెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు, ఆయనయందే
అతిశయపడుదురు.
హోషేయ 5:6, వారు గొఱ్ఱెలను ఎడ్లను తీసికొని
యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.,
హోషేయ 5:15, వారు మనస్సు త్రిప్పుకొని
నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ
సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. ;
ఆమోసు 5:4, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చునదేమనగా
నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
ఒక్కోసారి
క్త్రెస్తవ అనుభవమంతా చీకటిలో, ఒంటరి దారిలో తిరుగుతున్నట్టు ఉంటుంది. అయితే దేవుడు కొందరు కావలివాళ్ళను నియమించాడు – క్రీస్తు దగ్గరకు దారి
చూపించే విశ్వాస పాత్రులైన దైవ సేవకులు. వారి మాట విని ఆయన దగ్గరకు
వస్తే ఆయన బాటలో నడిస్తే తిరిగి నిన్ను దర్శించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారు!
మరి నీవు వస్తావా?
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*45వ భాగము*
*రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని
యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము. మొదటి వచనంలో షూలమ్మితి అంటుంది
1 రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని గాని అతడు
కనబడలేదు.
మొదటిగా
ఇశ్రాయేలు జాతి కోణంలో ధ్యానం చేసుకుందాం!
గతంలో చెప్పబడింది- ఇశ్రాయేలు జాతికి దేవుడు
దర్శనం ఇవ్వడం మానేశారు 400 సంవత్సరాలు! అప్పుడు అయ్యా నీ స్వరము వినిపించమని వారు బ్రతిమిలాడారు! అప్పుడు ఆయన స్వరము దూరంగా వినబడింది రెండవ అధ్యాయం చివర వచనాలలో! ఇప్పుడు ఇలాంటి స్థితిలో రాత్రివేళ పరుండి దేవుణ్ణి వెదుకుతుంది.
అయ్యా పడుకుని వెదికితే ఎవరైనా కనిపిస్తారా? లేదుకదా!!
ఒకవేళ నీ భర్త గాని నీ పిల్లలు గాని నీ పక్కలో ఉండేవారు కనబడకపోతే
ఇంట్లో వెదికితే కనబడతారు ఒక్కోసారి! మరి నీ ప్రియుడు దేవుడు యేసుక్రీస్తుప్రభులవారు
నీ ప్రక్కలో లేరు కదా- ఆయన స్వరము విని చాలా రోజులైంది కదా,
ఆయన ప్రత్యక్షత కనబడి చాలా రోజులైంది కదా- మరి
ఇప్పుడు నీవు పడుకుని వెదికితే ఆయన ఎలా కనబడతారు?
నేడు అనేకమంది తమ పాపపు జీవితాలలో ఉంటూనే దేవుడు నాతో ఉన్నాడు
కదా,
నేను పిలిస్తే జవాబు ఇస్తాడు కదా అని పొరపాటు పడుతుంటారు! మరికొంతమంది దేవుణ్ణి తమ పాలికాపు లేక పనోడు అనుకుంటారు! ఈ రాత్రంతా నాకు కాపలా కాయు అంటూ కాపలాధారిగా చేసేస్తారు! అప్పుడు ఆ స్థితిలో నీవు మొర్రపెట్టిన ఆయన నీకు జవాబు ఇవ్వరు! ప్రేమ అనేది ఇచ్చిపుచ్చు కోవడంలో ఉంటుంది! ఆయన నిన్ను
ఎంతగా ప్రేమిస్తున్నారో నీవుకూడా అంతే ప్రేమించాలి! ఆయన నీకోసం
ఎలా తపిస్తున్నారో నీవు కూడా ఆయన కోసం అంతగా తపించాలి ఆయన మందిరంలో గడపాలి ఆయన కార్యక్రమాలలో
పాల్గొవాలి నీవు ప్రేమిస్తున్నట్లు దేవునికి సూటిగా అర్ధమవ్వాలి . ఆవిధంగా నీ క్రియలుండాలి! అలాకాకుండా నీ మానాన నీవుండి
నీ లోకాచారాలు నీవు చేసుకుంటూ నేను బాప్తిస్మము తీసుకున్నాను గనుక నేను దేవుని బిడ్డనే
ఆయన నాతోనే ఉన్నారు అంటూ పొరబడకు! ఆయన నీ దగ్గర లేరు కారణం-
నీవు చేస్తున్న పాపపు కార్యాలు చూడలేక ఆయన దూరంగా ఏడుస్తున్నారు!
ఇట్టి స్థితిలో చీకటిలో శ్రమలలో సంకెళ్లలో ఉన్న నీకు- దేవుని ప్రత్యక్షత లేని
నీకు, దేవుని స్వరము వినబడని నీవు- ఇప్పుడు
పశ్చాత్తాప పడి దేవుణ్ణి మనస్పూర్తిగా వెదకాలి! వెదికితే ఆయన
దొరుకుతాడు! అడుగుడి మీకివ్వబడును! వెదకుడి
మీకు దొరకును! తట్టుడి మీకు తియ్యబడును అన్నారు యేసుక్రీస్తుప్రభులవారు!
అయితే మనస్పూర్తిగా వెదుకు! పెదాలతో పప్పలు వండినట్లు
కాదు! నీ మనస్సు హృదయం శక్తి అంతటితో మనస్పూర్తిగా శక్తివంచన
లేకుండా అడుగు! పశ్చాత్తాపంతో అడుగు! తప్పకుండా
మరలా ఆయన నీకు దొరుకుతారు!
గతభాగంలో
చెప్పుకున్నట్లు దేవుడు అంటున్నారు యిర్మీయా 4:1 లో
ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావాలి!
యిర్మీయా 24:7 ప్రకారం దేవుని ప్రజలు పూర్ణ
హృదయంతో ఆయనను వెదకాలి అలా వెదికితే ఆయన తిరిగి వారికి ప్రత్యక్షమవుతారు అన్నారు!
యెహేజ్కేలు 34:30 లో ఆయనను వెదికేవారికి దేవుడు
ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అంటున్నారు!
అదే 36:38 లో అలా ఎప్పుడు చేస్తారో అప్పుడు
మీరు నా జనులై ఉంటారు నేను మీకు దేవుడుగా ఉంటాను అంటున్నారు!
అలాంటి
స్థితిలో నేను మీకు ఒక రాజును ఇస్తాను అని వాగ్ధానం చేశారు! ఆయనే యూదులరాజు!
యెహేజ్కేలు 37:23; ఈయన కొరకు ఎన్నో వందల సంవత్సరాలుగా
ఎదురుచూస్తున్నారు! యెషయా 6 వ అధ్యాయంలో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు
అన్నారు! 9:6 లో ఇదిగో మీకు కుమారుడు అనుగ్రహించ బడుతున్నారు
ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నితయుడగు తండ్రి సమాధాన కర్త అంటున్నారు!
ఆయన
ఒకరోజు బెత్లెహేములో జన్మించారు! గొల్లలు ఆ వర్తమానం విని పరుగెత్తారు! తూర్పు దేశపు జ్నానులు దేశాలు నడిచారు కనుగొన్నారు! గాని
ఇశ్రాయేలు జాతి తమ కనులు మూసుకున్నారు! ఆ వర్తమానం నాకు నీకు
చేరింది! ఇప్పుడు ఆ వర్తమానం విని ఆయన వద్దకు వచ్చి ఆయనను సేవిస్తావా?
పూజిస్తావా? లేక ఆయన బిడ్డను అని చెప్పుకుంటూ లోకమును
ధనమును నీ స్వంత ఇష్టాలను పూర్తి చేసుకుంటూ సాతానును లోకమును సేవిస్తావా!!!
ఏదికావాలో తేల్చుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*46వ భాగము*
*రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని
యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. మొదటి వచనంలో షూలమ్మితి అంటుంది
1 రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని గాని అతడు
కనబడలేదు.
(గతభాగం తరువాయి)
ఇక
రాత్రివేళ దేవుణ్ణి వెదికినవారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేద్దాం!
కీర్తన 92:1—3 లో
1 యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
2 నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
3 పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను
ప్రచురించుట మంచిది.
4 ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత
నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను అంటున్నారు భక్తుడు!
134:1 లో దావీదు భక్తుడు అంటున్నారు 1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార
లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
2 పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
అనగా
ఇక్కడ రాత్రివేళ దేవుని ఆరాధించే వారు రాత్రివేళ దేవుని సన్నిధిలో గడిపేవారు ఆయన సేవకులు
అన్నమాట!
కీర్తన 42: 8 అయినను పగటివేళ యెహోవా తన
కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన
ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
ఇక్కడ
ప్రార్ధన మనకు తోడు! దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయనను కీర్తించి స్తుతించుట ద్వారా దేవుని సన్నిధి
మనతో ఉంటుంది!
ఇక కీర్తన 77:2 లో 2 నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ
చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
ఇక్కడ
భక్తుడు అంటున్నారు నీకు ఆపద కలిగితే ప్రార్ధన చేస్తావు సరే- నీ ఆపాతకాలంలో నీవు ప్రార్ధించవలసింది
రాత్రి వేల!
ఎందుకంటే
రాత్రివేళ నిన్ను నీ ప్రార్ధనను కలవర పరిచేవారు ఎవరూ ఉండరు! అందరూ పండుకున్నాక నీవు
దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నీకు జవాబు ఇవ్వగలరు! నీ
ఆపత్కాలంలో నీకు సహాయం చేయగలరు!
అయితే
యోబు గ్రంధంలో దేవుడే నీకు రాత్రివేళ తన పాటను పాడుకునే విధంగా నిన్ను చేయగలరు, ఇంకా నీకు బుద్ధి నేర్పుతారు అంటున్నారు 35: 10 అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు
11 భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె
మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును
లేరు.
ఇంకా
రాత్రివేళ ప్రార్ధన ఎందుకు చేయాలి అంటే రాత్రివేళ ఇశ్రాయేలు ప్రజలకు మరణం వచ్చింది
గుమ్మములోనికి గాని పస్కా పశు రక్తమువలన ఇంటిలోనికి రాలేకపోయింది నిర్గమ కాండంలో! గనుక నీకు కీడు రాకుండా
ఉండాలంటే నీవు రాత్రివేళ ప్రార్ధన చేయాలి!
ఇంకా
ఎందుకు చేయాలంటే కీర్తన
17:3 ప్రకారం దేవుడు రాత్రివేళ మన హృదయాలను పరీక్షిస్తూ ఉంటారు!
3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత
నేను అతిక్రమింపను
కాబట్టి
రాత్రివేళ దేవుడు నిన్ను పరిశీలించి నప్పుడు నీలో దురాలోచన గాని నోటిమాట ద్వారా అతిక్రమణ
గాని హృదయంలో పాపము గాని ఉండకూడదు! అలా ఉండాలంటే నీవు రాత్రివేళ ప్రార్ధన చేయాలి!
ఇంకా
అనేకమంది రాత్రివేళ పరుండి మంచము మీద పాపపు ఆలోచనలు కామపు ఆలోచనలు ఇంకా ఎవరినైనా దగా
చేయాలంటే మోసం చేయాలంటే అన్నీ రాత్రి మంచం మీదనే ఆలోచన చేస్తారు! అయితే వాటిని దేవుడు
పరిశీలన చేస్తారు రాత్రుళ్లు అని వారికి తెలియడం లేదు!
దావీదుగారు
కీర్తన 22:2 లో అంటున్నారు
2 నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను
రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
ఇక 88:1 లో కీర్తనాకారుడు మొర్ర పెడుతున్నాడు
1 యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా,
రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
2 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి
యొగ్గుము
అలా
మొర్ర పెట్టినప్పుడు 91:5 5 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
6 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు
రోగమునకైనను నీవు భయపడకుందువు.
119: 55 యెహోవా, రాత్రివేళ నీ నామమును
స్మరణ చేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను
యెషయా భక్తుడు అంటున్నారు 26:9 లో
9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న
ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు
రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. మరి ఇలాంటి ఆశ నీకుందా!
శ్రమలు
విస్తరించినప్పుడు యిర్మీయా భక్తుడు అంటున్నారు 14:8 లో
8 ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున
వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు?
ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;
దయచేసి
మమ్మల్ని కాపాడు అంటున్నారు!
ఇక
చివరిగా అసలు రాత్రి ఎందుకు ప్రార్ధన చేయాలి అంటే యేసుక్రీస్తుప్రభులవారు ఉదయమంతా సువార్త
ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్ధన చేసేవారు కాబట్టి!!!
లూకా 21:37 ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో
బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.
దేవాదిదేవుడు
పాప విమోచకుడు రానున్నవాడే ఒలీవల కొండమీద రాత్రంతా ప్రార్ధనలో గడిపినప్పుడు నీవు మాత్రం
ప్రార్ధన లేకుండా నీకున్న మంచం మీద ఇటు అటూ కునుకుతూ తిరుగుతూ ఉంటే నీకు దీవెనలు ఎలా
వస్తాయి?
చివరిగా
1 థెస్స 5 లో చూసుకుంటే 2 రాత్రివేళ
దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
7 నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
8 మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక,
విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ
మును ధరించుకొందము.
9 ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే
దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
10 మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము
ఆయన మనకొరకు మృతిపొందెను.
11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు
ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
ఆమెన్!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*47వ భాగము*
*రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని
యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. మొదటి వచనంలో షూలమ్మితి అంటుంది
1 రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని గాని అతడు
కనబడలేదు.
(గతభాగం తరువాయి)
ఇక
సంఘ కోణంలో చూసుకుందాము!!!
సరే, రాత్రివేళ ప్రాణప్రియుని వెదుకుతూ ఉంది షూలమ్మితి!!
ఇందులో నల్లనిదియైన బబులోను రాత్రివేళ పరుండియుండి యున్నప్పుడు,
ఆమె తన ప్రాణప్రియుని వెదికెనని వ్రాయబడింది. రాత్రి చీకటికి సూచన. చీకటిలో మనకు ఏమి కనబడదు. అనగా వెలుగు లేని జీవితములో ఆమె పరుండినట్లుగా చెప్ప బడింది. ఈ జీవితములో క్రీస్తు ప్రభువుకుకావలసిన
పరిశుద్దుల నీతిక్రియలు లేవు ఇవి తప్ప మిగిలినవన్ని వారి వద్ద ఉంటాయి. అవినీతికి నిలయముగాను సాతానుకు మందిరముగాను
ఈ జీవితము ఉన్నది. ఈమె
ఏ స్థితిలో ఉన్నదంటే చీకటిలో దైవత్వమునకు దూరముగా పరుండి అనగా పాపపు కార్యములు మధ్య
విశ్రాంతిలో ఉంది. ఈ
స్థితిలో ఉన్న నల్లనిదియైన బబులోను తనను ఏలుచున్న సాతాను శక్తులను వదలి తిరిగి తన ప్రాణప్రియుని
కోసము ఆ పాపపు స్థితిలో విశ్రాంతిని పొందుచు నిజమునుగూర్చి అబద్ధమును వదలి జీవించుటకు
ప్రయత్నించింది. కాని
అంత నిర్లక్ష్య ధోరణిలో పాపపు క్రియల మధ్య వెలుగు లేని జీవితములో నిజదైవమును వెదకినను
అక్కడ ఎందుకుంటాడు? కనుక
ఆమెకు ఆమె నిజమైన ప్రియుడు క్రీస్తు ప్రభువు కనబడలేదు. ఇది మొదటి ఆలోచన. దీనిలో నిజదైవమును కనుగొనాలన్న ఆలోచనతో
వెదకుట కనబడుచున్నది.
మూలవచనములో - పరుండి రాత్రివేళ వెదకినట్టి బబులోనులోని నిజదైవమును కనుకొనాలన్న షూలమ్మితి అంతటితో ఆగలేదు. తన ప్రయత్నము మరింత ముందుకు సాగి పట్టణముల
వద్దకు వెళ్లి సంతవీధులలో రాజవీధులలో క్రీస్తు ప్రభువు కోసము నిజదైవము కోసము వెదకుట
మొదలైంది. అక్కడ అందరు
వ్యాపారులు మోసగాళ్లు రకరకాల దేవుళ్లను పూజించువారు - తమవలె జీవించువారు అనేకులు కనిపించారుగాని
అక్కడ ఎక్కడ నిజదైవమునకు స్థానము ఉండదు, ఎందుకంటే అవి వ్యాపార
స్థలాలు మరియు ఈ లోకరీత్యా ఉన్నత స్థలాలు.
వీటిలో సాతాను అన్ని విధాలుగా విజృంభించి క్రియ జరిగిస్తాడు కనుక
అక్కడ దైవిక వెలుగుకు స్థానము లేదు.
కనుక అక్కడ ఆయనను ఎంత వెదకినను కనబడలేదు.
ఇక బబులోనులో ఉన్న వీరిలో ఆతృత
మరింత ఎక్కువ అయ్యిందేగాని వదలలేదు. ఏది నిజము? ఏది అబద్ధము? సమస్తములో వారి పరిశోధన కొనసాగుచున్నది. రాత్రివేళ పాపపు స్థితిలో మొదలైన
పరిశోధన తమ చుట్టు ప్రక్కల తమవలె పాపపు స్థితిలోని వారి మధ్య కొనసాగింపబడినను,
ఆ బబులోనులోని కన్యలు నిజదైవస్వరూపుడైన వారి ప్రాణప్రియుని కనుగొన లేకపోయారు
గాని, వారికి బబులోనులో ఉన్న అంధకార స్థితి పాపపు స్థితి అని
అక్కడ దేవుడు దేవుళ్లుగా చలామణి అగువారు అబద్ధికులు అని వారు నిజమైన దేవుళ్ళు కారు అని గ్రహింపు కలుగబట్టే నిజమైన దాని కొరకు
ఈ అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణలో ఇంకొక అడుగు ముందుకు వచ్చి అక్కడ పట్టణములయందు కావలి కాయువారు
(దీనికోసం తర్వాత భాగంలో చూసుకుందాం) అనగా సమాజపు
పెద్దలు లేక విగ్రహ దేవుళ్లు యాజకులు మొదలైనవారు ఆ బబులోను పట్టణమును అందులోని వారిని
కావలి కాయువారు వారిని నిజదైవమును గూర్చి అడుగుట జరిగింది. వారిని క్రీస్తు ప్రభువును గూర్చి
ప్రశ్నించింది కాని ఫలితము లేదు, ఎందుకంటే వారు కూడ అన్యులుగా
ఉంటూ సాతానుకు దాసులుగా ఉన్నారు! వారు అబద్ధపు దేవుళ్లు దేవతలకే
కొలువు చేయువారు గనుక - వారు కూడ క్రీస్తు ప్రభువును గూర్చిన
సమాచారము ఇయ్యలేక పోయారు.
ఇంతటితో షూలమ్మితి అన్వేషణ ఆగలేదు. ఇంకొక అడుగు ముందుకు వేసింది
. ఎలా? వారు పాపపు సమాజమైన బబులోనును విడిచి,
దానిని కావలి కాయు వారిలో శరీర రీత్యా ఉన్న పెద్దలను, యాజకులు మొదలైనవారిని విడిచి ఆత్మరీత్యా ఉన్న సాతాను ఏర్పరచిన దేవుళ్లను దేవతలను విడిచి అనగా మూలవచనములో
- ''నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా,'' అని చెప్పుట జరిగింది. ఎప్పుడైతే పైవన్ని అబద్ధమని వాటిని, వాటి సంబంధమైన సమస్తమును
విడిచి పెట్టిందో అప్పుడు - ''నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను,''
అని చెప్పుట జరిగింది.
అంటే క్రీస్తు ప్రభువు రక్షణలోకి
అనగా నిజదైవములోకి రావాలంటే మొదట అన్వేషణ జరిగించాలి. తమ చుట్టుప్రక్కల ఉన్నవారిలో పరిశోధించాలి. చివరకు అవన్ని అబద్ధములని గ్రహించి
మరికొంత ముందుకు అన్వేషిస్తూ ప్రయాణిస్తే - అక్కడ క్రీస్తు ప్రభువును
దర్శించగలుగుదురు. ఈ
విధముగా అనేకులు రక్షణలోకి వచ్చారు.
వారి సాక్ష్య జీవితము ఇంచుమించు ఈ పద్ధతిలోనే ఉంటుంది.
కాబట్టి
ఇప్పుడు విశ్వాసి క్రీస్తుని కనుగొనే వరకు వెదకాలి! అలా వెదికితే తప్పకుండా దొరుకుతాడు!
లూకా 11: 9 అటువలె మీరును అడుగుడి,
మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.
10 అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు
ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?
12 కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా
13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను
ఎంతో నిశ్చయ ముగా అనుగ్రహించుననెను.
అయితే
మొదటగా ఏ స్థితిలో నీవు పడిపోయావో గ్రహించి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడి వెదుకు! ఆయన నీకు దొరుకుతారు!
తిరిగి నిన్ను తన కుమారునిగా కుమార్తెగా చేసుకుంటారు! అలా దొరికిన తర్వాత తిన్నగా షూలమ్మితి వలె నీ గృహానికి నీ ఇంటికి తీసుకుని
రావాలి! నీ హృదయంలో ప్రధమ స్థానం ప్రభువుకు ఇవ్వాలి!
అలా
చేస్తే దేవుడు నీతోనే ఉంటారు!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*48వ భాగము*
*పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగితిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని
యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. 3 వ వచనంలో షూలమ్మితి అంటుంది
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని
చూచితిరా? అని నేనడిగి తిని
(గతభాగం తరువాయి)
ఇక్కడ
షూలమ్మితి మంచము మీద పరుండి ప్రాణ ప్రియుని వెదికితే ఆయన కనబడలేదు
గనుక ఇప్పుడు ఆమె బయటకు పోయి వెదకడం మొదలుపెట్టింది. అలా పట్టణం నడిబొడ్డుకు వచ్చింది. అక్కడ పట్టణమును కాపలాకాసే
కాపలాదారులు ఎదురు పడ్డారు- వారితో షూలమ్మితి అంటుంది అయ్యా కాపలావారలారా!
నా ప్రాణప్రియుడు సోలోమోను మీకు కనబడ్డాడా అంటే మాకు తెలియదు అన్నారు!
సరే ఇంతకు ఇక్కడ వర్ణించే ఈ కాపలాదారులు ఎవరై ఉండవచ్చు?
దీనికోసం భిన్నమైన అభిప్రాయాలున్నాయి! గతభాగంలో
ఆ కాపలాదారులు అన్యుల పూజారులు పండితులు అని తెలుసుకున్నాము! ఎందుకంటే అన్యజనుల మధ్య వెదికితే నిజదేవుడు ప్రాణప్రియుడు ఆమెకు దొరకలేదు!
వారు ఎందుకు చెప్పలేక పోయారు అంటే వారికి కూడా నిజంగా తెలియదు గనుక!
ఇక బైబిల్ ఆధారంగా ఈ కాపలాదారుల కోసం చూసుకుంటే నెహెమ్యా 4:9 ప్రకారం
నెహెమ్యా గారు యెరూషలేము పట్టణానికి కాపలాదారులను పెట్టినట్లు చూస్తాము! వీరిపని పట్టణమును శత్రువుల బారినుండి విడిపించడం, శత్రువులు
వస్తే లేక ఆపద రాబోతుంటే ప్రజలను హెచ్చరించి అలర్ట్ చేయడం వారి పని! దీనిని వాక్యపు వెలుగులో చూసుకుంటే పట్టణము దేవుని సంఘము! ఆ సంఘమును కాపాడేవారు కాపరులు మరియు ప్రవక్తలు! వీరు
సంఘమును శత్రువులు అనగా సాతాను నుండి తప్పుడు బోధలనుండి తోడేళ్లలాంటి దొంగబోధకులనుండి
కాపాడాలి! ప్రవక్తలు రాబోయే శోధనలు ప్రజలు చేస్తున్న తప్పులు
దేవుని నుండి తెలుసుకుని సంఘమును హెచ్చరించాలి!
ఆపో
20:28 లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి మిమ్మల్ని
కాపలా కాయమని చెప్పారు గనుక మీరు జాగ్రత్తగా ఉండమని పౌలుగారు హెచ్చరిస్తున్నారు! ఎంతగా కాపలా కాయాలంటే నెహెమ్యా
4:23 ప్రకారం తమ బట్టలు ఉదుకుకోడానికి తప్ప మరేందుకు తమ యూనిఫార్మ్ తీయకూడదు!
అంత జాగ్రత్తగా సంఘ కాపరులు పెద్దలు ప్రవక్తలు సంఘమును కాపాడవలసి ఉంది
అని గ్రహించాలి!
ఇక ఆదికాండము 31:38—41 వరకు
చూసుకుంటే అక్కడ యాకోబుగారు తన మామ మందను కాచారు, అప్పుడు అతడు
గొర్రెలకు గాని మేకలకు గాని నాశనం కలుగకుండా చూసుకున్నారు! ఒకవేళ
నష్టం కలిగితే దానిని తానే భరించారు! ఎందుకంటే దొంగలు కొన్నిసార్లు
పగలు గొర్రెలను దొంగలించారు దానిని యాకోబుగారు భరించారు! దుష్టుడు
కొన్నిసార్లు విశ్వాసులను దొంగలించి వారిని బ్రష్టులుగా చేస్తాడు. అలాంటి పరిస్థితులలో కాపరులు ఈ దుష్టుని నుండి కాపాడవలసిన అవసరం ఉంది!
ఇంకా ఆ ఆత్మలకు ఒకరోజు జవాబు చెప్పాలని తెలుసుకుని భారంతో భాధ్యతతో సంఘమును
కాయాలని ఈ భాగము తెలియజేస్తుంది!
అయితే యెహేజ్కేలు 34:8 లో కొంతమంది భాధ్యతలేని
కాపలాదారులు కనిపిస్తారు! వీరు గొర్రెలను కనికరించకుండా గొర్రెలను
తినేసేవారు! గొర్రెల యోగక్షేమాలు తెలుసుకోరు వారు తమ కడుపులు
మాత్రమే నింపుకుంటారు! వీరు మాదిరిలేని కాపరులు! ఇంకా కొంతమంది కేవలం జీతము కోసం మాత్రమే పనిచేస్తారు! ప్రజలు మెచ్చే ప్రసంగాలు చేసి వారి మెప్పు కోసం వారినుండి కానుకలు కోసం ఆశించి,
వారు ఎలా తిరిగినా తప్పులు చేస్తున్నా పాపంలో పడిపోయినా పట్టించుకోకుండా
తమ పొట్టను మాత్రం పోషించుకుంటారు! ఇలాంటివారికి తాను తీర్పు
తీరుస్తాను అంటున్నారు దేవుడు 34:10 లో!
ఇక యెహేజ్కేలు 48:11 లో ప్రతిష్టించబడిన కావలివారు కనిపిస్తారు! ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపోయారు!
లోకంలో కలిసిపోయారు! వీరుమాత్రం దేవుని కోసం నిలబడ్డారు!
కష్టాలను సహించారు! ప్రభువు వారికప్పగించిన వాటిని
కాపాడారు! అందుకే దేవుడు మెచ్చి వారికి శ్రేష్టమైన స్వాస్త్యమును
ఇస్తున్నారు! నీవు కూడా దేవుని సంఘాన్ని కాపాడుతూ దేవునికోసం
నిలబడితే నీకు కూడా మంచి స్వాస్త్యమును ఇవ్వడమే కాకుండా వాడబారని మహిమ కిరీటం కూడా
ఇస్తారు! దీనినే పేతురు గారు అంటున్నారు 1 పేతురు
5లో 2 బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను,
దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న
దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
3 మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు
మాదిరులుగా ఉండుడి;
4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ
కిరీటము పొందుదురు.
ఇక
2 రాజులు 11 వ అధ్యాయం ప్రకారం: కాపరులకు మూడు బాధ్యతలు అప్పగించారు! మొదటిది వీరు బలిపీఠాన్ని
కాపాడాలి! అనగా ఆరాధన మరియు ఆరాధనా క్రమాన్ని కాపాడి సంఘము నిజమైన
హృదయపూర్వకమైన ఆరాధన చేసేలా చేయాలి!
రెండు మందిరాన్ని సంరక్షించాలి!
అనగా సంఘమును కాపాడాలి! ఇంకా తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి!
మూడు రాజును భధ్రపరచాలి!
అనగా దేవుని నామమునకు అవమానం కలుగకుండా చూడాలి! అనగా ప్రభువునామమునకు అవమానం కలిగే కార్యాలు జరుగుతున్నప్పుడు కొరడా తీసుకుని
అనగా వాక్యముతో గద్ధించి ఖండించి బుద్ధి చెప్పాలి!
ఇక
కీర్తన 127:1 ప్రకారం కావలి వారు మేలుకొని ఉండాలి! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు
గాని శిష్యులు గాని అనగా పేతురుగారు గాని పౌలుగారు గాని తమ పత్రికలలో మెళుకువ కలిగి
ప్రార్ధన చేయమని పదే పదే చెప్పినట్లు మనము పత్రికలలో చూడగలము! యెషయా 62: 6 యెరూషలేమా, నీ ప్రాకారములమీద
నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
7 యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి
ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి.
తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు..
ఇక
యిర్మీయా 6:17 లో కావాలివారి చేతిలో భూరలు ఉండాలి వీరు అపాయమును గుర్తెరిగి సంఘమును హెచ్చరించాలి-
ఇది ప్రవక్తల పరిచర్య! వీరు దేవుని మాటలను హెచ్చరికలను
సంఘానికి తెలియజేయాలి ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకుని సంఘమునకు తెలియజేస్తూ హెచ్చరిస్తూ
ఉండాలి!
ప్రియ
సహోదరి సహోదరులారా! మీరు ఈ కాపలాదారుల మాటలను హెచ్చరికలను పాటిస్తున్నారా? వారికి లోబడుతున్నారా?
కాపరులారా
ప్రవక్తలారా పెద్దలారా సంఘమును హెచ్చరిస్తూ సంఘములను కాపాడుతున్నారా?
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*49వ భాగము*
*నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను*
పరమగీతము 3:1 రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను
రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు
నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగితిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు
నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని
యరలోనికి తోడుకొని వచ్చితిని.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. 4వ వచనంలో షూలమ్మితి అంటుంది నేను వారిని
విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని
తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
(గతభాగం తరువాయి)
ప్రియులారా! సోలోమోను అనే తన ప్రాణప్రియుడిని వెదుకుతున్న
షూలమ్మితికి పట్టణములో తిరుగుతూ ఉండగా కాపలాదారులను విడిచి కొంచెము ముందుకు వెళ్ళిన
తర్వాత ఆమెకు ప్రాణప్రియుడు సోలోమోను కనిపించాడు! అదేవిధంగా సంఘము
కూడా క్రీస్తుయేసుని చూసేవరకు కనుగొనే వరకు ఆయన కోసం వెదకడం ఆపకూడదు! అలా వెదికితే తప్పకుండా కనిపిస్తారు ఆయన! ఇప్పుడు షూలమ్మితి
సోలోమోనును కనుగొన్నది వెంటనే వదలిపెట్టక నేనతని
పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని
వచ్చితిని అంటుంది! తన ప్రేమను అక్కడ వ్యక్త పరుస్తుంది!
వెదికే వారికి దొరికే దేవుడు మన దేవుడు!
అలా ఎందరైతే వెదికారో వారందరికీ క్రీస్తు యేసు దొరికినట్లు బైబిల్
చెబుతుంది. భక్తిగల యూదులు కూడా ఆయనను వెదికి కనుగొన్నారు!
ఉదా: లూకా 2:8 లో మనకు కనబడుతున్న గొర్రెల కాపరులకు దేవదూతల దర్శన భాగ్యం కలిగింది సువార్తను
విన్నారు నమ్మారు బాలుడైన యేసును చూసి మ్రొక్కారు వారు! అయితే
నిజానికి చరిత్ర ప్రకారం వారు మామూలు గొర్రెల కాపరులు కాదు- వారు
కాచే ఆ గొర్రెలు యెరూషలేము దేవాలయంలో ప్రతీ రోజు అర్పిస్తున్న బలులకు ఉపయోగించే గొర్రెలనే వారు కాస్తున్నారు! వారు ధర్మశాస్త్రమును విని క్రీస్తుకోసం
ఎదురుచూస్తూ ఆయనను వెదుకుతున్నారు! అందుకే వారికి క్రీస్తు దొరికారు!
ఇక లూకా
2 వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్నానులు క్రీస్తు యేసును వెదుకుతూ యెరూషలేము
వరకు వచ్చారు- అయితే ఆయన వారికి బెత్లెహేము లో దొరికారు!
లూకా
1:5 లో జెకర్యా ఎలిజబెత్ లు దేవుణ్ణి ఎప్పటినుండో వెదుకుతున్నారు-
వారికి దేవుని సాక్షాత్కారం దొరికింది!
ఇక యోహాను
1:41 లో అంద్రెయ్య మెస్సయ్యా కోసం వెదుకుతున్నాడు- క్రీస్తు ఆయనకు దొరికాడు!
ఇక అదే భాగంలో ఫిలిప్పు మెస్సయ్యాను కనుగొన్నాడు.
ఏసయ్య ఫిలిప్పుతో నన్ను వెంబడించు అన్నారు- ఫిలిప్ నతానియేలుని కనుగొని నేను
మెస్సయ్యాను చూశాను వచ్చి చూడు అన్నాడు!
కాబట్టి క్రీస్తుని వెదికే వారందరికీ
ఆయన తప్పకుండా దొరుకుతారు అని గ్రహించాలి! ప్రభువు
ఎప్పుడూ ఎవరినీ నిరాశ పరచరు గాని తృప్తి పరచే దేవుడు!
సరే, ఇక ఈ భాగంలో మరో ముఖ్యమైన
మాట నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
దీనికోసం
అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి వాటిలో కొన్ని క్లుప్తంగా చూసుకుందాము!
మొదటగా సంఘ కోణంలో ఒక అర్ధము: నన్ను కనిన దాని ఇల్లు లేక అర అనగా
తన స్వంత సంఘమునకు రావడం అనేది ఒక వ్యాఖ్యానం!
ఇక మరొకటి ఇలా రక్షణలోకి
వచ్చిన అన్యజనులలో నుండి రక్షించబడిన
విశ్వాసులకు ఎప్పుడైతే రక్షణ అనుభవములోకి వచ్చారో వెంటనే రక్షణను
వదలిపెట్టక పట్టుకొనుట జరుగును. ఇక ఎవ్వరు ఎన్ని చెప్పినను ఎంతగా హేళన చేసినను వారు ఆయనను తమ ప్రాణప్రియునిగా
చేసుకొంటారేగాని వదలరు విడిచిపెట్టరు.
ఇంకా ఎక్కువ గట్టిగా విశ్వాసములో బలపడుట జరుగును. ఇలా గట్టిగా పట్టుకొని తన రక్షణ అనుభవమును
ముందుగా త్వరితగతిని తన తల్లి ఇంటికి అనగా నల్లనిదియైన బబులోనులోనికి కొనిపోయింది. ఇక్కడ విశ్వాసి తాను నిజమును కనుగొన్నానని
ఎంతో ఆనందముతో దానిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని తిరిగి తన తల్లి యింటికి కొనిపోయింది. తాను అన్వేషిస్తున్నన్ని రోజులు తన
యింటిలో వారికి అంతగా తెలియదుగాని ఒక్కసారి అన్వేషణ ఫలితమును మాత్రము తన తల్లియైన బబులోనులో
తెలియజేస్తుంది. అంతేకాదు తన ప్రాణప్రియుడని ఆయన ఒసగిన రక్షణను
తీసుకొని తనతో బాటుగా తోడుకొని వచ్చుట జరిగింది. ఇక్కడ వచనాలు చాలా విచిత్రముగా వ్రాయబడియున్నవి. తన తల్లి, తరువాత
వచనములో నన్ను కనినదాని అని చెప్పబడింది.
తన తల్లి అను పదములో గౌరవ భావము ఉన్నది. కనినదాని అను పదములో గౌరవము లేదు. అలా చెప్పుచూనే నన్ను కనినదాని యర
లోనికి తోడుకొని వచ్చితిని అని చెప్పబడింది. అంటే తాను రక్షణ పొందినది క్రీస్తుప్రభువును
కనుగొనినది. అంతటితో
ఊరుకొనక తాను పొందిన రక్షణను తన తల్లి యింటికి కొనిపోయింది. కాని అక్కడ ఉన్నవారంతా అన్యజాతివారు
విగ్రహారాధికులు. అక్కడ
పరిస్థితి ఎటు చూచిన విగ్రహారాధన మధ్యలో రక్షణ స్వరము వచ్చి చేరింది. ఇక్కడ కనినదాని యర అనుటలో బబులోనులో
ఈ విశ్వాసిగా మారిన వాని జన్మ జరిగింది.
దాని యరలో అన్యజాతులవారున్నారు. బబులోను విగ్రహారాధన మూలమైన ప్రాంతము. నరుల పతనానికి ఇదే పట్టుకొమ్మలాంటిది. మనిషిని అన్ని రకములుగా దేవునికి
దూరముగా చేయగల సత్తా దానికి ఉంది. చివరకు అటువంటి ప్రాంతములోనికి ఈ రక్షణను తోడుకొని తనతో బాటుగా విశ్వాసిగా
మారినవారు దైవ రక్షణకు మూలమైన ప్రభువును తమతో తీసుకొని పోవుట జరిగింది. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువుయొక్క
నామము దశదిశల వ్యాపింపజేయగలిగినారు. ఉదాహరణకు యాకోబు బావి దగ్గర
సమరయ స్త్రీ క్రీస్తుయేసుని కనుగొని నేను చేసినవి అన్నీ నాతో చెప్పిన వానిని చూడటానికి
రండి అంటే నీవేమీ చేశావు అని అడిగితే తన అసలైన పాపపు జీవితం కప్పుకోకుండా నిజము చెప్పి-
క్రీస్తు తనలో ఎలాంటి మార్పుని తీసుకుని వచ్చారో తెలిపి ఆ గ్రామమును
మార్చగలిగింది! ఇదే సరియైన ఉదాహరణ! నీవు
కూడా రక్షించబడ్డాక నీ స్వంత వారికి ఇరుగుపొరుగు వారికి నీ గ్రామ జనులకు ఈ సువార్త
చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది!
ఇక మరో కోణములో చూసుకుంటే దైవగ్రంధం మొత్తం
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడింది అని మనకు బాగా తెలుసు!
ఇక్కడ నన్ను కన్నదాని అర అది యెరూషలేము మరియు యూదుల దేశము అనేది మరో
అర్ధము ప్రియులారా! ఇది యూదుల లేక ఇశ్రాయేలు జాతి కోణములో భావము
అని గ్రహించాలి! షూలమ్మితి స్వగ్రామం షూనేము! అయితే తన తల్లి స్వంత ఇల్లు బెత్లెహేము! ఇశ్రాయేలు దేశం
మరియకు యోసేపుకి యేసుక్రీస్తుప్రభులవారికి మాతృభూమి అని గ్రహించాలి! ఇక్కడ బాలుడైన యేసుక్రీస్తుప్రభులవారు మార్గంలో జన్మయిస్తే భూమిమీద ఆయన తల్లిదండ్రులు
ఆయనను సత్రములో స్థలము లేనందున ఒక పశువుల పాకలో బెత్లెహేములో ఆయనను పరుండబెట్టారు!
ఇదే యూదుల వద్దకు నజరేయుడైన వచ్చిన మొదటి రాకడ! ఆయన ఈ సర్వసృష్టికి పాపరక్షకుడిగా ఈ భూలోకమునకు వస్తే ఆయనను యూదుల దేశంలో బెత్లెహేము
అనే గ్రామంలో పశువుల పాకలో తీసుకుని వచ్చి పరుండబెట్టడం అనగా తన స్వంత తల్లి ఒక్క అరలో
లేక ఇంట్లోకి మెస్సయ్యను తీసుకుని వచ్చుట ప్రియులారా!
ప్రియ
సహోదరి సహోదరుడా! సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకుంటున్నావు అయితే నీ హృదయంలో క్రీస్తు
ఉన్నారా? నీ గృహములో క్రీస్తు పరిపాలన చేస్తున్నారా లేదా???
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*50వ భాగము*
*ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి*
పరమగీతము 3: 5 యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని
లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి?
గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను
పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. 5వ వచనంలో షూలమ్మితి
అంటుంది యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు
లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు
కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
ప్రియులారా
దీనికోసం మనము 2:7 ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాము గనుక ఇక మనము ఆరవ వచనానికి వచ్చేద్దాం!
ఈ
వచనంలో 6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను
సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
అంటున్నారు! ఇంతకీ ఈ మాట పలికినది ఎవరు?
ఎందుకు పలికారు అని చూసుకుందాము!
మొదటగా ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుందాము!
ఈ మాట పలుకుతుంది అన్యజనులు! ఇశ్రాయేలు
జాతి కనాను యాత్రలో ఉండగా ఆ ప్రాంతంలో ఉన్న జాతులు పలుకుతున్న మాటలు ఇవి! పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము ఇశ్రాయేలు జాతిని 40 సంవత్సరాలు నడిపించి యుండగా చూచిన అన్యజనులు పలికిన మాటలు ఇవి!
ఈ వచనములో ఐగుప్తును విడనాడిన సందర్భమును గుర్తు చేసుకొనుచు
వర్ణించబడింది. వారు ఎఱ్ఱ సముద్రము దాటు సందర్భము మొదలు ఎడారిలోను
కానాను ప్రవేశించుటకు ముందు వరకు ఈ స్తంభము వారిని నడిపించింది. నిర్గమ కాండము 14:19-20,
''అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి
వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి
పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల
సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను
గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల
సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.''
ఈ విధముగా ఈ మేఘస్తంభము వారిని రక్షించింది. అటుతరువాత - నిర్గమ కాండము 40:36-38, ''మేఘము మందిరముమీదనుండి పైకి
వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు
దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.
ఇశ్రాయేలీయు లందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద
ఉండెను. రాత్రి వేళ అగ్ని
దానిమీద ఉండెను. వారి
సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.''
ఈ విధముగా అగ్నిస్తంభముగా రాత్రి, మేఘస్తంభముగా
పగలు వారిని నడిపింపజేశాడు. ఈ అగ్ని మండుచు పొగవలె, మేఘము క్రమ్ముట వలన అది బూడిద
రంగువలె కనిపించుట వలన దానిని ధూమస్తంభముగా గీతములో అలంకారముగా వర్ణించుట జరిగింది. ఇది మొదట ఐగుప్తులో ప్రారంభమై,
ఎఱ్ఱ సముద్రములోను, ఎడారి గుండా ప్రయాణించి చివరకు
అరణ్యమార్గముగా కానాను చేరుకొన్నది. కనుక ఈ వచనములో ఈ ధూమ స్తంభమువలె
అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అని గీతములో వ్రాయట జరిగింది.
ఇలా వచ్చుచున్న దాని నుండి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము
వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చుచున్నట్లుగా వ్రాయబడింది.
నిర్గమ కాండము 30:22-29, ''మరియు యెహోవా మోషేతో ఇట్లనెను-నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున,
అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము,
అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది
తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును
మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము, అనగా సుగంధ
ద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. ఆ తైలములో నీవు సాక్ష్యపు గుడారమును
సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరిశుద్ధమైనవిగా
ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను.'' ఇందులో వివిధ రకములైన సుగంధ
ద్రవ్యములతో తైలము చేసి
దానిని మందసమునకు పవిత్రమైన వస్తువులపై చల్లగా ఆ పరిమళించు సువాసనతో ఆ మందసము అరణ్య
మార్గముగా కానానుకు చేరుట జరిగింది.
ఈ యొక్క సందర్భాన్ని అద్భుతముగా అలంకార ప్రాయముగా ఈ గీతములో వర్ణించాడు.
అవి
నేటి దినాలలో మనము చేస్తున్న ప్రార్ధనలకు ఉపవాసములకు చేతులెత్తి ప్రార్ధించి స్తుతించడానికి
సాదృశ్యముగా ఉన్నాయని గ్రహించాలి!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*51వ భాగము*
*ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి*
పరమగీతము 3: 5 యెరూషలేము కుమార్తెలారా,
పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని
లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి?
గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను
పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో 6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను
సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
అంటున్నారు! ఇంతకీ ఈ మాట పలికినది ఎవరు?
ఎందుకు పలికారు అని చూసుకుందాము!
(గతభాగం తరువాయి)
రెండవదిగా సంఘ కోణంలో
కోణంలో చూసుకుందాము!
ఇది మొదటగా ప్రభువు అరణ్య మార్గములో బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు
వచ్చి యోహాను గారి ద్వారా నీటి బాప్తిస్మము తీసుకొనడం సూచిస్తుంది ప్రియులారా! యేసుక్రీస్తుప్రభులవారు
మొట్టమొదట అరణ్య మార్గములోనే వచ్చి తన సువార్త పరిచర్య చేశారు!
కాబట్టి మొట్ట మొదట ఈ ధూమ స్తంభము యేసుక్రీస్తుప్రభులవారి యొక్క సువార్త
పరిచర్య!
అది స్తంభము వలె మేఘము వలె ధూమము వలె యెరూషలేము నుండి బయలుదేరి మనవరకు
వచ్చి చివరకు ప్రపంచపు నలుమూలలా చేరుకోవడం అప్పుడే భక్తుడు ఆత్మలో చూసి మైమరచి పోయి వ్రాస్తున్న కావ్యం! ఈ ధూమ స్తంభమును ఆపాలని ఆర్పాలని
పరిసయ్యులు శాస్త్రులు ఇంకా నాటి రోమా అధికారులు ప్రయత్నించారు వారి వల్ల కాలేదు!
నీరోదు చక్రవర్తి ప్రయత్నించాడు వాడి వల్లకాలేదు! టైటస్ చక్రవర్తి ప్రయత్నించాడు వారి తరం కాలేదు! ఎందరో
రాజులు అధికారులు ప్రయత్నించారు వారి వల్లకాలేదు! సంఘముగా ప్రారంభించినా
తర్వాత విగ్రహారాధికులుగా మారిపోయిన RCM లేక రోమన్ క్యాథలిక్
సంఘము మరియు సామ్రాజ్యము కూడా ప్రయతించింది కానీ వారి వల్లకాలేదు! ఇది ఇంకా అన్నీ ఖాండయాలలోను చొచ్చుకు పోయింది చొచ్చుకుపోతుంది! ఇదే సువార్త ధూమము!
అయితే ఒక్కమాట! ఆ మేఘ స్తంభము అగ్ని స్తంభము ఆనాడు ఇశ్రాయేలు
ప్రజలను ఎలా కాపాడిందో అలాగే నేటి రోజులలో మరియు సంఘము ప్రారంభమైన తొలి రోజులనుండి
సంఘమును మరియు సంగహస్తులను ఈ ధూమ స్తంభము కాపాడుతూ వస్తుంది! అవును కొన్ని లక్షలమందిని కోట్ల మందిని చంపగలిగారు గాని సంఘమును క్రైస్తవ్యమును
ఆపలేక పోయారు! ఎందుకంటే దీని అధిపతి నాయకుడు రాజులరాజు ప్రభువుల
ప్రభువు! దీనికి మూలము భూమిమీద లేదు ఒకవేళ ఉంటే దానిని ఆపివేయ
గలిగె వారేమో! గాని దీని పునాది పరలోకములో ఉంది! అక్కడకు వెళ్ళి అంతం చేయడం వీరి అబ్బ తరం కాదు!
కాబట్టి ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్న వారిని దేవుడు పిలుస్తున్నారు
యిర్మీయా గ్రంధంలో 2:2 2 నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము
ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు అరణ్యములోను,
విత్తనములు వేయదగని దేశములోను, నన్ను వెంబడించుచు
నీ యవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
ఇక్కడ దేవుడు మరలా పిలుస్తున్నారు!
4వ అధ్యాయములో అంటున్నారు
1 ఇదే యెహోవా
వాక్కు ఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే
రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి
తొలగించి
2 సత్యమునుబట్టియు న్యాయమును బట్టియు నీతినిబట్టియు యెహోవా
జీవముతోడని ప్రమాణము చేసినయెడల జనములు ఆయనయందు తమకు ఆశీర్వా దము కలుగుననుకొందురు,
ఆయనయందే అతిశయపడు దురు.
3 యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.
4 అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి
యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
5 యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి
పోవునట్లుగా పోగై రండి.
ఈ
వర్తమానము వినిన అనేకమంది మత్తయి సువార్తలో తండోప తండాలుగా ఆయన వద్దకు రావడం మొదలు
పెట్టారు! మత్తయి 4: 13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న
హూమునకు వచ్చి కాపురముండెను.
14 జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును,
యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
15 చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి.
మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
16 అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు
(ఈలాగు జరిగెను.)
17 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక
మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు
బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
8: 1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు
ఆయనను వెంబడించెను.
ఇక 10 వ అధ్యాయములో దేవుడు ఈ సువార్త అందరికీ అందాలి
అనే లక్ష్యముతో తన శిష్యులను దేశమంతటా పంపించారు
1 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును
ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
7 వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.
8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని
లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా
ఇయ్యుడి.
అలా పంపించిన తర్వాత వారు వచ్చారు- శిష్యుల కూడా ఈ అరణ్య అనుభవములో గుండా
వెళ్లారు! చివరకు ఆ మార్గమును నేర్చుకుని ఏసయ్య పునరుత్థానం మరియు
ఆరోహణం తర్వాత ఇదే బోధను ప్రకటిస్తూ ప్రపంచమంతా బోధించారు అది దూపము వలె, ధూమము వలె మనవరకు వ్యాపించి వెలుగుతుంది! ఇప్పుడు దీనిని
చూస్తున్న అన్యజనులు రాజులు అధికారులు అడుగుతున్నారు అరణ్యమార్గమున ధూమము వలె వస్తున్న
ఇది ఏమిటి? ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి?
అది క్రీస్తుయేసు శిలువ సువార్త! క్రీస్తు రక్షణ
సువార్త!
ఇక
మరో కోణము సంఘ కోణము లోనే-
మత్తయి 21 వ అధ్యాయములో శిలువ మరణానికి ముందుగా
యెరూషలేము జయప్రవేశము చేసినప్పుడు గాడిద మరియు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నప్పుడు
గొప్ప జనసమూహము ఆయనను వెంబడించి దావీదు కుమారునికి జయము! హోసన్నా
అంటూ జయజయ ధ్వనులు చేస్తున్నపుడు మొత్తం యెరూషలేము పట్టణము మరియు అధికారులు కంగారూ
పడుతూ ఈయన ఎవరూ అంటూ ఆశ్చర్య పోయిన సన్నివేశమే ఇది!
7 ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ
బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.
8 జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి;
కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.
9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక
వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక
సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.
10 ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయుఈయన
ఎవరో అని కలవరపడెను.
ఇదీ
ఆయన గొప్పతనము! మరి ఆయన గొప్పతనము తెలుసుకున్న నీవు మరి ఆయనతో పాటుగా జయజయ ధ్వనులు చేసుకుంటూ
వెళ్లగలవా!!!
ఇక మూడవది:
ఇక్కడ స్నేహితులు మాట్లాడుతూ ఉన్నట్టు అనుకోవాలి. ఈ పుస్తకంలోని
పరమ సత్యాలకు సూచనగా ఉన్న సొలొమోను రాజునూ అతని పెండ్లి కూతురునూ గురించి మాట్లాడుతున్నారు.
సొలొమోను తన రాజ ఠీవి, వైభవమంతటితో తన వధువును
తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది (పరమగీతము 8:5). ఇందులో విశ్వాసుల విషయంలో ఆధ్యాత్మిక భావం లేకపోలేదు. ఈ పుస్తకంలోని ప్రత్యేకమైన గుణాల్లో ఒకటి ఏమిటంటే దృశ్యాలు హఠాత్తుగా మారిపోతూ
ఉంటాయి. వధువు గొర్రెల కాపరుల పొలాల్లో తన ప్రియుని కోసం వెదుకుతూ
ఉంది (పరమగీతము 1:7-8, );
వరుడు దగ్గరలో
ఉన్నాడు (పరమగీతము 1:9-11, );
వారిద్దరూ రాజనగరులో
జంటగా ఉన్నారు (పరమగీతము 1:12-17, );
హఠాత్తుగా వరుడు కొండల్లో ఉన్నాడు గాని ప్రియసఖి కోసం ఆమె ఇంటికి
త్వరత్వరగా వచ్చి పిలుస్తున్నాడు (పరమగీతము 2:8-15, );
మళ్ళీ అతను కొండల్లో ఉన్నాడు, ఆమె ఒంటరిదైపోయింది
(పరమగీతము 2:16-17, } పరమగీతము 3:1-3,
);
వారిద్దరూ ఆమె తల్లి ఇంట్లో ఒకటిగా ఉన్నారు (పరమగీతము
3:4-5, );
ఇప్పుడు వరుడు ఎడారి మార్గాన ఆర్భాటంతో వైభవంతో వస్తున్నాడు. ముందు
కూడా ఈ పుస్తకం తీరు ఇలానే ఉంటుంది. అంటే, దీన్లో క్రమబద్ధమైన కథ ఆరంభం, మధ్యం, అంతం అంటూ సాఫీగా సాగదు. వధూవరుల మధ్య ఉన్న సంబంధాన్ని
చిత్రీకరించే వివిధమైన సన్నివేశాలు చిన్నచిన్నవి కనిపిస్తాయి. ఇలా రాయడంలో ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం ఏమిటంటే విశ్వాసులు క్రీస్తులో తమ జీవితంలో
చవి చూడవలసిన వివిధమైన అనుభవాలను వివరించడం, క్రీస్తు సౌంధర్యాన్ని,
వైభవాన్ని, తన సంఘం కోసం ఆయనకున్న లలితమైన ప్రేమను
వెల్లడి చేయడం. ఈ భాగంలో ఆయన మహిమ, బలప్రభావాలను
కొంతమట్టుకు చూడగలం (కీర్తనల గ్రంథము 45:3-5). విశ్వాసులు (వారికిది తెలిసివున్నా తెలియకపోయినా)
ఈ లోకంలో మహిమ రాజు ప్రక్కన కూర్చునివుండి పరలోక సంబంధమైన పల్లకీలో సాగిపోతున్నారు.
రాత్రివేళల్లో అపాయం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ (వ 8) రాజుతో కలిసి వెళ్తున్న ఆయన వధువుకు కట్టుదిట్టమైన
భద్రత ఉంది.
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*52వ భాగము*
*ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది*
పరమగీతము 3: 7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది
అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు
యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని
యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో 7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు
ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు. అంటున్నారు!
ఈ మాటలు పలికింది ఎవరు?
దీనికోసం
భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి! అయితే ఇక్కడ ఎక్కువమంది అభిప్రాయ పడేది ఏమిటంటే ఈ మాటలు పలుకు
చున్నది స్నేహితులు- షూలమ్మితి యొక్క స్నేహితులు అని గ్రహించాలి!
ఇక సోలోమోను కోసం పల్లకి రావడం ఏమిటి? కారణం రాజుల కోసం పల్లకి
రాదు- వధువు కోసం వస్తుంది గాని!
ఇక ఆ పల్లకి అంటే ఏమిటి?
మోయు వారెవరూ?
ప్రియులారా
ఈ రోజు మొదటి కోణంలో చూసుకుందాము! అనగా ఇశ్రాయేలు జాతి కోణంలో :
సొలొమోను
పల్లకి వస్తున్నది అని చెప్పబడింది.
పల్లకిలో వధువు వచ్చునుగాని సొలొమోను కాదు. మహారాజుల ప్రయాణము రథముల మీదను లేదా
గుర్రముల మీదను ఉంటుంది. అలాగే వధువు కోసము సొలొమోను పల్లకి పంపితే సొలొమోను పల్లకి వధువు కోసము వెళ్లుచున్నది
అని వ్రాయాలి. అట్లుగాక
వధువును తీసుకొని వస్తుంటే అది వధువు పల్లకి అవుతుందిగాని సొలొమోను పంపినను వధువు పల్లకి
వస్తుందనే చెప్పుదురు.
ఇంతకి ఈ
పల్లకి ఏమిటి? మందసమే. అరణ్యమార్గములో పరిమళించుచు ఎవరు
ఉపయోగించని తైలముల సుగంధమైన వాసనలతో ఆ మందసము ఊరేగింపుగా దానిని మోసుకొంటూ వస్తున్నారు. నిర్గమ కాండము 37:1-5, ''మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు రెండు మూరలనర దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు
మూరెడునర. లోపలను వెలుపలను
దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను. దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి,
ఒకప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు
దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.
మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను
పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.'' ఈ విధముగా మందసమును పల్లకిని మోసుకొని
వచ్చునట్లుగా నాలుగు ప్రక్కల మోసుకొని వచ్చేవారు. పల్లకీలలో సాధారణముగా వధువు ఉంటుంది. కాని దీనిలో మందసము అందలి వస్తువులు
ఉన్నాయి. ఇవన్ని క్రీస్తు
ప్రభువుకు సూచన. చిగురించిన
అహరోను కర్ర క్రీస్తు ప్రభువుకు సూచన.
పది ఆజ్ఞలు చెక్కబడిన రాళ్లు క్రీస్తు ప్రభువుకు సూచనే. ఇవన్ని మందసములో ఉంచుట వలన క్రీస్తు
ప్రభువును వారు పల్లకిలో ఉంచుకొని మోసుకొంటూ వస్తున్నారు. అందువలన ఈ మందసమునకు సొలొమోను పల్లకి అని నామకరణము చేశారు. సొలొమోను రాజు అతనిలోని జ్ఞానము క్రీస్తు
ప్రభువు. క్రీస్తు ప్రభువే
ఆ పల్లకి అనగా మందసములో పరిశుద్ధమైన వస్తువుల రూపములో ఉన్నారు. కనుక ఇది సొలొమోను పల్లకిగా వర్ణించబడింది.
ఈ విధముగా
మందసమును నాలుగు ప్రక్కల మోసుకొంటూ వస్తున్నారు. ఈ మందసమును కాపాడుటకు అరువదిమంది
శూరులు దానికి పరివారముగా ఉన్నారు.
వీరు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. వీరందరు కూడ ఖడ్గము ధరించినవారు. యుద్ధము చేయగలిగిన వీరులే. ఇంతకి వీరు ఎవరు? యాకోబు సంతతివారు. వారిలో లేవీయులు దేవాలయములో దేవునికి
సేవ చేసుకొనువారు గనుక వీరు యుద్ధమునకు రానవసరత లేదు. మందసమునకు వెలుపటి కార్యక్రమాలలో
వీరు పాల్గొన అవసరము లేదు. వీరికి కేవలము మందసమున్న దేవుని ఆలయములో వారు దేవునికి సేవ చేసుకొందురు. యాజకులుగాను పనివారుగాను ఆలయములో
ఉండురు. కనుక ఈ డెబ్బదిమందిలో
నుండి వారి పేర్లు తొలగించాలి. ఈ పేర్లు లేని లేక వ్రాయబడని లేవీయులు మాత్రమే దానిని కాపలా కాయాలి. సంఖ్యా కాండము 1:48-54,
''ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను- నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు. ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును
చేర్చకూడదు. నీవు సాక్ష్యపు
గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణము లన్నిటిని
మోయవలెను. వారు మందిరపు
సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే
దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష
నొందును. ఇశ్రాయేలీయులు
తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.
ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము
చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని
తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.'' దీనినిబట్టి లేవీయులు మందసమునకు చుట్టు ఉంటూ దానిని కావలి కాయుచున్నారు. రాత్రి చీకటి భయము వలన వారు రాత్రులందు
కూడ ఖడ్గము ధరించి దానిని కావలి కాస్తున్నట్లుగా చెప్పబడింది. కనుక వీరు లేవీయులు.
కాబట్టి నూతన నిబంధన సంఘములో వీరు క్రీస్తు నామమునకు అవమానం
కలుగకుండా చూడవలసిన భాధ్యత వీరిదే! వారిదే కాదు క్రీస్తు నామమును ధరించిన
ప్రతీ ఒక్క ఆయన నామమునకు మహిమ కలుగునట్లు చూచుకోవాలి తప్ప ఆయన నామమునకు అవమానం కలిగే
పనులు ఏవీ చేయకూడదు అని గ్రహించాలి!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*53వ భాగము*
*ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది*
పరమగీతము 3: 7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది
అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు
యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని
యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో 7
ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము
వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు
అంటున్నారు!
ఈ
మాటలు పలికింది ఎవరు?
దీనికోసం
భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి! అయితే ఇక్కడ ఎక్కువమంది అభిప్రాయ పడేది ఏమిటంటే ఈ మాటలు పలుకు
చున్నది స్నేహితులు- షూలమ్మితి యొక్క స్నేహితులు అని గ్రహించాలి!
ఇక
సోలోమోను కోసం పల్లకి రావడం ఏమిటి? కారణం రాజుల కోసం పల్లకి రాదు- వధువు కోసం వస్తుంది గాని!
ఇక
ఆ పల్లకి అంటే ఏమిటి?
మోయు
వారెవరూ?
ప్రియులారా
ఈ రోజు మరో కోణంలో చూసుకుందాము!
(గత భాగం తరువాయి)
గతభాగంలో పల్లకి వధువుకోసం అని చూసుకున్నాము! అయితే మరొక అభిప్రాయం
ఏమిటంటే ఆ పల్లకిలో షూలమ్మితితో పాటుగా సోలోమోను కూడా ఉన్నాడు అంటారు! పల్లకి అనేది ప్రయాణమును సూచిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు
సంఘము లేక సంఘములో ప్రతీ ఒక్కరూ ఆత్మీయ యాత్రలో ఉన్నారు అనగా పరమకనాను యాత్రలో ఉన్నారు!
అయితే ఇప్పుడు పల్లకిలో షూలమ్మితితో పాటుగా సోలోమోను కూడా ఉన్నాడు అనగా
పరమకనాను యాత్రలో షూలమ్మితి అనగా సంఘముతో పాటుగా పరమ సోలోమోను అనగా యేసుక్రీస్తుప్రభులవారు
కూడా ఉన్నారు!
ఇక దీనిని
60 మంది శూరులు మోస్తున్నారు! వీరు కేవలం సేవకులు
కాపరులు మాత్రమే కాకుండా ఆయన పరిచర్య చేస్తున్నవారు అనగా మందిరములో చాపలు ఎత్తేవారు
వేసేవారు మందిరమును కడిగేవారు సమస్తవిధములైన పరిచర్య చేసేవారంతా ఉన్నారు!
అయితే ఈ పల్లకిని అనగా దేవుని మందసమును
దావీదుగారి కాలంలో మొదట క్రొత్త బండి మీద ఎక్కించి నాశనమును తెచ్చుకున్నారు!
ఆ తర్వాత దానిని తప్పకుండా భుజముల మీదనే మోయాలి అనే ధర్మశాస్త్ర ఆజ్నను
పాటించి భుజముల మీద మోసినప్పుడు గమ్యస్థానం చేరడమే కాకుండా ఆశీర్వాదాలు పొందుకున్నారు!
మరి
ఆ అరవై మంది శూరులలో నీవొక శూరుడిగా వీరుడుగా ఉండగలవా? ఆ పల్లకిని లేక మందసమును
మోయగలవా??!!
గమనించాలి- ఈ అరవై మంది ఐక్యతతో
ఆ పల్లకిని మోసారు యుద్ధములు చేయడానికి సిద్దంగా ఉన్నారు! మరి
సేవకులు పరిచారకులు కాపరులు కూడా సంఘములో ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉంది! సంఘ పెద్దలు మరియు సంఘము ఐక్యతతో ఉండాలి! సంఘపెద్దలు
మరియు సంఘకాపరి ఐక్యతతో ఉండాలి! సంఘము మరియు కాపరి ఐక్యతతో ఉండాలి!
అదే సమయములో సంఘకాపరులు ఒకరితో ఒకరు ఐక్యతతో ఉండాలి అని ఈ వచనం ద్వారా
గ్రహించాలి!!!
1 కోరింథీ 1:10 లో చూసుకుంటే కోరింథీ సంఘ విశ్వాసులు అనేకసార్లు
ఐక్యతను కోల్పాయారు తద్వారా అనేకసార్లు పౌలుగారు ఏడ్చారు!!
మరలా 2 కోరింథీ
13:11 లో మరోసారి చెప్పారు 11 తుదకు సహోదరులారా, సంతోషించుడి,
సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి,
ఏకమనస్సు గలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ
సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
ఇక పేతురు గారు కూడా అంటున్నారు 1 పేతురు
3:8 లో 8 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు
ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును,
వినయ మనస్కులునై యుండుడి.
ఎఫెసీ
పత్రికలో పౌలుగారు అంటున్నారు 4: 1 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన
వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3 ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
కాబట్టి ఈ పరమ సోలోమోను పల్లకిని మోసేవారు అంతా ఐక్యముగా ఉండాలి!!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*54వ భాగము*
*ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది*
పరమగీతము 3: 7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది
అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు
యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని
యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో 7 ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు
ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
8 రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు. అంటున్నారు!
ఈ మాటలు పలికింది ఎవరు?
దీనికోసం
భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి! అయితే ఇక్కడ ఎక్కువమంది అభిప్రాయ పడేది ఏమిటంటే ఈ మాటలు పలుకు
చున్నది స్నేహితులు- షూలమ్మితి యొక్క స్నేహితులు అని గ్రహించాలి!
ఇక
సోలోమోను కోసం పల్లకి రావడం ఏమిటి? కారణం రాజుల కోసం పల్లకి రాదు- వధువు కోసం వస్తుంది గాని!
ఇక
ఆ పల్లకి అంటే ఏమిటి?
మోయు
వారెవరూ?
ప్రియులారా
ఈ రోజు మరో కోణంలో చూసుకుందాము!
(గత భాగం తరువాయి)
గతభాగంలో పల్లకి మోసేవారు ఐక్యతతో ఉండాలి అని చూసుకున్నాము!
అయితే భుజము మీద మోయువారై కూడా ఉండాలి! అనగా భారమైన
పనులు దేవునికోసం చేసేవారై ఉండాలి! స్వంత పనికంటే ఎక్కువగా దేవుని
పనిని భావించాలి చేయాలి!
అయితే యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు మత్తయి 11లో
28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా
కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు
విశ్రాంతి దొరకును.
30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటంటే ఆయన
కాడిని మనము ఎత్తుకోవాలి. ఎక్కడ భుజముల మీద!!
ఆయనే సెలవిచ్చారు నాకాడి సులువు మరియు తేలిక!!
ఎద్దులు కాడిని మోస్తాయి.
ఇక్కడ రెండు ఎద్దులు కావాలి! అయితే ఆ రెండు సక్రమముగా
మోయాలి నడవాలి అంటే మొదటగా ఆ రెంటి హృదయాలు కలవాలి! అయితే ఇప్పుడు
నీవు ఒక్కడివే ఈ కాడి మోస్తావు మరి రెండో ప్రక్క ఎవరు మోస్తారు అంటే రెండవ ప్రక్క నీ
దేవుడైన ప్రభువే మోస్తారు! మరి సక్రమంగా మోయాలి అంటే మొట్టమొదట
నీ హృదయము దేవుని హృదయముతో సంధానమై పోవాలి! ఆయన అడుగుజాడలలో నడవాలి!
ఆయన చెప్పినట్లే చేయాలి!
సరే
సక్రమంగా మోయకపోతే ఏమి జరిగింది?
1 దిన 13:7 వారు దేవుని మందసమును
ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి;
ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.
8 దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని
సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను
వాయించుచు బూరలు ఊదుచుండిరి.
9 వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు
జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా
10 యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని
సన్నిధిని చనిపోయెను.
ఇక తర్వాత దావీదు గారు ఏమి చేశారంటే 15 వ అధ్యాయంలో
కనబడుతుంది
1 దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు... కట్టించెను; దేవుని మందస మునకు ఒక స్థలమును సిద్ధపరచి,
దానిమీద గుడారమొకటి వేయించెను.
2 మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా
లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు
ఆజ్ఞ ఇచ్చెను.
11 అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన
ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
12 లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.
13 ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును
మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి
విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.
14 అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన
యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.
15 తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే
ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.
కాబట్టి
ఈ క్రమమును మనము కూడా పాటించాలి!
ఇక
గలతీ 6:2 ప్రకారం ఇలా పల్లకిని మోస్తున్నప్పుడు ఒకరి భారములను మరొకడు భరించాలి!
అనగా తోటి సహోదరునికి గల అవసరాలలో మన చేతనైనంత సహాయం చేయాలి!
అలా
చేసినప్పుడు అనగా దేవుని మందసమును పల్లకిని మోసినప్పుడు యెహోషువా 3:13 ప్రకారం ఎప్పుడైతే
ఇలా మోస్తున్న యాజకుల పాదములు యోర్ధాను నది పాయలుగా మారిపోయి నీరు పారడం ఆగిపోయింది!
అయితే
యిర్మీయా 17:21 లో నీవు దేవుని మందసమును మోయకుండా విశ్రాంతి దినము అనగా దేవుని ఆరాధనకు ప్రతిష్ట
చేయబడిన దినము అనగా మన దేశంలో ఆదివారము నాడు దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుని బరువు
మోయకుండా నీ స్వంత పనులు చేసుకుంటూ నీ స్వంత వ్యాపారాలు షికార్లు చేస్తే నీ ఇంట్లో
అగ్ని రగుల పెడతాను అంటున్నారు! ఆరోజు నీవు ఏ బరువు మోయకూడదు
దేవుని కాడి తప్ప!
ఇక 3:8 లో వీరు వీరులు శూరులు
అని అర్ధమవుతుంది!
అనగా
తప్పకుండా వీరు విశ్వాస యాత్రలో ఆత్మ ఖడ్గము ధరించాలి! ఎఫెసీ పత్రికలో ఉన్న
దేవుని సర్వాంగ కవచం తప్పకుండా ధరించాలి!
13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14 ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16 ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి;
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17 మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18 ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన
పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
అంతేకాకుండా హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యమనే రెండు
అంచుల ఖడ్గము కూడా ధరించాలి!
అలా
సర్వాంగ కవచము ధరించి దేవుని కనాను యాత్రలో దేవుని మందశము అనే సోలోమోను పల్లకిని మోస్తూ
సాగిపోవాలి!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*55వ భాగము*
*లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని
యున్నాడు*
పరమగీతము 3: 9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో
9 లెబానోను మ్రానుతో మంచమొకటి
సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.
ఇక్క
సోలోమోను మంచము అనగా ఏమిటి?
దానిని అలంకరించిన వాటి యొక్క ఆత్మీయ భావము ఈ రోజు చూసుకుందాం!
ప్రియులరా
మొదటగా ఇశ్రాయేలు జాతి కోణంలో చూసుకుందాము!
మొదట
సోలోమోను మంచము అనగా దేవుని మందిరము లేక సోలోమోను దేవాలయము!
లెబానోను మ్రానుతో సొలొమోను
రాజు ఒక మంచము చేయించుకొని యున్నాడని ఇందులో చెప్పబడింది. మంచము విశ్రాంతికి సూచనగా చెప్పబడింది. దేవుని రెండవ ఆజ్ఞ కూడ ఇదియే. విశ్రాంతి దినమును ఆచరించాలి. ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సొలొమోను
రాజు లెబానోను మ్రానులతో యెరూషలేము నగరములో దేవునికి ఒక మందిరము నిర్మించాడు. 1 రాజులు 5:5-6, ''కాబట్టి-నీ సింహాసనముమీద
నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని
యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును
కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై
నాకు సెల విమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు;
మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు
తెలియును గనుక,'' దేవుని ఆలయమునకు సొలొమోను రాజు లెబానోను
ప్రాంతంలో గల దేవదారు మ్రానులతో మందిరమును
నిర్మించాడు. దీనిని
ఎందుకు నిర్మించాడు? దేవుని కోసమా? లేక తన కోసమా? అని ఆలోచిస్తే దేవుడు మానవ నిర్మితములైన హస్తకృత్యములలో నివసింపబడడని వ్రాయబడియున్నది. అపొస్తలుల కార్యములు
7:50, ''అని ప్రవక్త పలికిన ప్రకారము
సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.''
అయితే దీనిని ఎందుకోసము నిర్మించినట్లు?
విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనతో జీవించుటకు నిర్మించాడు.
అందుకే లెబానోను మ్రానుతో సొలొమోను రాజు ఒక మంచము తనకోసము చేసుకొనెనని
వ్రాయబడింది. ఇలా మందిరమును నిర్మించుటలో ఇంకొన్ని వర్ణనలు ఉన్నాయి. ''దాని స్తంభములు వెండి మయములు.'' 1 రాజులు 7:15-18, ''ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు
పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది,
ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది. మరియు
స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క
యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు. మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక
పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.
ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని
రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ
పీటకును చేసెను.''
''దాని పాదములు స్వర్ణమయములు.'' 1 రాజులు 6:17-20, ''అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము
నలువది మూరల పొడుగై యుండెను. మందిరములోపల నున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి
యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి
యొకటైన కనబడలేదు. యెహోవా
నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను. గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును
ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని
మేలిమి బంగారముతో పొదిగించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును
ఈలాగుననే పొదిగించెను.'' మందసము ఉంచు భాగము మొత్తము బంగారముతో పొదిగారు కనుక అది స్వర్ణమయముగా ఉన్నది.
''దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో
చేయబడెను.'' ఆ యొక్క
ఆలయములో సొలొమోను రాజు తెరలు కట్టించి అందముగా అలంకరించెనని వ్రాయబడింది. 2 దినవృత్తాంతములు 2:7, ''ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు
ప్రత్యక్షమై-నేను నీకు ఏమి ఇయ్య గోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా.'' ఈ విధముగా రకరకాల రంగులు గల వస్త్రములు సిద్ధము చేయుట జరిగింది. ఈ వస్త్రములను యెరూషలేము కుమార్తెలు
అనగా నీతి మార్గములో జీవించువారు దేవుని ప్రేమను సూచించు విధముగా వారికి దేవునిపై ఉన్న
ప్రేమను కనబరచు విధముగా ఆ యెరూషలేము ఆలయము లోపలి భాగమును అలంకరించిరని చెప్పబడింది.
ఇక
ఇదే విషయాన్ని నూతన నిబంధన కోణంలో చూసుకుంటే నీ దేహము దేవుని ఆలయము!
1 కోరింథీ 3: 16 మీరు దేవుని ఆలయమై
యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని
పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.
పేతురు గారు అంటున్నారు 1 పేతురు
2: 5 యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు
పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
అయితే
ఇప్పుడు ఈ దేవాలయమును పరిశుద్ధంగా పవిత్రముగా కాపాడుకోవాలసిన అవసరం నీకు ఎంతైనా ఉంది! కారణం ఈ దేవాలయమును ఎవడు
పాడు చేస్తాడో వాణ్ని దేవుడు పాడుచేయును అని చదువుకున్నాము! ఈ
దేవాలయమును సిగరెట్లు త్రాగుడు జూదము ఇంకా శరీర కార్యాలతో నింపి అపవిత్రము చేసేస్తే
దేవుడు వానిని పాడుచేస్తాడు గనుక భయము కలిగి నడుచుకుందాం!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*56వ భాగము*
*దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను*
పరమగీతము 3: 9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు
దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో
యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో 9 లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు
తనకు చేయించుకొని యున్నాడు.
10 దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో
చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము
నలంక రించిరి.
ఇక
సోలోమోను మంచము అనగా ఏమిటి అనేది చూసుకున్నాము! ఇక ఈరోజు దానిని అలంకరించిన వాటి యొక్క ఆత్మీయ
భావము ఈ రోజు చూసుకుందాం!
(గతభాగం తరువాయి)
గత
భాగంలో సోలోమోను పల్లకి అనగా మందసము అనియు ఆయన కట్టించిన దేవాలయము అనియు ధ్యానం చేశాము! అయితే దాని స్తంభములు
వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను
ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక
రించిరి అంటున్నారు!
ఈ రోజు స్తంభములు ఏమిటి అనేది చూసుకుందాం! సోలోమోను
నిజానికి ఇత్తడితో రెండు స్తంభములు చేయించినట్లు చూడగలము. మరి
ఇక్కడ వెండి మయములు అంటున్నారు- అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే వెండి అనేది విమోచనకు సాదృశ్యము! దీని ఆత్మీయ అర్ధము ఎవరైతే క్రీస్తు పిలుపు విని ఈ విశ్రాంతి లోనికి వస్తారో
అనగా ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని
ఇస్తాను అన్నారు కదా దానిని మనము సర్వలోకమునకు ప్రకటిస్తున్నాము కదా- ఇప్పుడు ఈ స్వరము విని ఆయన ఇచ్చే విశ్రాంతి లోనికి ఎవరైతే వస్తారో,
వారికి దేవుడు ఇచ్చే విమోచన కలుగుతుంది అన్నమాట! దేనినుండి విమోచన- అనగా మన పాపముల నుండి విమోచన-
ఎవరైతే తమ పాపములు ఒప్పుకుని అయ్యా నేను పాపిని నన్ను క్షమించి నీ రక్తముతో
కడుగు అని పశ్చాత్తాపముతో క్రీస్తు పాదాలు పట్టుకుంటారో వారిని తన సిలువరక్తము తో కడిగి
పరిశుద్ధులుగా చేసి వారికి పాపముల నుండి విమోచనము ఇస్తారు ఇచ్చారు! తద్వారా ఇప్పుడు విశ్రాంతి మాత్రమే కాకుండా మనశ్శాంతి విమోచనము రెండు కలిగాయి!
ఇక పాదములు స్వర్ణ మయములు! సోలోమోను గారు కట్టిన దేవాలయం మొత్తమంతా ఆయన బంగారముతో
పొదిగించినట్లు చూడగలము! బంగారము దైవత్వానికి సూచన! అనగా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో
ఆయన విమోచనం పొంది ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారో వారికి దైవత్వము లేక దైవస్వభావము
పొందుకుంటారు! ఏమండీ ఎలా చెబుతున్నారు అంటే తనను ఎందరు అంగీరిస్తారో
వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చారు అని వ్రాయబడింది కదా!! యోహాను 1:12
12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు
ఆయన అధికారము అనుగ్రహించెను.
13 వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
ఇక గలతీ 4:6 లో అంటున్నారు 5 మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై
ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
6 మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ,
అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
7 కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.
కాబట్టి దేవుని నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు అనగా దేవుని
దైవత్వము లో కూడా వారసుడవు! కాబట్టి సువర్ణము దైవత్వానికి సూచన
అలాగే నీవు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తే ఆయన యొక్క దైవస్వభావము నీలో కూడా ప్రతిభింభిస్తుంది!
కాబట్టి రక్షించబడి ఆయన రాజ్యములో పాలివాడైన నీవు దైవలక్షణాలే
నీలో కనబడాలి గాని లోకాశలు లోకపు పోకడలు నీలో కనబడకూడదు! నీలో పరిశుద్ధత
మాత్రమే కనబడాలి గాని అపరిశుద్ధమైనది ఏదీ నీలో ఉండనే కూడదు! దేవుని
కుమారుడు దేవుని లక్షణాలే కలిగి ఉండాలి గాని సైతాను గాడి లక్షణాలు సైతాను గాడి పిల్లల
లక్షణాలు అనగా శరీర కార్యములు కనబడకూడదు!
ఇక సోలోమోను మంచపు లోపలి భాగాన్ని యెరూషలేము కుమార్తెలు అలంకరించారు! అనగా దేవుని
బిడ్డలయిన మనము మన హృదయాంతరంగాలు పరిశుద్దత తోను పరిశుద్ధమైన అలంకారాలు అనగా సాధువైనట్టి
మృధువైనట్టి అక్షయ అలంకారాలతో పరిశుద్ధమైన స్వభావముతో అలంకరించుకోవాలి!
ఇక సోలోమోను మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడ్డాయి!
మెత్త అనగా తలగడ! తెలంగాణా ప్రాంతము వారు
తలగడను మెత్త అనే అంటారు! మనమైతే తలగడ అంటాము! ఇవి ధూమ్ర వర్ణము అనగా ఊదా రంగు వస్త్రంతో
చేయబడ్డాయి! ఇక్కడ క్రీస్తు ప్రభువు యొక్క విశ్రాంతిలో ఊదారంగు
ఉంది! ఊదా రంగు వస్త్రాలు రాజులు మరియు రాజవంశము వారు ధరిస్తారు!
ప్రభువైన యేసు ఆయన సిలువ మరణము పొందే ముందు ఊదా రంగు వస్త్రాలను వేశారు! ఆయనకు యూదుల రాజు అనే బోర్డు పెట్టారు!
యూదుల రాజా శుభము అన్నారు! అయితే ఆయన ముళ్ళ కిరీటము
ధరించి మనలను రాజులుగా చేశారు అందుకే రాజులైన యాజక సమూహముగా మనలను చేశారు అని వ్రాయబడింది! 1 పేతురు
2: 9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును
పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన
వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ
జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
10 ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి;
ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
కాబట్టి
ఇప్పుడు రాజ కుమారులము గనుక రాజ కుమార కుమార్తెలుగానే ప్రవర్తన కలిగి ఉందాము!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*57వ భాగము*
*కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి*
పరమగీతము 3: 11 సీయోను కుమార్తెలారా,
వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి వివాహదినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము అంటున్నారు!
ప్రియులారా
ఇక్కడ సోలోమోను కిరీటము అనియు, వివాహ
దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము అని కనిపిస్తుంది! కాబట్టి కిరీటమునకు ముందు అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము కోసం చూసుకుందాం!
అతని తల్లి అనగా సోలోమోను తల్లి ఎవరు? హిత్తీయుడైన
ఊరియా భార్య! హిత్తీయులు అనగా అన్యులు! మరి అన్యురాలు పెట్టిన కిరీటం ఏమిటి? దేవుని సంఘములో
అన్యురాలి కిరీటం ఏమిటి?
దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే నిజానికి రాజైన సొలొమోను తల్లి బత్షెబా!
ఆమె ఇశ్రాయేలీయురాలే! అయితే, మొదటి భర్త అయిన ఊరియా హిత్తీయుడు (అన్యజాతి సైనికుడు)(ప్రేమించి పెళ్లి చేసుకున్నారు) కావడం వల్ల ఆమె ఆయనను
వివాహం చేసుకున్నప్పుడు కొద్దికాలం అన్యుల కుటుంబంలో నివసించాల్సి వచ్చింది.
కానీ ఆమె పుట్టుకతో స్వచ్ఛమైన ఇశ్రాయేలు వంశానికి చెందినది. ఆ తర్వాత దావీదుగారు ఆమెను పెళ్లి
చేసుకున్నారు! ఆ చరిత్ర మనకు తెలుసు!
కాబట్టి ఇప్పుడు అతని తల్లి ఇశ్రాయేలు జాతికి చెందినదే! కాబట్టి
ఇప్పుడు ఆ కిరీటము అన్యురాలి కిరీటము కాదు అది ఇశ్రాయేలు కిరీటమే!
ఇక్కడ ప్రియులారా రెండు అర్ధాలున్నాయి! సోలోమోను
తల్లి బత్సెబా యూదురాలే! అలాగే పరమ సోలోమోను యేసుక్రీస్తుప్రభులవారి
తల్లి మరియ కూడా యూదురాలే! ఈమె ఎంతమాత్రమూ పరలోకపు తల్లి అనబడే
స్త్రీ జాంగిల్జా కానేకాదు! అయితే రోమా
9:5 ప్రకారం యూదా జనాంగమే క్రీస్తుని కన్నది! కనుక
శరీరరీతిగా యూదా సంఘము క్రీస్తు ప్రభువుకి తల్లి! ఆ తల్లి వివాహ
దినమున సోలోమోను రాజుకి ఒక కిరీటం పెట్టింది! ఈ కిరీటం ముళ్ళ
కిరీటం కానేకాదు! పరమగీతం 4:6 లో చెప్పబడింది
యూదులు పెట్టిన ముళ్ళ కిరీటం గాని ఈ వచనము దానిని సూచించుట లేదు!
సామెతలు 12:4 లో యోగ్యురాలు తన
పెనిమిటికి కిరీటం అని వ్రాయబడింది! ఆ యోగ్యురాలు ఎవరో కాదు-
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే ఆ యోగ్యురాలు! ఇట్టి యోగ్యురాలి కోసం సోలోమోను తన
పల్లకిలో వస్తున్నాడు!
అనగా క్రీస్తు తన సంఘవధువు కోసం యోగ్యురాలి కోసం తన పల్లకిలో మేఘాల మీద ప్రయాణం
చేస్తూ వస్తున్నాడు!
ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువును యెరూషలేము వారు చూడాలని దేవుడు
కోరుచున్నాడు! అయితే మొదట ఈ సంఘము ఏర్పరచబడినప్పుడు ఆ పెంతుకొస్తు
దినాన అనేకమంది చూశారు యెరూషలేములో! అయితే వారు గుర్తించక వీరు
కొత్త మధ్యముతో నింపబడ్డారు అని పొరబడ్డారు. వీరిని హేళన చేశారు! అయితే పేతురు గారి ప్రసంగం ద్వారా సంఘము మొదట కట్టబడింది పరలోకంలో సంతోషం కలిగింది!
ఆ దినము ప్రభువుకు సంతోషకరమైన దినముగా ఉందని వాక్యములో చదువుకున్నాము!
పసిపిల్లలకు దేవుని చిత్తము తెలుపబడినందుకు ఏసయ్య ఎంతో సంతోషించారు లూకా 10:21 లో! యోహాను 15 వ అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు శిష్యులకు
బోధించారు!
అయితే యోహాను 17:13 ప్రకారం క్రీస్తు యొక్క ఆనందం సంతోషం మనమందరము అనుభవించాలని
దేవుడు ఆశిస్తున్నట్లు చూడగలము!
హెబ్రీ 12:2 లో ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున
ఆసీనుడైయున్నాడు అని వ్రాయబడింది అదే ఆనందము మనము కూడా అనుభవించాలి శ్రమలను సహించాలి
అని చెబుతున్నారు!
అలా శ్రమలను సహించి పరిపూర్ణత సాధించి ప్రభువుతో ఏకమవ్వాలి ఆయన రూపులోనికి
మారిపోవాలి! మహిమ నుండి అత్యధిక మహిమ పొందాలి! అదే శ్రమల ద్వారా అభిషేకం
మీద అభిషేకం పొందుకోవాలి! అంతేకాకుండా అలా మనలను పరిశుద్ధ పరచుకుంటూనే
అనేకమందిని క్రీస్తులోనికి నడిపించి పరలోకములో నిజమైన ఆనందము కలిగించాలి! అదే ఆ రోజు సంతోషకరమైన రోజు!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*58వ భాగము*
*కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి*
పరమగీతము 3: 11 సీయోను కుమార్తెలారా,
వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము.
ఈ
వచనంలో సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి వివాహదినమున అతని తల్లి
అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము అంటున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక మరో కోణంలో చూసుకుంటే మొదట ఇశ్రాయేలీయులను ఎన్నుకొని
వారి ద్వారా ప్రపంచ మానవాళికి నిజమైన దేవుడను నేనే అని నిరూపించుతూ దేవుడు క్రియ జరిగించాడు. కాని వారు చివరకు పతనమై ప్రతిష్ఠాత్మకముగా
నిర్మించిన యెరూషలేము ఆలయమును సైతము విగ్రహ ప్రతిమలతో నింపి దేవుని అవమానపరచారు. కనుక దేవుడు సీయోనులో క్రీస్తు ప్రభువును
తిరిగి సంఘమునకు పునాదిగా వేశాడు. యెషయా 28:16, ''ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు -సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను
నేనే అది పరిశోధింపబడిన
రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది.'' ఈ పునాది క్రీస్తు ప్రభువే!
ఆయన ద్వారా మారినవారిని సీయోను
కుమార్తెలుగా ఇందులో వర్ణించుచు వారిని రమ్మని ఆహ్వానించుచున్నారు. కనుక ఎవరైతే ఈ ఆహ్వానము అందుకొనువారు
ధన్యులు. ప్రకటన 19:9, ''మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల పెండ్లి
విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని
యథార్థమైన మాటలని నాతో చెప్పెను.'' వీరిని ఆహ్వానించుటయేగాక కిరీటము
ధరించిన సొలొమోనురాజును చూడుడి అని చెప్పుచున్నారు. కాని పరలోకరాజ్య
ప్రవేశ అర్హత రాజులు తమ ఘనతను వీడి కేవలము తాము పొందిన మహిమ అనగా క్రీస్తు ప్రభువును
అంగీకరించిన దానిని బట్టి మాత్రమే వారికి ప్రవేశముంటుంది. ప్రకటన
21:24, ''జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు
తమ మహిమను దానిలోనికి తీసికొని వచ్చెదరు.''
ప్రకటన 21:26, ''జనములు తమ మహిమను ఘనతను
దానిలోనికి తీసికొని వచ్చెదరు.''
జనులు ఘనతను మహిమను కొనిపోతుంటే భూరాజులు
కేవలము మహిమను మాత్రమే కొనిపోతారు.
కనుక ఇక్కడ చెప్పబడిన రాజు క్రీస్తు ప్రభువే. వైభవములో సొలొమోను భూరాజులందరిని
మించినవాడు. అంత వైభవము
క్రీస్తు ప్రభువే ఆయనలో జ్ఞానముగా ఉండుట వలన ఈ వచనములో సొలొమోను రాజు అని వ్రాయబడింది. కాని నిజానికి యూదుల రాజైన క్రీస్తు
ప్రభువు అతని తల్లియైన కన్య మరియమ్మ ఆ వివాహ దినమున ఆయనకు కిరీటము పెట్టుట జరుగును,
కనుక ఆ దినము అతనికి బహు సంతోషకరమైనదని చెప్పబడింది. కనీసము సొలొమోనును రాజుగా అభిషేకించినవారు
నాతాను సొదోకు ప్రవక్తలు. అలాగే 1 రాజులు 3:1, ''తరువాత సొలొమోను
ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేముచుట్టు
ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.''
ఈ విధముగా సొలొమోను ఐగుప్తు
రాజైన ఫరో కుమార్తెను వివాహము చేసుకొన్నాడు. అన్యురాలైన స్త్రీని వివాహము చేసుకొనుట
బహు సంతోషకర దినము కాదు. ఇది బాధాకరమైన దినము, ఎందుకంటే సొలొమోను తన చివరి కాలములో
ఈ అన్యజాతి స్త్రీలు అతనిని విగ్రహారాధికునిగా మార్చి ఆత్మీయ జీవితమును నాశనము చేశారు.
1 రాజులు 11:9-10. కనుక ఇందులో రాజును సొలొమోను రాజుగా వర్ణించినను ఆ రాజు గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు
ప్రభువే!
అయితే క్రీస్తు ప్రభువుకు వివాహము
జరుగునా? అన్న అనుమానము
మనకు కలుగవచ్చును. క్రీస్తు
ప్రభువు గొఱ్ఱెపిల్లగా వధువు సంఘమును వివాహము చేసుకొనును. ప్రకటన
19:7-9, ''అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన
జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము-సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను
స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,
ఆయన భార్య తన్ను తాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక
మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును
నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల
నీతిక్రియలు. మరియు అతడు
నాతో ఈలాగు చెప్పెను- గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు
ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో
చెప్పెను.'' అలాగే ప్రకటన
21:9-11లో వధువుగా అలంకరింపబడుట అటుతరువాత భార్యగా మారును. ఈ వివాహమునకు ఒక దినము ఉన్నది.
(ఆ దినమున క్రీస్తు ప్రభువుకు కిరీటమును
ఆయన తల్లియైన కన్య మరియమ్మ ధరింపజేయును అని కొందరి అభిప్రాయము! వారు ఇంకా ఏమంటారు అంటే ఈ విధముగా క్రీస్తు ప్రభువును పెండ్లి కుమారునిగా చేసి ఆయనకు కిరీటమును ఆయన
తల్లియైన కన్య మరియమ్మ ధరింపజేయునని చెప్పబడింది. ఇందునుబట్టి కన్య మరియ వధువు సంఘమునకు
అత్తగారని, విశ్వాసి యొక్క విశ్వాస జీవితమునకు ప్రభువు దయచేసిన
తల్లియని యోహాను 19:27 వివరిస్తున్నది అంటారు! )
అయితే
నిజానికి మహిమలో ఇంకా పరలోకంలో మరియమ్మ గారి పేరు గాని ఆమె ప్రసక్తి గాని ప్రకటన గ్రంధములో
మనకు కనబడదు! కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునకు అత్తగారు మరియమ్మ గారు
కానే కాదు అని నా అభిప్రాయము ప్రియులారా! ఎందుకంటే దేవాది దేవుడైన
తండ్రియైన దేవుడు యెహోవా దేవునికి భార్య లేదు!
అయితే
ఏదిఏమైనా పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభులవారు తన వధువు సంఘమును తీసుకుని భూమిమీదకు
లేదా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మీదకు రావడమే నిజమైన సంతోషకరమైన దినము!! ఇలాంటి దినము బహు సంతోషకరమైనదని
దానిని చూచుటకు సీయోను కుమార్తెలమైన మనలను అనగా క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన
మనలను చూచుటకు వేంచేయుమని పిలుచుటను గీతముగా రచించుట జరిగింది.
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*59వ భాగము*
*నా ప్రియురాలా, నీవు సుందరివి
నీవు సుందరివి*
పరమగీతము 4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ
ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది
మేకల మందను పోలియున్నవి.
ప్రియులారా! పరమగీతము లను ధ్యానము చేస్తున్నాము. ప్రియులారా ఇంతవరకు మనము మూడు అధ్యాయాల నుండి అనేకమైన ఆత్మీయ అర్ధాలను గ్రహించాము!
ఇక నాలుగవ అధ్యాయము నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధిస్తున్నారో చూద్దాం!
నిజానికి
ఈ 4:1—6 వచనాలు క్రీస్తు మరణించక
ముందు మేడగదిలో ఉన్నప్పుడు జరిగిన సంభవము కోసం చెబుతుంది ప్రియులారా! ప్రభువు యెరూలేములో జయప్రవేశం చేశారు! ఆ తర్వాత సిలువ
వేయబడక మునుపు తన శిష్యులతో సంభాషణ చేస్తున్నారు! నేను సిలువవేయబడ
బోతున్నాను తండ్రియొద్దకు వెళ్తున్నాను అని చెబుతూ ఉంటారు! తాను
మరణించిన తర్వాత తన అనుచరులలో లేక శిష్యులలో విశ్వాసులలో ఉండవలసిన ఏడు లక్షణాలు లేక
ఏడు రకాలైన సౌందర్యము కోసమే ఇక్కడ చెప్పబడుతుంది
ప్రియులారా! యెషయా 50:4—5 లలో చెప్పబడిన అలసిన
వారికి ఊరడించే మాటలనే ఇక్కడ చెప్పారు అని గ్రహించాలి!
నా
ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి
నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
ఎప్పుడైతే
ప్రియుని వివాహ దినమున ఆయన తల్లి కిరీటమును ధరింపజేసిందో, ఆ తరువాత
ప్రియురాలిని గూర్చి చెప్పబడింది, ఎందుకంటే వివాహమునకు స్త్రీ
పురుషులిద్దరు తయారు కావాలి. ప్రియుడు క్రీస్తు ప్రభువు సిద్ధమైనాడు. సీయోను కుమార్తెలు అనగా విశ్వాసులు
చూడడానికి వచ్చారు. ఇప్పుడు
ప్రియురాలు సిద్ధమైంది. ఆమె ప్రియుని చూపుకు ఎలా కనబడుచున్నదో తెలుసుకొందము.
అతని
ప్రియురాలైన యెరూషలేము సంఘము అనగా వధువు సంఘము చాలా సుందరముగా కనిపించింది.
అందుకే ''నీవు సుందరివి నీవు సుందరివి''
అని చెప్పు చున్నారు.
అలాగే ఆమె ముసుగు ధరించుకొని వినయమును ప్రియుడైన క్రీస్తు ప్రభువు
ముందు ప్రదర్శించగా ఆయన ఆమె కళ్లను చూచి, గువ్వ కన్నులవలె అమాయకత్వముతోను
నిష్కల్మషముగా ఉన్నట్లుగా చెప్పుచున్నారు.
అలాగే ఆమె తల వెండ్రుకలు నిండుదనముగా ఉన్నవని చెప్పుటకు గిలాదు పర్వతము
మీద మేకల మందను పోల్చి చెప్పుట జరిగింది. ఈ వెండ్రుకలు శరీరమును కప్పుకొనుటకు ఆమెకు ఇచ్చినట్లుగా పౌలు తన లేఖలో వ్రాశాడు. 1 కొరింథీ 11:15.
సరే, విశ్వాసులలో లేక సంఘములో ఉండవలసిన ఆ సౌందర్యము లేక
మంచి లక్షణాలు ఏమిటి అనేది ధ్యానం చేద్దాం! విశ్వాసులలో దేవుని
ప్రజలలో ఆత్మ సంబంధమైన సౌందర్యము ఉండాలి!
మొదటిది కీర్తన 149:4 ప్రకారం
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను
రక్షణతో అలంకరించును.
అనగా మొట్టమొదటి లక్షణము లేక అలంకారము: దీనత్వము! ఈ దీనత్వము ప్రభువు బిడ్డలకు సౌందర్యాన్ని తీసుకుని వస్తుంది! కొండమీద ప్రసంగములో దేవుడు అంటున్నారు మత్తయి 6 లో
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము
వారిది.
గమనించారా ఈ దీనత్వము నీకు పరలోక రాజ్యములో స్థానమును తీసుకుని వస్తుంది!
సేన దయ్యం పట్టిన వాడు ఎంతో క్రూరముగా ఉండేవాడు తననుతాను బాధించుకునే వాడు! గాని దేవునిచేత బాగుపడిన
తర్వాత ఎంతో దీనుడై దేవుని పాదాల దగ్గర కూర్చున్నట్లు చూడగలము! పరిసయ్యుడు తననుతాను హెచ్చించుకుని ప్రార్ధన చేస్తే సుంకరి తననుతాను తగ్గించుకుని
దీనుడై పాపిని ప్రభువా అని ప్రార్ధించి పరిశుద్దుడుగా మార్చబడ్డాడు! కాబట్టి నిజమైన సౌందర్యము మరియు పరలోకరాజ్యములో స్థానము ఈ దీనత్వము వలన కలుగుతుంది!
రెండు: యెహేజ్కేలు
16:14 ప్రకారము పరిశుద్ధత కలిగి ఉండాలి! 13 ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి,
సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి,
గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి.
14 నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము
పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
15 అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని,
నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా
వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి.
దేవుడు
మనకు ఎన్నో రకాలైన ఆత్మీయ వరాలతో ఫలాలతో అలంకరించగా మంచి ఆహారము ఇచ్చి మనలను పోషిస్తే
దేవుని నుండి దూరమై పోకూడదు! వెండి విమోచనకు, బంగారము దైవత్వముకు,
గోధుమలు తేనె నూనె ఇవన్నీ ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సాదృశ్యము!
అయితే వీటిని ధరించి పరిశుద్ధుల నీతిక్రియలను వస్త్రములుగా ధరించాలి
తప్ప లోక సంబంధమైనవి నీలో కనబడకూడదు! నేను పరిశుద్ధుడై ఉన్నలాగున
మీరును పరిశుద్ధులై ఉండమని దేవుడు చెబుతున్నారు!
మూడవది: సద్గుణము లేక మంచి గుణము!
2పేతురు 1: 4 ఆ
మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి
యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ
వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు
వాటిని అనుగ్రహించెను
5 ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై,
మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
6 జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,
7 భక్తియందు సహోదరప్రేమను, సహోదర
ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
8 ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన
అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును.
పైన
చెప్పబడిన మంచి గుణములు విశ్వాసి పొందుకోవాలి విశ్వాసము సద్గుణము జ్నానము ఆశా నిగ్రహము
సహనము భక్తి సహోదర ప్రేమ దయ ఇవన్నీ పొందుకోవాలి!
ఇక 1 యోహాను 3:2 ప్రకారం నిరీక్షణ కలిగి ఉండాలి! 2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము.
మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.
3 ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై
యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
అట్టి మంచి లక్షణాలతో మనము అలంకరించు కుందుము గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*60వ భాగము*
*నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి*
పరమగీతము 4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ
ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది
మేకల మందను పోలియున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక ఈ వచనములో నీవు సుందరివి సుందరివి అంటూ రెండు సార్లు చెప్పారు! ఈ మాట ఈ గ్రంధంలో అనేకసార్లు చెప్పారు!
“సౌందర్యవతి”– పరమగీతము 1:5, , పరమగీతము
1:8, , పరమగీతము 1:9-11, , పరమగీతము
1:15, – ఆఖరు వచనం తప్ప ఈ అధ్యాయమంతట్లో
తనకు తన వధువు గురించి తన ఆహ్లాదాన్ని వెల్లడి చేసేందుకు వరుడు పలికిన మాటలే ఉన్నాయి.
అతడు ఆమెను ప్రేమ దృక్కులతో చూస్తున్నాడు. కాబట్టి
ఆమెకు సంబంధించిన ప్రతి విషయంలో అతనికెంతో ఆనందకరంగా ఉంది. దేవుని
దృష్టికి సంఘము ఎంతో
అందముగా కనిపిస్తుంది. ఎప్పుడు అంటే నీ బ్రతుకు బాగున్నప్పుడు,
నీవు దేవుని పనికోసం పరుగులెత్తు తున్నప్పుడు! నీవు క్రీస్తు కోసమే బ్రతుకుతూ ఆయన బాటలో నడుస్తున్నప్పుడు!
ఇక
నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి
“గువ్వలు”– పరమగీతము 1:15, . “మేకలు”– దీర్ఘమైన నల్లని వెంట్రుకలతో
మేకలు గుండ్రంగా ఉన్న గిలాదు పర్వతం ఒకదాని పైనుండి దిగి వచ్చే దృశ్యాన్ని జ్ఞప్తికి
తెస్తున్నాయి ఆమె శిరోజాలు.
మొదటగా
ఈ షూలమ్మితి మూసుకు వేసుకున్న అనుభవములో ఉంది అని గ్రహించాలి ప్రియులారా! ముసుకువేసుకున్న అనుభవము
అనగా తగ్గింపు అనుభవము! భర్తకు లోబడే అనుభవము! అదేవిధంగా యేసుక్రీస్తుప్రభులవారికి లోబడే అనుభవము!
ఈ
ముసుకు కోసం మొదటగా మనకు ఆదికాండం 24వ అధ్యాయములో కనిపిస్తుంది! ఎలియాజరు గారు రిబ్కాకు ప్రధానం చేసి ఇస్సాకు గారి కోసం తీసుకుని వస్తున్నప్పుడు
ఆమె 24 రోజులు మధ్యవర్తి ఎలియాజరుతో ప్రయాణం చేసి- తన యజమాని ఇష్టాలు ఏమిటి, ఎలాంటి వాడు వారి అలవాట్లు
ఆస్తిపాస్తులు అన్నీ తెలుసుకున్న తర్వాత బెహర్ లహోయిరోయి దగ్గరికి వచ్చినప్పుడు దూరంగా
ఉన్న ఇస్సాకు గారిని చూసి, మనవైపు వస్తున్న ఆ యువకుడు ఎవరు అని
ఎలియాజరుని అడిగితే అతడు నా యజమాని అన్న మాట వినిన వెంటనే ఆమె రెండు పనులు చేసింది.
మొదటగా ఒంటె మీద నుండి దిగినట్లు చూడగలము! రెండవదిగా
మూసుకు వేసుకున్నట్లు చూడగలము!!
అనగా
భర్తకు ఎంతో లోబడింది! గౌరవించింది! విధేయత చూపించినది. ఆ కాలంలో మెసపోటోమియా నాగరికతలో తప్పకుండా భర్త ఉండగా ముసుగు తీయకూడదు!
నేడు మన ఉత్తర భారతదేశంలో కూడా భర్త ముందు ముసుగు తీయకూడదు మరియు బయటకు
వెళ్తే ముసుగు వేసుకుని మాత్రమే వెళ్ళాలి! ఇది ఆచారం!
అయితే
దీనికోసం ఇంకా తెలుసుకోవాలంటే మనము సంఘ క్రమము తెలుసుకోవాలి! బైబిల్ గ్రంధంలో నూతన
నిబంధన సంఘములో సంఘక్రమము తెలిపే ఏకైక గ్రంధము 1 కోరింథీ పత్రిక!
11వ అధ్యాయములో మనకు రెండు ప్రాముఖ్యమైన అంశాల కోసం వ్రాయబడింది.
మొదటిది స్త్రీ ప్రార్ధించి నప్పుడు ఆరాధన చేసినప్పుడు తప్పకుండా మూసుకు
వేసుకోవాలి, రెండు ప్రభురాత్రి సంస్కారము ఎలా తీసుకోవాలి అనేది!
3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు
పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని
కోరుచున్నాను.
4 ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక
ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.
5 ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక
ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను.
కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె
ముసుకు వేసికొనవలెను.
7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక
తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.
8 ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు
స్త్రీనుండి కలుగలేదు.
9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు
సృష్టింప బడలేదు.
10 ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద
ఉండవలెను.
11 అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు
పురుషునికి వేరుగా స్త్రీలేదు.
12 స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు
స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.
13 మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ
ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?
14 పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని
స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?
15 స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక
ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని
సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.
ఇక్కడ
౩—16 వచనాలలో మొదటి సంఘక్రమము
చెబుతున్నారు: స్త్రీ తప్పకుండా ప్రార్ధించేటప్పుడు ముసుకు వేసుకోవాలి!
ఇది కేవలం కొరింథీ సంఘానికే కాదు సార్వత్రిక సంఘములో భాగంగా ఉంటున్న
ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతీ స్త్రీకి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ! సంఘ క్రమము! దీనిని ఎవరైనా సరే, బాప్తిస్మం తీసుకున్న ప్రతీ స్త్రీ పాటించాలి అనగా ప్రార్ధన చేసేటప్పుడు ముసుగు
వేసుకోవాలి తన తలమీద!!
ఇక
౩వ వచనంలో అంటున్నారు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు
అనగా భర్త అనియు, క్రీస్తుకి శిరస్సు దేవుడు అని తెలిసికోవాలి
అంటున్నారు!
ఇక్కడ “శిరస్సు”అంటే అధికారంలో ఉన్నవాడు. పురుషుడు క్రీస్తుకు లోబడి
ఉండాలి. స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి (ఎఫెసు 5:24; 1 తిమోతి 2:11-12; 1 పేతురు 3:1, 5, 6 ప్రకారం).
ఎఫెసీయులకు 5: 24
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను
తమ పురుషులకు లోబడవలెను.
1పేతురు 3: 1
అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
ఏ విధంగానైనా భార్య తన భర్తపై పెత్తనం
చేయాలనుకోవడం దేవుని క్రమాన్ని కాలదన్నడానికి ప్రయత్నించడమే. ఇందువల్ల కలిగే ఫలితాలు మంచివిగా ఉండవు. భర్త తన అధికారాన్ని
ఎలా ఉపయోగించాలో ఇక్కడ పౌలుగారు చెప్పడం లేదు గాని ఎఫెసు 5:25, 28, 33లో చెప్పారు.
...
25. పురుషులారా, మీరును మీ భార్యలను
ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు
చూచుకొనవలెను.
క్రీస్తుపైన
అధికారం దేవునిది అని పౌలుగారు అనడంలో క్రీస్తు దేవుని
స్వభావంలో భాగస్థుడు కాదని అతని ఉద్దేశం కాదు (భర్త అధికారం కింద
ఉన్న స్త్రీ అతని మానవ స్వభావంలో భాగస్థురాలే గదా. అలాగే పరమ
తండ్రి అధికారం కింద ఉన్న క్రీస్తు దేవుని స్వభావంలో భాగస్థుడు). క్రీస్తు నేర్పించినదాన్నే పౌలుగారు చెప్తున్నారు. యోహాను
14:28; 5:19-23.
యోహాను 14: 28
నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి
నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని
మీరు సంతోషింతురు.
John(యోహాను సువార్త) 5:19,20,21,22,23
19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి
యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు;
ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.
20. తండ్రి, కుమారుని ప్రేమించుచు,
తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును
తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.
22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని
23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని
తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
ఇక 4, 5 వచనాలలో పురుషుడు
బహిరంగ ప్రార్థనా స్తలాలలో ప్రార్ధన చేసినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోకూడదు,
అలా చేస్తే తన తలను అనగా యేసుక్రీస్తుప్రభులవారిని అవమాన పరుస్తున్నాడు!
అలాగే స్త్రీకూడా ప్రార్ధన చేసినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోకపోతే
తన తలను అనగా తనభర్తను మరియు ఆత్మీయ అర్థం యేసుక్రీస్తుప్రభులవారిని
పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమాన పరుస్తున్నది అని ఖరాఖండిగా చెబుతున్నారు!
ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి: ప్రార్ధన
అనగా కేవలం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే ముసుకు వేసుకోవాలి అని భావించకూడదు!
నీవు దేవుని మందిరంలో లేక బహిరంగ ప్రార్ధనా స్థలంలో అడుగుపెట్టిన క్షణం నుండి బయటకు వెళ్ళేవరకు
ముసుగు వేసుకునే ఉండాలి! ఉదాహరణకు: నీవు
ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఎవరైనా నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమిచెబుతావు?
ప్రార్ధనకు వెళ్తున్నాను! ఇక్కడ ప్రార్ధన అనగా
పాటలు, ప్రార్ధన, ఆరాధన అనే వర్షిప్ మరియు
వాక్యము వినడం /చెప్పడం, కానుకలు వెయ్యడం
ఇవన్నీ ప్రార్ధన గానే పరిగణించాలి!! అలాకాకుండా కేవలం ప్రార్ధన
చేసినప్పుడు ముసుగు వేసుకుని వాక్యం చెప్పేటప్పుడు పాటలు పాడేటప్పుడు ముసుగు తీసేయ్యమని
కానేకాదు!!!
నేటి రోజులలో అనేకులు స్త్రీలు పాటలు పాడేటప్పుడు ముసుకులు వేసుకోవడం
లేదు!
వాక్యం వినేటప్పుడు వేసుకోవడం లేదు! ఘోరమైన దురదృష్టకరమైన
విషయం ఏమిటంటే కొంతమంది పనికిమాలిన ఫారిన్ స్త్రీ ప్రసంగీకులను చూసి, మన దేశపు స్త్రీ ప్రసంగీకులు కూడా అనుకరిస్తూ ముసుకులు
వేయడం మానేస్తున్నారు! ఫాంట్ షర్ట్ వేసుకుని, లిప్స్టిక్ లు, మేకప్ లు వేసుకుని నగలు పూర్తిగా ధరించుకుని
ముసుగులేని ప్రసంగాలు చేస్తున్నారు! ఇది తప్పు! అనేకమంది స్త్రీలకు వీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు! ఫలాని గొప్ప దైవసేవకురాలు ముసుగులేకుండా మంచి ఖరీదైన బట్టలు వేసుకుని ప్రసంగం
చేసినప్పుడు మనము ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు, ఖరీదైన బట్టలు
చీరలు వేసుకున్నా పర్వాలేదు, పురుషుల వలే ఫాంట్ షర్ట్ వేసుకున్నా
పర్వాలేదు, ముఖానికి రంగు మూతికి రంగు వేసుకున్న పర్వాలేదు,
యెజెబెలు లాగ వేషధారణగా
జీవించినా పర్వాలేదు అనే తప్పుడు సంకేతాలు వీరివలన దేశమంతా వ్యాపించింది!
మరికొందరు ముసుగు వేసుకున్నారో లేదో తెలియదు- హాఫ్
ముసుగులు జారిపోయే ముసుగులు! ఇలాంటి వారిమీదికి దేవుని ఉగ్రత మిక్కిలి న్యాయంగా రాబోతుంది!
వీరి నాశనం కునికి నిద్రపోదని బైబిల్ చెబుతుంది!
కాబట్టి
ప్రియ సేవకుడా! విశ్వాసి ! నీవు దేవుని మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూసుకో అన్నమాట మర్చిపోవద్దు! సంఘక్రమమును తప్పిపోవద్దు!!!
రిబకమ్మ భర్త ఇస్సాకుని చూసి ముసుకువేసుకుని తన భర్తకు లోబడి ఆయనను గౌరవించింది!
ఒకమాట చెప్పనా నీవు నీ భర్తకు లోబడితే దేవునికి లోబడినట్లు! ఎందుకంటే పురుషుడు దేవుని పోలిక మరియు మహిమయై ఉన్నాడు అని మీద చదువుకున్నాము!
కనుక మనము కూడా మన ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారి గౌరవార్ధం ముసుకువేసుకుని
ప్రార్ధన చేద్దాం!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*61వ భాగము*
*నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి*
పరమగీతము 4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ
ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది
మేకల మందను పోలియున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక ఈ వచనములో నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి అంటున్నారు!
గతభాగములో ముసుకు వేసుకున్న
అనుభవము కోసం చూసుకున్నాము!
(గతభాగము తరువాయి)
ఇక ఈరోజు గువ్వకన్నులు కోసం చూసుకుందాం! నీ ముసుకుగుండా నీ కన్నులు గువ్వ
కన్నుల వలె కనబడుచున్నవి అంటున్నారు ప్రియుడు సోలోమోను! గమనించాలి
నీ కన్నులు గువ్వకన్నులు అనడం లేదు ఇక్కడ! నీ ముసుకులో నుండి
చూసినప్పుడు నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నాయి అంటున్నారు! ముసుగు విధేయతకు సాదృశ్యం అని చూసుకున్నాము! గతభాగంలో
రిబ్కా ఇస్సాకుని చూసి ఒంటె దిగి ముసుకు వేసుకుని విధేయత చూపించినట్లు చూసుకున్నాము!
మోషే గారు కూడా ముసుకువేసుకున్నారు!
సరే ఇక్కడ నీ ముసుకుగుండా నీ నేత్రములు గువ్వకన్నుల వలె కనిపిస్తున్నాయి
అంటూ సోలోమోను గారు వర్ణిస్తున్నారు! నిజానికి క్రీస్తుప్రభుని నమ్ముకున్న
బిడ్డలు కూడా వారి ప్రవర్తనా నియమావళి ఇలానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు!
గువ్వ పావురము పర్యాయపదాలు అని గమనించాలి
ఇక గువ్వ కోసం ఆలోచిస్తే సంఖ్యా 6:10 లో
ఎవడైనా అపవిత్రుడైతే రెండు తెల్ల గువ్వలు తేవాలి, లేక పావురాలు
తేవాలి! ఒకటి అర్పణ చేయాలి. ఇక్కడ అపవిత్రమైన
వాటినుండి పవిత్రత కలగాలి అంటే గువ్వ లేక పావురము అర్పించబడాలి! అలాగే నీవుకూడా పవిత్రుడిగా ఉండాలి అంటే నీకు గువ్వ కన్నులు కలిగి ఉండాలి!
గువ్వ చచ్చిన వాటిమీద వ్రాలదు! అపవిత్రమైన వాటిని
ముట్టుకోదు అలాగే నీవు కూడా పవిత్రమైన జీవితం జీవించాలి! ఇక్కడ
గువ్వకళ్ళు అనగా పాపము చూడలేని కళ్ళు అని అర్ధము! నీవు కూడా పాపమును
అసహ్యించుకునే బుద్ది కళ్ళు విశ్వాసికి ఉండాలి!
ఇక యిర్మీయా 48:28 ప్రకారం గువ్వ కొండపేటు సందులలో
గూడు కడుతుంది! ఎందుకంటే వేటగాళ్ళు గాని క్రూర పక్షి గాని జంతువులు
గాని వాటికి హాని చేయకూడదు అని! అలాగే దేవుని బిడ్డలు పేటు సందులు అనబడే ప్రభువైన యేసుక్రీస్తు గాయాలలో ఆశ్రయము
పొంది జీవించాలి! అలా ఆయన గాయాలను ఆశ్రయించక పోతే సాతాను గర్జించు
సింహము వలె వెదుకుతూ తిరుగుతూ మనలను నాశనం చేయాలని ఆశిస్తున్నాడు! వీడు మనలను వేటాడి బ్రష్టులుగా చేస్తాడు! అందుకే మనకు
ప్రభువు గాయములే శరణము!! గువ్వ కన్నులు ఎల్లప్పుడూ కొండ పేటుల
మీదనే ఉంటాయి. అలాగే మన కన్నులు కూడా క్రీస్తు గాయాలనే చూడాలి!
అందుకే మోషే గారు 90 వ కీర్తనలో అంటున్నారు ప్రభువా
తరతరములకు నా నివాస స్థలము నీవే!!!
కాబట్టి మన దృష్టి క్రీస్తుయేసు సిలువపై మాత్రమే ఉండాలి!
ఇక లేవీ 1:14 ప్రకారం గువ్వ బలి ఆర్పణకు
సాదృశ్యం! మానవుని పాపము
విమోచించ బడాలి అంటే గువ్వ బలి కావాలి! అలాగే యేసుక్రీస్తుప్రభులవారు
మనకొరకు బలిగా మారిపోయాడు! అలాగే మనము కూడా క్రీస్తుయేసు కోసం ఆయన మహిమ కోసం మన సమస్తము అర్పణ చేయడానికి
సిద్దం కావడం మాత్రమే కాకుండా ఆయన కొరకు చనిపోడానికి కూడా సిద్ధంగా ఉండాలి!
ఇక ఆదికాండం 8:8—12 ప్రకారం
పావురం చచ్చిన కళేబరముల మీద వ్రాలక కాలుపెట్టడానికి చోటులేక తిరిగి ఓడ లోనికి వచ్చేసింది!
అనగా అపవిత్రమైన స్థలములలో కాలుపెట్టని అనుభవము అని తెలుస్తుంది!
అపవిత్రత ఏ రూపములో ఉన్నా దాని నుండి దూరముగా పారిపోవాలి! వాటిని ప్రేమించకూడదు! మన దృష్టి కేవలం పవిత్రమైన వాటిమీదనే
ఉండాలి!
ఇంకా కీర్తన 55:6—7 ప్రకారం
ప్రమాదం వచ్చేలా ఉంటే లేక కీడు వచ్చేలా ఉంటే పావురం పారిపోతుంది ఇంకా పెనుగాలి సుడిగాలి
తప్పించుకుంటుంది. నెమ్మది గల జీవితమును పావురం ఆశిస్తుంది!
అనగా మన జీవితంలో కలిగే కష్టాలలో శ్రమలలో నుండి తప్పించుకుని విజయం సాధించే
విధంగా ఎక్కువగా ప్రార్ధించే అనుభవము అన్నమాట! దేవుడు అంటున్నారు
మీరు శోధనలోనికి ప్రవేశించ కుండునట్లు మెళుకువ కలిగి ప్రార్ధన చేయండి! అలానే మనము కూడా చేయాలి!
ఇంకా హొషేయా 11:11 ప్రకారం గువ్వలవలే ఇశ్రాయేలు ప్రజలు అన్య దేశాలలో ఉంటూ
దేవుని ప్రార్ధించి గువ్వల వలే ఎగిరివచ్చి దేవుని సన్నిధిలో జీవించడానికి ఇష్టపడ్డారు!
గనుక సాతాను చెరలో లోకపు చెరలో నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో
జీవించడానికి ప్రభువు బిడ్డలు ప్రయత్నించాలి! లోకాచారాలు లోకపు
పద్దతుల నుండి దూరంగా ఉండాలి!
చివరిగా మత్తయి 10:16 ప్రకారం పావురములు నిష్కపటమైనవి
అని ప్రభువే చెబుతున్నారు! కాబట్టి విశ్వాసులు నిష్కపటమైన జీవితం
జీవించాలి! దైవభక్తి కల్గి ఉండాలి! మన మాటలలో
పవిత్రత, చూపులలో పవిత్రత ప్రవర్తనలో పవిత్రత కలిగి ఉండాలి!
కపటముగా జీవించరాదు! నతానియేలు వలె కపటము లేని
జీవితం జీవించాలి!
ఇదే నిజమైన గువ్వ అనుభవము!
ఇలాంటి అనుభవము జీవితం ప్రియ విశ్వాసి నీకుందా!!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*62వ భాగము*
*నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి*
పరమగీతము 4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ
ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది
మేకల మందను పోలియున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక ఈ వచనములో నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.
గతభాగములో మూసుకు వేసుకున్న
అనుభవము కోసం చూసుకున్నాము!
(గతభాగము తరువాయి)
ఇక ఈరోజు నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి
కోసం చూసుకుందాము!
ఆమె తల వెండ్రుకలు నిండుదనముగా ఉన్నవని చెప్పుటకు గిలాదు పర్వతము మీద
మేకల మందను పోల్చి చెప్పుట జరిగింది. ఈ వెండ్రుకలు శరీరమును కప్పుకొనుటకు ఆమెకు ఇచ్చినట్లుగా పౌలు తన లేఖలో వ్రాశారు. 1 కొరింథీ 11:15.
అయితే ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే తలవెండ్రుకలు దేవునికి ప్రతిష్టించబడిన
జీవితానికి అనగా నాజీరు చేయబడటకు సాదృశ్యముగా మనము పాత నిబంధన గ్రంధములో చూడగలము!
గమనించాలి క్రొత్త నిబంధనలో తల వెండ్రుకలు పెంచుకొనుట పురుషునికి అవమానము
అని పౌలుగారు చెబుతున్నారు. అయితే నాజీరు చేయబడిన వారు వారి జీవితములో ఎప్పుడు
కూడా తల వెండ్రుకలు తీయకూడదు! ఎందుకంటే వారు దేవునికి ప్రతిష్టించ
బడిన వారు, వారు దేవుని మహిమ కోసమే జీవించాలి! పాత నిబంధన భక్తులు తమ తల వెండ్రుకలు భరించి ప్రభువు మహిమ కొరకు నిందలు అవమానాలు
భరించారు! అలాగే ప్రతిష్టించబడిన విశ్వాసి జీవితం నిందలు అవమానాలు
ఎదుర్కోవాలి! అలాగే రక్షించబడి క్రీస్తుకోసం తమ జీవితాలు అర్పించుకున్న
లేక ప్రతిష్టించుకున్న విశ్వాసి జీవితంలో ఎన్నో శ్రమలను శోధనలను అవమానాలు భరించవలసిన
అవసరం ఎంతైనా ఉంది! శోధన శ్రమలను అనుభవిస్తూ క్రీస్తు మహిమ కోసం
జీవించే అనుభవమే ఈ తల వెండ్రుకలు – అవి గిలాదు
పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నాయి అంటున్నారు! నిజానికి గిలాదు
పర్వతం ఎంతో పచ్చగా ఉంటుంది. ముళ్ళు తక్కువ! ఇది సుమారుగా 1200 మీటర్ల ఎత్తుగా ఉన్నా పశువులు మేయడానికి
ఎంతో వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కొండమీద గుగ్గిలము చెట్లు
ఎక్కువగా ఉంటాయి! వాటితో ఎన్నో రకాలైన వ్యాదులకు మందుగా వాడేవారు!
అందువలన వీటి ఆకులు తిన్న పశువులు మేకలు ఎంతో ఆరోగ్యముగా ఉండేవి!
అయితే ఇలా మేయుచున్న మేకలు కొండ క్రిందనుండి చూస్తే పచ్చని కొండ- వాటిమీద
మేయుచున్న తెల్లని మేకలు ఎంతో అందంగా కనిపించేవి! దానితో ఇప్పుడు
షూలమ్మితి యొక్క తల వెండ్రుకలను పోలుస్తున్నారు!
సరే, దీనికోసం ఆలోచిస్తే మొదటగా తల వెండ్రుకలు నాజీరు చేయబడిన
అనుభవంతో పోల్చుకుంటే మొదటగా ఈ అనుభవము ప్రత్యేకించ బడిన అనుభవము! వీరు మధ్యము గాని ద్రాక్షారసము గాని తాగకూడదు అనగా మత్తు పదార్ధాలు ఏవీ తీసుకోకూడదు! శరీర సంబంధమైన కార్యాలు వదిలి క్రీస్తుకోసం
ప్రత్యేకముగా జీవించాలి! ఇంకా ప్రభువుకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు!
ఇదే సంఖ్యా 6:5 లో చెప్పబడిన తల వెండ్రుకల అనుభవము
మనకు తెలుపుతుంది!
ఇక న్యాయాధిపతులు 13:5 లో తల వెంట్రుకలు సేవా జీవితాన్ని సూచిస్తున్నాయి!
సంశోను గారు పుట్టకముందే దేవుడు చెబుతున్నారు ఇతడు ప్రతిష్టితుడై దేవుని
పరిచర్య చేయాలి అని! అలాగే పెద్దవాడు అయ్యాక సంశోను దేవుని సేవ చేశాడు. అయితే
తర్వాత కామంలో పడిపోయి తన తల వెంట్రుకలను బలమును అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు!
కాబట్టి ఇది సేవా జీవితాన్ని అభిషేకించ బడిన అనుభవాన్ని సూచిస్తుంది!
కాబట్టి విశ్వాసి తన జీవితంలో సేవ పరిచర్యను వదల కూడదు అలాగే అభిషేకాన్ని
పోగొట్టుకో కూడదు!
ఇక 1 సమూయేలు
1:11 ప్రభువుకు అప్పగించబడిన జీవితానికి సాదృశ్యం! హన్నా గారు తన కుమారున్నీ అనగా సమూయేలు గారిని ప్రభువు పరిచర్య కోసం మందిరములో
అప్పగించేసింది. ఇక ఎప్పుడు అతనిని ఆశించలేదు! ఇక ప్రభువుకోసం అప్పగించబడిన సమూయేలు గారు తన జీవితమంతా సమర్పణ కలిగిన జీవితం
కలిగి దేవుని కోసమే జీవించారు! మనము కూడా సమర్పణ మరియు ప్రభువుకోసం
అప్పగించబడిన జీవితాలు కలిగి జీవించాలి!
ఇంకా
ఆమోసు 2:11 ప్రకారం ఇది దేవుని ఏర్పాటును సూచిస్తుంది! దేవుడే కొందరిని
ఏర్పరచుకుని తన కొరకు తన సేవ కొరకు పిలుచుకుంటారు! వారు తమ తల
వెంట్రుకలు పెంచుకుని నాజీరులుగా దేవుని కోసం ప్రతిష్టించుకుని ప్రభువుకోసమే జీవిస్తారు!
ప్రియ
సహోదరి సహోదరుడా! ఇలాంటి దేవునికోసం ప్రత్యేకించబడిన జీవితం నీకుందా!!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*63వ భాగము*
*నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి*
పరమగీతము 4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ
ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది
మేకల మందను పోలియున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక ఈ వచనములో నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి అంటున్నారు!
గతభాగములో ముసుకు వేసుకున్న
అనుభవము కోసం చూసుకున్నాము!
(గతభాగము తరువాయి)
ఇక ఈరోజు నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి
కోసం చూసుకుందాము!
గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నాయి అంటున్నారు! గతభాగములో
చెప్పుకున్నాము గిలాదు పర్వతం ఎంతో పచ్చగా ఉంటుంది. ముళ్ళు తక్కువ!
ఇది సుమారుగా 1200 మీటర్ల ఎత్తుగా ఉన్నా పశువులు
మేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కొండమీద గుగ్గిలము
చెట్లు ఎక్కువగా ఉంటాయి! వాటితో ఎన్నో రకాలైన వ్యాదులకు మందుగా
వాడేవారు! అందువలన వీటి ఆకులు తిన్న పశువులు మేకలు ఎంతో ఆరోగ్యముగా
ఉండేవి!
అయితే ఇలా మేయుచున్న మేకలు కొండ క్రిందనుండి చూస్తే పచ్చని కొండ- వాటిమీద
మేయుచున్న తెల్లని మేకలు ఎంతో అందంగా కనిపించేవి! దానితో ఇప్పుడు
షూలమ్మితి యొక్క తల వెండ్రుకలను పోలుస్తున్నారు!
సరే, ఇప్పుడు గిలాదు
పర్వతము యొక్క ప్రత్యేకత కోసం – దానిలో
ఉన్న ఆత్మీయ అర్ధము కోసం చూసుకుందాం!
మొదటగా 1 రాజులు 17:1 ప్రకారం అక్కడ ఏలీయా
గారు నివాసం చేసేవారు! అనగా దైవ సన్నిధి అక్కడ ఉంది అని అర్ధము!
ఆయన మాట- ఎవని సన్నిధిని నేను ఉన్నానో ఆయన మాట
ప్రకారం అంటూ ఉండేవారు! కాబట్టి గిలాదు అనుభవము అనగా దైవసన్నిధితో
నిండిన అనుభవాలు! మన ప్రతి అడుగులో ఆయన సన్నిధిని అనుభవించే అనుభవం
ఉండాలి! మనం నడిచేటప్పుడు మనం పనిచేసేటప్పుడు ఆయన సన్నిధిని అనుభవించాలి!
అంతేకాకుండా మనము చేసే ప్రసంగాలు ఆయన సన్నిధిని క్రిందికి దింపే విధంగా
ఉండాలి గాని చవిసారం లేని చప్పటి ప్రసంగాలు చేయకూడదు! మనం చేసే ప్రసంగాలు వలన ప్రజల గుండెలు
మండాయి అంటే ప్రజలను రగిలించాయి అంటే పాపి పశ్చాత్తాపం కలిగింది అంటే దేవుని సన్నిధి పనిచేసింది అని అర్ధము!
ఇక సంఖ్యా 32:1 ప్రకారం గిలాదు మందలకు తగిన స్థలము! అందుకే రూబేనీయులు గాదీయులు మనస్శే అర్ధగోత్రము వారు ఆ ప్రాంతము తమకు స్వాస్త్యముగా
కావాలని కోరుకున్నారు! ఇది యొర్దాను అవతలి ప్రాంతము! యోర్దానుకు అవతల వాగ్ధాన భూమి ఉంది! అయితే పై గోత్రాల
వారు వాగ్ధాన భూమిని వద్దు అనుకున్నారు! మందలకు తగిన ప్రాంతము
అని గిలాదును కోరుకున్నారు! ప్రభువు చిత్త ప్రకారం జీవించని వారే
ఈ గిలాదు అనుభవం గలవారు! దేవునికంటే తమ సుఖానుభవమును ఎక్కువగా
కోరుకునే వారు ఈ గిలాదు అనుభవం గలవారు! దేవునికంటే తమ ఆస్తి ఐశ్వర్యమే
తమకు మొదటి స్థానము అని భావించే వారు! తమ స్వార్ధము కోసం తమ సుఖముల
కోసం దేవున పనిని దేవుని మందిరాన్ని దేవునినే త్రోసివేసే వారు ఈ గిలాదు అనుభవం గలవారు!
చివరకు అందరికంటే ముందుగా వీరే చెరలోనికి పోయారు అని చరిత్ర చెబుతుంది! ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా!
నీవు ఒకవేళ ఈ అనుభవం లో ఉంటే జాగ్రత్త – నీవు కూడా
సాతాను చెరలోనికి ముందుగానే పోతావు అని గ్రహించు!
ఇక యిర్మీయా 8:22 ప్రకారం: గిలాదులో
స్వస్థత ఉంది! యిర్మీయా గారి దినాలలో వారు దేవుని విడిచి చేయకూడని
కార్యాలు చేశారు అందుకే దేవుడు వారిని రోగములతో నింపారు! ఎన్నో
అపవిత్రమైన కార్యాలు చేశారు ! చెడుమార్గాలలో నడిచి చెడు కార్యాలు
చేశారు! దీనివలన ఆత్మీయంగా రోగులయ్యారు! మరి రోగ నివారణకు వైద్యుడు గాని ఔషదం గాని లేక పోయింది అందుకే గిలాదులో గుగ్గిలము
లేదా అంటున్నారు! ఒకవేళ నీవు ఇలాంటి స్థితిలో ఉంటే నీకు వైద్యుడు
ప్రభువే! ఆ గిలాదు గుగ్గిలము క్రీస్తు రక్తమే!! ఆయనే మన రోగములను భరించు వాడు మన రోగములు స్వస్థ పరచువాడు! ఆయనే మన పరమ వైద్యుడు! ఆయన పాదాలు పట్టుకుని నీ చెడుతనము వదిలి ఆయన శరణు వేడితే తప్పకుండా నిన్ను
స్వస్థత చేకూర్చి నీకు తన ఆత్మీయ సౌందర్యము ఈయ గలడు!
మరి నీవు సిద్దమా?
చివరగా గిలాదు మేత స్థలము. మేతకోసం పశువుల కాపరులు తమ పశువులను
అక్కడికే తీసుకుని వెళ్తారు. ఇప్పుడు విశ్వాసికి నిజమైన ఆత్మీయ
ఆహారం కావాలంటే మందిరానికి రావలసిందే! టీవీల్లో వాక్యం విని బలపడతానంటున్నావేమో!
లేదు లేదు! నీవు మందిరానికి రావలసిందే!
మందతోపాటుగా మేయవలసిందే! అక్కడ గడ్డితోపాటు గుగ్గిలము
ఆకులు తినాల్సిందే! అప్పడే స్వస్థత నీకు! మరి నీవు గిలాదుకు వస్తావా!!!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*64వ భాగము*
*నీ పలువరుస కత్తెరవేయబడినవియు*
పరమగీతము 4: 2 నీ పలువరుస కత్తెరవేయబడినవియు
కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక
సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక రెండవ వచనములో
2 నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి
అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న
గొఱ్ఱెల కదుపులను పోలియున్నది అని ప్రియుడైన సోలోమోను పోగొడుచున్నాడు షూలమ్మితి అందమును!
అనగా ఇక్కడ సోలొమోను ఏమని చెబుతున్నారు అంటే ఆమె దంతాలు – తెల్లగా, మెరుస్తూ ఒకదానికొకటి చక్కగా అమరి ఉన్నాయి.
ఇక్కడ ఆమె పలువరుస హెచ్చుతగ్గులు లేక సరి చేయబడి వరుస క్రమములో ఉన్నవి. అలాగే అవి బాగా కడగబడి అప్పుడే పైకి
వచ్చినవియై పిల్లలను కలిగిన గొఱ్ఱెయొక్క పిల్లలను పోలియున్నవని చెప్పుచున్నారు. అంటే తమ పాపములు ప్రక్షాళన చేసుకొని
ప్రభువు రక్తములో కడగబడి, అప్పుడే నీతిలో ప్రవేశించినవారికి సూచనగా
అవి అలా కనబడుచున్నవి. ఆమె పెదవులు సన్నవిగా ఎరుపుగా ఉన్నవని చెప్పుటకు ఎరుపు నూలుతో పోల్చి చెప్పుచున్నారు. అలా సన్నని పెదవులుగల నోరు సుందరమైనదని
చెప్పబడింది. అలాగే ఆమె
కణతలు దాడిమ ఫలమువలె కనిపిస్తుంది.
ఈ విధముగా రకరకాలుగా క్రైస్తవ్యములోనికి వచ్చిన విశ్వాసులచే వధువు
నింపబడి వివాహమునకు సిద్ధపరచుచున్నది.
అలా తయారైన వధువు క్రీస్తు ప్రభుని కళ్లకు పై విధముగా కనబడినట్లుగా
వ్రాయబడింది.
దీనికోసం ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభువు మేడగదీలో శిష్యులకు ఏ విధమైన ఆత్మీయ
సౌందర్యము ఉండాలో చెబుతున్న సన్నివేశము ఇది!
నీ పలువరుస కత్తెర వేయబడి.. గమనించాలి
వరుసగా ఉండే పళ్ళు సౌందర్యాన్ని కలుగజేస్తాయి! పళ్ళు ఎగుడుదిగుడుగా
ఉంటే ముఖము యొక్క కవళికలు అంత బాగోవు! అందుకే పరువరుస క్రమంగా
ఉండాలి! ఒక్క పన్ను ఊడినా విరిగినా అందం లోపిస్తుంది!
ముసలి వారికి పళ్ళు ఊడిపోయినప్పుడు అంత బాగా కనబడరు! అయితే కొంతమందికి వయసులోనే పళ్ళు పుచ్చుపోయి పురుగులు పట్టి ఉంటాయి,
మరికొందరి పళ్ళు బలం లేకుండా ఊగుతుంటాయి! ఇలాంటివారి
ముఖ్యం కొంచెం అందవిహీనంగా కనిపిస్తుంది! మరికొంతమందికి ఆహారం
నమలడం కూడా కష్టంగా ఉంటుంది అందుకు వారు నమలకుండా మింగివేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని డైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి!
కోరింథీ విశ్వాసులు బలమైన ఆహారం తీసుకోలేక పోయారు అని పౌలుగారు
చెబుతున్నారు! పౌలుగారు వారిని సరియైన దారిలోనే సరియైన ఆహారమే పెట్టి
పోషించినా వారిలో ఉన్న కలహాలను బట్టి, లోక కార్యాలు బట్టి,
వారు ఆత్మీయంగా ఎదగలేక పోయారు అని మనకు రెండు కోరింథీ పత్రికలు చదివితే
అర్ధమవుతుంది! అందుకే పౌలుగారు అంటున్నారు మీరింకనూ శరీర సంబంధులుగా
వున్నారు అప్పుడు మీరు బలహీనులై ఉన్నారు మీలో అసూయ కలహములు ఉన్నాయి సంఘములో ముఠాలు
ఉంటే కుల బేధములు అంతస్తు బేధాలు ఉంటే మీ పలువరుస బాగోలేదు అని అర్ధము! ఏ సంఘములో ఇలాంటి బేధాలు తారతమ్యాలు కనిపిస్తాయో సంఘములో వారి పలువరుస బాగోలేదు
అని అర్ధము!!!
1 కోరింథీ 3: 1 సహోదరులారా, ఆత్మసంబంధులైన
మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన
మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.
2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును
పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై
యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై¸
3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య
రీతిగా నడుచుకొనువారు కారా?
ఇలాగే హెబ్రీ పత్రికలో కూడా అభిప్రాయ పడ్డారు!
5: 12 కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై
యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి
వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
13 మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో
అనుభవములేనివాడై యున్నాడు.
14 వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు
సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.
ఇక్కడ బలమైన ఆహారం తినకుండా వారి పళ్ళు వారిని ఆటంకపరుస్తున్నాయి! వాక్యము దొరకక కాదు!
వాక్యము పెట్టడానికి సంఘకాపరి సిద్ధంగా ఉన్నాడు, పెడుతున్నాడు కూడా! గాని పళ్ళు వలన ఆహారం తీసుకోలేక బాధపడుతుంది
ఈ సంఘములో విశ్వాసులు! ఎందుకంటే మీద చెప్పినట్లు కలహాలు లోకాచారాలు
దురభిమాన పాపం అన్నీ అడ్డువస్తున్నాయి! అవే వారి పళ్ళను బలహీన
పరుస్తున్నాయి!
ఇక మూడవ గుంపు- వీరు కోపోద్రేకులు కీర్తన 57:4 నా ప్రాణము
సింహములమధ్య నున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు
అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి. వీరిలో కోపము చాలా ఎక్కువ!
కోపాన్ని పూర్తిగా తీసేవరకు వీరు అందరి దృష్టిలోనూ శత్రువులుగా ఉంటారు!
అందరినీ శత్రువులుగానే చూస్తారు! శూలాల వంటి మాటలు
కత్తిపోటు వంటి మాటలు దెప్పి పొడిచే మాటలు మాట్లాడతారు! ఇవి తప్పకుండా
కత్తెర వేయబడాలి! అప్పుడే క్రమంగా అవుతాయి! అప్పుడే మన సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి! మన పళ్ళు
ఎగుడుదిగుడుగా ఉన్నంతవరకు సంఘము క్షేమాభివృద్ది పొందదు ఇంకా ప్రభువుకు మహిమ రాదు అని
గ్రహించాలి ప్రియులారా!
ఇక సామెతలు
13 లో చెప్పినట్లు కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు వీరు సంఘములో
ఉన్న మంచి విశ్వాసులను హతమారుస్తూ ఉంటారు 13 కన్నులు నెత్తికి
వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!
14 దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను
నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు.
కాబట్టి ఇలాంటివారు సంఘములో ఉంటే దీనులను బీదలను సంఘము నుండి తరిమేస్తూ ఉంటారు
ఇలాంటివారు సంఘములోనుండి కత్తెర వేయబడాలి! అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది!
ఒకవేళ
ఇలాంటి బుద్ధి నీకుంటే ఆమోసు 4:6 ప్రకారం నీకు దంతశుద్ధి కలుగజేస్తాను అంటే నీ మూతిపళ్లు
రాలగొడతాను అంటున్నారు దేవుడు!
అంతేకాకుండా
కీర్తన 3:7 లో దుష్టుల దవడ పళ్ళు రాలగొడతాను అంటున్నారు! కాబట్టి
మనలో గనుక అలాంటి పాడు బుద్దులు ఉంటే పలువరుస కత్తెర వేయబడి దేవునికి ఇష్టులుగా ఉందాము!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*65వ భాగము*
*కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై*
పరమగీతము 4: 2 నీ పలువరుస కత్తెరవేయబడినవియు
కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక
సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక రెండవ వచనములో 2 నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి
అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న
గొఱ్ఱెల కదుపులను పోలియున్నది అని ప్రియుడైన సోలోమోను పోగొడుచున్నాడు షూలమ్మితి అందమును!
అనగా ఇక్కడ సోమోను ఏమని చెబుతున్నారు అంటే ఆమె దంతాలు – తెల్లగా, మెరుస్తూ ఒకదానికొకటి చక్కగా అమరి ఉన్నాయి.
(గతభాగం తరువాయి)
ఇక
తర్వాత మాట ఏమిటంటే ప్రియులారా! కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి
ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది
మొట్టమొదటిగా కడుగబడి అంటున్నారు! ఏవి? గొర్రెల కదుపులు!
మొదటగా సోలోమోను షూలమ్మితి పళ్ళు కత్తెరవేయబడి క్రమబద్ధంగా ఉండాలని కోరుకుంటే
తరవాత అవి కడుగబడి ఉండాలని కోరుకుంటున్నట్లు ఇక్కడ చూడగలము!
అదేవిధంగా విశ్వాసులు కూడా మన పళ్ళు కడుగబడి ఉండాలి! విశ్వాసి కడుగబడిన స్థితిలో
ఉండాలి! మరి ఎవరు కడుగుతారు? ప్రభువే అని
గ్రహించాలి ప్రియులారా!
మొదటగా ఆదికాండం 49:12 లో అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు
పాలచేత తెల్లగాను ఉండును అంటున్నారు! ఇక్కడ యూదా గారిని యాకోబుగారు
దీవిస్తున్నారు! యూదా పళ్ళు పాలచేత అనగా దేవుని వాక్యముచేత కడుగబడి
తెల్లగా ఉండాలని తండ్రి ఆశ! దేవుని వాక్యమనే పాలు మన పళ్ళను అనగా
మన సంభాషణాలను తెల్లగా పరిశుద్ధంగా ఉంచగలదు! తెల్లగా ఉండటం అనగా
పరిశుద్ధంగా ఉండటం!! పేతురుగారు అంటున్నారు నిర్మలమైన వాక్యమనే
పాలను ఆపేక్షించండి అంటున్నారు! మనము అను దినము వాక్యమనే పాలతో
కడుగబడితే ఆ వాక్యము మనలో ఉన్న అపవిత్రతను కడిగి మనలను పరిశుద్దులుగా చేస్తుంది ప్రియులారా!
అంతేకాదు ఆ వాక్యమనే పాలు మన మాటలను చేటలను చేష్టలను ఆలోచనలను చూపులను
కూడా పవిత్రముగా ఉంచగలదు ప్రియులారా! ఎందుకంటే దేవుని వాక్యము
రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై మన లోపల వరకు అనగా మూలుగులు వరకూ దూరి శోధించి
శుద్ధి చేయగలదు! అందుకే ఈ నిర్మలమైన వాక్యమనే పాలను కోరుకోమంటున్నారు
పేతురు గారు! కాబట్టి మొదటగా పాలచేత అనగా వాక్యము చేత కడగబడాలి
విశ్వాసి!
రెండవదిగా
యేసుక్రీస్తుప్రభులవారు శిష్యుల పాదములను కడిగారు! అనగా ఇప్పుడు విశ్వాసి నీళ్లచేత కూడా కడుగబడాలి! ఉదకము అనగా నీరు! పౌలుగారు రెండుసార్లు ఆత్మావేషుడై రాస్తున్నారు వాక్యమను ఉదక స్నానము చేత కడుగబడాలి
అంటూ! మొదటగా పాలు వాక్యమును సూచిస్తే, ఇక్కడ అదే వాక్యము ఉదకము అని కూడా సూచిస్తుంది!
ఎఫెసీ 5:27
26 అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, *వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి*,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
హెబ్రీ 10:22
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు
గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై
యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
కాబట్టి
వాక్యము ద్వారా అనుదినము మనము కడుగబడి మనలో ఉన్న ఆలోచనలను అలవాట్లను చూపులను సరిదిద్దుకొనే
అనుభవమే ఈ కడుగబడిన అనుభవము!
కీర్తన 119:9 లో అంటున్నారు భక్తుడు
యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా
చూచుకొనుట చేతనే గదా?
ఇక 2 థెస్స 2:13 ప్రకారం పరిశుద్దాత్మ చేత కడుగబడాలి!
ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను,
మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు
ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లింప బద్ధులమైయున్నాము.
ఇప్పుడు కడుగబడే మూడవ గొప్ప కార్యము- పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధ పరచాలి!
ఎలాగో చెబుతాను! నీవు వాక్యముచేత నడిపించబడినప్పుడు,
ఆత్మ పొందుకుని ఆత్మద్వారా నడిపించబడేటప్పుడు- ఒకవేళ నీవు నడిచేదారిలో ఒక అందమైన స్త్రీ ఘోరమైన బట్టలు వేసుకుని మూతికి ముఖానికి
రంగులు పూసుకుని నడిచిపోతుంది
అనుకో, వెంటనే నీవు చూస్తావు అయితే వెంటనే నీ మనస్సులో ఎటువంటి
పాడు ఆలోచనలు రావు- ఒకవేళ నీకు వస్తే వాక్యము మొదటగా నిన్ను హెచ్చరిస్తుంది
అంతేకాకుండా పరిశుద్దాత్మ దేవుడు- ఒరే రాజ కుమారా నీవు రక్షించబడిన
వాడవు, దేవుని రక్తములో కడుగబడిన వాడవు- నీవు ఇలా చూడొచ్చా అని పరిశుద్ధాత్ముడు మరియు వాక్యము కూడా గద్ధిస్తారు వెంటనే
ప్రభువా నన్ను క్షమించు అని నీ చూపులు మార్చుకుంటావు! ఈ విధంగా నీవు పరిశుద్ధాత్మ ద్వారా
కడుగబడతావు!
రోమా 15: 15 అయినను అన్యజనులు అను అర్పణ
పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త
విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింప..
ఇక
మరొక కడుగబడే మూలము: రక్తము చేత కడగబడాలి! ఎవరి రక్తము? క్రీస్తుయేసు రక్తము చేత కడగబడాలి! ప్రకటన 1: 6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు
ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
1 యోహాను 1: 7.అయితే ఆయన వెలుగులోనున్న
ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము;
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా
చేయును.
9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి
మనలను పవిత్రులనుగా చేయును.
హెబ్రీ 13: 12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత
ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
1 పేతురు 1: 18 పితృపారంపర్యమైన
మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు
విమోచింపబడలేదుగాని
19 అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును
నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని
మీరెరుగుదురు గదా
కాబట్టి
విశ్వాసి తప్పకుండా యేసురక్తములో కడగబడాలి!!
సరే, ఇప్పుడు విశ్వాసి వాక్యముచేత, పరిశుద్దాత్మ చేత, యేసు రక్తము చేత కడగబడాలి అని చూసుకున్నాము!
అయితే ఇంతకీ శుద్ధీకరించేది వాక్యమా? పరిశుద్ధాత్ముడా?
యేసు రక్తమా?
జవాబు: ఈ ముగ్గురు!!!ఈ నుగ్గురు కలసి
కట్టుగా పనిచేస్తూ విశ్వాసిని శుద్దీకరిస్తారు! ఏం? ఎందుకంటే ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు!!
1 యోహాను 5: 6నీళ్లద్వారాను రక్తముద్వారాను
వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన
నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము
గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
7 సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును,
ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.
తెలుగులో దీని తర్జుమా తప్పుగా ఇవ్వబడింది ప్రియులారా! ఇంగ్లీషు
లో చూసుకుందాం!
6 This is He who came by water and blood -- Jesus Christ; not
only by water, but by water and blood. And it is the Spirit who bears witness,
because the Spirit is truth.
7 For there are three that bear witness in heaven: the Father,
the Word, and the Holy Spirit; and these three are one.
8 And there are three that bear witness on earth: the Spirit,
the water, and the blood; and these three agree as one.
కాబట్టి
మనము అనుదినము వాక్యముచేత,
యేసురక్తము చేత, పరిశుద్ధాత్మ చేత కడుగబడుచు కత్తెరవేయబడిన
పలువరస కలిగి, కడుగబడిన పళ్ళు అనే కడుగబడిన జీవితం కలిగి జీవిద్దాం!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*66వ భాగము*
*నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి*
పరమగీతము 4: 3. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 3వ వచనములో నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ఇక్కడ
ముఖ్యముగా మనకు నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి ప్రియులారా!
మొదటిది: పెదవులు- ఎరుపు నూలువలే ఉన్నాయి
రెండు: నోరు సుందరముగా ఉంది
మూడు: ముసుగు గుండా కణతలు (ముసుగు కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము
ప్రియులారా)
నాలుగు: దాడిమ ఫలము లేక దానిమ్మ పళ్ళు!
ఈరోజు
మొదటిది నీ పెదవులు ఎరుపు నూలును పొలియున్నది కోసం ధ్యానం చేసుకుందాం!
గమనించాలి ఇక్కడ షూలమ్మితి అందమును సోలోమోను గారు పొగుడుతున్నారు! అనగా ఆత్మీయ అర్ధములో
ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారికి సంఘములో ఏ ఏ లక్షణాలు కనిపించాలో చెబుతున్నారు!
ఎరుపు నూలు కోసం ఆలోచిస్తే యెహోషువా గ్రంధంలో 2:28 లో రాహాబు అనే వేశ్య
రక్షించబడటానికి ఎరుపు నూలు కట్టింది! రక్షించబడింది!
అనగా ఇక్కడ ఎరుపునూలు రక్షణకు సాదృశ్యం! కాబట్టి విశ్వాసి రక్షించబడిన అనుభవములో ఎల్లప్పుడూ
ఉండాలి!
*గమనించాలి రక్షణ పొందటం చాలా సులువు
గాని రక్షణ కాపాడుకోవడం లేక నిలబెట్టు కోవడం చాలా కష్టము* కాబట్టి
విశ్వాసి తన జీవితాంతం దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యమును కాపాడుకోవాలి!!!
రాహాబు తన జీవితాంతము తన జీవితములో ఆ ఎరుపునూలు ఎంతగా రక్షించిందో మరచిపోలేదు! అలాగే నీవు కూడా నీ రక్షణను
ఎలా పొందుకున్నావో దాని విలువ ఎప్పుడు మర్చిపోకూడదు!
సరే, షూలమ్మితి పెదవులు ఎరుపునూలును పోలి ఉన్నాయి! అనగా సంఘము
యొక్క పెదవులు ఎరుపునూలు అనేది రక్షణతో నిండి ఉండాలి! రక్షణకోసం
ప్రచురించాలి! రక్షణ కొరకు పాడాలి! స్తుతించాలి!
రక్షణ ప్రభావమును జనులకు వివరించాలి!
కీర్తన గ్రంధంలో ప్రకారం క్రీస్తునందు విశ్వాస ముంచి మన పెదవులు ప్రార్ధించుటకు
ఆయన రక్షణ గూర్చి వివరించుటకు ప్రతిష్ట చేయాలి! దేవుని సన్నిధిలో ప్రార్ధన
చేసే వారిగా మాన్యముండాలి! అంతేతప్ప కపటమైన పెదవులతో ప్రార్ధన
చేయకుండా, అది పవిత్రమైన పెదవులతో రావాలి, కపటముతో చేసే ప్రార్ధన దేవుడు ఆలకించడు అంటూ ఎన్నో కీర్తనలు చెబుతున్నాయి!
ఇక
కీర్తన 40:9 లో 9 నా పెదవులు మూసికొనక
మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
అనగా
మన పెదవులు నీతిని ప్రకటించేవిగా ఉండాలి! ఎందుకంటే ప్రభువు నీతిమంతుడు కనుక ఆయన తన పిల్లలు
కూడా నీతిమంతులుగా ఉండాలని తన రక్తముతో కడిగి కేవలం తన కృపచేత మనలను నిర్ధోషులుగా నీతిమంతులుగా
చేశారు! ఇప్పుడు అవి
రక్షణ ప్రకటించేవిగా ఉండాలి మన పెదవులు!
51:15 ప్రకారం ఆయన స్తుతిని ప్రచురము చేసేవారీగా స్తుతించే వారీగా ఉండాలి!
15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని
ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
దావీదు
గారు కష్టమొచ్చినా స్తుతించారు బాధ కలిగిన స్తుతించారు! సంతోష మొచ్చినా స్తుతించారు!
అందుకే దేవుడు దావీదుగారిని అంత ఘనముగా వాడుకున్నారు!
కీర్తనా
కారుడు 63:5 లో జీవితకాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నారు!
5 క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
6 కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను
నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
ఇక 66 వ అధ్యాయములో అంటున్నారు
14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు
వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
ఇక్కడ
పెదవులు పలికిన ప్రార్ధనలతో పాటు మ్రొక్కుకున్న మ్రొక్కుబడులు కూడా చెల్లిస్తాను అంటున్నారు!
ఇక
71:23
లో 23 నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును
నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
దేవుని
ప్రజల యొక్క పెదవులు విమోచించ బడిన పెదవులు! ఆవిశ్వాసుల పెదవులు శాపగ్రస్తమైనవి! కాబట్టి మన పెదవులతో దేవుణ్ణి స్తుతించడమే కాకుండా ప్రజలను ఆశీర్వదించే పెదవులు
గాని వారిని విమోచన లోనికి నడిపించే పెదవులుగాను ఉండాలి! అలా
కాకుండా 140 కీర్తనలో చెప్పినట్లు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది
చేటు ఉంది ఇలా ఉంటే దేవుడు వాటికి బుద్ది చెబుతాడు అని గ్రహించాలి!
కాబట్టి
నీ పెదవులు ఎరుపునూలు అనగా రక్షణను ప్రచురించే విధముగా ఉండాలి! ఆయనను స్తుతించే విధముగా
ఉండాలి!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*67వ భాగము*
*నీ నోరు సుందరము*
పరమగీతము 4: 3. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 3వ వచనములో నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ఇక్కడ
ముఖ్యముగా మనకు నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి ప్రియులారా!
మొదటిది: పెదవులు- ఎరుపు నూలువలే ఉన్నాయి
రెండు: నోరు సుందరముగా ఉంది
మూడు: ముసుగు గుండా కణతలు (ముసుగు కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము
ప్రియులారా)
నాలుగు: దాడిమ ఫలము లేక దానిమ్మ
పళ్ళు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా
ఇక ఈ రోజు రెండవ విషయం:
నీ నోరు సుందరము అంటున్నారు!
మరొక్క
సారి జ్నాపకం చేస్తున్నాను!
మనము ప్రభువు బిడ్డల యొక్క ప్రవర్తనా నియమావళి కోసం ధ్యానం చేస్తున్నాము!
వారి
నోరు సుందరమైనది! అది మానవుల దృష్టిలో కూడా అది సుందరముగా కనబడాలి! నోరు
సుందరమేమిటి? అనగా మంచి మాటలు ఆరోగ్యకరమైన మాటలు, దీవెన మాటలు రావాలి గాని చెడుమాటలు రాకూడదు!
అలాగే
నోరు సుందరముగా ఉండాలి అంటే పెదాలకు రంగు ముక్కుకి రంగు మూతికి రంగు వేసుకోమని అసలు
కానేకాదు!
అయితే
బైబిల్ లో కొన్ని నోరులు కోసం చెప్పబడింది!
కీర్తన 49: 2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి
దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును.
కాబట్టి మన నోరు విజ్నాణ విషయములను పలికేవారిగా ఉండాలి!
కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు! అనవసరమైన మాటలు
అనవసరమైన విషయాల కోసం ఎప్పుడూ మాట్లాడకూడదు! అయితే పూర్ణ వివేకము
గల మాటలు గూఢార్ధము గల
మాటలను మనము మనం మాట్లాడాలి! మరి అవి ఎక్కడ ఉంటాయి అంటే బైబిల్
లోనే మనకు ఈ విషయాలన్నీ ఉంటాయి! కాబట్టి మనము బైబిల్ లో వ్రాయబడిన
మాటల కోసం లోతైన మర్మాలు కోసం మాత్రమే మాట్లాడాలి!
ఇక
సామెతల 13:3 లో మరో నోరు కనిపిస్తుంది మనకు: 3 తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చు
కొనును.
ఇది
కాపాడబడే నోరు! అనగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకుని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడే
మాటలు అన్నమాట! ఇదే దేవునికి
సౌందర్యవంతమైన నోరు! ఏది పడితే అది మాట్లాడితే ఎదుటివారు మూతిపళ్లు
రాలగొడతారు ఇంకా అనేకమైన ఇక్కట్లు పడతారు! అందుకే తన సామెతలు
21:23 లో అంటున్నారు 23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
ఇది
భద్రపరచబడే నోరు! నోటిని ఎంతో జాగ్రత్తగా భధ్ర పరచుకోవాలి అంటున్నారు ఇక్కడ! ఇలా బద్రపరచుకొక పోతే చివరకు అది అనేక కీడులకు మూలమవుతుంది చివరకు అనేకసార్లు
దేవుని పనిని కూడా ఈ నోరు నష్టపరుస్తుంది!
అనేక
సంఘాలలో గలిబిలికి అల్లర్లకు కారణం ఈ నోరే అని గ్రహించాలి!
ఇక
సామెతలు 31:26 లో జ్నానము గల నోరు కనిపిస్తుంది!
26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును
కృపగల ఉపదేశము ఆమె బోధించును
ఈ
నోరు ఎప్పడూ మంచి మాటలు పదిమందికి పనికొచ్చే మాటలే మాట్లాడుతుంది! విశ్వాసుల నోరు ఎల్లప్పుడూ
మంచి మాటలే మాట్లాడాలి! జ్నానము గల మాటలు మాట్లాడాలి!
ఈ నోటితో శాపవచనం రాకూడదు! ఆవివేకమైన మాటలు రాకూడదు.
ఇక
యాకోబు గారు అంటున్నారు
1:26 లో 26 ఎవడైనను
నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల
వాని భక్తి వ్యర్థమే.
భక్తుల
లక్షణము లేక విశ్వాసికి ఉండవలసిన లక్షణము నోటిని తన అదుపులో ఉంచుకోవాలి!మితముగా మాట్లాడాలి!
సామెతల
గ్రంధములో సోలోమోను గారు అంటున్నారు విస్తారమైన మాటలలో దోషముండక
మానదు! 10:19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు
తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
కాబట్టి
నీ పెదవులను కాచుకుంటేనే నీవు బుద్ధిమంతుడవు లేక పోతే నీవు బుద్ధిహీనుడవు అని గ్రహించి- నీ నోరు మంచి మాటలు మాట్లాడితేనే
నీవు సుందరమైన నోరు గలవాడవు లేక గలదానివి అని గ్రహించి ప్రభువు మెచ్చుకునే విధముగా
జీవించమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*68వ భాగము*
*నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి*
పరమగీతము 4: 3. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 3వ వచనములో నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.
నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.
ఇక్కడ
ముఖ్యముగా మనకు నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి ప్రియులారా!
మొదటిది: పెదవులు- ఎరుపు నూలువలే ఉన్నాయి
రెండు: నోరు సుందరముగా ఉంది
మూడు: ముసుగు గుండా కణతలు (ముసుగు కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాము
ప్రియులారా)
నాలుగు: దాడిమ ఫలము లేక దానిమ్మ
పళ్ళు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా
ఇక ఈ రోజు మూడవ విషయం: నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి అంటున్నారు!
ఇక్కడ కణతల సౌందర్యము కోసం మాట్లాడుచున్నారు! కణతలు
ఆయువు పట్టులాంటివి. ఇవి ముఖానికి ఎంతో సౌందర్యమును ఇస్తాయి!
అయితే ఈ కణతలను విచ్చిన దానిమ్మ ఫలములతో ఇక్కడ పోల్చబడ్డాయి!
ఈ దానిమ్మ ఫలముల కోసం పాత నిబంధన గ్రంధంలో 32 సార్లు
చెప్పబడ్డాయి! ఇది ఒకరకమైన ఆత్మ సంబంధమైన ఫలము అని గ్రహించాలి!
భూమికి పైగా పండే ఫలము ఇది! అనగా మనము పైనున్న
వాటిమీదనే మనము ఆలోచించాలి గాని భూసంబంధమైన విషయాల మీద నీ తలంపులు ఉండకూడదు!
ఎందుకంటే నేను పై వాడను అని ఆయనే చెప్పారు! కాబట్టి
ఇక్కడ షూలమ్మితి యొక్క కణతలు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన జీవితాన్ని అనగా మన ఆత్మీయ
జీవితాన్ని సూచిస్తుంది! ఇంకా దానిమ్మ పండు ఎంతో గుండ్రముగా ఉంటుంది!
అనగా మన ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలి! ఆత్మీయ పరిపక్వతను ఈ దానిమ్మ పళ్ళు
సూచిస్తున్నాయి!
నిర్గమ 28 లో యాజకుని నిలువుటంగీ ఎలా ఉండాలో
చెబుతూ ఆ అంగీపై దానిమ్మపండు ఉండాలని దేవుడు చెబుతున్నారు! అంగీ
ప్రవర్తనకు సాదృశ్యం! దానిమ్మ పండ్లు ఆత్మీయ పరిపూర్ణతకు సాదృశ్యం!!! యాజకుని అంగీ నీల ధూమ్ర రక్త వర్ణము
గలది! అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధరక్తము నాకు
సాదృశ్యముగా ఉంది ఇది! అనగా రక్షించబడిన విశ్వసి జీవితములో యేసుక్రీస్తుప్రభులవారి
రక్తముయొక్క ప్రభావము ఎక్కువగా పనిచేయాలి! రక్షించబడిన వాణి జీవితంలో
యేసు రక్తము ప్రవర్తనలో ఎంతో మార్పుని తీసుకుని వస్తుంది! గతంలో
త్రాగుబోతు- నేడు పరిశుద్ధుడు! గతంలో ఎంతో
గయ్యాలమారి- ఇప్పుడ
కోపము గాని దూషణలు గాని రావడం లేదు! గతంలో
లంచగొండి- ఇప్పుడు ఎవరినుంది ఏమీ ఆశించడం లేదు! ఇలాంటి ఎన్నో మార్పులు కనబడతామే ఈ డానిమ్మపండ్ల అనుభవము!
ద్వితీ 8:8 ప్రకారం ఇది ఇశ్రాయేలు దేశంలో
ఎక్కువగా పాండే పంట! ఇది ఒక స్థానిక సంఘానికి సూచనగా ఉంది!
అనగా ప్రతీ శతానిక సంఘంలో ఆత్మ సంబంధనమైన పరిపక్వ జీవితం జీవించేవారు
ఉండాలి! వారు ప్రభువులో ఎడగాలి! ఆయన కృపాలో
ముందుకు సాగాలి! శరీరాన్ని జయించి ఆత్మ సంబంధమైన కార్యాలనే చేయాలి!
శోధనను జయించాలి! ఇదే దానిమ్మపండ్ల జీవిత అనుభవం!
ఇక సోలోమోను కట్టించిన దేవాలయములో ముఖ్యమైన స్తంభాలు కనిపిస్తాయి! వాటిపై
పీటలున్నాయి! ఈ పీటలపై దానిమ్మపండ్లు చెక్కబడ్డాయి! దేవుని ప్రజలు మందిరంలోని ష్టంభముల పీటలపై కనబడినట్లు దేవుని ప్రజలు మందిరములో
కనిపించాలి! స్తంభాలు పీటలు మందిరము యొక్క భారమును ఎలా మోస్తున్నాయో
అలాగే దేవుని ప్రజలు దేవుని సేవా భారాన్ని భరించాలి! దీనిని ఎవరో
ఒకరో ఇద్దరో కాకుండా సంఘమంతా భరించాలి! ఎవరిస్థానం వారు తెలుసుకుని
ఆ జాగాలో నిలబడాలి! అనగా తగినంత భారము మోయాలి! దేవునికి ఇవ్వడం విషయంలోనా లేక పరిచర్య చేయడం విషయంలోనా లేక ప్రార్ధించడం విషయంలోనా
లేక ప్రకటించే విషయంలోనా నీకు ఇవ్వబడిన తలాంతులు అవకాశం బట్టి నీకు చేతనైనది చేయాలి!
ఇదే దానిమ్మ అనుభవం!
ఇక 2 దిన 4:13 ప్రకారం మందిరంలో 400 దానిమ్మపండ్లు ఉన్నాయి!
3:16 లో 100 ఉన్నాయి! 100 పండ్లు దేవుడు చెప్పిన నూరంతలుగా ఫలించే జీవితానికి సాదృశ్యము! ప్రతీ విశ్వాసి దేవుని సన్నిధిలో ముప్పదంతాలు ఆరువదంతలు నూరంతలుగా ఫలించాలి! మరి 400? అనగా
ఫలించి అభివృద్ధి చెందిన జీవితం! ఇది కేవలం భౌతికమైన అభివృద్ధి
కోసం మాట్లాడటం లేదు! ఆత్మలో అభివృద్ధి! ఘోరమైన విషయం ఏమిటంటే విశ్వాసి నూరంతలుగా ఫలించడానికి కష్టపడకుండా అరువదంతలుతో
ముప్పదంతులతో సరిపెట్టేసుకుంటున్నాడు! అయితే తర్వాత
400 కూడా ఉందని మర్చిపోతున్నాడు! కృప నుండి అధికమైన
కృప, అభిషేకము మీద అభిషేకము పొందుకోవాలని మర్చిపోతున్నారు!
అలా
దేవునిలో సంపూర్తిగా సాగడమే, దేవుని సన్నిధిలో ఫలించడమే ఈ విచ్చిన దానిమ్మ పండ్ల అనుభవము!
మరి
ఆ స్థితిలో నీవున్నావా!!!!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*69వ భాగము*
*జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను*
పరమగీతము 4: 4.జయసూచకముల నుంచుటకై
దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును
వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము! ఇక 4వ వచనం నుండి చూసుకుంటే
జయసూచకముల
నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును
వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. ఈ మాట అంటున్నది ప్రియుడైన
సోలోమోను!
చూడండి
ఏమంటున్నారో – జయసూచకములు ఉంచుటకు దావీదు
కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు
ఆ గోపురముతోను నీ కంధరము సమానము!
కంధరము అనగా మెడ!! అంటే ఆమె మెడ నిటారుగా ఉండి కంఠాభరణాలతో అలరారుతూ
ఉంది. జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు అనేకసార్లు
చెప్పారు- మీరు మెడవంచని జాతి! మెడవంచని
తరము అంటూ!!!
యెషయా
48 లో!! అయితే షూలమ్మితి కోసం అంటున్నారు జయసూచకములు
ఉంచుటకు దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును
వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. అనగా ఆమె మెడ తిన్నగా
నిటారుగా ఉంది. దేనితోనూ ఆయుధాలు లాంటి అలంకారములతో!!!
ఇక్కడ షూలమ్మితి
యొక్క మెడ హారములతో అలంకరించ బడింది! అంటే మెడకు హారములు స్త్రీ
తప్పకుండా వేసుకోవాలని అర్ధము తీసుకోకండి! ఆమె మెడకు వేసుకున్న
అలంకారాలు ఏమిటో చివర్లో చెబుతాను! ఇశ్రాయేలు జాతి మెడ మెడవవంచనిది!
మూర్ఖ తరమునకు చెందినవారు అన్నారు దేవుడు! అయితే ఈమె మెడ ఆత్మీయ అలంకారాలతో
అలంకరించబడింది! వారి మెడ నాశనమునకు పోయేది! ఈమె మెడ విమోచించ బడింది! అంతేకాకుండా ఈమె మెడ దంత గోపురముతో
పోల్చబడింది!
ఏనుగును చంపాకనే ఆ దంతము తీసుకుని ఏదైనా అలంకారము లేక కుర్చీలు చేస్తారు! అనగా ఇక్కడ
దంత గోపురము అనగా అది యేసుక్రీస్తుప్రభులవారి మరణము మరియు పునరుత్థానమునకు సూచనగా ఉంది!
అంటే ఇక్కడ ఆమె చూపు అనగా షూలమ్మితి చూపు అనగా ఇప్పుడు సంఘము యొక్క చూపు
యేసుక్రీస్తుప్రభులవారి మరణ పునరుత్థానముల మీదనే ఉంది గాని ఈ లోకపు ఆశలమీద విషయాల మీద
లేదు అని గ్రహించాలి!
కాబట్టి రక్షించబడిన
విశ్వాసి చూపు యేసుక్రీస్తుప్రభులవారి మరణ పునరుత్థానముల మీదనే ఉండాలి! ఇంకా ఆ మెడ విమోచించబడి ఉండాలి! ఇంకా పరిశుద్ధ అలంకారాలు
పరిశుద్ధ ఆభరణములు ధరించి ఉండాలి!
ఇంకా అక్కడ దావీదు కట్టించిన గోపురము- అందులో
ఉన్న ఆయుధాలు కలిగి ఉండాలి! అనగా ఎఫెసీ పత్రికలో ఉన్న విశ్వాసి
ఆయుధాలు అనగా సర్వాంగకవచనము వాటితో ఉన్న ఇతర ఆయుధాలు విశ్వాసి కలిగి ఉండాలి!
గలతీ పత్రికలో ఉన్న ఆత్మఫలము ఫలించాలి!
ఇక జయసూచకము ఉంచుటకు దావీదు గారు కట్టించిన కోట కోసం ఆలోచిస్తే 1 దిన
11:5--9 లో దీనికోసం మనకు కనబడుతుంది! ఇందులో దావీదుగారు
సీయోను లేక యెరూషలేము అనబడే యెబూసును జయించాక అక్కడ జయసూచకములు కట్టించాడు పెట్టించారు!
అందుకే దీనిని దావీదు పట్టణం అనియు, సీయోను లేక
యెరూషలేము అనియు పేరు పెట్టారు!
కీర్తన 48:2 లో మహారాజు పట్టణమని
పిలువబడింది!
దీనికే
దేవుని పట్టణము అనికూడా అంటారు!
యిర్మీయా 3:17 ప్రకారము ఈ పట్టణానికి యెహోవా సింహాసనము ఉండే పట్టణం అనికూడా అంటారు!
దానియేలు 9:16 లో పరిశుద్ధ పర్వతము అని పిలిచారు!
పరిశుద్ధ
పట్టణం అని నెహెమ్యా
11:6 లో పిలువబడింది!
యెషయా 33:20 లో నిమ్మలమైన కాపురము
అనికూడా పిలువబడింది!
జెకర్యా 8:3 లో సత్యమునకు కేంద్రమైన
పట్టణం అని పిలువబడింది!
కాబట్టి
పై వచనాలు అన్నీ గమనిస్తే ఈ ప్రసంగి 4:4 లో ఉదాహరించిన దావీదు కట్టించిన గోపురానికి
లేక కోటకు సరిగా సరిపోతుంది! దీనిలోనే దావీదు గారు జయసూచకము ఉంచారు!
దీనిలోనే ఆయుధాలు ఉంచారు!
రక్షించబడిన మనము కూడా పరిశుద్ధ ఆయుధాలు ధరించి మనము కూడా ఇదే
పట్టణములో ప్రవేశించాలి అనగా ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి జయజీవితం కలిగి జీవించాలి!
సరే, ప్రభువు మనకు ఇచ్చిన
ఆయుధాలు ఒకసారి చూసుకుందామా?
1 కోరింథీ 10: 4 మా యుద్ధోపకరణములు
శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత
బలముకలవై యున్నవి. గమనించాలి దావీదు గారు శరీర సంబంధమైన యుద్దోపకరణాలు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాడిన
గొప్ప ఆయుధాలు మొదటిది ప్రార్ధన, రెండు యెహోవా నామము!
అసాధారణ అద్భుతాలు ఆయన జీవితంలో జరిగాయి!
అలాగే
పౌలుగారు అంటున్నారు మనకు కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి అవి శరీర సంబంధమైనవి
కావు! అవి
ఆత్మ సంబంధమైనవి అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై ఉన్నాయి అంటున్నారు! కాబట్టి విశ్వాసి ఈ ఆయుధాలు ధరించి
సాతాను దుర్గములను పడగొట్టి జయిస్తూ ముందుకు సాగిపోవాలి!
ఇక
అదే రెండో కోరింథీ పత్రికలో కొన్ని ఆయుధాలు చెబుతున్నారు 6: 4 మా
పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక
5 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందునుఒ దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాస ములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,
6 పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను
నిష్కపటమైన ప్రేమతోను
7 సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
8 ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై
యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
ఇక్కడ
ఆయుధాలు ఓర్పు, ఉపవాస ప్రార్ధన, పవిత్రత జ్నానము, దీర్ఘశాంతము, దయ పరిశుద్ధాత్మ, నిష్కపటమయిన ప్రేమ, సత్యవాక్యము లాంటివి ఉన్నాయి!
ఇవి విశ్వాసి ధరించవలసినవి మెడలో!
ఇక
రోమా 13:12 లో అంటున్నారు 12 రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది
గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు
ధరించు కొందము. అనగా చీకటి కార్యాలు వదిలి వెలుగు కార్యాలు చేయడమే!
ఈ వెలుగులో మూడు ఆయుధాలు ఉన్నాయి: మంచి తనము, నీతి మరియు సత్యము!!! ఇవి మన ఆత్మీయ జీవితంలో జయ జీవితం
జీవించడానికి పనికొస్తాయి!
ఇక 1 థెస్స 5:8 లో పౌలుగారు
మరో ఆయుధాలు చెబుతున్నారు 8 మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై
యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను
శిరస్త్రాణ మును ధరించుకొందము.
చివరిగా ఎఫెసీ పత్రికలో ఈ ఆయుధాలు కోసం ఇంకా క్షుణ్ణంగా చెబుతున్నారు 6: 11 మీరు
అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న
దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము.
13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14 ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16 ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి;
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17 మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18 ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన
పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ఇవి అసలైన ఆయుధాలు!
ఇక
జయసూచికలు కోసం ఆలోచిస్తే దావీదుగారు తన విజయానికి సూచనగా జయసూచికలు
ఉంచారు! ఇంకా ఆయుధాలు ఉంచారు! ఈరోజు నీ
విశ్వాస యాత్రలో జయసూచకములుగా యేసు రక్తమును ఓర్పు సహనము ప్రార్ధన పవిత్రత జనానము దీర్ఘశాంతము
లాంటివి ధరించి వెళితే అన్నీ నీకు జయాలే! అదే జయసూచకములు ఉంచుటకు దావీదు కట్టించిన
గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ
గోపురముతోను నీ కంధరము! అటువంటి మెడ కలిగిన జయజీవితం దేవుడు మనకు
దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*70వ భాగము*
*నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను
పోలియున్నవి*
పరమగీతము 4: 5 నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి
తామరలో మేయు కవలను పోలియున్నవి.
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము! ఇక 5వ వచనం నుండి చూసుకుంటే నీ యిరు కుచములు
ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.
ఈ
మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
ఆమె కుచములు అనగా చంటి బిడ్డకు పాలుఇచ్చు భాగములు లేక స్తనములు - ఇవి తామరలో మేయు జింక పిల్లలవలె యున్నాయని చెప్పబడింది కనుక లోయలలో తామర క్రీస్తు
ప్రభువుకు సూచనగా వర్ణించబడింది. కనుక క్రీస్తు ప్రభువును ఆధారముగా అనగా సువార్తను ఆధారము చేసుకొని విశ్వాసులను
పోషించిన సంఘమునకు ఇది సూచనగా చెప్పబడింది.
నిజానికి ఇది ఒకరకంగా ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉంది! ఎన్నోసార్లు
ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వదలి విగ్రహారాధనకు తిరిగిపోయారు గాని దేవుడు మరలా జాలి
తలచి వారిని చెంత చేర్చుకున్నారు ఎలాగూ అంటే తల్లి తన కన్నబిడ్డను చంటిబిడ్డను వెతికి
తీసుకుని వచ్చి ఆకలితో ఉన్నప్పుడు తన పాలిచ్చి పెంచినట్లు ఆయన ఎన్నోసార్లు ఇశ్రాయేలు
ప్రజల జీవితాలలో చేసినట్లు మనం పాట నిబంధన మొత్తం చూడగలము!
అయితే నిజానికి ఈ స్త్రీ అనగా ఇశ్రాయేలు జాతి తన కుచములు అపవిత్రతకు
కాముకత్వానికి అప్పగించేసింది అని యెహేజ్కేలు 23లో చెప్పారు దేవుడు! పాపములో పడి ఉన్నప్పుడు దేవుడు ఆ పాపములను కడిగి శుద్ధి చేసి బట్టలు అలంకారాలు
తినడానికి తిండి ఐశ్వర్యము ఇస్తే కొంతకాల మయ్యాక అన్య జనాంగముతో విగ్రహాలతో వ్యభిచారం
చేసింది. గాని దేవుడు కరుణించి క్షమిస్తే మరలా అదే పాపము చేసింది
ఆమె కుచములుతో పాపము చేసింది అని దేవుడే చెప్పారు! అనగా మొదటిది
పరిశుద్ధత కోల్పోయిన జీవితము లేక అనుభవము! ఇది దేవునికి వ్యతిరేఖమైన
పని!
అయితే
ప్రస్తుతము రక్షించబడిన విశ్వాసి జీవితం ఎలాఉందో మనకు పౌలుగారు ఎఫెసీ 2 లో చెబుతున్నారు 1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2 మీరు వాటిని చేయుచు, వాయు మండల
సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు
శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు
నడుచుకొంటిరి.
3 వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు
కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు,
కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
4 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా
ప్రేమచేత మనలను క్రీసు
5 కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
11 కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి,
శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన
మీరు
12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును,
నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి,
క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు
క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును,
అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత
మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
15 ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని
తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
16 తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని
యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.
17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని
సమాధాన సువార్తను ప్రకటించెను.
ఒకానొకప్పుడు
దేవునికి దూరంగా ఉన్న మనలను దేవుడు తన రక్తముతో కడిగి తనవారిగా చేసుకున్నారు గనుక ఇప్పుడు
మనము దేవునికి ఇష్టముగా జీవించి ఆయన ప్రేమ సందేశము అనేకులకు పంచి అనేకులను ఆ కుచములను
ఆశ్రయించి క్రీస్తులో ఎదిగి బలపడేలా చేయాలి!
ఇదే
షూలమ్మితి లో కనిపించే కుచముల సౌందర్యము!
అయితే
కొందరు బైబిల్ పండితులు చెప్పిన కుచముల సౌందర్యము ఏమిటంటే మారిన జీవితమే కుచముల సౌందర్యము!
1 తిమోతి 1:12 లో పౌలుగారు చెప్పారు
12 పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,
13 నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై
యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
ఇది
మారిన జీవితం- కుచముల సౌందర్యము!
ఫిలేమాను
జీవితం కూడా మారిన జీవితమే!
11 అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.
ఇది
కూడా కుచముల సౌందర్యమే
!
ఇటువంటి
మారిన జీవితముతో అనేకులను క్రీస్తుకొరకూ ఆకర్షిద్దాము!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*71వ భాగము*
*ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి
పర్వతములకు*
పరమగీతము 4: 6.ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు
గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము! ఇక 5వ వచనం నుండి ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు
గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును
ఈ
మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
ఇన్ని
విధాలుగా వధువు విశ్వాసులతో నింపబడి సౌందర్యమును సంతరించు కొనగా - ఎండ చల్లారి అనగా పాప ప్రక్షాళన జరిగి, నీడలు జరిగిపోవు
వరకు అనగా క్రీస్తు ప్రభువు నీడలో ఉన్నంతవరకు ఆ నీడ తొలగనంత వరకు ఆమె గోపరస,
సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును అని చెబుతున్నారు. ఈ గోపరసము అన్నది అరబ్బుల దేశమందు
ఒక విధమైన ముళ్ళ చెట్టు నుండి వచ్చు బంకయై యున్నది. దీనినే బోళము అని అందురు. యేసు జన్మించినప్పుడు ఆయనను చూడ వచ్చిన
జ్ఞానులు దీనిని ఆయనకు కానుకగా సమర్పించినట్లు మత్తయి 2:11 వివరిస్తున్నది.
ఇందునుబట్టి
ముండ్ల చెట్టు నుండి తయారయ్యే రసము కనుక ఈ దినుసులు పర్వత సానువులపై దొరకుచుండుట వలన
గోపరస పర్వతమునకు సాంబ్రాణి దొరకు పర్వతములకు నేను వెళ్లుదునని వ్రాయబడియుండవచ్చును. పన్నీరు వలె చేసిన రోజా పుష్పముల
నీళ్లతో పర్వతములు ఉండక పోయినను అలాగే సాంబ్రాణితో పర్వతములు ఉండక పోయినను ఆ పర్వత
సానువులలో వీటి తయారీకి కావలసిన మొక్కలు దొరకుచున్నవి. కనుక ఇది అభిషేక తైలమునకు సూచనగా చెప్పబడింది. ఈ తైలమును తయారీ చేయు విధానములో వీటిని
ఉపయోగిస్తారు. కనుక ఆయన
వద్దకు పోతానని చెప్పబడింది. ఇందులో పర్వతములని చెప్పుటనుబట్టి అవి ఉన్నత స్థానమునకు సూచన. కనుక కష్టాలు శ్రమలు శోధనలు ముగించేవారకు
విశ్రాంతిని ఇస్తాను అని చెప్పడం ప్రియులారా!
ప్రియులారా నిజానికి ఇది క్రీస్తుయేసు శిలువ శ్రమలు ఆయన మరణము కోసం
చెబుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎండలు చల్లారే వరకు నీడలు లేకపోవు
వరకు అంటున్నారు! ఇక్కడ నేను అనేది యేసుక్రీస్తుప్రభులవారు ప్రియులారా!
లోక రక్షణ కొరకు మనందరి పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తుప్రభులవారు సిలువమరణము
నకు వెళ్ళే ముందు చెప్పిన మాటలు వలె ఇక్కడ కనిపిస్తున్నాయి! ఆయన కల్వరి
సిలువలో ఆ గోల్గొతా గిరికీ వెళ్ళే సందర్భము ప్రియులారా!
హెబ్రీయులకు 9:25
అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము
తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.
హెబ్రీయులకు 9:26
అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు
శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన
పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
హెబ్రీయులకు 9:27
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత
తీర్పు జరుగును.
28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే
అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము
పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.
ఇక మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన
పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా
పశువు వధింపబడెను
కాబట్టి
మనలను రక్షించడానికి ఆయన బలి అయిపోయారు!
సరే, ఇక్కడ గోపరస పర్వతము మరియు సాంబ్రాణి పర్వతమునకు
నేను వెళ్తాను అని ప్రభువు అంటున్నారు!
సందర్భం: ఇక్కడ
"ప్రియుడు" (యేసుక్రీస్తు) తన "ప్రియురాలితో" (సంఘము
/ విశ్వాసి) మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది.
ఎండ చల్లారి, నీడలు జరిగిపోవువరకు: జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలు, మరియు భయాలు (ఎండ) తొలగిపోయేంత
వరకు అని అర్థం.
ఆధ్యాత్మికంగా
ఇది కటిక చీకటి లేదా శ్రమల సమయం ముగిసే సమయాన్ని సూచిస్తుంది.
గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు: గోపరసము (Myrrh): ఇది సుగంధ ద్రవ్యం. ఇది క్రీస్తు యొక్క శ్రమలను, మరణాన్ని మరియు ఆయన సిలువ
త్యాగాన్ని సూచిస్తుంది.
సాంబ్రాణి (Frankincense): ఎలా కరిగి పోతుందో అలాగే
క్రీస్తు మనకొరకు అర్పణ అయిపోయారు! ఇది ఆయన యాజకుడిగా మనకోసం
బలి అర్పణ చేసిన సందర్భము! ఇంకా ఆయన దైవత్వానికి కూడా సూచన!’
అనగా నేను మీకోసం బలి అయిపోడానికి సాంబ్రాణి పర్వతము మీదకు వెళ్తున్నాను అని దేవుడు
చెప్పడమే ఇక్కడ సూచిస్తుంది ప్రియులారా!
ఇంకా ఇది ప్రార్థనకు
ప్రతీక. ఇది దేవునికి
ఇష్టమైన సువాసననిచ్చే ప్రార్థనలను మరియు ఆరాధనను సూచిస్తుంది.
ఆత్మీయ సారాంశం: శ్రమలు లేదా కష్టాల సమయంలో (ఎండలో) భయపడి పారిపోకుండా, ప్రభువు
యొక్క శ్రమలను (సిలువను) ధ్యానిస్తూ,
ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుట (గోపరస,
సాంబ్రాణి పర్వతాలు) ద్వారా ఆధ్యాత్మిక శాంతిని
పొందుతాను అని దీని ఆత్మీయ అంతరార్థం.
అట్టి కృప దేవుడు
మనందరికీ దయచేయును గాక!!
ఆమెన్!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*72వ భాగము*
*నా ప్రియురాలా, నీవు అధికసుందరివి
నీయందు కళంకమేమియు లేదు*
పరమగీతము 4: 7.నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము!
ఇక 7వ వచనం 7.నా ప్రియురాలా,
నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
ఈ
మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
గమనించాలి గతభాగాలలో చూసుకున్నాము!
ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి తప్పిపోయేవారు అని! గాని ఇక్కడ షూలమ్మితి లో సోలోమోనుకు ఏవిధమైన కళంకము కనబడలేదు అంటున్నారు!
ఇది
ఒకసారి బిలాము గారు ఆత్మావేశుడై ప్రవచించిన సందర్బము గురుతుకు వస్తుంది. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు
ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేఖంగా ఎన్నో కానిపనులు చేశారు దేవుణ్ణి మోషేగారిని విసికించారు
గాని అక్కడ బిలాము ద్వారా దేవుడు ఏమంటున్నారు అంటే సంఖ్యా 23: 21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో
ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.
ఏదిఏమైనా షూలమ్మితిలో సోలోమోనుకు
ఏవిధమైన కళంకము కనబడలేదు. ఎందుకంటే ఆమె సిలువరక్తములో కడుగబడింది.
అలాగే వధువు సంఘములో కూడా ఏవిధమైన కళంకము కనబడకూడదు! ఎందుకంటే పౌలుగారు అంటున్నారు 2 కోరింథీ 11:2 లో
దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని,
మిమ్మును ప్రధానము చేసితిని గాని,
3 సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును
చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
నిజనికి “ఏ కళంకమూ” లేకపోవుట ఎంత
రమ్యమైన సంగతి! సంఘాన్ని ఉన్నది ఉన్నట్టు చూస్తే చాలా లోపాలు
ఉంటాయి. అందులోని ప్రతి విశ్వాసీ పౌలుగారిలాగా (రోమీయులకు 7:18, ), యాకోబుగారిలాగా (యాకోబు 3:2, ), యోహానుగారిలాగా (1 యోహాను 1:8, ) తాము నిష్కళంకులం ఎంత మాత్రం కాదని ఒప్పుకోవలసి
ఉంది.
రోమీయులకు 7:18
18 నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును.
మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
యాకోబు 3:2
2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను
మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును
స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును
1 యోహాను 1:8
8 మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము;
మరియు మనలో సత్యముండదు.
అయితే దేవుడు తనపై నమ్మకం ఉంచిన వారికి
ఆపాదించే నీతిన్యాయాలు మచ్చలేనివి, లోపం లేనివి.
యెషయా 61:10, శృంగారమైనపాగా
ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను
ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు
కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది;
యిర్మియా 33:16, ఆ దినములలో యూదావారు
రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు,
యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.;
రోమీయులకు 3:21-24,
21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి
కలుగు దేవుని నీతియైయున్నది.
23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు
మహిమను పొందలేక పోవుచున్నారు.
24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము
ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.;
1 కోరింథీయులకు 1:30, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.;
2 కోరింథీయులకు 5:21, ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి
అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను;
ఫిలిప్పీయులకు 3:9, క్రీస్తును సంపాదించుకొని,
ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి
విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు
నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును ...
ఇక
వారిలో ఉండే సౌందర్యం దేవుని సౌందర్యమే కీర్తనల గ్రంథము 45:13-14,
13 అంతఃపురములోనుండు రాజుకుమార్తె
కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.
14 విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది
ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.;
యెహెఙ్కేలు 16:14, నేను నీ కనుగ్రహించిన
నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిచూచి నీ కీర్తి ప్రశంసించుచు
వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
కాబట్టి
దేవుడు తన సంఘంలోను విశ్వాసిలోను జరిగించిన పని తుదకు లోపం లేని
పరిపూర్ణతను కల్పిస్తుంది. ఇలాంటి పనిని చేయగలిగేది దేవుడొక్కడే.
కాబట్టి
ఇట్టి కృప పొందిన నీవు కళంకము లేని జీవితం జీవించి ఆయన యొద్దకు చేరాలి ఎందుకంటే నేను
పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడీ అంటున్నారు దేవుడు లేవీకాండములో! గనుక పరిశుద్ధమైన జీవితం
జీవిద్దాం!
దైవాశీస్సులు!!
# # # #
# # # # # # # # ## # ## # #
గమనిక: ఈ సందేశం
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. కంటెంట్ లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా
షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులుకాగలరు.
వందనములు!
ఇట్లు మీ సహోదరుడు
బ్రదర్. రాజకుమార్ దోనె
/
Email: rajkumardone@gmail.com
*గీతాలకు గీతము-పరమగీతము*
*73వ భాగము*
*ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను
విడిచి నాతో కూడ రమ్ము*
పరమగీతము 4: 8.ప్రాణేశ్వరీ,
లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు
శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి
నీవు క్రిందికి చూచెదవు.
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము! ఇక 7వ వచనం ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు
శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి
నీవు క్రిందికి చూచెదవు ఈ మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
తాను
బోళం, సాంబ్రాణి
పర్వతాలకు వెళ్ళిపోతానని వరుడు అన్నాడు 6వ వచనంలో! వధువు అతనితో ఉండాలి. ఉన్నట్టుండి వధువు ఇస్రాయేల్ ఉత్తర సరిహద్దుల దగ్గర ఉన్న కొండల్లో కరుకైన సౌందర్యం,
ప్రమాదం ఉన్న తావులో ఉన్నట్టు కనిపిస్తున్నది. వరుడామెను వచ్చెయ్యమని పిలుస్తున్నాడు. దీన్లోని ఆధ్యాత్మిక
అర్థం గ్రహించడం పెద్ద కష్టమేమీ కాదు. లోకంలో అందాలు,
ఆకర్షణలు ఉన్న ఉన్నత స్థలాలనేకం ఉన్నాయి. అయితే
అవి విశ్వాసులకు ప్రమాదకరమైనవి. అలాంటి వాటిని విడిచి తనను చేరరమ్మని
క్రీస్తు వారిని పిలుస్తున్నాడు
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * *
మరిన్ని
భాగములకు, శీర్షికలకు సంప్రదించండి
Facebook
page “యేసుక్రీస్తు అందరికీ ప్రభువు”,
https://www.facebook.com/share/18KPDoLwfe/
. . . .
https://adhyatmikasandeshalu.blogspot.com/
Website:
ఆధ్యాత్మిక సందేశాలు
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * *
ఇంత ఉన్నతముగా ఏ కళంకము
లేకుండ ఉన్న వధువును తన ప్రాణముతో సమానముగా ప్రాణేశ్వరీ, అని
సంబోధిస్తూ, ప్రియుడైన క్రీస్తు ప్రభువు లెబానోను విడిచి నాతో
రమ్మని పిలుస్తున్నారు. పాతనిబంధన కాలములో లెబానోను దేవదారు కొయ్యలతో యెరూషలేమునందు ఆలయము నిర్మించబడింది. అందువలన అక్కడ అనేకమంది విశ్వాసులు
పరలోక రాజ్యమునకు యోగ్యులుగా మారారు.
వధువు సంఘములో చేర్చబడ్డారు. ఇలాంటి ఈ వధువు సంఘము బబులోనుకు బానిసత్వమునకు
కొనిపోవు కాలమునకు ఆ ఆలయమును విగ్రహాలతో నింపి ఇశ్రాయేలీయులు పాడు చేశారు. అక్కడ నుండి దేవుడు తన మందసమును అందులోని
తన మహిమను పరలోకమునకు కొనిపోయాడు అని యెహెజ్కేలు దర్శనములలో ఆయన ఎలా కెరూబుల ద్వారా
వెళ్లినది వ్రాయబడింది మరియు ప్రకటన 11:19 వివరిస్తున్నది.
అటుతరువాత సీయోనులో క్రీస్తు
ప్రభువును దేవుడు పునాదిగా వేసి దానిపై పేతురు అను బండను నాటి మరల సంఘమును నిర్మించాడు. క్రీస్తు ప్రభువు రక్షణ మార్గము వలన
లెబానోను విడిచి ఆయనతో కూడ వచ్చిన వధువు సంఘము అనగా యెరూషలేమును విడనాడిన సంఘము మరల
అమానపర్వతమును, శెనీరు, హెర్మోను పర్వతములను,
సింహవ్యాఘ్రములుండు గుహలుగల
కొండలను స్వాధీనపరచుకొనుట జరిగింది. అంటే రక్షణ ఈ లోకములో అన్ని ప్రాంతములకు
విస్తరించినదని చెప్పబడింది. ఆ ప్రాంతములలో శిఖరములుగా చెప్పబడినవి అత్యున్నత స్థానమును పొందెనని,
కొండలుగా చెప్పబడిన దగ్గర కొంత ఉన్నత స్థానమును పొందెనని అలంకారముగా
చెప్పబడింది. యెరూషలేమును
విడిచిన ప్రియురాలు క్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి అన్ని ప్రాంతములలో ప్రవేశించి అత్యున్నత
స్థానమును, కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి నిలిచిందని అర్థము. ఈ విధముగా సంఘము యొక్క స్థానమును
ఈ లోకములో ఆ సంఘము పొందిన స్థితిని వదిలిన ప్రాంతమును చెప్పుట జరిగింది.
ప్రియులారా! ఈ వచనం యేసుక్రీస్తుప్రభులవారి పునరుత్థానం జరిగాక శిష్యులకు
ప్రత్యక్షమయ్యే సందర్భముగా చెబుతారు బైబిల్ పండితులు! ప్రభువు
పునరుత్థానం తర్వాత శిష్యులకు 11 సార్లు ప్రత్యక్షం అయ్యారు! వారికి అనేక విషయాలు బోధించి జాగ్రత్తలు
చెప్పారు! దానికోసమే
ఈ వచనం చెబుతుంది! ఇక గతించిన కాలము చాలు- లేబానోను వదిలేసి తనతో రమ్మని సంఘాన్ని శిష్యులను పిలుస్తున్నారు! తనతోపాటు శ్రమలను అనుభవిస్తూ ఈ సువార్త మార్గములో ప్రయాణం చేయమని మరో అర్ధం
ప్రియులారా! ఈ క్రమంలో లోకము ఆకర్షించినా లోకమువైపుకు చూడకుండా
గురివద్దకే పరుగెత్తాలని దీని ఉద్దేశం ప్రియులారా!
లెబనాన్ అనగా తెల్లనిది
అని అర్ధం! అనగా
పరిశుద్ధతకు సాదృశ్యం! అయితే ఇక్కడ తెల్లదనం పరిశుద్ధత ఉండాలి
గాని అక్కడ సింహము పులులు ఉన్నాయి! దాని అర్ధం పైకి ఎంతో బాగా
కనిపిస్తున్నా పైకి పరిశుద్ధత కనిపిస్తున్నా వారి అంతరంగాలు పులులు సింహాల వలే ప్రజలను
సంఘాలను పాడుచేసే భయంకరమైన జీవితాలతో ఉన్నారు సంఘములో! పైకి భక్తిగల
వానివలె నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు! 2 తిమోతి
3: 5 పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.
ఇట్టివారికి విముఖుడవై యుండుము.
చూడండి ఇలాంటి వారికి
విముఖుడవై ఉండమంటున్నారు అందుకే ఇలాంటి వారినుంది దూరంగా వచ్చేయమని దేవుడు చెబుతున్నారు! ఇట్టివారితో నీవు సాంగత్యము చెయ్యరాదు! వారు చేసే పనులు వారు చేసే ఆచారాలు నీవు చేయకూడదు! ఇది
ఒక లెబనాన్ అనుభవము!
ఇక లెబనాన్ మరొక అనుభవము: 1 రాజులు 5:14 ప్రకారం వెట్టిపని
చేసే అనుభవము!! సోలోమోనుకు ప్రజలు అధికారులు వెట్టిపని చేసినట్లు
కనిపిస్తుంది ఇక్కడ! అందుకే రెహాబాము వద్దకు వచ్చి నీ తండ్రి
నియమించిన కఠిన దాస్యము మామీద నుండి తొలగించామంటున్నారు ! కాబట్టి
ఈ లెబనాన్ అనుభవము వెట్టిచాకిరీ అనుభవము! సాతానుకి లోకానికి దాసునిగా
శరీర కార్యాలకు బానిసగా బ్రతికే ఈ అనుభవము నుండి దూరంగా వచ్చెమని ప్రియుడైన పరమ సోలోమోను సంఘమును కోరుతున్నారు!
చివరిగా మరొక లెబనాన్
అనుభవం కనిపిస్తుంది మనకు యెహేజ్కేలు 17:3 లో: ఇది తిరుగుబాటు స్వభావంతో
కూడిన అనుభవము! దేవుని ప్రజలలో ఈ తిరుగుబాటు కనబడకూడదు!
ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రలో మోషే గారిమీద దేవుని మీద తిరుగబడి ఎలా
నాశనమైపోయారో మనం ఖండాలలో చూడగలము! కాబట్టి ఇలాంటి అనుభవం విశ్వాసిలో
ఉంటే ఆశీర్వాదాలు రావు కదా శాపము మరియు మరణం నీకు నీ కుటుంబానికి అని మరచిపోవద్దు!
అందుకే ఈ లెబనాన్ వదిలి
రమ్మంటున్నారు ప్రియుడు! మరి నీవు
ప్రియుని వెంట వెళ్ళడానికి సిద్ధమా!!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*73వ భాగము*
*శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల
కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు*
పరమగీతము 4: 8.ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు
శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి
నీవు క్రిందికి చూచెదవు.
ప్రియులారా! మనము పరమగీతములను ధ్యానము
చేస్తున్నాము! ఇక 7వ వచనం ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు
శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి
నీవు క్రిందికి చూచెదవు ఈ మాట అంటున్నది ప్రియుడైన సోలోమోను!
(గతభాగం తరువాయి)
ఇక తర్వాత అంటున్నారు శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు
గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు
శెనీరు ఆత్మ సంబంధమైన విజయానికి సూచనగా ఉంది! అమోరీయులు
హెర్మోనుని శెనీరు అంటారు. సీదోనీయులు దీనిని శిర్యోను అంటారు!దేవుని ప్రజలు శెనీరు ని జయించి స్వాదీనం చేసుకున్నారు! కాబట్టి దేవుని బిడ్డలు విశ్వాసులు ఎల్లప్పుడూ ఈ జయజీవితం కలిగిఉండాలి! కీర్తన 44:5 లో శత్రువులను జయించుటకు ప్రభువే సహాయకుడు అని వ్రాయబడింది! కాబట్టి ఆయనే మనకు జయమిచ్చువాడు!అందుకే పౌలుగారు అంటున్నారు
రోమా 8:36 లో ప్రభువైన ఏసుదవారా అన్నింటిలో అత్యధికమైన విజయాన్ని
మనకు అనుగ్రహిస్తున్నారు! అయితే యోహాను గారు 1 యోహాను 5:4 లో మనము బలమైన విశ్వాసము కలిగి ఉండాలని,
ఆ విశ్వాసం ద్వారానే మనకు విజయం లభిస్తుంది అని చెబుతున్నారు!
పౌలుగారు కోరింథీ పత్రికలో ఎల్లప్పుడూ ప్రతీ స్థలములోనూ మనలను జయోత్సాయవముతో
మనలను ఊరేగించు వాడు అని చెబుతున్నారు! కాబట్టి ఎవరైతే ఈ హెర్మోను
వంటి ఉన్నతమైన ఆత్మీయ లేక ఆధ్యాత్మిక అనుభవములోనికి అనగా జయజీవితం గల అనుభవము లోనికి
వస్తారో వారు సీయోను కొండమీద తనతో పాటు ఉండగలరు! గొప్ప అసాధారణ
కార్యాలు ప్రభువుకోసం చేయగలరు! అంతేకాకుండా ఇలాంటి స్థితిలో ఉంది
వారిలో ఐక్యత గాని ఉంటే హెర్మోను మంచు లాంటి అభిషేకం పొందుకుంటారు అని కీర్తన
133 చెబుతుంది! సహోదారుల మధ్య ఐక్యత ఉండాలి!
అందువలన హెర్మోను మంచు వంటి ఆత్మసంబంధమైన ఐక్యత దేవుని ప్రజలలో ఉండాలని
దేవుడు కోరుతున్నారు!
ఇక మరోమాట: సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి
చూచెదవు. దీనికోసం ఆలోచిస్తే
సంఘము శెనీరు హెర్మోను వంటి ఉన్నతమైన అనుభవాల గుండా ముందుకు సాగుతూ ఉంది విజయోత్సవముతో
ప్రభువు కృపాలో వర్ధిల్లుతూ ఉంది అయితే అలా జీవిస్తూ ఉండగా దేవుని బిడ్డలకు ప్రమాదం
పొంచి ఉంది ఇక్కడ! ఎందుకంటే వారున్న చోట సింహము పులులు ఉన్నాయి!
జయం ఎక్కడుందో అక్కడే అపజయం కూడా పొంచి ఉంటుంది! పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అపవిత్రత కూడా ప్రక్కనే ఉంటుంది! జయోత్సాహముతో జీవిస్తున్న నీకు అపజయం లేదు అనుకోకూడదు! దావీదు గారు ఎప్పుడు పడిపోయారు- ఎన్నో పట్టణములు జయించి
దేవుని కోసం ఎన్నో కార్యాలు చేసి ప్రవక్తగా గాయకునిగా ఆరాధికుడిగా ప్రార్ధనా పరుడిగా
రాజుగా ఉన్నప్పుడు మంచి జయజీవితం జీవిస్తున్నప్పుడే ఆయన చూడరాని దృశ్యం చూసి పడిపోయారు!
అయితే అపజయం కలిగినా మనం నిరాశపడ కూడదు! మరలా దేవుని
కృప కోసం కనిపెట్టి ఇంకా ప్రార్ధనలో పోరాడుతూ మనలో దేవునికి ఇష్టం లేని కార్యాలు పద్దతులు
అలవాట్లు తీసివేసి దేవునితో సమాధాన పడి ప్రయత్నించు! అప్పుడు
దేవుడు నీ పక్షముగా పోరాడి అత్యధికమైన విజయం ఇచ్చే దేవుడు!
కీర్తన 10:9 గుహలోని
సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురుబాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని
తమ వలలోనికి లాగి పట్టుకొందురు.
10 కాగా నిరాధారులు నలిగి వంగుదురువారి బలాత్కారమువలన
నిరాధారులు కూలుదురు.
సాతానుడు దుర్మార్గులను ప్రేరేపించి దేవుని ప్రజలను శ్రమల పాలు చేస్తుంటాడు
ఒక్కోసారి దేవుని ప్రజలను తప్పుదారిలో నడిపిస్తూ ఉంటాడు! ఈ విషయంలో
చాలా జాగ్రత్తగా ఉండాలి!
సామెతలు 1:11 & ఆదికాండం 4:7 ప్రకారం: దుర్మార్గులు
మంచివారిని పాడుచేయడానికి పొంచి ఉంటాడు అలాగే దేవుని పరిచర్యలో విశ్వాసములో సాగిపోయే
వారిని శ్రమ పెట్టడానికి చంపడానికి సింహము వలె పొంచి ఉంటారు! ఇది సాతాను గాడి లక్షణం! కాబట్టి ప్రార్ధనలో పట్టుదల కలిగి మెళుకువ కలిగి ఉండాలి!
ఇక 2 తిమోతి 4:17 ప్రకారం దేవుని
పరిచర్యలో ఉన్నవారికి అనేకమైన శ్రమలు శోధనలు వస్తాయి- అయితే ఇవి
సంఘములో ఉన్నవారినుండి తోటి కాపరులు సంఘ పెద్దల నుండి వస్తాయి! వీరిని ఉపయోగించుకుని సాతాను గాడు ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతవ్వ ఉంటాడు!
దీర్ఘశాంతముతో పవిత్రతతో మర్యాదగా ఉంటూ ఇలాంటి శోధనలు సహించాలి!
అవసరమైనప్పుడు గద్ధించి బుద్ధి చెప్పాలి!
ఇక 1 పేతురు 5:8 లో సాతాను గాడు గర్జించు
సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని తిరుగుతున్నాడు అని చెబుతున్నారు!
కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మీయంగా ఉన్నతమైన హెర్మోను శెనీరు అనుభవములో
ఉంటామో అప్పుడు సాతాను శోధనలు వస్తాయి! అప్పుడు వాటిని సహించి జయించాలి!
ఇదే హెర్మోను అనుభవము!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*74వ భాగము*
*నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీవు నా హృదయమును వశపరచుకొంటివి*
పరమగీతము 4: 9 నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా
హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 9వ వచనములో నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో
నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి అంటున్నారు!
ఏమండీ
సహోదరీ అంటున్నారు అదే సమయంలో ప్రాణేశ్వరి అంటున్నారు! వినడానికి బాగోలేదు కదా!
దీనికోసం
కొన్ని భిన్నమైన అభిప్రాయాలున్నాయి!
మొదటిది:
ప్రాణేశ్వరీగా చెప్పబడిన వధువు సంఘము తనతో బాటుగా జన్మించిన విశ్వాసులతో
నింపబడినది కనుక నా సహోదరీ, అని చెప్పుట జరిగింది. వీరందరుకూడ క్రీస్తు ప్రభువుకు తోబుట్టువులుగా
ఇందులో వర్ణించబడింది. యోహాను
20:17-18, ''యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక
నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి-నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని
యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి-నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని
శిష్యులకు తెలియజేసెను.'' ఇందులో క్రీస్తు ప్రభువు మగ్దలేనే మరియతో నా సహోదరులకు చెప్పమని చెప్పాడు. మగ్దలేనే మరియ శిష్యులకు తెలియజేసింది. కనుక ఆయన సహోదరులు ఆయన శిష్యులు అనగా
విశ్వాసములో జీవించు ప్రతి ఒక్కరు ఆయనకు సహోదరులే. అయితే ఆయనకు సహోదరులైనను ఆయనతో సమానము
కారుగాని సంఘములో భాగస్థులు అనగా ఈ సహోదరులందరు వధువు సంఘములో చేరి వధువుగా మారుతారు. కారణమేమిటంటే ఆదాము ఇచ్చిన దైవనిషేధఫలములు
తిని దైవవ్యతిరేకియై స్త్రీకి దాసుడైనందున ఎంతటి మగవాడైనను పెండ్లి కుమార్తెయైన వధువు
సంఘములో చేరవలసిందే. కనుక క్రీస్తు ప్రభువు వధువు సంఘములో చేరిన తనయందు విశ్వాసము కలిగిన తన సహోదరులు
స్త్రీ యొక్క రూపములోనికి మారగా సహోదరిగా సంబోధించుట జరిగింది. కనుక ఆయన సహోదరులుగా పిలువబడుచున్న
విశ్వాసులందరు ఆయనకు యుగాంతములో సహోదరిగా మారి ఆయనను ప్రాణముతో సమానముగా ప్రేమించుదుము.
రెండవది: బైబిల్ లో సహోదరీలను భార్యలుగా
చేసుకున్నవారు ఉన్నారు- ఉదాహరణకు: అబ్రాహాము
గారు! ఇరాన్ లో పార్శీ వారు, దాని ప్రక్కనున్న
దేశాలవారు ఇలా చేసేవారు! అయితే ఇక్కడ దీని అర్ధం దేవుడు సహోదారిని పెళ్లి చేసుకుంటారు అని కానేకాదు!
దీనిలో ఆత్మీయ అర్ధం దాగి ఉంది! దీనికి బైబిల్
పండితులు తెలిపిన మరో అభిప్రాయం: సహోదరి: అనగా క్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసి!! ప్రభువనందు
విశ్వాసముంచిన స్త్రీలు గాని పురుషులు గాని అందరూ సహోదరులు సహోదరీలు!! ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాసి మరో విశ్వాసినే వివాహం చేసుకోవాలి!
విశ్వాసి ఆవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు! ఇది
బైబిల్ మనకు బోధిస్తుంది! సంఘంలో ప్రతీ ఒక్కరూ అక్కా చెల్లి తమ్ముడు
అన్నా అని మాత్రమే పిలుచుకోవాలి అనికూడా పౌలుగారు రాస్తున్నారు! అయితే రక్షించబడిన సహోదరుడు మరో రక్షించబడిన
సహోదరీని వివాహం చేసుకుంటాడు! మొదట వారు సహోదరులు సహోదరీలు గాని
ఇప్పుడు వివాహం తర్వాత భార్యాభర్తలుగా మారారు! ఇప్పుడు ఆమె ఈ
సహోదరునికి సహోదరీ మరియు ప్రాణేశ్వరి!!! అలాగే ప్రభువు రక్తములో
కడుగబడి బాప్తిస్మయం తీసుకున్న మనలను దేవుడు నా సహోదరులు అని పిలిచారు! అయితే ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో వారు సంఘములో బలపడుతూ పెండ్లి కుమారునికి
వధువుగా మారుతుంది!! ఇప్పుడు సహోదరి/సహోదరుడు—ప్రియుడైన పెండ్లి
కుమారునికి ప్రాణేశ్వరిగా మారుతుంది అంత్య దినాలలో!!! ఇదీ
రెండవ వివరణ!!
ఇలా మారిన ఈ వధువు క్రీస్తు
ప్రభువు హృదయమును వశపరచుకొనినదని, ఒక చూపుతోనే వశపరచుకొనినదని
ఒక హారముతోనే వశపరచుకొన్నదని చెప్పబడింది.
అంటే ఎంత అందముగా విశ్వాసి యొక్క ఉన్నత స్థితిని ఇందులో వర్ణించాడో
గ్రహించాలి. ఈ వధువుగా
మారిన సంఘము మొత్తము క్రీస్తు ప్రభువు హృదయమును వశపరచుకొన్నది. అలాగే అందులో ఒక చూపుతోనే అనగా ఆయన
వద్దకు రావాలని ప్రయత్నించి ఎదురు చూచిన ఒక చూపు ఆమెను ఆయన వద్దకు చేర్చింది. ఆ చిన్న ప్రయత్నము ఎలా క్రీస్తు ప్రభువు
వద్దకు నడిపించునో పరిశోధించు విధానమును ఇంతకు ముందు చదువుకొని యున్నాము. అలాగే ఒక హారము ఆయనను వశపరచుకొనెనని
చెప్పబడింది. 1 కొరింథీ 3:10-15, ''దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని,
మరియొకడు దానిమీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద
ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము,
వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ,
గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,
వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును,
అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వానివాని పని యెట్టిదో దానిని
అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి
నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి
తప్పించుకొన్నట్టు రక్షింపబడును.''
ఇలా విశ్వాసి నిర్మించుకొన్న క్రియలు రకరకాలుగా అందులో
కనిపిస్తున్నాయి. వాటిలో
ఒక్క హారము అనగా ఒక్కొక్క విశ్వాసి క్రియలు ఆయనను అంతగా ఆకర్షించి వశపరచుకొన్నవని చెప్పబడింది. అంటే ఈ లోకములో విశ్వాసి చేయు క్రియలు
అంత గొప్పవని అవి క్రీస్తు ప్రభువును మన వశము చేయునని గ్రహించాలి.
నీవు
ఎన్ని మంచి హారములు పొందుకున్నావు అనగా మంచి
కార్యాలు చేస్తున్నావు!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*75వ భాగము*
*నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీవు నా హృదయమును వశపరచుకొంటివి*
పరమగీతము 4: 9 నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా
హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 9వ వచనములో నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో
నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి అంటున్నారు!
ఏమండీ
సహోదరీ అంటున్నారు అదే సమయంలో ప్రాణేశ్వరి అంటున్నారు! వినడానికి బాగోలేదు కదా!
దీనికోసం
కొన్ని భిన్నమైన అభిప్రాయాలున్నాయి!
మొదటిది: ప్రాణేశ్వరీగా
చెప్పబడిన వధువు సంఘము తనతో బాటుగా జన్మించిన విశ్వాసులతో నింపబడినది కనుక నా సహోదరీ,
అని చెప్పుట జరిగింది.
వీరందరుకూడ క్రీస్తు ప్రభువుకు తోబుట్టువులుగా ఇందులో వర్ణించబడింది. యోహాను 20:17-18, ''యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు;
అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి-నా తండ్రియు మీ
తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని
వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి-నేను ప్రభువును చూచితిని,
ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.'' ఇందులో క్రీస్తు ప్రభువు మగ్దలేనే
మరియతో నా సహోదరులకు చెప్పమని చెప్పాడు.
మగ్దలేనే మరియ శిష్యులకు తెలియజేసింది. కనుక ఆయన సహోదరులు ఆయన శిష్యులు అనగా
విశ్వాసములో జీవించు ప్రతి ఒక్కరు ఆయనకు సహోదరులే. అయితే ఆయనకు సహోదరులైనను ఆయనతో సమానము
కారుగాని సంఘములో భాగస్థులు అనగా ఈ సహోదరులందరు వధువు సంఘములో చేరి వధువుగా మారుతారు. కారణమేమిటంటే ఆదాము ఇచ్చిన దైవనిషేధఫలములు
తిని దైవవ్యతిరేకియై స్త్రీకి దాసుడైనందున ఎంతటి మగవాడైనను పెండ్లి కుమార్తెయైన వధువు
సంఘములో చేరవలసిందే. కనుక క్రీస్తు ప్రభువు వధువు సంఘములో చేరిన తనయందు విశ్వాసము కలిగిన తన సహోదరులు
స్త్రీ యొక్క రూపములోనికి మారగా సహోదరిగా సంబోధించుట జరిగింది. కనుక ఆయన సహోదరులుగా పిలువబడుచున్న
విశ్వాసులందరు ఆయనకు యుగాంతములో సహోదరిగా మారి ఆయనను ప్రాణముతో సమానముగా ప్రేమించుదుము.
రెండవది: బైబిల్ లో సహోదరీలను భార్యలుగా
చేసుకున్నవారు ఉన్నారు- ఉదాహరణకు: అబ్రాహాము
గారు! ఇరాన్ లో పార్శీ వారు, దాని ప్రక్కనున్న
దేశాలవారు ఇలా చేసేవారు! అయితే ఇక్కడ దీని అర్ధం దేవుడు సహోదారిని పెళ్లి చేసుకుంటారు అని కానేకాదు!
దీనిలో ఆత్మీయ అర్ధం దాగి ఉంది! దీనికి బైబిల్
పండితులు తెలిపిన మరో అభిప్రాయం: సహోదరి: అనగా క్రీస్తునందు విశ్వాసముంచిన విశ్వాసి!! ప్రభువనందు
విశ్వాసముంచిన స్త్రీలు గాని పురుషులు గాని అందరూ సహోదరులు సహోదరీలు!! ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాసి మరో విశ్వాసినే వివాహం చేసుకోవాలి!
విశ్వాసి ఆవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు! ఇది
బైబిల్ మనకు బోధిస్తుంది! సంఘంలో ప్రతీ ఒక్కరూ అక్కా చెల్లి తమ్ముడు
అన్నా అని మాత్రమే పిలుచుకోవాలి అనికూడా పౌలుగారు రాస్తున్నారు! అయితే రక్షించబడిన సహోదరుడు మరో రక్షించబడిన
సహోదరీని వివాహం చేసుకుంటాడు! మొదట వారు సహోదరులు సహోదరీలు గాని
ఇప్పుడు వివాహం తర్వాత భార్యాభర్తలుగా మారారు! ఇప్పుడు ఆమె ఈ
సహోదరునికి సహోదరీ మరియు ప్రాణేశ్వరి!!! అలాగే ప్రభువు రక్తములో
కడుగబడి బాప్తిస్మయం తీసుకున్న మనలను దేవుడు నా సహోదరులు అని పిలిచారు! అయితే ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో వారు సంఘములో బలపడుతూ పెండ్లి కుమారునికి
వధువుగా మారుతుంది!! ఇప్పుడు సహోదరి/సహోదరుడు—ప్రియుడైన పెండ్లి
కుమారునికి ప్రాణేశ్వరిగా మారుతుంది అంత్య దినాలలో!!! ఇదీ
రెండవ వివరణ!!
క్రీస్తు తన సంఘాన్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా?
ఆమె ప్రేమతో చూచే ఒకే చూపు ఆయన హృదయాన్ని ఇంతగా చలింపజేస్తుందా?
అవును. సంఘం కోసం తన ప్రాణాన్ని ధారపోయడం ద్వారా
ఆయన ఒక్కసారే తన అపార ప్రేమ తీవ్రతను నిరూపించాడు. ఆయన ప్రేమ
ఊహలకందనిది (ఎఫెసీయులకు 3:19, ). “సోదరి”– యేసుప్రభువు
పెండ్లి కుమారుడు, ప్రభువు, సంఘానికి అధినాధుడు.
అయితే ఆయన విశ్వాసులకు సోదరుడు అని కూడా అనిపించుకొంటాడు (హెబ్రీయులకు 2:11-12, ). ఆయన వారిని విమోచించే సమీప బంధువు
(రూతు 2:20).
ఇలా మారిన ఈ వధువు క్రీస్తు
ప్రభువు హృదయమును వశపరచుకొనినదని, ఒక చూపుతోనే వశపరచుకొనినదని
ఒక హారముతోనే వశపరచుకొన్నదని చెప్పబడింది.
అంటే ఎంత అందముగా విశ్వాసి యొక్క ఉన్నత స్థితిని ఇందులో వర్ణించాడో
గ్రహించాలి. ఈ వధువుగా
మారిన సంఘము మొత్తము క్రీస్తు ప్రభువు హృదయమును వశపరచుకొన్నది. అలాగే అందులో ఒక చూపుతోనే అనగా ఆయన
వద్దకు రావాలని ప్రయత్నించి ఎదురు చూచిన ఒక చూపు ఆమెను ఆయన వద్దకు చేర్చింది. ఆ చిన్న ప్రయత్నము ఎలా క్రీస్తు ప్రభువు
వద్దకు నడిపించునో పరిశోధించు విధానమును ఇంతకు ముందు చదువుకొని యున్నాము. అలాగే ఒక హారము ఆయనను వశపరచుకొనెనని
చెప్పబడింది. 1 కొరింథీ
3:10-15, ''దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె
పునాది వేసితిని, మరియొకడు దానిమీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము,
వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ,
గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల,
వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును,
అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వానివాని పని యెట్టిదో దానిని
అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి
నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి
తప్పించుకొన్నట్టు రక్షింపబడును.''
ఇలా విశ్వాసి నిర్మించుకొన్న క్రియలు రకరకాలుగా అందులో కనిపిస్తున్నాయి. వాటిలో ఒక్క హారము అనగా ఒక్కొక్క
విశ్వాసి క్రియలు ఆయనను అంతగా ఆకర్షించి వశపరచుకొన్నవని చెప్పబడింది. అంటే ఈ లోకములో విశ్వాసి చేయు క్రియలు
అంత గొప్పవని అవి క్రీస్తు ప్రభువును మన వశము చేయునని గ్రహించాలి.
నీవు ఎన్ని మంచి హారములు
పొందుకున్నావు అనగా మంచి కార్యాలు చేస్తున్నావు!!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*76వ భాగము*
*నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము*
పరమగీతము 4: 10.సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన
సకల గంధవర్గములకన్న సంతోషకరము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 10వ వచనములో సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ
ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము అంటున్నారు!
గమనించాలి- ఇక్కడ ఈ వచనాలలో ప్రభువు
సంఘాన్ని చూసి మురిసిపోతున్నారు!
కీర్తనల గ్రంథము 147:11, తనయందు భయభక్తులుగలవారియందు
తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.;
కీర్తనల గ్రంథము 149:4, యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు.
ఆయన దీనులను రక్షణతో అలంకరించును
జెఫన్యా
3:17, నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు,
ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు
సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి
సంతోషముచేత ఆయన హర్షించును.
అవును మన దేవుడు మనయందు ఆనందించు దేవుడు! మనలను చూసి మురిసి పోయే
దేవుడు! ఉదాహరణకు తండ్రి తన చిన్న పిల్ల నడుచుకుంటూ వస్తే ఎంతో
మురిసిపోతాడు- ఆబిడ్డ ఎదిగి స్కూల్ కి యూనిఫార్మ్ వేసుకుని వెళ్ళి ఇంటికి వస్తే చూసి చాలా పొంగిపోతాడు!
అలాగే మనలను చూసిన దేవుడు కూడా మురిసిపోతాడు! ఎంతవరకు
అంటే మన క్రియలు బాగున్నంత వరకు! అదే నీవు కాలేజీకి వెళ్ళి త్రాగుడు
సినిమాలు షికార్లు జూదము అలవాటు చేసుకుని ఇంటికి వస్తే తండ్రి ఏడుస్తాడు కోపగిస్తాడు! అలాగే పరమ తండ్రి కూడా!
సహోదరీ, ప్రాణేశ్వరీగా చెప్పబడిన వధువు సంఘము యొక్క ప్రేమ ఎంత మధురము అని ప్రియుడు
క్రీస్తు ప్రభువు చెప్పుటనుబట్టి వధువు సంఘమును మెచ్చుకోవాలి. అంత ప్రేమ వధువు సంఘము చూపెనని అర్థము. ప్రకటన
2:4, ''అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు
ఒకటి మోపవలసియున్నది.'' కనుక ప్రేమ లేకపోతే అది తప్పు. అలాగే ప్రకటన 2:13, ''-సాతాను సింహాసనమున్న స్థలములో నీవు
కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి
నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా
చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.'' ఒక ప్రక్క విశ్వాసులను చంపుచున్నను
మిగిలిన విశ్వాసులలోని విశ్వాసము కోల్పోనంత ప్రేమ క్రీస్తు ప్రభువు మీద ఉంది.
కనుకనే ఈ వచనములో ప్రభువు నీ ప్రేమ ఎంత మధురము అని చెప్పుచున్నారు. ఈ ప్రేమ ద్రాక్షారసముకన్న ఎంత సంతోషకరము
అని చెప్పుచున్నారు. ద్రాక్షారసము క్రీస్తు ప్రభువు రక్తము. ఇది పాప ప్రక్షాళన కోసము చిందించబడి
పాపి యొక్క పాపములను కడుగుటకు కల్వరిలో చిందించబడింది. దీనికన్నా నీ ప్రేమ సంతోషకరము అని
చెప్పుచున్నారు అంటే విశ్వాసి క్రీస్తు ప్రభువు పట్ల చూపు ప్రేమ విలువ ఎంత గొప్పగా
చెప్పబడినదో ఒక్కసారి గమనించాలి. అంతే కాకుండ మందసము, దానిలోని అతి పవిత్రమైన వస్తువులను
అభిషేకించు తైలము కన్నా సంతోషించదగినదని చెప్పుచున్నారు. అంటే క్రీస్తు అభిషక్తుడు అలా అభిషేకించుట
కన్నా కూడ విశ్వాసిలోని ప్రేమే గొప్పదని చెప్పుచున్నారు. కనుక క్రీస్తు ప్రభువు మనకొరకు ఇచ్చిన
రక్తము కన్నా, క్రీస్తు ప్రభువు మనలను క్రైస్తవులుగా అభిషేకించిన
దానికన్నా విశ్వాసములో బలపడి విశ్వాసి చూపు ప్రేమే గొప్పదని చెప్పబడింది.
మనకోసం
మరణించిన దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా?
మాటిమాటికి
తప్పిపోతున్నా గాని తన అపారమైన కృప చూపి కరుణిస్తున్న నీవు దేవునికి ఎంతగా ప్రేమించాలి!
ఒకసారి
నిన్ను నీవు సరిచూసుకో!
దేవునితో
సమాధాన పడు!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*77వ భాగము*
*నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న
సంతోషకరము*
పరమగీతము 4: 10. సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన
సకల గంధవర్గములకన్న సంతోషకరము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 10వ వచనములో సహోదరీ, ప్రాణేశ్వరీ,
నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ
ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము అంటున్నారు!
సోలోమోను
ముగ్ధుడై నీవు పూసుకొను పరిమళ తైలము వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము అంటున్నారు!
దీనిని యేసుక్రీస్తుప్రభులవారి పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులను
కలుసుకున్నప్పుడు వారి సహవాసం యొక్క సువాసనతో పోలుస్తారు! ఆయన పునరుత్థానము యొక్క సువాసన మనము
లోకమంతా వెదజల్లి ఆయన ప్రియమైన శిష్యులుగా ఆయన ప్రియమైన వధువుగా ఉండాలని దేవుడు ఎంతో
ఆశిస్తున్నారు!
ఈ
పరిమళ ద్రవ్యము కోసం ఒకసారి ఆలోచిద్దాం!
ఆదికాండం 43:11 లో యాకోబు గారు
ఐగుప్తు దేశాధిపతి అనగా యోసేపు గారికి ఈ పరిమళ ద్రవ్యములు సుగంద ద్రవ్యములు పంపినట్లు
చూడగలము! దేవునికి పరిమళ
ద్రవ్యములు అర్పించవలసిన బాధ్యత మనకుంది! మనలో ఉండే పరిమళ ద్రవ్యపు
వాసన ప్రభువుకే చెందాలి! అనగా మనలో ఉన్న శ్రేష్టమైన జీవితాలు
ప్రభువుకు మహిమ తెచ్చేవిధంగా ఉండాలి! మనలో ఉన్న మంచి లక్షణాలు
లేక ఆత్మఫలం విరివిగా ఫలించి అందరికీ నీలో ఉన్న దేవుడు యొక్క పరిమళం అందరికీ వ్యాపించాలి
అనగా నీలో ఉన్న సాధువైనట్టి లక్షణం ప్రేమ సంతోషం సమాధానం మంచితనము దీర్ఘశాంతము ఆశానిగ్రహముల
ద్వారా ప్రభువుకు మహిమ తేవాలి! ఇలాంటి జీవితం ప్రభువును ఎంతో
ఆనందింప జేస్తుంది!
ఇక నిర్గమ
30:22--26 లో ప్రత్యక్ష గుడారములో ఉంచవలసిన పరిమళ ద్రవ్యముల కోసం చెబుతున్నారు!
దీని ఆత్మీయభావము ఏమిటంటే ఇది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ప్రవర్తించ
వలసిన విధానము లేక ప్రవర్తన నియమావళి! నీవు దేవుని మందిరమునకు
పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకొనుము అన్నారు కదా ప్రసంగి 5:1 లో! దేవుని సన్నిధిలో లేక ఆయన మందిరములో దేవుని బిడ్డల
యొక ప్రవర్తన పరిమలించాలి! నీవు దేవుని సన్నిధిలో చేస్తున్న ఆరాధన, నీ ప్రవర్తన
దేవునికి మహిమగాను విశ్వాసులకు మాదిరిగాను ఉండాలి! పరిమళం వెదజల్లే
ప్రవర్తన సంఘములో ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరం! కష్టములు కలిగినా
నష్టములు కలిగినా ఇరుకులు ఇబ్బందులు కలిగినా నీ జీవితం పరిమలించేదై ఉండాలి!
2 రాజులు 20:13 ప్రకారం తన కొట్లలో
పరిమళ ద్రవ్యములు దాచి ఉంచారు హిజ్కియా రాజు! ఇతడు దేవునికి భయపడి
దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు! ఇతడు తన కొట్లు కొన్ని పరిమళ
ద్రవ్యములతో నింపేశాడు! అనగా తన హృదయమంతా దేవుని నామ స్మరణ,
ఆయన స్తుతి, ఆయన ధర్మశాస్త్రము మీద, ఆయన సేవా పరిచర్య మీదనే ఉంది గాని
లోకాశల మీద కాదు! విశ్వాసి తన కొట్లు పరిమళ ద్రవ్యముతో నింపుకోవాలి!
సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు తెస్తాడు దుర్జనుడు తన
చెడ్డ ధననిధి నుండి చెడ్డ విషయాలు తీసుకుని వస్తాడు అని వ్రాయబడింది! హిజ్కియా తన ధననిధిలో పరిమళ ద్రవ్యములను ఉంచారు! అలాగే
మన హృదయంలో కూడా మంచి విషయాలు మాత్రమే ఉండాలి! ఇదే పరిమళ జీవితం!
ఇక 2 దిన 16:14 లో ఆసా మరణించినప్పుడు
అతని శవాన్ని పరిమళ ద్రవ్యములతో భద్రపరిచారు! అయితే మన ప్రభువైన
యేసే ఆ పరిమళ ద్రవ్యము! చచ్చిన దుర్వాసన కొట్టకుండా కాపాడేవాడు!
మన జీవితాలలో పాపపు దుర్వాసన తొలగించబడాలి అంటే ఆయన రక్తములో కడగబడాలి!
ప్రభువు రక్తముతో మనము ఆవరించబడాలి! క్రీస్తు సువాసనతో
నింపబడాలి! మానవుడు దేవుని రక్తముతో కడుగబడి ఆయన పరిశుద్ధాత్మ
చేత నడుపబడితే దేవుని సువాసనగా మారి నిత్యజీవమునకు పాత్రుడు కాగలడు! ఇదే ఆ పరిమళ వాసన!
1 రాజులు 10 లో షేబ దేశపు రాణి సోలోమోను ఘనత కోసం విని
చూడటానికి వచ్చింది. వచ్చేటప్పుడు విస్తారమైన గంధవర్గములు పరిమళ
ద్రవ్యములు తెచ్చింది. ఆమె తెచ్చినన్ని ఎవరూ తేలేదు! అంత విస్తారంగా తెచ్చింది ఆమె! అయితే ఇది స్వనీతికి సాదృశ్యం!
దేవుని మందిరములో స్వనీతి పనికిరాదు! పరిసయ్యుడు
సుంకరి ఉపమానంలో పరిసయ్యుడు ఎంతో స్వనీతిని ప్రదర్శించినా నీతిమంతుడిగా నిలువలేక పోయాడు!
సుంకరి పాపినయిన నన్ను క్షమించు ప్రభో అంటూ నిజాన్ని ఒప్పుకున్నాడు నీతిమంతుడిగా
తీర్చబడ్డాడు!
అయితే
పౌలుగారు అంటున్నారు నిజానికి ఆ పరిమళ వాసన క్రీస్తే అంటున్నారు 2 కోరింథీ
2:14 లో 14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును
గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో
ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
15 రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి
క్రీస్తు సువాసనయై యున్నాము.
16 నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి
జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
యేసే
నిజమైన పరిమళ సువాసన- క్రీస్తు బిడ్డలు ఆ పరిమళ వాసన కలిగి దానిని అందరికీ పంచవలసిన అవసరం ఉంది!ఈ పరిమళ వాసన అనేకులను ఆకర్షించి, వారిని మరణపు వాసనను
తొలిగించి, క్రీస్తు సువాసనతో నింపి నిత్యజీవానికి పాత్రులుగా చేయాలి!
ప్రియ
విశ్వాసి ఆ క్రీస్తు పరిమళ వాసన నీలో ఉందా? నీ ఇరుగుపొరుగు వారి దగ్గర నీ కుటుంబంలో నీ సంఘంలో
ఆ సువాసన పంచుతున్నావా లేక మరణపు వాసన పంచుతున్నావా??
సరిచూసుకో! సరిచేసుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*78వ భాగము*
*నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి*
పరమగీతము 4: 11
ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి
నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 11వ వచనములో ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ
వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది అంటున్నారు!
సోలోమోను ముగ్ధుడై ఇంకా అంటున్నారు ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకు
చున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె
నున్నది. నిజంగా ఎంతగా మురిసిపోతున్నారో కదా! దేవునికి కూడా నీవంటే అంటే యిష్టము!!
ప్రేమ భరితమైన హృదయాల లోతులనుంచి మనం ఆయనతో పలికే ప్రేమ వాక్కులు మన ప్రభువుకెంతో
మధురంగా అనిపిస్తాయి మనతో సహవాసం ఆయన పాలిట పచ్చని వనాలుగా, పుష్పాల సౌరభంలాగా ఉంటుంది.
అస్తమానం మనతో ఉండాలని ఆయన కోరుతాడు. మనం ప్రార్థనలో
ఆయన సన్నిధికి చేరబోయే వేళ మనలను స్వీకరించేందుకు ఆయన అయిష్టంగా ఉన్నాడేమోనని ఎప్పుడూ
భావించకూడదు.
మనము మాట్లాడునప్పుడు మాటలు
మన నోటి గుండా వచ్చును. అలాగే విశ్వాసి మాట్లాడు ప్రతి మాట వధువు సంఘము మాటయే. వధువు సంఘము ఏ మాట మాట్లాడుచున్నది? ప్రకటన 22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని
రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.'' రమ్ము అని పిలుస్తున్నది. ఆ పిలుపు నందుకొని దప్పిగొని వచ్చిన
మరో విశ్వాసిని ఉచితముగా చేర్చుకొని వానిని సువార్త సంబంధమైన మాటలతో వారి దప్పికను
తీర్చాలి. అంటే సువార్తను
బోధించువారి పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు.
రోమా 10:15. అలాగే ఆ పెదవుల మధ్య ఉన్న నాలుక క్రింద
అనగా జిహ్వ క్రింద మధుక్షీరములు కలవని చెప్పుచున్నారు కనుక వారి నోటి నుండి ప్రతి మాట
జీవజలమే. ఈ జీవజలము సువార్తగా
వధువు సంఘము నోటిగుండా వచ్చుచున్నదని ఆ సువార్తలోని మాటల వలన వధువుయొక్క పెదవులు,
జిహ్వ క్రింద ఉన్న జలములును పాలు తేనెలవలె మధురమైనవని చెప్పుచున్నారు.
అలాగే వధువు యొక్క వస్త్రముల
సువాసన లెబానోను సువాసనవలె ఉన్నదని చెప్పబడింది. ఈ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు
అని చెప్పబడింది. ప్రకటన 19:8,
''మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు
ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.'' పరిశుద్ధుల నీతిక్రియలు వస్త్రములుగా వధువుకు ఇయ్యగా ఆ వస్త్రముల నుండి వచ్చు
సువాసన లెబానోనులోని దేవదారు వృక్షాలనుండి వచ్చు సువాసనవలె ఉన్నది.
మరి
అటువంటి తేనెలొలికే మాటలు క్రీస్తు సువార్తతో నిండిన మాటలతో నీ నోరు నింప బడిందా!!!
నీ
నోటిలో క్రీస్తు కోసమైన మాటలు వస్తున్నాయా లేక లోక సంబంధమైన మాటలా లేక బూతులు వస్తున్నాయా?
నీ
నోటిలో ఏ పాటలు వస్తున్నాయి? క్రీస్తు పాటలా? లేక సినిమా పాటలా లేక
బూతుపాటలా?
ఒకసారి
ఆలోచించు!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*79వ భాగము*
*నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి*
పరమగీతము 4: 11
ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి
నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక 11వ వచనములో ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకు చున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ
వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది అంటున్నారు!
సోలోమోను
ముగ్ధుడై ఇంకా అంటున్నారు నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను
సువాసనవలె నున్నది.
(గతభాగము తరువాయి)
సరే, జిహ్వక్రింద మధు క్షీరములుండి
తేనియ లొలికే నోరు ఎట్టిదో కొన్ని వచనాలు జ్నాపకం తెచ్చుకుందాం!
కీర్తన 37:30 లో 30 నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును అంటున్నారు!
గమనించాలి
నీతిమంతుల నోరు జ్నానము గూర్చి మాట్లాడుతుంది. జ్నానము యేసుక్రీస్తుప్రభులవారు మాత్రమే అని మనకు
సామెతల గ్రంధం స్పష్టము చేస్తుంది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ దేవునికోసమైన
మాటలు పలుకుతూ ఉంటే నీ నోరు జ్నానము గలదీగా మారిపోతుంది! అప్పుడు
నీ నోరు శ్రేష్టమైనదిగా మారిపోతుంది!
సామెతలు 10:11 లో అంటున్నారు 11 నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు
బలాత్కారము మరుగుపరచును
మలాకి 2:6 సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు
యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను
త్రిప్పిరి.
దేవుని
బిడ్డలు సత్యము గల దేవుని వాక్యాన్ని ప్రజలకు చెబుతూ ఉండాలి! దుర్భోధను ఎంతమాత్రమూ
బోధించ కూడదు! సమాధానమును బట్టి యధార్ధతను బట్టి ప్రభువును అనుసరించు
వారై ఉండాలి! సత్యవర్తనులై దేవుని వాక్యాన్ని బోధించుట వలన ప్రజలకు
క్షేమకారంగా ఉంటుంది!
యోహాను
4:10 లో సమరయ స్త్రీ జీవజలములు ఇమ్మని దేవుణ్ణి అడిగినది! అలాగే మనము కూడా మన కోరికలు కోసం ఆడగకుండా మన అవసరాల కోసం దేవుణ్ణి అడగాలి!
ముఖ్యంగా ఈ స్త్రీ అడిగినట్లు జీవజలములు, పరలోక
సౌభాగ్యాల కోసం, ఆధ్యాత్మిక ఫలములు వరములు కోసం దేవుణ్ణి అడగాలి-
లూకా సువార్త ప్రకారం ముఖ్యంగా పరిశుద్ధాత్మను అడగాలి! జీవజలమును ఆడగడమే కాదు పొందుకుని దానిని త్రాగాలి! అప్పుడే
నీకు నిత్యజీవము మరియు ఆశీర్వాదము !
అప్పుడే మన నోటినుండి మధుర క్షీరములు ప్రవహిస్తాయి! అలాకాకుండా మన నోటిలో
బూతులు శాపనార్ధాలు ముసలమ్మ ముచ్చట్లు వస్తే ఎట్టి పరిస్తితులలోనూ దేవునికి మహిమ రాదు
ముఖ్యంగా మనజీవితాలలో ఆశీర్వాదాన్ని ఆశించరాదు ఎందుకంటే అలాంటి మాటలు క్షేమాభివృద్ధి
తీసుకుని రావు సరికదా దేవుని శాపాన్ని తీసుకుని వస్తాయి!
ఇక ఇలాంటి సంఘము యొక్క వస్త్రముల సువాసన ఎలా ఉండాలో చూసుకుందాము!
ఆదికాండం
8:10-11 లో నోవహు గారు కొన్ని పవిత్ర పక్షులను బలిగా అర్పించారు దేవునికి!
అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది అని వ్రాయబడింది! కాబట్టి మన కానుకలతో మన పెదవులతో
దేవునికి ఇంపైన సువాసన వెదజల్ల గలగాలి! అనగా మన కానుకలు దేవునికి
ఇవ్వడమే కాకుండా మన నోటితో దేవునికి ఇష్టమైన రీతిలో కృతజ్నతా స్తుతులు చెల్లించాలి!
అది దేవునికి ఇష్టమైన బలియాగం!!!
ఆదికాండం 27:27 లో అక్కడ యాకోబు,
ఏశావు వస్త్రాలు వేసుకుని మోసగించడానికి వస్తే ఇస్సాకు గారు ఏశావు యొక్క
వస్త్రపు వాసన గ్రహించి
ఎంతో సంతోషించి ఆశీర్వదించినట్లు చూడగలము!
27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను.
అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను.
ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది
28 ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును
దేవుడు నీ కనుగ్రహించుగాక
29 జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు
నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు
శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక అంటూ దీవించారు!
కాబట్టి
మన వస్త్రములు యొక్క వాసన తండ్రిని ఆనందింప జేయాలి! అలాగే మనం చేసే మంచి పనులు మనుషులే కాదు
దేవుడు కూడా మెచ్చుకోవాలి!
ఫిలిప్పీ 4:18 లో మరో రకమైన అర్పణ
కనిపిస్తుంది 18 నాకు సమస్తమును
సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన
పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు,
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు
మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
పౌలుగారు
ఫిలిప్పీ పట్టణంలో సువార్తను ముగించిన తర్వాత రోమా పట్టణమునకు
పట్టబడి బందీగా వెళ్లారు! విషయం తెలిసిన ఫిలిప్పీ సంఘము పౌలుగారికి కావలసిన ఎన్నో వస్తువులు మరియు ధనము
పంపి పరిచర్యలో పాలుపంపులు పొందారు! దీనిని దేవునికి ఇష్టమైన
యాగము అంటూ చెప్పారు పౌలుగారు! ఇటువంటి ఆర్పణలు మనం కూడా చేయాలి
అవి దేవునికి ఇష్టమైన యాగముగా మారిపోతుంది అంటూ భక్తుడు అంటున్నారు!
ప్రియ
విశ్వాసి నీకు అటువంటి యాగం ఉందా?
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*80వ భాగము*
*నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన
జలకూపము*
పరమగీతము 4:
12 నా సహోదరి నా ప్రాణేశ్వరి
మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 12. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన
ఉద్యానము మూతవేయబడిన జలకూపము అంటున్నారు!
దీనికోసం జాగ్రత్తగా పరిశీలిస్తే మూయబడిన ఉధ్యాన వనము కోసం మూడు రకాలైన అభిప్రాయాలు
కనిపిస్తాయి ప్రియులారా! ఈ మూడింటి కోసం క్లుప్తంగా చూసుకుందాము!
ఈరోజు మొదటి అభిప్రాయం చూసుకుందాం!
కీర్తనల గ్రంథము 1:3 లో విశ్వాసులను ఫలవృక్షాలతో పోల్చడం కనిపిస్తుంది.
అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు
చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనల గ్రంథము 80:8, వారిని ద్రాక్షచెట్టుతో పోలుస్తుంది.
నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను
వెళ్లగొట్టి దాని నాటితివి
ఇక్కడ సోలోమోను గారు వారిని ఉద్యానవనం అంటున్నారు
యెషయా 58:11, యెహోవా నిన్ను నిత్యము నడిపించును
క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను
ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ;
యిర్మియా 31:12
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు,
గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు;
వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
నిజమైన సంఘం క్రీస్తుకు ఏదెను తోట వంటిది. ఆయన
అందులో విహరిస్తూ మనుషులతో ముచ్చటిస్తూ వారి సహవాసంలో ఆనందిస్తూ ఉంటారు (ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును
విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా
). ఎడారిలాంటి ఈ లోకంలో ఆయనకు
లభించే పరిమళం, ఫలసాయం అంతా తన విశ్వాసులనుంచే. ఇది మూసి ఉన్న తోట అనే మాటలు గమనించండి. అంటే విశ్వాసులు
కేవలం క్రీస్తుకు మాత్రమే చెందిన తోట. ఇతరులెవరూ అందులో సంచరించేందుకు
వీలు లేదు. విశ్వాసులు ఆయన స్వంతం
రోమీయులకు 14:7-8,
7 మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
8 మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము;
చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి
మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. ;
1 కోరింథీయులకు 6:19-20,
19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు
మీ సొత్తు కారు,
20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
కాబట్టి
ఇప్పుడు విశ్వాసులు ఆయన ఒక్కరి మనోల్లాసం కోసమే బ్రతకాలి!.
ఇంకా
ఆయన ఏమి చేశారంటే ఏ శత్రువైనా ప్రవేశించి ఆ తోటను కాళ్ళతో
త్రొక్కివేయకుండా ఆయన దాని చుట్టూ గోడ కట్టారు . వారు ప్రత్యేకంగా పవిత్రంగా ఆయనకే
అంకితమై ఉండాలి (యోహాను 17 అధ్యాయం;
రోమీయులకు 12:1, కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు
సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది
;
2 కోరింథీయులకు
6:14-18, 14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో
ఏమిపొత్తు?
15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు
సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును,
నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
17 కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా
ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
18 మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై
యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
వారు ఆయనకు ఇష్టమైన ఫలాలు ఫలించాలి
యోహాను 15:8, , మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును;
ఇందువలన మీరు నా శిష్యులగుదురు
16 మీరు నన్ను
ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన
మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును
నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.
రోమీయులకు 7:4, కావున నా సహోదరులారా,
మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు
అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి;
గలతియులకు
5:22-23,
22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశానిగ్రహము.
23 ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు. ;
ఎఫెసీయులకు 5:9, వెలుగు ఫలము సమస్తవిధములైన
మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.;
కొలొస్సయులకు 1:6, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు,
వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన
నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది
10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై,
ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన
జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,,
నిజమైన
సంఘం నీటి ఊటలాంటిది. పర్వత సానువుల్లో జాలువారే సెలయేరు లాంటిది. ఇది క్రీస్తుకు
ఎనలేని సంతృప్తి చేకూర్చేది. ఈ ఊట మూతవేసి ఉంది. అంటే కేవలం ఆయన కోసమే (2 కోరింథీయులకు 11:2,
). నిజమైన క్రీస్తు సంఘం నీరు నిలవ ఉండే చెరువులాంటిదో, ఎండిపోయే కోనేరువంటిదో కాదు. క్రీస్తు శరీరమైన నిజ సంఘంలో
శాశ్వతంగా పెల్లుబుకుతూ ఉండే పరిశుద్ధాత్మ
ఊటలు ఉంటాయి.
ఆ ఊటలను సంఘము అనుభవిస్తూ ఉండాలి! దానితో నిత్యము నిండి ఉంటూ ఆయనలో
సాగిపోవాలి ఫలించాలి!
మరి
ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉందా?!!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*81వ భాగము*
*నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన
జలకూపము*
పరమగీతము 4:
12 నా సహోదరి నా ప్రాణేశ్వరి
మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 12. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన
ఉద్యానము మూతవేయబడిన జలకూపము అంటున్నారు!
ఈరోజు రెండవ అభిప్రాయం చూసుకుందాం!
ప్రియుని సహోదరి ప్రాణేశ్వరియైన
వధువు సంఘము యొక్క ఉన్నత విలువలు ఇందులో వర్ణించుట జరిగింది. ఈ వధువు సంఘము మూయబడిన ఉద్యానము అనగా
ఉద్యానవనములో మనిషికి ఆహ్లాదము నిచ్చు సమస్తము అందులో ఉంటాయి. కాని అది మూయబడింది అంటే లోపలివారు
వెలుపలికి రాలేరు. వెలుపలివారు
లోపలికి రాలేరు. అనగా
అన్యులు ప్రవేశించుటకు వీలుపడదని భావము.
ప్రకటన 22:14-15, ''జీవ వృక్షమునకు హక్కుగలవారై,
గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు
కొనువారు ధన్యులు. కుక్కలును
మాంత్రికులును వ్యభి చారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు
ప్రతివాడును వెలుపటనుందురు.''
కనుక
ఉద్యానవనముగా చెప్పబడిన పరమ యెరూషలేము గొఱ్ఱెపిల్ల భార్యగా మారిన తరువాత అది మూయబడును.
అప్పుడు కొందరు హక్కుగలవారై గుమ్మముల గుండా ప్రవేశించి అందులో
ఉంటారు. మిగిలిన రకరకాల
పాపపు సంబంధమైన నరులు యెరూషలేమునకు వెలుపటనుందురు. ఆ విధముగా అది మూయబడును అనగా ప్రవేశ
అర్హత వారికి ఉండదు.
అలాగే
అది మూతవేయబడిన జలకూపము అని చెప్పబడింది.
ప్రకటన 22:1-2, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి
జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను
ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవ్షృముండెను; అది నెలనెలకు
ఫలించుచు పండ్రెండు కాపులు కాయును.
ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.''
జీవజలముల
నది అందులో ప్రవహిస్తున్నది గాని దానికి బయట కాదు. కనుక ఈ నది ఆ ఉద్యానవనమైన పరమయెరూషలేములో ఉన్నది. కాబట్టి అది మూత వేయబడిన జలకూపముగా
తన ప్రాణేశ్వరిని గూర్చి వర్ణించాడు.
అందులో ప్రతి ఒక్కరు జీవజలమైన క్రీస్తు ప్రభువును అంగీకరించినవారే! పరమయెరూషలేమునకు వెలుపట ఉన్నవారు
జీవజలమైన క్రీస్తు ప్రభువును తృణీకరించినవారు. కనుక వారు ప్రవేశించుటకు అందులో అవకాశము
లేదన్న అర్థముతో అది మూయబడి మూతవేయబడిన అని చెప్పబడింది.
ఈ విధముగా మూత వేయబడియున్న
ఈ వనములో అన్ని రకముల ఫలవృక్షములు పరిమళతైల వృక్షములు అన్ని రకముల పూలవృక్షములతో బాటు
నిమ్మగడ్డియు అందులో ఉన్నది. అంటే ఈ మూతవేయబడు నాటికి అందులో ఉన్నవారందరు ఒక్క యెరూషలేము కుమార్తెలే కాదు. అన్ని ప్రాంతముల నుండి వచ్చిన నానా
జాతులవారు అందులో ఉన్నారని వారందరు కూడ శ్రేష్ఠమైనవారేనని చెప్పబడింది. కనుక పరమయెరూషలేము అను ప్రియునిలో
ప్రియురాలులో ఉన్నవారు ఒకే రకమైనవారు కారు. అన్ని రకాల జాతులవారైనప్పటికి అందరికి
యోగ్యత ఒక్కటే - క్రీస్తు ప్రభువును రక్షకునిగాను తమ ప్రాణ ప్రియునిగాను
నమ్మి, ఆయన ఆజ్ఞలను శిరసావహించి జీవించుటయే అందులో ఉండుటకు అర్హత. ఇలా అర్హత సాధించినవారు సాధారణమైనవారు
కారని శ్రేష్ఠమైనవారుగా వర్ణనతో చెప్పబడింది ప్రియులారా!.
మరి
ఈ అర్హతను నీవు సాధించావా ప్రియమైన చదువరీ!!!
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*82వ భాగము*
*నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన
జలకూపము*
పరమగీతము 4:
12 నా సహోదరి నా ప్రాణేశ్వరి
మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 12. నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన
ఉద్యానము మూతవేయబడిన జలకూపము అంటున్నారు!
ఈరోజు మూడవ అభిప్రాయం చూసుకుందాం!
(గతభాగం తరువాయి)
సోలోమోనుకి షూలమ్మితి మూయబడిన ఉద్యానవనముగా ఉంది! ఆమె కేవలం
సోలోమోను కోసమే బ్రతుకుతూ తన పవిత్రతను కాపాడుకోవాలి! అలా ప్రత్యేకపరచుకుని
సోలోమోనుకి గౌరవం తెచ్చింది!
అలాగే సంఘము కూడా కేవలం ప్రభువు కొరకే బ్రతకాలి! మన జీవితాలు
ప్రభువుకే సమర్పించుకొని ఆయనకు మహిమకరంగా జీవించాలి! లోకము ఏవిధంగా
కూడా ఆకర్షించకూడదు! లోకపు ఆశలు కనబడకూడదు! లోకపు పోకడ చూపించ కూడదు మన జీవితాలలో! క్రీస్తు మాత్రమే
కనబడాలి పరిశుద్ధత మాత్రమే కనిపించాలి! మాటలలో పవిత్రత!
చూపులలో పవిత్రత! ప్రవర్తనలో పవిత్రత! అలవాట్లలో పవిత్రత! చివరకు ఊహాలలో తలంపులలో కూడా పరిశుద్దత
కనిపించాలి! నీ జీవితం కేవలం క్రీస్తుకోసమే తప్ప లోకము కోసం కాదు!
సాతానుకోసం అంతకన్నా కాదు! గలతీ 5 వ అధ్యాయంలో ఉన్న ఆత్మఫలము మాత్రమే ఫలించాలి తప్ప అదే అధ్యాయములో ఉన్న శరీర
క్రియలు ఏమాత్రము కనిపించకూడదు! ఇదే మూయబడిన ఉద్యాన వనము ప్రియులారా!
ఇక యోహాను
20:19 లో తలుపులు మూసుకుని ప్రార్ధనలో ప్రభువు కోసం కనిపెడితే ఆ మూయబడిన
గదిలోనికి యేసుక్రీస్తుప్రభులవారు ప్రత్యక్షమయ్యారు! కాబట్టి తలుపు మూయబడిన గదిలో నీ హృదయపు
వాకిళ్ళు లేక హృదయ ద్వారం ప్రభువుకోసం తెరిచి ఉంచితే ఆ గదిలోనికి క్రీస్తు ప్రవేశించి నిన్ను తన పరిశుద్దాత్మతో
నింపి తనకిష్టమైన ఫలములు నీకిచ్చి నిన్ను ఆత్మీయ ఆహారంతో ఆశీర్వాదంతో అభిషేకంతో నింపుతారు
ఆయన! ప్రభువు దప్పిక తీర్చుటకే శిష్యులు మూత వేయబడిన జలకూపంలా
ఉన్నారు అని గ్రహించాలి! దానిలోనికి ప్రభువు వచ్చి వారిని వారిని
నింపి వారి ఆకలి తీర్చారు! ఆ జలము త్రాగిన వారు విశ్వమంతా ప్రభు
సాక్షులుగా తిరిగి పవిత్రమైన జీవితం జీవించి ప్రజలను తన శిష్యులుగా చేశారు!
ఆదికాండం 2 వ అధ్యాయంలో దేవుడు ఒక వనమును
వేశారు! దానికి కాపలా కూడా పెట్టారు! మూడవ
అధ్యాయంలో మూడవ వ్యక్తి ప్రవేశించి ఆ వనమును ఆ మనుష్యులను పాడుచేశాడు! తద్వారా ఆ సంఘము పాడై పోయింది! లోకము మీదికి పాపము శాపము
తీసుకుని వచ్చారు! వారే గనుక మూతవేయబడిన ఉద్యానవనములా మూతవేయబడిన
జలకూపములా కాచుకుంటే నేడు ఆ వనము నాశనమై ఉండేది కాదు! ఆ సంఘము
పాడై ఉండేది కాదు!
సామెతలు 24:30లో మరో మూయబడని ఉధ్యాన వనము
కనిపిస్తుంది! ఇక్కడ సోమరివాని చేను కనిపిస్తుంది, దీనిలో దట్టమైన ముండ్ల తుప్పలు దూలగొండలు కనిపించాయి! ఇంకా దాని రాతిగొడ పడగొట్టబడింది!
కాపుదల భద్రత లేని పొలము ఇది! ఇంకా చెప్పాలయంటే
దేవునికోరకు ప్రత్యేకించ బడని తోట ఇది!
ప్రియ సహోదరి సహోదరుడా! ఒకవేళ నీవు కూడా ఇలా ఉంటే నీ హృదయం
భద్రత లేకుండా హృదయాన్ని అదుపులో ఉంచుకోకుండా ఉంటే లోకానికి సాతానుకి దాసుడవై పోతావు!
ఇక యెషయా
5 లో ఒక ద్రాక్షతోట కనిపిస్తుంది! దేవుడు ప్రత్యేకమైన
మంచి ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చి నాటితే మంచి ఫలము ఫలించకుండా కారు ద్రాక్షలు కాచినది!
అందుకే దేవుడు ఆ తోట కంచెను తీసివేస్తాను అంటున్నారు! నిజానికి ఇది మూయబడిన ఉద్యాన వనమే గాని మంచి ఫలములు ఫలించకుండా కారు ద్రాక్షలు
కాచినది! చివరకు దేవుడు ఏమంటున్నారు అంటే 7 ఇశ్రాయేలు
వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము.
ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా
రోదనము వినబడెను.
8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు
ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.
ప్రియ
విశ్వాసి ఒకవేళ నీలో కూడా ఆత్మఫలము కాకుండా శరీర క్రియలు కనిపించాయా నీకు కూడా ఇదే
గతి అని మరచిపోవద్దు!
ఇక 51:3 లో కరుణించి ఆ తోటను
మూయబడిన ఉద్యానవనముగా చేస్తాను అంటున్నారు
3 యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని
ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె
నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును
చూడండి
కారుద్రాక్షలు కాచారు కాబట్టి అనేకదేశాలలోనికి వారిని చెదరగొట్టారు దేవుడు! ప్రభువా మమ్మల్ని క్షమించు
అని ఆయన పాదాలు పట్టుకున్నారు ఇప్పుడు! అందుకే ఇప్పుడు వారిని
తిరిగి నిర్మిస్తాను అంటున్నారు దేవుడు!
ఇక యెషయా
58 లో మరో తోట కనిపిస్తుంది ఇది దేవుడే నీరు కట్టిన తోట!! ఎందుకంటే వీరు ప్రభువుకోసం తమనుతాము సమర్పించు కున్నారు! అందుకు దేవుడు అంటున్నారు నేను మీకు నీరు కడతాను అప్పుడు మీరు నీరు కట్టిన
తోట వలె ఉంటారు అంటున్నారు దేవుడు 58:11 లో!
యిక
యిర్మీయా 31:11--12 లో మరో తోట కనిపిస్తుంది
11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు,
వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు
12 వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు;
యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు
తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు
సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె
నుందురు.
13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను,
విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యవనులును
వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు
నీవు
మూయబడిన ఉద్యానవనములో ఉండి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని ప్రభువుకోసము మాత్రమే
బ్రతుకుట మొదలుపెడితే సమస్త ఆశీర్వాద అభిషేకాలు నీకు కలుగుతాయి!
మరి
నీవు ప్రభువుకోసం మాత్రమే జీవిస్తావా??
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*83వ భాగము*
*పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ
శ్రేష్ఠ పరిమళద్రవ్యములు*
పరమగీతము 4: 13 నీ చిగురులు దాడిమవనము వింతైన
శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు
14 జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన
పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 13 నీ చిగురులు దాడిమవనము వింతైన
శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు జటామాంసి వృక్షములు
14 జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు
గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు అంటున్నారు!
ఈ విధముగా మూత వేయబడియున్న
ఈ వనములో అన్ని రకముల ఫలవృక్షములు పరిమళతైల వృక్షములు అన్ని రకముల పూలవృక్షములతో బాటు
నిమ్మగడ్డియు అందులో ఉన్నది. అంటే ఈ మూతవేయబడు నాటికి అందులో ఉన్నవారందరు ఒక్క యెరూషలేము కుమార్తెలే కాదు. అన్ని ప్రాంతముల నుండి వచ్చిన నానా
జాతులవారు అందులో ఉన్నారని వారందరు కూడ శ్రేష్ఠమైనవారేనని చెప్పబడింది. కనుక పరమయెరూషలేము అను ప్రియునిలో
ప్రియురాలులో ఉన్నవారు ఒకే రకమైనవారు కారు. అన్ని రకాల జాతులవారైనప్పటికి అందరికి
యోగ్యత ఒక్కటే - క్రీస్తు ప్రభువును రక్షకునిగాను తమ ప్రాణ ప్రియునిగాను
నమ్మి, ఆయన ఆజ్ఞలను శిరసావహించి జీవించుటయే అందులో ఉండుటకు అర్హత. ఇలా అర్హత సాధించినవారు సాధారణమైనవారు
కారని శ్రేష్ఠమైనవారుగా వర్ణనతో చెప్పబడింది.
నిజానికి పై వచనాలలో శ్రేష్టమైన
పరిమళ ద్రవ్యాలు కనిపిస్తున్నాయి మనకు! ఇవి ప్రతిష్ట అభిషేక తైలములు!
ప్రభువు పునరుత్థానము తర్వాత తన శిష్యులకు సువార్త కోసం ప్రతిష్టించడం
ఈ వచనాల యొక్క సారాంశం అని అనేకుల అభిప్రాయం!
నిర్గమ 30:22 చూసుకుంటే
22 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ
సంభారములలో
23 పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును
24 నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును,
లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
25 వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
ఆహారోను
మరియు అతని కుమారులను దేవునికి యాజకులై ఉండేటప్పుడు ఈ పరిమళ ద్రవ్యములతో ఆహారోను గారిని
అతని కుమారులను అభిషేకించినట్లు మనము చూడగలము! దేవుని ప్రజలు వారి ప్రవర్తన వారి స్తుతి దేవునికి
ప్రతిష్టాభిషేక తైలమై ఉండాలి! అంతేకాకుండా ప్రభువు మనకు తన కృప
ద్వారా వాక్యము ద్వారా మనలను ప్రతిష్టించారు! అనగా దేవుడు అభిషేకించారు!
ఈ అభిషేకం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది!
1 యోహాను 2: 20 అయితే మీరు పరిశుద్ధునివలన
అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
27 అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది
గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే
గాని అబద్ధము కాదు;
ఇక
నిర్గమ 37:29 లో పరిశుద్ధాభిషేక తైలము కన్పిస్తుంది మనకు! ఇది స్వచ్ఛమైన
తైలము! ఇదికూడ పరిమళ దూపద్రవ్యములతో సిద్ధం చేయబడుతుంది. ఇది మన జీవితంలో ప్రభువు కొరకు మనము
జీవించవలసిన అవసరతను సూచిస్తుంది! నీవు ఏ మాత్రము లోకము కోసం
కాకుండా కేవలం దేవుని కోసమే జీవించాలి! దేవునికోసమే నీ అవయవాలు
ప్రతిష్టించు కోవాలి! దానినే ఈ భాగం సూచిస్తుంది!
1 సమూయేలు 10:1 లో సమూయేలు గారు తైలపు బుడ్డిలో నుండి తైలము
తీసి ఆ నూనెతో సౌలును అభిషేకించారు! అదేవిధంగా తర్వాత అధ్యాయాలలో
దావీదుగారిని కూడా అదే తైలపు బుడ్డిలో ఉన్న తైలముతో అభిషేకించి నట్లు చూడగలము!
అయితే నాటనుంది దేవుని ఆత్మ దావీదు గారి మీద బలముగా నిలిచింది అని చూడవచ్చు!
1 సమూయేలు 16:13
13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి
అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను.
తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
కాబట్టి
ఇది పరిశుద్దాత్మ అభిషేకాన్ని సూచిస్తుంది!
అలాగే పెంతుకొస్తు దినాన దేవుడు తన
ప్రజలను పరిశుద్దాత్మతో అభిషేకించినట్లు చూడగలము! నాటనుండి విశ్వాసులమీద
దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా దిగుతూ వారిని ఆత్మపూర్ణులుగా చేయడం చూస్తున్నాము!
ఈ అభిషేకం ప్రతి విశ్వాసి పొందుకోవాలి! అంతేకాదు
ఆ అభిషేకం నిలబెట్టుకోవాలి కూడా!
ఇక
కీర్తన 133:2 లో మరో అభిషేక తైలము చూడగలము! ఇది ఆహారోను గారి తలమీద
పోయబడితే అది అతని తలమీద నుండి అంగీ అంచుల వరకు జారినట్లు చూడగలము! ఇంతకు ఎప్పుడు పోయబడింది అంటే సహోదరులు ఐక్యతతో ఉన్నప్పుడు! కాబట్టి మరో రకమైన దేవుని అభిషేకం ఏమిటంటే సహోదరుల మద్య, సంఘములో విశ్వాసుల మధ్య, సంఘాపెద్దలు కాపరి మధ్య అందరిలో
ఈ ప్రభువు అనుగ్రహించిన సమాధానము ఏలుతున్నప్పుడు దేవుని యొక్క అభిషేకము అనే తైలము కుమ్మరించబడి
ఆశీర్వాదము శాశ్వత జీవము ఆ సంఘములో రాజ్యము చేస్తుంది!
ప్రియ
దేవుని బిడ్డా! ఈ అభిషేక తైలము నీమీద పోయబడింది మరి అది నీ మీద నిలిచి ఉందా లేక పోగొట్టుకున్నావా?
సరిచూసుకో! సరిచేసుకో!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*84వ భాగము*
*నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము*
పరమగీతము 4: 15. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను
పర్వతప్రవాహము.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 15. నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానజలాశయము ప్రవాహజలకూపము లెబానోను
పర్వతప్రవాహము అంటున్నారు!
ఇది
దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం చెప్పబడింది పియులారా!
ప్రియులారా! ఇశ్రాయేలు జాతి కోణములో
చూసుకుంటే: ఇది గత వచనాలలో ప్రియుని సహోదరి ప్రాణేశ్వరియైన వధువు
సంఘము మూయబడిన జలపాతమని తెలుసుకొన్నాము.
ఇలాంటి వధువు సంఘమునుగూర్చి మరికొంత విశ్లేషణగా వివరించుట ఈ వచనములో
జరిగింది. ఇందులో మూడు రకముల జలములు ప్రవహిస్తున్నవి. అందులో
1. ఉద్యానజలాశయము
2. ప్రవాహజలకూపము
3. లెబానోను
పర్వతప్రవాహము.
అంటే
యెరూషలేముగా మొదలైన వధువు లెబానోను దేవదారులతో చేయబడిన యెరూషలేము ఆలయముగా ప్రసిద్ధి
చెంది ప్రపంచమంతా ఆ పరిస్థితిని గూర్చి ఆ దినములలో తెలియనివారు
లేరు. ఇశ్రాయేలీయుల దేవుడు
గొప్ప వాడని అందరు ఒప్పుకొన్నట్లుగా రాజుల గ్రంథములో చదువగలము. ఇలాంటి వధువు సంఘము క్రీస్తు ప్రభువు
కాలములో మరల సీయోనులో పునాది వేయబడి క్రీస్తు ప్రభువు ఏర్పరచుకొన్న శిష్యుల ద్వారా
లెబానోను పర్వత ప్రవాహముగా ఉన్న నిజదైవత్వము మార్పు చెంది సీయోను నుండి ప్రవాహ జలములు
ప్రపంచ నలుమూలల ప్రవహించింది. ఇలా ప్రవహించిన జలప్రవాహము చివరకు యుగాంతము తరువాత వధువుగా మారి, గొఱ్ఱెపిల్లకు భార్యగా మారిన తరువాత ఉద్యానజలాశయముగా మాత్రమే ఒకటిగా నిలుచునని
అదే పరమయెరూషలేమని చెప్పబడింది.
ఇక
సంఘకోణములో చూసుకుంటే ఉధ్యాన జలాశయము, ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము ఇవన్నీ
దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసమే అని చూడగలము! తర్వాత వచనంలో ప్రియుడు వచ్చి తనకు ఇష్టమైన ఫలాలు
బుజించును గాక అంటున్నారు! అనగా ఇక్కడ మొదటగా ప్రభువు ఆరోహణం
కనిపిస్తుంది! ఆయన మొదటగా పరమునకు ఆరోహనుడై పెంతుకొస్తు పండుగనాడు
పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు! యోహాను 7:37 లో ఎవడైనా దప్పిగొంటే నా దగ్గరకు వస్తే
నాయందు విశ్వాసముంచితే వారి కడుపులో నుండి జీవజలనదులు పారును అన్నారు! అవి ఇవే! లేక ఇదే!!!
అవి 1. ఉద్యానజలాశయము 2. ప్రవాహజలకూపము 3. లెబానోను పర్వతప్రవాహము! అదే పరిశుద్దాత్మ దేవుడిగా దిగెను
!
దీనికోసం క్లుప్తంగా చూసుకుంటే యెహేజ్కేలు 47:1 లో
ఈ నీరు మామూలు నీరు కాదు! అంత్య దినాలలో దేవుని మందిరములో నుండి
ప్రవహించబోయే పరిశుద్ధాత్మ శక్తి!
జెకర్యా 14:8 లో ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి
పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాల మందును ఆలాగుననే జరుగును.
ఈ
జీవజలములు పరిశుద్ధాత్మ శక్తి!
యోహాను 4:10 అందుకు యేసు నీవు దేవుని వరమును
నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు,
ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను
ఈ
నీరు నిత్యజీవము! అయితే మొదట పరిశుద్దాత్మ దేవుడు అతనిలో పనిచేస్తేనే ఆ నిత్యజీవ ఫలమును అనుభవించగలము!
ఇక
ఈ ప్రవాహమునకు చావునుండి అనగా ఆత్మీయ చావునుండి కూడా రక్షించగలదు
రోమా 8: 11 మృతులలో నుండి యేసును లేపినవాని
ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు
చావునకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
ఇక
ఇదే పరిశుద్దాత్మ మనలను సర్వసత్యములోనికి కూడా నడిపించ గలడు!! యోహాను 16: 13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును
సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక,
వేటిని వినునో వాటిని బోధించి ..
ఇక
ఈ పరిశుద్దాత్ముడు మనలో ఉంటే మనకు శక్తి కలుగుతుంది ఆపో 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు
మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల
యందంతటను భూదిగంత ముల వరకును..
ఇక రోమా 15:15 ప్రకారము ఇదే పరిశుద్దాత్మ
ప్రవాహము మనలను పరిశుద్ధులుగా కూడా మార్చుతుంది
15 అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి
ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు,
దేవుని చేత నాకు అనుగ్రహింపబడెను
కాబట్టి
ప్రియ సహోదరి సహోదరుడా!
ఈ ప్రవాహమును శక్తిని నీవు పొందుకున్నావా? ఆత్మకార్యములు
ఆత్మ ఫలము ఫలిస్తున్నావా?
ఒకసారి
సరిచూసుకో!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*85వ భాగము*
*ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ,
వేంచేయుము*
పరమగీతము 4: 16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 16.ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక అంటున్నారు!
ప్రియులారా! దీనికోసం విభిన్నమైన
అభిప్రాయాలున్నాయి! గనుక అన్నీ చూసుకుందాము! గమనించండి ఈ వచనం నాకు ఎంతో ఇష్టమైన వచనము!
అనేకులు
ఇది పరిశుద్ధాత్మ కోసం చెప్పబడిన వచనము అని నమ్ముతారు! ఎందుకో మొదటి అభిప్రాయం చూసుకుందాం!
ఈ మాట అంటున్నది పెండ్లి కొడుకే.
ఎందుకంటే “నా ఉద్యానవనం” అంటున్నాడు. గాలి పరిశుద్ధాత్మకు చక్కని సాదృశ్యం
(యోహాను 3:8, – హీబ్రూలోను, గ్రీకులోను,
గాలి, ఊపిరి, ఆత్మ,
ఈ మూడు పదాలు ఒకటే) 8 గాలి తన కిష్టమైన చోటను విసరును;
నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో
నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
దేవుని ఆత్మ సంఘంలో వీస్తూ ఉన్నప్పుడే
దానిలోని పరిమళం వ్యాపిస్తుంది. “నా ప్రియుడు”– వధువు ప్రేమ నిండిన మనస్సుతో
ఆయనను ఆహ్వానిస్తుంది. ఇదే వరుని ప్రేమకు తగిన ప్రతిస్పందన.
కాబట్టి ఇక్కడ వాయువు అనగా ఉత్తర వాయువు అనేది దేవుని పరిశుద్ధాత్మ!
ఇది మొదటి అభిప్రాయం!
ఇక రెండవ అభిప్రాయము!
ప్రియుడైన క్రీస్తు ప్రభువు
తన వద్దకు వచ్చుటకు ఈ వచనములోని ప్రియురాలు ఉద్యానవనముగా చెప్పబడిన వధువు సంఘము సిద్ధపడుచున్నది.
ఏ విధముగా? ప్రకటన 7:1, ''అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి యుండి,
భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు
భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.'' ఇలాచేయుట వలన బాధ కలిగించినట్లు అగును
దానివలన హాని జరుగునని చెప్పబడింది.
అయితే ఉద్యానవనముగా ఉన్న వధువు ఉత్తర, దక్షిణ
వాయువులను తనపై వీచమని కోరుచున్నది.
ఇలా వీచుట ద్వారా ఆ వధువు సంఘములో హాని జరుగదు. పైపెచ్చు ఆహ్లాదకరమైన స్థితి అక్కడ
ఏర్పడును. అంటే ఆ ఉద్యానవనమైన
వధువు సంఘములో ఉన్న విశ్వాసులకు వాయువులు బిగబట్టుట వలన ఏ హాని జరుగదని వాయువులు ఆ
ఉద్యానవనములో ఎల్లప్పుడు వీచునని మనకు అర్థమగుచున్నది. ఇలా విసురుట వలన అందులో ఉన్న విశ్వాసులు
అను పరిమళము అందరికి సువాసనగా వ్యాపిస్తుంది. వీరిలోని విశ్వాసము ప్రేమ అను సుక్రుత
గుణములు పరిమళ ద్రవ్యములుగా ఆ గాలుల వలన వ్యాపింపగా అవి ప్రియుని యొద్దకు చేరి,
ఆ ప్రియుడు ఉద్యానవనమునకు వచ్చునట్లుగా చేయునని చెప్పబడింది. ప్రకటన
8:3-4, '' మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము
ఎదుట నిలువగా సింహాసనము ఎదుటఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై
అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి
పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.''
పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యములు అనగా పరిమళ సువాసన పొగ లేచి
వాయువుల సహాయముతో వ్యాపించి చివరకు దేవుని సన్నిధికి చేరగా, క్రీస్తు
ప్రభువు వారి ప్రార్థనలకు బదులు ఇచ్చుటకు ఆ ఉద్యానవనమైన వధువు సంఘమునకు వచ్చుట జరుగును.
అలా వచ్చిన ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఆ ఉద్యానవనములో విశ్వాసులతో బాటుగా
తనకిష్టమైన ఫలములను భుజించునని వ్రాయబడియున్నది. ఆ ఫలములే జీవవృక్ష ఫలములు.
ప్రకటన
22:2,
''ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది
నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై
వినియోగించును.'' ఈ ఫలములు తనకు చాలా ఇష్టమైనవని
వాటిని ఆ ఉద్యానవనమునకు వచ్చి భుజించునని చెప్పబడింది.
క్రీస్తు ప్రభువుకు ఇష్టమైన ఆ ఫలములను మనము భుజించవలెనంటే వధువు
సంఘములో ప్రవేశింపగల యోగ్యతను సంపాదించుకోవాలి.
గమనించాలి
ఈ రెండవ అభిప్రాయములో వాయువులు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదు గాని ఈ వాయువుల వలన
కలిగే సుగంధమును పీల్చడానికి లేక ఆఘ్రాణించడానికి ప్రియుని ఆహ్వానముగా మాత్రము చూడగలము!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*86వ భాగము*
*ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ,
వేంచేయుము*
పరమగీతము 4: 16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక అంటున్నారు!
ప్రియులారా! దీనికోసం విభిన్నమైన
అభిప్రాయాలున్నాయి! గనుక అన్నీ చూసుకుందాము! గమనించండి ఈ వచనం నాకు ఎంతో ఇష్టమైన వచనము!
(గతభాగం తరువాయి)
ఇక మూడవ అభిప్రాయం చూసుకుందాము!
ఉత్తరగాలి
అనగా ఏసుక్రీస్తు ప్రభులవారు పునరుత్థానం జరిగాక ఆరోహనుడయ్యే టప్పుడు మీరు పైనుండి
శక్తి పొందుకునే వరకు పట్టణము అనగా యెరూషలేము పట్టణములో నిలిచి ఉండండి అంటే వారు నిలిచి
మేడ గదిలో ప్రార్ధించేటప్పుడు పెంతుకొస్తు దినాన పైనుండి
దిగితే పొందుకున్న పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి
అందరిమీద వ్రాలి వారిని అభిషేకించింది గదా! అదే ఉత్తరగాలి!
అనగా పరిశుద్ధాత్మ దేవుడు! ఆయనకు మరోపేరు ఉత్తరవాది!
లేక ఆదరణ కర్త!!!
దీనిని
యెషయా 59 లో కూడా చూడవచ్చు!
21 నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు
నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు
ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెహేజ్కేలు 39: 29 అప్పుడు ఇశ్రాయేలీయులమీద
నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఇక యోవేలు గ్రంధములో కూడా దేవుడు వాగ్ధానం చేశారు! 2: 28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ
కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు
కలలుకందురు, మీ ¸°వనులు దర్శనములు
చూతురు.
29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను
కుమ్మ రింతును.
ఇక
మనము యేసుక్రీస్తుప్రభులవారి మీదకు పరిశుద్దాత్మ పావురము వలె దిగి ఆయన మీద వ్రాలి నట్లు
మనము సువార్తలలో చూడగలము!
అయితే ఉత్తరము నుండి గాలి వస్తే వర్షం పడుతుంది అంటూ ఏసయ్య మనకు చెప్పారు కదా
శాశ్త్రులకు బుద్ధి చెప్పేటప్పుడు లూకా 12 వ అధ్యాయములో!! కాబట్టి
దేవుని ఆత్మ ఉత్తరవాయువు వలె ఆత్మ వర్షం కురిసి చల్లదనము కలుగజేసింది! ఇది మనం ఆపో 2వ అధ్యాయములో చూడగలము తద్వారా మొదటి రోజు
మూడువేల మంది చేర్చబడినట్లు కూడా చూడగలము! ఆ రోజు దేవుని ఉధ్యానవనము
అనబడే సంఘము మీద వ్యాపించి అపోస్టులలను శక్తివంతులుగా మార్చి భూమి దిగంతములవరకు తిరుగుతూ
శ్రమలను శోధనలను చివరికి మరణమును కూడా తట్టుకునే విధంగా వారిని మార్చి ప్రపంచమంతా సువార్త
సువాసన వెదజల్లుతుంది! కాబట్టి దేవుని ఉధ్యాన వనము అనబడే సంఘము
మీదికి ఉత్తర వాయువు అనబడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి సంఘములో పరిమళము ఇంకా అనేక సూచక
క్రియలు మహత్కార్యాలు జరగడం చూస్తున్నాము! అయితే ఇలాంటి ఉత్తరవాయువు
కలిగిన సంఘము మీదికి వెనువెంటనే దక్షిణ గాలి అనబడే శ్రమలు శోధనలు కూడా వచ్చాయి!
ఇక దక్షణ గాలి అనగా శ్రమలు శోధనలు హింసలు: అదే లూకా
12:25 లో దక్షిణ గాలి వలన వడగాలి వస్తుంది అని కూడా చెప్పారు యేసుక్రీస్తుప్రభులవారు!! ఆపో 2 వ అధ్యాయములో
ఉత్తరవాయువు అనబడే పరిశుద్ధాత్మ వ్రాలి చల్లదనము కలిగిస్తే ఆపో 4 వ అధ్యాయము నుండి దక్షిణ వాయువు వ్యాపించడం మొదలుపెట్టింది సంఘము మీదికి భయంకరమైన
శ్రమలు శోధనలు వ్యాపించాయి! ఇక అది 7వ అధ్యాయానికి
దేవుని సంఘమును దేవుని ఉద్యాన వనములో గల చెట్లను నరికేటంతగా మారిపోయింది! యాకోబు గారిని చంపారు, స్టెఫెను గారిని చంపారు!
ఇలా సాగిపోతుండగా సంఘము ప్రపంచ దేశాలకు తరలిపోవడం మొదలుపెట్టారు!
టైటస్ మరియు నీరో అనే రోమా చక్రవర్తులు కొన్ని లక్షలమంది క్రైస్తవులను
ఊచకోత కోసారు ! అయితే నిజానికి సంఘానికి
శ్రమలు శోధనలు వచ్చినా ఇది సార్వత్రిక సంఘానికి మేలు చేసింది! సువార్త వ్యాప్తి కేవలం ఇశ్రాయేలు దేశానికి పరిమితం కాకుండా అది చుట్టుప్రక్కల
దేశాలకే కాకుండా యూరపు ఖండము ఆసియా ఖండము ఆఫ్రికా ఖండము ఇంకా అన్నీ ఖండాలకు వ్యాపించింది!
అదే మన దేశానికి అపోస్టలుడు తోమా గారిద్వారా వచ్చింది! కాబట్టి సంఘములో ఎక్కడైతే ఉత్తరవాయువు వ్యాపించునో అక్కడే దక్షిణ వాయువు కూడా
వ్యాపిస్తుంది! అనగ ఏ సంఘములో పరిశుద్ధాత్మ క్రియలు జరుగుతాయో
ఆ సంఘములోనే శ్రమలు శోధనలు కూడా వస్తాయి!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*87వ భాగము*
*ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ,
వేంచేయుము*
పరమగీతము 4: 16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక.
ప్రియులారా! పరమగీతములను ధ్యానము చేస్తున్నాము. ఇక తరవాత వచనములో 16.ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి
దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన
ఫలముల నతడు భుజించునుగాక అంటున్నారు!
ప్రియులారా! దీనికోసం విభిన్నమైన
అభిప్రాయాలున్నాయి! గనుక అన్నీ చూసుకుందాము! గమనించండి ఈ వచనం నాకు ఎంతో ఇష్టమైన వచనము!
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * *
మరిన్ని
భాగములకు, శీర్షికలకు సంప్రదించండి
Facebook
page “యేసుక్రీస్తు అందరికీ ప్రభువు”,
https://www.facebook.com/share/18KPDoLwfe/
. . . .
https://adhyatmikasandeshalu.blogspot.com/
Website:
ఆధ్యాత్మిక సందేశాలు 👆👆
* * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * *
(గతభాగం తరువాయి)
ఇక చివరిగా నా అభిప్రాయం కూడా చెప్పనీయండి!
ఇది యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడను సూచిస్తుంది!
ఉత్తర వాయువు అనగా నూటికి నూరుపాళ్లు పరిశుద్దాత్మ అభిషేకమే!
దక్షిణ వాయువు తప్పకుండా శ్రమలు శోధనలే!
అయితే
ఇలాంటి పరిస్తితులలో అనగా చివరి రోజులలో సంఘము పరిశుద్దాత్మ పూర్ణులై ప్రభువుకోసం నిలబడి
ఘనమైన కార్యాలు చేస్తున్నప్పుడు సాతాను గాడు వాడి అనుచరులు రెచ్చిపోయి సంఘమును హింసల
పాలు చేస్తున్నప్పుడు (నేడు ప్రపంచమంతా జరుగుతున్న విధముగా) యేసుక్రీస్తుప్రభులవారు
ఈ భూమిమీదకు రాబోతున్నారు! ఎందుకంటే తర్వాత మాట దాని పరిమళములు
వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు
భుజించునుగాక.
ఇంకా
ఇది రాకడ కోసమే అని ఎలా చెప్పగలము అంటే తర్వాత వచనము అనగా 5:1 లో అంటున్నారు 1 నా సహోదరీ, ప్రాణేశ్వరీ,
నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను
చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా,
పానము చేయుడి అంటున్నారు! అనగా ఇక్కడ ఏసయ్య వచ్చేశారు- రెండవ రాకడలో- మధ్యాకాశంలో గొర్రెపిల్ల పెండ్లి విందు జరుగుతుంది అక్కడ!
కాబట్టి ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారు తన ఉద్యానవనమునకు ఏతెంచి తనకు ఇష్టమైన
ఫలములను భుజించడానికి రాబోతున్నారు! అనగా సిద్దపడిన వారిని వాక్యానుసారమైన జీవితం
జీవిస్తూ సాక్షాన్ని కాపాడుకుంటున్న పరిశుద్దంగా పవిత్రంగా జీవిస్తున్న తనకు ఇష్టమైన
వారిని జయజీవితం జీవిస్తున్న పరిశుద్ధులను తన దూతలను పంపించి మేఘాల మీద వారిని తీసుకుని
పోబోతున్నాడు! తనకు ఇష్టమైన వారిని మాత్రమే తీసుకుని పోతాడు!
ఎవరు ఆయనకు ఇస్టమైన వారు? ఆయనకు ఇష్టులుగా జీవించిన
వారు మాత్రమే! ఈలోకపు భోగముల కంటే క్రీస్తు కోసం శ్రమలే ముఖ్యమని
దేవునికోసం నిలబడే వారు ఆయనకు యిష్టము!!!
ఆయనకు ఇష్టులుగా ఉండాలంటే గతంలో హనోకు గారికోసం ధ్యానించేటప్పుడు మొదటగా విశ్వాసం
కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి
యుండాలని, మన మాటలు దేవున్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని,
ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి
మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా,
ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,
పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన
కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా
నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవునికి ఇష్టులుగా
జీవించగలము!
ఇక్కడ పౌలుగారు ఇంకా స్పష్టముగా దేవునికి
ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి
మీరును పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45;
20:26; 21:8;
అంతే తప్ప నన్ను కేవలం నమ్ముకో!
కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, ఆ తరువాత నీవెలా
ఉన్నా పర్వాలేదు. వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోక రాజ్యము ఇచ్చేస్తానని దేవుడు చెప్పలేదు.
మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక
మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును
ఉంటారు.
అదే
విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో
1. యెహోవా, నీ గుడారములో అతిథిగా
ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా
నిజము పలుకువాడే. . . . .
ఇంకా అంటున్నారు కీర్తన 24: 3 యెహోవా
పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము
చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే..
ఇంకా అంటున్నారు ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది
ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ సహోదరీ/
సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన
జీవితం. నీ డబ్బులు, ఇంకా మరేదో ఆశించడం
లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు మందిరమైపోవాలి,. ఆ మందిరములో దేవుడు నిత్యమూ
ఉండాలని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్దమైన జీవితం జీవిస్తావో,
అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో
ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు
పరిశుద్దముగా జీవిస్తే దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు
ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించినట్లు దేవుడే
దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ నివాసం
చేస్తారు.
కాబట్టి ఎవరైతే ఆయనకు ఇష్టులుగా జీవిస్తారో ఒకరోజు ప్రియుడు తన ఉద్యాన వనమనే
సంఘమునకు ఏతెంచి తనకు ఇష్టులుగా జీవించిన వారిని తనతోపాటు నిరంతరము ఉండేలాగా తీసుకుని
పోతారు! యోహాను
14: 2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల
మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో
మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
కాబట్టి ప్రియ దైవజనమా! నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం జీవించు!
సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం,
పేరుకు తగ్గట్టు జీవించు! అప్పుడు దేవుడు నీతో
అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు!
మరి
నీవు సిద్ధమా?
ప్రియులారా! జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరవాయువు
దక్షిణ వాయువు ఒకేసారి ఉద్యానవనము పై వీస్తే ఆ ఉద్యానవనము ఉంటుందా? నిజానికి సర్వనాశనం అవుతుంది. నేను సముద్రాలలో గత
27 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కనుక నాకు తెలుసు! రెండు వేర్వేరు గాలులు ఒకేసారి వీస్తే అక్కడ ప్రళయమే ఉంటుంది! మరి ఇక్కడ ఉత్తరవాయువును దక్షిణ వాయువును ఒకేసారి పిలుస్తున్నారేమిటి?
గాని నిజానికి రెండు ఒకేసారి వీస్తే ఏమవుతుందో తెలుసా? (దైవసేవకులు demonstrate చేయాల్సింది ఏమిటంటే ఒకే ఎత్తు
ఒకే బలమున్న ఇద్దరు యవ్వనస్తులను పిలవండి.
ఒక స్టూల్ మీద తేలికగా ఉన్న ఒక పేపర్ పెట్టండి. ఇప్పుడు ఇద్దరినీ ఒకరికి ఎదురుగా ఒకరిని పెట్టి ఇద్దరు ఆ పేపర్ మీదకు ఒకే ఎత్తులో నిలబడి ఒకేసారి
కనీసం నాలుగు సెకన్ల పాటు గాలిని ఆ పేపరు మీదకు ఊడమని చెప్పండి. ఇప్పుడు ఆ పేపర్ ఏమవుతుందో తెలుసా? క్రిందపడిపోతుంది
అనుకుంటారేమో? అది పైకి ఎగురుతుంది. ఎంతసేపు
ఊడుతూ ఉంటే అంతసేపు అది గాలిలోనే పైపైకి ఎగురుతూ ఉంటుంది) ఇది
ఒక దైవజనుడు నాకు demonstrate చేసి చూపించాడు. నేను కూడా సంఘములో చేసి చూపించాను! నిజానికి సరిగ్గా
ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు సంఘములో బలంగా పనిచేస్తూ
ఉంటాడో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరుగుతూ ఉంటాయో
అక్కడ శ్రమలు శోధనలు అంతే బలంగా ఉంటాయి. అప్పుడు మొదటగా అక్కడ
జరిగే స్తుతి గాని, ప్రార్ధన గాని, ఆరాదన
గాని దూపములా దేవుని సన్నిధికి తిన్నగా ఎగిరి పోతుంది!
రెండవదిగా అంత్యదినాలలో కూడా ఇదే జరుగుతుంది. నేడు ప్రపంచములో
ఎక్కడ చూసినా సువార్తకు విరుద్దంగా శ్రమలు శోధనలు పెరిగిపోయాయి! అదే సమయంలో పరిశుద్దాత్మ కార్యాలు కూడా విరివిగా జరుగుతున్నాయి. అతి కొద్ది రోజులలో బూర మ్రోగ బోతుంది. అప్పుడు శ్రమలకు శోధనలకు గురైన సంఘము
పరిశుద్ధాత్మునితో పాటుగా మధ్యకాశం నాకు ఎగిరిపోతుంది! ఇదే జరుగబోతుంది.
అందుకే రెండు వాయువులను ఒకేసారి పిలుస్తున్నారు ఇక్కడ! మరి ఆ క్షణంలో నీవు ఎత్తబడటానికి సిద్దంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా!!!
దైవాశీస్సులు!
# # # #
# # # # # # # # # # # # # # #
📢
గమనిక: ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని
ఆశిస్తున్నాము. కంటెంట్
లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో
పాలిభాగస్తులు కాగలరు. వందనములు!!
✍️ ఇట్లు మీ సహోదరుడు
బ్రదర్. రాజకుమార్ దోనె
📧
Email: rajkumardone@gmail.com

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి