దైవజనుడా
*దైవజనుడా!*
*మొదటి భాగం*
*ఉపోద్ఘాతము-1*
1తిమోతి 6: 11
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక
సందేశాలు-7
లో భాగంగా మరోసారి మరో శీర్షికతో మిమ్మును కలవడము ఎంతో ఆనందముగా ఉంది.
ఇట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి హృదయపూర్వక వందనాలు స్తుతులు
చెల్లిస్తున్నాము! రోమా పత్రిక ధ్యానములు వ్రాసే రోజులలో ఒకరోజు నా అనుదిన
వాక్యధ్యానములో భాగంగా తిమోతి పత్రిక చదువుతుండగా మీద ఉదాహరించిన 1తిమోతి 6:11
వచనం దగ్గర పరిశుద్ధాత్ముడు నన్ను ఆపి,
నా హృదయంలో కొన్ని ఆలోచనలు పెట్టి,
వీటికోసం వ్రాయమని చెప్పారు. వెంటనే నేను రెండురోజులు రోమా పత్రిక
ధ్యానములు ఆపి దైవజనుడా అనే ఈ శీర్షిక కోసం స్టడీ చేయడం జరిగింది. ఆ
తర్వాత తొందరగా రోమా పత్రిక ధ్యానములు ముగించి దీనిని
ప్రారంభిస్తున్నాను.
*ఉపోద్ఘాతము- నేపధ్యం*
ఇక ఈ అపోస్తలుడైన పౌలుగారు వ్రాసిన రెండు తిమోతి పత్రికలు, తీతుకు పత్రిక ఎప్పుడు,
ఎలా, ఎవరి కోసం,
ఎట్టి పరిస్తితులలో వ్రాయబడ్డాయో నేపధ్యం తెలిస్తే మనము ఈ పత్రికలు బాగా
అర్ధం చేసుకోగలం కాబట్టి కొద్దిగా నేపద్యం తెలుసుకుందాం! ఈ రెండు తిమోతి
పత్రికలు,
తీతుకు పత్రిక ఈ మూడింటిని బైబిల్ పండితులు పాస్త్రాల్ ఎపిస్తల్స్
(Pastoral Epistles or Pastoral Letters)అంటారు. అనగా ఒక దైవసేవకుడు,
సంఘకాపరి సంఘంలో ఎలానడుచుకోవాలో నియమనిబంధనలు గల పత్రికలు ఇవి! మా
షిప్పింగ్ టర్మ్స్ లో వీటిని (charge) Handing Over Notes
అంటారు. అనగా తన పదవి విరమణ ముందుగా ఒక సంస్త లేదా ఆఫీస్ యొక్క ప్రస్తుత
స్తితి, ఏమి ఉన్నాయి, ఏమి లేవు,
ఏఏ సమస్యలున్నాయో మనకు బదులుగా వచ్చేడివారికి ఇబ్బందిలేకుండా
డాక్యుమెంటరీగా తెలియజేయడం! అదే సమయంలో ప్రస్తుతం పాటిస్తున్న నియమ
నిబంధనలు కూడా తెలియజేయడం! ఇక్కడ పౌలుగారు తను చనిపోయే సమయం
ఆసన్నమయ్యింది అని ఆత్మద్వారా తెలిసికొని తను ఇంతవరకు స్తాపించిన సంఘాలలో
కొందరిని పెద్దలుగా ఉంచి, ముఖ్యమైన సంఘాల బాధ్యత తిమోతికి అప్పగిస్తూ,
మరో సంఘం తీతుకు అప్పగిస్తూ ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో చెబుతున్న
చార్జి అప్పగింత నోటీసులు ఇవి! ఇవి క్రైస్తవ సంఘాలకు ఎంతో తలమానికమైనవి
ముఖ్యంగా క్రొత్తగా సేవకు వచ్చిన వారికి ఎంతో ఉపయోగపడే విషయాలు వ్రాశారు
పౌలుగారు!
అయతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: ఇలాంటి
Handing over notes
బైబిల్లో ఇంకా రెండు ఉన్నాయి. మొదటిది దైవజనుడైన మోషేగారు దైవాజ్న
మేరకు చార్జి యెహోషువా గారికి అప్పగించినప్పుడు ఒక అప్పగింత పత్రముంది.
ద్వితీయోప 31;
అలాగే దైవజనుడైన దావీదుగారు సొలోమోను గారికి చార్జి ఇచ్చేటప్పుడు మరో
అప్పగింత పత్రముంది. 1రాజులు 2:1--11
ఈ రెండు పత్రాలు ప్రకారం,
ఇంకా దేవుడిచ్చిన అప్పగింత పత్రం యెహోషువా 1:1—9
జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు విషయాలు మనకు క్షుణ్ణంగా
అర్ధమవుతాయి.
మొదటిది: నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండాలి.
రెండు: మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం కుడికి గాని ఎడుమకు గాని తిరుగకుండా
దానిని పాటించాలి.
గమనించారా?
మొదటగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి కారణం వారు చేసేది సామాన్యమైన పని
కాదు. దైవకార్యాలు చేయాలి. అప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు కలుగుతాయి కాబట్టి
నిబ్బరంగా ఉండి,
ధైర్యంతో దేవునిమీద విశ్వాసంతో ముందుకు సాగిపోతే దేవుడు వారికి సహాయం
చేస్తారు. అప్పుడు వారు ఎన్నెన్నో ఘనమైన గొప్ప కార్యాలు చేయగలరు!
ఇక రెండవది దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం అనగా దేవుని ఆజ్ఞలను
అనుదినం చదివి వాటి ప్రకారమే జీవించాలి. తీసుకున్న ఏ నిర్ణయమైన సరే,
అది ధర్మశాస్త్ర అనుకూలంగా లేక వాక్యానుసారంగా ఉండాలి.
ప్రియ దైవసేవకుడా! కాపరీ! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని నీ
చేతిలో పెట్టి ఆ చిన్నమంద యొక్క చార్జి నీ చేతిలో పెట్టారు. మరి ఇప్పుడు నీవు
సంఘాన్ని ఎలా చూసుకుంటున్నావు? సంఘాన్ని మేపుతున్నావా లేక సంఘాన్ని ఏలుతున్నావా?
సంఘాన్ని పోషిస్తున్నావా లేక క్రొవ్విన వాటిని భక్షిస్తున్నావా?
దైవసేవలో ఎదురైన ఆటంకాలకు బెదిరిపోతున్నావా లేక నిబ్బరం కలిగి ధైర్యంగా
ఎదుర్కొంటున్నావా?
మరి దేవుడిచ్చిన చివరి ఆజ్ఞ మరియు కమిషన్: మీరు సర్వలోకానికి వెళ్లి
సర్వసృష్టికి సువార్తను ప్రకటించి, శిష్యులనుగా చేయమన్నారు కదా! మార్కు 16:15-17;
మరి సువార్తను ప్రకటిస్తున్నావా?
లేక సంఘం దొరికింది కదా భత్యం గడిచిపోతుంది కదా అని ఊరుకుంటున్నావా?
ప్రియ స్నేహితుడా! చదువరీ! దేవునిసేవను ధైర్యంగా చేద్దాం!
నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం!
ఆయన చెప్పినట్లు వాక్యానుసారంగా జీవిస్తూ ఆన సేవలో సాగిపోదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మన అందరికీ దయచేయును గాక!
ఆమెన్!
(ఇంకాఉంది)
*దైవజనుడా!-- రెండవ భాగం*
*ఉపోద్ఘాతము-2*
1తిమోతి 6:11 ...
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).
ప్రియులారా! మనం దైవజనుడా శీర్షికలో ఈ pastrol epistels
రాయడానికి నేపద్యం చూసుకుంటున్నాము.
*తిమోతి*
ఈరోజు మొదటగా అసలు తిమోతి ఎవరు అనేది చూసుకుందాం! మొదటగా ఈ తిమోతి గారు
అపోస్తలుల కార్యములు 16:1
లో కనిపిస్తారు. ఆయన తల్లిపేరు యూనికే (యూనిస్),
అవ్వ లూయీ. వీరిద్దరూ ఎంతో దైవభక్తి కలవారు అని పౌలుగారు సర్టిఫై
చేస్తున్నారు. 2తిమోతి 1:5;
ఇక అతని తండ్రి గ్రీకువాడు,
తల్లి యూదురాలు! ఇక బైబిల్ పండితుల ప్రకారం పౌలుగారి మొదటి మిషనరీ యాత్రలో
భాగంగా లుస్త్రను దర్శించినప్పుడు తిమోతిగారు రక్షించబడతారు. లుస్త్ర అనగా
తుర్కుమెన్లు నివసించే ప్రస్తుత టర్కీ దేశంలో ఒకపట్టణం! ఇక పౌలుగారి రెండో
మిషనరీ యాత్రలో తనతోపాటు రమ్మని పిలిస్తే సమస్తము విడచి పౌలుగారిని
వెంబడించి, పౌలుగారికి పరిచర్య చేస్తూ,
ఆయన పాదాలదగ్గర వాక్యం నేర్చుకుంటూ,
పౌలుగారి జీవిత విధానాన్ని అతి దగ్గరగా తెలుసుకున్న వ్యక్తి ఈ తిమోతి
గారు. అందుకే నా నిజకుమారుడు,
ప్రియ కుమారుడు అని సంబోధించడం జరిగింది. పౌలుగారికి కుమారుడు లేకపోయినా
ఒక కుమారుడిలా పౌలుగారికి సేవచేసిన వ్యక్తి ఈ తిమోతిగారు.
పౌలుగారితో పాటు అనేక ప్రాంతాలలో సేవచేశారు. ప్రుగియ, గలతీయ, త్రోయా,
మైసియా, ఫిలిప్పీ,
బెరయ ప్రాంతాలలో సేవచేశారు . ఇంకా ఎథెన్స్,
థెస్సలోనికయ సంఘాలలో కూడా పరిచర్య చేసారు. ఇంకా కొరింతు పట్టణంలో, ఎఫెసీ సంఘంలో, మాసిదోనియా,
చిన్న ఆసియా లోకూడా పౌలుగారితో కూడా సేవచేయడం జరిగింది. ఇంకా పౌలుగారు చెరలో
ఉన్నప్పుడు సాక్షి! పౌలుగారు దెబ్బలు తింటే ఆయనతోపాటు కొన్నిసార్లు దెబ్బలు
తిన్నారు. ఆయనకు కలిగిన అవమానాలు తిమోతిగారికి కూడా కలిగాయి. పౌలుగారికి
వచ్చిన సన్మానాలు ఈయనకు కూడా కలిగాయి. ఆయన ఏమితింటే ఈయణ కూడా తిన్నారు. అవి
పంచభక్ష పరమాన్నాలు అయినా (మన భాషలో బిరియానీలు అయినా గంజి మెతుకులు
అయినా),
తిట్లు శాపనార్ధాలు అయినా దెబ్బలు అయినా ఎవైనా తిన్నారు. కష్టాలు
ఓర్చుకున్నారు. అలా చేసిచేసి ఆయనకు పరిచర్య చేస్తూ వాక్యానుభావం,
ప్రార్దానానుభవం నేర్చుకున్నారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,
వృద్దులతో ఎలా ఉండాలి,
యవ్వనస్తులతో ఎలా ఉండాలి అనేది పౌలుగారిని దగ్గరగా గమనిస్తూ మోషేగారికి
యెహోషువా సేవచేసి నాయకత్వ్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్లు తిమోతిగారు
కూడా పౌలుగారి దగ్గర నేర్చుకున్నారు. పౌలుగారి రెండవ మిషనరీ యాత్రలో చాలా
వరకు ఆయననే వెంబడించారు.
చివరకు మొదటగా ఎఫెసీ సంఘభాద్యతలు అప్పగించారు పౌలుగారు. అనగా ఎఫెసీ
సంఘానికి బిషప్ గా నియమించారు. కొలస్సీ పత్రికధ్యానంలో ఈ ఎఫెసీ సంఘంకోసం
సవివరంగా వివరించడం జరిగింది కాబట్టి నేను ఆ సంఘం కోసం వ్రాయడం లేదు. మన
భారతదేశంలో తిరుపతి ఎలాగో ఆ దేశాలలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఎఫెసీ దేవత
అయిన అర్తేమీదేవి. అక్కడ గుడిక్రింద
1000 గదులు ఉండేవి అట,
వాటినిండా వేశ్యలు ఉండేవారు. ఇష్టమైనట్లు వ్యభిచారం చేసేవారు. అందుకే ఆ
గుడి ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చుకుంది అంటారు.
చివరకు పౌలుగారి రెండు సంవత్సరాల సేవా పరిచర్య ఫలితంగా అనేకులు
రక్షించబడ్డారు అక్కడ! చివరకు చాలా విషయాలు జరిగాయి. వాటిని ఇప్పుడు
చెప్పడం లేదు. సంఘం లోకాన్ని వెలివేసింది. చివరకు లోకస్తులు ఆడిన
బేరసారాలతో చివరకు లోకమే సంఘంలోకి వచ్చేస్తుంది. అందుకే చివరకు కొరడా
జులిపించినట్లు ఎఫెసీ పత్రిక వ్రాయడం జరిగింది పౌలుగారు. చివరకు సంఘం
మరలా యధాస్తితికి వచ్చింది.
*ఇంతకీ ఈ ఉత్తరం వ్రాయడానికి కారణం ఏమిటి*?
చివరకు పౌలుగారు నాల్గవ మిషనరీ యాత్ర మొదట్లో యేరూషలేములో బంధింపబడి
చిట్టచివరకు రోమా పట్టణంలో రెండు సంవత్సారాలు గృహనిర్భందంలో ఉంటారు. అక్కడ కూడా
కొన్ని రోజులు పరిచర్య చేశారు తిమోతిగారు. అయితే బైబిల్ పండితుల ప్రకారం
అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం తర్వాత పౌలుగారు మొదటసారి విడుదల చేయబడతారు. అప్పుడు తన నాల్గవ
మిషనరీ ప్రయాణం ప్రారంబిస్తారు. అలా మాసిదోనియ నగరం వస్తారు. అప్పుడు
పౌలుగారు తన నిర్గమనం దగ్గర పడింది అని ఆత్మద్వారా గ్రహించి ఈ ఉత్తరం
వ్రాసారు. అయితే ఆ తర్వాత మరల పౌలుగారు బంధించబడతారు! అప్పుడు ఇక తను
తిమోతిని కలవడం జరుగదు అని తలంచి చెరసాల నుండి రెండవ పత్రిక రాశారు.
*ఎప్పుడు ఎక్కడ రాశారు*?
మొదటి పత్రిక క్రీ.శ.
6౩-64
ల మధ్య మాసిడోనియా పట్టణం నుండి రాశారు. రెండవది రోమా చెరసాల నుండి సుమారు
క్రీ.శ. 64-65ల మధ్య వ్రాశారు.
*ఎందుకు రాశారు*?
1తిమోతి మొదటి అధ్యాయం ప్రకారం... తప్పుడుబోధకులను, తప్పుడుబోధలను ఖండించమని,
ఇంకా సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి యోగ్యులైన వారిని పెద్దలగాను, పరిచారకులనుగాను నియమించమని ,
అయితే పరిచారకులు,
పెద్దలు ఎలాంటివారిని నియమించాలి అనే వాటికోసం పౌలుగారు హెచ్చరిస్తూ
రాస్తున్నారు.
చివరకు ఆయన రాసిన పత్రిక ప్రకారం తిమోతిగారు జీవించి, అదే పట్టణంలో సుమారుగా 80
సంవత్సరాల వయస్సులో అదే ఎఫెసీ పట్టణంలో అదే డయానా దేవత (అర్తేమీ) భక్తులచేత
రాళ్ళు రువ్వగా చనిపోయారు. నేను క్రీస్తును పోలి నడచుకున్నట్లు మీరును
నన్నుపోలి నడుచుకోండి, ఇంకా నన్ను పోలి తిమోతి నడచుకో అని తన గురువుగారు,
మెంటర్ చెప్పినట్లే తిమోతిగారు కూడా,
పౌలుగారు క్రీస్తుకోసం హతస్సాక్షి అయినట్లు ఈయన కూడా హతస్సాక్షి
అయ్యారు.
(ఇంకాఉంది)
*దైవజనుడా!--మూడవ భాగం*
*ఉపోద్ఘాతము-౩*
1తిమోతి 6:11 ...
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).
*తీతు*
చరిత్ర ప్రకారం తీతు అంతియొకయ పట్టణానికి చెందిన ఒక గ్రీకువాడు. గ్రీకు
వేదాంత,
తత్వ శాస్త్రాలలో- పాండిత్యంలో డాక్టరేట్ తీసుకున్నారు. అయితే అంతియొకయ
పట్టణంలో పౌలుగారు గారు,
బర్నబా గారు పరిచర్య చేసేటప్పుడు రక్షించబడ్డారు. ఆ తర్వాత తనతోపాటు
అనేకచోట్ల పరిచర్యలో పాల్గొన్నారు. కారణం ఈయన పండితుడు కాబట్టి ఆ గ్రీకు
ప్రాంతంలో చాలా భాషలు గల ప్రజలమధ్య పౌలుగారు పరిచర్య చేసేటప్పుడు
పౌలుగారికి ఒక తర్జుమా చేసేవాడిగా పనిచేశారు. ఆ తర్వాత పౌలుగారికి ఒక
సెక్రటరీగా పనిచేశారు. గమనించాలి తిమోతిగారు ఒక కొడుకులా, సేవకుడిలా పౌలుగారికి పరిచర్య చేస్తే,
తీతుగారు ఒక సెక్రటరీగా,
ఒక భాష తర్జుమాచేసే వాడుగా తనతోపాటు పనిచేశారు. చరిత్ర ప్రకారం, బైబిల్ పండితుల ప్రకారం AD 49
నుండి పౌలుగారితో కలసి పరిచర్య చేశారు. చివరకు తనతోపాటుగా యేరూషలేముకూడా
తీసుకుని వెళ్లి సంఘానికి పరిచయం చేశారు పౌలుగారు.
AD 56లో పౌలుగారు చిన్న ఆసియాలో పరిచర్య చేస్తున్నప్పుడు కొరింథీ సంఘం యొక్క
బ్రష్టమైన బ్రతుకుకోసం విని, అనేకరోజులు విలపించి,
చాలా వేదనతో బాధతో ఉండి,
అక్కడ పరిచర్య చేయలేక ఎఫెసీ పట్టణంలో ఉపవాసం చేసి,
కొరింథీయులకు వ్రాసిన మొదటిపత్రికను వ్రాసి,
తీతుతో పంపి సంఘాన్ని సరిచెయ్యమని పంపుతారు. కారణం తీతుగారు యోగ్యుడు అని
తెలిసి పంపారు.
తీతుగారు ఇచ్చిన పనిని ఎంతో ధైర్యంగా ఓర్పుగా నెరవేర్చి , ఖండించి, గద్దించి,
బుద్ధిచెప్పి తిరిగి సంతోషకరమైన సువర్తమానం తీసుకుని వెళ్తారు. అప్పుడు
పౌలుగారు మాసిదోనియా పట్టణంలో సేవ చేస్తున్నారు. అప్పుడు సంతోషంతో రెండవ
కొరింథీయులకు వ్రాసిన పత్రికను వ్రాసి ,
మరలా అదే తీతుగారితో ఈ ఉత్తరం పంపిస్తారు. అక్కడ కొన్ని సంవత్సారాలు ఉన్న
తర్వాత పౌలుగారు కొరింథీ పట్టణానికి వస్తారు. కొన్ని రోజుల తర్వాత పౌలుగారు
తీతుగారిని తన సేవచేసిన ప్రాంతాలలో నుండి శ్రమలలో ఉన్న సంఘానికి,
పరిశుద్దులకు అన్యజనులైన సంఘాలు సిద్ధం చేసిన కానుకను తీసుకుని రమ్మని
చాలా సంఘాలకు పంపించి,
మొత్తం అన్ని సంఘాల కానుకలను పట్టుకుని యేరూషలేము వెళ్లి అక్కడ ఇవ్వడం
జరిగింది. ఈ రకంగా ఒకశాంతి దూతగా,
ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వాక్యానుసారంగా పరిష్కరించడానికి
పౌలుగారిచేత పంపబడేవారు ఈ తీతుగారు.
ఇక పౌలుగారు నాల్గో మిషనరీ యాత్రలో బందింపబడి రోమా చెరనుండి మొదటి సారి
విడిపింప బడినప్పుడు నాల్గవ మిషనరీయాత్రను ప్రారంబిస్తారు. రోమా పత్రికలో ఆయన
ఆశను వెల్లడించారు ఏమిటంటే రోమాలోను,
స్పెయిన్ లోను ఆయన సువార్తను ప్రకటించాలి అనే ఆశ ఆయనది. అదే విధంగా చిన్న
ఆసియా, మాసిదోనియా మీదుగా స్పెయిన్ వెళ్ళాలి అని తలచి,
మాసిదోనియా వచ్చి,
అక్కడనుండి క్రేతుకు వస్తారు. క్రేతు అంటే మధ్యధరా సముద్రంలో ఉన్న నాల్గో
పెద్ద దీవి అన్నమాట! వారు పెద్ద మూర్కులు! అక్కడ వారిద్దరూ సేవ చేశారు.
అయితే ఇతర సంఘాలనుండి వార్తలు వచ్చాయి,
అబద్దబోధకుల ద్వారా సమస్యలు వచ్చాయి అని. వెంటనే పౌలుగారు తీతుగారికి
చార్జి అప్పగించి,
మిగిలిన పనిని పూర్తిచేసి పెద్దలను నియమించి రమ్మని అప్పగించి తిరిగి తనను
నీకోపోలిలో కలుసుకోమని చెప్పి ఇతర సంఘాలకు వెళ్ళిపోయారు. తీతుకు 1:5; 2:15; ౩:12—13;
ఆ తర్వాత పౌలుగారిని కలిసారో లేదో తెలియదు. గాని బైబిల్ ప్రకారం చరిత్ర
ప్రకారం తీతుగారు దల్మనూతా (Dalmatia)
అనగా ప్రస్తుతం క్రొయేషియ దేశం)లో సేవచేసినట్టు గమనించవచ్చు!
*ఈ పత్రిక ఎప్పుడు, ఎక్కడ,
ఎందుకు రాశారు*?
పౌలుగారు రోమా చెరనుండి మొదటసారి విడుదల అయిన తర్వాత నాల్గవ మిషనరీ యాత్రలో
మాసిడోనియాలో ఉండగా ఇక తీతుగారిని కలవడం అసాధ్యం అని తెలిసి ఈ పత్రిక సుమారు
క్రీ.శ. 64-65ల మధ్య రాసి అపోల్లో,
జేనా (యూనస్) లతో పంపించారు.
*నేపధ్యం* ఏమిటంటే:
తిమోతి పత్రిక లాగానే అబద్దబోధకుల బోధను ఖండించమని, పెద్దలను నియమించమని,
వారు ఎలాంటి లక్షణాలు కలిగి యుండాలో చెబుతూ క్రేతు సంఘం లాంటి సంఘాల
చార్జి అప్పగిస్తూ ఈ పత్రిక రాశారు.
*తీతు గారి సేవ- మరియు మరణం:*
పౌలుగారు హతస్సాక్షి అయిన తర్వాత మరలా క్రేతుకు వచ్చి సేవ చేసారు. క్రొయేషియ
తర్వాత మరల క్రేతుకు చెందిన గోర్తైన అనే పట్టణంలో సేవ చేసారు. ఎఫెసీ పట్టణస్తుల
మాదిరిగా వీరుకూడా అర్తేమీ దేవి (డయానా)ని పూజించేవారు. ఒకసారి పట్టణంలో ఒక
పండుగ సమయంలో పట్టణం మధ్య బోధిస్తుంటే ఆ విగ్రహాల వలన ప్రయోజనం లేదు అని చెబుతూ
ప్రార్ధన చేయగా ఆ అర్తేమీ దేవి విగ్రహం గుడితోపాటు కూలిపోయి తునాతునకలై పోయింది
అని చెబుతారు! అప్పుడు అనేకులు రక్షించబడతారు. చివరకు 97 సంవత్సారాల వయస్సు వరకు అక్కడే సేవచేసి,
నిండు వృద్ధాప్యమందు శాంతిగా చనిపోయారు. మంచిపోరాటం పోరాడి ప్రజలతో ఘనుడు
అని కీర్తించబడి, క్రీస్తును పోలి జీవించి మంచి మరణం పొందారు.
నీవు నేను కూడా క్రీస్తుకై అటువంటి సేవచేసి క్రీస్తుకు సాక్షులుగా అవసరమైతే
హతస్సాక్షులుగా జీవించెదము గాక!
ఆమెన్!
*దైవజనుడా! - నాల్గవ భాగం*
*విసర్జించవలసినవి-1*
1తిమోతి 6:11 ...
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము).
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం ఈ పత్రికల యొక్క నేపధ్యం చూసుకున్నాం. ఇక ఈ
వచనంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపోమ్ము అంటున్నారు పౌలుగారు.
వేటిని విసర్జించమని చెబుతున్నారు?
అనగా ఈ పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి ఈ వచనం వరకు వేటివిషయమై రాశారో
అవన్నీ విసర్జించడమే కాదు దూరంగా పారిపో అని చెబుతున్నారు. వాటిని
విసర్జించి, నీతిని, భక్తిని,
విశ్వాసమును,
ప్రేమను ఓర్పును,
సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము! ప్రియులారా ఈ
సంపాదించుకోవలసినవి –
హత్తుకోవలసిన విషయాలు ధ్యానం చేసేటప్పుడు చూసుకుందాం. అయితే 1:1--- 6:10
వరకు వ్రాసిన వాటిలో విసర్జించవలసినవి విడచిపెట్టి దైవజనుడా
హత్తుకోవలసినవి మొదటగా నీతిని, తర్వాత భక్తిని,
విశ్వాసమును, ప్రేమను,
ఓర్పును సాత్వికమును సంపాదించాలి అని చెబుతున్నారు పౌలుగారు.
ఇక ఈ రోజు విసర్జించవలసిన విషయం: *1తిమోతి 1:౩ సత్యమునకు భిన్నమైన భోధ చేయకూడదు, కల్పనాకధలు,
మితములేని వంశావలుల జోలికి పోకూడదు*.
ఉపోద్ఘాతములో వివరించిన విధముగా పౌలుగారు ఈ పత్రిక వ్రాయడానికి కారణం సంఘాలు
విస్తరించి సంఘాలలో క్రమ శిక్షణ గాడి తప్పింది, సత్ప్రవర్తన క్రమం,
నాయకత్వపు లక్షణాలు అనేవి లోపించాయి. అదే సమయంలో కొందరు దుర్భోదకులు అబద్ద
బోధకులు తప్పుడుబోదలు చెయ్యడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని మీరు
రక్షించబడి బాప్తిస్మం పొందిన మీ పాత ఆచారాలు వదిలేయ్యవలసిన అవసరం లేదు.
అని కొందరు,
ఇక ఆ ఎఫెసీ పట్టణ అన్యజనులు మీ భక్తీ మీరు చేసుకోండి,
మా భక్తీ మీము చేసుకుంటాము గాని మనం మనం బంధువులము ఒకే ఊరివారం కాబట్టి మా
వేడుకలలో మీరు పాలుపంచుకోండి, మీ పండుగలకు మేము వస్తాము,
అని చెబుతూ వారిని ఆకర్షించి ,
చివరకు లోకము సంఘంలోనికి ప్రవేశించి,
అన్యాచారాలు క్రైస్తావాచారాలుగా మారిపోయాయి. ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే
బోధను అనేక సంఘాలు పాటిస్తున్నాయి. దానికి వారు చెప్పే సాకులు-మనం
బారతీయులం కాబట్టి మనం తాళి తీయకూడదు, వాస్తును పాటిద్దాం,
ఇంకా హైందవ ఆచారాలు ముఖ్యంగా వివాహ సమయంలో,
గృహానికి సంబందించిన విషయాలలో మనలో చాలామంది ఆ పాతరోత ఆచారాలను వదలలేక
పోతున్నారు.
ఇక మరో ఆచారం- మీరు బాప్తిస్మం తీసుకున్నా సరే మీరు సున్నతిని పొందాలని
కొందరు,
గ్నోనోమిస్ట్లు కొందరు ఇలా రకరకాల సిద్దాంతాలు బోదిస్తూ ఆ సంఘాలను
పాడుచేస్తున్నారు. అప్పుడు ఈ పత్రికను వ్రాసారు పౌలుగారు.
ఇక్కడ ఈ వచనంలో సత్యమునకు భిన్నమైన బోధచెయ్యొద్దు ,
అలా చేసేవారిని అలా చెయ్యవద్దు అని ఆజ్ఞాపించమని చెబుతున్నారు పౌలుగారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ వచనం ద్వారా దైవసేవకులకు ఒక ఆజ్ఞ, ఒక అధికారం,
ఒక హెచ్చరిక కనిపిస్తున్నాయి. ఆజ్ఞ ఏమిటంటే: సత్యానికి భిన్నమైన బోధలు అనగా బైబిల్ కు వ్యతిరేఖమైన బోధలు చెయ్యకూడదు.
బైబిల్ లో వ్రాయబడిన విషయాలను కలిపి చెరపకూడదు. ఇక అధికారం ఏమిటంటే: అలా సత్యానికి వ్యతిరేఖంగా బోధించేవారిని అలా చెయ్యకూడదు అని
ఆజ్ఞాపించడమే కాకుండా వారిని ఆపే అధికారం ఈ వచనం ద్వారా బైబిల్ మనకు అనగా
దైవసేవకులకు ఉంది! అందుకే మరో దగ్గర భక్తుడు రాస్తున్నారు అలా సత్యానికి
వ్యతిరేఖంగా బోధించేవారిని చేర్చుకోవద్దు. వారికి వందనం కూడా చెయ్యొద్దు
అంటున్నారు. బైబిల్ లో వ్రాయబడిన విషయాలను నమ్మవలసిన బాధ్యత,
పాటించవలసిన భాద్యత ప్రతీ క్రైస్తవునికి ఉంది.
ఇక బైబిల్ వ్రాయబడిన సత్యాలు ఉన్నవి ఉన్నట్లుగా బోధించవలసిన బాధ్యత
సంఘకాపరికి, దైవజనుడికి ఉంది. 4:6.
ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు
క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవైయుందువు.
...
వారిని సరి చెయ్యవలసిన భాద్యత మరియు అధికారం కూడా ఉంది
2తిమోతి 3:16,17
16.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
ఉపదేశించుటకును,
17. ఖండించుటకును,
తప్పు దిద్దుటకును,
నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.
2తిమోతి 4:2,3,4
2. వాక్యమును ప్రకటించుము;
సమయమందును అసమయమందును ప్రయాసపడుము;
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము
బుద్ధిచెప్పుము.
3.
ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక,
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు
పోగుచేసికొని,
4.
సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును. ..... కారణం ప్రజలు సత్యమునకు వ్యతిరేఖమైన బోధను తొందరగా నమ్ముతున్నారు. కారణం
బైబిల్ ప్రకారం చెయ్యాలంటే చప్పిడి పత్యం లాగ ఉంటుంది. అయితే ఈ భిన్నమైన బోధలు
నీవు ఎలా తిరిగినా పర్వాలేదు. కేవలం ఆదివార్రం చర్చిలోకి వచ్చి కూర్చుంటే చాలు.
నమ్మిబాప్తిస్మం తీసుకుంటే చాలు,
ఆ తర్వాత ఎలా బ్రతికినా పర్వాలేదు అంటూ భిన్నమైన బోధలు చేస్తున్నారు. ఈ
బోధలు వీరికి ఇంపుగా సొంపుగా వినబడుతున్నాయి. వాటినే వారు పాటిస్తున్నారు.
ఆనాడు గలతీయులు కూడా అలాగే చేసారు. వెంటనే పౌలుగారు వారికీ పత్రిక రాశారు
గలతీ 1:6—12.
6.
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి,
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా
నాకాశ్చర్యమగుచున్నది.
7. అది మరియొక సువార్త కాదుగాని,
క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
8.
మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి
వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
9.
మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము;
మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల
వాడు శాపగ్రస్తుడవును గాక.
10.
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను
సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?
నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను
కాకయేపోవుదును.
11. సహోదరులారా,
నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు
తెలియజెప్పుచున్నాను.
12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు,
నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు
లభించినది. ...
ఇంకా ౩:1--౩
1. ఓ అవివేకులైన గలతీయులారా,
మిమ్మును ఎవడు భ్రమపెట్టెను?
సిలువ వేయబడినవాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులయెదుట
ప్రదర్శింపబడెనుగదా!
2. ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను;
ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటవలన
పొందితిరా?
3. మీరింత అవివేకులైతిరా?
మొదట ఆత్మానుసారముగా ఆరంభించి,
యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?
ఇక ఈ వచనం ద్వారా దైవజనులు, కాపరులు,
సంఘపెద్దల భాద్యతను గుర్తుచేస్తున్నారు: వీరి భాద్యత సంఘాన్ని
కనిపెడుతూ,
పై విచారణ కర్తలుగా ఉండాలి. తోడేలులాంటివారు సంఘాన్ని పాడుచేయ్యడానికి
ప్రయత్నం చేస్తున్నారు.
అపో 20:28—31
28.
దేవుడు (అనేక ప్రాచీన ప్రతులలో- ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి
సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు
అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు,
మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.
29.
నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు
తెలియును; వారు మందను కనికరింపరు.
30.
మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు
మీలోనే బయలుదేరుదురు.
31.
కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి
మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని
మెలకువగాఉండుడి. ...
చూసారా వారు ఎక్కడనుండో రారు, వారు మీ మధ్యనే తిరిగుతూ,
మీలోనే ఉంటూ పైనుండి లేక సాతానుగాడి నుండి వచ్చిన ఎంగిలి మెతుకులకు,
డబ్బుకు అమ్ముడుపోయి సత్యానికి భిన్నమైన బోధలు బోధిస్తున్నారు. వీరిని
భక్తుడు దొంగమెట్టలు అంటున్నారు.
యూదా 1: 12
వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు,
తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు (మూలభాషలో- మేపుకొనుచు),
మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు
కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక,
రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
పౌలుగారు పై వచనంలో వీరు తోడేళ్ళు అంటున్నారు. వీరు సంఘాన్ని చీల్చి ముక్కలు
చెయ్యడమే వీరి పని. కపటభోదలు అబద్ద బోధలు చేసి వారి కడుపును నింపుకోవడం
వీరిపని.
రోమా 16:1—18,
పేతురుగారు చెబుతున్నారు 2పేతురు 2:1
మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద
బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు,
తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు,
నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
...
ఇక సంఘస్తులు కోసం కూడా చెబుతున్నారు 2తిమోతి 4:3,4.
ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక,
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు
పోగుచేసికొని,
4.
సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును. ....
కాబట్టి సంఘకాపరులు, దైవసేవకులు,
సంఘపెద్దలు వారు తమ ఆదీనంలో ఉన్న సంఘంలో ఇటువంటి తప్పుడు బోధలకు,
బోధకులకు తావు ఇవ్వకూడదు. వీరిని చేర్చుకోకూడదు.
అలాచేస్తే వీరు విశ్వాస ఘాతులై సంఘానికి తీవ్రమైన నష్టాన్ని
కలుగాజేస్తారు. మొదటి శతాబ్ధంలో ఇలాంటి బోధలు వచ్చినప్పుడు అపోస్తలులు
లేచి,
ఖండించి సంఘాన్ని సరిచేశారు. నేడు కూడా ఇలాంటి బోధలు చాలా వస్తున్నాయి.
నేడు కూడా సంఘకాపరులు, సేవకులు,
సంఘపెద్దలు ఇలాంటి బోధలను తరిమికొట్టాలి.
అబద్ద బోధలు:
దుర్భోధ దావానంలా వ్యాపిస్తుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న
విశ్వాసులు కోకొల్లలు.
▪️యెహోవా సాక్షులు
▪️మొర్మాన్స్
▪️బ్రెన్హ మైట్స్
▪️జాంగిల్ జా
▪️సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
▪️సున్నతి లేకుండా గమ్యం లేదు.
▪️శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; (మత్తయి 24:11)
*నేటిరోజులలో అనేక తప్పుడుబోదలు వచ్చాయి. మనం యెహోవాదేవున్నే పూజించాలి.
యేసుక్రీస్తు దేవుడు కాదు- అని యెహోవా సాక్షులు;
శనివారం నాడే ఆరాధన చెయ్యాలి గాని ఆదివారము నాడు చెయ్యకూడదు అని సెవెంత్
డే వారు, సబ్బాతు ఆరాదికులు,
సంఘానికి తల్లి అంటూ ఒకరు,
మొర్మాన్లు,
ఇంకా ఈనాటి సంఘదూత విలియం మారియన్ బ్రేన్హాం,
ఆయనను ప్రవక్తగా అంగీకరించాలి ఆయన చెప్పిన బోదలు నమ్మాలి అని
మరికొందరు*... ఇలా ఎన్నెన్నో తప్పుడుబోధలు,
తప్పుడు బోధకులు సంఘాన్ని కలవరం చేస్తుండగా ప్రియ దైవజనుడా! ప్రియమైన
సంఘపెద్దలారా! నీ భాద్యతను నీవు విస్మరిస్తున్నావా?
ఇలాంటి వారినుండి నీ సంఘాన్ని నిజమైన బోధలతో సరిచేస్తున్నావా లేదా?
ఇప్పుడు అలాంటి బోదచేసి వారినుండి నీ సంఘాన్ని కాపాడుకో! ముందుగానే
హెచ్చరించు. అలాంటి వారిని చేర్చుకోవద్దు అని మీ సంఘానికి
చెప్పండి.
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*దైవజనుడా!-5వ భాగం*
*విసర్జించవలసినవి-2*
1తిమోతి 1:3,4 ...
3.
నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
4.
విశ్వాస సంబంధమైన దేవుని యేర్పా టుతో(మూలభాషలో-గృహనిర్వాహకత్వముతో) కాక
వివాదములతోనే సంబంధము కలిగి యున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్ట వద్దనియు,
కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన
ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
ఇంకా ఈ వచనంలో మరో ముఖ్యమైన విషయం మొదటి శతాబ్దంలో అపోస్తలులు పెద్దలు
సంఘాన్ని సరిచేశారు అంటే దానికి కారణం విశ్వాసులు వీరికి సంపూర్ణంగా
లోబడ్డారు.
అపోస్త 2:42.
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును,
రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
..
ఇప్పుడు కూడా సంఘం- సంఘకాపరికి,
సేవకులకు,
పెద్దలకు లోబడియుండాలి.
ఇక ఈ వచనంలో రెండో మాట ఏమిటంటే:
*కల్పనాకధలు, మితములేని వంశావలుల జోలికిపోవద్దు*. నేటిరోజులలో చాలామంది బోధకులు పిట్టకదలు,
కల్పనాకధలు ఎక్కువగా చెబుతున్నారు. అయితే ఇలా ఎందుకు చెబుతున్నారు అంటే
సువార్తలలో ఏమని వ్రాయబడింది- ఉపమానం లేకుండా యేసు ఏమీ బోధించలేదు అని
వ్రాయబడింది. అందుకే మేము కూడా ఉపమానాలు చెబుతున్నాం అంటున్నారు. గాని
ఇక్కడ వాక్యం తక్కువ,
పిట్టకధలు నవ్వించడం ఎక్కువైపోతుంది. ప్రజలు వాక్యంకంటే నువ్వు
చెప్పినపిట్టకదలకే ఆకర్షించబడుతున్నారు. దేవునికి రావలసిన మహిమ మీరు
దొంగిలించ వద్దు. గమనించాలి చాలామంది నిజ విశ్వాసులు వాక్యం వినడానికి
వస్తున్నారు గాని మీ పిట్టకధలు వినడానికి కాదు!!! మరికొంతమంది సైన్సు
పాటాలు చెబుతున్నారు మేము జ్ఞానులం అని ప్రజలు చెప్పడానికి. కొలస్సీ పత్రిక
వ్రాయడానికి ముందు కొలస్సీ సంఘంలో కొంతమంది అబద్దబోధకులు మీరు పరలోకం
కావాలంటే వేదాంతశాస్త్రం,
తత్వశాస్త్రం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే గాని మీకు పరలోక మర్మాలు
అర్ధం కావు అంటూ వేదాంతం ,
తత్త్వం బోధించడం మొదలుపెట్టారు. ఈరోజులలో సైన్సు అంటూ ఇంకా రకరకాల బోధలు
చెబుతున్నారు. అందుకే ఇలాంటి బోధలకు దూరంగా ఉండమంటున్నారు పౌలుగారు.
ఇంకా మితములేని వంశావలులు అంటున్నారు. నేటి రోజులలో చాలామంది మత్తయి 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి ఒకలా ఉంది,
లూకా సువార్తలో మరొకలా ఉంది అంటూ ఎన్నో కామెంట్లు చేస్తున్నారు. మత్తయి
సువార్త యోసేపు గారి వంశావళి,
లూకా సువార్త యేసయ్య తల్లి మరియమ్మ వంశావళి. అయినా ప్రజలు భిన్నమైన
సిద్దాంతాలు, వార్తలు,
అనుమానాలు చెబుతూ ఉంటారు. అందుకే
పౌలుగారు రోమా పత్రిక 14:1లో చెబుతున్నారు సంశయములు తీర్చడానికి వాదనలు,
పనికిమాలిన డిస్కషన్ పెట్టుకోవద్దు అంటున్నారు. బైబిల్ లో కొన్ని విషయాలు
అర్ధం చేసుకోవడం కష్టం! కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడని విషయాలు కూడా
కొంతమంది భక్తులు ఎత్తి రాశారు.
ఇంకా కయీనుకు భార్య ఎక్కడనుండి వచ్చింది?
దేవునికుమారులు ఎవరు నరుల కుమారులు ఎవరు?
నెఫీలులు ఎవరు?
ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. వీటికి జవాబు తెలిస్తే చెప్పాలి.
ఇక ఇలాంటి వాటికోసం వ్యర్ధమైన వాదనలు ఎవరితోనూ పెట్టుకోవద్దు
అంటున్నారు.
Dont go beyond the Bible. Better to Stop where Bible Stops.
పౌలుగారు ఏమి చెప్పిన సరియైన కారణాన్ని వివరించి చెబుతున్నారు. ఇక్కడ
వీటికోసం వ్యర్ధంగా ఎందుకు మాట్లాడవద్దు వాదనలు పెట్టుకోవద్దు అంటున్నారు
అంటే తర్వాత వచనం
4..విశ్వాస సంబంధమైన దేవుని యేర్పా టుతో (మూలభాషలో- గృహనిర్వాహకత్వముతో) కాక
వివాదములతోనే సంబంధము కలిగి యున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్ట వద్దనియు,
కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన
ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. .....
వీటిద్వారా మొదటగా దేవునికి మహిమ రాదు. నీ ఆత్మ బలపడదు. సంఘానికి ఏవిధముగాను
పనికిరావు. అవి కేవలం వివాదాలను రేపి,
శత్రుత్వం పెంచుకోడానికే తప్ప మరిదేనికి పనికిరావు. అందుకే అవి వద్దు.
వాటి జోలికి నీవు పోవద్దు,
అలా వెళ్ళేవారిని వారించు. గద్దించు! అనిచెబుతున్నారు పౌలుగారు.
2తిమోతికి 2: 14
వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము
పెట్టుకొనవద్దని,
ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము
చేయుము.
ఇంకా 2తిమోతి 2
అధ్యాయంలో తిమోతిగారికి సూచనలు ఇస్తూ అంటున్నారు నీ యవ్వనేచ్చలనుండి
దూరంగా పారిపో అని చెబుతూ 23—26..
23.
నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని
విసర్జించుము.
24. సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై,
దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును;
25.
అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి
తప్పించుకొని మేలుకొనెదరేమో అని,
26.
ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు,
జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను,
కీడును సహించువాడుగాను ఉండవలెను....
ఈ 26వ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలా తప్పుడు బోధలు చేసేవారిని,
ఆ బోధలు విని త్రోవత్రప్పిన విశ్వాసులను సాత్వికముతో శిక్షించాలి. గాని
ఎవరితోనూ జగడమాడవద్దు అంటున్నారు. సాధువు గాను, బోధింప సమర్ధువు గాను ఉండుము అంటున్నారు.
రోమీయులకు 16:17,18
17. సహోదరులారా,
మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని
కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి
తొలగిపోవుడి.
18.
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు;
వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను
మోసపుచ్చుదురు.
ప్రియ దైవజనమా! నీవు కూడా వీటి జోలికి పోవద్దు! బైబిల్ సంపూర్ణ గ్రంధం! బైబిల్
లో వ్రాయబడని విషయాల జోలికి పోవద్దు! బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో
వ్రాయబడింది అని నమ్ముతున్నావు కదా! కాబట్టి బైబిల్ లో వ్రాయబడిన సంగతులను
బైబిల్ తోనే పోల్చుకో! బైబిల్ ను దాటి బయటకు పోకు! వ్యర్ధమైన భోధల దగ్గరకు
పోకు! వాటిని నీ సంఘములో బోధించకు! అలా బోధించేవారిని చేర్చుకోవద్దు! అలాచేసి
నీ సంఘాన్ని కాపాడుకో!
నీ విశ్వాసం కాపాడుకో!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... -- 6వ భాగం*
*విసర్జించవలసినవి-౩*
1తిమోతి 1:6--7 .
6.
కొందరు వీటిని మానుకొని తొలగిపోయి,
తాము చెప్పువాటినైనను,
7.
నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రో
పదేశకులై యుండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
పైరెండు వచనాలలో మనకు విసర్జించవలసినవి రెండు కనిపిస్తున్నాయి. 1.
నీవు గ్రహించలేని/ నీకు అర్ధం కాని విషయాలు తెలుసు అని బోధించకూడదు! 2. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగవద్దు!
ఈ ఆరవ వచనంలో మొదట్లో కొందరు వీటిని మానుకుని అంటున్నారు.... కొందరు అనగా
కొంతమంది అబద్దబోధకులు వీటిని అనగా 5వ వచనంలో ఉదహరించబడిన విషయాలు మానుకున్నారు అట! ఇంతకీ 5వ వచనంలో ఏమి ఉంది? 5వ వచనంలో ఉపదేశ సారం ఉంది! అంటే?
భక్తియోక్క ఉద్దేశ్యం ఇంకా సువార్తయొక్క మూల సారాంశం! అది ఏమిటంటే:
పవిత్రమైన హృదయం కలిగియుండాలి, మంచి మనస్సాక్షి కలిగియుండాలి,
నిష్కపటమైన విశ్వాసం కలిగియుండాలి,
అప్పుడు ఈ మూడింటి ద్వారా మనకు లభించే ప్రేమను అందరికీ పంచాలి! ప్రేమకోసం
అనేకసార్లు ధ్యానం చేసాం కాబట్టి దీనికోసం మాట్లాడుకోవద్దు!
జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటగా పవిత్రమైన హృదయం ఉండాలి. కారణం హృదయం
భయంకరమైనది అది ఘోరమైన వ్యాదికలది అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే పవిత్రమైన
హృదయం కలిగియుండాలి. అందుకే యేసయ్య కొండమీద ప్రసంగంలో హృదయశుద్ధి కలవారు
ధన్యులు! వారు దేవుణ్ణి చూస్తారు అనిచెప్పారు. ఇక మంచి మనస్సాక్షి ఉండాలి. మన
మనస్సాక్షి ఎల్లప్పుడూ మనకు బోధచేస్తూ ఉంటుంది. దానిని పాటించడమే మంచి
మనస్సాక్షి కలిగియుండడం! ఇంకా చెప్పాలంటే నీ మనస్సాక్షి నీకు విరోధంగా
ఆరోపించకూడదు! తర్వాత విశ్వాసం కలిగియుండాలి అది ఎటువంటి విశ్వాసం
కలిగియుండాలి అంతే నిష్కపటమైన విశ్వాసం! విశ్వాసంలో ఎటువంటి కపటం ఉండకూడదు.
ఏదో మనకు రావాలి,
అని అనుకోకుండా నిజమైన దేవుడు ఆయనే అని విశ్వసించి ఎటువంటి కష్టమైనా ఆయన
చూసుకుంటారు అని ఉండాలి తప్ప, యేసుబాబుని నమ్ముకుంటే ఆస్తి,
అంతస్తులు కలుగుతాయి,
నా కొడుక్కి ఉద్యోగం వచ్చేస్తుంది ... ఇలాంటివి కాదు. ఆత్మ సంభంధమైన
విషయాలమీద విశ్వాసం కలిగియుండాలి. అప్పుడు నిజమైన ప్రేమ కలుగుతుంది.
అయితే దురదృష్టవశాత్తూ చాలామంది బోధకులు ఇటువంటి మంచి మనస్సాక్షి, విశ్వాసం, ప్రేమ,
పవిత్రమైన హృదయం లాంటి విషయాలు చెప్పకుండా తమ పొట్ట పోషించుకోడానికి
పిట్టకధలు, కల్పనాకధలు,
ఇంకా సైన్సు లాంటివి బోధిస్తున్నారు. అంతేకాకుండా తాము చెప్పేవి నిశ్చయం
అన్నట్లు, లేనిది ఉన్నట్లుగా భ్రమపరస్తూ,
ఇంకా వారిసొంత ఆలోచనలు దేవుని ఆలోచనలు అంటూ బోధిస్తూ వాక్యాన్ని కలిపి
చెరుపుతున్నారు! అందుకే వీటిని చెయ్యకూడదు అంటున్నారు పౌలుగారు!
ఇంకా ఏమి చెబుతున్నారంటే వారు చెప్పేది నిజంగా వారికే అర్ధం కాలేదు గాని
అర్ధమైనట్లు అదే నిజం అన్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారు. ఇంకా 7వ వచనంలో చెప్పినట్లు వట్టి ముచ్చట్లు లేక ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ కాలం
వెళ్ళబుచ్చుతున్నారు గాని రక్షణ, విశ్వాసం, పరిశుద్ధాత్మ,
దేవుని రాకడ లాంటి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడం లేదు!
ఇంకా అంటున్నారు: తాము పలికేవాటిని వారు గ్రహించకపోయినా
ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజమైన ముచ్చట్లు బోధిస్తున్నారు అని
పౌలుగారు బాధపడుతున్నారు. ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తాయి. మొదటగా
ధర్మశాస్త్రోప దేశకులై ఉండాలి అని ఆశపడుతున్నారు, రెండవది వ్యర్ధమైన ముచ్చట్లుకు తిరిగారు.
నేటిరోజులలో చాలామంది నేను పెద్ద బోధకుడను అని పిలిపించుకోడానికి తమకు
తెలియక పోయినా తెలిసినట్లు బిల్డప్ లు ఇచ్చి,
చాలా విషయాలు వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు! మరికొంతమంది మర్మాలు
అంటూ బోదిస్తున్నారు. మరికొంతమంది చదువురాని వారిముందు క్రైస్తవ వేదాంత
శాస్త్రమును బోధిస్తున్నారు. మధ్యలో పిట్టకధలు చెబుతూ,
నవ్విస్తూ కాలయాపన చేస్తున్నారు. మరికొంతమంది సైన్సు బోదిస్తున్నారు.
ఇలాంటివి కూడదు అని పౌలుగారు చెబుతున్నారు. ఇక ధర్మశాస్త్రోపదేశకులు అని
చెబితే—ఈ రోజులలో కొందరు పొట్టకూటికోసం బైబిల్ బేగ్ చేతిలో పెట్టుకుని బోధకులం
అంటూ తిరుగుతున్నారు. అయితే ఇలాంటి వారికందరికీ నేను వ్యతిరేఖిని కాను
ఎందుకంటే కక్షతో గాని,
మిషతో గాని దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు దేవునికి స్త్రోత్రం అని
చెబుతున్నారు పౌలుగారు. అలాగే వీరుకూడా కనీసం పొట్టకూటికోసమైన దేవుని
వాక్యం ప్రకటిస్తూ సువార్త చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం! ఐతే నా భాధ
ఏమిటంటే: మొదటగా వీరిలో చాలామందికి దేవుని పిలుపు లేకుండా చేస్తున్నారు. 2)
ఇలా చేసేవారు కొంతమంది విదేశీ ఎంగిలి మెతుకులకు ఆశిస్తూ వాక్యానికి
వ్యతిరేకమైన బోధలు చేస్తున్నారు. దానిలో ప్రముఖులు యెహోవాసాక్షులు,
బ్రేన్హాం బోధలు చేస్తున్నారు. ఇంకా అనేకరకాలైన బోధలు చేస్తూ వాక్యాన్ని
కలిపి చెరుపుతున్నారు. ఇంకా కొంతమంది అమ్మా! నేను రాత్రి ప్రార్ధన చేస్తే
దేవుడు మీ దగ్గరకు వెళ్ళమని చూపించారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను అని
అంటున్నారు. అప్పుడు నిజమైన విశ్వాసి అయితే మీకు చూపించిన, లేక మీతో మాట్లాడిన దేవుడు మాకు చూపించలేదు,
మాకు చెప్పలేదు అని చెప్పాలి. గాని వారు అలా చెప్పక వీరి వెనకాల
పోతున్నారు. మరికొంతమంది అమ్మా ! మీరు ఎక్కడికి వెళ్లొద్దు! మేము మీ
ఇంటికే వచ్చి ప్రార్ధన చేసి లేక ఆరాధన నడిపించి వెళ్ళిపోతాం అంటున్నారు.
ఇంకా పల్లెటూర్లలో కొంతమంది వారు ఏ కులానికి చెందినవారో తెలుసుకుని- మీరు
ఆ కులమే,
మేము కూడా అదే కులం కాబట్టి మా సంఘానికి రండి అంటూ బోధలు చేస్తున్నారు.
మరి దేవుడు చెప్పని కులం, బైబిల్లో వ్రాయబడని కులం ప్రసక్తి,
ఎందుకు వస్తుందో తెలియదు. సంఘంలో కులం ప్రసక్తి వస్తే,
సంఘం చావుకు సిద్దమైనట్టే! కాబట్టి ఇలాంటి పొట్టకూటికోసం వస్తున్న
సేవకులకు దూరంగా ఉండాలని విశ్వాసులకు అందరికీ ప్రభువు పేరిట మనవి
చేస్తున్నాను.
ఇక ప్రియ దైవసేవకుడా! బైబిల్ ను జాగ్రత్తగా ధ్యానం చేస్తే ,
ప్రార్ధనాపూర్వకంగా ధ్యానం చేస్తే దేవుడు ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను,
ఆత్మీయ మర్మాలను దేవుడు మీకే నేర్పిస్తారు. కేవలం ఆయన పాదాల దగ్గర
నేర్చుకుంటే చాలు! అందుకోసం పిట్టకధలు, సైన్సు,
వ్యర్ధమైన ముచ్చటలు చెప్పవలసిన అవసరం లేదు! కాబట్టి ఇలాంటివాటిని
విసర్జించి- విశ్వాసం, మంచి మనస్సాక్షి,
పవిత్రమైన హృదయం కలిగి యుండాల్సిన అవసరం,
ఆత్మానుసారమైన బ్రతుకు జీవించాలి లాంటి విషయాలు బోధిస్తూ సంఘాన్ని రాకడకు
ఆయత్త పరుద్దాం!
అట్టి కృప మనకు కలుగును గాక!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... -- 7వ భాగం*
*విసర్జించవలసినవి-4*
1తిమోతి 3:3 ...
మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనంలో మనకు విసర్జించవలసిన నాలుగు ఉన్నాయి:
1. మధ్యపానం;
2. కొట్టువాడు (భార్యను కొట్టువాడు);
౩. జగడమాడుట;
4.
ధనాపేక్షను విసర్జించాలి!
అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు! ఏమిటంటే: ఈ మూడవ అధ్యాయం
అధ్యక్షులు, పరిచారకులు ఎలా ఉండాలి?
ఎటువంటివారిని నియమించాలి అనేది వ్రాయబడి యుంది! అయితే మరి ఇవి సేవకుల
కోసం కాదుకదా అని అనుమానం రావచ్చు!
అయితే పౌలుగారు ఎఫెసీ సంఘపెద్దలను పిలచి అపోస్తలుల 20:28-31
వరకు ఇచ్చిన సందేశంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి
కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ మందకోసం
జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఇప్పుడు దేవుడు సంఘాన్ని కూడా సంఘకాపరులకు
అప్పగించారు. అప్పుడు కాపరులు తక్కువ! సంఘపెద్దల చేతిలో సంఘం ఉండేది!
కాబట్టి ఇక్కడ అధ్యక్షులు అంటే కేవలం సంఘం యొక్క ప్రెసిడెంట్ అని మాత్రమే
కాదు!
ఇక్కడ అధ్యక్షుడు మధ్యపానియై ఉండకూడదు, కొట్టువాడు అనగా భార్యను,
పిల్లలను ఆకారణముగా కొట్టువాడై ఉండకూడదు,
ఇంకా అందరితోను జగడమాడే వాడుగా ఉండకూడదు,
ఇంకా ధనాపేక్ష లేనివాడై యుండాలని వ్రాస్తున్నారు.
మొదటగా దైవసేవకుడు, సంఘపెద్ద,
అధ్యక్షుడు మధ్యపానియై ఉండరాదు! మద్యపానాన్ని అసహ్యించుకుని విసర్జించాలి!
సేవకుడే తాగితే, విశ్వాసులు త్రాగుబోతులు అవ్వరా?
మా ఏరియాలో నర్సీపట్నంలో ఒక దైవసేవకుడు ఉండేవాడు! ఇప్పుడు ఎక్కడున్నారో
తెలియదు! ఆయన ఆ నర్సీపట్నంలో ఉండేటప్పుడు ఫుల్ గ త్రాగేసి ప్రసంగం చేసేవాడు!
కాని ఎవరికీ ఆయన త్రాగినట్లు తెలిసేది కాదు! ఇంకా రాత్రిపూట తాగేసి భార్యను
కొట్టేవాడు! ఆయన ప్రసంగం వింటే ఎంతో గంభీరంగా ఉండేది. బహుశా ఆయన
ప్రసంగాలు,
ఆయన రాసిన పాటలు మన ఆంద్ర -తెలంగాణాలో విననివారు లేరు అని నా ఉద్దేశ్యం!
ఇంతగొప్ప సేవకుడు యొక్క దుర్గుణం: మద్యపానం! ఎవరైనా అడిగితే పాదిరివి
అయ్యుండి ఎందుకు త్రాగుతున్నావ్ అని అడిగితే: పౌలుగారు తిమోతికి ఏమని
వ్రాసారు?
అప్పుడప్పుడు ద్రాక్షారసం పుచ్చుకోమన్నారు కదా! అనేవాడు!
బైబిల్ లో ద్రాక్షారసాన్ని వైన్ అని తర్జుమా చేశారు. నిజం చెప్పాలంటే ఆ వైన్
ఏమిటంటే: ద్రాక్షాపళ్ళు యొక్క రసం! ద్రాక్షా జ్యూస్! అయితే ఈ అతితెలివైన
వారు, ఇంకా RCM వారు,
వైన్ త్రాగమన్నారు కదా అని ఈస్ట్ కలిపిన,
అనేకరోజులు నిలువ ఉంచిన వైన్ త్రాగుతున్నారు. ఇది వాక్యాన్ని కలిపిచెరపడం
కాదా? ఇలాంటి వారిమీద దేవుని న్యాయమైన తీర్పురాదా?
సంఘాన్ని బ్రష్టుపట్టించే ఇలాంటి దైవసేవకులు,
సంఘకాపరులు ఉంటే సంఘం ఇంకా ఎంతఘోరమైన పరిస్తితిలో ఉంటుంది??
మాఊరి ప్రక్కన వమ్మవరం గ్రామంలో ఒక పాదిరి గారున్నారు. ఆదివారం ఆరాధన ఎంతో
ఘనంగా నడిపించి,
ఆరాధన అయిన వెంటనే ఆ కానుకల డబ్బులతో ఆ కాపరిగారు,
పెద్దలు అదే మందిరంలో మందు తెప్పించుకొని త్రాగుతుంటారు. తద్వారా
దైవసేవకులంటే ఆ గ్రామంలో అలుసైపోయారు! అదే గ్రామంలో మాకుకూడా ఒక బ్రాంచి
చర్చి ఉంది! మరి సంఘకాపరే తప్పుచేస్తుంటే సంఘస్తులు తెగించరా? కంచే చేను మేస్తే ఎవరితో చెప్పుకోవాలి?
ప్రియ దైవజనుడా! ప్రియ సేవకుడా! దయచేసి మద్యపానాన్ని విడచిపెట్టు!
సామెతల గ్రంధంలో గంధకర్త ఏమంటున్నారు? ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము?
ఎవరికి జగడములు?
ఎవరికి హేతువులేని గాయములు?
ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె
కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును.
వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).
ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం
ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు.
త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో,
ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం
ధూమపానం చేస్తున్నారు,
సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని
బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా
తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు.
ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం
నాకేల?
పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ-
తిట్టుబోతుగాని,
త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు,
కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13).
ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . .
త్రాగుబోతులైననూ,
దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).
నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి
లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో
సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ
పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము
అశాంతి,
కారణం లేని జగడాలు,
ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి
రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో ,
డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు.
గమనించండి
అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు,
అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు
రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది
దూషింపబడుతుంది. ఇంకా ఏమి వస్తాయి?
Sugar, BP, Lever పనిచేయదు,
ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి,
కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే.
కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము,
ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం,
ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ప్రియ సహోదరుడా! దేవుని
పరువు తీస్తున్నావు,
నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్.
త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!
కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది?
వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1
పేతురు 4:3;
సామెతలు 23:29-35.
ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు
నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా!
దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి,
కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.
1. ఇక్కడ ద్రాక్షారసం (wine)
అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి
ఈస్ట్ కలిపి,
పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM)
చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2. పూర్వకాలంలో Medicine
అభివృద్ధికాని రోజులలో యూరోప్,
మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు,
ఒలీవ ఆకులు,
ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50
సం. ల క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine
తో కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ
ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.
కాబట్టి ప్రియ దైవసేవకుడా! సంఘకాపరీ! ప్రియ చదువరీ! ఈ మద్యపానాన్ని
విసర్జించమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను! దేవుని వాక్యాన్ని
కలిపిచెరపవద్దు!
తీర్పు దేవుని ఇంటినుండే బయలుదేరుతుంది అని గుర్తుంచుకో!
1పేతురు 4:7;
దైవాశీస్సులు!
*దైవజనుడా..... -- 8వ భాగం*
*విసర్జించవలసినవి-5*
1తిమోతి 3:3 ...మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనంలో మనకు విసర్జించవలసిన నాలుగు ఉన్నాయి:
1. మధ్యపానం;
2. కొట్టువాడు (భార్యను కొట్టువాడు);
౩. జగడమాడుట;
4.
ధనాపేక్షను విసర్జించాలి!
గత భాగంలో మధ్యపానియై ఉండకూడదు అని ధ్యానం చేసుకున్నాం! ఇక ఈ రోజు ఈ వచనంలో
వ్రాయబడిన మిగతా విసర్జించవలసిన విషయాలు ధ్యానం చేసుకుందాం!
తర్వాత కొట్టువాడుగా ఉండకూడదు! అనగా భార్యను గాని,
పిల్లలను గాని ఆకారణముగా కొట్టేవాడై ఉండకూడదు. ఈగుణాన్ని విసర్జించాలి. ఇక
పౌలుగారు వ్రాసిన విధముగా భార్య నీ శరీరములో ఒక భాగము కాబట్టి ఎట్టి
పరిస్తితులలో కూడా భార్యను కొట్టకూడదు. భార్యను కొడితే తననుతాను
హింసించుకొన్నట్లే! ఎఫెసీ 5:28-29;
తననుతాను హింసించుకొనేవాడు- అయితే పిచ్చోడు కావచ్చు లేదా గదరేనీయుల దేశంలో
దయ్యం పట్టినవాడు లాంటి వాడు అయ్యుంటాడు. ప్రియ సహోదరుడా! నీవునీ భార్యను ఏ
కారణం ద్వారా గాని కొడుతున్నావు అంటే, (ఒకవేళ ఆమె తప్పుచేసిన కూడా కొట్టరాదు) నీవు మతి స్తిమితం లేనివాడవు,
లేదా దయ్యాలు పట్టినవాడవు అన్నమాట! కాబట్టి భార్యను కొట్టడం విసర్జించాలి.
ముఖ్యంగా సేవచేసేవాడు గాని,
కాపరిగాని ఎట్టి పరిస్తితులలోను భార్యను కొట్టకూడదు!కారణం కాపరి,
సేవకుడు సంఘానికి మాదిరిగా ఉండాలి గాని వాక్యానికి వ్యతిరేఖంగా
ఉండకూడదు!
ఇక పిల్లలను శిక్షించమని బైబిల్ చెబుతుంది ఎందుకంటే ఎప్పుడైతే తప్పులు
చేస్తారో మరల చేయకుండా శిక్షించమని బైబిల్ చెబుతుంది గాని వాడు
చచ్చిపోవాలనేటంత కోపంతో పిల్లలను కొట్టకూడదు. సామెతలు 19:18;
అలాచేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిలో భయంకరమైన కోపం ఆ వ్యక్తిని కంట్రోల్
చేస్తుంది. కోపం –
పాపము అని మరచిపోవద్దు! పిల్లలను ప్రేమించని వాడు ఈ లోకంలో సాధారణంగా
ఉండడు అని నా ఉద్దేశ్యం! గాని అలా పిల్లలను పిచ్చికోపంతో కొడుతున్నాడు అంటే
ఆ క్షణంలో వాడిలో పనిచేస్తున్న దుష్ట సాతానిగాడి పనే! కాబట్టి ఇలాంటి
పాపాన్ని సేవకుడు, కాపరి,
విశ్వాసి విడచిపెట్టాలి! ఇక భార్యను,
పిల్లలనే కాక ఇతరులను కూడా కొట్టకూడదు! దీనిని విసర్జించాలి!
ఇక తర్వాత విసర్జించాల్సిన అంశం: జగడమాడుట!
కొంతమంది ప్రతీ చిన్న విషయాలలోనూ జగడమాడుతూ ఉంటారు. సామెతలు ౩:౩౦ లో నీకు
హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అంటున్నారు. ఇదే తిమోతి ౩:౩
లో సేవకుడు, కాపరి,
సంఘపెద్ద సాత్వికుడిగా ఉండాలి అని చెబుతున్నారు. 2తిమోతికి 2: 26
ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు,
జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
అనగా ఎవరైనా తనమీదకు జగడమాడడానికి వచ్చినా తగ్గించుకుని వెళ్ళిపోయేవాడు
సాత్వికుడు! మోషేగారి గురించి దేవుడే సర్టిఫై చేస్తున్నారు: మోషే భూమిమీద
ఉన్నవారిలో మిక్కిలి సాత్వికుడు! సంఖ్యా
12:3;
క్రైస్తవుడు కూడా అలాగే సాత్వికుడిగ ఉండాలి. గమనించండి : యేసుక్రీస్తు
ప్రభులవారు కూడా చాలా సాత్వికుడు! తనను హింసించిన సరే, వధకు తేబడిన గొర్రె,
ఇంకా బొచ్చుకత్తిరించువారిదగ్గర గొర్రె ఎలా మౌనముగా ఉంటాదో అలాగే
యేసుక్రీస్తు ప్రభులవారు కూడా తనను కొట్టేవారికి తనవీపును అప్పగించారు
గాని ఎవరితోనూ జగడమాడలేదు! కాబట్టి సేవకుడు/ కాపరి/ పెద్ద/ క్రైస్తవుడు
విసర్జించాల్సింది : జగడమాడుట!!
ఇక ఈ వచనంలో విసర్జించాల్సిన తర్వాత మరియు ముఖ్యమైన అంశం: ధనాపేక్షను విసర్జించాలి!
ఈ ధనాపేక్ష కోసం బైబిల్ లో చాలాచోట్ల వివరించబడింది!
ఇదే తిమోతి మొదటి పత్రిక – 6:6-10 లో చూసుకుంటే.....
6.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.
7. మన మీలోకములోనికి ఏమియు తేలేదు,
దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.
8.
కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము.
9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను,
ఉరిలోను,
అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి
మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము;
కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే
పొడుచుకొనిరి.
11. దైవజనుడా,
నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము(వెంటాడుము). ..
ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే మత్తయి 6:24..
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును;
లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని
దాసులుగా నుండనేరరు...;
ఎవరూ ఇద్దరు యజమానులకు లోబడి ఉండలేరు. అయితే దేవునికి లేదా సిరి అనగా ధనానికి
సేవకులుగా ఉంటారు. ప్రియ సేవకుడా! నీవు ధనానికి సేవకుడిగా ఉన్నావా లేక
దేవునికా?!!
ఒకవేళ దేవునికే అయితే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకి వెంటాడితే ఇవన్నీ
నీ వెనుకాల పరుగెత్తుకుని వస్తాయి!
లూకా 16:13-14.
డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతకూ ఒక మూలం. ఎందుకంటే ఇది మనుషులను
దేవుని నుంచీ ఆధ్యాత్మిక విషయాల నుంచీ భౌతిక వస్తువులవైపు మళ్ళిస్తుంది.
మత్తయి 6:20-24 .
20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి;
అచ్చట చిమ్మెటయైనను,
తుప్పైనను దాని తినివేయదు,
దొంగలు కన్నమువేసి దొంగిలరు.
21.
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
22.
దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు
మయమైయుండును.
23.
నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును;
నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.
24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు;
అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును;
లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని
దాసులుగా నుండనేరరు. ......
–
డబ్బంటే ప్రీతి = దేవుని పట్ల ద్వేషమే. మత్తయి 22:37లో ఉన్న ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటుండదు.
అలా కాక మనకు డబ్బంటే ప్రీతి ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటుండదు.
ఇస్కరియోతు యూదాను పిశాచంగా మార్చిన ఒక పాపం డబ్బుమీద వ్యామోహమే (యోహాను 12:6; మత్తయి 26:14-16).
మనకు ఏ మాత్రమైనా గ్రహింపు ఉంటే ఆ మార్గం వెంటవెళ్ళడానికి
ఇష్టపడతామా?
మనుషులు (క్రైస్తవులు/దైవ సేవకులు కూడా) డబ్బు వెంట వెళ్ళడం అనేది చాలా
జ్ఞానమని అనుకోవచ్చు. కానీ వారు ఘోరమైన మాయలో పడి మోసపోతున్నారు. ఆధ్యాత్మికంగా
నశించిపోయే మార్గంలో ఉన్నారు. సంపదను ఆశించడం సైతాను వేసే వల,
దుష్ప్రేరేపణ. ఇది తృప్తిని ఇవ్వదు గానీ ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి
చివరికి నాశనం చేస్తుంది (మత్తయి 7:13; 2 థెస్స 2:8-9;
కీర్తన 49:20; 73:18-19).
దీని గురించి బైబిలులో ఉదాహరణలు చూడండి –
బిలాము (2
పేతురు 2:15)
15.
తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి
త్రోవ తప్పిపోయిరి.
16.
ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను;
అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను,
ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క
వెఱ్ఱితనము అడ్డగించెను. .......;
గేహజీ (2 రాజులు 5:20-27).
20.
అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ-సిరియనుడైన యీ నయమాను తీసికొని
వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని,
యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద
ఏదైనను తీసికొందుననుకొని
21. నయమానును కలిసికొనుటకై పోవుచుండగా,
నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి
దిగి వానిని ఎదుర్కొని-క్షేమమా అని అడిగెను. అతడు-క్షేమమే అని చెప్పి
22.
నా యజమానుడు నాచేత వర్తమానము పంపి-ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యౌవనులు
ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు
రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయ చేయుమని
సెలవిచ్చుచున్నాడనెను.
23.
అందుకు నయమాను-నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసికొనుమని బతిమాలి,
రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి,
తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసికొని
పోయిరి.
24.
మెట్లదగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో
దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.
25.
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని
చూచి-గేహజీ,
నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు-నీ దాసుడనైన నేను ఎచ్చటికిని
పోలేదనెను.
26.
అంతట ఎలీషా వానితో-ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి
వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా?
ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
27.
కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము
అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట
నుండి బయటికి వెళ్లెను......;
యూదా (మత్తయి 26:14-16 )
14. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా,
ప్రధానయాజకులయొద్దకు వెళ్లి
15.
నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు
ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
16.
వాడప్పటినుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. .... యోహాను 12:4-6.......).
కాబట్టి మనం వీరిలాగా కావాలనుకుంటే వారిలాగే నీకు నాకు కూడా నాశనమే
కలుగుతుంది. కాబట్టి ప్రియ సేవకుడా! ధనం మీద వ్యామోహం విసర్జించు! కేవలం దేవుని
సువార్త,
సంఘవ్యాప్తి మీద దృష్టి పెట్టు! ధనం వెనకాల పరిగెడితే ధనం నీనుండి
పారిపోతుంది! అయితే సువార్త, దేవుని రాజ్యం,
ఆయన నీతి కోసం ప్రాకులాడితే ధనం నీ వెనకాల పెంపుడుకుక్కలా పరుగెత్తుకు
వస్తుంది! ఇది మా తండ్రిగారిదే కాకుండా అనేకమంది నిజ దైవసేవకుల
స్వానుభవం!
ఆబాటలో మనం కూడా మనం నడుద్దాం!
ధనాపేక్షను విసర్జిద్దాం!
జగడాలను విసర్జిద్దాం!
దైవరాజ్య వ్యాప్తి చేద్దాం!
దేవునితో భళానమ్మకమైన మంచిదాసుడా! అని పిలిపించుకుందాం!
ఆమెన్! దైవాశీస్సులు!
*దైవజనుడా..... -- 9వ భాగం*
*విసర్జించవలసినవి-6*
1తిమోతి 4:7 ...
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము!
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనంలో మనకు విసర్జించవలసిన అంశం: అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి!
ముసలమ్మ ముచ్చట్లు అనగా ముసలివారు మాట్లాడే మాటలు అనేదే కాదు- పనీపాటు
లేకుండా వీల్లమీద, వాళ్ళమీద చాడీలు చెప్పే గుణం,
ఇంకా పనికిమాలిన పిచ్చాపాటి మాటలు విసర్జించాలి అని అర్ధం!
బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం
“ముసలమ్మ ముచ్చట్లు”–
అంటే యథార్థం కాని మత సంబంధమైన కథలు,
వాస్తవికతలో చరిత్రలో ఆధారమేమీ లేని పుక్కిటి పురాణాలు అని పౌలు ఉద్దేశం.
ఇలాంటి పనికిమాలిన చెత్త బోధించకూడదు! అలాంటి మాటలు విసర్జించాలి అనేదే
పౌలుగారి ఉద్దేశ్యం! ఇదే తిమోతి పత్రిక ప్రకారం ఇలాంటి ముసలమ్మ ముచ్చట్లు
ఎక్కువగా యవ్వనస్తులైన విధవరాండ్రు చేస్తారు అని చెప్పారు! కాబట్టి
దైవసేవకుడు ఇలాంటి పనికిమాలిన విషయాలు బోధించకూడదు ఇంకా అలాంటి మాటలు
మాట్లాడేవారిని ప్రోత్సాహించక గద్దించవలసిన అవసరం ఎంతైనా ఉంది!
ఈ యదార్ధం కాని కల్పిత కధలకోసం బైబిల్ ఇంకా ఏమి చెబుతుంది అంటే: ఇదే తిమోతి
పత్రిక 1:3,4..
3.
నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,
4.
విశ్వాస సంబంధమైన దేవుని యేర్పా టుతో(మూలభాషలో-గృహ నిర్వాహకత్వముతో) కాక
వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు,
కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన
ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ...
“కల్పిత కథలూ...వంశ వృక్షాలు”–
బైబిలు కనబడని సంగతులు,
వంశ వృక్షాల గురించి చెప్తున్నారు పౌలుగారు. బహుశా ఇవి యూదులకు చెందినవి.
ఇలాంటి ఉపదేశాలు భూమిమీద దేవుని పనికి ఏ విధమైన సహాయమూ చేయవు. దేవుని వాక్కైన
పవిత్ర గ్రంథాన్ని నమ్మి దాన్ని ప్రకటించేవారి ద్వారానే,
దాన్ని ఉపదేశించేవారి ద్వారానే దేవుని పని నెరవేరుతుంది.
అయితే పౌలుగారు ఈ విషయం నొక్కి వక్కాణించి చెప్పడానికి అసలు కారణం వీటిని
విసర్జించి దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి గాని ఇలాంటి పనికిమాలిన విషయాల
కోసం మాట్లాడుకొంటూ విలువైన సమయాన్ని వృధాచేసుకోకూడదు! దైవభక్తిని సాధకం
చేసుకోవడం ఏమిటి? సాధకం అంటే ప్రాక్టీస్ చెయ్యడం!
సాధనం చెయ్యడం! దైవభక్తి–
ఆచరణ యోగ్యమైన క్రైస్తవ జీవితం అని పౌలుగారి ఉద్దేశం. ఇది క్రైస్తవులు
నేర్చుకోవలసినది. విశ్వాసులు తమకు తామే ఇందులో సాధన చేసుకోవాలి.
1 కొరింథీ 9:25
25.
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు
క్షయమగు కిరీటమును పొందుటకును,
మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.
నిపుణుడైన క్రీడాకారుడు తన శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకున్నట్టు
ప్రత్యేకంగా క్రీస్తు సేవకులు ఆధ్యాత్మిక విషయాలలోనూ మానసిక విషయాలలోనూ
క్రమశిక్షణగా ఉండాలి. తననుతాను కంట్రోల్ చేసుకోకుండా ఇష్టమొచ్చినట్లు
తిరిగితే సేవకుడు భక్తిని పొండుకోలేదు గని విశ్వాస భ్రష్టుడైపోతాడు!
కాబట్టి ప్రియ దైవసేవకుడా! ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి,
దైవ భక్తిని సాధకము/ ప్రాక్టీస్ చేసుకోమని వాక్యం చెబుతుంది కనుక ఈ రోజే
మొదలుపెట్టమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --10వ భాగం*
*విసర్జించవలసినవి-7*
1తిమోతి 5:1, 21,22
1.
వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
21.
విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియు చేయక,
నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను,
క్రీస్తుయేసు ఎదుటను,
ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు
ఆనబెట్టుచున్నాను(సాక్ష్యమిచ్చుచున్నాను)
22.
త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై
యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ...
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనాలలో మనకు మూడు విసర్జించవలసిన అంశాలు కనిపిస్తాయి.:
1.
వృద్ధుని గద్ధించక తండ్రిగా భావించి హెచ్చరించాలి.
2.
విరోధమైన బుద్ధితోగాని పక్షపాతంతో గానీ ఏమీ చెయ్యవద్దు.
౩. ఎవరిమీద త్వరపడి హస్తనిక్షేపనం అనగా చేతులుంచి ప్రార్ధన చేయవద్దు!
మొదటగా: వృద్ధుని గద్ధింపక తండ్రి అని భావించి హెచ్చరించమని చెబుతున్నారు. అనగా విసర్జించవలసినది:
వృద్దులను గద్ధించడం! ఎందుకంటే వారు నీ తండ్రి సమాన వయస్ఖులు కాబట్టి వారికి
గౌరవం ఇమ్మంటున్నారు పౌలుగారు! ఇంతకీ ఈ వచనానికి నేపధ్యం ఏమిటంటే: పౌలుగారు
సంఘంలో ఉన్న యవ్వనస్త్రీలతో సేవకుడు ఎలా ప్రవర్తించాలి? పెద్ద స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి?
అనే విషయాలు చెబుతూ వృద్ధులతో ఎలా ఉండాలో చెబుతున్నారు. వృద్ధుని
గద్దించవద్దు! తండ్రిగా భావించి హెచ్చరించు అంటున్నారు. అయితే
క్రీస్తు నియమించిన నాయకుడిగా సంఘ కాపరికి అధికారం ఉంది. కానీ సంఘాన్ని
తనదైన చిన్న రాజ్యంగా భావించి సర్వాధికారం చెలాయించకుండా, సంఘం ఒక ఇల్లు,
ఒక కుటుంబం అని గుర్తుంచుకోవాలి.1తిమోతికి 3: 15
అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో,
జనులేలాగు(నీవెలాగు) ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను
నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది.
గద్దించవలసిన అవసరం, హెచ్చరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది?
అంటే బహుశా ఏమైనా తప్పుచేసి ఉండవచ్చు! అయితే ఈ పరిస్తితులలో ఆ వృద్ధుని
గద్దించవద్దు గాని తండ్రిగా భావించి వదిలెయ్యమని అనడం లేదు! ప్రేమతో
హెచ్చరించమంటున్నారు. నెరసిన తలవెండ్రుకలు వృద్దునికి కిరీటం అని
సెలవిస్తుంది బైబిల్! అందుకే యోబుగారి స్నేహితులు ఆయనను విమర్శిస్తున్నప్పుడు
వారికి నెరసిన వెండ్రుకలు ఉన్నాయి కాబట్టి వారిని ఏమీ అనలేదు. కాబట్టి ప్రియ
సేవకుడా! దయచేసి వృద్ధులను గద్ధించడం, తిట్టడం విస్సర్జించు!
ఇక తర్వాత విసర్జించవలసిన అంశం: విరోధమైన బుద్ధితోగాని, పక్షపాతంతో గానీ ఏమీచెయ్యవద్దు! పౌలుగారు ఎంత గట్టిగా,
ఎంత నిక్కచ్చిగా రాస్తున్నారో చూశారా. క్రైస్తవ నాయకులు పక్షపాతం,
దురభిమానం చూపించడం సామాన్య విషయమని పౌలుగారికి తెలుసు. చాలామంది తమ
బంధువులూ స్నేహితులూ పాపం చేసినప్పుడైతే వారిని సమర్థించి
వెనకేసుకువస్తారు,
ఇతరులు చేసినప్పుడైతే వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. ఇది చాలా చెడ్డ
విషయం. క్రీస్తుకు చెందే ప్రతి సేవకుడూ దీన్ని నివారించాలి. అది ఎవరైనా
సరే, సొంత కుటుంబం గాని,
సంఘపెద్దలు గాని,
లేక ఎక్కువగా కానుకలు ఇచ్చే విశ్వాసులైన సరే,
ఎవరినైనా ఒకేవిధంగా చూడాలి! పక్షపాతంగా అనగా బీదలను ఒకలా, ధనవంతులను ఒకలాగ చూడకూడదు! బీదలను క్రిందను,
ధనవంతులను కుర్చీలపై కూర్చోబెట్టడం లాంటి పనులు మానివేసి అందరినీ సమానంగా
చూడాలి. ఇదీ దైవసేవకుని లక్షణం!
ఒకసారి నాతాను ప్రవక్త గారిని జ్ఞాపకం చేసుకుందాం! దావీదుగారు బెత్షబా విషయంలో
తప్పుచేస్తే రాజ ప్రసాదానికి వచ్చి, రాజా ఇలా జరిగింది,
అలా జరగింది అని కధ చెబితే దావీదుగారికి కోపం తన్నుకొచ్చింది! అప్పుడు
దావీదుగారు వాడు ఎవడు? వాడు మరణపాత్రుడు అంటే: ఆ మరణపాత్రుడవు,
ఆ పాపివి నీవే అని ధైర్యంగా చెప్పారు. రాజు అని స్పెషల్ ట్రీట్మెంట్
ఏమీలేదు! తప్పుచేసినప్పుడు దేవుని దృష్టిలో ఎవరైనా ఒకటే! రాజు అయినా,
సేవకుడు అయినా ఒకటే! అలాగే ప్రియ సేవకుడా! నీవుకూడా అలాగే అందరినీ చూడాలి!
తప్పుచేస్తే వారు ఎవరైనా సరే, ఖండించాలి అంతే! ఆ వ్యక్తి సంఘపెద్డా?
అయితే ఆయన పాపి అయిన సంఘపెద్ద అంతే దేవుని దృష్టిలో! కానుకలు ఎక్కువగా
ఇచ్చేవాడా?
అయితే పెద్దపెద్ద కానుకలు ఇచ్చే పెద్ద పాపి అంతే! అందరినీ ఒకేలా
చూడాలి!
కాబట్టి ఈ పక్షపాతం,
విరోధమైన బుద్ధితో చూడటం విసర్జించమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!
ఇక తర్వాత విసర్జించాల్సిన అంశం: త్వరపడి ఎవరిమీద హస్తనిక్షేపణం అనగా చేతులేసి ప్రార్ధన చెయ్యొద్దు
అంటున్నారు.
మా పల్లెటూర్లలో ఆరాధన అయిన వెంటనే పాదిరిగారు వారిమీద చేతులేసి ప్రార్దన
చెయ్యాలి. అలా చేసుకోకపోతే వారికి ఏదోరకంగా ఉంటాదంట! గాని ఇక్కడ పౌలుగారు
తిమోతితో చెబుతున్నారు- త్వరపడి ఎవరిమీద చేతులేసి ప్రార్ధన చెయ్యొద్దు
అంటున్నారు. బహుశా ఎందుకు అలా అన్నారంటే అలాచేస్తే కొన్నిసార్లు వారిలో
ఉన్న దయ్యాలు సేవకుని మీద ఎటాక్ చేస్తాయి అనే ఉద్దేశ్యంతో కావచ్చు!
ఈరోజులలో చాలామంది పల్లెటూర్లలో విశ్వాసులు పోములు కట్టించుకుని,
దాచేసుకుంటూ పాదిరిగారితో ప్రార్ధన చేయించుకుంటున్నారు. అయితే ఇలా
చేసినప్పుడు ఆ సేవకునికి ప్రార్ధనాబలం తక్కువగా ఉంటే,
ఆ దయ్యాలు ఆసేవకుని మీద దాడిచేసి సేవకుని వ్యాధిగ్రస్తుడిగా చేస్తున్నాయి.
కాబట్టి ప్రియ సేవకులారా! త్వరపడి అందరిమీద చేతులేసి ప్రార్ధన చెయ్యవద్దు
అన్న పౌలుగారి హెచ్చరిక మరియు సలహాను పాటించండి!
అసలు చేతులుంచి ప్రార్ధన యొక్క విశిష్టత ఏమిటంటే:– 4:14
పెద్దలు హస్తనిక్షేపణముచేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న
వరమును అలక్ష్యము చేయకుము....;
2 తిమోతి 1:6..
ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప
చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను....
దీని అర్ధం ఏమిటంటే దేవుని సేవకులు అభిషక్తులు చేతులేసి ప్రార్ధన
చేసినప్పుడు మనకు ఆత్మీయవరాలు,
ఆశీర్వాదాలు కలుగతాయి. ఇంకా సువార్తల ప్రకారం యేసుప్రభువు రోగగ్రస్తుల మీద
చెయ్యివేసి తాకితే వారు స్వస్తతను పొందుకునే వారు! అలాగే దైవసేవకుడు
ఆత్మబలంతో చేతులేసి ప్రార్ధనచేస్తే రోగులు బాగుపడతారు!
అయితే ఇక్కడ
బహుశా నాయకులనూ పరిచారకులనూ నియమించడం గురించి కూడా మాట్లాడుతున్నారేమో
అనికూడా అనుకోవచ్చు. మనుషులు తమ యోగ్యత కనపరచుకోక ముందు వారిని సంఘ
సేవకోసం నియమించడం అనేది సంఘానికి ఎంతో హాని కలిగించవచ్చు.
సంఘం- పెద్దలు పాపం చేస్తున్నవారిని పెద్దలుగానూ పరిచారకులుగానూ
నియమిస్తే జరిగే ఫలితాలకు వారే బాధ్యులవుతారు. సంఘ పెద్దలు తాము
పవిత్రంగా ఉంటూ పవిత్రమైనవారినే నియమించాలి. అనగా యోగ్యులైన వారినే
సంఘపెద్దలుగా/ సేవకులుగా నియమించి,
వారిమీద చేతులేసి ప్రార్ధన చేస్తే దేవుడు వారిని అత్యధికంగా
దీవిస్తారు!
కాబట్టి ప్రియ సేవకుడా! అయోగ్యులైనవారిమీద త్వరపడి చేతులేసి ప్రార్ధన చేయడం
విసర్జించు!
పక్షపాతంగా నడచుకోవడం విసర్జించు! వృద్ధుని గద్దించడం విసర్జించు!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --11వ భాగం*
*విసర్జించవలసినవి-8*
2తిమోతి 2:22 ..
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము),
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును వెంటాడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనములో మనకు విసర్జించవలసిన అంశము ఏమిటంటే: యవనేచ్చల నుండి పారిపోవాలి!!
ఇంతకీ యవనేచ్చలు అంటే ఏమిటి?
యవ్వనస్తుల కోరికలు! యవ్వనస్తులకు ఎటువంటి కోరికలు ఉంటాయి? ముఖ్యంగా శరీరాస, నేత్రాస,
జీవపుఢంభం వీరిమీద చాలాబాగా పనిచేస్తుంది.
*శరీరాస*: వ్యభిచారం, lust/ కామపుకోరికలు,
త్రాగుడు,
సిగరెట్లు లాంటి వ్యసనాలు,;
*నేత్రాస*: మోహపు చూపు,
అందమైన స్త్రీని చూసి కావాలని అనుకోవడం ; *జీవపుఢంభము*: మంచి మోపెడ్లు, కారులు,
బంగళాలు కొనుక్కోవాలి,
వాటిపై తిరగాలి! స్టేటస్ మైంటైన్ చెయ్యాలి! 6
పాక్స్ చూపించాలి. నేను అందగాడినని అందరూ నన్ను పొగడాలి. ఏ రకంగానైనా ప్రజలు
నన్ను గుర్తించాలి!
ఇలాంటి కోరికలు యవ్వనస్తులకు సామాన్యంగా వస్తుంటాయి. ఇలాంటి కోరికలును
జయించాలి అనడం లేదు పౌలుగారు- వీటినుండి పారిపోవాలి! అనగా ఏదైనా భయంకర – అత్యవసర పరిస్తితులలో—ఉన్నదంతా విడిచి ప్రాణాలు కాపాడుకోడానికి పరుగెత్తినట్లు- ఉదా: భూకంపం
కలిగితే ఇంటినుండి బయటకు పరుగెత్తినట్లు యవ్వనేచ్చలనుండి కూడా విడిచిపెట్టి
పారిపో అంటున్నారు పౌలుగారు!
ప్రతీ దైవజనుడు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్న సేవకులు గాని,
డాక్టర్లు,
మ్యుజీషియన్స్ గాని స్త్రీలకు చాలా దగ్గరగా ఉండాల్సి వస్తుంది. సేవకులకు
ముఖ్యంగా ఇంట్లో పురుషులు లేనప్పుడు వారి గృహాలను దర్శించవలసి వస్తుంది.
కాబట్టి దైవసేవకులు తప్పకుండా ఈ యవ్వనేచ్చలను విసర్జించి ఇలాంటి లైంగిక
పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది! అందుకే అనేకమంది బైబిల్
పండితులు గాని, కొన్ని సంఘాల పాష్టరేట్ కమిటీలు గాని,
కొన్ని ఆర్గనైజేషన్ పెద్దలు చెప్పేదేమిటంటే దయచేసి దైవసేవకులు,
కాపరులు ఎవరి ఇంటినైనా దర్శించినప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దు! ముఖ్యంగా
స్త్రీలు ఒంటరిగా ఉండే ఇంటికి మీ భార్యతోనే వెళ్ళాలి! ఒకవేళ వివాహం కాకపొతే
తనకుతండ్రి వయస్సున్న పెద్ద వ్యక్తితో పాటు అలాంటి గృహాలను దర్శించాలి తప్ప
ఒంటిగా వెళ్ళకూడదు! అలా ఎవరితోనైనా వెళ్ళినప్పుడు ఈ రకమైన లైంగిక పాపం
నుండి తప్పించుకోవచ్చు!
*తిమోతిగారు యవ్వనస్తుడు కాబట్టి పారిపో అన్నారు! మరినేను యవ్వనస్తుడను
కాను కదా! నేనెందుకు పారిపోవాలి అని అనుకోవద్దు! అబ్రాహాము గారు గొప్ప
విశ్వాసవీరుడు! దైవభక్తుడు: గాని 99
సంవత్సరాల వయస్సులో అబ్రాహామా నా సన్నిధిలో నిందారహితుడవై ఉండు అని
దేవునిచేతనే హెచ్కరించబడిన పరిస్తితిలోనికి వచ్చారు.* ఆదికాండం17:1;
కారణం దేవుడు చెప్పని పని,
భార్యమాటకు లోబడి పరస్త్రీతో కాపురం చేసారు అబ్రాహాముగారు! *ఇక
మహాభక్తుడు,
ప్రవక్త దైవజనుడు దావీదుగారు నడివయస్సులో చూడరాని దృశ్యం చూసి, తన భటుడి భార్యతో పాపం చేసి,
శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ యవ్వనేచ్చలు ఎవరికైనా ఏ వయస్సులోనైనా
వస్తాయి!*
కాబట్టి ప్రియ దైవజనుడా! ఈ యవ్వనేచ్చలనుండి పారిపో అంటున్నారు పౌలుగారు! 1తిమోతి 6:11లో దైవజనుడా! వీటిని విసర్జించి, భక్తిని,
విశ్వాసమును సాధకం చేసుకోమని హితవుపలికారు! ఇంకా పేతురు గారు కూడా
చెబుతున్నారు: 2పేతురు 1:2—9
2. తన మహిమను బట్టియు,
గుణాతిశయమును బట్టియు,
మనలను పిలిచినవాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి,
జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయు చున్నందున,
3.
దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చి నట్టియునైన అనుభవ
జ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
4.
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన
వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న
భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని,
దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను
5.
ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై,
మీ విశ్వాసమునందు సద్గుణమును,
సద్గుణమునందు జ్ఞానమును,
6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును,
ఆశానిగ్రహమునందు సహనమును,
సహనమునందు భక్తిని,
7. భక్తియందు సహోదరప్రేమను,
సహోదర ప్రేమయందు దయను(ప్రేమను) అమర్చుకొనుడి.
8.
ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ
చేయును.
9.
ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి
మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.
... కాబట్టి యవ్వన సేవకులు ఈ యవ్వనకోరికలకు లొంగిపోయి,
వాటిని తృప్తిపరచుకోవడం మానేసి,
వాటికి దూరంగా పారిపోతేనే దేవుడు వారిని బలంగా వాడుకుంటారు!
ప్రసంగి 11:9—10
ధ్యానం చేసుకుంటే: నీ యవ్వనమందు సంతోషపడు! నీ కోరికచోప్పున నీ దృష్టి యొక్క
ఇష్టము చొప్పున చెయ్యు! అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి
తెచ్చునని జ్ఞాపకం చేసుకో! అంటున్నారు!
కారణం లేతవయస్సు,
నడిప్రాయం కూడా గతించిపోతుంది. అనగా నీ బాల్యం,
నీ యవ్వనం కూడా గతించిపోయి,
నడిప్రాయానికి వెళ్తావు,
చివరికి నడిప్రాయం కూడా గతించిపోయి,
వృద్దుడవైపోతావు! చివరికి చనిపోతావు! కాబట్టి
మొదటగా నీవు చేసిన క్రియలకు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తారని మరచిపోకు!
రెండవది: కాబట్టి నీ హృదయంలోనుండి వ్యాకులమును తొలగించుకో!
మూడవది:నీ దేహాన్ని చెరిపేదాన్ని నీనుండి తొలగించుకో!
ఇక ఆ తర్వాత అధ్యాయంలో చెబుతున్నారు 12:1—2 ...
1.
దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు
సంవత్సరములు రాకముందే,
2.
తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే,
నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. .... నీ బాల్య
దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నారు భక్తుడు!
విలాపవాక్యములు ౩:27లో యిర్మియా ప్రవక్త గారు చెబుతున్నారు: యౌవనకాలనున దేవుని కాడి మోయుట
నరునికి మేలు! గమనించండి! మీద వచనంలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను
గుర్తుకు చేసుకో అంటే—ఇక్కడ యవ్వనకాలమందు ఆయన కాడి మోయాలి! అనగా బాల్యదినములలోనే దేవునికి
సమర్పించుకొని—యవ్వనకాలము వచ్చింది అంటే వెంటనే దేవుని కాడి అనగా సువార్తభారం కలిగి
దేవుని సేవ చెయ్యాలి! ఇదీ అర్ధం!
చాలామంది అంటుంటారు కదా నీవుకూడా దిగిపోయావా?
ఇప్పుడే దిగిపోయావేటి?
ఇంకా అనుభవించాల్సింది బోలెడుంది కదా! ముసలోడివి అయ్యాక దేవుణ్ణి
నమ్ముకుందువులే అంటుంటారు! గమనించాలి: దేవునికి గాని, దయ్యానికి గాని,
దేశానికి గాని,
దేశద్రోహులకు గాని యవ్వనస్తులే కావాలి! కారణం యోహానుగారు చెబుతున్నట్లు
యవ్వనస్తులారా! మీరు బలవంతులు!
మీ యవ్వనబలం దేవునికి కావాలి! దేశానికి కావాలి! అలా కాకుండా కాళ్లుచేతులు
పోయాక, ఊడిపోయిన మంచం కోడిలా అయ్యాక,
పళ్ళు ఊడిపోయిన తర్వాత చంకలో బైబిల్ బేగ్ వేసుకుని స్తోత్రం చెల్లింతుము
అని పాడుదాం అనుకుంటే అప్పుడు నీవు దేవునికి అక్కరలేదు! నీ జీవితాన్ని
మొత్తం సాతానుగాడు,
లోకము పీల్చిపీల్చి పిప్పుచేశాక మిగిలిన శేషజీవితం దేవునికే ప్రభువా
అంటే, ఆ కాలంలో నీవు,
అనగా పిప్పి దేవునికి అక్కరలేదు! దేవునికి పనిచేసే యవ్వనస్తులు
కావాలి!
దేవుడు యోసేపుగారిని బాల్యమందే,
యవ్వనప్రాయంలోకి అడుగుపెట్టినప్పుడే ఎన్నుకున్నారు! దావీదుగారిని
బాల్యమందే ఎన్నుకున్నారు! సమూయేలు గారిని బాల్యమందే ఎన్నుకున్నారు!
యిర్మియాగారిని బాల్యమందే ఎన్నుకున్నారు! యేహెజ్కేలు గారిని బాల్యమందే
ఎన్నుకున్నారు! దానియేలు, షడ్రక్, మేషాక్,
అబెద్నేగో వీరందరినీ బాల్యమందే ఎన్నుకుంటే: యవ్వనములో వారికి ఎన్ని
శోధనలు కలిగినా దేవునికోసం నిలబడి- దేవునికి సాక్షిగా నిలబడ్డారు!
చివరకు వారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారో మీ అందరికీ
తెలుసు!
కాబట్టి దేవునికి నీ యవ్వనం కావాలి!
యవ్వనంలోనే దేవుని సేవ చేయాలి!
మరినీవు సిద్దమా?
(ఇంకా ఉంది)
*దైవజనుడా..... --12వ భాగం*
*విసర్జించవలసినవి-8*
2తిమోతి 2:22 ..
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము),
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును వెంటాడుము...
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
ఈ వచనములో మనకు విసర్జించవలసిన అంశము ఏమిటంటే: యవనేచ్చల నుండి పారిపోవాలి!!
గతబాగంలో యోసేపు, దావీదు, యిర్మియా,
యేహెజ్కేలు, దానియేలు.... వీరికోసం- వీరు బాల్యంలోనే దేవుణ్ణి అంగీకరించి చివరివరకు దేవునిసేవ
చేశారు అని చూస్కున్నాం! అయితే మరి
వీరికి యవ్వనేచ్చలు కలగలేదా అనేది ధ్యానం చేసుకుందాం!
మొదటగా: *యోసేపు*గారు: యవ్వనంలో అడుగుపెట్టిన వెంటనే అన్నలచే ద్వేషించబడి తన్నబడి,
అమ్మబడ్డాడు! చెరసాల పాలయ్యాడు! యువరాజులా పెరిగిన వ్యక్తి బానిసలా
పనిచేయాల్సి వచ్చింది! అయినా దేవునిమీద విశ్వాసం తరగలేదు! ఆ విశ్వాసపు ఫలం
ఆయనకు గొప్ప శోధనలు తీసుకుని వచ్చాయి! తల్లిలాంటి యజమానురాలు తనతో లైంగిక
సంభంధమైన పాపం చెయ్యమంటే,
భలే చాన్సు దొరికింది అని ఆ పాపం చెయ్యలేదు గాని,
అమ్మా! ఇది తప్పు! దేవునికి,
నా యజమానికి వ్యతిరేఖంగా ఈ పాపం చెయ్యలేను అని చెబితే దాని పర్యవసానం-
చేయని నేరానికి జైలు శిక్ష! గానీ భాదపడలేదు! అక్కడకూడా నమ్మకత్వం! దానికి
ప్రతిఫలం: ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు అయన! అప్పటివరకు ఐగుప్టు
దేశంలో లేని పోస్టు కేవలం యోసేపుగారి కోసం సృష్టించి దేవుడు అధికారిగా
చేశారు! యోసేపు గారు పాపం/ కామం/ యవ్వనేచ్చ తనను బలవంతం చేస్తే:
*పారిపోయారు*!
యవ్వనం గతించిపోయిన మరో భక్తుడు: చూడరాని దృశ్యం చూసి—పాపం దగ్గర ఆగిపోయి- ఆ పాపాన్ని పిలిపించుకుని పాపం చేసి,
ఆపాపాన్ని తప్పించుకోడానికి హత్య చేయించి మరో పాపం చేశారు. చివరకు దేవుని
ప్రవక్త వచ్చి ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది అని స్టోరీ చెప్పి,
ఆ దోషివి నీవే అని చెబితే పశ్చాత్తాప పడ్డారు! ఈ భక్తుడు దావీదుగారు! పాపం
దగ్గర ఆగిపోయి- పాపం లో మునిగిపోయారు! గానీ దేవుని మహా కనికరం వలన
కనికరించబడి దేవునిపాదాలమీద పడి ఏడ్చిఏడ్చి పాపాన్ని కడుగుకున్నారు!
దాదాపు అదే యోసేపుగారి ప్రాయం: అదే యవ్వనం,
సంసోను గారు: వద్దు అని చెప్పిన మోహించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని
చెప్పి ఆ అమ్మాయినే పెళ్ళిచేసుకుని సంసారాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు
సంసోను గారు! తర్వాత మారుమనస్సు పొంది పశ్చాత్తాప పడినా,
మరికొన్ని రోజులకు వేశ్యల వెనకాల తిరిగి వ్యభిచారిగా మారి, తన రెండు కన్నులు పోగొట్టుకుని,
దాగోను దేవత గుడిలో హేళనకు గురై చివరికి ఘోరమరణం పొందారు సంసోను గారు!
ప్రియ దైవజనుడా! పాపం దగ్గర ఆగిపోతున్నావా దావీదు గారిలా? పాపంలో పడిపోతున్నావా సంసోనులా?
పాపం నుండి పారిపోతున్నావా యోసేపుగారిలా! పాపంనుండి పరుగెత్తిపోయావా
యోసేపులా ఘనతను పొందుకోగలవు!
ఈ రోజు పాపం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా పాపమే యవ్వనస్తుల
చేతిలోనికి వచ్చేసింది! మొబైల్ ఫోన్! స్మార్ట్ ఫోన్! నిన్ను స్మార్ట్ గా
పాపిని చేస్తుంది! అందులో చూడరాని దృశ్యాలు నీకు చూపిస్తూ, బూతు బొమ్మలు,
బూతుసినిమాలు చూసి నిన్ను నీవు పాడుచేసుకుంటూన్నావా?
లేక జయించి వాటిని చూడకుండా జయజీవితం జీవిస్తున్నావా?
ఎవరూ లేనప్పుడు దానిని జయిస్తే,
ఎవరూ లేనప్పుడు కూడా అలాంటి పాడు వాటిని చూడకుండా నిన్ను నీవు కంట్రోల్
చేసుకుంటే జయజీవితం జీవిస్తుంటే ప్రియ యవ్వనస్తుడా! యవ్వనస్తురాలా! నీవు
ధన్యుడవు!
ఇక దానియేలు, హనన్యా, అజర్యా,
మిషాయేలు అనబడే షడ్రక్,
మేషాక్,
అబెద్నెగో లు కూడా యవ్వనస్తులే! వీరికి పైనుదహరించిన లైంగిక పాపం
శోదించకపోయినా మరో శోధన శోధించింది! అది రాజు బుజించే భోజనం—మాంసాహారం! రాజు పానము చేసే పానము—ద్రాక్షారసం అనగా త్రాగుడు! మన భాషలో మందు-ముక్క! ఇవే శోదించాయి! వీరు
అప్పటికే తమ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి ఉన్నారు కాబట్టి అవి
తినలేదు! అధికారితో వినయముగా మనవిచేసుకున్నారు! అయ్యా! అవి మేము తినం!
వాటికి బదులుగా శాకాహారం,
కేవలం నీరు మాత్రమే ఇవ్వండి అని బ్రతిమిలాడి- చివరకు విజేయులై ఆ
రాజ్యములో ఒకరు ప్రధానమంత్రి కాగలిగారు! మిగిలిన వారు గొప్ప అధికారులు
కాగలిగారు!
ప్రియ దైవజనుడా! నీవుకూడా అలా జయించ గలుగుతున్నావా?
ఇంకా బైబిల్ గ్రంధంలో అనేకమందికి యవ్వనస్తులకు కలిగే శోధనలు కలిగాయి!
వారందరూ జయించారు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తులను ఎంతోఘనంగా వాడుకున్నారు!
ప్రియ దైవజనుడా! దేవుడు నిన్నుకూడా వాడుకోవాలని ఆశిస్తున్నారు! అయితే నీవు
నేడు విసర్జించవలసినది: యవనేచ్చలు!
చివరిగా! యేసుక్రీస్తు ప్రభులవారు కూడా నవ యవ్వనుడే! దివ్య సుందరుడు! ఆయన
సేవ ప్రారంబించిన తర్వాత అనేకమంది స్త్రీలు- ముఖ్యంగా మగ్ధలేనే మరియ, బేతనియకు చెందిన మరియ,
మార్త లాంటి అనేకమంది యవ్వనస్త్రీలు అనుక్షణం అయన వెంటే నడిచేవారు!
ఆయనతోనే తిరిగేవారు! కాని ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభులవారు ఎవరితోనూ పాపం
చెయ్యలేదు! నేడు చాలామంది అవకాశం లేక భక్తిపరుడిలా యాక్షన్ చేస్తుంటారు!
అయితే యేసయ్యకు అవకాశం ఉన్నా పాపాన్ని జయించగలిగారు! ఏ యవ్వనేచ్చ ఆయనను
జయించలేక పోయింది! లోకము ఆయనను ఆకర్షించలేకపోయింది, జయించలేకపోయింది! అందుకే ఆయన విశ్వాసం,
మన విశ్వాసం లోకాన్ని జయించిన విజయం! చివరకు నాలో పాపమున్నాదని మీలో
ఎవడు స్తాపించగలడు అని సవాలు విసిరారు యేసుక్రీస్తు ప్రభులవారు!
ఆయన దేవుడు కాబట్టి ఆయన జయించారు! నేను మనిషిని జయించలేను అంటావేమో!
ఆయనకూడా నీలాగే,
నాలాగే ఇదే లోకంలో ఇదే పాపలోకంలో జీవించారు! మానవులకు కలిగే సకల
రుగ్మతలు,
సకల శోధనలు ఆయనకు కూడా కలిగాయి! గాని ఆయన వాటిని జయించి, మచ్చలేని
జీవితం జీవించారు!
చివరకు సాతాను గాడు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని
తిను అని ఆయను శోధించినా ,
అన్ని శోధనలకు వాక్యము లేక లేఖనములతోనే సమాధానం చెప్పి సాతాన్ని జయించారు!
నీవుకూడా సాతాన్ని జయించటానికి కావలసినది ఆయన వాక్యము! వాక్యము వెల్లడి
అగుట తోడనే వెలుగు కలిగెను! కీర్తనలు 119:130; నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగై ఉన్నది! 105;
ఆయన వాక్యం మనకు దారి చూపిస్తుంది! చివరకు నీ ఎదుట నేను పాపం
చేయకుండునట్లు నాహృదయంలో నీ వాక్యమును ఉంచుకుందును! 119:11;
నీవు పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యంతో నీ హృదయం నిండి ఉండాలి!
యవ్వనేచ్చ మనిషిమీద పనిచేయడం మామూలే! అయితే ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో
ఉంటుందో- ఇలాంటి శోధన ఎదురైతే వాక్యంతో నిండిన అంతరాత్మ అంటుంది- -- ఒరేయ్!
నీవు ఎవడవు?
దేవుని బిడ్డవు! దేవుని బిడ్డలాగే ఉండు! సాతాను బిడ్డలా చేసేవా దేవుడు
ఉమ్ము వేసేస్తారు జాగ్రత్త! ఖబడ్దార్ అని హెచ్చరిస్తూ ఉంటుంది!
ఎప్పుడూ?
ఆ వాక్యముతో నీ హృదయం నిండి ఉన్నప్పుడు! వాక్యాన్ని వదలి- లోకాశలతో
నిండి, నలుగురితో... కులంతో... అన్నట్లు జీవిస్తే—నీ బ్రతుకు అధోగతి అవుతుంది అని మరచిపోకు ప్రియ దైవజనుడా!
కాబట్టి ప్రియ దైవజనుడా! సేవకుడా! యవ్వనస్తుడా! దయచేసి యవ్వనేచ్చల నుండి
పారిపో! యోసేపుగారిని, దానియేలు గారిని,
యేసయ్యను పోలి నడచుకో!
భళా నమ్మకమైన మంచిదాసుడా! అనిపించుకో!
అట్టి కృప ప్రతీ దైవజనునికి కలుగును గాక!
ఆమెన్!
*దైవజనుడా..... --1౩వ భాగం*
*విసర్జించవలసినవి-9*
2తిమోతి ౩:2—5...
2.
ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు
దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
3.
అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు
సజ్జనద్వేషులు
4.
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా
ప్రేమించువారు,
5.
పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.
ఇట్టివారికి విముఖుడవై యుండుము. ...
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
అయితే ఈ రెండవ పత్రిక పౌలుగారు రెండవసారి రోమా జైలులో భందించబడినప్పుడు రాసిన
పత్రిక! ఈ పత్రికలో కూడా మొదటి పత్రికలో ఉదాహరించిన వాటినే మరలా రాశారు కాబట్టి
వాటిని ఇప్పుడు ధ్యానం చెయ్యడం లేదు!
అవేమిటంటే:
2తిమోతి 2:14:
వినువారిని చెరపడానికే తప్ప మరి దేనికి పనికిరాని మాటల కోసం, కొన్ని పదాల కోసం వాదం పెట్టుకోవద్దు!
2:17: అపవిత్రమైన వట్టిమాటలకు దూరంగా ఉండు!
2:23: నేర్పులేని మూడుల వితర్కములను విసర్జించు!
పై విషయాలు అన్నింటికోసం గతభాగాలలో ధ్యానం చేశాము కాబట్టి మరోసారి వాటిని
ధ్యానం చెయ్యడం లేదు!
అయితే
పైనుదహరించిన వారికి విముఖుడవై ఉండమంటున్నారు పౌలుగారు! వారు ఎవరు అంటే:
స్వార్ధప్రియులు, ధనాపేక్షులు,
బింకము లాడువారు, అహంకారులు,
దూషకులు,
తల్లిదండ్రులకు అవిదేయులు,
కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు,
అనురాగ రహితులు, అతిద్వేషులు,
అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు, సజ్జన ద్వేషులు,
ద్రోహులు, మూర్ఖులు,
గర్వాంధులు,
దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు,
పైకి భక్తిగలవారివలె ఉండియు,
దాని శక్తిని ఆశ్రయించని వారు!
దైవజనుడా! ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే: వీరికి దూరంగా ఉండు అంటే దాని
అర్ధం ఇలాంటివారు మంచివారు కాదు కాబట్టి ఇలాంటివారికి దూరంగా ఉండటమే
కాదు,
నీవుకూడా ఇలా తయారుకావద్దు! ఇలా ఉండవద్దు అని అర్ధం కూడా వస్తుంది! అనగా
దైవజనుడు అనేవాడు ఎవరు కూడా మీదన ఉదాహరించిన లిస్టులో ఉండరాదు!
*మొదటది*: *స్వార్దప్రియులు*! దైవజనుడికి స్వార్ధం అనేది ఉండకూడదు! స్వార్ధం మనిషిని పశువును చేస్తుంది.
స్వార్ధం యోసేపుని ద్వేషించి హత్యచేయడానికి కూడా తయారయ్యింది! కాబట్టి
దైవజనుడా! స్వార్ధాన్ని విసర్జించు!
*రెండవది*: *ధనాపేక్ష*! దీనికోసం వివరంగా
ధ్యానం చేసుకున్నాం గతబాగాలలో!
*మూడవది*: *బింకములాడువారు*:
అనగా మొదటగా అబద్దాలు చెప్పేవారు- ఎలాంటి అబద్దాలు అంటే లేనిపోని గొప్పలు
చెబుతూ మేము ఇంతాఅంతా అని చెబుతూ మోసం చేసేవారు
– బింకములాడువారు. దైవజనుడు –
తను గొప్పలకు పోగూడదు! తగ్గింపు జీవితం కలిగియుండాలి! బింకములు అసలు
చెప్పకూడదు! చివరకు తన బింకములు సాగకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది లేదా
ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది అందుకే దైవజనుడా! ఈ బింకములకు, బింకములాడువారికి దూరంగా ఉండు!
*నాల్గవది*: *అహంకారులు*! అనగా గర్వంగా మాట్లాడువారు! అహంకారులుగా ఉండవద్దు అని అహంకారులుకు దేవుడు
ఆజ్ఞ ఇస్తున్నారు! కీర్తనలు
75: 4
అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
అహంకారులను ,గర్విష్టులను గద్దెదించి,
దవడ పళ్ళు ఊడగొడతారు దేవుడు! కాబట్టి ప్రియ దైవజనుడా! నీకు కలిగిన
తలాంతులను బట్టి గాని, ఆస్తిని బట్టిగాని,
సంఘాన్ని బట్టి గాని అహంకారంగా ఉండక,
పడిపోతానేమో అని భయపడుతూ పాపం చెయ్యొద్దు!
*ఐదవది*: *దూషకులు*!
అనగా అందరిని దూషించువారు! దైవజనుడు ఎవరినీ దూషించకూడదు!
*ఆరవది*: *తల్లిదండ్రులకు అవిదేయులు*:
తల్లిదండ్రులకు లోబడని వారు! యేసుక్రీస్తు ప్రభులవారు తల్లిదండ్రులకు
లోబడ్డారు! ఇలాంటి భక్తులెందరో తమ తల్లిదండ్రులకు లోబడ్డారు. సంసోను
తల్లిదండ్రులకు లోబడక తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. సంసారం మూడుముక్కలై
పోయింది.
నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అదీ
దేవుడు పెట్టిన కండిషన్! నిర్గమ 20:12;
నీవుకూడా మీ తల్లిదండ్రులకు లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
*ఏడవది*: *కృతజ్ఞత లేనివారు*:
అనగా చేసిన ఉపకారాలు మరచిపోయేవారు!
పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయాడు! అలాగే దేవుడు చేసిన మేలులను ఈ కాలంలో
ఎంతమందో మరచిపోయి కృతజ్ఞత లేకుండా తిరుగుతున్నారు! ఇలాంటి వారు దేవుడిచ్చిన
అంటరానివారి లిస్టులో చేరిపోయారు!
*ఎనిమిదవది*: *అపవిత్రులు*! అనగా
దేవుడు వద్దు అని చెప్పిన పని చేసి అపవిత్రతను అంటించుకున్నవారు! ఇంకా
చెప్పాలంటే ఈలోక మాలిన్యమును తమ ఘటములకు అంటించుకుని పాపముతో మలినమైపోయిన
అపవిత్రులకు దూరంగా ఉండమని చెబుతున్నారు. నరకానికి పోయే లిస్టులో ఉన్నారు
వీరు!
*తొమ్మిదవది*: *అనురాగ రహితులు*!
అనగా అనురాగం లేనివారు!
తండ్రికి పిల్లలమీద ప్రేమ ఉంటుంది దానిని అనురాగం అంటారు. అలాగే తల్లికి
పిల్లలమీద అనురాగం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులమీద కూడా పిల్లలకు కూడా
అనురాగం ఉండాలి! అది లేకపొతే కృతఘ్నుడు అంటారు. ప్రియ దైవజనుడా! నీకు ఆ
అనురాగం ఉందా? కృతఘ్నుడుగా ఉన్నావా?
మొన్న ఒక పాష్ట్రమ్మగారి జ్ఞాపకార్ధకూటం కి వెళ్ళాము,
అక్కడ మా తండ్రిగారితో పాటు సేవచేసిన ఒక దైవసేవకుని విషాద గాధ తెలిసింది.
ఆయన కుమారుడు ఆ దైవసేవకుడు సంపాదించిన రెండు సంఘాలు తీసుకుని, రెండు ఇల్లు తీసుకుని,
తండ్రికి తల్లికి భోజనం కూడా పెట్టకుండా వృద్ధాప్యమందు వ్యాధిగ్రస్తులై
ఉంటే కనీసం ఈ పిల్లపాదిరి తల్లిదండ్రులను చూడటం లేదు! ఇక వీడు ఏమని
భోదిస్తాడు అండి? వీడిభోధ ఎవరైనా వింటారా?
ఇలాంటి అనురాగ రహితులుగా దైవజనుడు ఎట్టిపరిస్తితిలలోను ఉండరాదు!
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --14వ భాగం*
*విసర్జించవలసినవి-10*
2తిమోతి ౩:2—5...
2.
ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు
దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
3.
అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు
సజ్జనద్వేషులు
4.
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా
ప్రేమించువారు,
5.
పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.
ఇట్టివారికి విముఖుడవై యుండుము. ......
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా
ధ్యానం చేస్తున్నాం! ఈరోజు మరికొన్ని ధ్యానం చేద్దాం!
*పదవది*: *అతిద్వేషులు*:
అనగా తీరని పగ కలవారు! నీకోపము సూర్యుడు అస్తమించులోగా చల్లారిపోవాలి అని
దేవుడు సెలవిస్తే (ఎఫెసే
4:26)
వీరు అవతలి వారికి హాని జరిగేవరకు నిద్రపోరు! ఇలాంటివారికి దూరంగా
ఉండాలి,
అంతేకాకుండా దైవసేవకునికి ఇలాంటి బుద్ధి ఎట్టి పరిస్తితిలోనూ
ఉండకూడదు!
*పదకొండవది*: *అపవాదకులు*!
అనగా
ప్రతీ ఒక్కరిమీద ఏదో ఒక అపవాదు వేస్తారు. వీరికి ఏ పనీపాటు లేదు! ఎవరిమీదో
ఏదో ఒకటి అంటూ ఉండాలి! వీరికి దూరంగా ఉండాలి!
*పండ్రెండవది*: *అజితేంద్రియులు*!
అనగా తమనుతాము అదుపులో పెట్టుకోని వారు! తమ కంట్రోల్ లో వారుండరు!
కొంతమందిని ఎవరో ఒకరు ఆడిస్తారు! ఎవరో చెప్పినట్లు ఆడేవారు తప్ప, వారికి వారు ఏది తప్పు,
ఏది నిజం అని ఆలోచన కలిగియుండరు! మరికొంతమంది కోపం వస్తే వారికివారు
కంట్రోల్ కారు. అవతలివారిని ఏదో ఒకటి చేస్తేనే గాని ఉండలేరు! ఇలాంటి
పిచ్చికోపం కూడా దైవజనునికి ఉండకూడదు! కాబట్టి దైవసేవకుడు తననుతాను అదుపులో
ఉంచుకోవాలి!
*13వది*: *సజ్జనద్వేషులు*!
అనగా మంచివారిని,
మంచిచేసే వారిని ద్వేషించేవారు! నేటిరోజులలో చాలామందికి మంచి గిట్టడం
లేదు! చెడు వెనుక పరుగెత్తుతున్నారు! గమనించాలి చెడు అనేది ఏదీ కూడా పరలోకం
సమీపించదు అని గమనించాలి! అలాగే మంచివారిని ద్వేషించేవారు కూడా పరలోకం
వెళ్ళరు అని గమనించాలి! గమనించాలి అబద్దమును ప్రేమించి దానిని జరిగించువారు
వెలుపల ఉందురు అని బైబిల్ సెలవిస్తుంది! ప్రకటన 22:15;
కాబట్టి దైవజనుడా మంచిని ప్రేమించి హత్తుకో! చెడును ద్వేషించు!
*14వది*: *ద్రోహులు*! అనగా
ద్రోహం చేసేవారు! చేసిన మేలుకు ప్రతిగా కీడుచేసేవారు! నమ్మించి మోసం
చేసేవారు! వీరంతా ఒకటే గ్రూప్! ఈ గ్రూప్ కి దూరంగా ఉండాలి దైవజనుడు!
యేసుప్రభులవారితో మూడున్నర సంవత్సరాలు ఉండి,
డబ్బుకోసం ప్రభువుని ద్రోహం చేసి అమ్మేశాడు ఇస్కరియోతు యూదా! ఏం
సాధించాడు??!!
మరణం! ఘోరమరణం! దైవజనుడా! నీవుకూడా ద్రోహం చేస్తే నీకుకూడా పట్టేది అదే!
దేవునికి, దేవుని సేవకు ద్రోహం చేస్తే,
ధనాశ వెనుక పరుగెడితే యూదాకు పట్టిన గతే,
గేహాజీకి పట్టిన గతే నీకు కూడా కలుగుతుంది అని మరచిపోకు!
*15వది*: *మూర్ఖులు*: అనగా మూర్ఖంగా ప్రవర్తించేవారు! ఏది చెడు,
ఏది మంచి అనే విచక్షణా జ్ఞానం లేనివాడు! ఇలాంటి బుద్ధి దైవజనునికి
ఉండకూడదు! అంతేకాకుండా ఇలాంటి మూర్ఖుల సహవాసం చేస్తే దైవజనుడి పరువు గంగలో
కలుస్తుంది. మూర్ఖుని సహవాసం చేయువాడు చెడిపోతాడు అని చెబుతుంది
బైబిల్!
*16వది*: *గర్వాంధులు*:
అనగా
గర్వం చేత కళ్ళు మూసుకుని పోయి అందత్వం కలవారు! నెబుకద్నేజర్ రాజు
గర్వించి,
నాచేతిలోనుండి మిమ్మును తప్పించేవాడు ఎవడు అన్నాడు! చివరకి గడ్డిమేశాడు!
అస్శూరు రాజు గర్వించాడు! చచ్చాడు తన సొంత కుమారుల చేతిలో! ఇంకా గర్వించిన
వారు ఎందఱో బైబిల్ లో భంగపడ్డారు! దైవజనుడా నీవుకూడా గర్విస్తే భంగపడక
తప్పదని మరచిపోకు!
*17వది*: *దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు*!
ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే దేవుని కంటే తమ లగ్జరీ లైఫ్ నే
ఎక్కువగా ప్రేమించు వారు! దేవుని సేవ కంటే,
తమ సుఖముల కోసం ఎక్కువగా ప్రాకులాడే వారు! మందిరంలో ఉపవాస కూటం ఉంది
అంటే తమ మంచం ఎక్కడ పోతుందో అని,
ఉపవాసకూటంకి రాకుండా ఆ పరుపులపై పడుకునే వారు! మరికొంతమది:
పల్లెటూర్లలో, కొండప్రాంతాలలో సేవ చెయ్యాలి అంటే బాధ అని,
లగ్జరీలకు అలవాటు పడి,
కేవలం పట్టణాలలో మాత్రమే సేవచేసేవారు లేక పట్టణాలలోనే వాక్య పరిచర్య
చేసేవారు! వీరికి ఫ్లైట్ టికెట్, AC
రూమ్ బుక్ చేస్తేనే ప్రసంగానికి వస్తారు! ప్రసంగానికి ఇంత రేటు అని
ఫిక్స్ చేసి,
వ్యాపారం చేసేవారు! ఇలాంటి కోవకు చెందిన వారికి దేవునికంటే తమ సుఖాల
కోసమే తిరుగుతారు తప్ప,
సేవకోసం పనిచేయరు! దైవజనుడా! ఇలాంటివి నీకు కుదరదు! ఇలాంటి వారితో
సహవాసం కూడా చెయ్యకూడదు!
*చివరిది*: *పైకి భక్తిగలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు*:
అనగా పైకి మేము భక్తీ పరులము అని యాక్షన్ చేస్తూ,
ఆ భక్తియోక్క శక్తిని ఆశ్రయించకుండా ప్రజలను మభ్యపెట్టే వారు! వీరి
భక్తి అంతా పెదాలమీదనే ఉంటుంది! వీరి భక్తి పెళ్లి దగ్గర,
ఆచార వ్యవహారాల దగ్గర తేలిపోతుంది! అప్పుడు మనం భారతీయులం కదా! ఈ
ఆచారాలు పాటించక పోతే ప్రజలు ఏమని అనుకుంటారు అంటారు! గుడిలో భక్తిగా
ఉంటారు! ఇంటికి వచ్చిన వెంటనే అన్యుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తారు!
పెద్దపెద్ద దీర్ఘ ప్రార్ధనలు చేస్తారు గాని దేవుణ్ణి వారి బ్రతుకులో
చూపించరు! నోరు తెరిస్తే చాలు బూతులు,
తిట్లు! సమాధానం లేని బ్రతుకులు! తెల్లనిబట్టలు వేసుకుంటారు గాని నల్లని
జీవితం జీవిస్తూ ఉంటారు! ఇలాంటి వారినే దేవుడు ఎండకట్టారు! వీరు సున్నం
కొట్టిన సమాదులతో పోల్చారు యేసుప్రభులవారు! ప్రసంగాలు చూస్తే ఎంతో
ఉజ్జీవంగా పరలోకాన్ని దించేసినట్లు ఉంటుంది,
గాని బ్రతుకులో మార్పులేని జీవితం! పెళ్ళాన్ని కొట్టడం, అక్రమ సంభంధాలు కలిగియుండడం,
తోటి సేవకునితో సమాధానం లేకపోవడం! ఇలాంటి రోగాలు అన్ని కూడా పైకి
భక్తిగలవారి ఉండి లేదా నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారి లిస్టు లోకే
వస్తాయి!
ప్రియ దైవజనుడా! కాపరీ! ఒకవేళ ఇలాంటి బుద్ధులు నీకుంటే నిన్నునీవు మోసం
చేసుకుంటున్నావు అని మరచిపోవద్దు! అంతేకాదు ఇలాంటివారికి విముఖడవై ఉండమని
దైవజనుడైన పౌలుగారు హెచ్చరిస్తున్నారు!
ఒకసారి నరకానికి పోయే గుంపు లేక లిస్టును చూసుకుందాం! ప్రకటన 21:8
8. పిరికివారును,
అవిశ్వాసులును, అసహ్యులును,
నరహంతకులును, వ్యభిచారులును,
మాంత్రి కులును,
విగ్రహారాధకులును,
అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. .....;
22:15...
15.
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును
అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
దైవజనుడా! నీవు ఏ గుంపులో ఉన్నావు? ఎత్తబడే గుంపులోనా?
లేక విడువబడే గుంపులోనా?
నిన్నుగూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తపడి,
నీ బోధను వినేవారిని కూడా రక్షించుకొని పరలోక వాసులుగా చెయ్యమని
యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మనవి చేస్తున్నాను!
అట్టి కృప దేవుడు ప్రతీ దైవజనునికి దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --15వ భాగం*
*చేయదగినవి-1*
2తిమోతి 1:8.
కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక,
దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో
పాలివాడవైయుండుము...
2తిమోతి 2:3 ...
క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను అనుభవించుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు విసర్జించవలసిన విషయాల కోసం విస్తారంగా ధ్యానం
చేశాము! ఇక ఇప్పుడు మనం దైవజనుడు చేయవలసిన పనులు ఏమిటి లేక దైవజనుడు
హత్తుకోవలసినవి ఏమిటి అనేవి పౌలుగారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నుండి
ధ్యానం చేసుకుందాం! గమనించాలి ఈ పత్రిక పౌలుగారు రెండవసారి రోమాలో ఖైదుగా
ఉన్నప్పుడు ఇక తిమోతిని కలవడం అసాధ్యం అని నిశ్చయమైన తర్వాత తిమోతి గారికి
ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం యొక్క చార్జి అప్పగిస్తూ, ఏమేమి చేయాలో,
ఎలా ఉండాలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఇస్తూ రాస్తున్నారు. అంతేకాదు
మొదటిభాగంలో వివరించినట్లు ఇది చార్జి Handing Over Note!
ఇక మొదటగా దైవజనుడు హత్తుకోదగినది లేక చేయవలసినది: సువార్తకోసం శ్రమపడాలి!
పైరెండు వచనాలలో మొదటగా సువార్తకోసం సిగ్గుపడక నా శ్రమానుభవంలో పాలుపొందుకో!
అంటే అనగా సువార్తకోసం సిగ్గుపడక శ్రమలు అనుభవించు,
ఎందుకనగా సువార్తలో శ్రమలు తప్పకుండా కలుగుతాయి! ఇక రెండవ వచనంలో
క్రీస్తుయేసు మంచి సైనికుని వలె నాతోకూడా శ్రమను అనుభవించు అంటున్నారు! ఈ
రెండు వచనాల ఆధారంగా దైవజనుడు తప్పకుండా శ్రమలు అనుభవించాలి! ఎవరినైనా మంచి
పదార్ధాలు తినడానికి లేక మంచి స్వాస్త్యము పొందుకోడానికి రా అని పిలిస్తే
వస్తారు గాని నాతోపాటు చెరలు, సంకెళ్ళు,
చీవాట్లు చెప్పుదెబ్బలు తినడానికి రా అని పిలిస్తే ఎవరు వస్తారు?
గాని తిమోతిగారు వచ్చారు! ఆదిమ సంఘం క్రీస్తుచెప్పిన భోధలకు శ్రమలకు
సిద్దపడి సేవకు వచ్చారు! శ్రమలు అనుభవించి ఘనమైన సేవ చేశారు! కాబట్టి సేవ – అనగా శ్రమల గుండా,
శ్రమలను అనుభవించి చేసేదే సేవ!
ఈ సందర్భంగా నాకు ఒక కధ గుర్తుకు వస్తుంది! ఒక యవ్వనస్తుడు ఒక పాదిరి గారి
వెనుక ఎప్పుడూ ఆయనతోపాటుగా సేవకు వెళ్తూ ఉండేవాడు! కొన్ని సంవత్సరాల తర్వాత
ఆ యవ్వనస్తుడు అన్నాడు: అయ్యగారు! నేనుకూడా ప్రత్యేకంగా దేవునిసేవ
చేస్తానండి. నన్ను దీవించి ప్రార్ధించి పంపండి అంటే అయ్యగారు
సంతోషించి,
చేతులుంచి ప్రార్ధనచేసి పంపించారు అట! కొన్నిరోజులు పోయిన తర్వాత ఆ
యవ్వనస్తుడు వచ్చి అంటున్నాడు ఆ పాదిరిగారితో: అయ్యగారు మీరు
సేవచేస్తే, మీతోపాటు సేవకు వెళ్తే ఘనత,
స్వాగతం,
ఇంకా బిరియానీలు పెడుతున్నారు. మరినేను సేవకు వెళ్తే - గుండగా
తన్నేస్తున్నారు! ప్రతీరోజు చీవాట్లు అవమానం, ఆకలిదప్పులు! మీకో న్యాయం! నాకో న్యాయమా?
ఏమిటండి ఇదీ?
అని అడిగాడట! వెంటనే పాదిరిగారు అన్నారట: బాబు! మొదట నేనుకూడా వాటినే
తిన్నాను, అవి తిన్నాకనే ఈ బిరియానీలు,
ఘనత,
గౌరవం అన్నారట! కాబట్టి సేవలో మొదటగా శ్రమలు,
అవమానాలు,
ఆకలిదప్పులు తప్పదు!
పౌలుగారు సేవలో ఏర్పడిన భాదల లిస్టు ఒకసారి చెప్పారు చూద్దాం!.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27,28
23. వారు క్రీస్తు పరిచారకులా?
వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను,
నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని;
అపరిమితముగా దెబ్బలు తింటిని,
అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24.
యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని;
ఒకసారి రాళ్లతో కొట్టబడితిని;
ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని;
ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను,
నదులవలననైన ఆపదలలోను,
దొంగలవలననైన ఆపదలలోను,
నా స్వజనులవలననైన ఆపదలలోను,
అన్యజనులవలననైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలోను,
అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
27. ప్రయాసతోను,
కష్టములతోను,
తరచుగా జాగరణములతోను,
ఆకలి దప్పులతోను,
తరచుగా ఉపవాసములతోను,
చలితోను,
దిగంబరత్వముతోను ఉంటిని,
ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
28.
ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును
నాకు కలుగుచున్నది. ........ ఇన్ని
భాధలు పడ్డారు పౌలుగారు.
యేసుప్రభులవారే స్వయంగా శ్రమలు అనుభవించాలి అని చెప్పారు కదా..
యోహాను సువార్త 15:20
దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము
చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల ...
John(యోహాను సువార్త) 16:1,2,3,4,12,20,33
1.
మీరు అభ్యంతర పడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను.
2.
వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు;
మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము
వచ్చుచున్నది.
3.
వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.
4.
అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు
జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను;
నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.
12.
నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని యిప్పుడు మీరు వాటిని
సహింపలేరు.
20.
మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును;
మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.
33.
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. *లోకములో
మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి యున్నాననెను*.
అయన చెప్పడమే కాదు,
ఆయనే స్వయంగా ఎన్నో శోధనలు అవమానాలు అనుభవించారు. సిలువను మోసేటప్పుడు
పచ్చిమానుకే(అనగా యేసుక్రీస్తు) ఇలా చేస్తున్నారు! ఎండుమానుకు (అనగా
విశ్వాసులు లేదా ఆయనను వెంబడించేవారు)
ఇంకేలాగు చేస్తారో అని ముందే చెప్పారు! లూకా 23:31;
నాకోసం జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్లా
పలుకునప్పుడు మీరు ఏడవండి అనలేదు,
మీరు సంతోషించి ఆనదించుడి కారణం మీ ఫలము పరలోకమందు అధికమగును! మత్తయి 5:11,12;
అంతేకాదు పూర్వ కాలంలో ప్రవక్తలను కూడా అలాగే చేశారు అని చెబుతున్నారు
యేసయ్య!
అందుకే పౌలుగారు సువార్తకోసం సిగ్గుపడక నాతోపాటు శ్రమానుభవంలో పాలుపొందుకో
అంటున్నారు! మంచి సైనికునివలె నాతోపాటు శ్రమలు పడు అని చెబుతున్నారు! నీవు
సేవకు వస్తే రెండు బంగ్లాలు, మూడు చర్చీలు,
నాలుగు కార్లు..... వస్తాయి అని ఎక్కడా లేదు! అవమానాలు,
నిందలు, హింసలు,
చెరసాల ఆకలిదప్పులు... ఇవే వస్తాయి అని ముందుగానే చెప్పారు అందరికీ
పౌలుగారు!అపో.కార్యములు 14: 22
*శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు,
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని
హెచ్చరించిరి.*
దానికి ఒప్పుకునే వచ్చారు తిమోతిగారు, తీతుగారు! వీటిని భరించలేక,
ఇహలోకాన్ని,
ధనాన్ని ఆశించి మధ్యలో వదిలేసి పారిపోయాడు దేమా! ప్రియ దైవజనుడా! నీవు
ఎవరిలా ఉంటావు? పౌలుగారిలాగా?
లేక తిమోతి తీతు లాగా?
లేక పారిపోయిన దేమా లాగానా?
ఆలోచించుకో! తిమోతికి చెబుతూ అంటున్నారు పౌలుగారు : క్రీస్తుయేసునందు
సద్భక్తితో బ్రతుక నుద్దేశించువారికి శ్రమలు కలుగును! 2తిమోతికి 3: 12
*క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు
హింసపొందుదురు.*
ఈలోకంలో ఎవరైతే భక్తిగా,
ఇంకా చెప్పాలంటే సద్భక్తిగా అనగా నిజమైన మంచి భక్తితో ఉంటారో వారికి
తప్పకుండా శ్రమలు కలుగుతాయి! సగం సచ్చిన క్రైస్తవులకు శ్రమలు రావు! నీకు
శ్రమలు రావడం లేదు అంటే నీవు నులివెచ్చని క్రైస్తవుడవు అని అర్ధం అంతే! ఇంకా
మచ్చుకు కొన్ని రిఫరెన్సులు చూద్దాం!
2తిమోతికి 4: 5
అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, *శ్రమపడుము*,
సువార్తికుని పనిచేయుము,
నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
రోమా 5:౩.
అంతే కాదు; శ్రమ ఓర్పును,
ఓర్పు పరీక్షను,
పరీక్ష నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి...;
8:17..
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; *క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము*.....; 2కొరింథీ 4:17
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ
భారమును కలుగజేయుచున్నది.....;
1పేతురు 4:12—16
12. ప్రియులారా,
మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో
యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13.
క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు
నిమిత్తము,
క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14.
క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ,
మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని,
దొంగగా గాని,
దుర్మార్గుడుగా గాని,
పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
16. *ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను*.
17.
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది;
అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి
యేమవును?
కాబట్టి విశ్వాసి, సేవకుడు,
దైవజనుడు శ్రమలను అనుభవిస్తూనే సేవ చేయాలి!
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --16వ భాగం*
*చేయదగినవి-1*
2తిమోతి 1:8.
కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక,
దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో
పాలివాడవైయుండుము...
2తిమోతి 2:3 ...
క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె నాతో కూడ శ్రమను
అనుభవించుము.....
(గతభాగం తరువాయి)
గతంలో మీకు మా సంఘంలో ఒక పనికిమాలిన విశ్వాసి గురుంచి చెప్పాను!
ఆవిడ అంటుంది –
ఇంకా అందరిని పాడుచేస్తుంటుంది: దేవుడిని అంటీఅంటనట్టు-
ప్రేమించిప్రేమించనట్టు ఉండాలి అట, ఎక్కువగా ప్రేమిస్తే,
ఎక్కువగా భక్తిగా ఉంటే కష్టాలు వచ్చేస్తాయి అట! ఇంకా ఏమంటుంది అంటే:
కోర్నెలు పాష్టరు గారు అంటే మా అన్నయ్య (46
సం.లు) చెడ్డీలు వేసుకున్నప్పుడు దేవుడ్ని నమ్ముకున్నాను,. ఇంతవరకు నాకు ఏ శోధన,
కష్టాలు రాలేదు. కాబట్టి మీరు అలాగే ఉండాలి,
నెలకోసారి గాని,
రెండునెలలకు ఒకసారి చర్చికి వెళ్తే చాలు! అప్పుడప్పుడు కానుకలు పంపితే చాలు
అని చెప్పి- సంఘస్తులను పెడత్రోవ పట్టిస్తుంది ఈ పనికిమాలిన విశ్వాసి
హెలీనమ్మ! ఇలాంటి పనికిమాలిన మాటలు వింటే తప్పకుండా నులివెచ్చని స్తితిలో
దేవునిచే ఉమ్ము వేయించుకుని నరకానికి పోవలసినదే!
ఇంకా యేసుబాబుని నమ్ముకుంటే మీకు శ్రమలు, శోధనలు,
కష్టాలు రావు అని ఎవరైనా భోధకుడు చెబితే ఆ భోధకుడు దొంగ భోధకుడు, అబద్ద భోధకుడు అని మరచిపోవద్దు!
అలాగే పాష్టర్లు, సేవకులు తెల్లనిబట్టలు వేసుకుని తిరిగేస్తున్నారు,
ఫ్రీగా అన్నీ వచ్చేస్తున్నాయి! పొట్ట గడిచి పోతుంది ఈజీగా అని
భ్రమించి, భావించి ఎవడైనా సేవకు వస్తే,
గమనించాలి- సేవలో చీవాట్లు,
చెప్పుదెబ్బలు,
అవమానాలు- ఆకలిదప్పులు తప్పవు! ఎప్పుడూ?
నిజంగా సేవచేసే వారికి! కేవలం విశ్వాసం మీదనే ఆనుకున్నవారికి!
అయితే ఇవన్నీ సహిస్తే ఒకరోజు దేవుడు నిన్ను దీవించి,
నీకు సంఘం ఇచ్చి,
అంచెలంచెలుగా దీవిస్తారు! దానికి సజీవసాక్ష్యం మేమే! మా తల్లిదండ్రులే! మా
తల్లిదండ్రులు ఒక టీ త్రాగి 25
గ్రామాలలో సేవను ప్రకటిస్తూ ఉండేవారు. ఒకపూట భోజనం చేస్తే- నాలుగైదు రోజులు
పస్తులుండి సేవ చేసారట! ఎవర్నీ ఏదీలేదు అని అడుక్కోలేదు! ప్రజలకు అన్నం
వండుకున్నారు అని చూపించడానికి పాత్రలో నీళ్ళువేసి మంట పెట్టేవారట! ఇలా ఎన్నో
కష్టాలు పడి,
కాలినడకను సేవచేశారు. తర్వాత దేవుడు ఒక సైకిల్ ఇచ్చారు! చర్చీలు లేని
రోజులలో దానిమీద రోజుకు కనీసం 15గ్రామాలు తిరిగి సేవచేసే వారట! ఇప్పుడు మా తండ్రిగారు ఏఏ గ్రామాలలో
సేవచేశారో,
సువార్త చెప్పారో ఆ గ్రామాలలో గ్రామానికి కనీసం రెండు సంఘాలు కట్టబడ్డాయి!
మా తండ్రిగారు కష్టబడ్డారు- ఇతరులు ఆ కోతను కోస్తున్నారు. అందుకు దేవునికి
స్తోత్రం! ఆ కన్నీటి పరిచర్యలో నేనుకూడా ఎన్నోసార్లు రాళ్ళదెబ్బలు, అవమానాలు,
ఆకలిదప్పులు అనుభవించాను! అందుకే దేవునికి స్తోత్రం!
కాబట్టి నేను చెప్పేదేమిటంటే- ఇంకా పౌలుగారు చెప్పేదేమిటంటే: సేవ ఆషామాషీ
కాదు! ముల్లపైన నడక! దానిని సవాలుగా తీసుకుని ఆ బాటలో నడిచావా—దేవునిచే భళానమ్మకమైన మంచిదాసుడా! అని పిలిపించుకోవడమే కాదు- ఒకరోజు ఈ
భూమిమీద కూడా దేవుడు నిన్ను నిండార ఆశీర్వాదాలతో నింపుతారు. దానికి కూడా
సాక్షులం మేమే! అటువంటి క్లిష్టమైన స్తితిలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడు
కరుణించి అంచెలంచెలుగా దేవుడు మమ్మును దీవించారు. మా కష్టార్జితం తోనే
మమ్ములను లక్షాదికారులుగా చేశారు. మా గ్రామంలో ఒక పేరు తీసుకుని వచ్చారు
దేవుడు! ఆశీర్వదించబడిన కుటుంబానికి ఉదాహరణగా దేవుడు మమ్ములను చేశారు.
ఎందుకంటే మా తల్లిదండ్రులు చేసిన నిస్వార్ధమైన సేవ! మాకు
కన్నీటిప్రార్ధన,
భక్తీ ఈ రెండుమాత్రమే నేర్పించారు. అవి మమ్మును ఉన్నత స్తానానికి తీసుకుని
వచ్చాయి! మా తల్లిదండ్రుల ప్రార్ధన వ్యర్ధమైపోలేదు!
ప్రియ యవ్వనస్తుడా! సేవకుడా! సేవ అంటే చంకలో బైబిల్ బేగ్ వేసుకుని,
కరపత్రాలు పంచుతూ లేక సంఘాన్ని కాయడమే కాదు! ఎన్నెన్నో అవమానాలు పొందాలి! ఒక
శిశువు జన్మించాలి అంటే ఆ తల్లి ప్రసవవేదన అనుభవించాలి! అలాగే సంఘం కట్టబడాలి
ప్రసవవేదన అనుభవించాలి! కష్టాలు- కడగండ్లు,
అవమానాలు ఇవన్నీ అనుభవిస్తే మంచి సంఘం కట్టబడుతుంది! యేసుక్రీస్తు
ప్రభులవారు అలాంటి ప్రసవవేదన అనుభవించి ఆదిమసంఘాన్ని కట్టారు! ఆ ఆదిమసంఘం అదే
కష్టాలు- శోధనలు-శ్రమలు- ప్రసవవేదన అనుభవించి ఆ సంఘాన్ని కొనసాగించారు.
అందుకే నీవునేను రక్షించబడి ఈ రక్షణ సువార్త మనవరకు వ్యాపించింది! వారు
ఆరోజులలో లగ్జరీల కోసం ఎదురుచూస్తే మనం రక్షించబడి ఉండేవారము కాదు! ఆయన
అన్నారు: కోత విస్తారం గాని పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి కోతకు
పనివారిని పంపమని యజమానునికి ప్రార్ధనచెయ్యమని చెప్పారు! మత్తయి 9:37; లూకా 10:2;
అదేమాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది! సువార్త అందని ప్రాంతాలు నేడుకూడా
ఉన్నాయి! మరి ఆ చోట్లలో సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది కదా! మరి ఆ
ప్రాంతాలలో సేవచేయడానికి నీవు సిద్దమా? గమనించాలి! సేవ అనగా శ్రమలు అనుభవించి,
కష్టాలు పడితేనే సువార్త ఫలిస్తుంది! చివరకు శ్రమలు అనుభవించి మాత్రమే నీవు
పరలోకం చేరగలవు!
ప్రియ దైవజనుడా! శ్రమలు చూసి పారిపోవద్దు! ఏవో భయంకరమైన,
మానవాతీతమైన విషయాలు సంభవిస్తున్నట్లు భావించకు! మన పితరులు ఆ మార్గం లో
నడిచే ఘనమైన సువార్త చేశారు! విదేశీ ఎంగిలిమెతుకులకు ఆశపడి సత్యవాక్యాన్ని
సంతలో అమ్మేవద్దు! శ్రమలు సహించు! సువార్తికుని పనిచేయ్యు! భళానమ్మకమైన
మంచిదాసుడా! అని దేవునిచేత పిలిపించుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --17వ భాగం*
*చేయదగినవి-2*
2తిమోతి 1:13—14
13.
క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై,
నీవు నావలన వినిన హితవాక్య(ఆరోగ్యముగల వాక్య) ప్రమాణమును గైకొనుము;
14.
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి మనం దైవజనుడు హత్తుకోవలసినవి లేక చేయదగిన
క్రియలకోసం ధ్యానం చేస్తున్నాం! గతభాగాలలో దైవజనుడి శోధనలకు జడియక హత్తుకోవాలి
అనేది ధ్యానం చేసుకున్నాం! ఈరోజు పైరెండు వచనాలలో మనకు కొన్ని విషయాలు
అర్ధమవుతాయి వాటిని తప్పకుండా హత్తుకోవాలి! పైరెండు వచనాలు బాగా అర్ధం కావాలంటే
ఒకసారి స్టడీ బైబిల్ లో ఏమని వ్రాసి ఉందో చూసుకుందాం!
..13 • నీవు నావల్ల విన్నదానిని –
ఆ సవ్యమైన బోధన మాదిరిని –
క్రీస్తు యేసులో•
ఉన్న విశ్వాసంతో, ప్రేమతో•
అవలంబించు.
14 నీకు అప్పగించిన ఆ మంచిదానిని•
మనలో నివాసమున్న• పవిత్రాత్మ•
వల్ల కాపాడుకో......
క్రీస్తుయేసునందు ఉంచవలసిన విశ్వాసప్రేమలు అంటున్నారు,
ఇక్కడ చాలా విషయాలున్నాయి. మొదటగా దైవజనుడికి లేక సేవకునికి లేక కాపరికి
ఉండవలసిన లేక హత్తుకోవలసినవి మొదటగా విశ్వాసము, రెండవదిగా ప్రేమ!
ఒకసారి ఆలోచించండి: అయ్యగారు! ఎలా ఉన్నారు? ఆ సమస్య తీర్తుందా అని విశ్వాసి అడిగాడనుకో,
అప్పుడు ఆ సేవకుడు,
ఏం దేవుడమ్మా! మాయదారి దేవుడు! అన్ని కష్టాలు నాకే పెడుతున్నాడు! ఈ భాదలు
పడలేక పోతున్నాను అన్నాడనుకోండి! అప్పుడు ఆ సేవకునికి విశ్వాసం ఉందా? ఇదేనా మాదిరి?
సేవకునికే లేక సంఘకాపరికే విశ్వాసము లేకపోతే విశ్వాసులకు విశ్వాసం కోసం ఏమని
చెప్పగలడు?
ఉదాహరణకు: తండ్రి సిగరెట్టు త్రాగుతున్నాడు లేక మద్యం త్రాగుతున్నాడు
అనుకుందాం, దానిని చూసి కొడుకు కూడా మొదలెడతాడు,
అప్పుడా తండ్రి ఒరేయ్ తాగొద్దురా,
చెడిపోతావ్ నాలాగ అన్నాడనుకోండి! అప్పుడు కొడుకు ఏమంటాడు? ముందు నీవు త్రాగడం మానేసి నాకు చెప్పు,
అప్పుడు నేర్చుకుంటాను అంటాడు కదా! ఇప్పుడు సంఘకాపరికే విశ్వాసం
లేకపోతే, అమ్మా! ధైర్యంగా ఉండు,
దేవునిమీద విశ్వాసం కలిగియుండు అని సేవకుడు చెప్పాడు అనుకుందాం, అప్పుడు విశ్వాసులు ఏమంటారు,
అయ్యగారు! ముందు మీరు విశ్వాసం అంటే ఏమిటి అనేది తెలుసుకుని ప్రాక్టీస్ చేసి
అప్పుడు మాకు నేర్పించండి అంటారు! అవునా???
కాబట్టి ఒక దైవజనుడికి ముఖ్యంగా ఉండాల్సింది దేవునిమీద అచంచల విశ్వాసం!
దానిని ప్రాక్టీస్ చేయు అంటున్నారు పౌలుగారు!
విశ్వాసం అంటే: నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి
అనుటకు రుజువునై యున్నది అని నిర్వచనం చెప్పారు పౌలుగారు హెబ్రీ 11:1లో! కాబట్టి సేవకునికి/ దైవజనుడికి దేవునిమీద విశ్వాసమే కాకుండా ఆయనే
నిజమైన దేవుడు,
ఒకరోజు మరల రాబోతున్నారనే విశ్వాసముతో కూడిన నిరీక్షణ కలిగియుండాలి!
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ తనఎదుట ఉన్న
పందెము(హెబ్రీ 12:2)
అనగా దేవుని సువార్త ఘనముగా చాటించే ప్రక్రియలో సాతానుగాడు చేసే ప్రతీ
తంత్రమును ఎదుర్కొనుటకు శక్తిమంతులుగా ఉండటానికి దేవుడిచ్చే ప్రతీ
ఆయుధము, కవచము ధరించి,
అనగా విశ్వసమనే డాలు,
సత్యమనే దట్టి,
ప్రార్ధనా ఖడ్ఘము, .... (ఎఫెసీ 6:11-18)
అన్నీ ధరించి మంచి సైనికుని వలే మంచి పోరాటము పోరాడి తన పరుగును
తుదముట్టించాలి! ఇదీ అసలు సిసలైన పరుగు! దానికి కావలసింది మొదటగా
విశ్వాసము,
రెండవదిగా ప్రార్ధనాఖడ్గము లేక ప్రతీవిధమైన తాళమును తీయగలిగే ప్రార్ధనా
తాళపుచెవి! ఇంకా ఆత్మపూర్ణత! అప్పుడే నీవు నీ పరుగులో విజయం సాధించగలవు!
కాబట్టి ప్రియ దైవజనుడా! నీకు కావలసినది మొదటగా విశ్వాసము!
ఇక రెండవదిగా అంటున్నారు పౌలుగారు: ప్రేమ కలిగి ఉండమని చెబుతున్నారు.
పౌలుగారు చెబుతున్నారు: ప్రేమ కలిగియుండుడి,
ఆత్మసంభంధమైన విషయాలు ఆసక్తితో ఆపేక్షించుడి! 1కొరింథీ 14:1; ఇంకా 1కొరింథీ 13
వ అధ్యాయం మొత్తం దానికోసమే చెప్పారు!
1.
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,
ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను,
ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను,
కాల్చబడుటకు(అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా
శరీరమును అప్పగించినను,
ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. ...
ఇంకా ముందుకు వెళ్లకముందు ఒకమాట మీతో చెప్పనీయండి: పౌలుగారి ఉపదేశ సారం
ఏమిటంటే: మనం బైబిల్ లో చెప్పిన ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించి వాటికే
అంటిపెట్టుకుని ఉండాలి! అంతేతప్ప అవి మనకు మృతతుల్యమైన ఆచారవ్యవహారాల వలె
ఉండకూడదు! కొంతమంది కొన్ని సంఘాలు వారు—వారి ఆరాధన క్రమాన్నే పాటిస్తారు,
అనగా ఆ ఆరాధనా క్రమం పుస్తకంలో వ్రాయబడిన ప్రార్ధనలనే చేస్తారు, అవే చదువుతారు,
ఆ ఆరాధనా క్రమం బుక్ లో ఉన్నట్లే వారి ఆచార వ్యవహారాలూ చేస్తారు తప్ప,
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోను,
సత్యముతోను ఆరాధించాలి అనే యేసయ్య బోధను పెడచెవిని పెడతారు! యోహాను 4:24; చర్చిలో భక్తిపరుడిగా యాక్షన్ చేస్తాడు,
ఇంటిదగ్గర తెలుస్తుంది వీడి బడాయి,
కొంతమంది స్త్రీలు చర్చిలో చాలా పరిశుద్ధంగా ఉంటూ పరిశుద్ధ పరిశుద్ద అని
పాటలు పాడతారు,
ఇక ఇంటికి వెళ్ళాక నీటికొళాయి దగ్గర తెలుస్తుంది వీళ్ళ బాగోతం! నోరు
తెరిస్తే కంపుకొట్టే బూతులు! ప్రేమ అనేది ఎక్కడా కనబడదు! చర్చిలో పాడిన
పరిశుద్ధ అనే పాటలో గల పరిశుద్ధత ఎక్కడా మచ్చుకైనా కనబడదు! అయితే ఇక్కడ నేను
మాట్లాడేది- సంఘకాపరి,
దైవజనుడు బైబిల్ లేఖనాలను ఉన్నది ఉన్నట్లు అవి నిజము అని భావించి పాటించాలే
తప్ప—వాటిని కేవలం ఆచారాలుగా చేయకూడదు! ప్రేమ అనేది వారి మాటలలో, వారి చేతలలో కనిపించాలి! మీకు ఎన్నోసార్లు చెప్పాను,
తల్లి మదర్ థెరీసా గారు ఎవరికీ యేసయ్యను నమ్ముకో అని తన నోటితో చెప్పలేదు!
ప్రేమను చూపిస్తూ, ఆ ప్రేమను తన చేతలతో చూపిస్తూ,
మానవత్వం,
కనికరం చూపించారు! దానికే ముగ్దులై అనేకమంది ప్రభువును స్వీకరించారు! యేసయ్య
చెప్పిన ప్రేమతత్వం, పౌలుగారు,
యోహాను గారు చాటిచెప్పిన ప్రేమతత్వాన్ని జీర్ణించుకుని తు.చ. తప్పకుండా
పాటించినందువలననే ఆ తల్లి కోట్లమందికి తల్లి అయ్యారు! అలాగే దైవజనుడు కూడా
అదే ప్రేమతత్వాన్ని మాటలలో మాత్రమే కాకుండా చేతలలో కూడా చూపిస్తే ఆ సేవ
దేవునికి అంగీకారం అయ్యే పానార్పముగా,
హోమముగా మారుతుంది! అటువంటి సేవ అనేకులను క్రీస్తువైపు ఆకర్షిస్తుంది!
తన సంఘములో ఒక విశ్వాసి కటిక పేదరికంలో ఉన్నట్లు తెలిసినప్పుడు,
ఆ వ్యక్తిదగ్గరకు వెళ్లి కాపరి కానుకలను ఆశించకుండా అమ్మా! ఈ డబ్బులు
ఉపయోగించుకుని బియ్యం తెచ్చుకుని వండుకుని తినండి,
లేక ఈ డబ్బులతో కొన్ని మందులు కొనుక్కుని వేసుకోండి అని అతిచిన్న మొత్తమైన
ఖర్చుపెడితే ఆ విశ్వాసి ఎంత సంతోషిస్తుందండి! దేవుడు కూడా పొంగోపోడా! ఈ
విశ్వాసి అనేకమంది చెబుతుంది నా దగ్గర ధనం లేనప్పుడు ఆయన నన్ను ఆదరించి సహాయం
చేశారు, దేవుడు –
బైబిల్ చెప్పినట్లు చేస్తున్నారు మన ఆత్మీయతండ్రిగారు అని ఆమె అందరికీ
సాక్ష్యం చెబితే సంఘం సంతోషించదా!! సంఘం అభివృద్ధి చెందదా?
అలాకాకుండా ఎప్పుడూ కానుకలు ఇచ్చే విశ్వాసులు దగ్గరకు వెళ్తూ, బీదల దగ్గరకు వెళ్ళకుండా,
వారిని వదిలేస్తే సంఘం ఏమి అబివృద్ధి చెందుతుంది?
అందుకే దైవసేవకునికి లేక దైవజనుడికి ఉండవలసిన లేక హత్తుకోవలసిన రెండవ
లక్షణం: ప్రేమ! క్రీస్తు చూపించిన ప్రేమ అందరిమీద చూపించాలి! తండ్రీ వీరేమి
చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అడిగిన ఆ ప్రేమ,
ఆ క్షమాపణ కలిగియుండాలి! ఒకవేళ సంఘంలో నీమీద తిరగబడుతూ ఉండవచ్చు ఆ
విశ్వాసి,
లేక ఆ విశ్వాసి రక్షించబడకముందు నిన్ను ఎంతో హింసించి ఉండవచ్చు,
అయినా ఇప్పుడు క్షమించి- ప్రేమించ వలసిన అవసరం ఎంతైనా ఉంది! అప్పుడే నీ
సేవ, పరిచర్య దీవించబడుతుంది!
ప్రియ దైవజనుడా! పౌలుగారు చెప్పిన విశ్వాస ప్రేమలను అనుదినం సాధకం
చేసుకుని,
వాటిని అన్వయించుకుని సాగిపోమని క్రీస్తుప్రేమతో మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --18వ భాగం*
*చేయదగినవి-౩*
2తిమోతి 1:13—14
13.
క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై,
నీవు నావలన వినిన హితవాక్య(ఆరోగ్యముగల వాక్య) ప్రమాణమును గైకొనుము;
14.
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము.
(గత బాగం తరువాయి)
ఇక ఈ వచనంలో తర్వాత చేయదగినది లేక హత్తుకోవలసిన విషయం ఏమిటంటే: *ఎలా వాక్యం నేర్చుకున్నావో అలాగే చెప్పాలి తప్ప వాక్యాన్ని నీకు
అనుకూలంగా తిప్పుకుని అనుకూల బోధలు చెయ్యకూడదు*!
మరలా ఒకసారి స్టడీబైబిల్ చదువుదాం! నీవు నా వలన విన్నదానిని- ఆసవ్యమైన భోధన మాదిరిని—క్రీస్తుయేసులో ఉన్న విశ్వాసంతో,
ప్రేమతో అవలంభించు!
ఇక్కడ చూడండి: నేను నీకు ఏమని చెప్పానో, ఎలా భోధించానో అదే మాదిగా నీవుకూడా భోధిస్తూ,
నీవుకూడా అవలంభించు అంటున్నారు పౌలుగారు!
పౌలుగారు – తిమోతిగారికి ఏమి నేర్పారు? సువార్తసత్యం! అది ఏమిటి?
యేసుక్రీస్తే దేవుడు,
ఆయన మన అందరి నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి మనఅందరి పాపముల నిమిత్తం రక్తం
చిందించి మనపాపముల నుండి మనలను విముక్తులుగా చేశారు. ఇదే సువార్త సత్యం! ఈ
సత్యాన్ని పౌలుగారు తిమోతిగారికి నేర్పించారు! అయితే ఈ సత్యాన్ని
యేసుక్రీస్తు ప్రభులవారే పౌలుగారికి నేర్పించారు!! గలతీ 1:11—12 ప్రకారం..
11. సహోదరులారా,
నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు
తెలియజెప్పుచున్నాను.
12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు,
నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు
లభించినది. ..;
ఇంకా ఎఫెసీ ౩:2—౩.. ప్రకారం!
2.
మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక,గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.
3.
ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని
గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
*కాబట్టి ఇప్పుడు తిమోతిగారు తనకిష్టమొచ్చినట్లు ఈ సత్యాన్ని మలచుకొని
బోధించకూడదు! ఇదీ ఈ వచనంలో ఉన్న గూడార్ధం*! వాక్యాన్ని కలిపి చెరపకూడదు!
సేవకులకు లేక విశ్వాసులకు అనుకూలంగా అనుకూలబోధలు చెయ్యకూడదు! అయితే కొంతమంది
అనుకూలబోధలవైపు తిరిగిపోయారట! 2తిమోతి 4:౩—4..
చూడండి హితబోధకు చెవినియ్యక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు
అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకుని సత్యమునకు చెవినియ్యక
కల్పనాకధలవైపుకు తిరుగుకాలము వచ్చును అంటున్నారు. అది ఇప్పుడు వచ్చింది.
కాబట్టి తిమోతి ఆ బోధలు నీవు చేయకు! అందుకే 2తిమోతి ౩వ అధ్యాయం చివరి వచనాలలో,
ఇంకా 4వ అధ్యాయం మొదటి రెండు వచనాలలో అంటున్నారు: ఉపదేశించుము, ఖండించుము,
గద్ధించుము! బుద్ధిచెప్పుము! సంపూర్ణ అధికారం పౌలుగారు తిమోతికి
ఇస్తున్నారు ఇక్కడ! ఇది కేవలం పౌలుగారు తిమోతికి మాత్రమే ఇవ్వలేదు!
పరిశుద్ధాత్ముడు ప్రతీ సేవకునికి/ దైవజనుడికి/ సంఘకాపరికి ఇస్తున్న
సంపూర్ణ అధికారం! వాటిని ఉపయోగించాలే తప్ప, కానుకలు ఇస్తున్నారు కదా అని బుజ్జగింపు బోధలు,
సమర్ధించే అనుకూలబోధలు చెయ్యకూడదు! వాక్యాన్ని ఎవరికొరకు కూడా అనుకూలంగా
మార్చకూడదు! చివరికి వాక్యాన్ని నీ ధనార్జన కోసం అనుకూలంగా మలచుకుంటూ నీ
ప్రాపర్టీని పెంచుకోకూడదు! అంతేకాకుండా ఎప్పుడూ Prosperity
కోసం చెబుతూ నీ ప్రాపర్టీ నీ పెంచుకోకూడదు! అనగా ఎల్లపుడూ దీవనలే
కోసమే,
ఆశీర్వాదాల కోసమే చెబుతూ నీ ఆస్తిని పెంచుకోకూడదు! వారు తప్పుచేస్తే
ఖండించాలి! గద్ధించాలి! సరిచెయ్యాలి! వారెవరైనా సరే!! ఇంకా వారికి
ఆత్మపూర్ణతయొక్క అవసరాన్ని, నీతిగా జీవించాల్సిన అవసరాన్ని బోధిస్తూ,
క్రీస్తు మరలా రాబోతున్నారని చెబుతూ,
వారిని రాకడకోసం ఆయత్తం చెయ్యాలి!
కాబట్టి మనం కూడా దేవుని సిద్దాంతాలను మనకు అనుకూలంగా మలచుకోగూడదు! అందరూ
కూడా దేవుడు ఒకసారి ఇచ్చిన మాదిరినే అనుసరించాలి! *అలాకాకుండా చేస్తే,
అనగా అనుకూలబోధలు బోధిస్తూ ఎంత పెద్ద సంఘాన్ని కట్టినా, ఎంత పరిచర్య చేసినా,
మనుష్యుల దృష్టిలో గొప్ప పరిచర్య చేసినవాడవు అవుతావు తప్ప దేవుని దృష్టిలో
నీవు ఇసుకమీద నీ ఇంటిని కట్టిన బుద్ధిహీనుడవే*!!!! నీవు మందను తయారుచేశావు
తప్ప దేవునిరాకడకు ఎత్తబడే సైన్యాన్ని తయారుచేయలేదు! నీవు పొట్టును
తయారుచేశావు గాని రాకడ అనే గాలికి లేక శ్రమలు అనేగాలికి నిలబడి
కోరబడే/ ఎత్తబడే గింజలను తయారుచేయలేదు జాగ్రత్త!!
కాబట్టి ప్రియ దైవజనుడా! కాపరీ! ఎలాంటి బోధలను చేస్తున్నావో ఒకసారి
సరిచూసుకోమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను! నిన్నుగూర్చియు నీ బోధలను గూర్చియు జాగ్రత్తపడమని చెబుతున్నారు పౌలుగారు!
1తిమోతికి 4: 16
నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము;
నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు...
గమనించారా?! నిన్ను గూర్చి,
నీవుచేసే భోధకోసం జాగ్రత్తగా ఉంటే,
మొదటగా నీవు,
తర్వాత నీభోధ వినేవారిని కూడా రక్షించుకుంటావట!
నీ యావత్తు మందను ఎలా సాకుతున్నావు? పేతురుగారు అంటున్నారు: 5:2,3
2.
బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్ట పూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను,
మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
3.
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా
ఉండుడి; ... చూశారా మందను కాయమని చెప్పడమే కాకుండా మందకు మాదిరిగా ఉండమంటున్నారు! అనగా
విశ్వాస ప్రేమలను చూపిస్తూ సంఘం ఎలా ప్రవర్తించాలో –
మీ ప్రవర్తనను ఒకమాదిరిగా చూపిస్తూ వారికి మార్గదర్శకులుగా ఉండమంటున్నారు!
పౌలుగారు మాదిరిగా జీవించి నేను క్రీస్తును పోలి నడచుకొన్న ప్రకారం మీరును
నన్నుపోలి నడచుకోనుడి అనగా మీరును నావలె క్రీస్తును పోలి నడచుకోనుడి
అంటున్నారు! 1కొరింథీ 11:1;
అలా చెప్పే స్తితిలో నీవున్నావా ప్రియ సేవకుడా! నీవే త్రాగుబోతులా, నీవే జూదగాడిలా,
భార్యను కొట్టి అవమానించేవాడిగా,
వ్యభిచారిగా ఉంటే మీ సంఘానికి ఎలా బోధించగలవు ప్రియ దైవజనుడా!
కాబట్టి మాదిరికరమైన జీవితం జీవిద్దాం! వాక్యాన్ని కలిపిచెరపకుండా
ఉన్నదిఉన్నట్లు బోధిస్తూ ఖండిస్తూ, గద్దిస్తూ,
బుద్ధిచెబుతూ సంఘాన్ని కడదాం!
సంఘాన్ని రాకడకు ఆయత్తపరుద్దాం!
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --19వ భాగం*
*చేయదగినవి-4*
2తిమోతి 1:13—14
13.
క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై,
నీవు నావలన వినిన హితవాక్య(ఆరోగ్యముగల వాక్య) ప్రమాణమును గైకొనుము;
14.
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము.
(గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! గతకొన్నిరోజుల నుండి మనం దైవజనుడు హత్తుకోవలసినవి లేక చేయదగిన
క్రియలకోసం ధ్యానం చేస్తున్నాం! ఇక ఈ వచనాలలో పౌలుగారు ఇంకా ఏమని అంటున్నారు
అంటే: మొదటగా హితవాక్య ప్రమాణాన్ని గైకొను;
రెండు: నీకు అప్పగింపబడిన అ మంచి పదార్ధమును కాపాడాలి; మూడు: ఎలా కాపాడాలి?
మనలో నివశించు పరిశుద్దాత్మ వలన కాపాడుము!
మొదటగా హితవాక్యమును లేక హితబోధకు చెవియొగ్గి దాని ప్రకారం చెయ్యాలి!
అంతేకాకుండా అదే హితభోదను బోధించాలి! హితబోధ అనగా మంచిబోధ- స్తడీబైబిల్ లో
ఆరోగ్యమైన బోధ అని తర్జుమా చెయ్యబడింది! 2తిమోతి 4:౩—4
వరకు కూడా దీనినే బోధిస్తున్నారు—ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన) సహింపక దురద చెవులు గలవారై తమ
స్వకీయ దురాశాలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకుని,
సత్యమునకు చెవినియ్యక కల్పనాకధలవైపు తిరుగుకాలము వస్తుంది అంటున్నారు.
కాబట్టి ప్రజలు ఎలాగు హితభోదను అంగీకరించడం లేదు! కాబట్టి ప్రియ
దైవజనుడా! నీవుకూడా అలాంటి బోధలు చెయ్యక హితభోదను లేక హితవాక్య
ప్రమాణాన్ని మొదటగా నీవు పాటించి తర్వాత అందరికీ చెప్పమంటున్నారు
పౌలుగారు! ప్రియ దైవజనుడా! అదే మాట పరిశుద్ధాత్ముడు నేడు నీతోను నాతోను
చెబుతున్నారు! మనం కూడా మొదటగా మనజీవితాలలో హితబోధను గ్రహించాలి! ఆ
గ్రహించినదే ఆచరించి ఇతరులకు బోధించాలి! ఇదే ప్రభువు కోరుతున్నది!
నేటిదినాలలో ప్రజలు ఖండించి, గద్దించి,
బుద్ధిచెప్పే వాక్యమును వినకుండా ఎవడు పిట్టకధలు చెబుతున్నాడో, ఎవడు సుతిమెత్తగా ఎప్పుడూ అభివృద్ధి,
దీవెన, ఆశీర్వాదాలు,
స్వస్తతలు బోధిస్తున్నారో వారి వెనకాల వేలం వెర్రిలా
పరుగెత్తుతున్నారు—చివరకు ఆదివారంనాడు కూడా తమ సొంత సంఘాలను సహవాసాన్ని వదిలేసి మరీ
పరుగెత్తుతున్నారు! వారు ఎలా పోయినా సహోదరుడా! నీవు హితవాక్యాన్నే అనగా
ఆరోగ్యకరమైన వాక్యమును అనగా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసి రాకడకు
ఆయత్తపరచే బోధనే చేయాలి. ప్రియ దయువజనుడా నీవు చేస్తున్నావా లేక
సంఘాన్ని, ప్రజలను మెప్పించే బోధలను చేస్తున్నావా?
మనుష్యులు మెచ్చుకునే బోధలు చేస్తున్నావా లేక దేవుడు మెచ్చే బోధలను
చేస్తున్నావా?
ఒకసారి సరిచూసుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!
ఇక రెండవదిగా:
నీకు అప్పగింపబడిన మంచి పదార్ధమును కాపాడాలి! ఇంతకీ పౌలుగారు తిమోతిగారికి అప్పగించిన మంచిపదార్ధము ఏమిటి?
దీనికోసం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎక్కువమంది ఒప్పుకునే
అభిప్రాయము ఏమిటంటే: ఆ మంచి పదార్ధము—దేవుడు అపోస్తలులద్వారా వెల్లడిచేసిన సువార్తసత్యము!
అది ఏమిటంటే: మానవుడు ధర్మశాస్త్రము వలన చావునకు లోనై,
నరకపాత్రుడుగా మరణపాత్రుడుగా ఉన్నప్పుడు నిరీక్షణకు ఆస్పదం
లేనప్పుడు, దేవుడే మానవుడై పుట్టి,
నరులు అనుభవించిన శిక్ష తాను అనుభవించి,
తన రక్తమును చిందించి తనరక్తము ద్వారా పాప విమోచనం చేసి దేవునికి మానవులకు
తెగిపోయిన నిచ్చెన- లేక సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు! ఈ సువార్తను
అనగా క్రీస్తుయేసునందే నిజమైన రక్షణ పరలోకం అనే సత్యాన్ని,
క్రీస్తుయేసు రక్తము ద్వారానే తప్ప మానవుల మంచి పనుల ద్వారా నీతిమంతులుగా
తీర్చబడరు అనే సువార్తసత్యమును గ్రహించిన వారికే పరలోకము! ఇదే
సువార్తసత్యము! బయలు పరచబడిన మర్మము! ఇది దేవుడే పౌలుగారికి చెప్పారు! అదే
పౌలుగారు తిమోతి గారికి చెప్పారు! దానినే ఇప్పుడు పౌలుగారు జాగ్రత్తగా
కాపాడాలి అంటున్నారు! మరి క్రీస్తు సేవకులు దీనిని ఎందుకు కాపాడుకోవాలి
అంటే దీనిని సంఘంలోనుండి తీసివేయాలని అనేకమంది దుర్భోధకులు ప్రయత్నం
చేస్తున్నారు. కొంతమంది విదేశీ ఎంగిలిమెతుకులకు ఆశపడి,
మరికొంతమంది సాతాను గాడి ప్రలోభాలలో పడి అబద్దబోధలు చేస్తుండగా ప్రియ
దైవజనుడా దీనిని కాపాడుకొని ప్రకటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది! ఇది ఒక
అభిప్రాయం!
మరొక అభిప్రాయం ఏమిటంటే: అప్పగింపబడింది అనగా ప్రకటన గ్రంధంలో
చెప్పబడినట్టు
నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకో అని దేనిగురుంచి చెబుతున్నారు అంటే
అది రక్షణ భాగ్యము! అది వెలకట్టలేనిది! కారణం అది నీవు ఉచితముగా
పొందుకున్నా గాని,
దానిని తీసుకుని రావడానికి క్రీస్తుయేసు వెల చెల్లించారు! అది అమూల్యమైన
రక్తము! అందుకే పేతురుగారు మీరు వెండిబంగారు వంటి వెలగల వస్తువుల వలన
విమోచించ బడలేదు గాని అమూల్యమైన సిలువ రక్తము ద్వారా విమోచించబడ్డారు
కాబట్టి మీరు పొందుకున్న రక్షణభాగ్యమును తుచ్చమైన కోరికల నిమిత్తం
పోగొట్టుకోనక దానిని భద్రంగా కాపాడుకో అని ఒక అభిప్రాయము!1 Peter(మొదటి పేతురు) 1:18,19
18.పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి
బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
19.అమూల్యమైన రక్తముచేత,
అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --20వ భాగం*
*చేయదగినవి-4*
2తిమోతి 1:13—14
13.
క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై,
నీవు నావలన వినిన హితవాక్య(ఆరోగ్యముగల వాక్య) ప్రమాణమును గైకొనుము;
14.
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన
కాపాడుము.
(గతభాగం తరువాయి)
మరో అభిప్రాయము ఏమిటంటే: నావలన నీకు కలిగింది,
నావలన నీకు అప్పగింపబడింది అని చెబుతున్నారు కాబట్టి ఈ రెండు తిమోతి
పత్రికల ప్రకారం పౌలుగారు చేతులుంచి ప్రార్ధించినందువలన తిమోతిగారు
పొందుకున్న ఆత్మీయవరములను ఫలములను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకో అని
చెబుతున్నారు! సరే,
ఎన్ని అభిప్రాయాలున్నా అన్ని అభిప్రాయాలు సరియైనవే! మొదటగా
అబద్దబోధకులనుండి సువార్తసత్యము పాడవకుండా భద్రపరచుకోవలసిన అవసరం ప్రతీ
దైవజనునికి ఉంది!
అదేవిధముగా దైవజనుడు పొందుకున్న రక్షణభాగ్యమును తుచ్చమైన కోరికల కోసం
పోగొట్టుకోకూడదు! అందుకే పౌలుగారు నేను ఇతరులకు బోధించిన పిమ్మట నేను
బ్రష్టుడను అయిపోతానేమో అని నిరంతరం పరీక్షించుకుని తన దేహమును
నలుగగొట్టుకుంటున్నాను అంటున్నారు. అలాగే ప్రతీ దైవజనుడు కూడా తను
పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి!
ఇక తర్వాత దైవజనుడు పొందుకున్న ఆత్మీయవరాలు పోగొట్టుకోకుండా దానిని
హత్తుకోవాలి! మరి వరాలు ఇచ్చిన దేవుడు నీవు పాపం చేసినప్పుడు ఆ వరాలు
తీసేసుకుంటారా అంటే నా ఉద్దేశ్యం ప్రకారం తీసేసుకోరు! గాని మొదటగా నీవు
పాపం చేసినప్పుడు నీవు ప్రార్ధన చేస్తున్నప్పుడు కూడా సాతానుగాడు వచ్చి
అంటుంటాడు: అబ్బో గొప్ప ప్రార్ధనలు చేస్తున్నావు, ఫలాని పాపం చేశావు,
ఫలానా అబద్దం ఆడేశావు ఇప్పుడు ఏమీ ఎరగని ఎర్రోడులాగ ప్రార్ధన
చేస్తున్నావు అని సాతానుగాడు,
ఇంకా నీ అంతరాత్మ నీమీద సాక్ష్యం పలికినప్పుడు నీవు ప్రార్ధించడానికి
నీవు పొందిన వరాలను వాడడానికి ఇష్టపడవు నీవు! ఎప్పుడైతే ఇలా
అవుతుందో,
రెండవదిగా: దేనినైనా వాడుతుంటే లేక ప్రాక్టీస్ చేస్తుంటే నీవు దానిని
వాడగలవు, ఉపయోగించగలవు గానీ,
చాలారోజులు దేనినైనా మానేస్తే నీవు దానిని బాగుగా ఉపయోగించలేవు! ఉదాహరణకు
నీకు ఒక సంగీత వాయిద్యం వాయించడం చాలాబాగా వచ్చు! కానీ నీవు పని ఒత్తిడి
వల్ల మూడు సంవత్సరాలు వాయించడం మానేశావు! మూడు సంవత్సరాల తర్వాత నీవు
వాయించాలి అనుకుంటే ఏ నోట్ ఎక్కుడుందో వెదుకుకోవలసి వస్తుంది! అలాగే దేవుడు
నీకు ఇచ్చిన వరములను ఉపయోగించకపోతే వాటిని వాడటం నీవు మరచిపోతావు! తద్వారా
నీవు వరములు లేని వాడవైపోతావు! అందుకే వాటిని వాడుతూ ఉండాలి కాబట్టి
ఎప్పుడూ వాటిని వాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండమని,
భద్రముగా కాపాడుకోమని పౌలుగారు తిమోతిగారికి చెబుతున్నారు! కాబట్టి ప్రియ
దైవజనుడా నీవు పొందుకున్నవి జాగ్రత్తగా కాపాడుకోమని ప్రభువుపేరిట మనవి
చేస్తున్నాను!
ఇక చివరిగా ఎలా కాపాడుకోవాలి అని చెబుతున్నారు అంటే మనలో ఉన్న పరిశుద్దాత్మ
వలన జాగ్రత్తగా కాపాడుకోవాలి! మనలో ఉన్న అంటే పరిశుద్దాత్ముడు ఎల్లప్పుడూ
నీలోనే ఉండాలి! నీ దేహము దేవుని ఆలయము కాబట్టి దానిని అనగా నీ దేహాన్ని
ఎల్లప్పుడూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచాలి! అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు
కూడా ఎప్పుడూ నీలోనే ఉంటారు! అలా కాకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అపవిత్రమైన
పనులు చేస్తే పరిశుద్దాత్ముడు నీలో నివాసం చేయగలడా?
ఒకవేళ ఉంటే సంతోషంగా ఉండగలడా ప్రియ దైవజనుడా! రోమా 8:9.
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర
స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
కాబట్టి క్రీస్తు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కలిగియుండాలి.
1కొరింథీ 6:19..
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి,
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?
మీరు మీ సొత్తు కారు,
ఒకసారి గమనించాలి మన స్వంత బలంతో ,
మన బలహీనమైన మనసాక్షితో ,
మన వాదనలతోగాని,
మన జ్ఞానంతో గాని ఆ సువార్త సత్యాన్ని,
వరాలను ఫలాలను కాపాడుకొమ్మని దేవుడు అడగడం లేదు! తనసేవకులకు ఉచితంగా
సహజసిద్ధంగా ఇచ్చిన గొప్ప శక్తి- పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించి ఆ
సత్యాన్ని , వరాలను ఫలాలను కాపాడమని దేవుడు చెబుతున్నారు!
ఈక్రింది రిఫరెన్సులు ఒకసారి చూడండి. మత్తయి 10: 19—20
19. వారు మిమ్మును అప్పగించునప్పుడు,
ఏలాగు మాటాడుదుము?
ఏమి చెప్పుదుము?
అని చింతింపకుడి;
మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
20.
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
..;
లూకా 21:14,15
14.
కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ
మనస్సులో నిశ్చయించుకొనుడి.
15. మీ విరోధులందరు ఎదురాడుటకును,
కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
...;
యోహాను 16:13—15
13. అయితే ఆయన,
అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి
నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక,
వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు
తెలియజేయును.
14.
ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ
పరచును.
15. తండ్రికి కలిగినవన్నియు నావి,
అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
..; అపో 4:13
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని
పామరులని(లేక, సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి,
వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి....
క్రీస్తుయేసు శిష్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు మరో కారణం పరలోకంలో
క్రీస్తుయేసు మనకోసం పరమతండ్రికి ప్రార్ధనచేస్తూ ఉన్నారు. రోమా 8: 34
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే;
అంతే కాదు,
మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు
విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే..
హెబ్రీ 7:25
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున,
విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా
రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు..
కాబట్టి ఒకప్రక్క యేసు క్రీస్తు ప్రభులవారు,
ఇంకా ఆదరణ కర్త ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఇక్కడ ఆదరణ కర్తకు గ్రీకుబాష
నుండి తిన్నగా తెలుగులోనికి తర్జుమా చేస్తే “సహాయపడేందుకు మానవుల దగ్గరకు పంపబడినవాడు”
అని అర్ధం! కాబట్టి మన బలహీనతలలో మనకు సహాపడటానికి ప్రభువు పంపించిన
పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నీకు ఏ విధమైన
సహాయం కావాలన్నా ఆ పరిశుద్దాత్ముని సహాయం తీసుకుంటే ప్రియ దైవజనుడా నీకు
సహాయం చేయడానికి పరిశుద్దాత్ముడు సిద్దంగా ఉన్నాడు!
ఆయనతో నీవు సహవాసం చేస్తే పరిశుద్దాత్ముడు నీకు సలహాలిచ్చే
మిత్రుడుగా, ఆపదలందు సహాయకుడుగా,
నీకు బుద్ధిచేప్పేవాడుగా,
ఓదార్చేవాడుగా నీకోసం దేవుని ఎదుట ప్రతినిధిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు!
కాబట్టి ప్రియ దైవజనుడా పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని
కలిగియున్నావా?
అలా కలిగిఉంటేనే తప్ప నీ నీకునీవుగా దేవుడు నీకిచ్చిన సువార్తసత్యాన్ని
గాని, నీవు పొందుకున్న రక్షణ బాగ్యాన్ని కాని,
వరాలను ఫలాలను కాపాడుకోలేవు!
కాబట్టి నేడే పరిశుద్ధాత్ముని నీకు సహాయం చెయ్యమని ప్రార్ధించు!
ప్రతీ రోజు పరిశుద్ధాత్ముని అభిషేకం పొందుకో!
ఆత్మతో నింపబడు!
భక్తులు పరిశుద్దాత్మతో నింపబడిన వెంటనే ఘనమైన మానవాతీతమైన కార్యాలు
చేసినట్లు నీవుకూడా చేస్తూ ఆయన సేవలో సాగిపో!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... –21వ భాగం*
*చేయదగినవి-5*
2తిమోతి 2:2..
నీవు అనేక సాక్షులయెదుట *నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు
సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము*,
ప్రియ దైవజనమా! దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత
కొన్నిరోజులుగా ధ్యానం చేసున్నాము!
ఈరోజు ధ్యానం చేస్తున్న అంశము లేక హత్తుకోదగిన లేక చేయవలసిన అంశము: *ఇతరులకు
భోదింపతగిన సామర్ధ్యము గల నమ్మకమైనవారికి పని అప్పగింపుము*!
ఇంతకీ పౌలుగారు దేనికోసం లేక ఏ పని నమ్మకమైన వారికి అప్పగించమంటున్నారు??
దీనిని అర్ధం చేసుకోవాలంటే ఈ పత్రికలు దేనికోసం వ్రాశారు పౌలుగారు,
ఇప్పుడు ఏ విషయం కోసం మాట్లాడుతున్నారో నేపధ్యం తెలిస్తేనే ఈ విషయం అర్ధం
అవుతుంది!
మొదటగా పౌలుగారు ఈ పత్రికలు రాసి పంపడానికి నేపధ్యం ఏమిటంటే ఆయన ఖైదులో
ఉన్నారు. ఇక తిమోతిగారిని చూడటం అసాధ్యం అని ఆత్మద్వారా మరియు పరిస్తితులను
అధ్యయనం చేయగా తెలిసిపోయింది- అందుకే తను చనిపోబోతున్నారు కాబట్టి కొన్ని
సంఘాల చార్జి అప్పగిస్తూ, సంఘంలో ఎలా దైవజనుడు ప్రవర్తించాలో చెబుతూ,
నమ్మకమైన వారిని అర్హులను యోగ్యమైన వారిని సంఘానికి అధ్యక్షులను
గాను, పెద్దలు గాను,
పరిచారకులను గాను వారివారి అర్హతలు బట్టి నియమించమని చెబుతూ ఈ పత్రిక
రాశారు!
కాబట్టి మొదటగా సంఘంలో భాద్యత నీవు ఒక్కడివే మోయకుండా నమ్మకమైన
అర్హులైన, యోఘ్యమైన,
భోదించ సామర్ధ్యము గలవారిని సంఘానికి అధ్యక్షులు,
పెద్దలు,
పరిచారకులుగా నియమించి వారికి కొంచెం బాధ్యతను అప్పగించమని మొదట అర్ధం
వస్తుంది!
అయితే ఈరోజులలో అనేక పెంతుకోస్తు సంఘాలలో,
ఇంకా ఏ సంస్తలకు చెందని మాలాంటి ఇండిపెండెంట్ సంఘాలలో సంఘపెద్దలను నియమించడం
లేదు! కారణం సంఘపెద్దల వలన చాలా సంఘాలలో మేలు కాకుండా కీడు జరుగుతుంది. కారణం
ఈ పెద్దరికం దగ్గర వారిలో వారికి లేనిపోని పోటీ- తగాదాలు వచ్చి సంఘంలో
మనస్పర్ధలు వచ్చి- సంఘంలో లేనిపోని అనవసరమైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి
సంఘంలో సంఘపెద్దలను నియమించడం మానేస్తున్నారు!
*మరి ఇది వాక్యానుసారమా అంటే కానేకాదు! పరిశుద్ధాత్మ పూర్ణులై,
అపోస్తలుల ద్వారా మనకు అప్పగింపబడిన ఆజ్ఞ -- సంఘాలలో సంఘపెద్దలను
నియమించాలి*!
*మరి సంఘాలలో మరి తగాదాలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి?*
కొన్ని వారాల క్రితం మన ఆంద్ర రాష్టంలో ఆదివారం నాడు రెండు గ్రూపులకు
తగాదా వచ్చి పోలీసులు రంగప్రవేశం చేసి చర్చికి తాళం వేసినట్లు పేపర్లో
చదివితే ఎంతగానో దుఃఖం కలిగింది. *అంతవరకూ సంఘం ఎందుకు వెళ్ళింది అంటే తమ
సొంత నిర్ణయాల వలననే! ఒకసారి మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక,
తీతుకు రాసిన పత్రిక చదివితే (ముఖ్యంగా 1తిమోతి 3వ అధ్యాయం,
తీతు మొదటి అధ్యాయం) అసలు సంఘపెద్దలను ఎలాంటి గుణగణాలు లేక కేరెక్టర్
ఉన్నవారిని పెద్దలుగా పరిచారకులుగా అధ్యక్షులుగా పెట్టమన్నారో మనకు
తేటతెల్లంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నారు పౌలుగారు! ఇప్పుడు ఈ
తగాదాలు వస్తున్న సంఘాలలో ఒకవేళ నిజంగా ఆ పత్రికలలో వ్రాసిన అదే
కేరెక్టర్ గల వ్యక్తులను పెద్దలుగా పరిచారకులుగా నియమిస్తే ఈ సమస్యలు 200%
రాకపోవును! వాటిని పాటించక పోవడం వలననే ఈ సమస్యలు! దేవుని పరువు
పోతుంది!* సంఘం బోగట్టా కోర్టులకు,
పోలిస్ స్టేషన్ లకు వెళ్తుంది. ఎంత సిగ్గుచేటండి!!! ఈ రోజులలో ఎవరికి
ధనం ఉంటే,
ఎవరికి ఎక్కువమంది మనుష్యులుంటే వారికే సంఘపెద్దల పోష్టు దొరుకుతుంది!
నిష్వార్ధంగా పరిచర్య చేసేవారికి కమిటీలో చోటు దొరకడం లేదు! నాకు మా
ప్రాంతంలో ఒక పెద్ద సంఘంతో చాలా మంచి పరిచయం ఉంది. మా తండ్రిగారి
దగ్గరనుండి పరిచయం! సువార్త ఉద్దేశ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో అంతగా
సువార్తకు తెగిస్తూ,
ఖర్చుపెడుతున్న సంఘం మరొకటి లేదనే చెప్పాలి! ఇంతమంచి సంఘం- చర్చి
ఎలక్షన్ రాబోయేసరికి కులం ప్రసక్తి వస్తుంది! కొన్ని కులాల వారిని
పెద్దలుగా ఉండడానికి ఒప్పుకోరు! దానికోసం పెద్ద రాజకీయాలు జరుగుతాయి! ఇంత
ఘనమైన పరిచర్య చేస్తున్న సంఘం – ఎలక్షన్ లో కులం ప్రసక్తి ఎందుకు వస్తుందండీ??!!
ఏ సంఘాలలో కులం పేరు,
కులం ప్రసక్తి వస్తుందో వారు నైతికంగా ఆధ్యాత్మికంగా పతనమైనట్లే నా
ఉద్దేశ్యంలో! బైబిలో చెప్పబడని కులం- మనకెందుకండీ??!!
కాబట్టి దైవజమా! దైవజనుడా! బైబిల్ ప్రకారం సంఘపెద్దలను నియమించవలసినదే!
అయితే వారిలో ఈ మూడు పత్రికలలో వ్రాయబడిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని
లోతుగా అధ్యయనం చేసి నియమించు! ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తున్నారో వారిని
ఎంతమాత్రము పెద్దలుగా పెట్టవద్దు! ముఖ్యంగా వ్యభిచారం చేసేవారిని,
త్రాగుబోతులను ఎట్టిపరిస్తితిలోనూ పెద్దలుగా నియమించవద్దు!
ఇక అసలు ఎందుకు పెద్దలను నియమించాలి అంటే:
మొదటగా బైబిల్ చెబుతుంది గనుక!
రెండవది: భారం నీవు ఒక్కడివే భరించక కొంతమందికి అప్పగిస్తే,
నీ భారం మరికొంతమందికి షేర్ చేస్తే మొదటగా వారిలో భాద్యత అనేది
కలుగుతుంది. రెండవదిగా సువార్త విషయంలో ఆసక్తి కలుగుతుంది వారికి కూడా!
వారుకూడా దేవుని పరిచర్యలో బాగస్వాములు అవుతారు! ఒకసారి మోషేగారు – తనమామ గారైన యిత్రో గారు ఇచ్చిన సలహా చూస్తే...
Exodus(నిర్గమకాండము) 18:17,18,19,20,21,22,23
17.
అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;
18.
నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయ ముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము,
అది నీవు ఒక్కడవే చేయచాలవు.
19.
కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు
తోడైయుండును,
ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు
తేవలెను.
20.
నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి,
వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.
21.
మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని,
వేయిమందికి ఒకనిగాను,
నూరుమందికి ఒకనిగాను,
ఏబదిమందికి ఒకనిగాను,
పది మందికి ఒకనిగాను,
వారిమీద న్యాయాధిపతులను నియ మింపవలెను.
22.
వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప
వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే
తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా
ఉండును.
23. *దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భార మును
సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని
చెప్పెను*. .
దానికి ఆయన అంగీకరించారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన మరో వచనం ఉంది. 23..
చూడండి..
దీనికి దేవుడు అంగీకరిస్తే అప్పుడు ఇలా చేయు అన్నారు.
మోషేగారు కూడా ఏ పని అయినా,
దేవుడు చెబితేనే చేశారు గాని దేవుడు చెప్పని పని ఎప్పుడూ చేయలేదు! గాబట్టి
మోషేగారు దేవుణ్ణి అడిగే ఉంటారు, దేవుడు కూడా దానికి అంగీకరించారు. అందుకే మోషే,
ఆహారోను, యెహోషువా,
ఇంకా 70మంది పెద్దలకు దేవుడు కొండమీద అభిషేకం చేసారు. వారికి కనబడ్డారు కూడా!
కాబట్టి ఇలా దేవునిపనిలో మరికొందరికి భాగస్వామ్యం చేయడం అనేది దేవునికి
ఇష్టమైన పనే! దేవునికి వ్యతిరేఖమైన పని ఎంతమాత్రమూ కాదు!
ఇక మరో కారణం ఏమిటంటే ఎప్పుడైతే సంఘపెద్దలను నియమించి వారికి కూడా కొన్ని
భాద్యతలు అప్పగిస్తారో సంఘకాపరికి లేక సేవకునికి కొంచెం సమయం దొరుకుతుంది.
లేకపోతే అస్తమానూ దేవునిపనిలో,
పరిచర్యలో పడి తన ఆరోగ్యాన్ని పాడుచేస్కుంటూ ఉంటారు. ముఖ్యంగా రెండు విషయాలో
ఫెయిల్ అవుతూ ఉంటారు. మొదటిది: దేవునితో గడపడం! అనగా దేవునితో
ప్రార్ధనలో, వాక్యములో గడిపే సమయం,
సేవాభారం పెరిగిపోయే కొలదీ తగ్గిపోతుంటుంది. అలా జరుగబట్టే దేవుడు యోహాను
గారిని ఇక లాభం లేదు అనుకుని పత్మాస్ దీవిలో బంధీగా పంపించి తనపని అనగా
ప్రకటన గ్రంధాన్ని వ్రాయించుకున్నారు!
ఇక సేవా- పరిచర్య పెరిగే కొలదీ సేవకునికి/ దైవజనునికి కుటుంబంతో గడిపే సమయం
ఉండదు! చాలామంది దైవజనులకు/ కాపరులకు సంఘంలో విశ్వాసుల యోగక్షేమాలు భాగా
తెలుస్తాయి గాని తనకుటుంబంలో విషయాలు తెలియవు కారణం వారు కుటుంబంతో గడిపే
సమయం చాలా తక్కువ! గమనించాలి దేవుడు కుటుంబం ఇచ్చారు అంటే, కుటుంబానికి ఇవ్వవలసిన సమయం,
ప్రాధాన్యత వారికి ఇవ్వాలి! లేకపోతే లేనిపోని కుటుంబ కలహాలు,
మనస్పర్ధలు వస్తాయి! అర్ధం చేసుకోని భార్య అనగా పాష్ట్రమ్మగారు గాని,
పిల్లలు గాని ఉంటే ఆ దైవజనుని బ్రతుకు నరకం అయిపోతుంది.
కాబట్టి దైవజనులారా! మీ కుటుంబాన్ని దయచేసి నిర్లక్షం చేయవద్దు! ఎప్పుడైతే
మీరు సంఘపెద్దలకు భాద్యతలు కొద్దిగా అప్పగిస్తే మీకు సమయం దొరుకుతుంది. ఆ
సమయం మీరు కుటుంబంతో గడపవచ్చు! కాబట్టి పై అన్ని కారణాల వలన తప్పకుండా
సంఘపెద్దలను నియమించి భాద్యతలు అప్పగించాలి!
ఇక భాద్యతలు అప్పగించాలి ఏ విషయంలో అంటే: రెండో తిమోతి మొదటి అధ్యాయం
సువార్తసత్యాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకుని,
కాపాడమని చెప్పారని గతభాగంలో చూసుకున్నాం! అయితే ఇదే సువార్తసత్యాన్ని, సువార్తభారాన్ని నమ్మకమైన,
ఇతరులకు బోధించదగిన సామర్ధ్యం ఉన్నవారికి అప్పగించమని చెబుతున్నారు! కారణం
దేవుడు ఇచ్చిన చివరి ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను
ప్రకటించండి. నమ్మి భాప్తిస్మం పొందువారు రక్షించబడుదురు. నమ్మనివానికి శిక్ష
విధించబడును అన్నారు. మత్తయి 28; మార్కు 16;
కాబట్టి ఈ భాద్యత కేవలం దైవజనులకు,
సేవకులకే కాదు—నమ్మి విశ్వసించి,
భాప్తిస్మం పొందిన ప్రతీ ఒక్కరికీ ఉంది ఈ భాద్యత! కాబట్టి సంఘపెద్దలను
నియమించి, అర్హులు, నమ్మకమైన వారు,
ఇతరులకు భోదించదగిన సామర్ధ్యం గలవారికి కూడా దీనిని అనగా సువార్తభారం, సువార్తసత్యం కూడా బాగా అర్ధమయ్యేలా చెప్పి,
ఈ భాద్యతను అప్పగించాలి! ఇదీ పౌలుగారి భావం!
కాబట్టి ప్రియ దైవజనుడా! సంఘపెద్దలను నియమిస్తున్నావా?
వారికి కొన్ని భాద్యతలు అప్పగిస్తున్నావా? వారికి సువార్తసత్యము సరిగా భోదించి,
సువార్తభారం అప్పగిస్తున్నావా?
ఒకవేళ అలా చేయడం లేదా అయితే నేడే ప్రారంభించు!
నేనుకాదు, దేవుడే,
పరిశుద్దాత్మ దేవుడే చెప్పినవిధంగా నడచుకో!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... -- 22వ భాగం*
*చేయదగినవి-6*
2తిమోతి 2:15...
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను,
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను
నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం! *గమనించాలి
ఈ 2:15 వ వచనం ప్రతీదైవసేవకుడు,
సంఘకాపరి, భోధకుడు,
సువార్తికుడు చేయవలసిన ముఖ్యమైన పని: కాబట్టి ప్రతీ సేవకుడు ఈ వచనం ప్రకారమే
చేయాలి!*
పైవచనంలో పౌలుగారు తిమోతిగారిని మూడు విధాలుగా దేవునికి నిన్ను నీవు కనపరుచుకో
అంటున్నారు.
1. యోగ్యునిగా;
2. సిగ్గు పడనక్కరలేని పనివానిగా;
౩. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా దేవునికి
నిన్ను నీవు కనుపరచుటకు జాగ్రత్తపడు అంటున్నారు పౌలుగారు!
మొదటగా: దేవుని యెదుట నిన్ను నీవు యోగ్యునిగా కనపరచుకోవాలి! ఇంతకీ దేవుని
దృష్టిలో యోగ్యుడు ఎవడు? రోమా పత్రిక 16వ వచనంలో పౌలుగారు కొందరిని యోగ్యుడు అంటున్నారు. 16:10
లో క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లుకు వందనాలు అంటున్నారు. ఇంకా
కొన్నితర్జుమాలలో ఇలా ఉంది. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లుకు వందనాలు
ఎందుకంటే అతడు పరీక్షలలో అనగా శ్రమలలో నిలిచిన వాడు. కాబట్టి ఇక్కడ ఒక
అర్ధం ఏమిటంటే: ఎవరైతే శ్రమాలలో శోధనలలో ఓలిపోకుండా,
సోలిపోకుండా క్రీస్తుకై బలమైన సాక్షులుగా నిలుస్తారో వారు యోగ్యులు అని
అర్ధం వస్తుంది.
లూకా సువార్త 7:4లో ఇశ్రాయేలు పెద్దలు యేసుక్రీస్తు ప్రభులవారిని బ్రతిమిలాడుతున్నారు ఒక
శతాధిపతి యొక్క సేవకుడు రోగముతో బాధపడుతున్నాడు. ఈ శతాధిపతి యోగ్యుడు. ఈ
వ్యక్తి ఇశ్రాయేలు జనులకోసం ఎన్నో గొప్పకార్యాలు చేశాడు అంతేకాకుండా
సమాజమందిరాన్ని కట్టి ఇచ్చాడు. కాబట్టి నీవలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు
అంటున్నారు. అనగా దేవునికోసం ఖర్చుపెట్టే వాడు యోగ్యుడు అనే అర్ధం మరొకటి
వస్తుంది.
ఇక 2కొరింథీ 10:18
లో ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గాని తననుతానే మెచ్చేకొనే వాడు
యోగ్యుడు కాదు అని పౌలుగారు చెబుతున్నారు. మరి ప్రభువు మెచ్చుకోవాలంటే ఏమి
చెయ్యాలి? ఎలాంటి పనులు చెయ్యాలి?
సింపుల్! దేవుడు చెప్పిన పనులే చెయ్యాలి గాని దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన
పనులు చెయ్యకూడదు. గాని ఈరోజులలో అనేకమంది దేవుడు చెయ్యమన్న పనులు చెయ్యడం
లేదు గాని వద్దు అని చెప్పిన పనులే ఎక్కువగా చేస్తున్నారు. కారణం అవన్నీ
లోకానుసారమైనవి. వాటిని చేస్తుంటే వీరికి మజా వస్తుంది. అయితే ఈ మజాకు
ప్రతిఫలంగా నరకం,
చావు వస్తుంది అని మరచిపోతున్నారు. దేవుడు మెచ్చుకునే వాడు ఎవడు, యోగ్యుడు ఎవడు అని చెప్పడానికి పౌలుగారు 1తిమోతి 11:19లో ఒక విభిన్నమైన మాట చెప్పారు. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో
భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు అంటున్నారు. అయితే ఈ మెచ్చుకునే లేక యోగ్యమైన
అనేమాటకు ఉపయోగించిన పదం యొక్క అర్ధం మనం గ్రీకు నుండి తెలుగులోనికి తిన్నగా
తర్జుమా చేసుకుంటే: ఏదో ఒక పరీక్ష తర్వాత కలిగే ఆమోదాన్ని సూచిస్తుంది.
క్రైస్తవుల మధ్య చీలికను దేవుడు ఒక మంచి ఉద్దేశ్యంతోనే అనుమతిస్తారు అని ఈ
వచనం ద్వారా తెలుస్తుంది. ఈ భిన్నాభిప్రాయాలలో నుండి నిజమైన అభిప్రాయం కలిగి
స్వలాభం కోసం చూడకుండా సువార్తభారం కలిగి సువార్తవ్యాప్తి ఎవరుచేస్తారో వారే
యోగ్యులు! ఇంకా ఈ శోధనలు,
శ్రమలు దేవుని మెప్పుకు ఎవరు యోగ్యులే తేల్చి చెప్పడానికి ఉపయోగ
పడతాయి!
పరీక్ష అనేది లేనిదే ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలియదు! ఇంకా పరీక్ష అనేది
లేకపోతే చదువులు చదవడం వ్యర్ధం! అప్పుడే పిల్లలకు ఏమి అర్ధమయ్యింది ఎంతవరకు
అర్ధమయ్యింది? ఎవరు యోగ్యులు?
ఎంత పర్సెంట్ యోగ్యులు అనేది తెలుస్తుంది. ఫస్ట్ క్లాస్ నా,
సెకండ్ క్లాసా లేక డిస్టింక్షన్ ఏదో ఒకటి తెలియాలి అంటే పరీక్ష ఉండక తప్పదు!
అలాగే క్రీస్తుకోసం నిలబడినప్పుడు ఇలాంటి పరీక్షలు తప్పవు! ఈ పరీక్షలు ద్వారా
దేవుడు నిన్ను ఒకమెట్టు నుండి మరో మెట్టుకు తీసుకుని వెళ్తున్నారు. దేవుని
దృష్టిలో నీవు ఇంకాఇంకా యోగ్యుడుగా మారుతున్నావు అన్నమాట!
గలతీ 1:10లో ..
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా?
నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా?
నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను
కాకయేపోవుదును.
....
మనం ఒప్పించాల్సినది మెప్పించాల్సినది దేవున్నే తప్ప మనుష్యులను ఎంతమాత్రము
కాదు!
ప్రియ దైవజనుడా! నీవు దేవుని ఎదుట యోగ్యుడుగా ఉండాలంటే ముఖ్యమైన మరో విషయం
ఏమిటంటే: నీవుచేసే బోధ మనుష్యులను మెప్పించేదిగా ఉండాల్సిన అవసరం లేదు. నీవు
దేవుణ్ణి మెప్పించాలి. కారణం నిన్ను ఏర్పరచుకున్నది, రక్షించినది, ఎన్నుకున్నది,
పిలిచినది దేవుడే గాని మనుష్యులు కాదు! వారిని మెప్పించే బోధ
చెయ్యకపోతే,
వారికి బాధ కలిగించే బోధ చేస్తే ఎక్కడ కానుకలు ఇవ్వరో లేక ఎక్కడ మా సంఘం
వదిలి వెళ్ళిపో అంటారో అని మనుష్యులను మెప్పించే బోధ చేస్తే నీవు దేవుణ్ణి
మెప్పించే వాడవు కాదు మనుష్యులను మెప్పించే వాడవు. అప్పుడు నీవు దేవునిఎదుట
యోగ్యుడవు కావు. బండమీద పునాది వేసి ఇల్లు కట్టిన వాడవు కావు. ఇసుకమీద
పునాదివేసి ఇల్లు కట్టిన బుద్ధిహీనుడవు! మత్తయి 7; లూకా 6;
ఇంకా బంగారం వెండి కర్ర వంటి వస్తువులతో ఇల్లు కట్టగా నీ పని అగ్ని అనగా
అగ్నిలాంటి పరీక్షలు శోధనలు వచ్చినపుడు నీ పని కాలిపోతే అనగా కనబడక పోతే నీవు
యోగ్యుడవు కావు అంటున్నారు ఇదే అధ్యాయములో! ఇక్కడ బంగారం వెండి కర్ర అనగా
నీవు చేసిన భోధలు! నీ బోధ వినిన విశ్వాసులు శ్రమలలో తట్టుకుంటే,
రాకడలో ఎత్తబడితే నీవు యోగ్యుడవు. సిగ్గుపడనక్కరలేని పనివాడవు! నీభోదతో నీవు
మందను తయారుచేస్తున్నావా లేక దేవుని రాజ్యాన్ని కడుతున్నావా?
దేవునికి రాజులైన యాజక సమూహాన్ని తయారుచేస్తున్నావా లేక గాలికి ఎగిరిపోయే
పొల్లునా లేక చెత్తనా?
ఒకసారి ఆలోచించుకో! నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలి కాని మనుష్యులను సంతోష
పెట్టాలని ఎంతమాత్రము ప్రయత్నించకు!
1థెస్స 2:4-6
ఒకసారి ఆలోచిద్దాం!.
4.
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై,
మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే
సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
5. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను,
ధనాపేక్షను (లోభత్వమును) కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును
వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.
6.
మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు
సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని,
మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు. ....
కాబట్టి దైవజనుడా! మనుష్యుల మెప్పును కోరవద్దు! దేవుని మెప్పును పొందాలి అంటే
ఉన్నది ఉన్నట్లే బోధించి,
దేవుని ఎదుట యోగ్యుడు అనే సర్టిఫికేట్ పొందుకో! దానినే భళానమ్మకమైన
మంచిదాసుడా! అంటారు.
ఇంకా శ్రమలయందు సోలిపోవద్దు! ధైర్యముగా ఉండు!
అప్పుడు నీవు యోగ్యుడవు అవుతావు!
ఇంకా దేవునికోసం నీ ధనము, నీ యవ్వనము,
నీకు కలిగినది సమస్తము ఖర్చుపెట్టు అప్పుడు దేవుని దృష్టికి నీవు యోగ్యుడవు
కాగలవు!
అట్టి ధన్యత ప్రభువు ప్రతీ దైవజనుడికి దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --2౩వ భాగం*
*చేయదగినవి-7*
2తిమోతి 2:15...
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను,
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను
నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం! *గమనించాలి
ఈ 2:15 వ వచనం ప్రతీదైవసేవకుడు,
సంఘకాపరి, భోధకుడు,
సువార్తికుడు చేయవలసిన ముఖ్యమైన పని: కాబట్టి ప్రతీ సేవకుడు ఈ వచనం ప్రకారమే
చేయాలి!*
పైవచనంలో పౌలుగారు తిమోతిగారిని మూడు విధాలుగా దేవునికి నిన్ను నీవు కనపరుచుకో
అంటున్నారు.
1. యోగ్యునిగా;
2. సిగ్గు పడనక్కరలేని పనివానిగా;
౩. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా దేవునికి
నిన్ను నీవు కనుపరచుటకు జాగ్రత్తపడు అంటున్నారు పౌలుగారు!
ఇక రెండవదిగా *సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవునియెదుట నిన్నునీవు
కనపరచుకో!* దైవ సేవకుడు ఎవరైనా సరే, సోమరితనంతోను,
నిర్లక్షమైన ధోరణితోనూ,
సాక్షం కోల్పోయినవాడుగాను ఉంటే అతడు దేవుని దృష్టిలో యోగ్యుడు
అనిపించుకోడు! దేవుడు మరియు సాతానుగాడు కూడా నిన్ను ప్రతీక్షణం జాగ్రత్తగా
పరిశీలన చేస్తున్నారు. ఇంకా దేవుడు మనం అనగా దైవసేవకులు చేస్తున్న పనిని
పరీక్షిస్తున్నారు కూడా 1కొరింథీ ౩:12—15 ప్రకారం.
12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము,
వెండి, వెలగల రాళ్లు,
కఱ్ఱ, గడ్డి,
కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,
13. వాని వాని పనికనబడును,
ఆ దినము దానిని తేటపరచును,
అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే
పరీక్షించును.
14.
పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.
15.
ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును;
అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు
రక్షింపబడును.
ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కట్టేవారు అనగా దేవుని సేవకులు
ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండాలి. ఇంకా దేవుని వాక్యాన్ని అమూల్యమైన సత్యాలను
ఆత్మీయ మర్మాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించే వారైతేనే వారు కట్టే దేవుని
ఇల్లు అనగా ఆయన సంఘాన్ని విలువైన వెండిబంగారాలు లాంటి విలువగల లోహాలను
మణిమాణిక్యాలు వాడుతున్నట్లు! అలా కాకుండా లోక సంబంధమైన జీవితం జీవిస్తూ
లోకాచారాలు నీవే పాటిస్తూ సంఘంలో నీవుకూడా లోకాచారాలు సంఘాచారాలుగా పాటించావు
అంటే నీవు ఆధ్యాత్మిక మైన వ్యక్తివి కావు లోక సంభంధమైన వ్యక్తివి! ఇంకా నీవు
సంఘంలో ఆధ్యాత్మిక సంబంధమైన వాటికోసం బోధించక, మనుష్యులు మెచ్చుకునే బోధలు చేస్తూ ,
నీ సొంత ఆలోచనలు,
మనుష్యులకు ఆనందం కలిగించే బోధలు చేస్తే నీవు గడ్డి కర్ర, కొయ్య,
చెత్త లాంటి వస్తువులు ఉపయోగిస్తూ దేవుని ఇంటిని అనగా దేవుని సంఘాన్ని
కడుతున్నావు అని అర్ధం! అయితే తన సేవకుల అందరి పనికి దేవుడు తీర్పుతీర్చే
కాలం దగ్గరలో ఉంది దానికోసం ఈ 13—15
వచనాలలో పౌలుగారు చెబుతున్నారు. తీర్పు అనే మంటలలో,
శోధనలలో,
శ్రమలలో దేవుడు నిన్ను పరీక్షించబోతున్నారు. అప్పుడు నీవు నీసంఘము
శ్రమలకు, శోధనలకు,
విశ్వాసంలో నిలబదిందా నీవు నిలబదినట్లే! సోలిపోయిందా నీ పని గడ్డితో
కొయ్యతో కట్టినవి అగ్నిలో ఎలా కాలిపోతాయో అలాగే నీ సేవ కూడా
వ్యర్ధమైపోతుంది. నీవు సేవలో ఎంతగా కష్టపడ్డావో అన్నది కాదు ఎంత నాణ్యమైన
బోధలు చేసావు,
ఎంతగా నీ సంఘాన్ని రాకడకు ఆయత్తపరచావు. అందరూ దేవుని నిజమైన బోధను
గ్రహించారా లేదా? అన్నది ముఖ్యం!
ఎంత సంఘాన్ని సంపాదించావు అన్నది కాదు—ఎంతమంది విశ్వాసవీరులను/ ప్రార్ధనావీరులను తయారుచేశావు అన్నది ముఖ్యం! నీ
సంఖ్య దేవునికి అక్కరలేదు! ఎంతమంది చెత్తను, పొల్లును తయారుచేసినా దేవునికి ఆ చెత్త,
పొల్లు అక్కరలేదు!
దేవునికోసం చావడానికైనా సిద్దపడే విశ్వాసవీరులను తయారుచేయాలి. అంతేగాని
శ్రమలు వచ్చినా, క్రైస్తవుడు అని చెబితే ఉద్యోగం రాదు,
రేషన్ కార్డ్ తీసేస్తారు,
కులం నుండి వెలివేస్తారు అని భయపడే వారిని తయారుచేస్తే ఏమీ ఉపయోగం లేదు!
సోమరియైన చెడ్డ దాసుడా అని పిలుస్తారు దేవుడు!
శ్రమలు సంభవించిన తర్వాత సంఘం నిలబదిందా లేక పారిపోయిందా అనేది దేవుడు
చూస్తారు తప్ప నీ సంఘం యొక్క సంఖ్య దేవునికి అనవసరం!
ఇంకా దేవుని పనిని ఎంత నమ్మకముగా చేస్తున్నావు అనేది దేవునికి కావాలి!ఇంకా
ఎంత శ్రద్దగా, భయంతో , వణకుతో,
దేవుని సేవ చేస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నారు. 1కోరింథీయులకు 2: 3
మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.
... ఇలాగే ప్రతీ సేవకుడు పనిచెయ్యాలి!
యేసుక్రీస్తు ప్రభులవారు త్వరలో రాబోతున్నారు. అప్పుడు ప్రతీఒక్కరికి
తీర్పుతీర్చి ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. అప్పుడు తీర్పులో దేవుని న్యాయమైన
త్రాసులో తూయగా నీవు తక్కువగా కనబడితే నీ బ్రతుకు ఏమవుతుంది ప్రియ
సహోదరుడా! మత్తయి 16:27..
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పు
డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును..; 2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే,
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును
క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.....; ప్రకటన 22:12....
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు
నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
ఈ న్యాయమైన తీర్పులో నీవు తీర్పు పొంది భళానమ్మకమైన మంచి దాసుడా అనిపిలువ
బడితే నీవు బహు ధన్యుడవు! అలా కాకుండా నష్టం కలిగితే నీకు అవమానమే! సిగ్గుపడే
సేవకుడవే!
ఒకసారి తీర్పుకోసం ఆలోచన చేద్దాం! ఆ తీర్పు దేవుని ఇంటినుండే అనగా దైవసేవకుని
ఇంటినుండే మొదలైతే నీవు సిద్దముగా ఉన్నావా ప్రియ దైవజనుడా???!! 1పేతురు 4:17—18..... 1 Peter(మొదటి పేతురు) 4:17,18,19
17.తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది;
అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి
యేమవును?
18.మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ
నిలుతురు?
19.కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై,
నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
కాబట్టి ప్రియ దైవజనుడా! దేవునిముందు సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని సేవ
చెయ్యమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను! కయీను తన అర్పణమును
అర్పించినప్పుడు,
తన తమ్ముడైన హేబెలును చంపినప్పుడు,
దేవుడు ఏమని చెప్పారు?
నీవు సత్క్రియలు చేస్తే నీ తలను ఎత్తుకొనవా?
ఆదికాండం 4:6,7;
నీవు నిస్వార్ధంగా దేవునికోసం పనిచేస్తూ,
దేవుడే చెప్పిన పనిని మాత్రమే చేస్తూ,
దేవుడు చెప్పిన బోధను మాత్రమే ఉన్నదిఉన్నట్లుగా చేస్తే నీవుకూడా తలెత్తుకుని
జీవిస్తావు!
లేదా సోమరియైన చెడ్డదాసుడా అని పిలువబడి అగ్ని గంధకాలతో మండే గుండములో
పాలుపొందుతావు! కాబట్టి నిన్నుగూర్చి,
నీభోదను గూర్చి జాగ్రత్తపడు! సువార్తికుని పనిచేస్తూ శ్రమలను
అనుభవించు!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --24వ భాగం*
*చేయదగినవి-8*
2తిమోతి 2:15...
దేవునియెదుట యోగ్యునిగాను,
సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను,
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను
నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం! *గమనించాలి
ఈ 2:15 వ వచనం ప్రతీదైవసేవకుడు,
సంఘకాపరి, భోధకుడు,
సువార్తికుడు చేయవలసిన ముఖ్యమైన పని: కాబట్టి ప్రతీ సేవకుడు ఈ వచనం ప్రకారమే
చేయాలి!*
పైవచనంలో పౌలుగారు తిమోతిగారిని మూడు విధాలుగా దేవునికి నిన్ను నీవు కనపరుచుకో
అంటున్నారు.
1. యోగ్యునిగా;
2. సిగ్గు పడనక్కరలేని పనివానిగా;
౩. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా దేవునికి
నిన్ను నీవు కనుపరచుటకు జాగ్రత్తపడు అంటున్నారు పౌలుగారు!
ఇక మూడవదిగా *సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా లేక సరిగా విభజించువానిగా
దేవునికి నిన్నునీవు కనపరచుటకు జాగ్రత్తగా ఉండు అంటున్నారు పౌలుగారు*! స్టడీ
బైబిల్ లో అయితే: సత్యవాక్కును సరిగా ప్రయోగించేవాడుగా నిన్నునీవు దేవునికి
కనబరచుకోవడానికి ఆసక్తితో కృషి చేయుము! అని వ్రాయబడింది. దేవుని వాక్యమును
సరిగా ప్రయోగించాలి,
సరిగా ఉపయోగించాలి. సరిగా విభజించాలి! అప్పుడే దేవునివాక్య మర్మము నీకు
అర్ధం అవుతుంది. నీభోధ వినే ప్రజలకు కూడా బాగా అర్ధం అవుతుంది అని పౌలుగారి
భావము ఇక్కడ! అలాగని నీకు అనుకూలంగా మార్చుకుని బోధచేస్తే దేవుని ప్రతిదండన
తప్పించుకోలేవు జాగ్రత్త! అందుకని దయచేసి వాక్యాన్ని కలిపి చెరపకు!
ఉన్నదిఉన్నట్టు బోధించాలి!
ఇంతకీ ఎందుకు పౌలుగారు సరిగా విభజించు లేక ప్రయోగించు అంటున్నారు? కారణం దేవుని వాక్యం/ వాక్కు కొంచెం ఇక్కడ,
కొంచెం అక్కడ విడుదల కాబడింది లేక చెప్పబడింది లేక ప్రత్యక్షపరచబడింది.
వాటిని మనం సరిగా విభజించుకుని అన్వయించుకుంటే సత్యవాక్యము సరిగా
అర్ధమవుతుంది. ఒకసారి యెషయ 28:9—14
చదువుకుంటే ఇంకా బాగా అర్ధమవుతుంది......
9. వాడు ఎవరికి విద్య నేర్పును?
ఎవరికి వర్తమానము తెలియ జేయును?
తల్లిపాలు విడిచినవారికా?
చన్ను విడిచినవారికా?
10.
ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి
సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.
11.
నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని
చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో
మాటలాడుచున్నాడు.
12.
అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి
చిక్కు బడి పట్టబడునట్లు
13.
ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ! సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి
సూత్రము! కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
14.
కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా,
యెహోవా వాక్యము వినుడి!
కాబట్టి ప్రియ దైవజనమా! కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడిన దేవుని
వాక్యాన్ని అది ఇదీ కలుపుకుని విభజిస్తూ వివరిస్తే సంఘానికి సరిగా
అర్ధమవుతుంది. ప్రియ దైవజనుడా! ఇంతకీ నీవు ప్రతీరోజూ దేవుని సత్యవాక్యాన్ని
పటిస్తూ ధ్యానం చేస్తున్నావా?
అప్పుడే నీవు దేవుని వాక్యమును సరిగా అర్ధం చేసుకోగలవు. అందరికీ
చెప్పగలవు!
పౌలుగారు వాక్యమును సత్యవాక్యము అని చాలాచోట్ల ప్రయోగించారు. ఎఫెసీ 1:13....
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి,
వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
చూడండి ఇక్కడ సత్యవాక్యము అనగా క్రీస్టు రక్షణ సువార్త అని చెబుతున్నారు
పౌలుగారు. ఇంకా కొలస్సీ 1:5లో....
మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు
ఇంతకుముందు వింటిరి.
ఇక్కడ ఇదే సత్యవాక్కును సువార్తసత్యము అంటున్నారు. మొత్తానికి ఇక్కడ
సత్యవాక్యము అనగా దేవుని రక్షణ సువార్తనే పౌలుగారు సత్యవాక్యము అని
వ్రాస్తున్నారు.
మరి ఇప్పుడు దేవుని మెప్పును పొంది ఆయనకు యోగ్యుడుగా మారాలి అంటే మొదటగా
దేవుని వాక్యాన్ని ఏ విధముగా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి! కొంతమంది సేవకులు
వారు ఏ వాక్యము చెబుతున్నారో వారికే తెలియకుండా ప్రసంగాలు చేస్తుంటారు. చావుకు
ఏ వాక్యము చెప్పాలి, పెళ్ళికి ఏ వాక్యము చెప్పాలి,
సువార్త ఎలా చెప్పాలి,
సంఘ ఆరాధనలో ఏ వాక్యము చెప్పాలో తెలియకుండా చెబుతుంటారు. మా సంఘంలో ఒక
అమ్మాయి పెళ్ళికి మరో ఊరు వెళ్తే ఆ సంఘకాపరి చావు వర్తమానం ఇచ్చారు. స్టేజి
దిగాక ప్రజలందరూ ఆ వ్యక్తిని తిట్టారు. ఎందుకు తిట్టారు అంటే దేవుని
వాక్యమును ఎలా ఉపయోగించాలో తెలియకనే! కాబట్టి దేవుని వాక్యమును సరిగా
ఉపయోగించడం తెలియకపోతే దేవుడే కాదు ప్రజలకు కూడా యోగ్యుడుగా ఉండలేవు! .
ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి: నా భార్యయొక్క తాతగారు పాష్టర్ గారు.
కొంతకాలానికి ఆయన బ్రేన్హాం గారి బోధలు అంగీకరించి వారిలో కలసిపోయారు. కాబట్టి
నా భార్య బ్రెన్హమైట్ సంఘానికి చెందినది. మరి బంధుత్వం కోసం అప్పుడప్పుడు వారి
వివాహాలు,
చావులకు వెళ్తూ ఉంటాను. అప్పుడు అక్కడ వారు చెప్పే బోధలలో కొంతమంది
అనేకసార్లు పెళ్ళికి ఒకటే ప్రసంగం, చావుకు ఒకటే ప్రసంగం,
మామూలు మీటింగులకు ఒకటే ప్రసంగం. అది ఏమిటంటే: అంత్యకాల ప్రవక్త ఎవరు?
ఏం చెప్పారు అంటూ.... ఇలాంటి బోధలు అన్యులు వింటూ వీరికి ఇకబైబిల్ లో మరో
మాటలు దొరకలేదా అంటుంటారు. కాబట్టి దైవజనుడు తప్పకుండా దేవుని సత్యవాక్కును
సరిగా ఉపయోగిస్తూ,
సరిగా విభజిస్తూ సరిగా ప్రయోగించే వాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు, ప్రజలు మెచ్చుకుంటారు.
కొంతమంది దైవసేవకులు అనొచ్చు—నేను ఏమీ చదువుకోలేదు. ఎలా వాక్యాన్ని సరిగా బోధించగలను అంటుంటారు.
సహోదరి సహోదరుడా! పేతురు, అంద్రేయ,
ఇంకా యేసయ్య శిష్యులలో చాలామంది చదువుకొనని వారు. జాలరులు! అందుకే
వారిని చూసిన శాస్త్రులు పరిసయ్యులు అధికారులు వారు విద్యలేని పామరులు
అని ఇట్టే పసిగట్టేశారు. అపొ 4:16;
మరి వారు దేవునివాక్యాన్ని సరిగా ప్రకటించలేదా?
ఎందుకు ప్రకటించలేదు.. ఇప్పటి కాలంలో ఉన్న బైబిల్ పండితులకు,
ప్రసంగీకులకు మించి ఘనంగా వాక్యమును లేఖనాలను వివరిస్తూ ఘనమైన సువార్తను
ప్రకటించారు. వారు ఎక్కడ చదువుకున్నారు? ఏ బైబిల్ కాలేజిలో చదువుకున్నారు?
అంటే ఎక్కడ లేదు! యేసయ్యతో ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకుని-
పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పాడో ఎలా నేర్పించాడో అదే చెప్పారు! కాబట్టి
ప్రియ చదువుకోలేని దైవజనులారా! మీరుకూడా బాగా వాక్య పరిచర్య చేస్తూ
వాక్యమును సరిగా ఉపయోగించగలరు—ఎలా?
పరిశుద్దాత్మ పూర్ణులైనప్పుడు! అప్పుడు పరిశుద్ధాత్ముడే మిమ్మును
నడిపించి వాడుకుంటారు.
(ఇంకాఉంది)
*దైవజనుడా..... --25వ భాగం*
*చేయదగినవి-8*
2తిమోతి 2:15...
దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను,
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను
నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
(గత భాగము తరువాయి)
ఈ సందర్బముగా ఒకసారి మా తండ్రిగారి సాక్ష్యములో కొంత మీకు చెప్పాలని
అనుకుంటున్నాను. మా తండ్రిగారు చేపలు పట్టే వృత్తిలో ఉండి
నిరుపేదలుగా,
చదువుకోలేదు! గాని చదువుకోవాలని ఆశ! మా నాన్నగారి బాల్యములో స్కూళ్ళు
లేవు ఆ ప్రాంతంలో. ఒకరి దగ్గర అఆ లు మాత్రం నేర్చుకున్నారు. గాని మొత్తం
నేర్చుకోకుండా మా పెదనాన్న కొట్టేసేవాడంట ఉడికిపోతూ! కాబట్టి
చదువుకోలేకపోయారు. నాన్నగారు రక్షించబడ్డాక దేవుడు సేవకు రమ్మనిపిలిచారు.
నేను రాను- నాకు చదువురాదు అని చెబితే దేవుడే నాన్నగారికి చదవడం
నేర్పించారు. ఎలా అంటే;
ప్రతీరాత్రి ఒంటిగంటకు మా సొంతఊరిలో ఒక కొండమీదకు పిలిచి అక్కడ
దేవునివెలుగు చూపించి బైబిల్ ఎలా చదవాలి, ఎలా అర్ధం చేసుకోవాలి,
ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలి,
ఎలా పాటలు పాడాలి అనేవి అన్నీ సుమారు ఏడు నెలలు చేర్పించారు అట! ఆ
తర్వాత మా సొంత గ్రామానికి 24
కి.మీ. దూరంలో యలమంచిలి అనే టౌన్ లో ఉన్న పెంతుకోస్తు చర్చికి వెళ్తూ
ఉండేవారు. దేవుని నడిపింపును బట్టి దేవునిమాటను బట్టి ఆ దేవదాసు గారు అనే
దైవజనుడు నాన్నగారిని దైవజనులు అపో. P M
సామ్యేలు గారి దగ్గరకు ట్రైనింగ్ కి పంపితే ఆ దైవజనుడు వాక్యమును
ఎక్కువగా చెప్పలేదంట! మోకాళ్ళ అనుభవం నేర్పించి, ఏ సమస్యకు ఎలా దేవుణ్ణి అడగాలి,
దేవునినుండి ఎలా పొందుకొవాలి,
దేవునితో ఎలా సాంగత్యము చెయ్యాలి అనేది నేర్పించి—ఒకరోజు నాన్నగారి మోకాళ్ళు చూశారట! అప్పటికే నాన్నగారి మోకాళ్ళు నల్లగా
బండబారి పోయాయట! వెంటనే లూకా నీకు సేవ చేయడానికి కావలసిన అనుభవం
వచ్చేసింది ఇక నీవు వెళ్లి సేవచేయు అన్నారట! (ఆ దైవజనుడు స్టైలే అది.
ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వారు సాతానుగాడితో అంత విజయవంతంగా పోరాడగలరు
కాబట్టి మోకాళ్ళు చూసి అప్పుడు సేవకు పంపించేవారట). వెళ్ళటప్పుడు బోరున
ఏడ్చారట- ఎందుకంటే నాన్నగారు క్రీస్తుకోసం –
సేవకోసం పడబోయే కష్టాలు ముందుగానే ఆ దైవజనుడికి చూపించారట దేవుడు!
అప్పుడు ఆ దైవజనుడు: లూకా! నాకో మాట ఇస్తావా? అని అడిగారు. నీకు సేవకోసం,
క్రీస్తుకోసం ఎన్ని కష్టాలు వచ్చినా సేవను,
క్రీస్తును వదలకుండా సేవచేస్తాను అని మాటిస్తావా అని అడిగితే, నన్ను సేవకు పిలిచింది దేవుడు,
ఇక్కడకు పంపించినది,
చదువు నేర్పినది దేవుడే కాబట్టి నా ప్రాణమున్నంత దేవుణ్ణి వదలను అని ఆ
దైవజనుడికి మాటిచ్చారు. 50
సంవత్సరాలు సేవచేసారు. ఎనిమిది సంఘాలు కట్టారు. ఒక తీ త్రాగి రోజుకు 15—20
గ్రామాలు తిరుగుతూ సేవచేశారు. నాన్నగారి చేతులతో వెయ్యికి మందికి పైగా
భాప్తిస్మం ఇచ్చారు. 9౩ సంవత్సరాల వయస్సులో నిండు వృద్ధాప్యమందు చనిపోయారు.
మరి చదువురాని మా తండ్రిని వాడుకున్న దేవుడు,
అనేక సభలలో ప్రసంగించిన నాన్నగారిని వాడుకున్న దేవుడు నిన్నుకూడా
వాడుకోగలరు! సేవకు చదువు ప్రమాణం కాదు. యేసయ్య శిష్యులలో అనేకమంది చదువురాని
వారే! ఆయన ప్రవక్తలలో అనేకమంది గొప్పవారు కాదు. సామాన్యులు! అయినా దేవుడు
వారిని వాడుకున్నారు. నిన్నుకూడా వాడుకోగలరు! నీకు చదువురాకపోయినా పర్వాలేదు
కాని ఆయన పాదాల దగ్గర కనిపెట్టే వాడుగా, నమ్మకమైన వాడుగా ఉంటూ,
ఆయన ఆత్మను పొందుకుని ప్రతీదినం ఆత్మాభిషేకాన్ని అనుభవిస్తూ ఉంటే దేవుడే
నీకు బోధిస్తారు. ఎటువంటి బైబిల్ తర్ఫీదు పొందుకోకపోయిన నీవు దేవుని
వాక్యమును సరిగా ఉపయోగించగలవు. దేవుణ్ణి అడుగు వాక్యమును నేర్పించమని!
పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు.
నేటి రోజులలో క్రొత్తగా సేవకు వచ్చిన,
వస్తున్న వారు చదువుకోని ఎవరూ ఉండరనే నా ఉద్దేశ్యం! కాబట్టి వారికి
చెప్పేదేమిటంటే: దైవజనుడా వాక్యాన్ని అనుదినం ఆసక్తితో పటిస్తూ ధ్యానం
చేస్తూ,
ప్రార్ధనాపూర్వకంగా ధ్యానం చేస్తే దేవుడు నీకు బోధిస్తారు. ఆయన పాదాల దగ్గర
నేర్చుకో! మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి
అంటున్నారు భక్తుడు యాకోబుగారు! 1:5;
మరినీవు కూడా అడిగి పొందుకో!
వాక్యాన్ని బాగా నేర్చుకో!
విభజించడం నేర్చుకో!
వాక్యాన్ని ఉపయోగించడం నేర్చుకో! అప్పుడే దేవుని మెప్పును పొంది దేవునికి
ఇష్టుడుగా యోగ్యుడుగా మారగలవు!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --26వ
భాగం*
*చేయదగినవి-9*
2తిమోతి 2:22...
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి అంటున్నారు
మొదటిది నీతిని,
రెండవదిగా విశ్వాసమును;
మూడవదిగా ప్రేమను;
నాల్గవదిగా సమాధానమును వెంటాడాలి!
అంతేకాకుండా
ఎవరితో
కలవాలి
అంటే
పవిత్ర
హృదయులై
ప్రభువుకు
ప్రార్ధన
చేసేవారితో
మాత్రమే
కలవాలి
తప్ప – ప్రతీ
ఒక్కరితో
స్నేహం
చేయకూడదు! దైవజనుడు
అన్యులతోను
అవిశ్వాసులతోను
మాట్లాడకూడదు
అని
ఇక్కడ
అర్ధం
ఎంతమాత్రము
కాదు! వారితో
మాట్లాడ
వచ్చు
గాని
వారితో
సహవాసం
చెయ్యకూడదు! హయ్
అంటే
హాయ్
అని
చెప్పేటంతవరకే
తప్ప
వారితోగంటలు
గంటలు
కబుర్లు
చెబుతూ
వారి
ఇంటికి
వెళ్తూ
ఉండకూడదు. విశ్వాసికి
అవిశ్వాసితో
పాలెక్కడిది , వారితో
విజ్జోడిగా
ఉండవద్దు
అంటున్నారు
అనగా
వారితో
చెట్టాపట్టాలు
వేస్తుకుని
తిరగావద్దు
అంటున్నారు
పౌలుగారు. 2కొరింథీ 6:14--16;
మరి ఎవరితో సహవాసం చెయ్యమంటున్నారు అంటే: *పవిత్రమైన హృదయం కలిగి ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రార్ధనా విజ్ఞాపనలు చేస్తున్న భక్తులతో ప్రార్ధనా పరులతో, దేవుని సమాజముతో సహవాసం చెయ్యమంటున్నారు! అప్పుడే నీవు నీతిని సమాధానమును, ప్రేమను విశ్వాసమును వెంటాడగలవు లేక వాటిని అనుసరిస్తూ జీవితాన్ని గడపగలవు! అలా చెయ్యకపోతే మూర్ఖులతో సహవాసం చేస్తే వాడు చెడిపోతాడు అని సామెతల గ్రంధంలో వివరంగా వ్రాయబడిఉంది! 13:12; ప్రియ దైవజనుడా! నీ సహవాసం ఎవరితో ఉంది?
ఇక ఈరోజు మొదటగా వెంటాడవలసిన లేక హత్తుకోదగిన లేక అనుసరించ వలసిన అంశం ధ్యానం చేద్దాం: *నీతిని
అనుసరించాలి*.
బైబిల్ గ్రంధంలో నీతిని అనుసరించిన దైవభక్తులు విశ్వాసవీరులు చాలామంది ఉన్నారు. వారిలో కొందరిని మాత్రం జ్ఞాపకం చేసుకుందాం! నీతిమంతుడు అని చెప్పిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది నోవహుగారు! దేవుడే అంటున్నారు: ఈ తరములో నీవే నీతిమంతుడుగా నాకు కనబడ్డావు అని! ఆదికాండం 7:1; అందుకే దేవుడు నోవహుగారితో నిభందన చేశారు. జలప్రళయములో చావకుండా తప్పించారు. అందుకే బైబిల్ లో చెప్పబడింది: నీతి మరణం నుండి తప్పించును! సామెతలు 11:4; నోవాహు గారి నీతి ఆయనను మరణం నుండి తప్పించింది.
ఇక తర్వాత నీతిమంతుడు అని అంటే టక్కున గుర్తుకు వచ్చేది అబ్రాహము గారు! బైబిల్ అబ్రాహాముగారి గూర్చి సెలవిస్తుంది అనేకచోట్ల: అబ్రాహాము దేవుని నమ్మెను, అది (అనగా దేవుని నమ్ముట) అతనికి నీతిగా ఎంచబడెను! ఇక్కడ నీతి అంటే ఏమిటో ఒక నిర్వచనం కనబడుతుంది మనకు. అది ఏమిటంటే: దేవుని మనసారా నమ్మడమే నీతి! ప్రియ దైవజనుడా! నీవు దేవుణ్ణి మనసా వాచా కర్మేనా నమ్ముతున్నావా? అన్నీ బాగున్నప్పుడు నమ్మడం చాలా సులువే! గాని అన్నీ పోయాక లేక ఏమీ లేనప్పుడు దేవుణ్ణి నమ్మడమే నీతిగా ఎంచబడుతుంది. అటువంటి భక్తులు ఇద్దరున్నారు. మొదటగా భక్తుడైన యోబుగారు. దేవుడే అతని గురుంచి సాతానుతో వాదిస్తున్నారు- అతడు అనగా యోబు యదార్ధవంతుడు అంటున్నారు. నీతిమంతుడు అంటున్నారు. తనకు కలిగిన సమస్తమూ పోయింది ఒక్క భార్య, అతని ప్రాణం తప్ప అన్నీ పోయాయి. గాని దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదు. ఈలోకానికి వచ్చినప్పుడు దిగంబరినై వచ్చాను దిగంబరినై వెళ్తున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవ తీసికొనెను. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నారు. 1:21-22; అదీ నీతి! అదీ విశ్వాసం- నమ్మకం! ప్రేమ!
ఇక మరో భక్తుడు హబక్కూకు గారు.3:17,18
17. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
18. నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. ..... ఈ మాట అనడానికి పూర్వం ఆయన యెరూషలేములో గొప్ప శ్రీమంతుడు! ప్రవక్తల శిష్యుల స్కూలులో చదువుకుని ఆస్థాన ప్రవక్తగా, ఒక ప్రక్క మంచి వాయిద్యకారుడు కాబట్టి మందిరములో వాయిద్యకారుడుగా ఉంటూ, తన తండ్రికి ఉన్న ఎన్నో ఎస్టేట్ ల ఆలనాపాలన చూసుకుంటూ ఉండేవారు ఆయన! అకస్త్మాత్తుగా బబులోనీయులు దండెత్తి యేరూషలేమును ద్వంసం చేసి కాల్చినప్పుడు పారిపోయి కేవలం తన ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. సమస్తము పోగొట్టుకున్నారు. తన ఆస్థాన ప్రవక్త ఉద్యోగం, తన ఆస్థాన గాయకుడు, వాయిద్యకారుడు ఉద్యోగం పోయాయి. తనకున్న ఎస్టేట్ లు పోయాయి. హబక్కూకు గ్రంధంలో దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగి చివరకు అంటున్నారు: ఏదైతేనేమి ఏమి ఉన్నా లేకపోయినా నేను దేవుని యందు నమ్మకము ఉంచుతాను. ఆయనే నాకు కావాలి! ఇదీ విశ్వాసం! నమ్మకం! ఇదే నీతి! ప్రియ దైవజనుడా! నీకు అటువంటి నీతి ఉందా? కేవలం అన్నీ ఉన్నపుడే దేవుణ్ణి స్తుతిస్తూ ఏమీ లేనప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నావా?
తర్వాత
దావీదుగారు: ఆయన
ఎన్నోసార్లు
నా
నీతిని
నా
యధార్దతకు
ప్రతిఫలం
ఇచ్చారు
అని
చెబుతున్నారు. 1సమూయేలు 26:23; ఇంకా
ఎంతో
ధైర్యంగా
దేవుడా
నన్ను
పరిశీలించుకో! నాయందు
నీకు
ఏ
దోషము
కానరాదు! నాలో
నీకు
నిర్దోషత్వం, నీతిన్యాయాలు
మాత్రమే
కనిపిస్తాయి
అంటున్నారు. అలాంటి
ధైర్యం
నీకుందా? ఇంకా
ఎంతోమంది నీతిమంతులైన భక్తులున్నారు బైబిల్ లో!
దానియేలు గారు నీతిమంతుడు!
కీర్తనల గ్రంధంలో యెహోవా నీతిమంతుడు! ఆయన నీతిని ప్రేమించువాడు అని వ్రాయబడింది.11:7;
యోబుగారు ఎన్ని కష్టాలు వచ్చినా నానీతిని విడువను, పట్టుకొంటాను అంటున్నారు 27:6; ఇంకా ఆయనే నీతిని వస్త్రముగా ధరించుకొన్నాను అంటున్నారు 29:14;
దేవుడు నీతిని న్యాయమును ప్రేమించువాడు కీర్తనలు ౩౩:5;
దేవుని నీతిని కలిగియున్నవాడు మౌనముగా ఉండడు; ఆయన సత్యమును రక్షణను అందరికీ వెల్లడిచేస్తాడు కీర్తనలు 40:10;
ఇంకా నా నీతిని బట్టి నన్ను తప్పించుము అంటున్నారు.71:2;
ఆకాశములు ఆయన నీతిని తెలియజేయుచున్నాయి అంటున్నారు 97:6; 50:6;
ఇంకా దైవజనుడు అన్నవాడు నీతినే వస్త్రముగా ధరించుకోవాలి 132: 9;
ఇంకా సామెతలు గ్రంధంలో అనేకచోట్ల నీతిని గురుంచి దాని ప్రాముఖ్యత కోసం వ్రాయబడి ఉంది. నీతిని కృపను అనుసరిస్తే జీవము, నీతి ఘనత పొందుతాడు 21:21;
కీర్తనలు 15 ప్రకారం ఎవరైతే నీతిని అనుసరించి నిజం పలుకుతాడో వాడే దేవుని పర్వతం అనగా సీయోనులో అనగా దేవుని సన్నిధిలో పరలోకంలో నిత్యమూ ఉంటాడు!
యెషయా ప్రవచన గ్రంధంలో అనేకసార్లు దేవుని నీతి గురుంచి, నీతిని అనుసరించ వలసిన అవసరం కోసం అనేకచోట్ల వ్రాయబడింది.26:9; ౩౩:15; 41:2; 45:8; 46:13; 51:1; 56:1; ఇక 58వ అధ్యాయంలో దేవుని నీతి అంటే పేదలకు, అవసరంలో ఉన్నవారికి సేవచేయడం అని చెబుతూ అలా చేస్తే 58:8 లో ..... నీ నీతి నీ ముందర నడుస్తుంది అంటున్నారు.
అందుకే ఆమోసు 5:24లో నీళ్ళు పారునట్లు న్యాయాన్ని, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహించనియ్యుడి అంటున్నారు.
జేఫన్యా 2:౩..
దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
దైవజనుడా! యేసుప్రభులవారు చెబుతున్నారు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకు! అప్పుడు నీకు ఏమికావాలో అన్ని ఆయనే ఇస్తారు! మత్తయి 6:౩౩;
అంతేకాదు నీతిని అనుసరిస్తే కష్టాలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. కాని నీతిని విడచిపెట్టకపోతే నీకు ఎన్నో ఆశీర్వాదాలు! మత్తయి 5:11,12;
చివరగా అందుకే పౌలుగారు 1తిమోతి 6:11 లో దైవజనుడా నీవైతే .... నీతిని భక్తిని, విశ్వాసమును, ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోడానికి ప్రయాసపడు అంటున్నారు.
కాబట్టి ప్రియ దైవజనుడా! నీవుకూడా అదే నీతిని వెంటాడుతూ ఆయన నీతిని నేరవేర్చమని ప్రేమతో మనవిచేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --27వ భాగం*
*చేయదగినవి-10*
2తిమోతి 2:22...
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము),
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును వెంటాడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు
మొదటిది నీతిని,
రెండవదిగా విశ్వాసమును;
మూడవదిగా ప్రేమను;
నాల్గవదిగా సమాధానమును వెంటాడాలి!
ఇక తర్వాత హత్తుకోవలసినది *విశ్వాసమును*! విశ్వాసము అంటే మొదటగా మనకు
గుర్తుకు వచ్చేది అబ్రాహాము గారు! విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డారు!
ఎందుకు పిలువబడ్డారు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి
నిలిచారు కాబట్టి,
దేవుణ్ణి మనస్పూర్తిగా నమ్మారు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడి అలా
దేవుణ్ణి నమ్మడం ఆయనకు నీతిగా ఎంచబడి విశ్వాసువీరుల పట్టీలో టాప్ గా
నిలిచారు.
ఒక సామాన్య మానవునికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది?
అబ్రాహాము గారి జీవితం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధిక్యతకు కారణాలు
కనిపిస్తాయి:
1. నీ తండ్రి ఇంటిని,
నీ స్వజనాన్ని విడచి,
నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు చెబితే (ఆది 12, హెబ్రీ 11:8)-
ఎక్కడికి వెళ్ళాలి?
ఎందుకు వెళ్ళాలి?
నేను నిన్ను ఎందుకు నమ్మాలి?
అక్కడ ఏముంటాయి?
ఇలాంటివి ఏమీ అడగకుండా దేవునిని నమ్మి తనకున్నదంతా తీసుకొని కల్దీయ దేశం
నుండి సుమారు 300
మైళ్ళు నడచి హారాను వెళ్ళిపోయారు. మరలా అక్కడనుండి ఐగుప్తు,
కానాను ఇలా దేశాలు తిరుగుతూ ఉన్నారాయన తన జీవితమంతా! ధనవంతుడైన
అబ్రాహాముగారు గుడారాలలో జీవిస్తూ, అరణ్యాలలో,
ఎడారులలో ఎండకు వానకు తిరుగుతూ జీవిస్తు గడిపారు. గాని ఎప్పుడూ దేవున్ని
ప్రశ్నించలేదు. ఇది చేస్తాను అది చేస్తాను అన్నావు. ఏదీ? అనలేదు. అదే అతనికి నీతిగా ఎంచబడింది, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను”
ఆదికాండము 15:6, రోమా 4:3.
ఈ అనుకూల ప్రవర్తనే అబ్రాహాము గారిని విశ్వాసులకు తండ్రిగా
మార్చింది.
2.
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:17-23.
ఎందుకంటే నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని వాగ్దానం చేసినవాడు
దానిని నెరవేర్చుటకు సమర్డుడని విశ్వశించి బలముపొందెను. అందుచేత అది అతనికి
నీతిగా ఎంచబడెను.
3. ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెబితే,
ఏ అడ్డంకము చెప్పకుండా బలి అర్పించడానికి సిద్ద మయ్యారు,
మృతులను సహితము ఆయన లేపడానికి శక్తిమంతుడని ప్రగాఢ విశ్వాసం కలియుండెను.
అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసులందరికీ తండ్రిగా
మారిపోయారు అబ్రహాము గారు!
కాబట్టి అబ్రాహాము గారికున్న అదే విశ్వాసమును ప్రతీదైవజనుడు పొందుకుని
వెంటాడాలి!
ఇంతకీ విశ్వాసము అనగా ఏమిటి?
విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1
*విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో?
దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.
2.
కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.
విశ్వాసం అంటే?
• చీకటిలోనికి దూకడం కాదు.
• గాలిలో మేడలు కట్టడం కాదు.
•
దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
•
నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను
నమ్మదు.
•
దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
•
పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.
*నమ్మిక,
విశ్వాసం ఒక్కటి కాదు.
•నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం.
•నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి.
ప్రియ దైవజనుడా! నీకు ఎలాంటి విశ్వాసము ఉంది?
అబ్రాహాము గారిలాంటి విశ్వాసముందా లేక ఎలాంటి విశ్వాసముంది? ఒకసారి హెబ్రీ 11వ అధ్యాయం చూస్తే అక్కడ అనేకమంది విశ్వాసవీరులు కనిపిస్తారు. హేబెలు, హనోకు, అబ్రాహాముగారు,
మోషేగారు, దావీదుగారు, ..
ఇలా ఎందఱో ఉన్నారు అందరూ విశ్వాసముంచారు.
హెబ్రీయులకు 11: 13
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి,
తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఇంకా 6వ వచనంలో ......
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు,
తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
10వ వచనంలో
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో,
పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
ఇంకా ప్రియ దైవజనుడా! నీ పరిచర్య ఘనముగా జరగాలా?
నీవు గంభీరమైన సేవ చేయాలి అంటే నీకుండవలసినది విశ్వాసం! ఒకసారి ౩౩—35.....
33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి;
నీతికార్యములను జరిగించిరి;
వాగ్దానములను పొందిరి;
సింహముల నోళ్లను మూసిరి;
34. అగ్నిబలమును చల్లార్చిరి;
ఖడ్గధారను తప్పించుకొనిరి;
బలహీనులుగా ఉండి బలపరచబడిరి;
యుద్ధములో పరాక్రమశాలులైరి;
అన్యుల సేనలను పారదోలిరి.
35.
స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి
శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
అయితే అదే విశ్వాసము శ్రమలను కూడా తీసుకుని వచ్చింది గాని వారు సోలిపోలేదు
వాలిపోలేదు పారిపోలేదు! విశ్వాస బ్రష్టులు కాలేదు. 36—40 ..
36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను,
మరి బంధకములను ఖైదును అనుభవించిరి.
37. రాళ్లతో కొట్టబడిరి,
రంపములతో కోయబడిరి,
శోధింపబడిరి,
ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
38.
అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి.
అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
39.
వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనము లేకుండ
సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
40.
దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు
వాగ్దానఫలము అనుభవింపలేదు.
కాబట్టి దైవజనుడా నీవుకూడా అదే విశ్వాసము కలిగియుండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం
కలిగిఉంటావో అప్పుడు శ్రమలు శోధనలు వస్తాయి. అప్పుడు అంత్యము వరకు నమ్మకముగా
ధైర్యముగా ఉంటే దేవుడు నీకు జీవకిరీటం,
మహిమ కిరీటం అన్ని ఇస్తారు! భళానమ్మకమైన మంచి దాసుదా;
అనే బిరుదు కూడా ఇస్తారు.
చివరగా 12:1—2 లో ... చూడండి
1.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
2. మనముకూడ ప్రతిభారమును,
సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి,
విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన
యేసువైపు చూచుచు,
మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన
ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి,
దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
ఇక్కడ పౌలుగారు మనము కూడా ఆ విశ్వాసవీరులను అనుసరిద్దాము అనడం లేదు,
ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసుక్రీస్తు ప్రభులవారిని
అనుసరించాలి అంటున్నారు పౌలుగారు! ప్రియ దైవజనుడా! నీ విశ్వాస ఆత్మీయ
యాత్రలో నీకు తోడుగా కావలసినది యేసుక్రీస్తు ప్రభులవారు,
పరిశుద్ధాత్ముడు! ఆయనను తోడుగా ఉండమని అడుగు! ఆయన ఎన్ని కష్టనష్టాలు
వచ్చినా ఎన్ని ఇరుకుఇబ్బందులు వచ్చినా నీతోనే నీలోనే ఉంటారు.
కాబట్టి ఆయనమీద విశ్వాసముంచి ఆయనను నమ్ముకుని నీ యాత్రను కొనసాగించు!
జయము నీదే! భయము లేదు!
దేవుడు మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --28వ భాగం*
*చేయదగినవి-11*
2తిమోతి 2:22...
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము),
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును వెంటాడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు
మొదటిది నీతిని,
రెండవదిగా విశ్వాసమును;
మూడవదిగా ప్రేమను;
నాల్గవదిగా సమాధానమును వెంటాడాలి!
ఇక తర్వాత హత్తుకోవలసినది ప్రేమను! యేసయ్య భోదలలో ఎక్కువగా ప్రేమతత్వము
నిండిఉంటాయి! నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనే ధర్మశాస్త్ర
ఆజ్ఞను (లేవీ
19:6, మత్తయి 19:19; 22:39)
మరల యేసుక్రీస్తు ప్రభులవారు కొట్టివేయక అలా ఆ ఆజ్ఞను పాటిస్తే ఆజ్ఞలలో 6
ఆజ్ఞలను పాటించినట్లే కాబట్టి పొరుగువారిని ప్రేమించమని,
ఇంకా నీ శత్రువుని కూడా ప్రేమించి క్షమించమని చెప్పిన ప్రేమమూర్తి మన
యేసయ్య! చివరికి ఆ కల్వరి గిరిలో ఆ సిలువలో ఎన్నెన్నో హింసలు పెట్టిన
వారిపై జాలిపడి, క్షమించి,
దేవుణ్ణి కూడా తండ్రీ! వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని
క్షమించుము అని క్షమాభిక్ష పెట్టిన ప్రేమామయుడు,
కరుణామయుడు ఆయన! అదే ప్రేమతత్వాన్ని అలవరచుకొని పౌలుగారు మనకు
రాస్తున్నారు ఇక్కడ ప్రేమను వెంటాడు! అనగా ఈలోక ప్రేమను వెంటాడు అనడం
లేదు! ఈ లోక ప్రేమలో lust అనగా కామాభిలాష,
కామకోరికలు ఉంటాయి! గాని నిజమైన ప్రేమలో క్షమాపణ,
ఆదరణ, సమాధానం,
అనురాగం అన్నీ ఉంటాయి! అలాంటి ప్రేమను ప్రతీ దైవజనుడు పొందుకుని
హత్తుకోవాలి అంటున్నారు పౌలుగారు!
కొలస్సీయులకు 3: 14
వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
ప్రియులారా! ఈ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం
పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ పోతే –
ఏమీ అర్ధం కాదు మనకు. దానిని జాగ్రత్తగా ప్రార్ధనపూర్వకముగా చదివితే అర్ధం
అవుతాయి మనకు పౌలుగారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు
మనకోసం వ్రాయించారో అర్ధం అవుతుంది. ఈ వచనంలో అంటున్నారు పౌలుగారు—పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ ఆయన వీటన్నికన్నా
ప్రేమను ధరించుకొనుడి అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ
అంటున్నారు. దీని అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటే—ప్రేమకు—పరిపూర్ణతకు సంభందం ఉంది.
పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే –
పరిచర్య చేయాలి అది fivefold ministry
గాని, tenfold ministry
అయినా సరే! కాబట్టి
ఈ పరిచర్య చేసే దైవజనులు సంపూర్ణులు పరిపూర్ణులు కావాలి అంటే—ప్రేమను ధరించుకోవాలి!!! ఒక వ్యక్తికి ఎన్ని ఫలాలు,
శక్తులు,
టాలెంట్లు ఉన్నా ప్రేమలేకపోతే పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు అంటున్నారు 1 కొరింథీ 13:1-3 లో
1.
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,
ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను,
ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను,
కాల్చబడుటకు(అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా
శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
. .. *కాబట్టి ప్రేమలేని విశ్వాసి,
ప్రేమలేని సేవకుడు,
ప్రేమలేని ప్రసంగీకుడు –వేస్ట్ ఫెల్లో!*
ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు! అందుకే ఆయన మనలను రక్షించడానికి మానవరూపం
దాల్చి, పరమును విడచి,
భువికి వచ్చారు. ఫిలిప్పీ 2:5,6,7,8
5.
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి,
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి,
దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు,
ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై,
తన్నుతాను తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో
కదా!
ఇక ప్రేమకోసం బైబిల్ ఎక్కువగా రాసినవారు మొదటగా పౌలుగారు,
రెండవదిగా యోహానుగారు! ప్రేమకోసం రాయడానికి కారణం దైవజనులు ఇంకా
విశ్వాసుల మధ్య ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను
నెలకొల్పగలదు!
ప్రేమలేకపోతే మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన ఆశలు,
తగాదాలు, కొట్లాటలు,
చీలికలు ఉంటాయి. అందుకే సామెతలు 10:12
లో ప్రేమ అనేక దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది ,
ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది అంటున్నారు.
దేవుడు మనపట్ల చూపేది ఆగాపే ప్రేమ! అది అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన
యిర్మియా 31:3
లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక
నీ ఎడల కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!
అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి అనేది దేవుని ఆశ! అయితే ఈ ప్రేమ
చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలా?
అక్రమము విస్తరించినందువలన అనేకుల ప్రేమ చల్లారును! మత్తయి 24:12;
యోహాను 17:26
జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు యేసుప్రభులవారియందు
ఏ విధమైన ప్రేమను ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు ఉండేలా తండ్రిని
వేడుకున్నారు.
పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:
రోమా 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ
ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
. . .
దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా?
పరిశుద్ధాత్మ ద్వారా! కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు!
మరి ఈ ప్రేమ మనలో ఎలా ఉండాలి?
*** నిష్కపటమైనదిగా ఉండాలి.
రోమా 12:9;
*** చెడును అసహ్యించుకొనాలి.
రోమా 12:9;
*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;
*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;
*** క్షేమాభివృద్ధి కలుగజేసేది.
1 కొరింథీ 8:1;
ఇంకా రోమా 13:8,9,10
8.
ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.
పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు,
నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు,
ఆశింపవద్దు, అనునవియు,
మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను
వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
10.
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును
నెరవేర్చుటయే.
* ప్రేమ దీర్ఘకాలము సహించును,
* దయ చూపించును.
* ప్రేమ మత్సరపడదు;
* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;
* అది ఉప్పొంగదు;
* అమర్యాదగా నడువదు;
* స్వప్రయో జనమును విచారించుకొనదు;
* త్వరగా కోపపడదు;
* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
* దుర్నీతివిషయమై సంతోషపడక
* సత్యమునందు సంతోషించును.
* అన్ని టికి తాళుకొనును,
* అన్నిటిని నమ్మును;
* అన్నిటిని నిరీక్షించును;
* అన్నిటిని ఓర్చును.
* ప్రేమ శాశ్వతకాలముండును.
1కొరింది 13:4-8,13
అందుకే 1 కొరింథీ 14:1 లో
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి(మూలభాషలో-ప్రేమను వెంటాడుడి) . ఆత్మ
సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.
. .
గలతీ 5:6
ప్రకారం విశ్వాస కార్యసాధకం కావాలి అంటే ప్రేమ తప్పకుండా కావాలి!
గలతీ 5:22
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము,
ఆశానిగ్రహము.
ఫిలిప్పీ 1:9
మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను,
సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై,
అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,
అందుకే హెబ్రీ 10:25 లో
ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు,
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు
పురికొల్పవలెనని(మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము
అంటున్నారు.
పేతురుగారు ప్రేమ కోసం ఏమ్మన్నారు ఈ వచనాలలో ఉన్నాయి
1పేతురు 1: 21
మీరు క్షయ బీజమునుండి కాక,
శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు
గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,
. . ., ఇంకా రిఫరెన్సులు 3:8, 4:8;
యోహాను గారు చెప్పినది చూద్దాం.
1 యోహాను 2:5
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా
పరిపూర్ణమాయెను;
మరిన్ని రిఫరెన్సులు
3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను 1:6
తోటి దైవజనుడిని తోటి సేవకుడిని ప్రేమించలేక పోతున్నాము. ఇక మనలో ప్రేమ ఎలా
ఉంటుంది?
అలా ప్రేమించలేక పోతే నీవు నరహంతకుడవు అని యోహానుగారు చెబుతున్నారు. కనబడే
సహోదరుడు,
కనబడే తోటి సేవకున్ని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు
అని అడుగుతున్నారు యోహాను గారు!
కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో
ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా,
చేతలలో కూడా ఉందా?
ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!
అట్టి ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!
ఆమెన్!
*దైవజనుడా..... --29వ భాగం*
*చేయదగినవి-12*
2తిమోతి 2:22...
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము(విడిచి పారిపొమ్ము),
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును
ప్రేమను సమాధానమును వెంటాడుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు
మొదటిది నీతిని,
రెండవదిగా విశ్వాసమును;
మూడవదిగా ప్రేమను;
నాల్గవదిగా సమాధానమును వెంటాడాలి!
ఇక తర్వాత హత్తుకోవలసినది సమాధానమును! దైవజనుడికి కావలసింది అందరితోను
సమాధానము! సఖ్యమైతే సమస్త జనులతోను సమాధానముగా ఉండమని చెబుతున్నారు
పౌలుగారు!
కొలస్సీ
3:15
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి;
మరియు కృతజ్ఞులై యుండుడి.
ఈ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి
అంటున్నారు పౌలుగారు!
1). ఇది కూడా ఆత్మఫలములో ఒక భాగము. గలతీ 5:22;
2)
ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటున్నారు.
సమాధానమునకు మరో నానార్ధం శాంతి! శాంతి ఉంటేనే సమాధానం ఉంటుంది. అయితే ఇది
ఎవరిచ్చే సమాధానం?
క్రీస్తు అనుగ్రహించే సమాధానం! అందుకే యేసుప్రభులవారు తను పరమునకు
వెల్లకమునుపు అంటున్నారు.
యోహాను
14: 27
శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను;
నా శాంతినే (లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు;
మీ హృదయమును కలవరపడనియ్యకుడి,
వెరవనియ్యకుడి.
కాబట్టి ఆ శాంతిని మనం పొందుకుంటే, మన హృదయాలలో శాంతి ఉంటుంది,
అప్పుడు మనుష్యుల మధ్య సమాధానం ఉంటుంది.
3)
ఇక్కడ పౌలుగారు సమాధానం కలిగియుండుడి అనడం లేదు—సమాధానం ఏలుచుండనియ్యుడి అంటున్నారు. ఈ క్రీస్తు అనుగ్రహించు సమాధానం
మనమీద అధికారం చేయాలి, ఏలాలి. అప్పుడే ఆయన శాంతి,
సమాధానం సంపూర్తిగా పొందుకోవచ్చు!
నేటిదినాల్లో ఈ శాంతి-సమాధానం లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి!
భార్యాభర్తలమధ్య సమాధానం లేదు! తల్లిదండ్రులు- పిల్లలమధ్య సమాధానం లేదు!
పిల్లల మధ్య సమాధానం లేదు! సంఘంలో సమాధానం లేదు! సంఘకాపరి—సంఘపెద్దల మధ్య సమాధానం లేదు! సంఘపెద్దలు—సంఘసభ్యులమధ్య సమాధానం లేదు! సంఘకాపరులు/ సేవకుల మధ్య సమాధానం లేదు!
వీరిమధ్య సమాధానమును తీసివేసి, అశాంతిని కలిగించి,
ఈర్ష్య—ద్వేషాలు రగిలించి ,
వీరు కొట్టుకుంటుంటే,
తగాదాలు పడుతుంటే సాతాను గాడు తెగ సంభరపడుతున్నాడు. గెంతులేస్తున్నాడు!
పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు!!! ప్రియ సంఘమా! ఒకసారి ఆలోచించు! ప్రియ
దైవజనుడా! ఆలోచించు! పరిశుద్దాత్ముని సంతోషపరుస్తావా? దుఃఖపరుస్తావా? ఆలోచించుకో!
ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ
ఆశీర్వాదం ఉంటుంది కీర్తన 133 ప్రకారము
1.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
2.
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచువరకు
దిగజారిన పరిమళ తైలమువలె నుండును
3.
సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును
శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.
కాబట్టి మన జీవితాలలో ఆశీర్వాదం లేదు అంటే మనలో సమాధానం లేదన్నమాట! ఐక్యత
లేదన్నమాట!
ఈ ఐక్యత—సమాధానం లేనందువలన మొట్టమొదటి కుటుంబంలో హత్య జరిగింది! కయీను—హేబెలు మధ్య సమాధానం లేక,
కయీను –
హేబెలును చంపివేశాడు. శాపగ్రస్తుడయ్యాడు! యాకోబుగారి కుమారుల మధ్య సమాధానం
లేక తమ్ముడిని చంపబోయారు. చివరికి బానిసగా అన్యుడికి అమ్మివేశారు
యోసేపును!
అదే ఐక్యతగా ఉన్నప్పుడు ఏం చేశారు?
అదే యాకోబు కుమారులు శత్రువుల మీద పగతీర్చుకున్నారు. దానియేలు, షడ్రక్, మేషాక్,
అబెద్నేగో సమాధానంగా,
ఐక్యంగా ప్రార్ధన చేశారు. రాజు మరచిపోయిన కలను చెప్పగలిగారు. తమ
ప్రాణములు కాపాడుకోగలిగారు. అసాధ్యాలను—సుసాధ్యం చేశారు. సింహపు నోళ్లను మూశారు. అగ్నిగుండములో ఏమీ ఇబ్బందులు
పడకుండా తిరిగి, ప్రాణములతో బయటికి వచ్చారు. ఆదిమ సంఘం,
ఆది అపోస్తలులు కలసిమెలసి ఉండి,
సమైక్యతతో ఉన్నందువలన ఎన్నో అధ్బుతకార్యాలు చేసారు. భూలోకమును
తల్లక్రిందులు చేయువారు అనే బిరుదు పొందుకున్నారు! అదీ సమాధానమునకు ఉన్న
శక్తి!
ఈ సమాధానమును బంధముచేత పోల్చారు పౌలుగారు. ఎఫెసీయులకు
4: 1
కాబట్టి,
మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ
కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
ఈ సమాధానమను బంధము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాంతి—సమాధానం, అద్భుతాలు ఉంటాయి. లేకపోతే తగవులు,
కొట్లాటలు, కోర్టులు ఉంటాయి!
అందుకే యేసుప్రబులవారు తన శిష్యులను సేవకు పంపిస్తూ,
మీరు వెళ్ళిన గృహానికి సమాధానము కలుగును గాక అని దీవించమంటున్నారు! మత్తయి 10:12,13;
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి,
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.
అలాచేస్తే
ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ
హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
ఇంకా
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము
అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
అట్టి సమాధానము మనలో లేకపోతే ఇప్పుడే సమాధాన పడుదాం! కారణం యోహాను గారు
రాస్తున్నారు తన సహోదరున్ని ప్రేమించని వాడు, తన సోదరునితో సమాధానముగా ఉండని వాడు వేషధారి,
నరహంతకుడు, 1 యోహాను 4,5
అధ్యాయాలు. . .
కాబట్టి అందరితో సమాధానముగా ఉందాం. పౌలుగారు అంటున్నారు సఖ్యమైతే సమస్తమైన
వారితో సమాధానముగా ఉండుడి. రోమా 12:18;
అట్టి సమాధానము, శాంతి మనందరం పొందుకుందుము గాక!
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాలను ఏలుచుండును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దైవజనుడా..... --30వ భాగం*
*చేయదగినవి-13*
2తిమోతి 2:26...
ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు,
జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను,
కీడును సహించువాడుగాను ఉండవలెను.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనం నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు
మొదటిది అట్టివారిని సాత్వికంతో శిక్షించాలి;
రెండవది జగడమాడక అందరియెడల సాదువుగాను,
మూడవదిగా బోధింప సమర్ధుడుగాను
, నాల్గవదిగా కీడు సహించువాడుగాను ఉండవలెను!
మొదటగా *అట్టివారిని సాత్వికముతో శిక్షించాలి* అంటున్నారు పౌలుగారు!
ఎట్టివారిని? 24-25
వచనాలలో ఉన్నారు కొందరు. సత్యవిషయమైన అనుభవజ్ఞానం లేనివారు
కొందరున్నారు, వారు ఎదురాడుతుంటారు,
ఇలా సత్యాన్ని ఎదిరించేవారిని సాత్వికంతో శిక్షిస్తూ సరిదిద్దాలి అంటున్నారు
పౌలుగారు! ఎదిరించే వారిని అలా వదిలెయ్యకుండా సరిచెయ్యమంటున్నారు.
నేటిరోజులలో చాలామంది సోషల్ మీడియాలో సత్యవాక్యాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా
ఈ సత్యానికి వ్యతిరేఖంగా ఎన్నో కూతలు కూస్తున్నారు. దానికి మనవారు సమాధానం
చెబుతున్నారు. అందుకు దేవునికి స్తోత్రం! అయితే ఈ సమాధానం చెప్పేవారు
గ్రహించాలి ఇలాంటివారికి సాత్వికముగా వాక్యపరంగా సమాధానం చెప్పమన్నారు
పౌలుగారు అంతేగాని వారు వాడిన లాంటి చెత్తబాషను మనం వాడకూడదు! అంతేకాకుండా
కొన్నిసార్లు పనికిమాలిన వారికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వారిని హైలైట్
చేస్తున్నారు. కొన్నింటిని పట్టించుకోవలసిన అవసరం లేదు! ఇప్పుడు ఈ వచనం
ద్వారా పౌలుగారు సాత్వికముతో శిక్షించుము అంటున్నారు ఎందుకంటే మాటకు
మాట,
దెబ్బకు దెబ్బ అన్నట్లు నీవు సమాధానం చెబితే మన క్రైస్తవ సహోదరులు
సంతోషిస్తారు గాని అలా ఎదురాడేవారు ఎప్పటికీ నిజం తెలుసుకోరు! క్రీస్తుకు
రోజురోజుకి దూరమైపోతారు!అయితే మీ సాత్వికమైన సమాధానం కొన్నిరోజులకు
ఇలాంటివారిని కూడా ప్రభువునొద్దకు నడుపగలదు! సాత్వికులు ధన్యులు వారు
భూలోకమును స్వతత్రించుకొందురు. మత్తయి 5:5;
మత్తయి 11:29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద
నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
....
కాబట్టి దైవజనుడు ఇలాంటి వారికి సాత్వికముతో జవాబు చెబుతూ ఉండాలి. గమనించాలి
మనుష్యులను మార్చేది,
పశ్చాత్తాపపడేలా చేసేది దేవుడే గాని మన వాదనలు సమాధానాలు కానేకాదు! కేవలం
పశ్చాత్తాపం వలనే మనిషి దేవుని సత్యాన్ని పూర్ణంగా గ్రహించగలడు!
ఇక రెండవది: దైవజనుడు ఎవరితోనూ జగడమాడకూడదు అలా జగడమాడకుండా *అందరియెడల
సాధువుగా ఉండాలి*. ఇక్కడ సాధువుగా ఉండాలి అంటే సాదువుల్లాగా కాషాయవస్త్రాలు
ధరించి ఊరూరూ తిరగమని కాదు! సాధువు అంటే ఎవరు తిట్టినా సహించేవాడు,
కొట్టినా సహించి తిరిగి కొట్టనివాడు తిట్టని వాడు!ఇంకా చెప్పాలంటే సాదు
జంతువులైన మేక, గొర్రె, ఆవు,
జింక లాంటి స్వభావం గలవారు! తలవంచుకుని పోయేవారు సాధువులు! దైవజనుడు కూడా
అలాంటి స్వభావమే కలిగియుండాలి. దానికి ఉదాహరణ మోషేగారు! ఎంతోమంది ఎన్నో
విధాలుగా ఆయనను సూటిపోటు మాటలన్నారు గాని ఎప్పుడు ఎవరిని దూషించలేదు! అందుకే
దేవుడే మోషే భూమిమీద నున్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని సర్టిఫికేట్
ఇచ్చారు! సంఖ్యా 12:3; అలాంటి సాత్వికము,
సాదు జీవితం ప్రతీ దైవజనునికి ఉండాలి! కారణం వారు సువార్త ప్రకటించేటప్పుడు
గాని, సంఘంలో పరిచర్య చేసేటప్పుడు గాని ఎదురాడేవారు,
ఎదురు తిరిగే వారు,
దూషించేవారు,
ఇంకా హింసించే వారు కూడా ఎదురవుతారు! అప్పుడు వారు దూషిస్తే తిరిగి
దైవసేవకుడు కూడా దూషిస్తే వారికి- దైవ సేవకునికి తేడా ఏముంటుంది? వారు వాడిన పరుషమైన పదజాలమే దైవసేవకుడు కూడా వాడితే,
వాళ్ళలాగ దైవసేవకుడు కూడా బూతులాడితే ఇక వారికి- దైవజనుడికి తేడా
ఏముంది?
మన మాటలలో చేతలలో ప్రవర్తనలో ప్రభువుని చూపించాలి గాని పాత మనిషి కనబడకూడదు!
అందుకే సాదువుగా ఉండాలి అంటున్నారు పౌలుగారు! ఇంకా కొంతమంది మనతో వాదిస్తూ
ఉంటారు. ఇతరులను సంపాదించటానికి ఇతర అన్యులుకూడా సత్యానికి లోబడకుండా వారి
ట్రాప్ లో పడకుండా వారిని రాబట్టటానికి వారితో తర్కించడం మంచిదే గాని అలాంటి
తర్కం అనవసరమైన జగడంగా మారకుండా జాగ్రత్తపడాలి! నేటిరోజులలో కూడా చాలామంది
అన్యులు-క్రైస్తవుల మధ్యనే కాకుండా క్రైస్తవ సహోదరుల మధ్య కూడా కొన్ని
విషయాలలో తర్కములు విబేధాలు వస్తుంటాయి. అప్పుడు వాదనలు పెట్టుకోకూడదు! అవి
మన ఆత్మీయజీవితానికి ఏ విధంగాను పనిచేయవు! వినువారిని చెరపడానికే పనికొస్తాయి
అని పౌలుగారు ఈ రెండు పత్రికలలోను చెబుతున్నారు. అసలు పోరాడవలసినది సాతాను
గాడితో గాని మనుష్యులతో కాదు.
ఎఫెసీయులకు 6: 12
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను,
అధికారులతోను,
ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
ప్రియ దైవజనుడా! అలాంటి సాధుత్వం నీకుందా?
ఇక మూడవది: *బోధింప సమర్ధుడుగా ఉండాలి.* దీనికోసం గతభాగాలలో విస్తారంగా
ధ్యానము చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పుకోవద్దు. 1తిమోతి ౩:2లో చెప్పినవిధంగా ఉండాలి
అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగినవాడునైయుండి,
చివరిగా *కీడును సహించగలవాడై ఉండాలి.* అనగా ఇతరులు నీకు కీడుచేసినా సహించి
ప్రతికీడు చేయకూడదు. లేవీ 19:18;
సత్యవాక్యానికి విరోధులు అనేకసార్లు బాధించేమాటలు,
అనకూడని మాటలు అంటూ వ్యక్తిగతమైన దాడులు కూడా చేస్తారు,.
మొన్న చేసినట్లు పేడనీళ్ళు కూడా జల్లుతారు. అనేకసార్లు ఉమ్మివేస్తారు.
ఇలాంటి పరిస్తితులలో దైవజనుడు అన్ని విషయాలను సహించాలి,
ప్రేమతో ఓపికతో ఓర్చుకోవాలి అన్నారు గాని వారిమీద కేసులు పెట్టి జైలులో
పెట్టించమని,
క్రిష్టియన్ ఫోరంలుగా ఏర్పడి ధర్నాలు చెయ్యమని కోర్టులకు వెళ్ళమని
బైబిల్ చెప్పనేలేదు! కీడుకు ప్రతికీడు ఎవరికీ చెయ్యవద్దు అని చెప్పారు
దేవుడు! లేవీ 19:19;
శోధనను సహించమని చెప్పారు గాని శోధనకు ఎదురు తిరుగు అనలేదు. నా
నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా
చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు వారి చెంప చెల్లమనిపించు అని చెప్పలేదు
యేసయ్య! ఎదురు తిరుగక,
ఓర్చుకో అన్నారు. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నారు దేవుడు!
దేవుని ప్రేమతత్వము,
క్షమాతత్వము అలవరచుకొని నడిస్తే నేడు ఇంతటి శోధనలు సువార్తకు ఆటంకాలు
ఉండేది కాదు! నేడు మనదేశంలో సువార్తకు ఇంత అడ్డంకులు,
ఇంత రాద్దాంతము కలుగుతుంది అంటే చాలామంది ఈ క్రీస్తు ప్రేమతత్వము అర్ధం
చేసుకోకుండా వారిని ప్రతి దూషిస్తూ,
కోర్టులకు వెళ్తూ ఎన్నెన్నో చేశారు కాబట్టి. *ఇంకా దేవుడు నన్ను
వెంబడించు వాడు ప్రతీరోజు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి
అన్నారు. లూకా 9:23; సిలువ అనేది శ్రమలు,
శోధనలకు గుర్తు అని అందరికీ తెలుసు! కాబట్టి ఈ కీడు, శ్రమలు,
శోధనలు ప్రతీరోజు భరిస్తూ సాగిపో అన్నారు దేవుడు! వీటిని భరించాల్సిందే
అంతే! అలాకాకుండా నీవు ఎదురుదాడి చేసావు అంటే, లేదా వారిమీద కేసులు పెట్టావు,
వారికి వ్యతిరేఖంగా క్రైస్తవ యూనియన్లు పెట్టి ధర్నాలు చేసావు అంటే నీవు
ఎత్తుకున్న సిలువను ప్రక్కన పెట్టి సాగిపోతున్నావు అన్నమాట!*
సిలువలేనిదే సాక్షం లేదు!
సాక్షం లేకపోతే క్రైస్తవుడు శీలం కోల్పోయినట్లే!
చచ్చినట్లే!
కాబట్టి ప్రియ దైవజనుడా! శ్రమలను సహించు!
కీడుకు ప్రతికీడు ఎవరికీ చేయవద్దు!
ప్రతీదినం ఆయన సిలువనెత్తుకుని సాగిపో!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --31వ భాగం*
*చేయదగినవి-14*
2తిమోతి 3:14—15 ...
14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు
కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు
గనుక,
15.
నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి
తెలిసికొని, *వాటియందు నిలుకడగా ఉండుము.*
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనాల నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనంలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు నీవు నేర్చుకున్న వాక్యమందు నిలకడగా ఉండమంటున్నారు. ఇక్కడ
14వ వచనంలో పౌలుగారి మాటలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. క్రీస్తుయేసునందుంచవలసిన
విశ్వాసము ద్వారా రక్షణార్ధమైన జ్ఞానము నీకు రావాలంటే పరిశుద్ధలేఖనములు
పటించాలి. అయితే నీవు ఇవి బాల్యం నుండి నీవు చేస్తున్నావు అంటున్నారు అనగా
పౌలుగారు చెబుతున్నారు నీకు పరిశుద్ధ లేఖనముల జ్ఞానం బాల్యం నుండి ఉంది
అంటున్నారు. మరింతగా నానుండి నేర్చుకున్నావు అంటున్నారు. మరి బాల్యములో
ఎవరు నేర్పించారు? 2తిమోతి 1:5
ప్రకారం అది నీ అవ్వయైన(అమ్మమ్మ) లోయిలోను,
నీ తల్లియైన యునీకే లోను వశించెను అంటున్నారు.
అదే విశ్వాసము నీలో కూడా నివశిస్తుంది అని నేను రూఢిగా నమ్ముచున్నాను
అంటున్నారు పౌలుగారు! ఆ తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత నానుండి
నేర్చుకున్నావు,
నేను చేయివేసి ప్రార్ధన చేసిన తర్వాత ఇంకా అనేక వరాలు ఫలాలు పొందుకున్నావు
అంటున్నారు పౌలుగారు! దీనినిబట్టి అర్ధమయ్య దేమిటంటే తిమోతిగారి అవ్వ, తిమోతిగారి తల్లి ఇద్దరు తిమోతిగారికి లేఖనములు,
వాక్యము చిన్నప్పటినుండి నేర్పించడం మొదలుపెట్టారు. చివరకు వీరిద్దరూ
తిమోతిగారిని లేఖనములయందు ప్రావీణ్యత కలిగిన వానిగా చేశారు. ఇంకా
విశ్వాసవీరుణ్ణి చేసారు. ప్రార్ధనాపరునిగా చేశారు. అందుకే సామెతల గ్రంధకర్త
రాస్తున్నారు: బాలుడు నడువ వలసిన మార్గము వానికి నేర్పుము! వాడు పెద్దవాడైన
తర్వాత దానినుండి తొలగిపోడు! సామెతలు 22:6..
ద్వితీ 6:6—7
6.
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
7. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి,
నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును
లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. ...;
పాతనిబంధన రోజుల్లోనే కాదు ఇప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకు
వాక్యాన్ని ప్రార్ధనను నేర్పించాలి. ప్రియమైన తల్లిదండ్రులారా! మీ పిల్లలు
ఎలా చదువుతున్నారో ప్రోగ్రెస్ రిపోర్ట్ జాగ్రత్తగాచూస్తారు కదా మరి దేవుని
సన్నిధిలో ఎలా ఉంటున్నారు, వారికి వాక్య జ్ఞానం ఎలా ఉంది?
ప్రార్ధనానుభావం ఎలావుంది?
అనేదాని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నారా?
మీ పిల్లలు సండేస్కూల్లో ఎలా ఉంటున్నారో,
ఎలా వాక్యం నేర్చుకుంటున్నారో,
ఎన్నిమార్కులు వస్తున్నాయో,
ఎన్ని కంటస్థ వాక్యాలు వచ్చో,
ఎలా వాక్యాన్ని ఉపయోగించి ప్రార్ధన చేస్తున్నారో ఎప్పుడైనా
గమనించారా?
ఇక మీ పిల్లలు ఆదివారం నాడు చర్చికి వస్తున్నారా లేక స్పెషల్ క్లాసులకు
వెళ్తున్నారా?
లేక స్పెషల్ క్లాసులు అనిచెప్పి సినిమాలకు షికార్లకు, బాయ్ఫ్రెండ్ తో,
గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారో పట్టించుకుంటున్నావా?
అలా పట్టించుకోకపోతే ఒకరోజు నీవు విచారిస్తూ దుఖించాల్సి వస్తుంది.
అందుకే రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లలు,
నీ పిల్లలకోసం ప్రార్ధనచేయమని చెబుతుంది బైబిల్! విలాపవాక్యములు 2: 19
నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు
సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను
ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు
ఇప్పుడు ఏడ్చి కన్నీటితో వారికొరకు ప్రార్ధనచెయ్యకపోతే ఒకరోజు వస్తుంది.
అప్పుడు వారుచేసిన పనివలన ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు జాగ్రత్త! అందుకే
ఇప్పటినుండే వారికోసం కన్నీటితో ప్రార్ధించి,
వారిని ప్రార్ధనలోను వాక్యములోను పెంచమని మనవిచేస్తున్నాను!
ఈ అమ్మ,
అమ్మమ్మ అలాగే పెంచారు తిమోతిగారిని! ఇక తర్వాత పౌలుగారిచేతిలో
పెట్టేశారు. అప్పుడు పౌలుగారు మొదటగా పరిచర్య ధర్మాన్ని నేర్పించి,
ఆ తర్వాత వాక్యమును సరిగా బోధించి వాక్యమర్మములు నేర్పించారు.
పరిశుద్దాత్ముడు నేర్పించిన ఏ సత్యాన్ని కూడా తిమోతిగారికి నేర్పించక
మానలేదు పౌలుగారు! పౌలుగారికి ఒక సొంత కొడుకులా తిమోతి గారు
సేవచేస్తే, పరిచర్య చేస్తే,
పౌలుగారు సొంత కొడుకుని ఆదరించినట్లు ఆదరించి,
సొంత కొడుక్కి ఆస్తిని ఇచ్చినట్లు ఆయన పొందుకున్న ఆత్మీయ సత్యాల్ని, మర్మాల్ని,
జాగ్రత్తగా నేర్పించారు. మరి పౌలుగారు సంపాదించిన ఆస్తి అదే! దేవుని నుండి
అడిగి ఎలా పొందుకోవాలి? ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి?
ఎలా పరిశుద్దాత్ముని అడుగుజాడలలో నడవాలి?
ఎలా దేవుణ్ణి మెప్పించాలి?
ఎలా శ్రమ పడాలి?
ఎలా శ్రమలను సహించాలి?
ఇవే నేర్పించారు!
మరి ఇప్పుడు తిమోతి నీవు నేర్చుకున్న వాక్యమందు నిలకడగా ఉండు! అబద్దబోధలతట్టు
తిరుగకు! తిరిగేవారిని తిరగనీయవద్దు! అబద్దబోధకులకు బుద్ధిచెప్పు అంటూ ఈ రెండు
ఉత్తరములు రాస్తున్నారు పౌలుగారు తిమోతిగారికి! కాబట్టి దైవజనుడా! మొదటగా
నీవుకూడా వాక్యమును సరిగా నేర్చుకో! అలా నేర్చుకున్న వాక్యమందు ఎన్ని
కష్టనష్టాలు వచ్చినా నిలకడగా ఉండు! ఏ బాధ సమస్య వచ్చినా దానికి పరిష్కారం,
జవాబు వాక్యమందు దొరుకుతుంది నీకు! వాక్యముతోనే సమస్యను తీర్చుకో!
యేసుక్రీస్తు ప్రభులవారు దేవాదిదేవుడే గాని సాతాను గాడు శోధించినప్పుడు
యేసయ్య కూడా తనసొంత మాటలను ఎక్కడా ఉపయోగించలేదు! వాక్యము,
లేఖనములు ఎత్తి సమాధానం చెప్పారు. నీవుకూడా అదే వాక్యాన్ని ఉపయోగించి
పోరాడాలి, సమస్యలను ఎదుర్కోవాలి గాని నీ సొంత ఆలోచనలు,
తెలివితో చేశావా ప్రియ దైవజనుడా! బొక్కబోర్లా పడతావు జాగ్రత్త! యోహానుగారు
లేఖ రాస్తూ : జీవ వాక్యమును గూర్చి ఆదినుండి ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో,
మా కన్నులు ఏమి చూసాయో,
మా చేతులు ఏమి తాకి అనుభవించాయో వాటినే రాస్తున్నాము,
చెబుతున్నాము అంటున్నారు. 1యోహాను 1: 1
జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో,
మేమేది వింటిమో,
కన్నులార ఏది చూచితిమో,
ఏది నిదానించి కనుగొంటిమో,
మా చేతులు దేనిని తాకి చూచెనో,
అది మీకు తెలియజేయుచున్నాము.
అలాగే దైవజనుడు కూడా వాక్యం ఎలా నేర్చుకున్నాడో, ఏమి విన్నాడో,
పరిశుద్దాత్ముడు ఏమి బోధించాడో,
నేర్పించాడో అదే బోధించాలి తప్ప వాక్యమును వదలి పిట్టకధలు,
సైన్సు చెబుతూ కాలయాపన చేయకూడదు! ప్రకటన ౩:౩ లో పరిశుద్దాత్ముడు
చెబుతున్నాడు: నీవేలాగు ఉపదేశము పొందితివో,
ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు ... ఉండాలి!
ప్రియ దైవజనుడా!వాక్యమందు నిలకడగా ఉంటున్నావా?
వాక్యమును వదలి నీ సొంత డైరెక్షన్లో నడుస్తున్నావా?
వాక్యమే దేవుడు! యోహాను 1:1; వాక్యమును వదిలితే దేవుణ్ణి వదలినట్లే!
కాబట్టి వాక్యమందు నిలకడగా ఉంటూ నీ తుదిశ్వాస వరకు ఆయననే వెంబడిస్తూ సాగమని
ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --32వ భాగం*
*చేయదగినవి-15*
2తిమోతి 3:16—17
16.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
ఉపదేశించుటకును,
17. ఖండించుటకును,
తప్పు దిద్దుటకును,
నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.;
4:1—2
1.
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు
ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు,
నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2. వాక్యమును ప్రకటించుము;
సమయమందును అసమయమందును ప్రయాసపడుము;
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము
బుద్ధిచెప్పుము. ...
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనాల నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనాలలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు. మొదటగా దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి—దేనితో దైవావేశమువలన కలిగిన లేఖనాలతో;
రెండవదిగా ఆ లేఖనాలు ఉపయోగించి ఉపదేశించాలి;
మూడు: ఖండించాలి;
నాలుగు: తప్పు దిద్దాలి;
ఐదు : నీతియందు శిక్షణ చేయాలి;
ఆరు: వాక్యమును ప్రకటించాలి;
ఏడు: సమయమందు అసమయమందు ప్రయాసపడాలి;
ఎనిమిది: ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి;
మొదటిది: దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి దైవలేఖనాలతో! దీనికోసం గతబాగాలలో
విస్తారంగా ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఎందుకు
సన్నద్ధుడై ఉండాలి అంటే నీమాటల లోను,
నా మాటల్లోనూ శక్తి ఏమాత్రము లేదు! అయితే దేవుని వాక్యం హృదయాలను
మండించేది, సరిచేసేది,
బండను కూడా బద్దలుచేసేది,
రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది;
మనిషిని బ్రతికించేది,
ఆదరించేది;
చివరకు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి అటువంటి వాక్యముతో,
లేఖనాలతో దైవజనుడు సన్నద్దుడై ఉండాలి. ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం
ఏమిటంటే ఈ లేఖనాలు మనుష్యుల ఆలోచనల వలన కలగలేదు గాని దైవావేశము వలన
కలిగాయి. 2పేతురు 1:20—21
20.
ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట
గ్రహించుకొనవలెను.
21.
ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు
పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి...;
ఇక్కడ ఈవచనంలో దైవావేశము అని వ్రాయబడింది. అయితే దీనికి గ్రీకు అర్ధం
చూసుకుంటే దేవుడు తన ఊపిరి పోయడం వలన కలిగాయి లేక తన ఊపిరి ఊదటం వలన కలిగాయి.
మరో అర్ధం దేవునిఆత్మ మనిషి ఆత్మకు ఇచ్చిన ప్రేరేపణ వలన కలిగాయి అనే అర్ధాలు
ఉన్నాయి. కీర్తన ౩౩:6
యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము
కలిగెను....
యోహాను 20:22...
ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి...
హెబ్రీ 4:12
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను
వాడిగా ఉండి,
ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు,
హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది....
కాబట్టి బైబిల్ దేవుని నోట నుండి, దేవుని ఊపిరి నుండి వచ్చింది. మత్తయి 4:4
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు
ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను...
కాబట్టి ఆయన తన సత్యాన్ని,
ఆలోచనలను,
మాటలను తనసేవకులైన ప్రవక్తల హృదయాలలో ఊదారు. వారు ఆత్మావేశులై రాశారు.
ఎందుకంటే మనుషులు దేవుని లేఖనాలను ఆరాదించాలి అనికాదు గాని మనుష్యులు
దేవునిగూర్చిన సత్యాన్ని తెలుసుకుని అవి దైవావేశం వలన కలిగాయి అని
గ్రహించి, దేవునికోసం సంపూర్తిగా తెల్సుకుంటారు అని!
కాబట్టి ఇటువంటి శక్తిగల లేఖనాలను తెలుసుకొని వీటితో సన్నద్ధుడై ఉండాలి
అనగా అంబులపొదిని వాక్యముతో నింపుకుని సాతానుగాడితో యుద్ధం చెయ్యాలి!
ఎప్పుడైతే అలా సన్నద్దుడౌతాడో అప్పుడు ఈ రెండవ స్తెప్పులోకి మూడవ
స్తెప్పులోకి వెళ్తాడు.
రెండు: ఈ లేఖనాలు ఉపయోగించి ఉపదేశించాలి! గమినించాలి బైబిల్ గురించిన జ్ఞానం
లేకుండా ఏ సేవకుడైన ఏ మంచిపనికైనా పూర్తిగాసిద్దపడలేడు . ఇతర విషయాలు ఎన్ని
నేర్చుకున్నా గాని జీవితంలో బైబిల్ ని చదివి అర్ధం చేసుకోలేక పోతే తనపనిలో
రాణించలేడు. అందుకే ఈ బైబిలో లేఖనాలతో నింపబడటానికి ఎక్కువ ఆసక్తి చూపాలి!
అప్పుడు వాక్యానుసారంగా ఉపదేశించాలి! ఇక్కడ ఉపదేశించుట అనగా మంచిదానిని
వ్యక్తులను సన్మార్గంలో నడిపించేలా బోధలుచెయ్యడం అని అర్ధమిస్తుంది. ఉపదేశం
అనేది సదుద్దేశంతో కూడినది, మంచిది,
లోక కల్యాణం కోసం పాటుపడేదై యుండాలి. అదీ ఉపదేశం! అందుకే పౌలుగారు
చెబుతున్నారు: 1తిమోతికి 1: 5
ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు,
మంచి మనస్సాక్షినుండియు,
నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.
మూడవది: ఇలా లేఖనములతో సన్నద్ధుడై ఖండించాలి. ఎందుకు ఖండించాలి?
ఎప్పుడు ఖండించాలి అంటే తన సంఘంలో ఎవరైనా తప్పుచేస్తున్నప్పుడు వారు
ఎవరైనా,
ఎంతటివారైనా తప్పును ఖండించాలి. సరిచెయ్యాలి. అదే సరిదిద్దడం! లేదా
తప్పు దిద్దడం (నాల్గవది). అలా చేసిన వారు మనకు ముగ్గురు
కనిపిస్తారు.
మొదటగా దావీదు గారు! గొప్ప దైవజనుడు, ప్రవక్త,
చక్రవర్తి! అయినా చూడరాని దృశ్యం చూసి,
చేయరాని పని చేస్తే చివరకు హత్యకూడా చేయిస్తే,
నాతాను ప్రవక్త రాజుగారు కదా ఎలా చెప్పాలి అని నీళ్ళు నమలలేదు. ఈవిధంగా
జరిగింది ఆ విధంగా జరిగింది అని ఒక స్టోరీ చెప్పి –
దావీదుగారు చెప్పిన తీర్పు ప్రకారమే ఆ నేరస్తుడు నీవే అని ధైర్యంగా
చెప్పారు ఆ ప్రవక్త! ఇదీ దైవజనుడి లక్షణం! చక్రవర్తి అయితేనేం? దేవుని దృష్టిలో మనుష్యుల దృష్టిలో పాపిగాను,
నేరస్తుడుగాను అయినప్పుడు వెంటనే ఖండించారు ఈ ప్రవక్త! 2సమూయేలు 11,12
అధ్యాయాలు.
ఇక రెండవ వ్యక్తి: ఏలీయా ప్రవక్త! తనకూర తోట కోసం- నాబోతు గారు తన ద్రాక్షతోట
ఇవ్వలేదని భార్య- ప్రేరేపితుడై నాబోతుని తప్పుడు సాక్ష్యాలతో- తప్పుడుగాల్లతో
చంపించినందుకు ప్రవక్త రాజుగదా అని భయపడలేదు! దేవుడు చెప్పమన్నది ధైర్యంగా:
ఒరేయ్- నాబోతు రక్తాన్ని ఎక్కడ కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు
నాకుతాయి. అంతేకాకుండా నీ పెళ్ళాం రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని
చెప్పారు. చావుకు భయపడలేదు ఈ ప్రవక్త! 1రాజులు 21;
తర్వాత వ్యక్తి: అదే ఏలియా గారి ఆత్మకలిగిన వ్యక్తి భాప్తిస్మమిచ్చు యోహాను
గారు. రాజైన హేరోదు తన తమ్ముడు భార్య తో మొదటగా అక్రమ సంభంధం పెట్టుకుని,
కొన్నిరోజుల తర్వాత ఉంచుకుంటే ఈ దైవజనుడు భయపడకుండా నీవు పవిత్రమైన దేశానికి
రాజువైయుండి ఇలాంటి తప్పుడుపని చేస్తావా పనికిమాలినవాడా అని అందరిముందు
నిర్భయంగా ఖండించారు ఆయన! ఆయనకు తెలుసు దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది
అని! గాని భయపడలేదు! చివరకు వారిచేతిలో చనిపోయారు ఆయన గాని భయపడలేదు!
మొదట వ్యక్తి ప్రకటిస్తే దావీదుగారు భక్తుడు గాబట్టి తనతప్పును తెలుసుకుని
మారుమనస్సు నొందారు. నాతాను ప్రవక్తను ఏమీ అనలేదు. రెండవ వ్యక్తిని చంపడానికి
చూసాడు రాజు! గాని దేవుడు కాచికాపాడారు. మూడవ వ్యక్తిని చంపించాడు ఆ రాజు! ఈ
ముగ్గురు ఆ ముగ్గురు రాజులకు భయపడలేదు! వారి స్టేటస్ చూసి ప్రత్యేకమైన గౌరవం
ఇవ్వలేదు! తప్పుచేశారు కాబట్టి తప్పును తప్పుగా చెప్పారు. నేటిరోజులలో అనేకమంది
దైవసేవకులు ఈ పై వచనాలలో ఉన్న అధికారాన్ని ఉపయోగించలేక పోతున్నారు. వారు
సంఘపెద్దలని, అధికారులని,
పెద్దపెద్ద కానుకలు ఇస్తున్నారని,
తప్పుచేసినప్పుడు ఖండించడం లేదు!
దైవజనుడా! యేహెజ్కేలు
గ్రంధం ప్రకారం దైవజనుడు లోకానికి సంఘానికి కావలివాడు. ముందు రాబోయే
ప్రమాదాలను పసిగట్టి చెప్పడమే కాకుండా తప్పుచేస్తున్నప్పుడు సరిదిద్దే
అధికారం కూడా ఇచ్చారు దేవుడు! నీవు తప్పుచేస్తున్నావు అని వార్నింగ్
ఇమ్మన్నారు దేవుడు! వాడు వినినా వినకపోయినా చెప్పడం నీ భాద్యత అనిచెప్పారు
దేవుడు! యెహెజ్కేలు 33:7,8,9
7. నరపుత్రుడా,
నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా
నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.
8. దుర్మార్గుడా,
నీవు నిశ్చయముగా మర ణము నొందుదువు అని దుర్మార్గునికి నేను
సెలవియ్యగా,
అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా
మాట తెలియజేయని యెడల ఆ దుర్మా ర్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని
అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.
9.
అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక
చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము
నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.
ఈరోజు అదే భాద్యతను పౌలుగారు తిమోతిగారికి గుర్తుకుచేస్తున్నారు! ఏ బాధ్యతను
ఇప్పుడు దైవజనులందరికీ వాక్యం ద్వారా గుర్తుకు చేస్తున్నాను.
ప్రియ దైవజనుడా! నీవు ఎవరికి భయపడుతున్నావు?
కేవలం ప్రాణం తీసేవారికా?
లేక ప్రాణమును ఆత్మను నరకంలో పడేసే వానికా?
దేనికోసం భయపడుతున్నావు?
కానుకలు ఇవ్వరనా?
ఆ సంఘం నుండి తీసేస్తారు అనా?
లేక ట్రాన్స్ఫర్ అయిపోతానని భయమా?
ప్రియదైవజనుడా! నిన్ను సేవకు పిలిచింది సంఘ పెద్దలు కాదు. కానుకలు ఇచ్చేవారు
కాదు! నీకోసం ప్రాణం పెట్టింది వారెవరు కాదు! యేసుక్రీస్తు ప్రభులవారు! ఆయనకు
భయపడు! ఆయన చెప్పినట్లు చేయు! ఖండిచు. గద్దించు! సరిదిద్దు!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --33వ భాగం*
*చేయదగినవి-16*
2తిమోతి 3:16—17; 4:1—2
16.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
ఉపదేశించుటకును,
17. ఖండించుటకును,
తప్పు దిద్దుటకును,
నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.;
4:1—2
1.
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు
ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు,
నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2. వాక్యమును ప్రకటించుము;
సమయమందును అసమయమందును ప్రయాసపడుము;
సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము
బుద్ధిచెప్పుము. ......
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు పై వచనాల నుండి ధ్యానం చేద్దాం!
ప్రియులారా! పై వచనాలలో దైవజనుడు కొన్నింటిని అనుసరించాలి లేదా హత్తుకోవాలి
అంటున్నారు. మొదటగా దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి—దేనితో దైవావేశమువలన కలిగిన లేఖనాలతో;
రెండవదిగా ఆ లేఖనాలు ఉపయోగించి ఉపదేశించాలి;
మూడు: ఖండించాలి;
నాలుగు: తప్పు దిద్దాలి;
ఐదు : నీటియందు శిక్షణ చేయాలి;
ఆరు: వాక్యమును ప్రకటించాలి;
ఏడు: సమయమందు అసమయమందు ప్రయాసపడాలి;
ఎనిమిది: ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలి;
ఐదవది: నీతియందు శిక్షణ చేయాలి—దేనితో వాక్యముతో,
లేఖనములతో! ఈ వచనం స్టడీబైబిలో ఇదేమాట ఏమని వ్రాయబడింది అంటే:
నీతిన్యాయాల విషయంలో క్రమశిక్షణ చేయడానికి అవి ప్రయోజనకరమైనవి. గతభాగంలో
చెప్పినట్లు ఈ లేఖనాలు క్రమశిక్షణ విషయంలో శిక్షణ చేయడానికి ఎంతో
పనికివస్తాయి. అంతేకాకుండా పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి ఎంతో
ఉపయోగపడతాయి. మోషేగారు ఐగుప్తీయుడుగా పెరిగినా తల్లి దేవుని
లేఖనాలు,
దేవునిబోధలు నేర్పించి పెంచారు. అందుకే ఈలోక పాపభోగాలు అనుభవించుట కంటే
దేవునిప్రజలతో శ్రమయే మేలని ఆ మార్గములోనే పయనించారు. గొప్ప
నాయకుడు, ప్రవక్త అయ్యారు.
సమూయేలుగారిని మొదట తల్లి,
ఆ తర్వాత యాజకుడైన ఏలీ గారు భక్తితోనూ,
లేఖనములను బోధిస్తూ పెంచారు. దేశానికి చివరి న్యాయాధిపతి, దీర్ఘదర్శి,
ప్రవక్తగాను తిరుగులేని నాయకుడుగా వెలిగారు. ఇలా బాల్యం నుండి దైవ
లేఖనములు చదువుతూ పెరిగిన భక్తులు గొప్పగా దేవునిచే వాడబడ్డారు. ప్రియ
దైవజనుడా! నీ పిల్లలు గొప్ప భక్తిపరులుగా దేవునిచే వాడబడే వారుగా ఉండాలంటే
నీవు క్రమశిక్షణలో పెంచాల్సింది వాక్యముతో క్రమశిక్షణతో! బాలుడు నడువవలసిన
త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
సామెతలు 22:6;
ఆరవది: వాక్యమును ప్రకటించుము! దీనికోసం గతభాగాలలో విస్తారంగా
మాట్లాడుకోన్నాము. సంఘకాపరులకు బోధకులకు సువార్తికులకు దేవుడిచ్చిన
గొప్పపని ఇది! భూమిమీద దీనికంటే గొప్పపని ఏదీ లేదు! అయితే వారు తమ ఊహలను
భావాలను,
కల్పనలను చెప్పకుండా వాక్యమును మాత్రమే ప్రకటించాలి. మనం
ప్రకటించవలసినది వాక్యమే గాని పిట్టకధలు, సైన్సు,
మన తెలివితేటలూ ఎంతమాత్రము కాదు! కారణం దేవుని వాక్యము సజీవమైనది .
దేవుని వాక్యం హృదయాలను మండించేది, సరిచేసేది,
బండను కూడా బద్దలుచేసేది,
రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది;
మనిషిని బ్రతికించేది,
ఆదరించేది;
చివరకు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి అటువంటి వాక్యముతో,
లేఖనాలతో దైవజనుడు సన్నద్దుడై ఉండాలి. చివరికి వాక్యమైయున్న దేవుణ్ణి
ప్రకటించాలి తప్ప మన బోధనాపటిమను ప్రదర్శించడానికి ఏదేదో చెబుతూ,
ప్రజలను నవ్విస్తూ కాలక్షేపం చెయ్యకూడదు! కారణం ఆ వాక్యం జీవమైనది.
మత్తయి 28:20.
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి
బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో
చెప్పెను.; మార్కు 16:15; 1కొరింథీ 1:23
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము....;
Corinthians(మొదటి కొరింథీయులకు) 2:1,2,3,4,5,6,7
1. సహోదరులారా,
నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని
దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.
2. నేను,
యేసుక్రీస్తును అనగా,
సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప,
మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.
3.
మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.
4.
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక,
దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని,
5. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక,
పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే
వినియోగించితిని.
6.
పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము,
అది యీ లోక(మూలభాషలో-ఈ యుగ) జ్ఞానము కాదు,
నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము;
ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ
నిమిత్తము నియమించెను. ;
2కొరింథీ 4:5; 1పేతురు 4:11...
ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను;
ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను.
ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు
మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.
ఏడవది: సమయమందును అసమయమందును ప్రయాసపడాలి—దేనికై?
సువార్తపనికై! దేవుని పరిచర్యకై! కారణం కేవలం డాక్టర్లు, పోలీసు ఆఫీసర్లకే కాదు పాదిర్లు,
సేవకులకు కూడా సరియైన టైమింగ్ ఉండదు. ఏ సమయంలో ఎవరు పిలుస్తారో తెలియదు. ఏ
నిమిషంలో ఎవరు పోతారో తెలియదు. అక్కడకు వెళ్ళాలి. ఎప్పుడు ఎవరికీ ఏ దయ్యం
పడుతుందో తెలియదు. వెళ్లి ప్రార్ధనచెయ్యాలి! పుట్టుకలు, చావులు, పెళ్ళిళ్ళు,
బర్త్ డే ఫంక్షన్ లు,
ఇక ఆదివారం వాక్యపరిచర్యే కాకుండా మధ్యలో గృహకూటాలు,
ఇన్ని విషయాలలో బిజీగా ఉండాలి కాబట్టి దేవుని కాడిని ఎత్తుకుంటే ఇవన్నీ
చేయడానికి సంసిద్దుడై అప్పుడు సేవకు రావాలి! కష్టపడాలి! ప్రయాసపడాలి!
సువార్తికుని పని చెయ్యాలి.
ఎనిమిది: ఖండించుము, గద్ధించుము,
బుద్ధిచెప్పుము! ఇది ప్రతీ దైవసేవకునికి దేవుడిచ్చిన అధికారం మరియు
ఆజ్ఞ! ఇలా చెప్పడానికి కారణం
౩—4 వచనాలు.....2తిమోతికి 4: 3,4
ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక,
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు
పోగుచేసికొని,
సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
కాబట్టి ఈ అధికారాన్ని తప్పకుండ ఉపయోగించమని దేవుడు- పౌలుగారు
చెబుతున్నారు.
2తిమోతి ౩:16..
16.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము(ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి)
ఉపదేశించుటకును,
17. ఖండించుటకును,
తప్పు దిద్దుటకును,
నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.;
1తిమోతి 5:20...
ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
తీతుకు
1:9,13..
9.తాను హితబోధవిషయమై (ఆరోగ్యకరమైన బోధవిషయమై) జనులను
హెచ్చరించుటకును,
ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు,
ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై
యుండవలెను.
13.
ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను,
సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,
14.
విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.
.;
2:15...
వీటిని గూర్చి బోధించుచు,
హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని
తృణీకరింపనీయకుము.;
ప్రియ దైవజనుడా నీవు ఎలా బోధిస్తున్నావు?
ఖండించి గద్దించి బుద్దిచేప్పే బోధ చేస్తున్నావా లేక ప్రజలకు ఇష్టమయ్యే
టట్లు ఆశీర్వాదం, దీవెన,
నవ్విస్తూ చెబుతున్నావా?
గమనించాలి నిన్నుగూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పారు.
అంతేకాకుండా మీరు దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంటుంది అని మరచిపోవద్దు!
హెబ్రీయులకు 13: 17
మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను
కాయుచున్నారు;
వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో
కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని,
వారికి లోబడియుండుడి.....
ఆ రకంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిద్దాం!
దైవరాజ్య వ్యాప్తి చేద్దాం!
సమయమందు అసమయమందు ప్రయాసపడుదాం!
శ్రమలను సహిద్దాం!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --34వ భాగం*
*చేయదగినవి-17*
తీతుకు 1:5..
నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది,
ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను
విడిచి వచ్చితిని.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత
కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఇంతవరకు రెండవ తిమోతి పత్రికలో పౌలుగారు
తిమోతిగారికి ఇచ్చిన మార్గదర్శకాలద్వారా పరిశుద్ధాత్ముడు దైవసేవకులకు ఇచ్చిన
ఆజ్ఞలను ధ్యానం చేశాము. ఈరోజు తీతు పత్రికనుండి కొన్నింటిని ధ్యానం చేద్దాం!
గమనించాలి- మూడవ భాగంలో చెప్పిన విధముగా తీతుగారు
– పౌలుగారియొక్క సెక్రటరీ,
ఇంకా పౌలుగారియొక్క తర్జుమా చేసేవాడు. అనగా స్వతహాగా ఈయన గ్రీకు
పండితుడు, డాక్టరేట్ పొందినవాడు,
ఆ తర్వాత దేవుణ్ణి అంగీకరించారు గనుక పౌలుగారితో పాటుగా రోమా, గ్రీకు, ఎథెన్స్,
క్రేతు ఇంకా చుట్టుపట్ల ప్రాంతాలలో దేశాలలో పౌలుగారు సువార్త
ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు తర్జుమా చేయడానికి వెళ్తూ ఉండేవారు.
అంతేకాకుండా అప్పుడప్పుడు పౌలుగారి పత్రికలు ఆయన చెబుతుండగా ఈయన రాసేవారు.
కొన్ని సంవత్సరాలు గడిచాక క్రేతులోను,
ఇంకా కొన్నిప్రాంతాలలోను గల సంఘాల భాద్యత పౌలుగారు తీతుకు అప్పగించారు.
ఈయన బహు భాషా పండితుడే కాకుండా గ్రీకు వేదాంతశాస్త్రంలో తత్వ శాస్త్రంలో
డాక్టరేట్ గల వ్యక్తి! మరి ఇప్పుడు పౌలుగారు రోమా చెరలోనికి రెండవసారి
వెళ్ళాక ఇక తను తిరిగిరావడం, తీతును చూడటం అసంభవం అని గ్రహించి,
తిమోతిగారికి వ్రాసిన విధముగానే తీతుకు కూడా పత్రిక రాశారు. ఈయన పండితుడు
కాబట్టి తిమోతిగారికి రాసినంత విస్తారంగా రాయలేదు గాని క్లుప్తమైన మాటలలోనే
మొత్తం సందేశం చెప్పేశారు. మార్గదర్శక సందేశాలు ఇచ్చారు. మొత్తం తీతుకు
వ్రాసిన పత్రిక తిమోతికి రాసిన రెండు పత్రికలు పోలి ఉంటాయి,
చాలావరకు అవే విషయాలు ఎత్తిరాశారు పౌలుగారు! కాబట్టి ఇపుడు మనం తీతు
పత్రికలో పౌలుగారు దైవజనుడు ఎలా ప్రవర్తించాలో, ఏవి చెయ్యాలో,
ఏవి హత్తుకోవాలో ఈ విషయాలు గురించి అన్నిటినీ ఇప్పుడు ద్యానం చెయ్యడం
లేదు. కారణం వీటిని మనం తిమోతి పత్రికలో ధ్యానం చేసినప్పుడు ధ్యానం
చేసాము.
ఈ పత్రికలో పౌలుగారు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు అని
ఆత్మావేశంతో వ్రాశారు. 2:11 ఆయన మహా దేవుడు,
మన రక్షకుడు అని ఉద్ఘాటించారు.
ప్రియులారా! ఈ పత్రికలో ఎన్నో కామన్ టాపిక్ లు ఉన్నాయి. ఉదా: 1:5
లోపముగా ఉన్నవాటిని సరిదిద్దు! ప్రతీ పట్టణంలో అర్హులైన వారిని సంఘపెద్దలుగా
నియమించు అని వ్రాశారు.
1:10—11...
10. అనేకులు,
విశేషముగా సున్నతి సంబంధులును,
అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.
11.
వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు
ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.
వదరబోతులు ఉపదేశించకూడని వాటిని బోధించేవారి నోళ్లను మూయుంచు అంటున్నారు.
తిమోతి పత్రికలో కూడా అటూఇటూగ ఇలానే చెప్పారు. అవును ఈరోజులలో అనేకమంది
వదరబోతులు దేవునికి వ్యతిరేఖంగా వాగుతున్నారు,
కొంతమంది వారినోల్లను మూయిస్తున్నారు. దేవునికి స్తోత్రం! దీనికోసం
గతభాగాలలో మనం ధ్యానం చేసుకున్నాం! అయితే కొంతమంది సేవకులు ఉపదేశించకూడని
వాటిని బోధ చేస్తున్నారు,
కారణం వారు విదేశి ఎంగిలిమెతుకులకు డబ్బుకు ఆశపడి వాక్య విరుద్ధమైనవి
బోధిస్తున్నారు. బైబిల్ లో లేని విషయాలు,
బైబిల్ అంగీకరించని విషయాలు అవి లేఖనాల సారాంశమని బోధిస్తున్నారు. వీరినోరు
మూయించమని పౌలుగారు చెబుతున్నారు. ముఖ్యంగా యెహోవాసాక్షులు, మొర్మాన్స్, బ్రెన్హమైట్లు ,
సబ్బాతు ఆరాదికులు,
శరీరంతో పాపము చేసినా తప్పులేదు,
ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు,
చిన్నచిన్న పాపాలు చేసినా పర్వాలేదు,
పెద్దపెద్ద పాపాలు చెయ్యకూడదు అని బోధించే అబద్దబోధకుల నోరు తప్పకుండా
మూయించాలి.
ప్రియ దైవజనుడా! ఈ ఆజ్ఞ నీకుకూడా ఇవ్వబడింది.
ఇక 1:13—14 లో ఎవరైనా తప్పుచేస్తే,
పాపం చేస్తే సంఘంలో కఠినముగా గద్దించుము అంటున్నారు- వారు ఎవరైనా సరే,
ఇలా చెప్పడంలో పౌలుగారి ఉద్దేశం వారిని అవమానపరచాలి అని ఎంతమాత్రమూ కాదు.
వారి తప్పులు సరిదిద్ది వారినికూడా తిరిగి దేవునితో సమాధానపడాలనే ఉద్దేశ్యంతో
మాత్రమే ఇలా రాస్తున్నారు. అంతేకాకుండా ఇలా బహిరంగంగా గద్ధిస్తే ఎదుటివారు
అలా పాపం చెయ్యడానికి భయపడతారు అనే ఉద్దేశ్యం! అందుకే తిమోతిగారికి
రాస్తున్నారు: ఖండించుము గద్దించుము,
బుద్ధిచెప్పుము! తీతుకు చెబుతున్నారు కటినముగా గద్ధించుము! కారణం ఈ క్రేతు
ప్రజలు మూర్ఖులు,
ఎవరికీ లోబడని వదరబోతులు లాంటివారు అందుకే సాఫ్ట్ గా చెప్పకు కటినముగా
చెప్పు అంటున్నారు. 1:12--14;
ఇక 2:1
లో హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించమని చెబుతున్నారు తిమోటికి
చెప్పినట్లే!
2:15 లో పై విషయాలు బోధిస్తూ,
హెచ్చరిస్తూ,
సంపూర్ణాధికారంతో దుర్భోదను ఖండిస్తూ,
నిన్ను ఎవరూ తృణీకరించకుండా చూసుకో అంటున్నారు. తిమోతిగారి కూడా ఇలానే
వ్రాసారు. అయితే తిమోతిగారికి నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను
తృణీకరించకుండా చూసుకో అన్నారు. కారణం తిమోతి యవ్వనస్తుడు కాబట్టి. నేడు
యవ్వనస్తులైన దైవజనులకు కూడా బైబిల్ ను బట్టి ఇదే ఆజ్ఞ ఇస్తున్నారు దేవుడు!
నీ యవ్వనాన్ని బట్టి ఎవరునూ నిన్ను తృణీకరించకుండా చూసుకో! నీ పరువు దేవుని
పరువు తీయవద్దు! గతంలో మీకు చెప్పడం జరిగింది: మాకు వమ్మవరం అనే గ్రామంలో
బ్రాంచి చర్చి ఉంది. అక్కడ నాన్న గారు సుమారు 40సంవత్సరాల క్రితం ఆరాధన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గ్రామంలో సుమారు 10 సంఘాలున్నాయి గాని పాష్టర్ అంటే,
క్రీస్తు బిడ్డలు అంటే అక్కడ గౌరవం లేకుండా పోయింది కారణం అక్కడ సేవచేసిన
కుర్రపాష్టర్లు. ఒక పాష్టర్ ఒక వివాహితను తీసుకునిపోయాడు. మరో పాష్టర్
పెళ్ళికాని అమ్మాయిని లేపుకుపోయాడు. అయ్యా! పాష్టర్లే తప్పులు చేస్తుంటే ఆ
గ్రామంలో సువార్త ఎలా జరుగుతుంది?
సంఘం ఎలా అభివృద్ధిచెందుతుంది. అందుకే మీ బట్టే కదా దేవుని నామం
అవమానించబడుతుంది అని చెబుతుంది బైబిల్! రోమీయులకు 2: 24
వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను
దూషింపబడుచున్నది?
కాబట్టి ప్రియ యవ్వన సేవకులారా! మీ యవ్వనాన్ని బట్టి ఎవరూ మిమ్మును
తృణీకరించకుండా మీశీలాన్ని కాపాడుకోండి! ఇక తీతుగారు యవ్వనస్తుడు కాదు
కాబట్టి నిన్ను ఎవరూ ఏ విషయంలో కూడా తృణీకరించకుండా జాగ్రత్తపడు
అంటున్నారు. మనిషి పడిపోవాలి అంటే అది అమ్మాయిలు లేక స్త్రీల విషయంలో
అవుతుంది. లేకపోతే ధనం విషయంలో అవుతుంది. లేకపోతే అధికార కాంక్ష వలన గాని
జరుగుతుంది. ప్రియ దైవజనుడా! ధనాశలో కూరుకుపోకు!
నిన్ను సేవకు పిలిచింది,
నీకోసం రక్తం కార్చింది యేసుక్రీస్తు ప్రభులవారు. నీకు ఏమి కావాలో ఆయనకు
తెలుసు కాబట్టి ఆయనమీద ఆనుకో! ధనం వెనకాల పరుగెత్తకు! ఎక్కువ కానుకలు
ఇచ్చేవారి వెంట తిరుగకు! ఈ సంస్థ,
ఆ సంస్థ అంటూ తిరుగకు! నిన్ను పోషించేవాడు దేవుడే! ఇక రాజకీయ నాయకుల వెంట
తిరుగకు! సేవకునికి రాజకీయం పనికి రాదు! నీ పని నీవు చేయు! ఇలా ఎలాంటి
విషయంలో కూడా నిన్ను ఎవడునూ తృణీకరించకుండా చూసుకో!
ఇక ౩:10లో మతబేధములు పుట్టించేవాడికి ఒకటిరెండుసార్లు బుద్ధి చెప్పు! వినకపోతే
వెలివేసేయ్ అంటున్నారు. మతబేధం అంటే ఇందాక చెప్పిన తప్పుడుబోధలను
చేస్తూ,
వాటిని అనుసరించేవారు. వీరికి సత్యాన్ని చెప్పవలసిన అవసరం నీకుంది.
కాబట్టి ఒకటి రెండుసార్లు బుద్ధిచెప్పు! వినకపోతే వీడితోపాటు అనేకులను వాడు
పాడుచేస్తాడు కాబట్టి వాణ్ని వెలివేసేయ్ అంటున్నారు. కొరింథీ పత్రికలో
మరొకడు ఉన్నాడు. వీడు తన తండ్రి భార్యను ఉంచుకుంటే పౌలుగారు చెప్పారు-
వాడిని సంఘం నుండి వెలివేసేయ్ అన్నారు. వెంటనే వారు వెలివేశారు.
కొన్నిరోజుల తర్వాత రెండవ కొరింథీ పత్రిక రాసి, ఇక వాడిని వెలివేయక బుద్ధిచెప్పి,
తప్పును దిద్దుకుంటే వాడిని తిరిగి సంఘంలో చేర్చుకోమన్నారు. లేకపోతే వాడు
కృంగిపోయి నరకానికి పోతాడు కాబట్టి వాడిని బలపరచి, సరిద్దిద్ది సంఘంలో చేర్చుకో అన్నారు. 2కొరింథీ 2:6-7;
అలాగే దైవజనుడా! ఎవరైనా తప్పుచేస్తే నీవుకూడా అలాగే చెయ్యమని వాక్యం ద్వారా
గుర్తుకుచేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా..... --35వ భాగం*
*చేయదగినవి-18*
తీతుకు 2:7..
పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు
అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
ప్రియ దైవజనమా! మనం దైవజనుడు చేయవలసిన లేదా హత్తుకోదగిన విషయాల కోసం గత కొన్ని
రోజులుగా ధ్యానం చేస్తున్నాం! ఈరోజు తీతు పత్రికనుండి మరొకటి
ధ్యానం చేద్దాం!
పై వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డమాట
ఏదియు చెప్పకుండా చూసుకో అంటున్నారు పౌలుగారు! పరపక్షమందున్నవాడు మనగూర్చి
చెడ్డమాట ఎందుకు చెబుతాడు?
మన బ్రతుకులు బాగోలేకపోతే తప్పకుండ చెడ్డమాట చెబుతాడు. అంతేకాకుండా దానికి
ఇంకా నాలుగైదు కలిపి చెబుతాడు. దీని అర్ధం ఏమిటంటే: బ్రతుకు బాగోలేదు=
సాక్ష్యం కోల్పోయాడు అని అర్ధం!
సంఘకాపరే త్రాగుబోతు అయితే సంఘస్తులు ఇంకా ఎలా ఉంటారు?
ఇక్కడ గమనించాలి: అన్యులు తాగేసి పందిలా దొర్లినా ఎవరూ ఏమీ
పట్టించుకోరు,
అదే ఒక క్రైస్తవుడు తాగేసి దొర్లితే : ఈ క్రైస్తవులంతా ఇంతే అంటారు.
దేవుడు బిడ్డ అట. ఎలా ఉన్నాడో చూడండి అంటారు. ఒక పనికిమాలినవాడు/పనికిమాలిన
దానికోసం మొత్తం క్రైస్తవులకు అందరికీ ఆ పాపాన్ని ఆపాదిస్తారు. ఎవరైనా ఒక
యవ్వనస్తుడు సంఘంలో మరో అమ్మాయిని ప్రేమిస్తే (శారీరక ప్రేమ) ఈ
క్రైస్తవులంతా ఇంతేరా! ఈ ప్రేమించుకోడానికి వెళ్తున్నారు, గుడికని వెళ్ళడం,
లోపల చేసే బాగోతం ఇదేరా అంటారు. ఇదే పరపక్షమందున్నవాడు మనకోసం చెడ్డమాట
పలకడం!
కొంతమంది చీడపురుగులు చేసిన పనికి మొత్తం సంఘానికి లేదా క్రైస్తవులందరికి ఆ
తప్పును ఆపాదిస్తారు కాబట్టే పరపక్షమందున్నవాడు నీకోసం చెడ్డమాట పలుకకుండా
జాగ్రత్తపడు అంటున్నారు పౌలుగారు! ప్రియ దైవజనుడా! నీ మాటలోనూ
, నీ ప్రవర్తనలోనూ,
నీ చూపులోనూ చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి. 1తిమోతికి 4: 12
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను,
ప్రేమలోను, విశ్వాసములోను,
పవిత్రతలోను,
విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
కారణం కేవలం సంఘమే కాకుండా ఇంకా లోకము కూడా నిన్ను చాలా దగ్గరగా
పరిశీలిస్తున్నారు అని మరచిపోకు! ఒకవేళ నీ కోపాన్ని కంట్రోల్
చేసుకోలేకపోతున్నావా? నిన్ను కోపిష్టి అంటారు. నీ బార్యను కొడుతున్నావా?
పైకి గొప్ప బోధలు చేస్తాడు. పెళ్ళాన్ని గొడ్డుని బాదినట్లు బాడుతున్నాడు
అంటారు. నీకు అక్రమసంభంధం ఉందా? నీకు సెకండ్ సెటప్ ఉందా?
ఈ పాదిర్లు/ పాష్టర్లు అంతా ఇంతేరా ,
పైన పటారం లోన లొటారం! పెద్దపెద్ద ప్రసంగాలు చేస్తారు గాని వచ్చిన
సంఘస్తులతో వ్యభిచారం చేస్తారు అంటారు,. నీకోసం మొత్తం పాష్టర్లు అందరి పరువు,
దేవుని పరువు పోయింది కదా! నీవు త్రాగుబోతువా?
జూదగాడివా?
గమనించాలి : మీవల్లనే దేవుని నామము అన్యజనుల మధ్య అవమానించబడుతుంది అని
బైబిల్ లో చెప్పబడింది. రోమీయులకు 2: 24
వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను
దూషింపబడుచున్నది?
గాబట్టి నిన్ను గూర్చి,
నీబోదను గూర్చి జాగ్రత్తగా ఉండు అని పౌలుగారు చెబుతున్నారు!
ఇతరులకు చెప్పాక నేను పడిపోతానేమో,
బ్రష్టుడనైపోతానేమో అని పౌలుగారు అనుక్షణం భయపడుతూ జీవించారు. మనం కూడా
అలాగే ఉండాలి! యాకోబుగారు అంటున్నారు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా
తనఘటమును కాపాడుకోవడమే భక్తి! 1:27;
ఇహలోక పాపము నీ దేహాత్మలకు అంటకూడదు! అంతేకాకుండా ఒకవేళ నీవు సంఘంలో
ఎప్పుడూ ఇవ్వండి, ఇవ్వండి అంటూ కానుకలు కోసం చెబుతున్నావా?
అయితే మీ సంఘస్తులే నీకు ధనాశ అంటారు. దేవునికి ఇవ్వడం కోసం తప్పకుండా
చెప్పాలి. అయితే మాటిమాటికి కాదు! అప్పుడప్పుడు నీవు కాకుండా మరో సేవకుడి
ద్వారా చెప్పిస్తే మంచిది అని నా ఉద్దేశ్యం!
కాబట్టి అన్ని విషయాలలో మితముగా ఉంటూ అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి
అని తెలియజేస్తున్నాను!
ఈ విషయంలో లేమెన్స్ ఇవాంజిలికల్ ఫెల్లోషిప్ వారు చెప్పే విషయం ఒకటి
చెప్పనీయండి. అది నాకు మంచిదే అని తోస్తుంది! వారు వయస్సులో ఉన్న
అన్నాచెల్లెళ్ళను కలసి రోడ్డుమీద నడవడం గాని,
బండిమీద వెళ్ళడం గాని చేయకూడదు అంటారు. ఎందుకంటే మీరు అన్నాచెల్లెళ్ళు అని
మీకు తెలుసు,
తల్లిదండ్రులమైన మాకు తెలుసు గాని రోడ్డుమీద పోయేవారికి తెలియదు కనుక వారు
మీరిద్దరూ ఏదేదో అని ఊహించుకునే అవకాశం వారికీ ఇవ్వవద్దు అంటారు. నిజమే
కదా!
ఈరోజులలో వయస్సులో ఉన్న ఇద్దరు స్త్రీ-పురుషులు నడచిపోతుంటే,
బండిమీద పోతుంటే ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటారు లోకులు అనగా పరపక్షమందున్న
వారు. వారికి ఆ అవకాశమే ఇవ్వవద్దు అంటున్నారు వీరు అదే పౌలుగారు చెప్పిన
మాటను ఉటంకిస్తూ! ఓ యవ్వనుడా! దయచేసి నీవుకూడా దీనిని పాటిస్తే మంచిది!
సంఘంలో పరిచర్యలో ఒక అమ్మాయి లేటయిపోతే,
వారి ఇంటిదగ్గర దిగబెట్టిపోదాం అనే సదుద్దేశం నీకుంది. మీ ఇద్దరిమధ్య ఎలాంటి
చెడుబుద్ది కూడా లేదు! గాని మీ ఇద్దరు అలా బండిమీద వెళ్తుంటే ఒకటిరెండు
సార్లు చూసిన అన్యులు మీ ఇద్దరిమధ్య ఏదో అక్రమసంభంధమో,
ఈ లోక ప్రేమ ఉంది అని అనుకుంటారు. లోకులు అదిగో పులి అంటే,
ఇదిగో తోక (దానితోక) అంటారు. కాబట్టి ప్రియ యవ్వనులారా! ఈ అవకాశం దయచేసి
ఎవరికీ ఇవ్వకుండా,
పరపక్షమందున్నవాడు మనగురుంచి చెడ్డమాటలు పలుకకుండా దయచేసి జాగ్రత్తపడమని
మనవి చేస్తున్నాను. ఒకవేళ వయస్సులో ఉన్న అమ్మాయిని మందిరము నుండి
దిగాబెట్టాలి అంటే దయచేసి తనతండ్రి వయస్సున్న వారితో దిగబెట్టడం మంచిది అని
నా ఉద్దేశ్యం!
అన్నీ పురుషులకోసమే చెబుతున్నారు గాని అవి మాకోసం కాదు అని బహుశా
స్త్రీలు అనుకోవచ్చు అనగా దైవసేవకురాళ్ళు లేక సేవకురాళ్ళు!
లేదా పాష్ట్రమ్మలు,
సువార్తికురాండ్రు అనుకోవచ్చు! దయచేసి పౌలుగారు స్త్రీ పురుషులందరి కోసం
వ్రాశారు అని గమనించాలి! నీ బ్రతుకు బాగులేకపోతే,
సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే నీబట్టి సేవకురాళ్ళు అందరి పరువుపోతుంది.
నీవు ప్రసంగం చేసేటప్పుడు మాదిరిగా లేకుండా ముఖానికి రంగు, మూతుకి రంగు,
కనుబొమలకు రంగు,
పెదాలకు రంగు పొట్టిపొట్టి జాకెట్లు,
రకరకాలైన హెయిర్ స్టైల్,
ముసుగులేకుండా వాక్యం చెప్పడం,
పాటలు పాడటం చేస్తుంటే ప్రజలు ఏమని అనుకుంటారు?
సినిమా యాక్తర్లకు తీసిపోకుండా నేడు అనేకమంది సేవకురాళ్ళు,
పాష్ట్రమ్మలు ముస్తాబవుతున్నారు. ఇక పాష్టర్ గారి కూతుర్లు సినిమాలలో ఏ
స్టైల్ వస్తే ఆ స్టైలే చేస్తున్నారు! మాదిరిగా ఉండాల్సిన
పాష్ట్రమ్మలు, సేవకురాళ్ళు,
ప్రసంగీకులు వారే తప్పుడుమార్గంలో పయనిస్తూ ఉంటే ఇక సంఘస్తులకు ఎలా
బోధించగలరు?
ఇక మీరు అలా తయారైతే అలా చేయడం తప్పు అని మీ భర్త- పాదిరి- దైవసేవకుడు
లేదా మీ తండ్రి ఎలా ఇతరులకు బోధించగలడు?
ఒకసారి ఆలోచించమని మనవిచేస్తున్నాను. మరచిపోవద్దు- తీర్పు దేవుని
ఇంటినుండే మొదలుపెడుతుంది .1పేతురు 4: 17
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది;
అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి
యేమవును?
ప్రియమైన సేవకురాలా! నీవే నీభర్తకు/ సేవకునికి విలువ ఇయ్యకుండా
చీపురుపుల్లను తీసిపారేసినట్లు మాట్లాడితే సంఘస్తులు నీ భర్తకు/ సేవకునికి
ఎలా విలువనిస్తారు? గౌరవిస్తారు?
ఆ మధ్య చదివాను: నీవు నీ భర్తను రాజును చేస్తే,
నిన్ను నీ భర్త మహారాణిలా చూసుకుంటాడట! ఇక దైవ సేవకురాలవైన నీవే నీ భర్తను
అనుమానపు జబ్బుతో వేధిస్తుంటే, సూటిపోటు మాటలంటూ, నగలు,
చీరలు కొను అంటూ,
మీ ఆర్ధిక పరిస్తితి అర్ధంచేసుకోకుండా వేధిస్తుంటే ఎలా మాదిరిగా
ఉండగలవు? అప్పుడు పరపక్షమందున్న వారు నిన్ను,
నీ భర్తను నిందించరా?
నీవే అక్రమసంభంధం కలిగి ఉంటే నీ భర్త తలెత్తుకుని సేవ చేయగలడా?
నాకు తెలిసిన ఒక పాష్టర్ గారి భార్య వారిసంఘంలో తనకంటే తక్కువ వయస్సు గల
అబ్బాయితో అక్రమ సంభంధం పెట్టుకుంది. ఇక వారిద్దరూ లేచిపోయారు.
ఇక ఆ దైవసేవకుడు అక్కడ సేవచేయలేక మా ప్రాంతం వదలి తెలంగాణా పోయి అక్కడ
సేవచేసుకుంటున్నాడు. దేవుడు ఆ అబ్బాయి కుడికాలు కుల్లిపోయేలా చేసి,
మొత్తం తొడవరకు కాలు తీసేసారు అనుకోండి! గాని ఆ పాదిరి సేవమానేసి
ఎక్కడికోపోవాల్సి వస్తుంది. ప్రియ సేవకుల కుమారులారా! కుమార్తెలారా! మీరు
అక్రమసంభందాలు కలిగియున్నా,
ఇలాంటి తప్పుడుపనులు చేసినా మీ తల్లిదండ్రులు అవమానంతో తలెత్తుకుని
సేవచేయలేరు అని మరచిపోవద్దు! మీ తండ్రిగారు అంతకష్టపడి చేసిన సేవ
పనికిరాకుండా పోతుంది అని గమనించండి! దేవుని పరువు పోతుందని
గుర్తుచేసుకోండి
కాబట్టి ప్రియ దైవ జనులారా! దైవసేవకులారా! దైవజనుల పిల్లలారా! ఇంకా యవ్వన
బిడ్డలారా! సంఘ పెద్దలారా! క్రైస్తవులారా! దయచేసి పరపక్షమందున్నవారు అనగా
అన్యులు మిమ్మల్ని గమనిస్తున్నారు అని గ్రహించి, వారు మీగురుంచి,
మన గురుంచి చెడ్డమాటలు పలుకకుండా మన జీవితాలను,
మన మాటలను,
ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోమని,
మీ ఘటమును, శీలాన్ని,
సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు అని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!
మరచిపోవద్దు మనుష్యులు చేసే ప్రతీ పనికి,
ప్రతీ మాటకు విమర్శ దినమందు లెక్క అప్పగించాలని మరచిపోకండి! మిమ్మును
బట్టి దేవునినామం అవమానించబడకుండా జాగ్రత్తగా చూసుకోండి!
అట్టి కృప ధన్యత ప్రభువు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దైవజనుడా.....–౩6వ భాగం*
*చేయదగినవి-19*
1తిమోతి 6:11..
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము
(వెంటాడుము).
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము! ఇంతవరకు మనం రెండవ తిమోతి పత్రిక,
తీతుకు పౌలుగారు వ్రాసిన పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఇక ఈరోజునుండి పౌలుగారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము.
ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశములు లేక హత్తుకోదగిన లేక చేయవలసిన
అంశములు: నీతి, భక్తి,
విశ్వాసము, ప్రేమ,
ఓర్పు,
సాత్వికము సంపాదించుకోవాలి.
అయితే నీతి, విశ్వాసము,
ప్రేమ కోసం గతభాగాలలో వివరంగా ధ్యానం చేసుకున్నాం కాబట్టి భక్తి, ఓర్పు,
సాత్వికముల కోసం ధ్యానం చేసుకుందాం!
నేటి అంశము: *భక్తి!*
నేటిరోజులలో క్రైస్తవులు భక్తివేశము వేసుకుని అనేకులను
మోసగిస్తున్నారు.
తెల్లనిబట్టలు వేసుకుని మందిరంలోకి వెళ్తే మేము భక్తిపరులముగా కనిపిస్తాము
అనుకుని తెల్లనిబట్టలు వేసుకుని, మనస్సులో పాపమనే చీకటితో నిండుకుని ఉంటున్నారు.
అయితే తెల్లనిబట్టలు వేసుకోవడం తప్పా?
కానేకాదు!
బైబిల్లో ఎల్లప్పుడూ తెల్లనిబట్టలు వేసుకుని,
తలకు నూనె రాసుకోమని వ్రాయబడిఉంది.
ప్రసంగి 9: 8
ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.
అయితే నా ఉద్దేశ్యం తెల్లనిబట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్దులు
భక్తిపరులు కాలేరు- ఆ భక్తీ,
పరిశుద్ధత క్రియల్లోనూ,
మాటలోనూ,
ప్రవర్తనలోనూ చూపించాలి అంటున్నాను.
దైవసేవకులు కూడా అలాగే తెల్లనిబట్టలు వేసుకుని అనేకమందిని తమ
తప్పుడుబోధలతో నరకానికి ఈడ్చుకుపోతున్నారు. తేనెలొలుకు పలుకులతో,
తప్పుచేసినా ఖండించని బోధలతో,
దేవుడు చెప్పని బోధలతో తమ కడుపులు పోషించుకుంటూ సంఘాన్ని
దోచుకుంటున్నారు. అన్నింటికీ తొడుగు భక్తి అనే మేలిముసుగు! 2తిమోతికి
3: 5
పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
ఇది కేవలం విశ్వాసులకే కాదు దైవజనులకు ,
సంఘపెద్దలకు కూడా వర్తిస్తుంది.
అంతేకాదు మీరు కేవలం చెప్పేవారుగా మాత్రమే ఉండకుండా చేసేవారుగా ఉండాలని
కూడా బైబిల్ చెబుతుంది.
అయితే దైవజనుడైన పౌలుగారు భక్తిని సంపాదించుకో అని తన ఆత్మీయ కుమారుడైన
తిమోతికి నొక్కివక్కానిస్తున్నారు. *కారణం ముక్తికి మార్గం భక్తిమాత్రమే*!
అయితే అది ఎటువంటి భక్తియై ఉండాలి?
కేవలం మాటల్లోనూ,
ఆరాధన క్రమం లోను మాత్రమే చూపించేది అయితే నీ భక్తి గణగణలాడు తాళము
మాత్రమే!
ఇలాంటి వారి గురుంచి యేసయ్య ఎండగట్టారు పరిసయ్యులు,
శాస్త్రులకోసం చెబుతూ....మత్తయి సువార్త
23:2,3,4,5,6,7,13,14,15,16,17,18,19,23,24,25,26,27,28,29,31,33,34,35
2.
శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
3.
గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి;
వారు చెప్పుదురే గాని చేయరు.
4.
మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు
పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.
5.
మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు;
తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
6.
విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను
7.
సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
13. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా,
మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
14.
మీరందులో ప్రవేశింపరు,
ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.
15. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా,
ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు;
అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా
(మూలభాషలో- నరకకుమారునిగా)
చేయుదురు.
16. అయ్యో,
అంధులైన మార్గదర్శకులారా,
ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని
బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు
చెప్పుదురు.
17. అవివేకులారా, అంధులారా,
ఏది గొప్పది? బంగారమా,
బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
18. మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె,
అందులో ఏమియు లేదు గాని,
దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టు కొంటె దానికి బద్ధుడని మీరు
చెప్పుదురు.
19. అవివేకులారా, అంధులారా,
ఏది గొప్పది? అర్పణమా,
అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
23. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా,
మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను,
అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.
24. అంధులైన మార్గదర్శకులారా,
దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.
25. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యు లారా,
మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను
అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.
26. గ్రుడ్డిపరిసయ్యుడా,
గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల
శుద్ధిచేయుము.
27. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యు లారా,
మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు.
అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త
కల్మషముతోను నిండియున్నవి.
28.
ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు.
29. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా,
మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు,
నీతిమంతుల గోరీలను శృంగారించుచు
31.
అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే
సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
33. సర్పములారా,
సర్పసంతానమా,
నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?
34.
అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను
పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు,
కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టీ,
పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు.
35.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును,
దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు
భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
ఇలాంటివి దేవునికి అక్కరలేదు! ఇలాంటి భక్తి దేవునికి ఇష్టం లేదు.
నీ దీర్ఘ ప్రార్ధనలు, కానుకలు,
ప్రసంగాలు కాదు దేవునికి కావలసినది-
దేవునికి నీ పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రార్ధన కావాలి.
నీ తనువూ, మనస్సూ,
ఆత్మ పరిశుద్ధంగా ఉంటూ నీవు దేవుణ్ణి నీ ప్రతీ పనిలోనూ చూపించాలి, ప్రతీ పలుకులోను దేవుణ్ణి చూపించాలి.
క్రీస్తుని పోలి నడచుకోవాలి!
పౌలుగారు:
నేను క్రీస్తును పోలి నడచినట్లు మీరును నన్ను పోలి నడచుకోనుడి
అంటున్నారు.
ఇక్కడ పౌలుగారు నన్నుపోలి నడచుకోండి అనగా నేను ఎలా క్రీస్తుని పోలి
నడచుకోన్నానో అలాగే మీరుకూడా నాలాగే క్రీస్తుని పోలి నడుచుకోండి
అంటున్నారు. అదే భక్తి!
*ఇంతకీ భక్తి కోసం బైబిల్ ఏమి చెబుతుంది?*
మనము పవిత్ర భారతదేశంలో పుట్టాము. మన దేశమంతా భక్తికి ప్రాధన్యతనిస్తుంది.
క్రైస్తవులుగా మనంకూడా భక్తికి చాలా ప్రాముఖ్యతనిస్తాము.
భక్తి అనగా ఏమిటి?
మన నిర్వచనం ప్రకారం పాపాలు చేయకుండా, అబద్దాలు ఆడకుండా,
ప్రార్ధన చేస్తూ, ఉపవాసం ఉంటూ,
ఇంకొందరు వీటితో పాటు భాషలు మాట్లాడుతూ,
ప్రవచిస్తూ,
ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటే అదే భక్తి అనుకొంటాం. ఇదేనా భక్తి?
ఇంకా ఏమైనా ఉందా?
మనకి ప్రతీదానికి ఆధారం మన పరిశుద్ధగ్రంధమే! గనుక బైబిల్ లో ఏమి వ్రాయబడి ఉందో చూద్దాం!
యేసుప్రభులవారి సహోదరుడు యాకోబుగారు వ్రాసిన పత్రిక
1:27
“*తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కలంకమును ఐన భక్తి ఏదనగా
1. దిక్కుమాలిన పిల్లలను,
విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు (అనగా వారికి సహాయం చేయడం), 2.
ఇహలోకమాలిన్యం తనకంటకుండా తననుతాను కాపాడుకొనుటయే!*”
ఇదే విషయాన్ని పాతనిభందన గ్రంధంలో యెషయా
58:3-10 లో భక్తిని-
ఉపవాసంతో పోలుస్తున్నారు.
“*1. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు(ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం), 2. భాదింపబడేవారికి సహాయం చేయుటయు, 3.
నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, 4.
నీరక్త సంభందికి ముఖము తప్పించుకొనకుండుటయు, 5.
వస్త్రహీనుడు కనబడితే వానికి వస్త్రములిచ్చుటయు,
ఇదేకదా నాకిష్టమైన ఉపవాసము*”
అని దేవుడు సెలవిస్తున్నారు.
ఇప్పుడు చూద్దాం మనం అనుకొంటున్న భక్తికి- దేవుడు సెలవిచ్చిన భక్తికి తేడా!!!!
మనం చేస్తున్నది ఒకటి! చెయ్యమన్నది ఒకటి!!!
అయితే మీరనొచ్చు మేం చేస్తున్నది భక్తి కాదా?!!!!! అని, *మీరు చేస్తున్నది,
భక్తిలో ఒక భాగం మాత్రమే గాని అదే భక్తి కాదు*!!!
మనల్ని మనం పరీక్షించుకొందాము ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం. మన బంధువులకి,
రక్త సంభదికులకు,
మన పొరుగువారికి సహాయం చేస్తున్నామా?
నీవు ప్రపంచంలో ఉన్న అందరికి సహాయం చేయడం కష్టం గాని కనీసం నీ ఊరువాడికి
చేయగలవు కదా! అందరికీ చేయలేకపోయినా నీ పొరుగు వాడికి,
నీ స్నేహితునికి లేక నీ సహోదరునికి లేక నీ సంఘసభ్యునికి సహాయం చేయగలవు
కదా! మరి చేస్తున్నావా?
నీవు ఎంత ప్రార్ధనాపరుడివైనా/పరురాలివైన, ప్రసంగీకుడవైనా,
ఉపవాసాలుండినా ఇవి చేయకపోతే నీ భక్తి దండగ!!!
చర్చిలో మరియు ఇంట్లో గంటలుగంటలు ప్రార్ధనచేస్తావు గాని నీ పొరుగు వానితో
సమాధానంగా ఉండవు, సహాయం చేయవు! –
నీ భక్తి వ్యర్ధం!!
భాషలు మాట్లాడుతావు గాని
– నీ సహోదరుని ప్రేమించవు,
ఎవరికీ భిక్షం వేయవు----
నీ భక్తికి అర్ధం లేదు!!!
ప్రసంగాలు చేస్తావు నీ పొరుగువాని ప్రేమించమని- నీ పోరుగువానితో గాని,
తోటి దైవసేవకునితో గాని సమాధానంగా ఉండవు,
మాట్లాడవు-
సరికదా వారితో వైరం!!!
ఎవరికీ అన్నం పెట్టవు.---
నీ ప్రసంగాలు,
నీ భక్తి దండగ!!!!!
ఉపవాసాలు ఉంటావు-
ఇంట్లో నీ అత్తమామలకు లేక నీ తల్లిదండ్రులకు భోజనం పెట్టవు
, నీవు చూడవు నీ భర్తను కూడా చూడనీయవు –
నీది భక్తా? వేషధారణా????
ఉపవాసాలుంటావు, ప్రార్ధనలు చేస్తావు,
భాషలు మాట్లాడుతావు,
ప్రవచిస్తావు గాని,
అన్యుడితో మాట్లాడవు,
వారికి సహాయం చేయవు,
దేవుని ప్రేమ చూపించవు,
సరికదా వారిని అంటరానివారిగా చూస్తావు.
ఇంకా వారెప్పుడు రక్షణ పొందుతారు?
నిన్ను చూస్తూనే అసహ్యంచుకొంటారు.
నీబట్టి యేసయ్యని కూడా ద్వేషిస్తున్నారు!!
చెబుతావు గాని చెయ్యవు!! నోరు తెరిస్తే భూతులు!
కొళాయిలదగ్గర తగవులు.
ఊరిలో ఎవరితోనూ సమాధానంగా ఉండవు!!
సరికదా దేవుని పరువుపోయేలా తగవులాడుతావు!!
అందుకే యాకోబు పత్రికలో
1:26 లో “ఎవడైననూ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తానూ భక్తి గలవాడినని అనుకొంటే వాని
భక్తి వ్యర్ధము” అని వ్రాయబడింది.
అందుకే యేసయ్య అంటున్నారు –
శపింపబడిన వారలారా!
అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచిన అగ్నిగుండములోనికి పొండి! ఎందుకంటే నేను ఆకలిగొంటిని-
భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని-
దాహమీయలేదు, పరదేసినై ఉంటిని-
నన్ను చేర్చుకోలేదు,
రోగినైయుంటిని-
పరామర్శించలేదు,...
అందుకు ప్రభువా నీవెప్పుడు ఆకలిగొంటివి?
దప్పిగొంటివి? ........
దేవుడన్నారు అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా
చేయలేదు.
అంటే వారికి సహాయం చేస్తే దేవునికి చేసినట్టే!!!!
కాబట్టి నీవు చేసేది భక్తా?
వేషధారణా? సరిచూసుకో!
సరిచేసుకో! 1 యోహాను 3:17
లో ఈలోకపు జీవనోపాధిగలవాడవై ఉండి,
తన సహోదరునికి లేమి కలిగియుండుట చూచియు,
అతనియెడల కనికరం చూపనివానియందు దేవుని ప్రేమ ఏలాగునిలుచును?
దేవుని ప్రేమ లేక పొతే నీవు వ్యర్దుడవే సుమా!!!
(ఇంకాఉంది)
*దైవజనుడా..... –౩7వ భాగం*
*చేయదగినవి-19*
1తిమోతి 6:11..
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము
(వెంటాడుము).
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము. గతబాగం నుండి భక్తి కోసం ధ్యానం చేసుకుంటున్నాము.
(గత భాగం తరువాయి)
సరే నీవు భక్తి చేస్తున్నాను అంటున్నావు కదా!
ఆ భక్తినే ఒకసారి ఆలోచిద్దాం!
*1.ప్రార్ధన*:-
ప్రార్ధన ఎలా చేస్తున్నావు?
అస్తమాను ప్రభువా నాకు అది ఇచ్చేయ్! ఇది ఇచ్చేయ్!
నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చేయ్!
నా కోడలికి గర్భఫలం ఇచ్చేయ్!
నాకు ఇల్లు ఇచ్చేయ్,
కారు ఇచ్చేయ్,
ఇంకా చాలా రకాలైన కోరికలు లిస్టు ఇస్తున్నావ్
(భర్త మార్కెట్ కి వెళ్ళినప్పుడు భార్య సరుకులు లిస్టు ఇచ్చినట్లు).
లేకపొతే దేవుణ్ణి కాపలాదారులాగా ప్రభువా కాపలాకాయమని
అడుగుతున్నావ్!
రోగం బాగుచేయ్యమని అడుగుతున్నావ్!
గాని ప్రభువా నాకిచ్చిన ప్రతీ ఈవికోసం నీకు వందనాలు అని దేవునికి స్తుతి
చెయ్యడం లేదు.
ప్రార్ధన అంటే దేవునితో సంభాషించుట, దేవునికి చెప్పడం-
తిరిగి జవాబుపొందడం.
దేవుడు తిరిగి జవాబిచ్చేవరకు ప్రార్ధనలో కనిపెడుతున్నావా?!
•దేవుడు నీతండ్రి-
తండ్రితో మాట్లాడినట్లు మాట్లాడు,
తండ్రికివ్వవలసిన గౌరవం ఇవ్వు
•దేవుడు నీరాజు-
రాజుతో జాగ్రత్తగా మాట్లాడు
•దేవుడు నీ స్నేహితుడు-
నీకు సంతోషం కలిగిన,
భాదలున్నా అన్నీ ఆయనతో చెప్పేసుకో!!
•దేవుడు నీకు తల్లిలాంటి వారు –
నీకు గురువు-
ఆయననుండి నేర్చుకో!!
*2. ఉపవాసం*:-
అనగా దేవునితో సహవాసం
సహవాసం చేస్తున్నావా?
వేషదారుల్లాగా అందరికీ కనబడాలని ఉపవాసం చేస్తున్నావా? మత్తయి 6:16
యెషయా
58: 5 అట్టి ఉపవాసము నాకనుకూలమా? .....
ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండట
ఉపవాసమా? అట్టిది నాకు ప్రీతికరమా?
అని అడుగుచున్నారు.
6,7,8 వచనాలు దేవునికి కావాల్సిన భక్తి,
ఉపవాసం ఏమిటో సెలవిచ్చారు.
కాబట్టి ఎలా ఉపవాసం చేస్తున్నావు? నిజమైన ఉపవాసమా?
ఆచారపరమైన ఉపవాసమా?
దేవుడు చెప్ప్పిన భక్తా?
నీ సొంత భక్తా?
నీ సంఘంలో చేసే –
ఆచరించే కట్టుబాట్లు –
ఆరాధనా క్రమం మాత్రమే భక్తా?
ఆలోచించుకో!!
*3. భాషలు*:-
భాషలు మాట్లాడటం తప్పులేదు.
అవి కావాలి.
కాని భాషలే భక్తి కాదు.
అవి అంతరంగపురుషుడు బలపరచబడటానికే మాత్రమే ఉపయోగపడతాయి. ఉదా:-
ఒక చంటిబిడ్డకు హార్లిక్స్,
బూస్ట్ మాత్రమే ఇస్తే సరిపోదు,
సరియైన ఆహారం,
పోషక పదార్దాలు ఇవ్వాలి లేకపోతే పిల్లవాడు నీరసించిపోతాడు. అలాగే ప్రార్ధన,
ఉపవాసం వీటితో పాటు –
మంచి కార్యాలు చెయ్యాలి.
అప్పుడే దానిని భక్తి అంటారు బైబిల్ ప్రకారం.
అపోస్తులుల కార్యంలో కొర్నేలు గారిదగ్గరకు దేవుని దూత వచ్చి
ఏమంటున్నాడు? కొర్నేలి!
నీవు చేసిన ప్రార్ధన,
ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి.
అంటే ప్రార్ధనతో పాటు ధర్మకార్యాలు మాత్రమే దేవునిని చేరుకొంటాయి
కాబట్టి తప్పకుండా ధర్మకార్యాలు కావాలి. లేకపోతే నీ భక్తి వ్యర్ధం!
అసలు భక్తికి మూలం ఏమిటి? 1.
దేవుడంటే భయము , 2.
ప్రేమ కలిగియుండటం.
1.దేవుడంటే భయం ఉంటే పాపం చెయ్యవు.
దానినే భక్తి నిర్వచనంలో –
ఇహలోక మాలిన్యం తనకంటకుండా చూసుకోవడం!
భయముంటే అబద్దాలు చెప్పవు. దొంగతనం చేయవు.
వ్యభిచారం చేయవు.
పొరుగువాని భార్యను/భర్తను ఆశించవు.
ఇవి చేస్తున్నావు అంటే దేవుడంటే నీకు భయం లేదన్న మాట!
2. ప్రేమ:-
ప్రేమ ఉంటే పొరుగు వానిని ప్రేమిస్తావు.
స్నేహితునికి సహాయం చేస్తావు.
అత్తమామలని,
తల్లిదండ్రులని బాగాచూసుకొంటావు.
సమాధానంగా ఉంటావు.
మరి నీవు ఏం చేస్తున్నావ్? యేసయ్య అంటున్నారు మత్తయి 7:22-23
ప్రభువా నీనామమున ప్రవచింపలేదా?
దయ్యములు వెళ్ళగొట్టలేదా?
అనేక అద్భుతములు చేయలేదా?
అని చెప్పుదురు;
అప్పుడు నేను అక్రమము చేయు వారలారా!
నాయొద్ద నుండి తొలగిపొండని మీతో చెప్పుదును.
ఆలోచించుకో!
దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా మీ సొంత భక్తి చేస్తే –
అక్రమముచేయు వారలారా అంటే నీ ప్రార్ధన,
ఉపవాసం, భాషలు,
ప్రవచనాలు అన్నీ వ్యర్ధమే కదా!
పౌలుగారు ఏమంటున్నారు 1
కొరింథీ 13
వ అధ్యాయం మనుష్యుల భాషలతోను
దేవదూతల భాషలతోను మాట్లాడినా,
ప్రవచించే వరం కలిగినా,
కొండలు పెకలించే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా,
బీదలపోషణ కొరకు నా ఆస్తిఅంతా ఇచ్చేసినా ప్రేమలేని వాడనైతే నేను
వ్యర్దుడను.
దేవునిచే నేను నిన్ను ఎరుగను అనే స్తితికి చేరుకొంటావు జాగ్రత్త!
*ఒక విషయం చెప్పనా?
యాకోబు పత్రిక 1:27
ప్రకారం, యెషయా 58
ప్రకారం పేదలకు సహాయం చెయ్యడం,
ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం,
బందీఖానాలో ఉన్నవారిని విడిపించడం చేస్తే భక్తి చేసినట్లే!!!*
*అలా అయితే అవిచేస్తే ప్రార్ధన,
ఉపవాసాలు వద్దా అంటారేమో!!*
*పైనుదహరించిన ధర్మకార్యాలు చేస్తూనే,
వాటితోపాటు దేవునితో సత్సంభందం కోసం నీ అత్మీయాభివృద్ధికోసం, నీ అంతరంగపురుషుడు బలపడేలాగా ప్రార్ధన,
ఉపవాసం, వాక్యధ్యానం,
భాషలు,
సంఘపరిచర్యలో పాల్గొనుట,
క్రమం తప్పకుండా ఆరాధనకు హాజరవడం చేయాలి.
అప్పుడే దేవుడు నిన్ను భళానమ్మకమైన మంచిదాసుడా!
అని పిలుస్తారు.*
అంతేకాదు ఇంకా ఏమంటున్నారు యెషయా 58లో అలాచేస్తే నీ వెలుగు వేకువ చుక్కలా ఉదయించును, స్వస్తత నీకు శీఘ్రముగా లభించును,
యెహోవా నిన్ను తృప్తి పరచును,
నిన్ను పోషించును ....
అంటున్నారు.
అలాకాకుండా నీపొరుగువాడు చలికి భాదపడుతుంటే మంటకాచుకో, రగ్గు కప్పుకో,
ఆకలితో ఉంటే ఇంటికివెళ్ళి భోజనం వండుకొని తిను అని చెబితే ప్రయోజనం
ఏముంది? డబ్బులు ఉంటే రగ్గు కొనుక్కోలేరా?
అన్నం వండుకోడానికి సరిపడే ధనం ఉంటే వండుకోలేదా?
ఆరోగ్యం ఉంటే చేసుకోలేదా?
అవి లేకే కదా నిన్ను కోరినది. (యాకోబు పత్రిక
2వ అధ్యాయం చదవండి)
ఆలోచించుకో! సరి చేసుకో!
ప్రియ దైవజనుడా! అక్షరార్ధమైన భక్తి కాకుండా,
వేషధారణ భక్తి కాకుండా,
ప్రజలు మెచ్చుకొంటారనే భక్తి కాకుండా,
నిజమైన దైవిక భక్తి,
బైబిల్ చెప్పిన భక్తి కలిగియుండమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.
దేవుని కృపా సమాధానములు మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్!
*దైవజనుడా.....–౩8వ భాగం*
*చేయదగినవి-20*
1తిమోతి 6:11..
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము
(వెంటాడుము).
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము.
ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశములు లేక హత్తుకోదగిన లేక చేయవలసిన
అంశములు: నీతి, భక్తీ,
విశ్వాసము, ప్రేమ,
ఓర్పు,
సాత్వికము సంపాదించుకోవాలి.
నేటి అంశము: *ఓర్పు!*
ఓర్పుకు మరోపేరు దీర్ఘశాంతము!
పౌలుగారు చెబుతున్నారు-
దైవసేవకునికి/
దైవజనుడికి ఓర్పు ఎంతో అవసరం!
పెద్దల సామెత :
ఓర్చుకుంటే కోడిగుడ్డు దాకడు మాంసం అవుతుంది.
కోడిగుడ్డు దాకడు అనగా పాత్రనిండా మాంసం అవుతుంది మరి ఎలా అవుతుంది? ఆ కోడిగుడ్డును పట్టుపెట్టి,
పిల్లలను చేయించి,
వాటిని ఒక ఆరునెలలు పెంచితే ఆ కోడిగుడ్డు ఇంటిల్లిపాదికీ సరిపోయినంత మాంసం
అవుతుంది.
అలాగే దైవసేవకునికి కూడా ఓర్పు కావాలి అంటున్నారు పౌలుగారు. ఏం?
దైవసేవకునికి ఓర్పు ఎందుకు అవసరం?
కారణం: దైవసేవకునికి/
దైవజనుడికి ఎన్నో రకాలైన ఆటంకాలు,
అవమానాలు కలుగుతాయి.
వాటిని తప్పకుండా ఓర్పుతో ఎదుర్కోవాలి.
అవి సంఘం నుండి కావచ్చు!
అన్యుల నుండి కావచ్చు!
తోటి దైవసేవకులనుండి కావచ్చు!
తన కుటుంబం నుండే కావచ్చు!
చివరకి సాతానునుండి కావచ్చు!
అవి ఎవరినుండి వచ్చినా ఓర్చుకోవాలి!
అప్పుడే సేవ అభివృద్ధి పొందుతుంది!
కొందరు భక్తులు ఎలా ఓర్చుకున్నారో తద్వారా వారి సేవా-పరిచర్య ఎలా వృద్ధిచెందిందో క్లుప్తంగా చూద్దాం!
దేవుని ప్రణాళిక
–
మోషేగారి ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్టు చెరవిముక్తి చెయ్యాలి. అందుకు గాను మొదట 40
సంవత్సరాలు రాజ విద్యలు,
రాజకీయ పరిజ్ఞానంతో శిక్షణ ఇచ్చారు దేవుడు!
అది గడిచాక దానికి పూర్తిగా వ్యతిరేఖమైన శిక్షణ-
పశువులు కాసుకోవడం!
ఈ ట్రైనింగ్లో పశువులను ఎలా కాయాలి,
ప్రక్కనున్న వాటిని కొమ్ములతో పొడిచే పశువులను ఎలా ట్రీట్
చెయ్యాలి, పాలిచ్చేవాటిని ఎలా మేపాలి,
చిన్న పిల్లలను ఎలా మేపాలి?
పశువులు సామాన్యంగా బుద్ధిజ్ఞానాలు లేకుండా ప్రవర్తిస్తాయి కాబట్టి ఎలా
ఓర్చుకోవాలి, ఎలా నడిపించాలి అనే శిక్షణ ఇచ్చారు దేవుడు!
అన్నీ ఓర్చుకున్నారు మోషేగారు.
అప్పుడు అనగా 80
సంవత్సరాల ట్రైనింగ్ అనంతరం నాయకుడిగా,
ప్రవక్తగా దేవుడు వాడుకొన్నారు.
ఇశ్రాయేలు వారికి తిరుగులేని నాయకుడిగా,
ధర్మశాస్త్రం దేవునినుండి తెచ్చి ఇచ్చిన గొప్ప దైవజనుడిగా
మారిపోయారు. ఈస్తితికి రాడానికి 80
సంవత్సరాల కఠోరమైన శిక్షణ-
ఓర్పు ఉంది ఆయనకు!
యోసేపుగారి బాల్యంలో దేవుడు దర్శనరీతిగా మాట్లాడారు—నిన్ను గొప్ప వ్యక్తిగా,
అధికారిగా దేశాన్ని పాలించేవానిగా చేస్తాను అని!
బాల్యంలోనే అమ్మబడ్డాడు బానిసగా!
బానిసగా బ్రతికారు ఆయన!
చివరకు చేయని నేరానికి జైలుకు కూడా వెళ్లారు!
అన్ని భాధలు ఓర్చుకున్నారు,
దేవా ఇంతన్నావ్, అంతన్నావ్!
ఇప్పుడు నన్ను చేయని నేరానికి జైలుపాలు చేశావు అని దేవుణ్ణి
నిందించలేదు! అన్ని బాధలు,
శ్రమలు సహించారు.
ఓర్చుకున్నారు!
చివరకు ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు ఆయన!
బాల్యంలోనే రాజుగా అభిషేకించబడ్డారు దావీదుగారు!
మొదట గొర్రెల కాపరి!
తర్వాత వాయిద్యాలు వాయించే ఉద్యోగం,
రాజుగారి ఆయుధాలు మోసేవాడిగా,
సైన్యాధిపతిగా,
రాజుకి అల్లుడిగా,
కట్టకడకు రాజుగా చక్రవర్తిగా మారారు దావీదుగారు.
తనకు ఎన్నో-
ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు,
ప్రాణాలు పోయే పరిస్థితులు ఎన్నోసార్లు కలిగాయి ఆయనకు. అన్ని తట్టుకొన్నారు,
ఓర్చుకున్నారు.
దేవుణ్ణి స్తుతించారు.
అందుకే చక్రవర్తి కాగలిగారు ఆయన!
ప్రవక్తగా మారారు!
ఎస్తేరు గారు తల్లిదండ్రులను పోగొట్టుకుని పరాయిదేశంలో బానిసగా మరిపోవలసి
వచ్చింది. అన్ని తట్టుకున్నరామే ఆమె!
చివరకు ఆశ్చర్యరీతిగా ఆ దేశానికే కాకుండా 117
దేశాలకు రాణి-
పట్టపురాణి కాగలిగారు ఆమె!
ఇలా ఎంతోమంది విశ్వాస వీరులు ఓర్చుకుని ఘనమైన కార్యాలు చేశారు. ప్రియ దైవజనుడా!
నీలో ఓర్పు ఉందా?
నిరీక్షణ కలదా?
దీర్ఘశాంతము ఉందా?
లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది నీకు!
ఓర్పుకోసం బైబిల్ లో చాలాసార్లు వ్రాయబడింది.
ప్రసంగి
10:4
ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరుగకుండా చేస్తుంది.
రోమా
5:౩ .. శ్రమ ఓర్పు,
ఓర్పు పరీక్షను, ...
కలిగిస్తుంది.
రోమా
12:12...నిరీక్షణ గలవారై సంతోషించుచూ,
శ్రమలయందు ఓర్పు గలవారై, ....
ప్రకటన ౩:10
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు
లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో
(మూలభాషలో- శోధనగడియలో)
నేనును నిన్ను కాపాడెదను.
ప్రకటన 14:12
దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు
ఇందులో కనబడును.
కాబట్టి నీవు కూడా ఓర్చుకోవలసిఉంది.
ఓర్పునే దీర్ఘశాంతము అనికూడా అంటారని చూసుకున్నాం!
కీర్తన 40:1.
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ
ఆలకించెను.
అంతేకాదు సామెతలు 15:18
కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
ఈ ఓర్పుగలవారిని యేసుప్రభులవారు మంచినేల మీద పడిన విత్తనాలతో
పోలుస్తున్నారు. లూకా 8:15 లో
మంచి నేల నుండు
(విత్తనమును పోలిన)
వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో
ఫలించువారు.
కాబట్టి నీవు మంచినేలమీద పడితే ఓర్చుకుంటావు. ఫలిస్తావు.
లూకా
21:19
ప్రకారం అంత్యకాలములో మీ ఓర్పుచేత ప్రాణములు రక్షించుకొంటావు.
ఎఫెసీయులకు 4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ
వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,. .
కొలస్సీ 1:11
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు,
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ
శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, . . .
1థెస్సలొనికయులకు 5: 14
సహోదరులారా,
మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి
బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి,
బలహీనులకు ఊత నియ్యుడి,
అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.. .
2 తిమోతీ 3:10 .
అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా
దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును. .
హెబ్రీ 10:36 .
మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై,
వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
యాకోబుగారు కూడా అంటున్నారు 5:7-8 .
సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి;
చూడుడి;
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము
నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా
కాబట్టి అటువంటి దీర్ఘశాంతము,
ఓర్పు మనందరమూ కలిగియుందుము గాక!
చివరకు యాకోబు
1:4
మీరు సంపూర్ణులు కావాలి అంటే ఓర్పు తన క్రియను జరిగింపనియ్యుడి!
నీవు సంపూర్ణుడిగా ఆత్మీయుడిగా ఉండాలి అంటే ఓర్పు కావాలి!
ప్రియ దైవజనుడా! అటువంటి ఓర్పు నీకుందా?
తనను ఎన్ని భాదలు పెడుతున్నా,
అపహసిస్తున్నా తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని
అడిగిన ఓర్పు క్షమాపణ నీకుందా?
ఒకవేళ లేకపోతే నేడే ఆయన పాదాలు శరణువేడి ఓర్పును పొందుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా.....–౩9వ భాగం*
*చేయదగినవి-21*
1తిమోతి 6:11..
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి(విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా
దించుకొనుటకు ప్రయాసపడుము
(వెంటాడుము).
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము.
ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశములు లేక హత్తుకోదగిన లేక చేయవలసిన
అంశములు: నీతి, భక్తీ,
విశ్వాసము, ప్రేమ,
ఓర్పు,
సాత్వికము సంపాదించుకోవాలి.
నేటి అంశము: *సాత్వికము!*
పౌలుగారు చెబుతున్నారు-
దైవసేవకునికి/
దైవజనుడికి సాత్వికము కావాలి!
సాత్వికము అనగా ఎదుటివాడు తిట్టినా,
అపహసించినా,
కొట్టినా ఓర్చుకుని సహించడం!
సాత్వికం చేతకానితనం ఎంతమాత్రము కాదు!
ఎదుటివారు అది చేతకానితనం అనుకున్నా సహించి నవ్వడం గొప్ప వరం! ఉదాహరణగా:
ఒకడు లేదా నీ భర్త మారుమనస్సు నొందనివాడు,
నిన్ను అకారణంగా తిడుతున్నాడు అనుకో లేక నీవు యేసయ్యను నమ్ముకున్నందుకు
తిడుతున్నాడు అనుకో—నీవు ప్రతీతిట్టుకు దేవునికి స్త్రోత్రం-
దేవుడు నిన్ను దీవించును గాక అంటూ నవ్వుకుంటూ చెబుతున్నావు అనుకో- ఆయనకు ఉంటుంది పిచ్చికోపంతో రగిలిపోతాడు.
నీవు ఇంకా సాత్వికం చూపిస్తే కొన్నిరోజులకు సిగ్గు పడతాడు. అంతేకాదు నీవు సేవా-పరిచర్య చేసేటప్పుడు ఎవరైనా నిన్ను నిందించినా ఇలా వారిమీద తిట్టకుండా
దీవిస్తూ ఉంటే వారికి నిప్పుల కుప్ప మీద వేసినట్లు లెక్క! అదీ సాత్వికము!
ఇంతకీ సాత్వికము కోసం బైబిల్ ఏమి చెబుతుంది?
సాత్వికము అనగా చాలా నెమ్మదస్తుడు,
ఎవరు ఎన్ని మాటలన్నా కోపపడకుండా భరిస్తూ-
పరుషమైన మాటలతో కాకుండా ప్రేమతో జవాబు చెప్పేవారు సాత్వికులు.
సాత్వికము అనే మాట వస్తే మనకు గుర్తుకు వచ్చేది మోషేగారు!
మోషే భూమిమీద నున్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే
certify చేశారు. సంఖ్యా 12:3;
ఈసాత్వికమే ఆయనను నాయకుణ్ణి చేసింది.
ఐగుప్తులో యుద్ధవిన్యాసాలలో ప్రావీణ్యం పొందితే,
మిధ్యాను దేశంలో 40 సం.లు పశువులు- మందలు కాయడం ఎలా అని ట్రైనింగ్ ఇచ్చారు.
పశువులు అన్ని ఒక రకంగా ప్రవర్తించవు.
వాటిని కంట్రోల్ చేయడం ఎలా,
మేపడం ఎలా,
నిర్వహించడం ఎలా అన్నీ నేర్పించారు.
బహుశా ఇదే ఆయనకు సాత్వికము నేర్పించి ఉంటుందని నా ఉద్దేశ్యము!
మండుచున్న పొద ఆయనకు దేవునితో సాంగత్యము నేర్పించింది.
ఈ మూడు అనుభవాలు ఆయనను మహా గొప్పనాయకున్ని చేశాయి!
సాత్వికమును ఉపయోగించి ఆయన దేవుని దృష్టిలో అత్యంత సాత్వికుడు అయ్యారు.
యేసుప్రభులవారు తన కొండమీద ప్రసంగంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నారు.
మత్తయి 5:5;
కాబట్టి సాత్వికమునకు అంత గొప్పశక్తి ఉంది.
యేసయ్య గురుంచి ప్రవక్తలు ముందుగానే చెప్పారు ఆయన సాత్వికుడని! అది మత్తయి 21:5
లో నెరవేరింది.
ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను,
భారవాహక పశువుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని
సీయోను కుమారితో చెప్పుడి అనునది.
అందుకే ఆయనను అన్ని చిత్రహింసలు పెట్టినా, హింసించినా, గేలిచేసినా,
అవమానపరచినా సాత్వికుడై—తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని మన
పక్షముగా దేవుని దగ్గర క్షమాపణ అడిగి, మనకు క్షమాభిక్ష పెట్టారు.
అందుకే ఆయన మనందరికీ గురువు అయ్యారు.
ఆయన సాత్వికుడు కాబట్టి మనము కూడా సాత్వికులమై ఉండాలి,
2 సమూయేలు 22:36
నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
అదేమాట కీర్తనాకారుడు కూడా అంటున్నారు 18:35లో.
నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ
సాత్వికము నన్ను గొప్పచేసెను.
చూసారా!
ఎవరైతే సాత్వికముగా ఉంటారో వారిని దేవుడు గొప్పచేస్తారు.
గర్వించిన వారిని నేలపడగొట్టి దీనులను పైకి లేపుతారు.
లూకా 1:51-53;
అంతేకాకుండా గలతీ 5:22
లో గల ఆత్మఫలములో ఇది కూడా ఒక భాగము!
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము,
విశ్వాసము, *సాత్వికము*,
ఆశానిగ్రహము.
పౌలుగారికి ఎంతో నచ్చినది ఈ సాత్వికము.
అందుకే 2 కొరింథీ 10:1
లో
మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు,
పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును
వేడుకొనుచున్నాను. అంటున్నారు.
చూశారా పౌలుగారి సాత్వికము.
గలతీ
6:1లో ఎవరైనా అతిక్రమము చేస్తే వారితో సాత్వికముగా ప్రవర్తించి తిరిగి వారిని
దేవుని దారిలోనికి తీసుకుని రావాలి అని చెబుతున్నారు.
ఎఫెసీయులకు
4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ
వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . .
ఫిలిప్పీయులకు
4: 5
మీ సహనమును
(లేక,మృదుత్వమును/
సాత్వికమును)
సకల జనులకు తెలియబడనియ్యుడి.
ప్రభువు సమీపముగా ఉన్నాడు.
2 తిమోతీ 2:25
లో ఎదురించేవారిని సాత్వికముతో సరిదిద్దాలి అంటున్నారు,
తీతుకు
3:2
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు,
మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు,
ఎవనిని దూషింపక,
జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు,
వారికి జ్ఞాపకము చేయుము.
1 పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై,
మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని
సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా
ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;
కాబట్టి ప్రియ దైవజనుడా!
క్రీస్తుయేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండాలని దేవునిపేరిట మనవి
చేస్తున్నాను.
ఇది విశ్వాసులకు/
దైవజనులకు ఉండవలసిన మంచి లక్షణాలలో ఉత్తమమైనది *సాత్వికము*
కాబట్టి అట్టి సాత్వికమును అలవరచుకొని దేవునికి ఇష్టులుగా ఉందాం!
దేవునిచే ఘనపరచ బడుదాం!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దైవజనుడా..... –40వ భాగం*
*చేయదగినవి-23*
1తిమోతి 6:12..
విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము.
దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు
ఒప్పుకొంటివి.
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము.
ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశములు లేక హత్తుకోదగిన లేక చేయవలసిన
అంశములు: విశ్వాస సంభంధమైన మంచిపోరాటం పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము!
ప్రియులారా!
పౌలుగారు ఎల్లప్పుడూ పోరాటము అంటూ ఉంటారు.
ఇంతకీ ఏ పోరాటం?
ఆ పోరాటం ఈలోక సంభంధమైన పోరాటం కాదు! ఈ భూలోకానికి వచ్చిన ప్రతీవాడు పోరాటం చేస్తున్నాడు.
అది ఆత్మీయపోరాటం!
ఈ పోరాటంలో మనకు శత్రువు సాతాను,
లోకం, పాపం!
ఈ అడ్డంకులను దాటుకుని ఈ ఆత్మీయ పోరాటంలో ఆగిపోక సాగిపోతూ మన గమ్యము అనగా
పరలోకాన్ని చేరుకోవాలి! రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఈ పోరాటంలో ఉన్నాడు!
అయితే ఆ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు అనేదే ఇక్కడ సమస్య!
ఒక వీరుడిలా పౌరుషంగా పోరాడుతున్నావా లేక యుద్ధంలో ఓడిపోయి చతికిల
బడిపోయావా?
అనగా సాతాను గాడు పన్నే తంత్రాలలో పడి చిత్తుచిత్తుగా ఓడిపోయావా?
సాతాను గాడి చేతిలో ఓడి ఊడగోట్టిన మంచం కోడిలా ఒక మూలాన
ఏడుస్తున్నావా?
లేక యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం అని తెలిసి చావుకైనా తెగించి ముందుకే
సాగిపోతున్నావా?
1 కొరింథీయులకు 9:24,25
24.
పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము
పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.
25.
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును,
మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.
యాకోబు
4: 1
మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
అయితే ఇక్కడ పౌలుగారు తిమోతిగారికి ఉత్తరం వ్రాస్తూ మంచి పోరాటం పోరాడు అనడం
లేదు! 2 తిమోతిలో 4:7-8లో మంచి పోరాటం నేను పోరాడాను అంటున్నారు గాని ఇక్కడ విశ్వాస సంభంధమైన
మంచి పోరాటం పోరాడు అంటున్నారు.
అక్కడ అనగా పై వచనంలో కూడా మంచి పోరాటం పోరాడాను అన్న వెంటనే నా పరుగు
తుదముట్టించాను.
అక్కడితో ఆగిపోకుండా విశ్వాసమును కాపాడు కొంటిని అంటున్నారు. అదీ ఆసలు విషయం!
విశ్వాసం కాపాడుకోవడం ముఖ్యం!
దీనినే యాకోబు గారు ఇహలోక మాలిన్యం అంటకుండా ఘటమును కాపాడుకోవాలి
అంటున్నారు.
నీ శీలాన్ని సాక్ష్యాన్ని పోగోట్టుకోక కాపాడుకోవాలి అంటున్నారు.
నేను అలా చేసాను కాబట్టే ఇకమీదట నాకొరకు నీతి కిరీటం ఉంచబడింది
అంటున్నారు.
ప్రియ దైవజనుడా!
నీ పరుగు లేక పోరాటం ఎలా ఉంది?
దేనికోసం నీ పోరాటం? ధనం,
ఆస్తిఅంతస్తుల కోసమా?
లేక విశ్వాస సంభంధమైన మంచిపోరాటమా?
ఎప్పుడైతే నీవు అలా విశ్వాస సంభంధమైన మంచి పోరాటం పోరాడుతావో అప్పుడు నీవు
నిత్యజీవాన్ని చేపట్టగలవు! ఇంకా అంటున్నారు అందుకోసమే నీవు పిలువబడ్డావు!
ప్రియ దైవజనుడా!
నీవుకూడా మంచిపోరాటం పోరాడుటకే పిలువబడ్డావు!
అంతేకాని నీవు ధనం సంపాదించుకోడానికి ఆస్తులు సంపాదించుకోడానికి
ఎట్టిపరిస్తితిలోను పిలువబడలేదు అని గుర్తుకు తెచ్చుకో!
ఒకసారి మనం ఎలిషా గారిని గేహాజిని జ్ఞాపకం చేసుకుందాం!
నయమాను కుష్టు వ్యాధితో దైవజనుడు ఎలీషా వద్దకు వచ్చాడు.
అప్పుడు చివరికి నయమాను స్వస్తత పొందుకుని గురువుగారి దగ్గరకు వచ్చి అయ్యా
దయచేసి ఈ కానుకలు తీసుకోండి అంటే నేను తీసుకోను, నువ్వే ఉంచుకో అని పంపించి వేస్తారు.
అయితే ఇదంతా చూస్తున్న గేహాజి –
గురువుగారికి పెళ్ళాం బిడ్డలు లేరు.
నాకున్నారు కదా,
తీసుకుని నాకివ్వచ్చుగా అని ఆలోచించుకుని,
ఏదైతేనేమి రధం వెనకాల పరిగెత్తి ఏదైనా సంపాదించుకుంటాను అని వెళ్ళి కొంత
సంపాదించుకుని,
కట్టకడకు నయమాను పోగొట్టుకున్న కుష్టువ్యాది ఈ పిల్లపాదిరి
పొందుకున్నాడు.
అయితే ఈ జరిగిన వ్యవహారంలో ఎలీషా గారు చెప్పిన మాటలను ప్రతీ దైవజనుడు
గుర్తుంచుకోవాలి! ఎంతవరకూ? చచ్చేంతవరకు!
2రాజులు 5:25-27
25.
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచి-గేహజీ,
నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు-నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.
26.
అంతట ఎలీషా వానితో-
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా
మనసు నీతోకూడ రాలేదా? *ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?*
27.
కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము
అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట
నుండి బయటికి వెళ్లెను....
ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి: ద్రవ్యమును, వస్త్రములను,
ఒలీవ చెట్ల తోటలను,
ద్రాక్షతోటలను, గొర్రెలను,
ఎడ్లను,
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా???!!!
*నేడు ఇదే ప్రశ్న ప్రతీ దైవజనునికి,
ప్రతీ సేవకునికి,
సేవకురాల్లకు,
సంఘపెద్దలను దేవుడు అడుగుచున్నారు!!
ప్రియ దైవజనుడా/ సంఘకాపరీ/
సేవకుడా/ సేవకురాలా/
విశ్వాసి! నా సేవ చేయమని,
నీకు అప్పగించిన పని అనగా సువార్త చేయమని,
అలా చేస్తూ నీకు అప్పగించిన నీ విశ్వాస పోరాటంలో సాగిపోతూ ఉండమని
చెబితే, నీ విశ్వాస పరుగు /
పోరాటంలో కొనసాగకుండా ఆస్తులు సంపాదించుకోడానికి,
ధనం సంపాదించుకోడానికి,
పేరు ప్రతిష్టలు సంపాదించుకోడానికి
ఇది సమయమా?*
సువార్త పని చేయమని చెబితే నీవు రాజకీయాల వెనుక పరుగెత్తడానికి, షోకులు చెయ్యడానికి ఇది సమయమా?
నీ పొరుగు వాడు,
సంఘవిశ్వాసి నాశనానికి జోగుపడుతూ ఉంటే నీవు TV
సీరియల్ చూడటానికి,
షోకులు చేసుకోవడానికి ఇది సమయమా?
విశ్వాస సంభంధమైన మంచిపోరాటం పోరాడమంటే- లోక సంబంధమైన విషయాలు కోసం ప్రాకులాడుతావేమి?
ఖభాడ్దార్!
గేహాజికి పట్టిన గతే ప్రియ దైవజనుడా నీకు కూడా పట్టగలదు!
దేవుడు చెప్పిన దానిని చెయ్యాలి గాని సాతానుగాడి ఆశలను నెరవేర్చడానికి
పరుగెత్తకూడదు!
గేహాజి పరుగెత్తాడు లోక విషయాల వెనుక కుష్టువ్యాది
సంపాదించుకున్నాడు!
ఒకవేళ ఏ సేవకుడైనా ఇలాంటి లోక సంభంధమైన విషయాల వెనుక పరుగెత్తుతుంటే
గమనించాలి ఆల్రెడీ అతగాడు కుష్టు వ్యాధితో ఉన్నాడు! ఆత్మీయ కుష్టు!
అది కనబడకుండా ఇహలోక సంభంధమైన దేవత అ నేత్రాలకు గ్రుడ్డితనం కలిగించింది
ఈ కుష్టువ్యాదిగ్రస్తులకు!
ప్రియ దైవజనుడా!
పౌలుగారిలాగా మంచి పోరాటం పోరాడు!
భక్తులెందరో ఇలాంటి పోరాటం పోరాడారు!
పరలోకాన్ని పట్టారు.
ఈ పోరాటంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు గాని విశ్వాసాన్ని గాని, పరలోకాన్ని గాని పోగొట్టుకోలేదు!
చిన్నచిన్న కష్టాలకు శోధనలను ఓలిపోయి,
సోలిపోయి నీ పరుగులో బొక్కబోర్లా పడిపోతున్నవేమో!
అంత్యము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్న దేవుని
వాగ్దానాన్ని మరచిపోయావా?
ఎఫెసీ 6:10—18
లో ఒక పోరాటం కోసం వ్రాస్తున్నారు పౌలుగారు.....ఎఫెసీయులకు
6:11,12
11. మీరు అపవాది(అనగా సాతాను)
తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో) కాదు,
గాని ప్రధానులతోను,
అధికారులతోను,
ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
ఇక 1కొరింథీ 9:24-25
లో మరో పోరాటం....
పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము
పొందునని మీకు తెలియదా?
అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును,
మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.
పైన వివరించిన
2తిమోతి 4:7—8
చూసుకుంటే ఇది ఆత్మీయ /
విశ్వాస సంబంధమైన మంచిపోరాటం కోసం చెబుతున్నారు.
ఇంకా 8వ వచనంలో చెబుతున్నారు అది నాకే కాకుండా అనగా ఇలా నాలాగే విశ్వాస సంభందమైన
మంచిపోరాటం పోరాడే ప్రతీవారికి దేవుడు ఇలాగే నీతి కిరీటం ఇస్తారు.
కాబట్టి ప్రియ దైవజనుడా!
నీ పోరాటం దేనికోసం?
మంచి పోరాటమా లేక చెడ్డపోరాటం అనగా లోక విషయాల కోసం పోరాటమా! మంచి పోరాటం పోరాడితే పౌలుగారిలా నిత్య జీవం,
నీతి కిరీటం, జీవ కిరీటం!
చెడ్డ పోరాటం పోరాడితే గేహాజిలా,
దేమాలా నరకం,
కుష్టు తప్పదు జాగ్రత్త!
ఇప్పుడే సరిచేసుకో!
సరిచూసుకో!
అట్టి మంచి పోరాటం ప్రతీ దైవజనునికి దేవుడు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దైవజనుడా..... –41వ భాగం*
*చేయదగినవి-24*
1తిమోతి 6:14..
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను
అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు చేయవలసిన లేక హత్తుకోవలసిన విషయాల కోసం గత కొన్నిరోజులుగా ధ్యానం
చేసున్నాము.
ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశములు లేక హత్తుకోదగిన లేక చేయవలసిన
అంశములు:
మొదటగా నిష్కళంకముగాను, రెండవది అనింద్యముగాను,
మూడవది:
ఈ ఆజ్ఞను గైకొనుము!
ఇక్కడ మూడవదిగా సంభోదించిన ఈ ఆజ్ఞ అనగా 12వ వచనంలో ఇచ్చిన ఆజ్ఞ అనగా విశ్వాస సంబంధమైన మంచిపోరాటము పోరాడు!
ఎంతవరకు యేసుక్రీస్తుప్రభులవారు ప్రత్యక్షం అయ్యేవరకు అనగా ఆయన
రెండవరాకడలో ప్రత్యక్షం అయ్యేవరకు ఈ ఆజ్ఞను అనగా విశ్వాస సంబంధమైన
మంచిపోరాటం పోరాడుతూ ఉండు అంటున్నారు.
ఇక మొదటి అంశము:
దైవజనుడు నిష్కళంకమైన జీవితం జీవించాలి!
బైబిల్ గ్రంధంలో దీనికోసం ఎన్నోసార్లు వ్రాయబడింది.
పౌలుగారు స్త్రీలు ఎలా ఉండాలి,
పురుషులు ఎలా ఉండాలి అనేది చెబుతూ ఎఫెసీ పత్రిక
5:26,27
లో పురుషులు యేసుక్రీస్తు ప్రభులవారు సంఘమును ప్రేమించిన మాదిరిగానే తమ
భార్యలను ప్రేమించాలి అని చెబుతూ ఆ ప్రేమ కళంకమైనా ముడతయైనా లేకుండా
పరిశుద్ధంగా ఉండాలి అంటున్నారు.
అలాగే దైవజనుడు మొదటగా తమ వివాహ జీవితంలో కళంకం అనేది లేకుండా
జీవించాలి. ఇక యాకోబు 1:27
ప్రకారం ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తమ ఘటము అనగా సాక్ష్యము, శీలము కాపాడుకోవాలి!
నిష్కళంకమైన జీవితం జీవించాలి.
అది ఎంత నిష్కళంకముగా ఉండాలంటే తీతుకు పత్రిక 2:7
లో వ్రాసిన విధముగా పరపక్షమందున్నవాడు మీమీద చెడ్డమాటలు కూడా పలకనంత
నిష్కళంకముగా ఉండాలి!
మాటలోనూ ప్రవర్తనలోనూ పనులలోను క్రీస్తును చూపించేవాడుగా ఉండాలి
అంటున్నారు. ప్రియ దైవజనుడా!
నీవు ఎలా ఉంటున్నావు?
నిష్కళంకముగా జీవిస్తున్నావా లేక నీ ఊహలలోను,
తలంపులలోను,
ప్రవర్తనలోనూ కళంకముగా జీవిస్తున్నావా?
జాగ్రత్త! ప్రకటన గ్రంధంలో ఇలాంటి కళంకం ఉన్నవారు పరలోక రాజ్యం దరిచేరరు
అనివ్రాయబడింది. ప్రకటన 21:7; 22:15;
1కొరింథీ 6:9—10;
చూడండి పౌలుగారు అధ్యక్షుడు ఎలా ఉండాలో చెబుతూ అతడు నిందారహితుడు
గాను.....స్వస్తబుద్ధిగలవాడు గాను.....సంపూర్ణమాన్యత గలవాడుగా ఉండాలని చెబుతున్నారు. అపోస్తలుల కార్యములు 20:28
ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి అధ్యక్షులుగా... అంటున్నారు కాబట్టి ప్రతీ దైవజనుడు,
కాపరీ ఇలా నిందరహితముగా అనింద్యముగా ఉండాలి!
ఇక్కడ కొందరు అనొచ్చు యవ్వనస్తుడు తప్పక తొట్రిల్లుదురు అని వ్రాయబడినట్లు
ఎప్పుడో ఒకప్పుడు తప్పిపోతూ ఉంటాము కారణం మనం మానవమాత్రులం అనొచ్చు!
అయితే దేవుడు మనం చెయ్యగలిగినదే చెప్పారు గాని మనలను మానవాతీతమైన కార్యాలు
చెయ్యమని చెప్పలేదు! యోసేపుగారు యవ్వనస్తుడు-
ఏ మడత కళంకము లేకుండా పవిత్రమైన జీవితం జీవించగలిగారు. దానియేలు షడ్రక్, మేషాకు,
అబెద్నేగో వీరంతా పవిత్రమైన జీవితం జీవించలేదా?
పేతురుగారు ఇంకా అపోస్తలులు పవిత్రమైన జీవితం జీవించలేదా?
చివరకు మన అందరి రోల్ మోడల్ యేసుక్రీస్తుప్రభులవారు పవిత్రమైన పరిశుద్దమైన
జీవితం జీవించలేదా?
అందుకే కదా నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు
విసిరారు! యోహాను8:46;
మరి వీరంతా నిష్కళంకమైన జీవితం జీవించడం సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం
కాదు??!!
కాబట్టి ఈ ఆజ్ఞను పాటించేటప్పుడు మొదటగా దైవజనుడు నిష్కళంకముగా, నిందారహితుడు ఉండాలి అంటున్నారు.
ఇక రెండవ అంశము: అనింద్యముగా ఉండాలి అనగా నిందారహితుడు!
అనగా ఏ నిందా లేనివాడుగా ఉండాలి!
ప్రియ దైవజనుడా నీవు నిందారహితుడుగా ఉంటున్నావా?
దావీదు గారు అంతగొప్ప భక్తుడు గాని బుక్కావాని తైలములో చచ్చిన ఈగ
పడినట్లు బత్షెబ విషయంలో పాపం చేసినందువలన నిందారహితుడు అనేమాట ఆయనకు
వర్తించకుండా పోయింది.
దేవుని దృష్టిలో కొంతమంది నీతిమంతులు యధార్ధవంతులు నిందారహితులు
ఉన్నారు. ఇది యేహెజ్కేలు గ్రంధం 14లో వ్రాయబడింది: వారు యోబుగారు,
నోవహుగారు, దానియేలు గారు!
ఈ తరంలో నీవే నీతిమంతుడుగా కనబడ్డావు అన్నారు నోవహుగారితో దేవుడు! ఆదికాండం7:1;
అంటే చెడిపోయిన తరంలో కూడా తన ఘటమును కాపాడుకొని నిందా రహితముగా, నీతిమంతుడుగా జీవించారు ఆయన!
యోబుగారి విషయంలో దేవుడే సాతానుతో చాలెంజ్ చేస్తున్నారు: అతడు యధార్దవంతుడును,
నీతిమంతుడును చెడుతనమును అసహ్యించుకున్నవాడు అని దేవుడే సర్టిఫై
చేస్తున్నారు. యోబు 1:8;
ఎంత ధన్యతండి ఆయనది!
దానియేలు గారు జీవితమంతా నిందారహితముగా నీతిమంతుడుగా జీవించినందువలన
శత్రువులకు ఏ విషయంలో ఆయనమీద నింద మోపాలో అర్ధమో కాకపోయినప్పుడు కేవలం
దేవుని విషయంలో తప్ప మరి దేనివిషయంలోను ఆయన మీద నేరం మోపలేము అని
తెలిసికొని రూటు మార్చారు! అంతటి నీతిమంతుడు ఆయన!
మరి ఇలాంటి శ్రేష్టమైన జీవితం నీవు జీవించగలుగుతున్నావా ప్రియ
దైవజనుడా!! దేవునికి కావలసినది ఇలాంటి వారే!
ప్రియ సేవకుడా! దైవజనుడా!
నీవే త్రాగుబోతువు,
వ్యభిచారివి,
భార్యాబిడ్డలను కొట్టేవాడివి,
మోసగాడివి, అబద్దికుడు,
జారుడువు అయితే ఇంకా సేవ ఎలా చెయ్యగలవు??!!
మా ఊరిలో ఇద్దరు పాష్టర్లున్నారు,
వారు ఒక్కొక్కరి దగ్గర లక్షలు లక్షలు అప్పుచేసి జల్సాలకు ఖర్చుచేసి ఇప్పుడు
తీర్చలేని స్తితిలో అందరితోను అవమానాలు పొందుతున్నారు!
అనేకరోజులు ఎదురుచూసి ఇప్పుడు అప్పిచ్చినవారు ఒరేయ్ పాష్టర్ నా
డబ్బులిస్తావా లేదా? నీ దేవుడు ఇలాగే చెప్పాడా?
ఎవడికి పుట్టావ్ రా అని నడిరోడ్డుమీద అడుగుతుంటే ఆ ప్రక్కన వెళ్తున్న మాకు
ఎలా ఉంటుదండి??!! దేవుడు పరువు నీ పరువు పోవడం లేదా?
కాబట్టి ప్రియ దైవజనుడా!
ప్రతీ విషయంలోనూ మాదిరికరమైన జీవితం జీవించాలి తప్ప ఇలాంటి పనికిమాలిన
జీవితం జీవించడానికి దేవునికి ఇష్టం లేదు!
ఏ విషయంలో కూడా పరపక్షమందున్నవారు నీ మీద చెడ్డమాటలు,
నిందలు వేయకుండా మచ్చలేని జీవితం జీవించాలి!
అదే దేవుడు కోరుకుంటున్నారు!
ఒకవేళ నీ బ్రతుకు మారకపోతే నేడే బ్రతుకు మార్చుకుని దేవునితోను, ప్రజలతోను సమాధానంగా జీవించు!
అట్టి కృప ధ్యన్యత ప్రభువు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్! దైవాశీస్సులు!
*దైవజనుడా—42వ భాగం*
*చేయదగినవి-25*
1తిమోతి 6:17.
ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే
నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం:
ధనవంతులుగా మారడానికి ప్రయత్నం చేయవద్దు అని సంఘానికి భోధించు!
ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అలా ధనవంతులవ్వడానికి ప్రయత్నం చేయవద్దు అని
భోధించాలి అంటే మొదట నీవు/
నేను అలా ధనవంతులు కావడానికి ప్రయత్నాలు మానుకుని అప్పుడు
బోధించాలి.
ప్రతీ విషయంలో పౌలుగారు తను మాదిరిగా ఉండి సంఘానికి, తిమోతి,
తీతుగార్లకు బోధించినట్లుగా ముందు మనం ఆచరించి తర్వాత సంఘానికి బోధిస్తే
అప్పుడు వింటారు గాని మనం చేయకుండా పరిసయ్యులు చేసినట్లు చెప్పేవారంగా
ఉంటూ,
చేసేవారముగా ఉండకపోతే యేసుక్రీస్తుప్రభులవారు పరిసయ్యులు శాస్త్రులను
ఖండించినట్లు మనం కూడా సున్నముకొట్టిన సమాధుల వలె ఉంటాము.
బయటకు ఆ సమాధులు ఎంతో శృంగారముగా కనబడినా లోపల కుళ్ళిపోయిన మాంసం, పురుగులు,
ఎముకలు ఉంటాయి.
అలాగే నీ/నా బ్రతుకు ఉంటుంది.
కాబట్టి మాదిరి కరమైన జీవితం జీవించాల్సిన అవుసరం ఎంతైనా ఉంది.
గమనించండి ఈ రోజులలో అనేకమంది దైవసేవకులు దీనిని పాటించకుండా
Prosperity Gospel ప్రకటిస్తూ తమ Property
ని పెంచుకుని,
సేవకులే ధనవంతులు కాడానికి ప్రయత్నం చేస్తున్నారు.
వారి కష్టార్జితముతో దేవుని సేవార్ధమై,
దేవునికి కానుకలు ఇస్తే వీరు విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ విలాసవంతమైన
కార్లలో, బంగళాల్లో ఉంటున్నారు.
ఇది తప్పకుండా శిక్షార్హమైన నేరం!
దీనికి వారు ఇచ్చే కవరింగ్ దేవుని పిల్లలు రాజులు,
రాజభోగంతో జీవించాలి అనియు,
ఇది దేవుని ఆశీర్వాదం అనియు కవరింగ్ ఇస్తున్నారు.
ప్రియ దైవజనుడా!
ఇది బైబిల్ ప్రకారం ఇది తప్పు!
తప్పు! తప్పు!
సరే,
ఇక్కడ పౌలుగారు తిమోతిగారికి ఆజ్ఞాపిస్తూ ధనవంతులు కాడానికి ప్రయత్నం
చేయవద్దు అని సంఘానికి ఎందుకు చెప్పమంటున్నారు?
యోహాను గారు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు కొలదీ అన్ని విషయాలలోనూ అభివృద్ధి
చెందమని వ్రాస్తున్నారు కదా
(3యోహాను 1:2)
అనగా ఆర్ధికంగా కూడా వృద్ధి చెందాలి కదా అని అడగొచ్చు!
అవును దేవుడు మనం అన్నివిషయాలలోనూ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు
అందుకే అన్నియు ధారాళంగా దయచేయు దేవుడు అని వ్రాయబడి ఉంది. అయితే అది క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి,
అంతేకాకుండా దేవుడిచ్చినవి దేవునికి ఖర్చుపెట్టే విధంగా ఉండాలి తప్ప నీ
ఆస్తిని, ప్రాపర్టీ పెంచుకునే విధంగా ఉండకూడదు!
ఆస్తి పెరిగినప్పుడు అవి దయచేసిన దేవునికి ఋణపడి,
కృతజ్ఞత కలిగిఉండాలి తప్ప నీ ప్రేమ,
ఆరాటం,
అభిమానం దేవునిమీద ఉండాలి తప్ప ధనం మీద ఆస్తి మీద వ్యామోహం పెంచుకుని అవి
దయచేసిన దేవుణ్ణి మరచిపోకూడదు!
పౌలుగారు నిరంకుశంగా ఏమీ వ్రాయలేదు!
ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎందుకు ఏమిటి ఎలా అనేది వివరించడం ఆయనకు
అలవాటు! ఇదే 6వ అధ్యాయంలో 9—10,
ఇంకా ఈ 17వ వచనంలో దానికోసం వివరంగా రాస్తున్నారు.
ఇహలోకంలో ధనవంతులు అయిన వారు మొదటగా గర్వం అనేది వారిలో
ప్రవేశిస్తుంది. బైబిల్ లో చెప్పబడింది-
సామెతలు 16: 18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును.
కాబట్టి మనిషిలో గర్వం వచ్చింది అంటే పతనం దగ్గరయ్యింది అని అర్ధం! మీరు పడిపోకూడదు అని పౌలుగారి/
పరిశుద్దాత్ముని ఆశ!
సాతానుగాడు గర్వించి దేవునికంటే ఎత్తైన స్థానంలో ఉండాలి అనుకున్నాడు- ఒక్క తాపుతంతే నరకంలో ఒకమూలన పడ్డాడు. (యెషయా
14:12-15)! ప్రియ సేవకుడా నీవుకూడా అలాగే పడగలవు జాగ్రత్త!
అందుకే అలాంటివి జరుగకూడదు అని రాస్తున్నారు పౌలుగారు!
కాబట్టి ధనం మీద నమ్మిక పెట్టుకోకుండా జీవం గల దేవునిమీదనే నమ్మకం ఉంచాలని
అందరికీ ఆదేశించు అంటున్నారు.
ధనవంతులు గర్వంతో దేవుడంటే అవసరం లేదనే దుష్ట తలంపుకు వచ్చే అవకాశం
ఉంది. ఉదాహరణ:
కీర్తనల గ్రంథము 49:6,11,14
6.
తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి
నేనేల భయపడవలెను?
11.
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము
నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ
పేళ్లు పెట్టుదురు.
14.
వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున
యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో
క్షయమై పోవును. .....;
7౩:౩—12....
7.
క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి
కానవచ్చుచున్నవి
8.
ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
11.
దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
12. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు.
వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
ఇంకా ధనవంతుడైన వెర్రివాడు ఉపమానం చూసుకుందాం.. లూకా సువార్త 12:16,17,18,19,20,21
16.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా
పండెను.
17.
అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని
తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;
18. నా కొట్లు విప్పి,
వాటికంటె గొప్పవాటిని కట్టించి,
అందులో నా ధాన్యమంతటిని,
నా ఆస్తినిసమకూర్చుకొని
19. నా ప్రాణముతోప్రాణమా,
అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము,
త్రాగుము,
సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.
20. అయితే దేవుడువెఱ్ఱివాడా,
యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు;
నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
21.
దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని
చెప్పెను. ....... కాబట్టి ఇలాంటి దురుద్దేశం
, తమ ఆస్తిపాస్తుల మీద నమ్మకం ఉంచకూడదు!
ఇంకా అంటారు ఈ ఆస్తిపాస్తులు అస్తిరమైనవి అంటున్నారు.
అవును ఆస్తిపాస్తులు ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు.
చూడండి ఈ కరోనా వైరస్ వలన కొంతమంది కోటీశ్వరులు మనదేశంలో రోజుకు కొన్నివేల
కోట్లు నష్టపోతున్నారు. వ్యాపారంలో కుభేరులు-
కుదేల్లులై పోయారు.
కాబట్టి అస్తిరమైన వాటిని నమ్మక-
స్తిరముగా ఉండే దేవుని మీదనే ఆశపెట్టుకోమని బోధిస్తున్నారు.
సామెతలు 23:4—5
4.
ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని
విడిచిపెట్టుము.
5.
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు
ధరించి యెగిరిపోవును.
పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును. ...;
ఎన్నోసార్లు చెప్పాను నేను:
మా తండ్రిగారు ఇంకా అనేకమంది దైవజనుల సాక్ష్యాల ఆధారంగా ఏ సేవకుడైనా,
విశ్వాసి అయినా ధనం వెనకాల పరిగెడితే ధనం నీ నుండి పారిపోతుంది.
అయితే సువార్తకోసం సేవాభివృద్ధికోసం పరుగెడితే ధనం నీవెనుక పెంపుడు
కుక్కలా పరుగెత్తుకు వస్తుంది.
28:2౦...
నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.
యాకోబు 5:1—5
1. ఇదిగో ధనవంతులారా,
మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.
2. మీ ధనము చెడిపోయెను;
మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.
3. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి;
వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను
తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి.
4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక,
మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది.
మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో
చొచ్చియున్నవి.
5.
మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను
పోషించుకొంటిరి.
సామెతలు 23:4..
ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని
విడిచిపెట్టుము.
1తిమోతి
6:9—10.
9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను,
ఉరిలోను,
అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు.
అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
10. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము;
కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే
పొడుచుకొనిరి. ......;
హెబ్రీ
13:5....
ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
చివరగా 1 Timothy(మొదటి తిమోతికి) 6:18,19
18.వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము,
రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు,
మేలుచేయువారును,
19.సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును,
తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైయుండవలెనని వారికి ఆజ్ఞాపించుము.
ఇంకా పౌలుగారు అన్ని విషయాలలోను మితంగా ఉండమంటున్నారు అనగా ధనసంపాదన విషయంలో
కూడా మితంగానే ఉండాలి.
ప్రియులారా! గమనించండి:
దేవుడు మనుషులను దేనిని సంపాదించుకోనిచ్చారో దానిని తిరిగి తీసేయగలరు!
దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఇదే శాస్తి మనుష్యులకు!
అయితే దేవుడు తన ప్రజలు పేదరికంలో మ్రగ్గిపోవాలని కోరుకుంటున్నారా? లేదు!
తాను ఇచ్చిన మంచివాటిని వారు అనుభవించాలని,
ఈ అనుభవం తప్పు అని వారు అనుకోకూడదు అని దేవుని కోరిక! ప్రసంగీ 2:24—26.
24. అన్నపానములు పుచ్చుకొనుటకంటెను,
తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకర మైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని.
25.
ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము?
26.
ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని
ఆనందమును అనుగ్రహించును;
అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన
పాపాత్మునికి నిర్ణయించును.
ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది...;
అపో
14:17...
అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు,
ఆహారము ననుగ్రహించుచు,
ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు,
మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా
చెప్పిరి.
2కొరింథీ 9:8
మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన
ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను
విస్తరింపచేయగలడు.
2కోరింథీయులకు 9: 10
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము
దయచేసి విస్తరింపచేసి,
మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధి పొందించును.
ఫిలిప్పీ
4:19.....
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి
అవసరమును తీర్చును.
దేవుడు గుప్పిలి బిగించేవాడు కాదు,
పిసినారి కానేకాదు!
అయితే మన విశ్వాసం, నిరీక్షణ,
ప్రేమ ఆయనమీదనే ఉండాలి గాని ఈ భౌతికమైన,
వాటిమీద ఆశ కలిగి ఉండకూడదు అని దేవుని ఉద్దేశ్యం!
కాబట్టి ప్రియ దైవజనుడా!
ఈ విషయాలు నీవు పాటించు!
అప్పుడు సంఘానికి వివరంగా చెప్పమని పౌలుగారు చెప్పిన మాటను మరోసారి
గుర్తుకుచేస్తున్నాను!
అట్టి కృప మనందరికీ మెండుగా కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా—43వ భాగం*
*చేయదగినవి-26*
1తిమోతి 2:1--3...
1. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి,
నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము,
అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును
2.
రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును
కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
3.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నైయున్నది.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం:
సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి రాజులు,
అధికారులు,
మనుష్యులందరికోసం ప్రార్ధన చెయ్యాలి!
దానికంటే ముందుగా 6:20
లో నీకు అప్పగింపబడిన దానిని కాపాడుము అంటున్నారు దీనికోసం గతభాగాలలో ధ్యానం
చేసుకున్నాం కనుక ముందుకు సాగిపోదాం! ఇంకా 1:18
లో విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం పోరాడుము అంటున్నారు. దీనికోసం కూడా గతభాగాలలో ధ్యానం చేసుకోవడం జరిగింది!
ఇక నేడు మన పాఠ్య భాగానికి వద్దాం!
మనం సంపూర్ణ భక్తికలిగి ఉండాలి అంటున్నారు మొదటగా!
భక్తి అనేది సగం సగం చేసి మానేసేదిగా కాకుండా సంపూర్ణ భక్తికలిగి ఉండాలి
అంటున్నారు.
నేటి రోజులలో అనేకమంది క్రీస్తునందు సగము మరివేరుగాను సగముగా
ఉంటున్నారు.
ఆదివారంనాడు భక్తిపరులుగా సోమవారంనుండి అన్యులకంటే ఘోరంగా
జీవిస్తున్నారు. గుడిలో గుండ్రంగా బయట బల్లపరుపుగా ఉంది జీవితం!
అన్యులమధ్య అన్యులవలె,
క్రైస్తవుల మధ్య క్రైస్తవుల వలె వేషధారణ జీవితం జీవిస్తున్నారు.! ఇది కూడదు అంటున్నారు పౌలుగారు!
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు-
అయితే దేవునికి లేక సాతానుకి,
అయితే దేవునికి లేక సిరికి అనగా ధనము/
లోకానికి దాసులుగా ఉండలేరు అంటున్నారు యేసయ్య!
మత్తయి 6:24;
కాబట్టి ఇలాంటి భక్తి అనగా కొన్ని విషయాలలో దేవునిమాట ఆలకిస్తూ మరికొన్ని
విషయాలలో అనగా పెళ్లి,
గృహాలు కట్టడంలాంటి విషయాలలో అన్యాచారాలు పాటిస్తే దానిని సంపూర్ణ భక్తి
అనరు
– వేషధారణ లేక నామమాత్రపు క్రైస్తవులు అంటారు.
నాభాషలో సగం సచ్చిన క్రైస్తవులు!
విచారం ఏమిటంటే అనేకమంది దైవజనులే దీనినిపోషిస్తూ అంటున్నారు మనం భారతీయులము
కాబట్టి దీనిని ఆచరించాలి! ఛీ!అనడానికి సిగ్గుగా లేదు!
మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి అన్న పరిశుద్దాత్ముని
మాటలు, (అపొ 2:40);
మీరు ఆ దేశస్తులు ఆచారాలు/
అన్యజనుల ఆచారాలు పాటించవద్దు వారుచేసినట్లు మీరు చేయవద్దు అన్న దేవుని ఆజ్ఞ
గుర్తుకు రావడం లేదా? లేవీ 20:23;
సినిమా స్టార్లు చేసే సోకులు,
అన్యులు పాటించే ఆచారాలు!
ఇవన్నీ దేవునికి అసహ్యం!
అవి క్రైస్తవులు ముఖ్యంగా దైవజనులు అసహ్యించుకోవాలి!
అప్పుడే దానిని సంపూర్ణ భక్తి అంటారు.
అలా చేస్తూ యాకోబుగారు (1:27)
చెప్పిన విధవరాల్లకు అనాధలకు సహాయం చేస్తూ ఉండాలి.
అప్పుడు సంపూర్ణ భక్తిగలవారు కాగలరు!
ఇక ఆ తర్వాత మాన్యత కలిగి ఉండాలి!
అందరితో సమాధానంగా ఉండాలి!
అలా ఉంటూ అప్పుడు రాజులకోసం అధికారులు కోసం విజ్ఞాపనప్రార్ధనలు,
యాచనలు అనగా బ్రతిమిలాడి ప్రార్ధన చేయడం ఇంకా కృతజ్ఞతా స్తుతులు
చెల్లిస్తూ ప్రార్ధించడం చెయ్యమని హెచ్చరించు అనడం లేదు—ఓ తిమోతి ఇవి చెయ్యు అని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అంటున్నారు!
ఇది కేవలం పౌలుగారు తిమోతికి ఆజ్ఞాపించిన హెచ్చరికే కాదు- పరిశుద్దాత్ముడు ప్రతీ దైవజనునికి,
విశ్వాసికి ఇస్తున్న హెచ్చరిక!!
ఎందుకు చెయ్యాలి? ౩వ వచనం:
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. అందుకే చెయ్యండి అంటున్నారు.
సరే ఇంతకీ
*ఎవరికోసం ప్రార్ధించాలి?*
నీ కుటుంబం కోసం ఎలాగూ ప్రార్థన చేస్తావు, అయితే ముఖ్యంగా వీరికోసం ప్రార్థన చేయాలి.
*ప్రభుత్వ అధికారుల కొరకు*:
1 తిమోతి 2:1-4
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి,
సుప్రీం కోర్టు,
హై కోర్టు న్యాయ మూర్తులు,
సైన్యాధి పతులు, గవర్నర్లు,
మేయర్లు మరియు ఇతర ప్రభుత్వాధి కారులు కొరకు ప్రార్ధించాలి.
*సంఘ నాయకుల కొరకు*:
సంఘకాపరి, సండేస్కూలు టీచర్స్,
సంఘ పెద్దలు,
పరిచారకులు మొదలైన స్థానికి సంఘ నాయకులకు అనుదినం ప్రార్ధించాలి.
1 థెస్స 5:12,13
మీ సంఘకాపరి ఆరోగ్యాన్ని,, సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి,
కుటుంబాన్ని పాడుచేయడానికి సాతాను తీవ్రంగా ప్రయత్నింస్తుంటాడు. కావున ప్రతీరోజూ ప్రార్థన చేయాలి.
*ఇతర క్రైస్తవ నాయకుల కొరకు*:
సువార్తికులకోసం, బైబిల్ బోధకుల కోసం,
క్రైస్తవ సాహిత్యం కోసం,
క్రైస్తవ రచయితల కోసం,
ఎడిటర్ల కోసం,
బైబిల్ సొసైటీ వంటి ముద్రణాలయాల కోసం,
సువార్త గాయకులు,
సంగీత కళాకారులు, యూత్ లీడర్స్,
చిన్న పిల్లల పరిచర్య చేసే వారి కోసం
*మిషనరీ పరిచర్య కొరకు*:
యేసు క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది వున్నారు. అయితే,
సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన భాద్యత మన మీదుంది.
(మత్తయి 28:18-20)
మనం ఆపని చేయలేకపోయినా, చేసే వారి నిమిత్తం తప్పక ప్రార్ధించాలి.
*ఇతర క్రైస్తవ పరిచర్యలు కొరకు*:
రేడియో, టెలివిజన్,
కర పత్రికల పరిచర్య,
దండయాత్రల పరిచర్య,
సువార్త బృందాలు,
చెరసాల పరిచర్య,
యూత్ పరిచర్య.
*దేవుని నామం కోసం హింసించబడుచున్న వారికోసం*
ఈ చివరి రోజులలో యేసునామం కోసం మన దేశంలోనూ,
విదేశాల్లోనూ ఎంతోమంది ఎన్నోవిధాలుగా బాదపడుతున్నారు,
ఊచకోత కోయబడుచున్నారు,
చిత్రహింసలకు గురౌచున్నారు.
మానభంగాలకు గురౌచున్నారు.
గేలిచేయబడి,
చెరసాలలో మగ్గుచున్నారు.
కొంతమంది ఇవి తట్టుకోలేక కొండలకు పారిపోయి ఆకలిబాదలతో బాదపడుచున్నారు. వారందరికోసం ప్రార్ధించాల్సిన అవుసరము మనకుంది.
*నీ ప్రియమైన వారికోసం*:
వారి రక్షణ, వ్యక్తిగత అవసరాల కొరకు.
*ప్రత్యేకమైన అవసరాల కొరకు*:
టి.వి,
వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి, వరదలు, భూకంపాలు,
అతివృష్టి, అనావృష్టి,
ప్రమాదాలు, వ్యాధులు,
హృదయ విదారకమైన పరిస్థితుల గురించి.
తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక,
నివసించడానికి గృహాలు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్న వారి
నిమిత్తం, సేద్యం చేస్తున్న రైతుల కోసం,
దేశాన్ని కావలి కాస్తున్న సైనికుల కోసం ఇట్లా...
ఇంకా కరోనా వైరస్ కొరకు!
అనేక విషయాలను గురించి ప్రార్ధించాల్సిన బాధ్యత మన మీదుంది.
ఆ భారం నీకుందా?
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*దైవజనుడా—44వ భాగం*
*చేయదగినవి-26*
1తిమోతి 2:1--3...
1. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి,
నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము,
అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును
2.
రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును
కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
3.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నైయున్నది.
(గతభాగం తరువాయి)
యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీటమునకు మధ్య నిలువబడి
*కన్నీరు విడచుచూ* --
యెహోవా నీ జనులయెడల జాలిచేసుకొని అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు
వారిని అవమానమునకు అప్పగింపకుము అని వేడుకోనవలెను. యోవేలు 2:17
ఇది దేవుడే చెబుతున్న మాట!
ఎవరు వేడుకోవాలి? యాజకులు –
పరిచారకులు
*ఎందుకు ప్రార్ధించాలి?
అన్య జనులు దేవుని పిల్లలమైన మన మీద ప్రభుత్వం చేసే పరిస్థితులు
నెలకొన్నాయి. అన్యభోదలు,
తప్పుడు సిద్ధాంతాలు సంఘాన్ని కలవరపెడుతున్నాయి.
• కొందరు యెహోవా సాక్షులమని
• మరికొందరు మోర్మాన్స్ అని
• కొందరు శనివారమే దేవునిని ఆరాధించాలని
• రాకడ వచ్చేసిందని కొందరు
• యేసయ్య మరల మనిషిగా వచ్చారని మరికొందరు
• మరో సంఘ దూత వచ్చాడని –
ఆ సంఘ దూతను అంగీకరించకపోతే పరలోకం లేదని కొందరు
• ఏడు వారాలు మందిరానికి వస్తే చాలని కొందరు
• 40 రోజుల దీక్ష అని మరికొందరు
• అద్భుతాలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ రక్షణ ,
రెండో రాకడ వంటివి భోదించడమే మానేసిన వారు అనేకులు.
• prospirity Gospel పేరుతో వారి prospirity
ని పెంచుకొనే సేవకులు కోకొల్లలు.
ఇట్లా అనేకమైన పరిస్థితుల మధ్య సంఘము క్రమము తప్పింది. వాక్యాన్ని ప్రక్కన బెట్టింది,
దేవునికి మనిషికి మధ్య నానాటికి దూరం పెరిగిపోతుంది.
దాని ఫలితంగా దేవుని ఉగ్రత రగులు కొంటుంది.
సాతానుగాడు డైరెక్ట్ గా సంఘముతో పోరాడి ఓడిపోయి
, క్రైస్తవులనే ఉపయోగించుకొని తప్పుడు సిద్ధాంతాలు ,
అన్య భోదలు,
అనుకూల భోధనలుతో సంఘాన్ని ఓడిస్తున్నాడు.
ఇప్పుడు ప్రార్ధించాల్సిన అవుసరము ఎవరికుంది?
దేవుడే చెప్పారు- మొదట యాజకులు, అనగా సంఘకాపరులు, దైవసేవకులు,
సువార్తికులు, పాష్టర్లు.
రెండవదిగా- సంఘపెద్దలు, lay leaders
అలనాడు దేవుడు ఇశ్రాయేలీయులు మీద కోపగించి వారందరిని నాశనం చేస్తాను
అన్నప్పుడు దైవజనుడైన మోషే
–
దేవునికి ఇశ్రాయేలీయులకి మద్య నిలిచి ఉపవాసంతో కన్నీటితో
బ్రతిమిలాడారు.
ఇశ్రాయేలీయులను క్షమించండి లేదా నాపేరు నీ గ్రంథంలో నుండి తుడిచివేయు మని
బ్రతిమిలాడారు. నిర్గమ 32,33
మరియు ద్వితి 9,10
అధ్యాయాలు
నా జనులలో హతమైనవారి గూర్చి నాకన్ను కన్నీరు ఊటగాను,
నాతల జలమయముగాను చేస్తాను అంటూ దేవునిదగ్గర ఇశ్రాయేలీయుల కోసం విలపించిన
యిర్మియాగారిలా
(యిర్మియా,విలాపవాక్యాలు)
ఈరోజు దైవసేవకులు,పెద్దలు ప్రార్ధించాల్సిన అవుసరం ఉంది.
కాల్చబడిన పట్టణ పునరుద్ధరనకోసం ఉపవాసముండి ప్రార్ధించిన నెహేమ్యా, ఎజ్రా,
దానియేలు గారిలా ప్రార్ధించాల్సిన అవుసరం ఉంది.
నాదేశాన్ని రక్షిస్తావా,
నన్ను చంపుతావా అని దేవుని సన్నిధిలో ఏడ్చి,ఏడ్చి పేగులు బయటకొచ్చి,
చనిపోయి తన దేశాన్నే రక్షించుకొన్న జార్జ్ ముల్లర్ గారిలాంటి భక్తులు
అవుసరం నేడు.
ప్రపంచ పటములోని భారత దేశం మీద తన మోకాళ్ళ నుంచి,
మన దేశ రక్షణకై భారము కలిగి ప్రార్దించారు విదేశీయుడైన విలియం కేరి.
ప్రియ దైవజనుడా! సంఘకాపరీ!
ప్రసంగీకుడా! సంఘపెద్దా!
ఏం చేస్తున్నావ్?
బలిపీటానికి,
మండపానికి మధ్య నిలువబడి *కన్నీటితో* ప్రార్ధించమని దేవుడు సెలవిచ్చారు.
అనగా సంఘానికి-దేవునికి మధ్యలో కన్నీటితో రాయభారం చేయమని,
సంఘాన్ని దేవునితో సమాధానపరచి దేవునితో ఐక్యము చేయమని నీకు సెలవిస్తే ఏం
చేస్తున్నావ్?
మన గురించి, మన వారి గురించి ప్రార్ధనా విజ్ఞాపన చేసే అనుభవం,
రోదించే అనుభవం మనకుందా?
దానియేలు, నెహెమ్యా,
ఎజ్రాల వలే దీన మనస్సు అనే గోనెపట్ట కట్టుకొని,
కన్నీటితో ప్రార్ధించే అనుభవాలను కలిగియుందాం!
తద్వారా, సాతాను చెర నుండి విడిపించ బడదాం!
ఆయన సన్నిధి ప్రసన్నతను అనుభవిద్దాం!
ఆ నిత్య రాజ్యానికి వారసులమవుదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దైవజనుడా—45వ భాగం*
*చేయదగినవి-27*
1తిమోతి 2:8—10
8.
కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై,
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
9.
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి,
తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను
ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10.
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం:
1) పురుషులు కోపమును,
సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చెయ్యాలి;
2). స్త్రీలు అణుకువ,
స్వస్తబుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతో వేసుకోవాలి తప్ప వెలగల
వస్త్రములు గాని బంగారు వెండినగలు ధరించుకోకుండా దైవభక్తిగల స్త్రీలకు
మాదిరిగా సత్క్రియలు అనే అలంకారాలు వేసుకోవాలి!
ఇక్కడ ఇవి దైవజనుల కోసం వ్రాయబడలేదు మొత్తం అందరికోసం వ్రాయబడ్డాయి కదా
అని అనుమానం రావచ్చు! అయితే ఈ దైవజనుడు గాని,
దైవజనురాలు గాని అయితే పురుషుడు లేదా స్త్రీ అంతేకదా!
దైవగ్రంధం వీరిద్దరి కోసమే చెప్పింది.
కాబట్టి ఈదైవజనులు/దైవజనురాలు కూడా ఈ కోవకే వస్తారు కాబట్టి పౌలుగారు దైవజనులకు ఇచ్చిన ఆజ్ఞ
వీరిద్దరికీ చెందుతుంది అందుకే దీనిని క్లుప్తంగా ధ్యానం చేద్దాం! ఇంకా దైవజనులు/
సేవకులు సంఘానికి మాదిరిగా ఉండాలి కాబట్టి మొదట పౌలుగారు చెప్పినవి
దైవజనులు పాటించి, ఆ తర్వాతనే బోధించడం అతి శ్రేష్టం!
ఇక్కడ పౌలుగారు పురుషులు కోపమును,
సంశయమును మానాలి అంటున్నారు.గమనించాలి ప్రియ దైవజనులారా!
వివాహ వ్యవస్థ అనేది భార్యాభర్తల మధ్య నమ్మకం మీదనే ఆధారపడుతుంది. భర్త భార్యను నమ్మాలి,
ఆమె శీలాన్ని శంకించకూడదు!
అలాగే భార్య కూడా భర్తను నమ్మాలి!
అప్పుడే కుటుంబ వ్యవస్థ గాని,
ఆకుటుంభం గాని నిలబడుతుంది.
భార్యమీద భర్త అనుమాన పడినా,
భర్తమీద భార్య అనుమానపడినా కుటుంభం విచ్చిన్నమౌతుంది.
పిల్లలు పాడైపోతారు.
సేవకులే ఇలా తయారయితే సంఘం చితికి పోతుంది!
ఓ సేవకుడా!
నీవు సంఘానికి కేవలం స్త్రీలు మాత్రమే రావడం లేదు,
పురుషులు కూడా వస్తున్నారు కాబట్టి నీ భార్య సంఘానికి తల్లితో సమానం
కాబట్టి అందరితోను మాట్లాడుతుంది. కాబట్టి ఆమె అందంగా ఉంది,
ఎవరితోనైనా అక్రమ సంభంధం పెట్టుకుంటుంది అనే అనుమానం నీకు రాకూడదు. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆమెకు,
ఆ నవ్వించిన వ్యక్తికి లింకు పెట్టకు!
ఇది బైబిల్ ప్రకారం తప్పు!
అలాగే ఓ సేవకురాలా!
మీ సంఘానికి కేవలం పురుషులు మాత్రమే రారు,
స్త్రీలు,
పెళ్ళికాని అమ్మాయిలు వస్తారు.
కాబట్టి నీ భర్తయైన సేవకుడు వారితో కూడా మాట్లాడాలి కాబట్టి ఊరికినే
అనుమాన పడి నీ కాపురాన్ని పాడుచేసుకోకు! అందుకే పౌలుగారు సంశయమును మానివేయాలి అంటున్నారు.
ఇంకా దైవజనుడు/సేవకుడు కోపమును విడిచిపెట్టాలి. కోపము పాపము అని బైబిల్ సెలవిస్తుంది.
ఎవరిమీదనైనా కోపగిస్తే సూర్యాస్తమయంలోగా తిరిగి సమాదాన పడాలి అని బైబిల్
సెలవిస్తుంది. ఎఫెసీయులకు 4: 26
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.
కాబట్టి నీ భార్యను, పిల్లలను క్షమించాలి.
కోపమనే పాపమును విడిచి పెట్టాలి.
కోపపడుడి గాని పాపము చేయకుడి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నీ సంఘస్తుల మీద కూడా కోపపడకూడదు!
వారిని ప్రేమించాలి.
అన్నిగొర్రెలు,
పశువులు ఒకేలాగా ఉండవు,
కాబట్టి నీవు కాపరివి కాబట్టి నీ మందను కూడా జాగ్రత్తగా కోపము లేకుండా
కాయాలి! James(యాకోబు) 1:19,20
19. నా ప్రియ సహోదరులారా,
మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును,
కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.
20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
ఇక తర్వాత మాటలో పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చెయ్యమంటున్నారు! చేతులెత్తి ప్రార్ధన చెయ్యడం అనేది యూదుల ఆచారం!
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు కూడా అనేకసార్లు చేతులెత్తి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చూడగలం! ఉదాహరణ: 5రొట్టెలు, 2చిన్నచేపలు
5000మందికి పంచిపెట్టినప్పుడు!
మత్తయి 14:19; అయితే ఇక్కడ పవిత్రమైన చేతులెత్తమంటున్నారేమిటి పౌలుగారు? ఒకసారి కీర్తన 26:6
చూద్దాం..
నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయు దును.
ఇంకా యెషయా 1:15....
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా
ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
యాకోబు
4:8.....
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును,
పాపులారా,
మీ చేతులను శుభ్రము చేసికొనుడి;
ద్విమనస్కులారా,
మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.
కాబట్టి ఇన్ని రకాలైన పాపాలు హృదయంలో ఉంచుకుని వాటిని విడిచిపెట్టకుండా
పరిశుద్ధం పరిశుద్ధం అని ప్రార్ధన చేస్తే, పాటలు పాడితే దేవుడు వినరు!
అందుకే ముందు వీటిని విడిచిపెట్టి ,
మీ చేతులకు అంటుకున్న పాపం,
రక్తం,
అన్ని కడుగుకుని అప్పుడు పాపములేని చేతులతో,
నిర్దోషమైన చేతులతో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్ధనచేస్తే దేవుడు మీ
ప్రార్ధన అంగీకరిస్తారు! ఇదీ దీని అర్ధం!
కాబట్టి ప్రియ దైవజనుడా! ముందుగా నీలోనున్న పాపములు ఒప్పుకుని,
పవిత్రపరచుకుని చేతులెత్తి ప్రార్ధన చేస్తే దేవుడు గొప్పకార్యములు
చేయగలరు.
ఒకసారి దావీదుగారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం! కీర్తన 141:2 .
నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ
దృష్టికి అంగీకారములగును గాక.
..కాబట్టి ప్రార్ధన అనేది ధూపము,
చేతులెత్తి ప్రార్ధన చెయ్యడం అనేది దేవునికి నైవేధ్యంతో సమానం కాబట్టి ఆ
అర్పణ కూడా పవిత్రమైనదై ఉండాలి.
కాబట్టి ప్రియ దైవజనుడా/
సేవకుడా!
నిర్దోషమైన చేతులెత్తి ప్రార్ధన చేద్దాం!
చేతులు చాపి అనేకమంది ప్రార్ధన చేశారు.
సొలోమోను గారు ప్రార్ధన చేశారు.
దానియేలు గారు ప్రార్ధన చేశారు.
ఇంకా అనేకమంది ప్రార్ధన చేశారు కాబట్టి మనం కూడా చేతులెత్తి అనగా నిర్దోషమైన
చేతులెత్తి ప్రార్ధన చేద్దాం!
గమనించాలి దేవుడు మన ప్రార్ధనలకు జవాబివ్వాలి అంటే మనం ఏ విధమైన పాపము
అంటుకొనని చేతులెత్తి ప్రార్ధన చెయ్యాలి!
అపవిత్రమైన చేతులెత్తి పేరు రావాలని ప్రార్ధన చేస్తున్నారు అంటే దేవుణ్ణి
అవమానించినట్లే అని నా ఉద్దేశ్యం! కాబట్టి పాపము, సణుగులు,
సంశయములు, కోపాలు,
తాపాలు మానేసి పవిత్రమైన చేతులేత్తుదాం!
అట్టి కృప దేవుడు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా—46వ భాగం*
*చేయదగినవి-28*
1తిమోతి 2:8—10
8.
కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై,
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
9.
మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి,
తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను
ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
10.
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం: 1)
పురుషులు కోపమును,
సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చెయ్యాలి; 2). స్త్రీలు అణుకువ,
స్వస్తబుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతో వేసుకోవాలి తప్ప వెలగల
వస్త్రములు గాని బంగారు వెండినగలు ధరించుకోకుండా దైవభక్తిగల స్త్రీలకు
మాదిరిగా సత్క్రియలు అనే అలంకారాలు వేసుకోవాలి!
గతభాగంలో పురుషులు ఎలా ఉండాలో ధ్యానం చేసుకున్నాం!
మరోసారి గుర్తుకుచేస్తున్నాను—ఆ పురుషులలో దైవసేవకులు కూడా ఉన్నారు.
ఈరోజు స్త్రీలు ఎలా ఉండాలి అనేది చూసుకుని తద్వారా దైవసేవకురాళ్ళు ఎలా
ఉండాలో ధ్యానం చేసుకుందాం!
స్త్రీలు అణుకువయు,
స్వస్తబుద్ధిగలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని
....మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకోగూడదు;
ఇది మొదటిది.
సాధారణంగా మన భారతదేశ స్త్రీలకూ వెలగల చీరలు,
రెండవదిగా బంగారునగలు అంటే చాలా ఇష్టం!
దానికోసం ఎంతో ఆరాటపడుతూ భర్తను సాధిస్తూ ఉంటారు!అయితే బైబిల్ సెలవిస్తుంది వెలగల చీరలు ధరించనే కూడదు! ఎందుకు అనేది చివరలో చెబుతాను వాక్యాధారముగా!
కాని దురదృష్టం ఏమిటంటే అనేకులు వెలగల వస్త్రముల వెనుక
పరుగెత్తుచున్నారు,
విచారం ఏమిటంటే దైవసేవకురాళ్ళు చాలా ఎక్కువగా వెలగల బట్టలు
వేసుకుంటున్నారు. ఇది కేవలం స్త్రీలకోసమే చెప్పారా దేవుడు?
పురుషులకు చెప్పలేదా అంటే పురుషులకు కూడా కలిపి చెప్పారు
పరిశుద్ధాత్ముడు!
అనేకమంది సేవకులు నేడు వారు వేసుకునే కోట్లు వేలు,
లక్షలు కూడా ఖర్చుచేస్తున్నారు.
అనేకమంది సేవకులు/
సేవకురాండ్రు నేడు టివీలో గాని,
బహిరంగ సభలలో గాని ప్రసంగం చేసేముందు బ్యూటీ పార్లర్ కి వెళ్లి, సింగారించుకుని ప్రసంగాలు చేస్తున్నారు.
నేనంటాను వీరిలో యెజెబెలు ఆత్మ పనిచేస్తుంది.
ఈ ఆత్మ నాశనానికి దారితీస్తుంది.
గమనించాలి!
పౌలుగారు పెళ్లి చేసుకోలేదు అలాగే అంటారు,
అనవచ్చు,
మరి అదే పరిశుద్ధాత్ముడు పెళ్లి పిల్లలు గల పేతురు గారిద్వారా కూడా అదే
వ్రాయించారు కదా!ఏమీ తేడా లేదు! 1పేతురు ౩:౩--4..
3. జడలు అల్లుకొనుటయు,
బంగారునగలు పెట్టుకొనుటయు,
వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా
ఉండక,
4. సాధువైనట్టియు,
మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు)
మీకు అలంకారముగా ఉండవలెను;
అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. .
కాబట్టి ప్రియ దైవసేవకులారా!
దైవసేవకురాలులారా!
దయచేసి దేవుడు/
బైబిల్ చెప్పినట్లు వెలగల వస్త్రములు వేసుకోవద్దు!
ఇక రెండవదిగా బంగారములతో గాని ముత్యములతో గాని అలంకరించుకోవద్దు! అనగా ఆభరణాలు పెట్టుకోవద్దు!
గమనించాలి కొంతమంది ఆభరణములు ధరించుకోగూడదు అని బైబిల్ లో ఎక్కడుంది అని
అడుగుతున్నారు.
దయచేసి వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ఇది అర్ధం అవుతుంది తప్ప
నిర్గమ కాండంలో దేవుడిచ్చిన పదిఆజ్నల మాదిరిగా నీవు ఆభరణములు పెట్టుకోగూడదు
అని డైరెక్టు ఆజ్నకోసం చూడకూడదు! మరికొంతమంది నన్ను అడిగారు,
ముఖ్యంగా దైవసేవకుల కుమార్తెలు దేవుడు మన బయట అలంకారాలు
పట్టించుకుంటాడా? మన ఆత్మ శుద్ధిని చూస్తాడు తప్ప అంటున్నారు! మరి యెషయా ౩:16—23
లో ఎందుకు పట్టించుకున్నారు దేవుడు?..... Isaiah(యెషయా గ్రంథము) 3:16,17,18,19,20,21,22,23,24,25,26
16.
మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై
మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
17.
కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి
మానమును బయలుపరచును.
18.
ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను
చంద్రవంకలను భూషణములను
19. కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
20.
కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
21. రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
22. ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
23.
చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను
తీసివేయును.
24.
అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా
త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా
గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
25.
ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
26.
పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల
కూర్చుండును.
అందుచేతనే దేవుడు పౌలుగారిని, పేతురుగారిని ఉపయోగించుకుని ఈ మాటలు రాసారు!
విశ్వాసులైన స్త్రీపురుషులు సామాన్యమైన దుస్తులు ధరించి, మర్యాద పూర్వకంగా మెలగాలి అనేది దేవుని ఉద్దేశ్యం!
అంతేతప్ప బిగుతైన బట్టలు ధరించి,
తమ శరీర శౌష్టవం అందరికీ కనబడాలి అని తలంచి వస్త్రధారణ చేస్తే దేవుడు
యెజెబెలును శిక్షించి నట్లు ఈ స్త్రీ-పురుషులను తప్పకుండా శిక్షిస్తారు!
వెలగల బట్టలు వేసుకుని స్టేటస్ సింబల్ అంటే నీకు ఆ స్టేటస్ లేకుండా
చేస్తారు దేవుడు జాగ్రత్త! మరొక సేవకుడంటాడు మనం రారాజు కొడుకులం కుమార్తెలం!
రారాజుల్లాగా రాజకుమారుడులాగా అలంకరించుకోవాలి అంటున్నారు.
దయచేసి దీనికి వాక్యాధారమేదైనా చూపించగలరా ఇలా చెప్పే ఏ
దైవసేవకుడైనా? తగుమాత్రపు వస్త్రములే వేసుకోమన్నారు. తిమోతికి చెబుతూ పౌలుగారు అన్నివిషయాలలోనూ మితంగా ఉండమన్నారు.
అన్ని విషయాలు అనగా వస్త్రధారణ మరియు అలంకరణ కూడా వస్తుంది.
*దైవభక్తిగల స్త్రీలు పురుషులు బంగార నగలు పెట్టుకోగూడదు, ఆభరణములు పెట్టుకోగూడదు!
పురుషులు ఉంగరాలు కూడా ధరించకూడదు!
వెలగల వస్త్రములు ,
వెలగల చీరలు, వెలగల సూట్లు,
బూట్లు వేసుకోగూడదు.
ఎందుకంటే లోకంలో అనేకమంది పేదవారు,
మధ్యతరగతి వారు సరైన తిండిలేక,బట్టలు లేక భాధపడుతున్నారు కదా!
వారికి వీటికి ఖర్చుపెట్టేసొమ్మును ఖర్చుచేసి వారికి అన్నవస్త్రాలు
కలిగించాలి! ఇదే దేవుని ఉద్దేశ్యం!
అందుకే ఈ వెలగల వస్త్రాలు,
వెండిబంగారాల ఆభరణాలు ధరించడం మానేయడం!
దానికి ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తుప్రభులవారు!*
2కొరింథీ 8:9 .... చూడండి
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా?
ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
ఆయన అంత ధనవంతుడు ప్రకాశమానుడై ఉండి కూడా మనకోసం దరిద్రుడై పోయారు. పశువుల శాలలో జన్మించి,
ఎన్నో కష్టాలు పడి,
కాయకష్టం చేసి బ్రతికారు.
నక్కలకుబొరియలు,
ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని నాకు తలవాల్చుకొనుటకు స్థలం లేదు
అన్నారు.మత్తయి 8:20; లూకా 9:58;
చివరకు ఆయన చనిపోయినప్పుడు అద్ది సమాధిలో ఉన్నారు.
ఆయనే అంత దరిద్రుడుగా,
సింపుల్ గా జీవిస్తే మనం కూడా సింపుల్ గా జీవించాల్సిన అవసరం ఉందా
లేదా? ఫిలిప్పీయులకు 2: 7
మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
కాబట్టి యేసయ్య జీవించినట్లే మనం కూడా మనకోసం, మన స్టేటస్ చూపించుకోడానికి,
మన శరీరాస, నేత్రాస,
జీవపుఢంభం నెరవేర్చుకోడానికి కాకుండా దేవునికోసం సమస్తము వదలుకుని ఆయనకోసం
బ్రతక బద్దులమై ఉన్నాము! మత్తయి 10:38—39 ..
38.
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.
39.
తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన
ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. .;
లూకా
14:౩౩...
33.
ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు
కానేరడు. ..;
కాబట్టి వెండిబంగారు ఆభరణాలు,
వెలగల వస్త్రాలమీద పెట్టే ఖర్చు మొదటగా పేదలకు ఖర్చుపెట్టి,
రెండవదిగా పేదలకు అన్యులకు సువార్త ప్రకటించడానికి ఖర్చుపెట్టడం ఎంతో
శ్రేష్టం!
1తిమోతి 6:6—8...
6.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది.
7. మన మీలోకములోనికి ఏమియు తేలేదు,
దీనిలో నుండి ఏమియు తీసికొనిపోలేము.
8.
కాగా అన్నవస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము. .
భూమిమీద కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకోడానికి విశ్వాసులంతా/ దైవజనులు కూడా ప్రయత్నించాలి మత్తయి 6:19—21
19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు;
ఇక్కడ చిమ్మెటయు,
తుప్పును తినివేయును,
దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి;
అచ్చట చిమ్మెటయైనను,
తుప్పైనను దాని తినివేయదు,
దొంగలు కన్నమువేసి దొంగిలరు.
21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
;
అయితే ఏమి ధరించుకోవాలి? అణకువ,స్వస్తబుద్ధి,
ఇంకా దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకూ తగినట్లుగా సత్క్రియలు అనే
ఆభరణములను ధరించుకోవాలి అని హితవు చెబుతున్నారు పౌలుగారు!
చివరిగా నగలు పెట్టుకోవడం దేవునికి వ్యతిరేఖమా అని అడిగితే నా ఉద్దేశంలో
అది దేవునికి వ్యతిరేఖమే! ఎలాగో చెప్పనీయండి!
స్త్రీలు ఎప్పుడూ మరి రిబ్కా కు ముక్కు కమ్మి నగలు ఎందుకిచ్చారు అని
అడుగుతారు తప్ప ఈ పౌలుగారు, పేతురు గారు వ్రాసినది గ్రహించరు,
వీరిద్దరూ బంగారు ఆభరణాలు దరించకూడదు అని వ్రాసారు. ఇక ఆదికాండం .35:1--4..
ప్రకారం ఆభరణాలు పెట్టుకోవడం అనేది దేవుని దృష్టిలో అపవిత్రత!
యాకోబుగారు మిమ్మును మీరు శుద్ధిచేసుకోండి అంటే వారు శుద్ధిచేసుకుని
ఆభరణాలు తీసివేశారు.
అంటే ఆభరణాలు ఉంటే అపవిత్రులు అనిఅర్ధం వస్తుంది కదా!
ఇక నిర్గమకాండం
33:4--6
లో దేవుడు చెబుతున్నారు మీ ఒంటిమీదున్న ఆభరణములు తీసివేయుడి! .Exodus(నిర్గమకాండము) 33:4,5,6
4. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి;
ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.
5.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని
ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా,
మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు
తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
6.
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ....
మరి దేవునికి ఇష్టం లేనివి ఎందుకు వేసుకోవడం!
గమనించండి ఆభరణములు వేసుకుని మొదటగా మీ సోకు ప్రదర్శించకూడదు! మీ మాటలలో చేతలలో దేవున్నే ప్రతిబింభించాలి!
ఇక రెండవదిగా మన భారతదేశంలో పెట్టుకునే ప్రతీ ఆభరణం కూడా ఏదో ఒక
అన్యదేవతారాధన బట్టి వచ్చింది. ప్రతీ ఆభరణం ఒక దేవతకు చెందినది.
అందుకే వేసుకోకూడదు!
మూడవదిగా దేవుడు తన రూపులో మనిషిని చేసుకున్నారు.
అయితే ఈ ఆభరణాలు అనేవి ప్రతీ విగ్రహానికి ఏదో ఒక ఆభరణం ఉంటుంది.
దేవుడు నేను మనిషిని నా రూపులో చేసుకుంటే వీరు విగ్రాహాల మీదనుండే
నగలు
/
ఆభరణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అని దేవుడే అక్కడ ఆభరణాలు
తీసివేయమన్నారు.
అవి వేసుకుంటే దేవుని రూపులో ఉండే మీరు కనబడకుండా మీమీదనున్న విగ్రహాలు
కనిపిస్తాయి! అందుకే ఆభరణాలు పెట్టుకోగూడదు!
గమనించాలి ఆభరణాలు విడచిపెట్టడం వ్యక్తిగత సమర్పణకు సాదృశ్యం కాదుగాని
వ్యక్తిగత పరిశుద్ధతకు నిదర్శనం!
కాబట్టి ప్రియ దైవసేవచేసే స్త్రీలారా! విశ్వాసులారా!
ఇది మిమ్ములను బాధపెడుతుండవచ్చు గాని ఒకసారి సత్యమును గ్రహించాలని, దయచేసి వెండిబంగారాలు పెట్టుకోవద్దనియు,
తగుమాత్రపు వస్త్రములేధరించుకోమని ప్రభువు పేరిట వినయపూర్వకంగా మనవి
చేస్తున్నారు!
దైవాశీస్సులు!
*దైవజనుడా—47వ భాగం*
*చేయదగినవి-29*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం:
అధ్యక్షుడు లేక దైవసేవకుడు/ సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
ప్రియ దైవజనమా!
పై వచనాల ప్రకారం అవి అధ్యక్షులు అనగా సంఘంలో ప్రెసిడెంట్ కోసమే
వ్రాయబడ్డాయి అని అభిప్రాయపడవద్దు!
అవి దైవసేవకులు కోసం వ్రాయబడ్డాయి అని చేయకూడని పనులు ధ్యానం చేసినప్పుడు
చూసుకున్నాం!
ఒకసారి మనం ఈ విషయంలో క్లుప్తంగా లోతుగా ఇక్కడ అధ్యక్షులు అని ఎవరికోసం
వ్రాయబడింది అనేది చూసుకుందాం! ఈ తిమోతి ౩:1
లో ఉన్న అధ్యక్షుడు అనేమాట-
నాయకుడు అనికూడా అర్ధమిస్తుంది!
గ్రీకు పదం ఎపిస్కోపాస్ అనే పదానికి క్రొత్తనిబందనలో ఈ నాయకుడు లేక
అధ్యక్షుడు అని తర్జుమా చేయడం జరిగింది. ఈ మాట కేవలం 5
సార్లు మాత్రమే ఈ క్రొత్త నిబంధనలో ఉపయోగించడం జరిగింది. అపోస్తలుల కార్యములు 20:28;
ఫిలిప్పీ 1:1; 1తిమోతి ౩:2;
తీతు 1:7; 1పేతురు 2:25;
ఈ పదము గ్రీకులో రెండు పదముల కలయిక వలన ఏర్పడింది!
దీని అసలు అర్ధం తిన్నగా తెలుగులోకి తర్జుమా చేస్తే
“విషయాలు చూచుకొనేవాడు”,
కావలి కాసేవాడు”
అని అర్ధం వస్తుంది.
ఉదాహరణ పైన ఇచ్చిన అపో 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన...అధ్యక్షులు
... అనగా సంఘాన్ని కాచేవారు—ఇంకా లోతుగా చెబితే సంఘకాపరి! కాబట్టి ఈ పదం సంఘాల్లో ఉన్న నాయకులు,
సంఘకాపరుల కోసం,
దైవజనుల కోసం వ్రాయబడింది అని గ్రహించాలి.
కేవలం సంఘ ప్రెసిడెంట్ కోసమే అని అపోహపడవద్దు!
అపో 20:17,18; ఫిలిప్పీ 1:1
కూడా చూడండి;
ఇక కావలి కాసేవాడు అనే అర్ధానికి సరిపోయే చాలా రిఫరెన్సులు
మనకున్నాయి. ఉదాహరణ యేహెజ్కేలు గ్రంధం 33
అధ్యాయంలో దేవుడు యేహెజ్కేలుగారితో అంటున్నారు:
నేను నిన్ను ఇశ్రాయేలు జాతికి కావలివానిగా ఉంచాను.
వారికి ఇలాఇలా చెప్పు అని అక్కడ ఆజ్ఞలు ఇస్తున్నారు..Ezekiel(యెహెజ్కేలు) 33:2,3,4,5,6,7,8,9
2. నరపుత్రుడా,
నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుమునేను ఒకానొక
దేశముమీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా
నిర్ణయించిన యెడల
3. అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి,
బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున
4.
ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము
తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది
5.
బాకానాదము విని యును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణ మునకు తానే
ఉత్తరవాది;
ఏలయనగా వాడుజాగ్రత్తపడిన యెడల తనప్రాణమును రక్షించుకొనును.
6. అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు,
బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు,
ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన
దోషమును బట్టి పట్టబడినను,
నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయు దును.
7. నరపుత్రుడా,
నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా
నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను.
8. దుర్మార్గుడా,
నీవు నిశ్చయముగా మర ణము నొందుదువు అని దుర్మార్గునికి నేను
సెలవియ్యగా,
అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా
మాట తెలియజేయని యెడల ఆ దుర్మా ర్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని
అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.
9.
అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక
చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము
నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ...
కాబట్టి ఈ వచనాల ప్రకారం అధ్యక్షుడు అనగా కేవలం ప్రెసిడెంట్ మాత్రమే
కాదు, సంఘాన్ని కాచేవారు,
ఇంకా ఇలా ముందుగానే సంఘాన్ని హెచ్చరించే ప్రవక్తలు కూడా అధ్యక్షులే! మొత్తానికి చూసుకుంటే-
సంఘ పెద్దలు, సంఘకాపరి,
దైవజనులు, సువార్తికులు,
ప్రవక్తలు,
అపోస్తలులు వీరంతా ఈ అధ్యక్షుల కోవలోనికి వస్తారు!
సరే ఇప్పుడు నాయకుని పని చాలా శ్రేష్టమైనది.
బైబిల్ ప్రకారం భూమిమీద నున్న అన్ని పనులలో అతి శ్రేష్టమైన పని ఇది!
ఈ పనిని బాగా జరిగించే వారికి గొప్ప బహుమానం కలుగుతుంది. 1పేతురు 5:1—4
ప్రకారం నాయకుని పని /
అధ్యక్షుని పని చాలా విలువైనది కాబట్టి నాయకునికి/
దైవసేవకునికి/
సంఘపెద్దలకు చాలా మంచి యోగ్యతలు కలిగి ఉండాలి.
ఈ యోగ్యతలను దృష్టిలో పెట్టుకోకుండా,
ఇంకా చెప్పాలంటే తిమోతి పత్రికలలో,
తీతు పత్రికలో,
పేతురు పత్రికలో ఉదాహరించిన యోగ్యతలు అర్హతలు లేకుండా, పొట్టకూటికోసం దేవుని సేవకు వచ్చినా,
గొప్పకోసం,
వారి దగ్గర డబ్బులున్నాయి-వారికి బోలెడు కుటుంబాల సపోర్టు ఉంది అని ఎవరినైతే వారిని సంఘ
పెద్దలుగా,
నాయకులుగా చేస్తే నేడు అనేక సంఘాలలో జరుగుతున్నట్లు గొడవలు, అల్లరులు చివరికి పోలీసుల రంగ ప్రవేశం,
చర్చికి తాళాలు,
ఇంకా సంఘ నాయకులు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు ఉంటాయి!
వాడు గొప్ప కానుకలు ఇస్తున్నాడు అని వాడు వ్యభిచారియైనా, త్రాగుబోతు నైనా తీసుకుని సంఘ ప్రెసిడెంట్,
పెద్దగా చేస్తే సంఘంలో భక్తిపరుడిగా ఫోజిచ్చి,
బయట దేవుని పరువు తీస్తుంటాడు.
కాబట్టి సంఘమా మీరు ఎవరిని నాయకులుగా ఎన్నుకుంటున్నారో ఒకసారి
జాగ్రత్తపడమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!
ఇక సంఘకాపరి కూడా చాలా భాద్యతలు నిర్వర్తించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా
ప్రవర్తించాలి.
వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఈ నాలుగు వచనాలలో వివరంగా వ్రాసి
ఉంది. దీనినే తీతుకు 1:6—9
వరకు కూడా వివరంగా వ్రాయబడిఉంది.
ఈ దైవజనుడా శీర్షిక మొదటినుండి చెబుతున్నాను అనేకమంది దైవసేవకుల ప్రవర్తన
బాగోలేకనే అనేక గ్రామాలలో, పట్టణాలలో దేవుని పరువుపోయింది/
పోతుంది.
దైవసేవకుడు తన శీలాన్ని లేక సాక్ష్యాన్ని/
ఘటాన్ని మలినం కాకుండా కాపాడుకోవాలి!
సాక్ష్యాన్ని/
శీలాన్ని పోగొట్టుకున్న దైవసేవకుడు చచ్చిన శవంతో సమానం!
బయట ప్రాంతాలలో ఎంత గొప్పగా ప్రసంగాలు చేసిన సొంత గ్రామంలో/ సొంత ఇంటిలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే వీడా ,
వీడి బ్రతుకు మనకు తెలియదా అంటారు.
కాబట్టి ప్రియ దైవజనులారా!
సంఘకాపరులారా! సంఘ పెద్దలారా!
ప్రెసిడెంట్ లారా!
మీ సాక్ష్యాన్ని, శీలాన్ని,
ఘటాన్ని కాపాడుకోవలసి ఉంది అని ప్రభువుపేరిట గుర్తుకు చేస్తున్నాను!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*దైవజనుడా—48వ భాగం*
*చేయదగినవి-29*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. ఈ రోజు ధ్యానించే అంశం:
అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
(గతభాగం తరువాయి)
1). నాయకుడు/ అధ్యక్షుడు/
దైవసేవకుడు లో ఉండవలసిన మొదటి లక్షణం: *నిందారహితుడు*! దీనినే స్టడీ బైబిలో ఇలా తర్జుమా చేయబడింది!
నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ,
మర్యాదస్థుడూ,
అతిథి సత్కారాలు చేసేవాడూ,
ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి.
గమనించారా నిందకు చోటివ్వనివాడై ఉండాలి!
సంఘంలో ఎవరినైనా నాయకునిగా/
కాపరిగా/
పెద్దగా ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి పవిత్రమైన రీతిలో నీతి నిజాయితీలతో
జీవిస్తున్నవాడు,
నిందారహితుడు అనగా ఎవరు అతని మీద నింద మోపనివాడై ఉండాలి!
ఈ విషయం కోసం పౌలుగారు పరపక్షమందున్నవాడు నీమీద చెడ్డమాటలు పలుకకుండ
జాగ్రత్తపడమని తీతుకు హెచ్చరిస్తున్నారు! తీతుకు 2: 7
పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు
అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.
ఇక ఇదే ౩:7
ప్రకారం అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపల వారు
అనగా అన్యజనులతో కూడా మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి! తీతుకు 1:6—9
లో కూడా పౌలుగారు తీతుకు వ్రాస్తూ మొదటగా నిందారహితుడు అంటూ వ్రాస్తూ మూడవ
పాయింట్ లో ఒకమాట అంటున్నారు:
దుర్వ్యాపారము విషయంలో నేరము మోపబడనివారై ఉండాలి అంటున్నారు! ఇంకా అదే తీతుకు 1:7
లో కూడా దేవుని గృహ నిర్వాహణ విషయములో నిందారహితుడుగా ఉండాలి
అంటున్నారు.
దీనిని కొంచెం ఆగి ఆలోచిస్తే మొదటగా అతడు ఏ విషయంలోనూ నిందారహితుడుగా
ఉండాలి!
ఎవరుకూడా అతనిని వేలెత్తిచూపలేని స్తితిలో నమ్మకంగా ఉండాలి.
అప్పుడే నీవు సంఘానికి పెద్దగాను నాయకుని గాను ఉండాలి!
ఒకవేళ నీ గతం భయంకరమైనదైతే నీవు రక్షించబడ్డాక నీ పరిస్తితి అంతా
మారిపోవాలి! క్రీస్తుయేసు రూపం నీలో ఏర్పడాలి!
క్రీస్తుయేసు ప్రభులవారు నీలో నీ నడవడిలో,
నీమాటలో కనబడాలి!
అప్పుడే నీవు నాయకునిగా కాని,
కాపరిగా,
దైవసేవకునిగా చెయ్యాలి!
పరిపూర్ణ మార్పు లేకుండా దైవసేవకునిగా చేస్తే దేవుని పరువుపోతుంది, నీ పరువుపోతుంది-
అవసరమైతే తన్నులు-
తాపులు తింటావు!
ఇక రెండవ విషయం దేవుని గృహనిర్వాహకుడుగా నిందారహితుడుగా ఉండాలి!
అనగా మొదట నీ వ్యక్తిగత జీవితం విషయంలో ఎవడూ నీమీద నిందమోపకుండా
ఉండాలి! రెండవదిగా నీవు దేవుని పని చేస్తున్నావు,
నాయకుడుగా, అధ్యక్షుడిగా,
దైవసేవకునిగా/
కాపరిగా ఉంటున్నావు కదా అయితే దాని విషయంలో అనగా దేవుని గృహనిర్వహణ
విషయంలో ఎంతో నిందారహితుడుగా ఉండాలి!
ఎవరుకూడా వీడు దేవుని డబ్బులు తినేసేడండి అనేమాట అనకుండా ఉండాలి!
నేటిరోజులలో అనేకులు సంఘానికి ప్రెసిడెంట్ లుగా,
ట్రెజరర్ లుగా ఉంటూ తప్పుడులెక్కలు చూపిస్తూ దేవుని డబ్బులునే
కాజేస్తున్నారు.
ఎవరూ చూడలేదని అనుకుంటున్నావు గాని దేవునికి కళ్లులేవా? ఆయన చూడటం లేదా?
ఎవరూ నన్ను చూడలేదు అని కయీను హేబెలును చంపాడు.
గాని దేవుడు లెక్క అడగలేదా?
ఎవరూ నన్ను చూడటం లేదు అని సమరయ స్త్రీ ఆరుగురితో అక్రమ సంబంధం
పెట్టుకుంది. దేవుడు అడగలేదా?
ఎవరూ చూడలేదు నేను రాజును అని దావీదుగారు బత్షెబతో వ్యభిచారం
చేసారు. దేవుడు అడగలేదా?
నోరులేని గార్ధబాన్ని ఉపయోగించుకుని గొప్ప ప్రవక్త
(బిలాము)కు బుద్ధిచెప్పలేదా?
ఏ ప్రాంతంలో నాబోతు రక్తమును కుక్కలు నాకేయో అదే స్థలంలో నీ
రక్తాన్ని,
నీ పెళ్ళాం రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని దేవుడు
తీర్పుచెప్పలేదా?
దేవుని తీర్పు దేవుని ఇంటినుండే బయలుదేరుతుంది అనేమాట
గుర్తుకులేదా
(1 పేతురు 4:17)
ప్రియ సంఘపెద్డా!
ప్రెసిడెంట్! ట్రెజరర్!
జాగ్రత్త!
జీవముగల దేవుని చేతిలో పడటం భయంకరం అని తెలియదా!
నీవు చేసే ప్రతీక్రియకి,
ప్రతీమాటకు అవి మంచివైనా చెడ్డవైన విమర్శదినమందు లెక్క చెప్పాలి అని
మరచిపోతున్నావా?
ఎవరితో చెలగాటం ఆడినా నాటకాలాడినా చెల్లుతుంది గాని దేవుని దగ్గర నీ
నాటకాలు చెల్లవు అని గుర్తుకు తెచ్చుకో!
లోకం భాషలో దేవుని దగ్గర నీ పప్పులుడకవు అని గుర్తు తెచ్చుకో!
ఇక సేవకుడా/ దైవజనుడా!
నీ బ్రతుకు ఎలా ఉంది?
ఎంతో కాయకష్టం చేసి,
ఇల్లిల్లూ పాచిపనులు చేసి,
ఎండలో కష్టపడి దేవునికి కానుకలు ఇస్తుంటే నీవు ఆ కానుకలు దేనికోసం
ఉపయోగిస్తున్నావు? దేవునికోసమా?
లేక నీ లగ్జరీలకా?
విదేశంలో ఉన్న దేవుణ్ణి ప్రేమించే వారు ఎన్నో కష్టాలు పడి ధనం సంపాదించి
నీకు పేదదేశంలో ఉన్న ప్రజలకు సహాయం చెయ్యమని సువార్త ప్రకటించమని, దిక్కులేని పిల్లలను,
విధవరాల్లను చూడమని ధనం పంపిస్తే నీవు ఏం చేస్తున్నావు? ఖరీదైన కార్లు,
బంగాళాలు కడుతున్నావా?
లేక దైవరాజ్య స్తాపన,
వ్యాప్తి కోసం ఖర్చుచేస్తున్నావా?
దొంగలెక్కలు దొంగ ఉత్తరాలు రాస్తున్నావా లేక నిజంగా ఆ ధనం పైసా పైసా
దేవునికై ఖర్చు చేస్తున్నావా? గమనించాలి!
దేవుడు నీ గృహ నిర్వహణ విషయంలో ఒకరోజు లెక్క అడుగుతారు!
అందుకే ఉదాహరణగా ఉపమానం చెప్పారు యేసుక్రీస్తుప్రభులవారు! లూకా 16:1--8; ఆరోజు,
ఆన్యాయపీటమందు నిలబడినప్పుడు నిన్ను భళానమ్మకమైన మంచి దాసుడా అంటారా లేక
త్రాసులో తూయగా నీవు తక్కువగా కనబడ్డావు అంటారా? జాగ్రత్త!
జీవముగల దేవుని చేతిలో పడటం భయంకరం!
ప్రియ దైవజనుడా! సంఘ పెద్దా!
ఈ లోకంలో నీతిమంతులు,
యధార్దవంతులు (ప్రతివ్రతలు) ఎవరూ లేరు!
ఎవరో ఎప్పుడో తప్పుచేసిన వారే!
ఇప్పుడైనా నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ఒకవేళ నీ మనస్సాక్షి
నీమీద నేరారోపణ చేస్తుంటే ఇప్పుడే దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని,
సంఘం దగ్గర తప్పు ఒప్పుకుని మింగేసిన సొమ్ము తిరిగి ఇచ్చేసి నిజమైన
యదార్ధమైన జీవితం,
మచ్చలేని జీవితం జీవించమని ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా—49వ భాగం*
*చేయదగినవి-30*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
గతభాగంలో దైవజనుడు/
సంఘపెద్ద నిందారహితుడుగా ఉండాలని ధ్యానం చేసుకున్నాం!
ఇక ఈ వచనాలలో దైవసేవకుడు/సంఘపెద్దలకు ఉండవలసిన రెండవ అర్హత ఏమిటంటే అతడు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి!
అనగా ఒకే భార్యను కలిగియుండాలి గాని బహుమంది భార్యలను కలిగిఉండరాదు! తీతుకు 1:6
లో కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు పౌలుగారు!
సంఘపెద్దలకు గాని, సంఘ ప్రెసిడెంట్ కి గాని,
దైవసేవకుడు/సంఘకాపరి/
బోధకుడు వీరెవరైనా ఒకేఒక భార్యను కలిగి ఉండాలి గాని ఒకరికంటే ఎక్కువమంది
భార్యలను కలిగిఉండకూడదు! ఇదీ పౌలుగారు ఇస్తున్న ఆజ్ఞ,
మరియు మార్ఘదర్శకం!
గమనించాలి 2తిమోతి ౩ వ అధ్యాయం ప్రకారం లేఖనం అనేది మానవుల ఇచ్చను బట్టి పుట్టలేదు
గాని దేవుడే/ పరిశుద్ధాత్ముడే వ్రాయించారు!
మనుషులు పరిశుద్ధాత్మ పూర్ణులై వ్రాశారు అని వ్రాయబడింది.
కాబట్టి ఇక్కడ పౌలుగారు తను పెళ్ళిచేసుకోలేదు కాబట్టి ఒక్కరే చాలు
అంతకంటే ఎక్కువ వద్దు అనలేదు!
పరిశుద్ధాత్ముడే పౌలుగారితో అలా వ్రాయించారు లేక పౌలుగారు పరిశుద్ధాత్మ
పూర్ణుడై వ్రాశారు. అందువలన ఎవరైనా సంఘపెద్దలు గాని,
ప్రెసిడెంట్ లు గాని,
దైవసేవకులు గాని,
సంఘకాపరులు గాని,
బోధకులు గాని ఒకరికంటే ఎక్కువమంది బార్యలను కలిగియున్నా, అక్రమసంభందాలు కలిగిఉన్నా వారు ఆ దైవసేవకు /
పరిచర్యకు అనర్హులు!
వారు ఎట్టి పరిస్థితిలోను సంఘపెద్దగా గాని,
సంఘకాపరిగా గాని పనికిరారు!
ఇదీ దేవుని ఆజ్ఞ!
విచారం ఏమిటంటే నేటిదినాలలో కొంతమంది దైవసేవకులకు,
కాపరులకు,
సంఘపెద్దలకు చిన్నిల్లు/
పెద్దిల్లు ఉంటున్నాయి!
మరికొంతమంది సేవకులు సంఘాన్ని స్తాపించి సంఘం చెదిరిపోకుండా కాపలా
ఉంచటానికి, అప్పటికే ఆయనకు వివాహం జరిగినా గాని, ఈ విశ్వాసులలోనే ఒకరిని పెళ్లి చేసుకుని సంఘానికి కాపలా ఉంచుతున్నారు. దీనిని బైబిల్ ఒప్పుకోదు!
వ్యభిచారం అంటారు!
సంఘకాపరే,
సంఘపెద్దనే ఇలా చేస్తే విశ్వాసి పదిమందితో అక్రమ సంభంధం గాని, లేక రెండుమూడు పెళ్ళిళ్ళు చేసుకోరా?ఇది బైబిల్ కి విరుద్ధం కాదా?
గమనించాలి!
పౌలుగారు ఈ లేఖ వ్రాయబోయేసరికి ఆ ప్రాంతాలలో బహుబార్యాత్వం ఉండేది! ఇది అప్పుడు సామాన్యమైన విషయం!
పౌలుగారు సువార్త విని రక్షించబడిన వారిలో కూడా అనేకులు అప్పటికే
ఇద్దరుముగ్గురు భార్యలను కలిగిఉన్నారు.
అందుకే ఇలా ఎక్కువమంది భార్యలు కలవారు సంఘపెద్దలుగా, దైవసేవకులుగా,
సంఘకాపరులుగా పనికిరారు అంటున్నారు!
ఇలా అనడానికి పౌలుగారికి ఏమైనా ఈర్ష్యనా?
ఎందుకంటే ఆయనకు పెళ్ళికాలేదు గనుక వీరికి కూడా ఒక్కరికంటే ఎక్కువ
ఉండకూడదు అనా ఆయన ఉద్దేశ్యం! కానేకాదు!
ఇక్కడ ఆయన ముఖ్య ఉద్దేశ్యం:
నాయకుడు/ సంఘపెద్ద/
సంఘ కాపరి అనేవాడు మాదిరికరమైన జీవితం కలిగి ఉండి,
ప్రజలకు ఆదర్శవంతమైన జీవితం జీవిస్తూ ప్రజలను మంచిమార్గము లోనికి
ప్రభావితం చేసేవాడుగా ఉండాలి గాని నాయకుడే
/
సేవకుడే కామాభిలాషతో కొట్టుకుపోతూ ఇద్దరుముగ్గురు భార్యలు కలిగిఉంటే
అతడు మాదిరికరమైన జీవితం కలవాడు కాదు! అందుకే అలాంటి వారిని సంఘానికి పెద్దలుగా గాని,
దైవసేవకులుగా గాని ఉండటానికి ఒప్పుకోలేదు! ఇదే విషయాన్ని పేతురుగారు దైవజనుడు/
సంఘపెద్ద ఎలా ఉండాలో చెబుతూ 1పేతురు
5:౩ లో మీ క్రింద అనగా మీ భాద్యత క్రింద ఉన్నవారిమీద ప్రభువులుగా ఉండవద్దు
గాని మందకు ఆదర్శంగా లేక మాదిరిగా ఉండండి అంటూ రాస్తున్నారు!
ఇక్కడ ఒకవిషయం చెప్పనీయండి!
పురుషునికి ఒకే భార్య ఉండాలని మొదటినుండి దేవుని ఉద్దేశ్యం!
అంత ధైర్యంగా ఎలా నొక్కివక్కానిస్తున్నావు అని నన్ను అడగొచ్చు! సింపుల్ లాజిక్!
దేవుడు ఆధాముగారికి సాటియైన సహాయం చేయడానికి ఎన్ని ఎముకలు తీసి
చేశారు? ఎంతమంది అవ్వమ్మలను ఇచ్చారు దేవుడు ఆదాముగారికి!
ఒకేఒక అవ్వమ్మను కదా!
అనగా దేవుని ప్రణాళికలో మానవునికి ఒకేఒక్క భార్య ఉండాలి గాని బహుమంది
భార్యలు ఉండకూడదు! ఇదీ దేవుని ఉద్దేశ్యం! (ఒక్క భార్య తోనే నీవు ఏగలేవురా కొడుకా!
ఒక్కరికంటే ఎక్కువ వద్దురా అని దేవుని ఉద్దేశం కాబోలు!).
అయితే నేటిరోజులలో మనదేశం కూడా పోషించే కెపాసిటీ ఉండి, ఇద్దరు భార్యలను సంసారంలో సుఖపెట్టే వాడుగా,
మొదటి భార్యకు అభ్యంతరం లేకపోతే రెండవ వివాహం చేసుకోవచ్చు అని క్రొత్త
ఆర్డినెన్స్లు ఇచ్చినా, ఇది మాత్రం బైబిల్ ఒప్పుకోదు!
బైబిల్ ఒప్పుకొనని పని దైవసేవకుడు/
పెద్ద చేయకూడదు అంతే!
వారు మాదిరిగా ఉండాలి!
ఇక దీనికి మరో లాజిక్ ఉంది, ఏమిటంటే పౌలుగారు నాయకులకు ఉండాల్సిన మరో అర్హత/
లక్షణం ఏమిటంటే బోధింప సమర్ధుడై ఉండాలి!
మరి ఎప్పుడు బోధించగలడు?
తను ముందుగా ఒకే భార్యను కలిగి,
కుటుంబాన్ని తన కంట్రోల్ లో ఉంచుకుంటూ,
కుటుంబం అంత ఐక్యంగా ఉంటూ,
శాంతిసమాధానాలతో జీవిస్తూ మాదిరిగా ఉంటేనే కదా ఇతరులకు బోధించగలడు!
తనే తప్పుడుపనులు చేస్తే ఇతరులకు బోధించ సమర్ధుడు కాలేడు కదా!
అందుకే పౌలుగారు ఒకే భార్యను కలిగి ఉండాలి అని వ్రాస్తున్నారు!
ప్రియ దైవజనుడా! సంఘపెద్డా!
సంఘ ప్రెసిడెంట్!
ఒకవేళ నీకు ఒకరి కంటే ఎక్కువమంది భార్యలు కలిగిఉన్నావా? అయితే మొట్టమొదట నీవు నీ పరిచర్య మానేయ్!
నీవు అర్హుడవు కావు!
రెండవది :
బహుభార్యత్వం బైబిల్ ప్రకారం విరుద్ధం!
కాబట్టి ఒకే భార్యను కలిగిఉండాలి కాబట్టి నీ తప్పును దిద్దుకో! నీ అక్రమ సంభంధాలు,
ఒకరికంటే ఎక్కువ ఉన్న సక్రమసంభందాలు కూడా వదిలేయ్!
దేవునితో సమాధానపడు!
ఈలోకంలో మజాకోసం ఒకరికంటే ఎక్కువమంది పెళ్లిచేసుకున్నావనుకో, లేక అక్రమ సంభంధాలు కలిగిఉన్నావనుకో,
అక్కడ అనగా ఆ నరకంలో నీకు కలిగే మజానే వేరు!
అగ్ని ఆరదు! పురుగు చావదు!
యుగయుగాలు ఆ మండుటగ్నిలో మాడవలసినదే అని మరచిపోకు! ఈలోకంలో మజా కోసం చూసుకుంటే ఆలోకంలో కలిగే మజానే వేరు అని
తెలుసుకో! పనికిమాలిన తెలివితేటలు ప్రదర్శించకు—దావీదు గారికి వందమంది భార్యలు,
సొలోమోనుగారికి వెయ్యిమంది భార్యలు ఉన్నప్పుడు నాకు ఇద్దరుంటే తప్పా
అనకు!
దావీదు గారి సమయంలో దేవుడు సమర్ధించినా అనగా ఏమీ అనకపోయినా, పౌలుగారి సమయం వచ్చేసరికి దేవుని బిడ్డలు,
దేవుని పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి అనే విధివిధానాలు, దిశానిర్దేశాలు వచ్చేసాయి!
వాటి ప్రకారం దేవుడు ఒక్క భార్యనే అనుమతిస్తున్నారు! అది తెలుసుకో!
ఒక్క భార్య కంటే ఎక్కువ ఉంటే నీవు వ్యభిచారం చేస్తున్నట్లే!
విషయాన్ని గ్రహించి తప్పు దిద్దుకొని పరలోకం పొందుకోమని ప్రభువుపేరిట
మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా—50వ భాగం*
*చేయదగినవి-31*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును అయిఉండాలి!
ఈ రెండు పదాలు దాదాపు ఒకే రకమైన భావాలు కలిగి దగ్గర సంభంధం కలిగిఉన్నాయి!
ఈ వచనాలు ఒకసారి స్టడీబైబిల్ నుండి చూసుకుందాం...
1 స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్ఠమైన పని చేయాలని కోరుతున్నాడన్న మాట నమ్మతగినదే.
2 నాయకుడు నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీ పురుషుడై ఉండాలి. ఆశానిగ్రహం గల వాడూ, మనసు అదుపులో ఉంచుకొనే వాడూ,
మర్యాదస్థుడూ,
అతిథి సత్కారాలు చేసేవాడూ,
ఉపదేశించడానికి సమర్థుడూ అయి ఉండాలి.
3 అతడు సాత్వికుడై
ఉండాలి
గాని
ఇతరులను కొట్టేవాడూ, త్రాగుబోతూ , జగడగొండీ,
ధనాపేక్ష గలవాడూ పేరాశగలవాడూ అయి ఉండకూడదు.
4 తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా
నిర్వహించుకొనేవాడై ఉండాలి.....
ఈ వచనాలలో పై రెండు పదాలకు స్టడీబైబిల్ లో ఉపయోగించిన మాటలు మితానుభవుడు అనగా
ఆశానిగ్రహము కలవాడు అనియు,
స్వస్థబుద్ధి గలవాడు అనగా మనస్సును అదుపులో ఉంచుకొనేవాడును అయిఉండాలి అని
అర్ధం ఈయబడ్డాయి. కాబట్టి దైవజనుడు గాని/
సంఘపెద్ద గాని మొదటగా ఆశానిగ్రహము కలిగి ఉండాలి!
అనగా మితానుభవము కలిగిఉండాలి.
అందుకే పౌలుగారు తిమోతికి ఈ ఉత్తరం వ్రాస్తూ అన్ని విషయాలలోనూ మితముగా
ఉండుము అంటున్నారు. 2తిమోతి 4:5;
అనగా అన్ని విషయాలలోనూ నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటూ మాదిరిగా
ప్రవర్తించమంటున్నారు. రెండవదిగా మనస్సును అదుపులో ఉంచుకోమంటున్నారు.
ఈ స్వస్థబుద్ధి అనేమాటను పౌలుగారు రెండుచోట్ల ఉపయోగించారు
1తిమోతి 2:15లో స్త్రీల కోసం వ్రాస్తూ స్త్రీలు మనస్సును అదుపులో ఉంచుకోవాలి
అంటున్నారు.
కారణం స్త్రీలు తొందరగా ఇవి ఉంటే బాగుణ్ణు అది ఉంటే బాగుణ్ణు అని
కోరుకుంటారు.
కోరికలకు అంతులేదు అంటున్నాడు అర్ధశాస్త్రం వ్రాసిన వ్యక్తి! అందుకే మనస్సును కంట్రోల్ లో /
అదుపులో ఉంచుకుని ఖర్చుపెట్టకపోతే అప్పుల ఊభిలో కూరుకుపోయి, మనశ్శాంతిని,
పరువును పోగొట్టుకుంటావు,
చివరకు నీ ఆస్తిని కూడా కోల్పోయేపరిస్తితి వస్తుంది.
హవ్వమ్మగారు మనస్సును కంట్రోల్ లో పెట్టుకోకనే మానవజాతికి ఈ పాపమనే శిక్ష
పడింది. అవునా ఇది నిజమా అని సాతానుగాడు చెబితే,
ఆ పండును చూసిన ఇంతకుముందు చూసినప్పుడు లేనికోరికలు వాడు చెప్పిన తర్వాత
అది ఆహారమునకు మంచిదియు,
చూపునకు అందముగాను,
వివేకమిచ్చు రమ్యమైనదియు అని తెలిసిపోయింది అట!
అనగా శరీరాస, నేత్రాస,
జీవపుడంభము వెంటనే కలిగాయి!
అప్పుడు పేరుకుమాత్రము దేవుడు తినొద్దు అని చెప్పాడు అన్నా,
సాతానుగాడి మాటలకు లొంగిపోయి ఇంత ఖర్మను మనకు తీసుకుని వచ్చారు ఆ
తల్లి!
ఆమె అప్పుడు తన మనస్సును అదుపులో ఉంచుకుంటే ఈభాధ మనకు కలగక పోను! ఏశావు ఆకలితో వచ్చి ఎర్రని వంటకము చూసి ఆకలిని,
మనస్సును అదుపులో ఉంచుకోలేక జ్యేష్టత్వపు హక్కును అమ్మేసుకున్నాడు!
చూడరాని దృశ్యము చూసి మనస్సును అదుపులో ఉంచుకోలేక ఆమెతో పాపం చేశారు
దావీదుగారు! అన్యులు విగ్రహారాధన చేస్తూ,
త్రాగితందనాలు ఆడుతూ విచ్చిలవిడిగా వ్యభిచారం చేస్తున్నారు-
ఇదేదో చాలాబాగుంది మేముకూడా చేస్తాము అని ఇశ్రాయేలీయులు అనేకసార్లు
మనస్సును అదుపులో ఉంచుకోలేక, విగ్రాహారాధన-
పాపాలు చేయడం వలన అనేకసార్లు దేవుని ఉగ్రతకు లోనవ్వడం జరిగింది!
కాబట్టి దేవుని జనులు/ నాయకులు/
పరిచర్య చేసేవారు తప్పకుండా తమనుతాము అదుపులో ఉంచుకోవాలి! తమ కోర్కెలను అదుపులో ఉంచుకోవాలి!
తమ మనస్సును అదుపులో ఉంచుకోవాలి!
తమనోటిని అదుపులో ఉంచుకోవాలి!
గతభాగాలలో చెప్పాను ఒక పాదిరిగారు ఏ ఊరినుండో మా ఊరువచ్చి సేవ
ప్రారంభించి గొంతెమ్మకోరికలకు పోయి,
లగ్జరీలకోసం విశ్వాసులను మధ్యలో ఉంచి అనేకమంది దగ్గర లక్షలు లక్షలు
అప్పుచేసేసాడు.
అప్పులు తీర్చలేక బాధపడుతుంటే ఈ రోజు మా ఊరిలో ఆయన్ను పట్టుకుని ఒరే
పాష్టరు మా డబ్బులు మాకిస్తావా లేదా?
ఎవడికి పుట్టావురా అని బహిరంగంగా పరువుతీస్తుంటే దేవుని పరువు, ఆయన పరువు పోతుంది!
లేనప్పుడు మూసుకుని ఉండాలి తప్ప అంత గొప్పలకు ఎవడు పొమ్మనాడు? ఈరోజు అన్నిమాటలు ఎవడు పడమన్నాడు?
కాబట్టి దైవజనులు/
విశ్వాసులు అందరూ లేనిపోని గొప్పలకు పోయి తిప్పలు పడకూడదు! అందుకే మితానుభవుడు,
స్వస్థబుద్ధి గలవాడు అయిఉండాలి అంటున్నారు పౌలుగారు! మనస్సును అదుపులో ఉంచుకోవాలి,
ఇంకా నాలుకను అదుపులో ఉంచుకోవాలి.
నాలుక అగ్నియే అంటున్నారు పౌలుగారు.... కాబట్టి ప్రసంగాలలో తప్పించి,
మిగాతాచోట్ల సంఘకాపరి గాని,
పెద్దలుగాని,
విశ్వాసులు గాని చాలా మితముగా మాట్లాడాలి. యాకోబు 1:26
26.
ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు
భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. ;
౩:2—10
2.
అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము(తొట్రిల్లుచున్నాము).
ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన (కళ్లెము పెట్టుకొని) శక్తిగలవాడగును.
3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి,
వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా
4. ఓడలను కూడ చూడుడి;
అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను,
ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత
త్రిప్పబడును.
5.
ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును(అతిశయపడును).
ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
6. నాలుక అగ్నియే,
నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము
కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును;
అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు,
అది మరణకరమైన విషముతో నిండినది,
అది నిరర్గళమైన దుష్టత్వమే.
9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము,
దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
10.
ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా,
యీలాగుండకూడదు. ;
అందుకే 1:19—20 లో అంటున్నారు..
19. నా ప్రియ సహోదరులారా,
మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును,
కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.
20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
.....
ఇంకా చివరికి
22.
మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. .
చివరకు యేసయ్య చెప్పినమాట మీరు చెప్పేవారుగా మాత్రము ఉండకుండా వాటిని
చేసేవారుగా ఉండాలి అని పరిసయ్యులను గురుంచి చెప్పినప్పుడు అందరికీ
చెప్పారు!
కాబట్టి ప్రియ దైవజనుడా! సంఘపెద్డా! విశ్వాసి!
దయచేసి నీ కోరికల గుర్రానికి కళ్ళెము వేసి అదుపులో ఉంచుకో!
నీ మనస్సును కోరికలను అదుపులో ఉంచుకుని మితానుభవముకలిగి ప్రవర్తించడానికి
ప్రయత్నించు! కార్లు బంగళాలు, చీరెలు,
బంగారం వెనుక పరుగెత్తకు!
దేవుని సేవ,
పరిశుద్ధాత్మ వరాలు,
ఫలాలు కోసం ప్రాకులాడు!
అప్పుడు ఘనమైన తనసేవలో నిన్ను వాడుకుంటారు ప్రభువు!
నిన్నొక లైట్ హౌస్ లాగ వాడుకొంటారు!అప్పుడు ప్రజలకు నీవో సాక్ష్యముగా ఉండగలవు!
మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!
*దైవజనుడా—51వ భాగం*
*చేయదగినవి-32*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు మర్యాదస్తుడును, అతిధిప్రియుడును,
భోధింపతగినవాడు అయిఉండాలి!
దీనినే తీతుకు పత్రికలో అతిథిప్రియుడును సజ్జనప్రియుడును,
నీతిమంతుడును పవిత్రుడును హితబోధవిషయంలో జనులను హెచ్చరించుటకు సమర్దుడును
అయిఉండాలి అంటున్నారు.
మొదటగా అతిథిప్రియుడు అనగా అతిథులను సన్మానించు వాడు, ఆతిథ్యమిచ్చువాడు అయిఉండాలి!
పరిచర్యలో అనేకమంది వారి గ్రామాలు పట్టణాలు వస్తూ ఉంటారు. లేదా తోటిసేవకులు గాని,
విశ్వాసులు గాని వారి గృహాలను దర్శించినా,
లేదా ఎవరైనా సేవకులు మంచివార్తను/
సువార్తను ప్రకటిస్తూ ఈ దైవజనుడు ఇంటికి వస్తే వారిని సన్మానించి
ఆతిథ్యమిచ్చేవారై ఉండాలి. చాలామంది ఇది మానుకుంటున్నారు.
ముఖ్యంగా పట్టణంలో ఉన్న సేవకులు,
విశ్వాసులు వారికున్న అద్దె ఇంటి పరిమితుల వలన గాని,
లేక ఏదేదో కారణాల వలన వారు మన గృహాలు అనగా పల్లెటూర్లను దర్శించినప్పుడు
మనం వారికి మంచిగా ఆతిథ్యమిచ్చినా
,
మనం వారి పట్టణాలు వెళ్ళినప్పుడు హాయ్ అని చెప్పి బై అంటున్నారు. వారికేదో అర్జంట్ పని ఉన్నట్లు పారిపోతుంటారు.
ఇది తప్పు అని బైబిల్ చెబుతుంది.
ఆతిథ్యము చేయ మరచిపోవద్దు అని బైబిల్ చెబుతుంది.
హెబ్రీ 13:2; రోమా 12:13;
1పేతురు 4:9;
దానికి రెండు ఉదాహరణలు కూడా ఇస్తుంది బైబిల్!
మొదటిది అబ్రాహాముగారు దేవుని దూతలకు ఆతిథ్యమిచ్చుట!
రెండవది లోతుగారు దేవునిదూతలకు ఆతిథ్యమిచ్చుట!
తద్వారా వారు వారికి లోటు ఉన్నవి పొందుకున్నారనియు,
లోతుగారు చావును తీర్పును తప్పించుకున్నట్లు చూస్తున్నాము!
ఈ సందర్భముగా ఇద్దరికోసం చెప్పాలని ఉంది.
మొదటిది నర్సీపట్నంలో సేవచేసి మరణించిన ఆగ్నెస్ అమ్మగారు! ఆమె దైవజనులు జి.
దేవదాసు గారి భార్య!
మేము గాని,
ఏ దైవసేవకుడు గాని,
విశ్వాసి గాని ఏ సమయంలో వెళ్ళినా అర్ధరాత్రివేళ వెళ్ళినా భోజనం చేయకుండా పంపించేవారు కాదు!
ఆమె కోడలు ఆశీర్వాదం అన్నగారి భార్య కూడా అదేబుద్ది నేర్చుకుని అలాగే
దేవుని సేవకులను, విశ్వాసులను సన్మానించేవారు!
ఏదైనా దైవసేవకుడు నర్సీపట్నం వెళ్తే ఆకలేస్తే అమ్మగారి ఇంటికి
వెళ్ళాలి, ఎప్పుడైనా ఆహారం దొరుకుతుంది అనే ఆశ వారిలో ఉండేది.
గమనించాలి ఆ కాలంలో దేవుని సేవకులకు ఆహరం దొరకడమే కష్టం! ఇక మరో వ్యక్తి మా అమ్మగారు మార్తమ్మగారు!
నా చిన్నప్పటినుండి పెద్దయ్యేవరకు నాకు చాలాగుర్తు మా ఇంట్లో ఎప్పుడూ
పొయ్యి వెలుగుతూనే ఉండేది.
అనేకమంది దైవసేవకులు దేవుని బిడ్డలు వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు.
రోజుకు కనీసం అయిదుగురు అయినా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు. నాన్నగారికి ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేదో,
అమ్మగారికి బాగుందో లేదో పట్టించుకునేవారు కాదు!
పాష్ట్రమ్మగారు-
పలానా దైవసేవకుడు వచ్చారు భోజనం వండేయ్ అని చెప్పడమే తెలుసు!
చాలాసార్లు నాకు తెలుసు మా అమ్మగారు తినకుండా అతిథులకు పెట్టిన రోజులు
నాకు తెలుసు!
కొన్నిసార్లు మాకు కూడా లేకుండా వారికే పెట్టేవారు అమ్మగారు!
దాని ఫలితం దేవుని సంపూర్ణ ఆశీర్వాదైశ్వార్యాలు దేవుడు మాకు
దయచేశారు!
ఇలాంటివారు నాకు తెలిసి అనేకచోట్ల ఉన్నారు కాబట్టి మన తెలుగు
రాష్ట్రాలలో దేవుని సేవ ఇంత విస్తారంగా అభివృద్ధి చెందింది.
కాబట్టి దేవుని సేవకుడు తప్పకుండా ఈ ఆతిథ్యం ఇవ్వడం మరచిపోకూడదు!
రెండవది మర్యాదస్తుడు:
అతిథిమర్యాదలు నిజానికి ఎవరు చేయగలరు అంటే మర్యాదస్తులు మాత్రమే
చేయగలరు! ఎవరినైనా మర్యాదగా పలకరిస్తూ,
ఇతరులకు మర్యాదనిస్తూ తను మర్యాదను పొందేవాడు!
పాత సామెత:
నోరు మంచిదైతే ఊరు మంచిదే అట!
అవును నీవు ఇతరులను గౌరవిస్తే-ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు. ఏ సేవకుడైన అందరికి మర్యాదనిస్తూ,
అందరిని మర్యాదతో పలకరిస్తూ ఉంటే బుద్ధి ఉన్న వారు ఎవరూ ఆయనను ఏమీ
అనరు!
వాక్య విరోధులు కూడా ఆయన ఎదురుగా ఏమీ అనడానికి ప్రయత్నం చేయరు!
అయితే ఈ మర్యాద కేవలం పెదాలతో పప్పలు వండినట్లుగా ఉంటూ బ్రతుకు
బాగోలేకపోతే మర్యాద రాదు! మాటలోనూ,
ప్రవర్తనలోనూ అన్నింటిలోను యేసయ్యను చూపిస్తూ అందరితోను మర్యాదగా ఉంటే
మా పల్లెటూళ్ళలో అయితే ఆ దారంటవెళ్తే చాలు లేచి నమస్కారం
చేస్తారు! ఆ వ్యక్తికి అంత గౌరవం ఇస్తారు!
బ్రతుకు బాగోలేకపోతే అనగా సాక్ష్యం పోగొట్టుకుంటే,
శీలాన్ని పోగొట్టుకుంటే వీడా వీడి బ్రతుకు మనకు తెలియదా అంటారు! అప్పుడు నీవు ఎంత మర్యాదగా పిలిచినా వ్యర్ధమే!
కాబట్టి మర్యాద అనేది కేవలం మాటలోనే కాకుండా ప్రవర్తన వలన కూడా
వస్తుంది! కాబట్టి దైవజనుడు/సంఘపెద్ద తప్పకుండ తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుని అందరితోను మర్యాదగా
ప్రవర్తించవలసిన అవసరం ఉంది!
మూడవది: బోధింప తగినవాడు:
దీనికోసం గత భాగాలలో వ్రాయడం జరిగింది!
సేవకులు/పెద్దలు కేవలం చెప్పేవారుగా మాత్రమే ఉండకుండా చేసి చూపించి ఆదర్శంగా
ఉంటూ అందరికి నేర్పించేవారై ఉండాలి! అప్పుడే వారు బోధిస్తే అందరూ వింటారు!
ఎంతో గొప్ప రుచికరమైన ప్రసంగాలు నీవు చేస్తున్నా బ్రతుకు బాగోపోతే
ఎవడూ వినడు!
నీవు మాదిరిగా ఉంటూ అందరికి బోధిస్తే అప్పుడు అందరూ వింటారు. అప్పుడు నీవు బోధించసమర్దుడవు కాగలవు!
నీవే త్రాగుబోతుగా తిట్టుబోతుగా వ్యభిచారిగా ఉంటూ ప్రజలకు ఏ విధముగా
బోధించగలవు?
నాకు కొంతమంది సేవకులు తెలుసు వారు భార్యలను విపరీతంగా కొడుతూ
ఉంటారు!
సంఘ అరాధనలోనే భార్యను కొడుతుంటే సంఘస్తులు అడ్డుపడి నీవు పాష్టర్ వా
లేక మెంటలోడివా అని సంఘం అడిగిన పాష్టర్ లు కూడా తెలుసు!
భార్యను పుట్టింటికి పోయి డబ్బులు తీసుకుని వస్తావా లేదా అని
అర్ధరాత్రి గుండగా తన్నేసి మెడబెట్టి త్రోసేసిన సేవకులు కూడా
తెలుసు!
పెళ్ళయి పదిహేనేళ్ళయినా ఇంకా పుట్టింటికి పోయి కారు తీసుకురా!
ఇవి తీసుకురా అని వేధించిన సేవకులు కూడా తెలుసు!
అయ్యా దేవుని సేవకులారా!
నీవు మాదిరిగా లేకుండా బోధించలేవు!ముందు నీవు మందకు మాదిరిగా ఉండాలి!
అదే పేతురుగారు రాస్తున్నారు మొదటి పత్రికలో!1పేతురు 5: 3
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా
ఉండుడి;
మందకు ఆదర్శంగా ఉండమంటున్నారు!
అప్పుడే భోధించేసమర్ధుడుగా ఉండగలవు!
ఇది చదువుతున్న సేవకుడా!
సంఘపెద్డా! విశ్వాసి!
ఒకవేళ నీకు ఇలాంటి బుద్ధి అనగా మాదిరిలేని జీవితం ఉంటే ఇపుడే
విడచిపెట్టు! మాదిరికలిగి జీవించు!
దేవుని తీర్పు తప్పించుకోలేవని,
తీర్పు దేవుని ఇంటినుండే ప్రారంభం అయ్యే రోజు వచ్చిందని మరచిపోవద్దు!1పేతురు 4: 17
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది;
అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?
దైవాశీస్సులు!
*దైవజనుడా—52వ భాగం*
*చేయదగినవి-33*
1తిమోతి 3:1—4 ...
1.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని
అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.
2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును,
ఏకపత్నీ పురుషుడును,
మితానుభవుడును,
స్వస్థబుద్ధిగలవాడును,
మర్యాదస్థుడును,
అతిథిప్రియుడును,
బోధింపతగిన వాడునైయుండి,
3. మద్యపానియు కొట్టువాడునుకాక,
సాత్వికుడును,
జగడమాడనివాడును,
ధనాపేక్షలేనివాడునై,
4.
సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు,
తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు సాత్వికుడు, జగడమాడనివాడు,
ధనాపేక్షలేని వాడు,
సంపూర్ణ మాన్యత కలిగి తనపిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటివారిని
బాగుగా ఏలువాడై ఉండవలెను!
ప్రియులారా!
ఈ లక్షణాలలో సాత్వికము,
జగడమాడనివాడు,
ధనాపేక్ష కోసం గతభాగాలలో ధ్యానం చేసుకున్నాం!
ఇక సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరచుకొన్నవాడై ఉండాలి! ఇంకా తన కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి!
ఎందుకు తన కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి అంటున్నారో తర్వాత వచనంలో
అనగా
5వ వచనంలో వివరణ ఇవ్వడం జరిగింది.
ఎవడైననూ తన ఇంటివారిని ఏలలేకపోతే ఇక దేవునిసంఘాన్ని ఏలాగు పాలిస్తారు అని
అడుగుచున్నారు!
ఇక్కడ మనకు ముఖ్యంగా రెండు విషయాలు అర్ధమవుతాయి! ఒకటి తన పిల్లలను స్వాధీన పరచుకొనువాడై ఉండాలి.
అనగా తన పిల్లలు తన చెప్పు చేతలలో ఉంచుకొను సామర్ధ్యము అతనికి
ఉండాలి.
ఒకవేళ ఎవరైనా తనకు పిల్లలు కలిగి సేవాపరిచర్య చేయాలని ఆశ ఉన్నా,
తన పిల్లలు ఆయన మాట వినక పోతే దేవుని సేవాపరిచర్యకు ఆ వ్యక్తి
పనికిరాడు! ఇది నేను చెప్పింది కాదు!
బైబిల్ చెబుతుంది.
దానికి ఉదాహరణ దైవజనుడు యాజకుడైన ఏలీ గారు!
తన పిల్లలను తన స్వాధీనంలో ఉంచుకొనలేకపోయారు.
ఆ కుమారులు మందిరంలో సేవకు-
పరిచర్యకు వచ్చిన స్త్రీలను చెరచడం మొదలుపెట్టారు.
ఈ వార్త తెలిసిన తర్వాత వారిని వారించడం జరిగింది ఏలీగారు, గాని వారు వినలేదు!
దేవునికి కోపం వచ్చింది ఎందువలన అనగా ఏలీగారు వారిని వారించి వదిలేశారు
గాని వారిని యాజకుల ఉద్యోగం నుండి తీసివేయలేదు ఎందుకంటే కొడుకులంటే
ప్రేమ! కొడుకులు తన మాట వినలేదు!
చెడిపోయారు! ఫలితం వినాశనం!
మందసం పట్టబడింది!
కాబట్టి దైవజనుడు తప్పకుండా తన పిల్లలను స్వాధీనం చేసుకుని ఉండాలి. అనగా తనమాటకు తన భార్య-పిల్లలు లోబడితేనే ఆ వ్యక్తి దేవునిసేవకు అర్హుడు! అలా లేనిపక్షంలో అతడు సేవకు-
పరిచర్యకు అనర్హుడు!
ఇదే విషయాన్ని తీతుకు వ్రాస్తూ ఇంకా వివరంగా వివరించారు. తన పిల్లలు:
అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడై ఉండాలి.
గమనించాలి దైవసేవకుని/
లేక సంఘపెద్ద/
అధ్యక్షుని పిల్లలు మొదటగా అవిదేయులై ఉండకూడదు!
విధేయులై ఉండాలి! ఎవరికీ?
మొదటగా తన తండ్రికి- తల్లికి!
రెండవదిగా దేవునికి-
వాక్యానికి!
ఇక తర్వాత లక్షణం విశ్వాసులై ఉండాలి!
ఎవరికైతే విశ్వాసులైన పిల్లలు ఉంటారో అట్టివాడే సంఘపెద్ద పోస్టుకు లేక
దేవునిసేవ చేయాలి తప్ప తన పిల్లలు అవిశ్వాసులైతే అతడు/ఆమె దేవుని సేవ-
పరిచర్య చేయడానికి అనర్హుడు/
అనర్హురాలు!
ఇక్కడ ఒక అనుమానం రావచ్చు!
అయ్యా కేవలం పెండ్లి చేసుకుని పిల్లలు గలవారే సేవ చేయాలి గాని పిల్లలు
లేనివారు,
పెండ్లికానివారు సేవచేయకూడదనా పౌలుగారి ఉద్దేశం? కానేకాదు! ఇక్కడ పౌలుగారి ఉద్దేశం:
ఒకవేళ పెండ్లిచేసుకుని పిల్లలు కలిగిఉంటే వారిని అదుపులో పెట్టె
శక్తి/ కెపాసిటీ తప్పకుండా ఈ నాయకునికి ఉండాలి!అటువంటి శక్తి లేకపోతే తన సంఘాన్ని కూడా కంట్రోల్ లో పెట్టలేడు,
అందుకే తప్పకుండా తన పిల్లలను అదుపులో ఉంచుకొనేవాడై ఉండాలి
అంటున్నారు. బైబిల్ ని బాగా అధ్యయనం చేస్తే ఏలియాగారు,
అతని శిష్యుడు ఎలీషాగారు పెళ్లి చేసుకోలేదు!
ఎంత ఘనమైన సేవ చేశారో మన అందరికీ తెలుసు!
పౌలుగారు వివాహం చేసుకోలేదు!
ఆయన శిష్యుడైన తిమోతికూడా బహుశా వివాహం చేసుకోలేదు అంటారు. వారు ఎంత ఘనమైన సేవ చేశారో అదికూడా మనకు తెలుసు!
వివాహబంధం లేనివారు ఏవిధమైన ఒత్తిళ్ళు లేకుండా కేవలం దేవుని పరిచర్య
చేయగలరు!
అలాగని అందరినీ పెండ్లి చేసుకోకూడదు అని దేవుడు గాని, పౌలుగారు గాని అనలేదు.
ప్రతీ పురుషునికి సొంతభార్య ఉండాలి అలాగే ప్రతీ స్త్రీకి సొంతభర్త
ఉండాలి అనే దైవాజ్న ఉంది! 1కొరింథీ 7:2;
సరే,
ఇక్కడ విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి అంటున్నారు!
సేవకునికి విశ్వాసులైన పిల్లలు ఎలా ఉంటారు?
ఎప్పుడు ఉంటారు?
మొదటగా తను వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు!
రెండవది:
తన పిల్లలను బాల్యము నుండి దేవుని క్రమశిక్షణలో వాక్యంలో ప్రార్ధనలో
భక్తిలో పెంచినప్పుడు!
బాలుడు నడువవలసిన మార్గము వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు
దానినుండి తొలగిపోడు! సామెతలు 22:6;
చిన్నప్పటినుండే వారిని భక్తిలో పెంచి వాడు నడువవలసిన మార్గము అనగా
భక్తిమార్గము, ముక్తిమార్గము వానికి నేర్పించాలి.
తెలుగుసామెత:
మొక్కై వంగనిది మానై వంగునా?
కనుక చిన్నప్పటి నుండే వారిని క్రమశిక్షణలో భక్తిలో పెంచితే అప్పుడు ఆ
సేవకునికి/ సంఘపెద్దకు విశ్వాసులైన పిల్లలు ఉంటారు!
ప్రియ దైవజనుడా! సేవకుడా!
సంఘపెద్డా! అధ్యక్షుడా!
నీ పిల్లలు విశ్వాసులా?
నీ పిల్లలు నీ మాట వింటున్నారా?
ఒకవేళ లేకపోతే అయ్యా దుఃఖముతో చెబుతున్నాను-
పై వచనాల ప్రకారం నీవు దేవుని సేవా-పరిచర్యలో ఒక నాయకునిగా ఉండటానికి అనర్హుడవు! వెంటనే విరమించుకోవడం మంచిది!
అయితే ఒక్క విషయం చెప్పనీయండి!
ప్రియమైన తల్లిదండ్రులారా!
మీ పిల్లలు మీమాట వినడం లేదా?
ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపిస్తున్నారా?
దానికి కారణం ముమ్మాటికి మీరే!
వారు బాల్యంలో ఉన్నప్పుడు గారాబంతో వారిని దేవుని క్రమశిక్షణలో
పెంచలేదు!
స్పెషల్ క్లాసులకు పంపించే శ్రద్ధ సండేస్కూల్ కి పంపడం లో లేకపోయింది
మీకు! వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసే శ్రద్ధ,
వారి ఆత్మీయ జీవితం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడటం ఎప్పుడూ
కనబడలేదు! అందుకే ఇలా జరిగింది!
ఇక చివరగా వారు బాలురై ఉన్నప్పుడు వారికోసం వారి ఆధ్యాత్మిక జీవితం వారి
భవిష్యత్ కోసం దేవుని సన్నిధిలో ఏడ్చి మొర్రపెట్టలేదు! అందుకే ఇప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు!
అప్పుడు ఏడ్చి ఉంటే ఆ ప్రార్ధన తప్పకుండా వారిని పట్టుకుని నేడు
విశ్వాసులుగా తీర్చి ఉండును! కాబట్టి ప్రియమైన దైవజనమా!
ఇప్పటినుండే మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచండి!
ప్రియమైన దైవసేవకుల పిల్లలారా!
మీరు అవిశ్వాసులుగా అవిధేయులుగా ఉంటున్నారా?
అయితే గమనించండి మీ వలన మీ తల్లిదండ్రులు దేవుని సేవా-పరిచర్యకు అనర్హులైపోతున్నారు అని గమనించండి.
మీ ప్రవర్తన వలన మీ ప్రేమ-పెళ్ళిళ్ళు వలన- మీ తిరుగుబోతు తనం వలన మొదటగా మీ తండ్రికి-
తర్వాత మీ సంఘానికి-
దేవుని అవమానం తెస్తున్నారు!
ఇది న్యాయమా?
దేవుని న్యాయపు త్రాసులో తక్కువగా కనిపిస్తావు అని మరచిపోకండి!
తీర్పు దేవుని ఇంటినుండే ఆరంభమయ్యే కాలం వచ్చింది అని మరచిపోవద్దు! 1పేతురు 4:17;
దైవసేవకుల పిల్లలు మాదిరిగా ఉండాల్సింది పోయి –
సినిమా స్టార్లు లాగ తయారవుతూ భయంకరమైన వస్త్రధారణతో సంఘానికి దేవునికి
అవమానం తెస్తున్నారు. ఇది కూడదు అని గమనించండి!
ఏలీగారి కుమారులు చెప్పిన మాట వినకుండా ఉన్నందుకు కుక్కచావు చచ్చారు! వాళ్ళు చస్తే బాగుణ్ణు!
వారితోపాటు కొన్నివేలమంది పోయారు!
చివరికి దేవుని మందసం కూడా చెరపట్టబడింది!
కాబట్టి దయచేసి దైవసేవకుల కుమారులారా!
పిల్లలారా!
మీ తల్లిదండ్రులు మాట వినండి.
దేవుని భక్తిలో ఉండండి.
మేము మా తండ్రిగారి మాట,
తల్లిమాట జవదాటకుండా మా తల్లిదండ్రులకు గాని,
సంఘానికి గాని,
దేవునికి గాని అవమానం తేకుండా బ్రతికాము!
అందుకే మాకొక పేరు వచ్చింది!
పిల్లలను పెంచడం అంటే లూకా పాష్టర్ గారి లాగ పెంచాలని మా
తండ్రిగారికి;
పిల్లలంటే లూకా పాష్టర్ గారి పిల్లలు అని మాకు మంచిపేరు వచ్చింది!
కారణం మా తండ్రి మమ్ములను భక్తిలో క్రమశిక్షణలో పెంచారు!
ప్రియ సంఘకాపరి! దైవజనుడా!
సంఘపెద్డా!
మీ పిల్లలను స్వాధీనంలో ఉంచుకోండి!
భక్తిలోను శ్రద్ధలోను ప్రార్ధనలోను వాక్యములోను పెంచండి! అప్పుడే మీరు సేవకు అర్హులు!
దైవాశీస్సులు!
*దైవజనుడా—53వ భాగం*
*చేయదగినవి-34*
1తిమోతి 3:6—7 ...
6. అతడు గర్వాంధుడై అపవాదికి(సాతానుకు)
కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.
7. మరియు అతడు నిందపాలై అపవాది(సాతానుకు)
ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన
వాడైయుండవలెను.
తీతు 1:8—9 ...
8. అతిథి ప్రియుడును,
సజ్జన ప్రియుడును (సద్విష్యప్రియుడును) స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును,
ఆశానిగ్రహము గలవాడునైయుండి,
9. తాను హితబోధవిషయమై (ఆరోగ్యకరమైన బోధవిషయమై) జనులను హెచ్చరించుటకును,
ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు,
ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై
యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు: కొత్తగా చేరినవాడై ఉండకూడదు;
సంఘమునకు వెలుపలి వారిచేత మంచిసాక్ష్యము పొందినవాడై ఉండాలి! నీతిమంతుడు;
పవిత్రుడై ఉండాలి!
ప్రియులారా!
నీతిమంతుడు పవిత్రుడై ఉండాలని గతబాగాలలో చూసుకున్నాం కనుక ముందుకు
సాగిపోదాం! అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి-
నిజాయితీ లేనివాడు అన్యాయస్తుడు అవుతాడు,
మోసగాడు అవుతాడు అలాంటి మనిషి సంఘానికి శాపమే గాని దీవెన/ ఆశీర్వాదం కానేకాదు!
కనుక దైవజనుడు తప్పకుండా నిజాయితీగా ఉంటూ నీతిమంతుడై ఉండాలి.
నీతిమంతుడు చూస్తే యోబుగారు యధార్ధవర్తనుడు నీతిమంతుడు. అబ్రాహాము గారు దేవుని నమ్మడమే అతనికి నీతిగా ఎంచబడింది. దానియేలుగారు నీతిమంతుడు!
దావీదుగారు నీతిమంతుడు!
కాబట్టి నా నీతిని బట్టి నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వు అని
ధైర్యంగా చెప్పగలిగారు! కాబట్టి దైవజనులు/సంఘపెద్దలు నీతినిజాయితీకలిగి ఉండాలి. దేవుడు ఒకరికి 5తలాంతులు,
ఒకడికి రెండు ఒకడికి ఒక తలాంతులు ఇచ్చిన ఉపమానంలో చెప్పారు:
కొద్ది విషయంలో నిజాయితీగా ఉన్నవాడు పెద్ద విషయంలో కూడా నిజాయితీగా
ఉండగలడు! లూకా 16: 10
మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును;
మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
చిన్నది అయినా పెద్దది అయినా దొంగతనం దొంగతనమే దొంగ దొంగే!
అలాగే దేవుని పరిచర్య విషయంలో కూడా దేవుని ఇంతగొప్ప పరిచర్యలో నిజాయితీగా
నీతిగా ఉండాలి! కొంచెమైనా దొంగలించరాదు!
తీతు 2:12,13;
ఇక పవిత్రుడుగా ఉండాలి అంటున్నారు.
దీనికోసం కూడా గతంలో చూసుకున్నాం!
పవిత్రుడు కాదు అంటే అపవిత్రుడు అన్నమాట!
అలాంటివాడు ఎప్పుడూ సంఘాన్ని నీతిమార్గంలో ఉంచలేడు!
కారణం వాడే అపవిత్రుడు ఇక సంఘాన్ని ఎలా పవిత్రమార్గంలో ఉంచగలడు?
అందుకే కొరింథీ పత్రికలో అన్యాయస్తులు దేవుని రాజ్యంలో పాలుపొందలేరు అని
చెప్పబడింది! .1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10,11
9.
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి;
జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష
సంయోగులైనను
10.
దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని
రాజ్యమునకు వారసులు కానేరరు.
11. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని,
ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.
...కాబట్టి దేవుని సంఘంలో నాయకులు నీతిమంతులు,పవిత్రులై ఉండాలి!
ఇక తర్వాత లక్షణం: క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు!
ఎందుకు అంటే పౌలుగారే చెబుతున్నారు:
క్రొత్తగా చేరినవాడిని సంఘానికి నాయకునిగా చేస్తే గర్వాంధుడై అపవాది
ఉరిలో పడిపోతాడు! అందుకే క్రొత్త వాడై ఉండకూడదు!
గమనించాలి ఒక అధికారంతో కూడిన పదవిలో ఒక విశ్వాసిని నియమించడం అనేది
జరగక ముందు అతడు దేవుని వాక్యంలో, పరిశుద్దాత్మతో అభిషేకం పొంది ప్రార్ధనలో,
వాక్యంలో,
ఆధ్యాత్మికంగా స్థిరపడినవాడినే పెట్టాలి తప్ప ఆధ్యాత్మికంగా అభివృద్ధి
పొందనివాడిని సంఘానికి నాయకులుగా చేస్తే వారు గర్వంతో మిడిసిపడే అవకాశం
ఉంది! ఇది దైవసేవకులకి కూడా వర్తిస్తుంది.
దేవుని పిలుపును పొందుకుని,
దేవునివాక్యంతో వేరుపారి,
పరిశుద్ధాత్మ అభిషేకం పొంది,
దైవజనుల దగ్గర నేర్చుకుని అనుభవం వచ్చాకనే వారు దేవుని సేవకు రావాలి
తప్ప రక్షణపొందిన వెంటనే చిన్న బైబిల్ ట్రైనింగ్ చేసి సేవకు వచ్చేస్తే
బొక్కబోర్లాపడటం ఖాయం! కారణం మొదటగా ఆ వ్యక్తికీ దేవుని పిలుపు లేదు!
రెండు వాక్య అనుభవము లేదు;
మూడు పరిశుద్ధాత్మ నడిపింపు లేదు! ఇవన్నీ పొందుకున్నాక వారి సంఘకాపరి వద్దగాని,
లేక అనుభవజ్ఞులైన సేవకుల వద్ద కొంతకాలం శిష్యరికం చేసి సేవకు
వస్తే, ఏలియా గారి దగ్గర ఎలీషాగారు చేసినట్లు,
మోషేగారిదగ్గర యెహోషువాగారు చేసినట్లు,
పౌలుగారి దగ్గర తిమోతి తీతుగార్లు చేసినట్లు చేసి,
సేవకు వస్తే ఆ నడిపింపు ఆ సేవా విధానమే వేరుగా ఉంటుంది.
కారణం సేవలో వచ్చే ఆటుపోట్లు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుని,
వాటిని ప్రార్ధనద్వారా ఎలా జయించాలో నేర్చుకుని వస్తే అప్పుడు ఘనమైన
సేవ చేయగలవు!
లేదంటే వచ్చే శోధనలకు సేవను విడిచి పారిపోవడం గాని, లేక సాతానుగాడి తప్పుడుదారులలో,
తప్పుడుబోధలలోనికి పోవడం గాని జరుగుతుంది.
అలాగే సంఘపెద్దగా కూడా దేవుని సంఘంలో సంఘసభ్యుడుగా ఎంతోకాలం నుండి
ఉన్నవాడు వాక్యానుభావం, బోధించే సమర్ధత గలవాడు సంఘానికి నాయకుడిగా/
పెద్దగా ఉంటే సంఘానికి అప్పుడు ఏమి అవసరమో ఎటువంటి నిర్ణయాల వలన సంఘం
అభివృద్ధిపొంది,
ఇంకా సువార్త వ్యాప్తి చేయగలమో తెలుస్తుంది తప్ప క్రొత్తవాడికి
డబ్బులున్నవాడు,
గొప్పగొప్ప కానుకలు ఇస్తున్నాడు అని నాయకుడుగా చేస్తే మొదటగా వాడు
అపవాది తంత్రాలలో పడి గర్వాంధుడై పోతాడు అంటున్నారు పౌలుగారు.
ఇంకా సరియైన నిర్ణయాలు తీసుకోలేడు కారణం వానికి వాక్యానుభావం లేదు!
సగం సగం తెలిసిన వాడు నాయకుడైతే సంఘానికి ప్రమాదమే గాని మేలుకాదు! Half Knowledge More Dangerous! ఇంకా వాడు గర్విష్టుడై పోతాడు అంటున్నారు.
నాశనానికి ముందు గర్వం ఉంటుంది...సామెతలు
16: 18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
. కాబట్టి ఇలాంటివారిని నాయకులుగా చేయకూడదు!
అనుభవజ్ఞులనే నాయకులుగా చెయ్యాలి!
ఇక తర్వాత లక్షణం: సంఘం వెలుపల వారినుండి మంచిపేరు కలిగిఉండాలి.
దానినే తీతుపత్రికలో పరపక్షమందున్నవాడు మీమీద చెడ్డమాటలు పలుకకుండా
చూసుకో అంటున్నారు. 2:7;
కాబట్టి సంఘానికి పెద్దగా ఉండాలంటే వాడు సంఘానికి వెలుపల ఉన్నవారు
అనగా అన్యజనులనుండి కూడా మంచిపేరు కలిగిఉండాలి. ఇక దైవసేవకులు/
దైవజనులు కూడా పరపక్షమందున్నవాడు చెడ్డమాటలు పలుకకుండా చూసుకున్నవాడే
సేవకు పనికొస్తాడు అని గతభాగాలలో విరివిగా చూసుకున్నాం!
ప్రియ సంఘమా!
ఒకసారి మీ నాయకులు ఎలాంటివారో చూసుకోమని మనవిచేస్తున్నాను!
దైవాశీస్సులు!
*దైవజనుడా—54వ భాగం*
*చేయదగినవి-35*
1తిమోతి 3:6—7 .
6. అతడు గర్వాంధుడై అపవాదికి(సాతానుకు)
కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.
7. మరియు అతడు నిందపాలై అపవాది(సాతానుకు)
ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన
వాడైయుండవలెను.
తీతు 1:8—9 ..
8. అతిథి ప్రియుడును,
సజ్జన ప్రియుడును(సద్విష్యప్రియుడును) స్వస్థబుద్ధిగలవాడును,
నీతిమంతుడును, పవిత్రుడును,
ఆశానిగ్రహముగలవాడునైయుండి,
9. తాను హితబోధవిషయమై (ఆరోగ్యకరమైన బోధవిషయమై) జనులను హెచ్చరించుటకును,
ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు,
ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై
యుండవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు:
నాల్గవ అధ్యాయంలోచాలా ఉనాయి గాని ఇంతకుముందు మనం వీటిని ధ్యానం
చేసుకున్నాం!
4:1—౩ అబద్దబోధకుల కోసం,
అబద్దబోధలకోసం బోధిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉండాలి,.
4:7 దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో! దీనికోసం కూడా గతంలో ధ్యానం చేసుకున్నాం.
ఈలోకంలో అనేకమంది ఏటేటో సాధకం /
ప్రాక్టీస్ చేస్తున్నారు గాని దైవజనుడైతే దైవభక్తిని సాధకం చేసుకోవాలి
అంటున్నారు పౌలుగారు! భక్తి అనేది మూన్నాళ్ళ ముచ్చట కాదు!
ఏడువారాల భక్తికాదు! 40
రోజుల దీక్ష కాదు! లేక 40
రోజుల శ్రమదినాలలోనే చేసే భక్తికాదు,
అది అనుదినం చేస్తూనే ఉండాలి!
సాధకం చేస్తూనే ఉండాలి!1తిమోతికి
4: 15
నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.
ఈ భక్తిలో భాగంగానే నీ ప్రవర్తన బాగుగా జాగ్రత్తగా కాచుకుంటూ దేవుడు
నీకు అనుగ్రహించిన వరములు ఫలములు వాడుతూ ఉండాలి. గతంలో చెప్పిన విధముగా ఒకవేళ ఆ దైవజనుడు/
విశ్వాసి పాపంలో పడిపోతే దేవుడు ఆ వరములు ఫలములు తీసేసుకొనే దేవుడు కాదు
గాని నీ పాప జీవితం వలన నీవు ప్రార్ధిస్తూ ఉంటే సాతానుగాడు గొప్పప్రార్ధన
చేసేస్తున్నావ్ గాని మొన్న ఏ పాపం చేసేవో గుర్తుకుందా?
అంతాచేసేసి ఏమీ ఎరుగనట్లు అమాయకంగా ప్రార్ధన చేసేస్తున్నావ్!
నీ దేవుణ్ణి మోసగిస్తున్నావు అంటూ నీ మనస్సులో హృదయంలో గుసగుసలాడటం వలన
నీవు ప్రార్ధన చేయలేవు ఇంకా నీ వరములను ఫలములను వాడలేవు! ఈ పరిస్తితులలో కొన్ని నెలలు,
సంవత్సారాలు నీకున్న ఫలములను వరములను వాడలేకపోతే వాటిని వాడే విధానం
మరచిపోయి/
అలవాటు తప్పిపోయి నేను వరాలను పోగొట్టుకున్నానేమో అని అనుకుంటావు. అందుకే నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి!
ఇది చదువుతున్న దైవజనుడా!
ఒకవేళ ఈ స్తితిలో నీవుంటే దేవుడు దయామయుడు,
ఒకవేళ నీవు మనస్పూర్తిగా పశ్చాత్తాపపడి,
తప్పు ఒప్పుకుంటే తిరిగి ఆ పాపము చేయడం మానుకుంటే,
దేవుడు క్షమించి నిన్ను మరలా తనహక్కున చేర్చుకోగలరు! నేడే నీ ప్రయత్నం
చేయు! ఆయన దగ్గర క్షమాపణ కోరి,
పొందుకుని తిరిగి నీ వరములను ఫలములను సాధకం చేసుకోమని దేవునిపేరిట మనవి
చేస్తున్నాను!
అయితే నీవు మొదటగా జయించవలసినది సాతానును, రెండవదిగా నీ గిల్టీ ఫీలింగ్!
ఇదే గిల్టీ ఫీలింగ్ మాటిమాటికి నీ ముందుంచి నిన్ను బురుడీ కొట్టిస్తాడు
సాతానుగాడు! దానిని జయించు!
మరలా నీ భక్తిని సాధకం చేసుకో!
నిపుణుడైన క్రీడాకారుడు తన శరీరాన్ని తన చెప్పుచేతలలో ఉంచుకుంటూ సాధకం
చేయునట్లు నీవు కూడా నీ తనువును మనస్సును అదుపులో పెట్టుకుని భక్తిని, ఆధ్యాత్మిక విషయాలలోను సాధకం చేసుకోవాలి!
హెబ్రీ 5:14; 1కొరింథీ 9:
24—27 ;
ఇక తర్వాత 4:12లో నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించకుండా చూసుకో
అంటున్నారు!
దీనికోసం కూడా గతభాగాలలో వివరంగా ధ్యానం చేసుకున్నాం!
యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు అన్నట్లు సాతానుగాడు నిన్ను
విశ్వాసబ్రష్టులు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ముఖ్యంగా యవ్వనస్తులు సాధారణంగా పడిపోయే విషయాలు వ్యభిచారం, గర్వము, నేత్రాస,
శరీరాస, జీవపుడంభము,
ఈ కార్లు కొనాలి, అది కొనాలి.
మంచి మంచి ఖరీదైన వస్తువులు కావాలి లాంటివి విసర్జించి దేవభక్తిని సాధకం
చేసుకుంటూ వరములను ఫలములను వృద్ధిపొందించుకోవాలి! నీ బ్రతుకు బాగోలేక పోతే వీడా అంటారు!
కాబట్టి ఏ విషయంలో కూడా సాతానుకు,
లోకానికి చోటివ్వకుండా ఆయన పనిలో సాగిపోవాలి!
యోసేపుగారు తన జీవితాన్ని తనఘటాన్ని తన శీలాన్ని తన సాక్ష్యాన్ని
కాపాడుకొన్నట్లు కాపాడుకోవాలి! దానియేలు షడ్రక్,
మేశాక్ అబెద్నేగోలు కాపాడుకొన్నట్లు కాపాడుకోవాలి.
సంసోను పోగొట్టుకున్నట్లు సాక్ష్యం పోగొట్టుకుని కళ్ళు అనే ఆత్మీయ
నేత్రాలు, ఆత్మీయ చూపు పోగోట్టుకోకు!
సేవ్వకుడా నీ చూపు నీ ఆశ సువార్తమీద సేవపైనే ఉండాలి గాని స్త్రీలమీద, ధనం మీద అధికారం మీద బంగళాలు మీద ఉండకూడదు!
4:16
ప్రకారం నిన్నుగూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండాలి! దీనికోసం కూడా గతంలో చెప్పుకున్నాము!
నీవు చెప్పేవాడిగా మాత్రమే ఉండకుండా చేసేవాడుగా కూడా ఉండాలి!
నీవు బోధిస్తూ సన్మార్గంలో ఉండమని చెబుతూ నీవే చెడుమార్గంలో నడిస్తే ఎలా
చెప్పగలవు?
అలా చెబితే చాలు చాల్లే చెప్పావు గాని మొదట నీబ్రతుకు బాగా చేసుకో
అంటారు! అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి!
నీవుచెప్పే బోధను జాగ్రతగా చూసుకోవాలి!
నీవు చెప్పేది వాక్యాధారమైనదా లేక నీ సొంత మాటలు చెబుతున్నావో సరిచేసుకుంటూ
వాక్యమనే అద్దంలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి!
లేకపోతే దేవుని దగ్గర లెక్క అప్పగించాలి అని మరచిపోకు!
దేవుని సేవకులకు బోధించే వారికి మరింత శిక్ష అని మరచిపోకు! యాకోబు 3: 1
నా సహోదరులారా,
బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు
బోధకులు కాకుండుడి.
తీర్పు దేవుని ఇంటినుండే బయలుదేరు కాలం వచ్చింది అని మరచిపోకు! 1పేతురు 4:17;
కాబట్టి ప్రియ దైవజనుడా!
నిన్నుగూర్చి,
నీ బోధగూర్చి జాగ్రత్తగా ఉండు!
నీ యవ్వనము బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించకుండా చూసుకో!
దైవభక్తిని ప్రతీరోజు సాధకం చేసుకుంటూ ఉండుము!
అట్టి కృప దయదేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా—55వ భాగం*
*చేయదగినవి-36*
1తిమోతి 4:12—14
12.
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను,
ప్రేమలోను, విశ్వాసములోను,
పవిత్రతలోను,
విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
13. నేను వచ్చువరకు చదువుటయందును,
హెచ్చరించుటయందును,
బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. ;
5:2—3
1.
వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.
2. అన్నదమ్ములని యౌవనులను,
తల్లులని వృద్ధ స్త్రీలను,
అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.
3. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ...
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు:
మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు
మాదిరిగా ఉండుము! ప్రియదైవజనమా!
వీటికోసం కూడా గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాం!
అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ
విశ్వాసంలోను పవిత్రత లోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్పడానికి అసలు
కారణం మరొకటి ఉంది నా ఉద్దేశ్యం! అదేమిటంటే :
దైవజనుడు చెప్పేబోధలు కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు; దైవసేవకులకు కూడా వర్తిస్తాయి.
అయితే ఎప్పుడైతే పైన చెప్పినట్లు ప్రవర్తిస్తే –
సంఘానికి మాదిరిగా తప్పకుండా ఉంటారు గాని వారి అనగా దైవసేవకుల/ దైవజనుల ఆత్మీయ /
ఆధ్యాత్మిక జీవితం ప్రభావమానమై వర్ధిల్లుతుంది.
కాబట్టి మొట్టమొదటగా వారు దేవునితో సత్సంభంధం కలిగిఉంటారు. రెండవదిగా ఆత్మపూర్ణులై ఉంటారు.
తద్వారా వారు పరలోకరాజ్యం చేరుతారు.
వారు బోధించి వారే తప్పి పోకుండా,
వారు బోధిస్తూ వారితోపాటు తన సంఘాన్ని కూడా దేవునిరాకడకు ఆయత్తపరచి
తనతోపాటు తన సంఘాన్ని కూడా గొర్రెపిల్ల వివాహమహోత్సవానికి ఆర్భాటంగా
తీసుకుని వెళ్ళగలరు! ఇదీ దీనివెనుక అసలు భావం అని నా ఉద్దేశ్యం!
ముందు దైవజనుడా!
నీవు దేవునితో ప్రత్యేకమైన అనుభంధం కలిగిఉండాలి.
ముందు నీ ప్రవర్తన వలన నీవు పరలోకం చేరే అవకాశాన్ని పొందుకోవాలి. ఆ తర్వాత నీ కుటుంభం,
సంఘం కూడా దేవుని పరలోకంలో చేరాలి.
అలా చెయ్యాలంటే మొదట నీవు మాదిరిగా ఉండాలి.
ఆ ప్రయత్నానికి మెట్టులే ఈ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసం లోను
విశ్వాసులకు మాదిరిగా ఉండటం!
ప్రేమలో మాదిరిగా ఉండటం కోసం గతంలో ధ్యానం చేసుకున్నాం! ఈ గడ్డుకాలంలో ప్రియ దైవసేవకులారా!
అనేకమంది దైవజనులు/
సేవకులు/విశ్వాసులు/
నీ పొరుగువారు ఈ లాక్ డౌన్ వలన భోజనం లేకుండా పస్తులుంటున్నారు వారికి
నీవు చేయగలగిన సహాయం చెయ్యాలి!
ఇది నీవు ఎప్పుడు చెయ్యగలవు అంటే బల్లగుద్ది బోధచేస్తే రాదు,
నాలాగా దీర్ఘప్రసంగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే రాదు- ప్రేమ చూపించి చేయగల సాటియైన,
చేతనైన సహాయం చెయ్యాలి.
అదే ప్రేమలో మాదిరిగా ఉండటం అంటే!
ఎప్పుడూ నీవు దేవుని కివ్వు ఇవ్వు అని చెప్పడం కాదు! నీవుకూడా ఇవ్వాలి!
ఇలా ఆపదలో/
దీనావస్తలో ఉన్నవారికి సహాయం చేస్తే దేవునికి ఇచ్చినట్లే! కాబట్టి ప్రేమలో మాదిరిగా ఉండు!
ఇంకా విశ్వాసంలో మాదిరిగా ఉండాలి! దీనికోసం ధ్యానం చేసుకున్నాం!
పవిత్రతలో మాదిరిగా ఉండాలి!
ఇది గతభాగంలో చూసుకున్నాం!
ఇక మాటలో మాదిరిగా ఉండాలి!
దైవసేవకుని మాటలు తప్పకుండా ప్రత్యేకంగా ఆదరణ కలిగించేదిగా ప్రేమను
కురిపించేదిగా, పంచేదిగా,
దేవుణ్ణి చూపించేదిగా,
పరిచయం చేసేదిగా ఉండాలి!
పరుషమైన మాటలు రానేకూడదు దైవజనుడు నోటనుండి!
శాపం ఎట్టి పరిస్తితిలో రాకూడదు!
అది పిల్లలపైన గాని,
విశ్వాసుల మీద గాని; కారణం దేవుడు దైవజనుడు పలికేమాటకు విలువనిస్తారు! నీవు దీవించేవారిని దీవిస్తాను.
నిన్ను శపించేవారిని శపిస్తాను నీవు ఏమి చెబితే అది చేస్తాను అన్నారు
దేవుడు! ఆదికాండం 12:3; ఏలియాగారు చెప్పిన మాటలకు దేవుడు విలువనిచ్చి ఆకాశాన్ని ఇనుముగాను
భూమిని ఇత్తడిగా చేసి మూడున్నర సంవత్సరాలు వర్షం లేకుండా
చేసేశారు. 1రాజులు 17; నిన్ను నీ యాబై మందిని అగ్ని వచ్చి దహించెయ్యాలి అంటే దేవుడు
పంపించేశారు. 2రాజులు 1:12--14; భూమి నెరవిడిచి వీరిని మ్రింగేయ్యాలి అని మోషేగారు అంటే వెంటనే భూమి
కోరహు,
దాతాను అభిరాములకు సంభందించిన వారిని మ్రింగేసింది. సంఖ్యా 16; కీర్తనలు 106:17; కాబట్టి ప్రియ దైవసేవకుడా!
నీ మాటకు దేవుడు విలువనిస్తున్నారు కాబట్టి నీ మాట చాలా జాగ్రత్తగా
ఉండాలి! అందరూ మాట్లాడినట్లు నీవు మాట్లాడకూడదు!ఎఫెసీయులకు
5: 4
కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను(లేక,వెఱ్ఱిమటలైనను),
సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు;
ఇవి మీకు తగవు.
1పేతురు 4: 11
ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను;
ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది
చేయవలెను.
ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక.
ఆమేన్.
ఇంకా మాదిరిగా ఉండాలి అనడానికి
5వ అధ్యాయంలో ఎలా మాదిరిగా ఉండాలో పౌలుగారు చక్కని ఉదాహరణలు
చెబుతున్నారు.
వృద్ధుని గద్దించకు! తండ్రిగా భావించి హెచ్చరించు!
యవ్వనస్తులను అన్నా తమ్ముడు అని సంభోదించమంటున్నారు! ఈ విషయంలో ఒక విషయం చెప్పనీయండి!
ఇది నా ఉద్దేశం మాత్రమే! మనం సాధారణంగా బ్రదర్ ప్రైజ్ ద లార్డ్ ,
బాగున్నారా,
సిస్టర్ బాగున్నారా అంటాము!
మంచిది!
ఇది శ్రేష్టమైన పిలుపే!
అయితే ఇంగ్లీష్ పిలుపు కంటే మన శ్రేష్టమైన అచ్చమైన తెలుగులో ఇదేమాట
పలికితే ఇంకా చాలా శ్రేష్టంగా చాలా దగ్గరగా బంధాలు అనుభంధాలు కలిపినట్లు
ఉంటుంది అని నా ఉద్దేశ్యం! ఎలాగంటే:
ఆయన నీకంటే పెద్దవాడు అయితే అన్నా ప్రైజ్ ద లార్డ్!
బాగున్నారా?
అక్కా బాగున్నారా!
చెల్లి బాగున్నావా!
అమ్మా బాగున్నావా?
వందనాలు అమ్మా!
అని చెబితే పలకరిస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం! గమనించాలి!
ఇది పౌలుగారు నేర్పించిన పలకరించే విధానం!
దీనిని తప్పకుండా ప్రతీ దైవజనుడు పాటించాలి!
నోరు మంచిదయితే ఊరు మంచిది!
నీవు ఈ రకంగా పలకరిస్తే వారు నిన్ను ఆత్మీయ తండ్రిగా భావించి నిన్ను
ప్రేమిస్తారు! నీ మాటకు గౌరవిస్తారు!
తమ్ముడు బాగున్నావా?
చిన్నవాడిని:
నాన్నా బాగున్నావా?
అని పలకరిస్తే బాగుంటుంది.
అయితే ఇది సంఘంలో పలకరింపు కోసం చెబుతున్నాను!
అలాకాకుండా అందరిమీద అధికారం చెలాయిస్తే అంత బాగోదు అని నా ఉద్దేశం! రేయ్ ఇలా రా! ఓ స్త్రీ!
అలా చెయ్!
అంటే అసలు బాగోదు అని పౌలుగారి ఉద్దేశం!
నా ఉద్దేశం కూడా!
పౌలుగారు ఇలానే ప్రేమతో మాట్లాడి కొన్ని లక్షల మందిని ఆకట్టుకున్నారు. కొన్ని లక్షలమందికి సువార్త చెప్పారు!
కావాలంటే పౌలుగారు రాసిన పత్రికలలో చివరి అధ్యాయాలు చూడండి! : ఆమె నాకును తల్లి!
ప్రభువునందు ప్రియ సహోదరుడు,
నాకు మిక్కిలి ప్రియుడు,
నా నిజ కుమారుడు,
ఇలాగే పిలిచేవారు!
బంధుత్వం కలుపుకునే వారు!
కారణం మనమంతా క్రీస్తులో సహోదరులం!
కాబట్టి మన పిలుపు ఇలాగే ఉండాలి.
ఇక వృద్ధ స్త్రీలను తల్లీ అని పిలవాలి!
వయస్సులో ఉన్న స్త్రీలను అక్కా చెల్లీ అని పిలవాలి! దీనివలన అనేక ఆపదలు తప్పించుకోగలవు!
ఆ స్త్రీ నీమీద కన్ను వెయ్యదు,
నీవు కూడా చెల్లీ అక్కా అని పిలుస్తున్నావు కాబట్టి సాతానుడు నిన్ను కూడా
శోదించడు.
ఇంకా చూడండి అక్కాచెల్లెళ్ళు అని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను
పిలవాలి! ఇదీ మాదిరి!
ప్రియ దైవజనుడా! నీ పిలుపు ఎలా ఉంది?
మాదిరిగా ఉంటున్నావా?
ఇలాంటి పిలుపు కలిగి ఉంటున్నావా?
లేకపోతే ఇప్పుడే సరిచేసుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*దైవజనుడా—56వ భాగం*
*చేయదగినవి-37*
1తిమోతి 5:3, 17
3. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.
17. బాగుగా పాలనచేయు పెద్దలను,
విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని,
రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.
ప్రియ దైవజనమా!
దైవజనుడు హత్తుకోవలసిన లేక చేయదగిన అంశముల కోసం గతకొన్ని రోజులుగా ధ్యానం
చేస్తున్నాము. అధ్యక్షుడు లేక దైవసేవకుడు/
సంఘకాపరి/సువార్తికుడు ఎలా ఉండాలి? ఎలాంటివాడై ఉండాలి?
అనేది ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాము!
ఇక ఈరోజు దైవజనుడికి/
సంఘపెద్దకు ఉండవలసిన అర్హత/
లక్షణములు:
ఇద్దరిని ప్రత్యేకంగా సన్మానించమని చెబుతున్నారు పౌలుగారు.
మొదటగా నిజముగా అనాధలైన విధవరాండ్రను సన్మానించాలి;
రెండవది:
బాగుగా పాలనచేసే పెద్దలను,
మరీముఖ్యంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారిని రెట్టింపు
సన్మానమునకు పాత్రులుగా ఎంచి సన్మానించాలి!
నిజంగా అనాధలైన విధవరాల్లను సంఘం/
దైవజనుడు సన్మానించాలి,
వారిని పట్టించుకోవాలి,
వారి బాగోగులు సంఘమే చూసుకోవాలి అని అంటున్నారు పౌలుగారు! ముఖ్యంగా ఏ పనిచేయలేని విధవరాల్లను,
దిక్కులేనివారిని తప్పకుండ సంఘం వారిపోషణ బాధ్యత తీసుకోవాలి!
దానికి కొన్ని నియమనిభందనలు చెబుతున్నారు పౌలుగారు తర్వాత వచనాలలో!
యాకోబు
1: 27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని
పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు,
ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
దానికి ముందుగ ఈ ఆచారం ఎక్కడనుండి వచ్చింది అంటే పాతనిభందనలో వ్రాయబడ్డ
కట్టడలు బట్టి!
పాతనిభందనలో ఎన్నోచోట్ల విధవరాల్లను పరదేసులను సన్మానించి వారి బాగోగులు
చూడమని ఉంది గాబట్టి ఈ ఆచారాన్ని యూదులు/ ఇశ్రాయేలీయులు తప్పకుండా పాటించేవారు! పౌలుగారు కూడా ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆ లేఖనాన్ని ఆ ఆచారాన్ని బట్టి
రాస్తున్నారు.
అసలు ఈ ఆచారం కోసం కొద్దిగా చెప్పనీయండి. యూదుల ఆచారం ప్రకారం నీతిమంతులు ఎవరు?
అంటే మూడు పనులు చేసేవారు నీతిమంతులు!
తన సంపాదన అంతా మూడు భాగాలు చెయ్యాలి.
తన రాబడిలో మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి అనగా దేవుని మందిరానికి
కానుకగా ఇవ్వాలి; రెండవ భాగాన్ని విధరాల్లకు,
పరదేసులకు,
తల్లిదండ్రులు లేని అనాధల పోషణకోసం ఇవ్వాలి;
మూడవ భాగంతో తన కుటుంభాన్ని పోషించుకోవాలి.
ఇలా ఎవరైతే చేస్తారో వారిని నీతిమంతులుగా అనేవారు ఆ కాలంలో! అట్టి నీతిమంతుల కోవలోనికి చెందినవాడు యోసేపుగారు.
యేసుక్రీస్తు ప్రభులవారి భూలోకంలో తండ్రిగా పరిగణించబడినవారు. ఇక మొదటిభాగపు ధనంతో యాజకులు,
లేవీయుల పోషణ,
మందిరపు పర్యవేక్షణ జరిగేది.
ఇక రెండవ భాగపు ధనముతో ఆ కాలంలో మందిరం వెనుక ఒక హాస్టల్ నడిపేవారు- ఇది ప్రధానయాజకుని పర్యవేక్షణలో ఉండేది.
దీనిలో విధవరాళ్ళు,
దిక్కులేనివారు,
తల్లిదండ్రులు లేనివారు ఉండేవారు.
ఇలాంటి హాస్టల్ లోనే యేసయ్య తల్లియైన మరియమ్మగారు బ్రతికారు గబ్రియేలు
దేవదూత యోసేపుగారికి ఆజ్ఞ ఇచ్చినవరకు!
సరే,
దీనికోసం పౌలుగారికి తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతీసంఘంలో బీదలు విధవరాళ్ళు
ఉంటారు కాబట్టి ఇప్పుడు సంఘం వీరిని పోషించమని చెబుతున్నారు. అయితే తర్వాత వచనాలలో ఎవరిని విధవరాళ్ళ లెక్కలో ఉంచాలి ఎవరిని ఉంచకూడదు
అనేది రాస్తున్నారు.
ఇంకా విధవరాలు తనకు బలం ఉన్నంతవరకు సంఘంలో పరిచర్య చెయ్యాలి! సంఘంలో చీరలు సామానులు పోషణ పొందడమే కాదు!
సంఘంలో పరిచర్య చెయ్యాలి!
పరిశుద్దుల బాగోగులు చూడాలి!
ఇంకా బలమున్నప్పుడు సంఘానికి చేయూతగా ఉండాలి.
బలం ఉదడిగినప్పుడు సంఘమే ఈమె పోషణ చూస్తుంది...
మొదటి తిమోతికి
5:4,5,9,10,11,12,13,16
4.
అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును,
తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.
5. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి,
దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని,
విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
9. అరువది ఏండ్ల కంటె తక్కువ వయస్సు లేక,
ఒక్క పురుషునికే భార్యయై,
10. సత్క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి,
పరిశుద్ధుల పాదములు కడిగి,
శ్రమపడువారికి సహాయముచేసి,
ప్రతి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో
చేర్చవచ్చును.
11. యౌవనస్థులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు;
12.
వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును
వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.
13. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు,
బద్ధకురాండ్రగుటకు మాత్రమేగాక,
ఆడరాని మాటలాడుచు,
వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు.
16.
విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల,
సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ
ఆమెయే వీరికి సహాయము చేయవలెను.
ఇక బాగుగా పాలన చేసే సంఘపెద్దలను సన్మానించాలి! ఇక్కడ సన్మానించడం అంటే శాలువా కప్పి,
బొకే ఇవ్వడం కాదు!
వారిని గౌరవించి అవసరమైతే వారికి ఆర్ధికంగా కూడా సహాయం చెయ్యాలి అని
అర్ధం! వీరు బాగుగా పాలన చెయ్యడమే కాదు-
వాక్యమందును ఉపదేశమందును ప్రయసపడేవారిని అంటున్నారు.
కొన్నిసంఘాలలో వీరు వాక్యపరిచర్య కూడా చేస్తారు. Lay
ప్రీచర్స్ అంటారు వీరిని.
వీరిని పోషించాలి సన్మానించాలి!
అలాగే కొందరు సువార్తికులు ఉంటారు.
వీరికి సంఘం ఉండదు!
గాని ఒక సంఘానికి అనుభంధముగా ఉంటూ సువార్త ప్రకటిస్తూ రక్షించబడిన వారిని సంఘంలోనికి తీసుకుని
వస్తుంటారు.
ఇలాంటి వారిని సన్మానించి పోషించాలి అని పౌలుగారు.
ప్రియ దైవజనుడా! ఇవీ పౌలుగారు తిమోతి పత్రికలలో,
తీతు పత్రికలో పౌలుగారు చెప్పిన దైవజనుడు ఉండవలసిన విధానం, ఉండకూడని లేక విసర్జించవలసిన విషయాలు!
ఇవి పౌలుగారి సొంత ఉద్దేశం కానేకాదు!
పరిశుద్ధాత్ముడు దైవజనులు/
సంఘపెద్దలు,
సేవకులు ఎలా ప్రవర్తించాలో ముందుగానే నిర్ణయించి ఆదేశించిన
విధివిధానాలు! ఇవి దైవసేవకులు తప్పకుండా పాటించి తీరాలి!
ఇవన్నీ చదివిన తర్వాత ముఖ్యంగా మనకు అర్ధమయ్యేది ఏమిటంటే దైవసేవకుడు
మాదిరిగా ఉండాలి!
తను సన్మార్గంలో నడిచి సంఘాన్ని అదే సన్మార్గంలో నడిపించాలి! అన్యజనులు చేసినట్లు చెయ్యకూడదు!
నిరంతరం దేవునితో సంభంధం కలిగియుండి దేవుడు చెప్పమన్నవి భయం లేకుండా
చెబుతూ, ప్రజలను ఖండించి,
గద్దించి బుద్ధి చెబుతూ రాకడకు ఆయత్తం చెయ్యాలి!
సంఘాన్ని దేవునితో సమాధాన పరచాలి!
సంఘానికి కావలి వాడు లేదా కాపలాదారులుగా దేవుడు దైవసేవకులను/కాపరులను/పెద్దలను ఉంచారు.
కాబట్టి ఈ కాపలా డ్యూటీ తప్పకుండా చెయ్యాలి కారణం ప్రజలు దురదచెవులు
గలవారు, లోకానికి తొందరగా ఆకర్షించబడేవారు.
అంతేకాకుండా అబద్దబోధకులు బోధలు ఎక్కవ అయిపోతున్నాయి కాబట్టి సంఘాన్ని
వారినుండి తప్పిస్తూ కాపలా కాయాలి!
ప్రియ దైవజనుడా!
ఇలా చేస్తున్నావా?
అలా చెయ్యకపోతున్నట్లు అయితే నేడైనా అలా ఉండటానికి నిర్ణయం
చేసుకుంటావా? కారణం నీవు చేసేది రారాజు పరిచర్య!
మహా ఘనమైన పరిచర్య!
చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది!
అట్టి నిర్ణయం ఇప్పుడే తీసుకో!
దేవుని ఆత్మీయపోరాటంలో క్రీస్తుతో పాటు శ్రమలను అనుభవిస్తూ సాగిపో!
ఒకవేళ ప్రియమైన దైవజనుడా! నీవు ఈ శ్రమానుభవంలో సాగిపోతున్నావా?
అయితే అలసిపోకు!
రారాజు తన చేతితో నీ చెమటను తుడిచేరోజు చాలాదగ్గరలో ఉంది.
నీ కళ్ళనుండి వచ్చే ప్రతీ భాష్పబిందువును తుడిచే రోజు దగ్గరలో ఉంది! ప్రకటన 21:4; భళా నమ్మకమైన మంచిదాసుడా!
నేడు విందులో నాతోపాటు పాలుపంచుకో!
అనేరోజు నేడోరేపో ఉంది!
నేడే తేల్చుకో!
భళా నమ్మకమైన మంచిదాసుడా అని అనిపించుకుంటావో లేక సోమరియైన చెడ్డదాసుడా
అనిపించుకుంటావో!!!
దేవుడు ప్రతీ దైవజనుని తన సేవలో జ్వాలగా వాడు కొనును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
ప్రియ దైవజనమా!
మొదటిభాగంలో చెప్పినట్లు నేను రోమా పత్రిక ధ్యానాలు రాస్తున్నప్పుడు ఒకరోజు
అనుదిన బైబిల్ పఠన భాగంగా నేను తిమోతి పత్రిక చదువుతున్నప్పుడు
పరిశుద్దాత్ముడు దైవజనుడా అనే ఈ టాపిక్ వ్రాయమని చెప్పారు. ఆ దేవుని ఆజ్ఞను పాటించి,
రోమా పత్రికను తొందరగా ముగించి దీనిని మొదలు పెట్టడం జరిగింది.
ఈ టాపిక్ మొదలుపెట్టిన నాటనుండి నేను ఎన్నో ఒడిదుడుకులు, ఆర్ధికమైన సమస్యలు,
కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నాను.
ఆరునెలలు కాలం నేను నా పనికి వెళ్ళలేక పోయాను.
చాలా నిరాశలో ఉన్నా దేవునిమీద నిరీక్షణ కోల్పోలేదు!
అయితే నేను ఎంతోబాధపడుతూ ఆలోచిస్తుంటే అదేరోజు కొందరు ఫోన్ చేసి అయ్యా నేను
సేవ మానేసి తిరిగి ఏదో ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను గాని దేవుడు ఈ టాపిక్ ద్వారా ప్రతీరోజు
మాట్లాడుతూ నన్ను బలపరిచారు.
ఇక నేను మరణపర్యంతరం వరకు సేవను విడవను అని చెప్పడం జరిగింది. ఇలా అనేకులు నాకు ఫోన్ చేసి గాని,
మెసేజ్ చేసి గాని తెలియపరిచారు!
కొంతమంది ఫోన్లు ఎటెండ్ చేయలేకపోయాను క్షమించండి.
కారణం సేవా పరిచర్య మీటింగ్ లలో బిజీగా ఉంటూ మాట్లాడలేక పోయాను. సమస్తమహిమ దేవునికే చెందును గాక!
అయితే అప్పుడు నాకు అర్ధమయ్యింది దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో నా పనిలో
చేరకుండా అడ్డుకున్నారు.
ఎంతోమంది దైవసేవకులకు పనికొచ్చే దేవుని సందేశాలు వ్రాయడానికే దేవుడు
ఇన్నిరోజులు నన్ను షిప్ ఎక్కకుండా ఆపేశారు.
ఇక ఈ కరోనా ఆపదనుండి తన ఉగ్రత తీరేవరకు భద్రతకలిగిన ఒక జైలులాంటి షిప్
ఎక్కించారు. దేవుని ప్రణాలికలు అమోఘం!
అవి తొందరగా అర్ధం కావు!
నాకోసం ప్రార్ధన చెయ్యండి!
మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ నా వందనాలు! మరో టాపిక్ తో,
వీలయితే దానియేలు భక్తుని జీవితానుభవాలను ధ్యానం చేసుకుంటూ మరలా
కలుసుకొందాము.
ఇట్లు ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
రాజ కుమార్ దోనె!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి