దానియేలు




*దానియేలు--The Man of God*

*మొదటి భాగం*

 

దానియేలు 9:1— ..

1. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.

2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని.

3. అంతట నేను గోనెబట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

 

   ప్రియ దైవజనమా! వచనాలలో దానియేలు అనే భక్తుడు ప్రవక్తయైన యిర్మియా గారు ప్రవచించిన ప్రవచనం: యేరూషలేము 70 సంవత్సరాలు పాడుగా విడవబడుతుంది అనే దానిని జ్ఞాపకం చేసుకుని,   పాడుగా ఉండవలసిన 70 సంవత్సారాలు పూర్తికావచ్చాయని గ్రహించారు. గ్రహించిన వెంటనే రిలాక్ష్ కాలేదు. ఉపవాసముండి గుండెలు బాదుకుని ప్రార్ధన చేస్తున్నారు. అధ్యాయం పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది అది.

 

   ఇంతకీ భక్తుడు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? ఇక భక్తుడే ఉండవలసిన ఆవసరం ఏమొచ్చింది? విషయం తెలుసుకోవాలి అంటే కొద్దిగా చరిత్ర తెలుసుకోవాలి.

 

చెర:

 BC 722-721 లో అస్సీరియా ఇశ్రాయేలీయులను చెరలోనికి తీసుకుపోయింది.

 

 BC 609 లో ఫరో నెకో యెహోయాహాజును రాజుగా చేస్తాడు.

 

 BC 605 లో నెబుకద్నేజరు ఈజిప్టుని గెలిచి ఇశ్రాయేలీయులకు- ఐగుప్తీయులకు ఉన్న alliance భంగం చేస్తారు.

 

 BC 597 లో నెబుకద్నేజర్ స్వయంగా యేరూషలేము మీదకు దండెత్తి వస్తాడు. 2 రాజులు 24 అధ్యాయం ప్రకారం అప్పడు రాజైన యెహోయాకీను, రాజు తల్లి, భార్యలు, సైన్యం నెబుకద్నేజర్ ఎదుట లొంగిపోతారు. (యుద్ధం చేసే శక్తి లేక). అప్పటికి యెహోయాకీను వయస్సు 18 సం.లు. అప్పుడు నెబుకద్నేజర్ దేవాలయం లోని బంగారం, ఆలయ సామాగ్రి, ఇంకా రాజుని, అతని భార్యలను, 10000 మంది పరాక్రమశాలులను, 7000 మంది కంసాలులను, కమ్మరివారిని తనదేశం చెరతీసుకుపోతారు. వారిలో యేహెజ్కేలు, దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు ఉన్నారు. నెబుకద్నేజర్ సిద్కియాను రాజుగా నియమించి, పన్ను విధించి వెళ్ళిపోతాడు. అయితే చాలా మంది చరిత్రకారులు, బైబిల్ పండితులు క్రీ.పూ 605 లోనే నెబుకద్నెజరు వీరిని చెరలోనికి తీసుకుని పోయాడు అంటారు.

 

అయితే కొన్ని సం. తర్వాత అనగా

 

 BC 592 లో సిద్కియా తన సైన్యాధిపతి, సలహాదారుల సలహాలు ఆలకించి నెబుకద్నేజర్ మీద తిరుగబడతాడు.

 

 BC 588 జూలై నెలలో యేరూషలేము ముట్టడి వేయబడుతుంది.

 

 BC 587 లో నెబుకద్నేజర్ స్వయంగా వచ్చి యేరూషలెం మీద దండెత్తుతాడు.

 

 BC 586 ఆగష్టు, 14 తారీకున యేరూషలేము పట్టణం పట్టబడి, పడగొట్టబడుతుంది, మందిరం అగ్నితో కాల్చబడుతుంది.

 

     ఈవిధముగా BC 597/605 లో భక్తుడు ఇంకా అతని స్నేహితులైన హనన్యా (అననీయ), అజర్యా, మిషాయేలు ,ఇంకా ప్రవక్తయైన యేహెజ్కేలుగారు, అతని భార్య ఇంకా కొంతమందిని నెబుకద్నేజర్ ద్వారా చెరలోనికి కొనిపోబడ్డారు.  తర్వాత జరిగిన వృత్తాంతములు చాలా గతంలో ధర్శనపు ప్రవక్త అనే శీర్షికలో యేహెజ్కేలు గారిజీవితం ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాం! ఇక దానియేలు గ్రంధం ప్రకారం ఉపవాస ప్రార్ధన చేసేటప్పటికి ఈయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. ఇలాంటి ఉన్నతమైన పదవిలో ఉండి ఈయన ప్రార్ధన చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది?

 

    మొదటగా వారు 70 సంవత్సరాలు నుండి దాసులుగా ఉన్నారు. దానియేలుగారు ప్రధానమంత్రిగా ఉన్నా తన ప్రజలు బందీలుగా, బానిసలుగా పరాయిదేశంలో బాధపడుతున్నారు. ఇక తమ సొంతదేశంలో తమ ఇల్లు, తమ పట్టణాలు మరీముఖ్యంగా తమ దైవమందిరం కాల్చబడి శిధిలమై ఉన్నది. దేవుడు 70 సంవత్సరాలు గడిచాక తిరిగి వారిని తమ సొంతదేశం తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేశారు. యిర్మియా 29: 10

యెహోవా ఆజ్ఞ ఇచ్చు చున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సర ములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించు నట్లు నేను మిమ్మును దర్శింతును.

 అందుకే వారు తిరిగి తమ దేశం వెళ్లాలని దేవుని వాగ్ధానం దేవునికే గుర్తుచేస్తున్నారు. కారణం యెహోవా జ్ఞాపక కర్తలారా! విశ్రమించకుడి అని వ్రాయబడింది గాబట్టి దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు భక్తుడు! యెషయా 62: 7

యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు....

 

      అయితే ఈయన ఉపవాసముండి ప్రార్ధన చేస్తే దానిలో ప్రత్యేకత ఏముంది? ఎందుకింత బిల్డప్ అని అడగొచ్చు మీరు! అందరూ చేసినట్లు ఈయన కూడా చేశారు అనుకుంటే మీరు పప్పులోనూ తప్పులోను కాలు వేసినట్లే! ఎందుకంటే  భాగాన్ని మామూలుగా చదువుకుంటూ వెళ్తే ఏమీ అర్హం కాదు మనకి! అందుకే లోతుగా పరిశీలిద్దాం!

 

  మొదటి ప్రశ్న: *ఇంతకీ ఈయన ఉపవాసం ఉండేసమయానికి ఈయన వయస్సు ఎంత*?

 

జవాబు: మొదటి అధ్యాయం ప్రకారం ఈయన, ఈయన స్నేహితులు బాల్యంలోనే బబులోనుకు చెరలోనికి కొనిపోబడ్డారు. అది బహుశా BC 605 గాని, 597 గాని. అయితే ఎక్కువమంది ఒప్పుకునేది BC 605. అప్పటికి ఈయన వయస్సు సుమారు 14-17 సంవత్సరాలు. బైబిల్ పండితులు లెక్క ప్రకారం యిర్మియా గారు చెప్పిన 70 సంవత్సరాలు మొట్టమొదట చెరలోనికి పోయిన సంవత్సరం అనగా దానియేలు గారు, ఆయన స్నేహితులు, యేహెజ్కేలు గారు చెరలోనికి పోయిన సంవత్సరం నుండి 70 సంవత్సరాలు లెక్కపెడతారు. అంటే ఒకవేళ 605 లో చెర తీసుకుని పోతే సుమారు BC 535 లో దానియేలు గారు ప్రార్ధన చేశారు. ఒకవేళ 597 లో చెరకు పోయి ఉంటే 527 లో ప్రార్ధన చేశారు అన్నమాట! ఇక చరిత్ర ప్రకారం క్రీ.పూ. 538 లో మాదీయ-పర్షియ రాజ్యం మొదలయ్యింది. అనగా దర్వావేషు మొదటి సంవత్సరం లోనే దానియేలు గారు ప్రార్ధన చేసినట్లు మొదట వచనంలో అర్ధమవుతుంది. కాబట్టి సుమారు BC 535--  538 లో  దానియేలు గారు ఉపవాస ప్రార్ధన చేశారు. అంటే అప్పటికి దానియేలు గారి వయస్సు 14+70=84 గాని 87 గాని ఉంటుంది అన్నమాట!

 

రెండవది: *ఆయనే ఎందుకు చేశారు? చేయవలసి వచ్చింది? ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరా*?

 

అంటే లేరు అనే చెప్పాలి! మొదటగా యిర్మియా గారు BC 586 లో తన సొంత ప్రజలే తనను బలవంతంగా ఐగుప్టు దేశం తీసుకుని పోయి, అక్కడ కూడా దేవునిమాటలు హెచ్చరికలు చెబుతుంటే వీడు అక్కడ అనగా ఇశ్రాయేలు దేశంలో వదలలేదు ఇక్కడ కూడా వదలడం లేదు అని చెప్పి BC 585 లో రాళ్లురువ్వి చంపేశారు. కాబట్టి యిర్మియా గారు లేరు. ఇక తన గైడ్ యేహెజ్కేలుగారు తేలాబీబు (Tel Abib) బబులోను రాజ్యంలో అనగా సౌత్ ఇరాక్ లో 570లో  చనిపోయారు.  ఇక ఇశ్రాయేలు దేశంలో ఉన్న హబక్కూకు గారు కూడా అప్పటికి చనిపోయి ఉండవచ్చు. లేదా చాలా ముసలివాడు అయిపోయారు. ఇక జెఫన్యా గారు చనిపోయారు. ఇక హగ్గయి, జెకర్యా గార్లు ఇంకా తమ ప్రవచన పరిచర్య ప్రారంభించలేదు. ఇశ్రాయేలీయులు తిరిగి తమ దేశానికి వెళ్ళిన తర్వాత వారు పరిచర్య ప్రారంభించారు. ఇక ఎజ్రా, నెహేమ్యాగార్లు ఇంకా పుట్టి ఉండకపోవచ్చు లేదా చిన్న పిల్లలు కావచ్చు! కారణం ఎజ్రాగారి పరిచర్య కాలం క్రీ.పూ. 48—440!   కాబట్టి ఇలాంటి స్తితిలో ఎవరూ వారి ప్రజలకోసం మొర్రపెట్టి వారిని నడిపించే వారు లేరు.

  

       ఇప్పుడు చెప్పండి,  ఒక వృద్ధుడు, ఒక అత్యుత్తమైన హోదాలో భాధ్యతలో ఉన్న ఒక వ్యక్తి తన ప్రజలు చెరలో ఉన్నారు అని, ఇంకా తన దేశం పాడైపోయి ఉంది అని  ఉపవాసముండి ప్రార్ధన చేస్తున్నారు. అయ్యో! ప్రభువా! మేము చేసిన పాపాలు వలననే, మా పితరులు నీ మాట విననందువలననే మాకు ఈ కీడు కలిగింది. మాకు సిగ్గే తగియున్నది అని ఒప్పుకుంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు.  ఎలా చేస్తున్నారు? 3వ వచనం

అంతట నేను గోనెబట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.

 

ఇక ఈవచనాలలో ముఖ్యమైన వచనం, బైబిల్ గ్రంధంలో గల ఉత్తమమైన వచననాలలో శ్రేష్టమైన వచనం దానియేలు గారు అడుగుతున్నారుఅయ్యా మా మంచితనం వలన మేము ప్రార్ధన చెయ్యడం లేదు గాని నీ గొప్ప కనికరములను బట్టి నిన్ను అడుక్కుంటూన్నాను. దయచేసి దయచేసి మమ్ములను జ్ఞాపకం చేసుకుని చెరనుండి విడిపించమని అడుగుతున్నారు. Daniel(దానియేలు) 9:18

18. నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము. 

 

 ఎంతగొప్ప ప్రార్ధనండి ఇది! అవును కదా మనమందరం అపవిత్రమైన వారం! మాటిమాటికి దేవుని మాటను అతిక్రమించే వారం కాబట్టి మనము అడగటానికి అనర్హులం! అయితే దేవుడు కనికరించే లక్షణం గలిగిన వాడు కాబట్టి ఆయన గొప్ప కనికరములను జ్ఞాపకం చేసుకుంటూ మనం అడగగలం!

 

    ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం! ఒక వృద్ధుడు ఘనుడు, హోదా అదీకూడా ప్రధానమంత్రి హోదా, అనగా కేవలం బబులోను సామ్రాజ్యమే కాదు, బబులోను, పారశీక (పర్షియా- నేటి ఇరాన్), మాదీయ సామ్రాజ్యాలు అన్నిటికీ ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఎలా కాళీ చేసుకుని, వయస్సు మీరిపోయినా ఉపవాసముండి ప్రార్ధన చేస్తుంటే- హోదా లేని నీవు నేను, ప్రార్ధించే తీరిక, అవకాశం ఉన్నా గాని, మన పొరుగువారు నశించిపోతుంటే దేవుణ్ణి తెలుసుకోకుండా విగ్రాహారాధనలో నాశనానికి, నరకానికి జోగుతుంటే నీవెలా మౌనముగా ఉండగలుగుతున్నావు? ఫేస్బుక్, వాట్సప్ లో పనికిమాలిన చాటింగ్ చేయడానికి, పనికిమాలినవి చూడటానికి నీకు సమయముంది గాని నాశనానికి జోగుతున్నవారికి సువార్త చెప్పడానికి, వారికోసం ప్రార్ధన చెయ్యడానికి నీకు సమయం లేకుండాపోయింది. పనికిమాలిన సీరియల్లు చూడటానికి సమయం ఉంది గాని నశించిపోతున్న ఆత్మలకోసం పట్టుదలతో ఉపవాసముండి ప్రార్ధన చెయ్యడానికి సమయం లేదు, ఆరోగ్యం సహకరించడం లేదు అంటున్నావు!! ఇదేనా దేవుడు చూపించిన ప్రేమ? ఇందుకేనా యేసయ్య నిన్ను రక్షించినది? ఇందుకేనా దేవుడు నిన్ను ఏర్పాటుచేసుకుని ప్రత్యేకపరచుకొని పిలుచుకున్నది?!! 

ఒక ముసలివానికున్న జ్ఞానం భారం ఆలోచన నీకు లేదా?

నేడు ఈ కరోనా వచ్చి దేశం మొత్తం, చివరికి ప్రపంచంలో మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లిన పరిస్తితిలో భారంతో ఈ వ్యాధి నిర్మాలన కోసం, మానవుల మనుగడ కోసం ఉపవాసముండి ప్రార్ధించడం మానేసి తాపీగా పిచ్చి కబుర్లు చెప్పుకుంటున్నారు గాని ప్రార్దిస్తున్నావా  ప్రియ సహోదరీ సహోదరుడా! అయ్యా బ్రద్దలైన గోడలదగ్గర నిలబడి శత్రువు నీమీద ఎటాక్ చేయకుండా కాపలా కాయమని ప్రభువు చెబితే తాపీగా కూర్చుంటున్నావ్ గాని కాపలా కాస్తున్నావా? ప్రియ దైవజనుడా! సంఘానికి కాపలాగా ఉంటూ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉండమని చెబితే ఎప్పుడూ దీవెన, ఆశీర్వాదం, స్వస్తత అని చెబుతూ కాలయాపన చేస్తున్నావ్ గాని సాతానుగాడు అనేకమైన దుర్భోదలు సంఘం లోనికి చొప్పిస్తూ సంఘాన్ని విశ్వాసులను తప్పుడు బోధలలోనికి ఈడ్చుకుపోతుంటే తాపీగా కూర్చోన్నావేమి దైవజనుడా! ఇది తగునా?

కరోనా వచ్చి ప్రజలు మరణిస్తుంటే ప్రియ దైవజనుడా, ప్రియ విశ్వాసి, సంఘపెద్డా! దానియేలు గారిలాంటి కన్నీటి ప్రార్ధన ఉపవాస ప్రార్ధన ఏది?

 

యిర్మియా 9: 1

నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.  ..... అని విలపిస్తున్న యిర్మియా గారిలాంటి కన్నీటి ప్రార్ధన ప్రార్ధనా భారం, ఆత్మల భారం నీకుందా ప్రియ స్నేహితుడా!!

 

కాల్చబడిన పట్టణ పునరుద్ధరనకోసం ఉపవాసముండి ప్రార్ధించిన నెహేమ్యా, ఎజ్రా, దానియేలు గారిలా ప్రార్ధించాల్సిన అవుసరం ఉంది.

 

     నాదేశాన్ని రక్షిస్తావా, నన్ను చంపుతావా అని దేవుని సన్నిధిలో ఏడ్చి,ఏడ్చి పేగులు బయటకొచ్చి, చనిపోయి తన దేశాన్నే రక్షించుకొన్న జార్జ్ ముల్లర్ గారిలాంటి భక్తులు అవుసరం నేడు.

 

     ప్రపంచ పటములోని భారత దేశం మీద తన మోకాళ్ళ నుంచి, మన దేశ రక్షణకై భారము కలిగి ప్రార్దించారు విదేశీయుడైన విలియం కేరి.

 

     ప్రియ దైవజనుడా! సంఘకాపరీ! ప్రసంగీకుడా! సంఘపెద్దా! ఏం చేస్తున్నావ్? బలిపీటానికి, మండపానికి మధ్య నిలువబడి *కన్నీటితో* ప్రార్ధించమని దేవుడు సెలవిచ్చారు. అనగా సంఘానికి-దేవునికి మధ్యలో కన్నీటితో రాయభారం చేయమని, సంఘాన్ని దేవునితో సమాధానపరచి దేవునితో ఐక్యము చేయమని నీకు సెలవిస్తే ఏం చేస్తున్నావ్?

 

మన గురించి, మన వారి గురించి ప్రార్ధనా విజ్ఞాపన చేసే అనుభవం, రోదించే అనుభవం మనకుందా?

 

     ఇన్ని చెప్పినా ఫేస్బుక్ వాట్సప్ సోషల్ మీడియాలో పనికిమాలిన చెత్త చూడటానికి ఉపయోగిస్తున్నావు, బూతు బొమ్మలు, సినిమాలు, జోకులు చూడటానికి వినడానికి ప్రయత్నం చేస్తున్నావు గాని దేవుని వాక్యం మీద గాని, ప్రార్ధన మీద గాని మనస్సు  లేకుండా, సువార్తభారం లేకుండా, ఆత్మల భారం లేకుండా ఉంటున్న సహోదరి సహోదరుడా/ సేవకుడా/పెద్దా ! నీవు తప్పించుకోగాలవా? తప్పించుకోలేవు సుమీ! త్రాసులో వేస్తే తక్కువగా కనబడతావు! నేడే పశ్చాత్తాపపడి ఆయన పాదాలమీద పడి, మనలను మనం సరిదిద్దుకొని అప్పుడు మన పొరుగువారి కోసం నశించిపోతున్న ఆత్మలకోసం, కరోనా కోసం, మన గ్రామం కోసం, మనం రాష్ట్రం కోసం, సంఘం కోసం, దేశం కోసం భక్తులు ప్రార్ధించినట్లు ప్రార్ధిద్దాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*దానియేలు--The Man of God*

*రెండవ భాగం- ఉపోద్ఘాతం*

దానియేలు 1:14

1. యూదారాజగు యెహో యాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడివేయగా

2. ప్రభువు యూదా రాజగు యెహో యాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజు చేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.

3. రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

4. తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.  ..

 

   ప్రియ దైవజనమా! యేసుక్రీస్తుప్రభులవారి ప్రశస్తనామంలో అందరికీ శుభాది వందనములు! ఆధ్యాత్మిక సందేశాలు-7 లో భాగంగా మరోసారి మిమ్మును రకంగా కలుసుకోడానికి కృప చూపిన దేవాదిదేవునికి వందనములు! రకంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! మరలా ఒకసారి బైబిల్ గ్రంధంలో గల భక్తులు- వారి జీవితాలలో జరిగిన అనుభవాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని సారి దానియేలు భక్తుని జీవితానుభవాల ద్వారా ధ్యానం చేసుకుందాం! వీలయితే కొద్దిగా ఆయన దర్శనాలను కూడా ధ్యానం చేసుకుందాం! దానియేలు భక్తుని దర్శనాలు ధ్యానం చెయ్యాలి అంటే గొప్ప బైబిల్ జ్ఞానం కావాలి! నాకు అంత జ్ఞానము లేదు గాని కొద్దిగా క్లుప్తంగా మనలాంటి సామాన్యులకు అర్ధమయ్యే విధంగా ధ్యానం చేసుకుందాం. మొదటగా దానియేలుగారి కోసం ధ్యానం చేసుకుందాం! ఆయనకోసం బాల్యము, చెర, తర్వాత ఆయన అంచెలంచులుగా ప్రధాన మంత్రి పదవిపొంది మొత్తం 5గురు రాజుల దగ్గర అతిముఖ్యమైన పదవిని పొందుకున్నట్లు మనకు దానియేలు గ్రంధం చదివిత్తే అర్ధం అవుతుంది!

 

పేరు: దానియేలు

పేరుకు అర్ధం: దేవుడే తీర్పు తీర్చువాడు లేక దేవుడే నా తీర్పరి లేక దేవుడే నా న్యాయాధిపతి

 

జననం: సుమారు. క్రీ.పూ. 620 కావచ్చు! దానియేలు 1:1 ప్రకారం రాజైన యెహోయాకీము దినములలో చెరకు పోయారు. అనగా రాజైన యోషియా గారి దినములలో జన్మించి ఉండవచ్చు!

 

తల్లిదండ్రులు: తెలియదు! అయితే దానియేలు 1:1—4 ప్రకారం ఈయన రాజ వంశానికి చెందినవాడు అని తెలుస్తుంది. అనగా రాజైన యెహోయాకీము కు దగ్గరబందువు. దావీదు వంశం. యూదా గోత్రము!

(గమనించాలి. మనకు బైబిల్ లో ముగ్గురు దానియేలులు కనిపిస్తారు. 1. దావీదు గారి కుమారుడు ఒకరు దానియేలు; రెండు. మనకు ఈ దానియేలు గ్రంధంలో కనబడే  దానియేలు గారు; మూడు: నెహేమ్యా, ఎజ్రాగ్రంధాలలో కనబడే దానియేలు; గమనించాలి , ఈ దానియేలు , మనం ధ్యానం చేసే దానియేలు గారు ఒకరు కారు!! ఆ దానియేలు గారు ఈతామారు గోత్రము, అనగా యాజకుల వంశమునకు లేవీ గోత్రమునకు చెందినవారు)

 

జన్మస్థలం: యేరూషలేము;

 

విద్య: మొత్తం యేరూషలేములోనే జరిగింది కారణం 1:—4 ప్రకారం సకల విద్యా ప్రవీణత కలిగి, తత్వజ్ఞానము అనగా ఫిలాషఫీ నేర్చుకున్నవారినే బబులోను తీసుకుపోయారు.

 

చెర: క్రీ. పూ. 605 లో బబులోను రాజైన నెబుకద్నెజరు దానియేలు హనన్యా మిషాయేలు, అజర్యాలను, యెహెజ్కేలుగారిని చెరలోనికి తీసుకుని పోయాడు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 14-17 సంవత్సరాలు.

 

ప్రత్యేకతలు: 1:—4 ప్రకారం మొదటగా రాజవంశానికి చెందిణ వారిలో ముఖ్యుడు, రెండు లోపము లేనివాడు, మూడు సౌందర్యమైనవాడు అనగా చాలా అందగాడు, నాలుగు  సకల విద్యా ప్రవీణత కలిగి, తత్వజ్ఞానము అనగా ఫిలాషఫీ నేర్చుకున్నవాడు; 8—14 ప్రకారం ఎంతోభక్తిగలవాడు, లేఖనాల మీద పట్టున్నవాడు;

 

వివాహం: దానియేలుగారు వివాహం చేసుకోలేదు, అనడానికి రుజువులైతే లేవు, చేసుకున్నాడు అనడానికి కూడా రుజువులు లేవు!అయితే మొదటి అధ్యాయంలో వారు మాటిమాటికి నపుంసకుల అధిపతితో మనవిచేసుకున్నట్లు వ్రాయబడింది కాబట్టి దానియేలుగారిని అతని స్నేహితులను నపుంసకులుగా చేసినట్లు నమ్ముతారు. అంతేకాకుండా ఆరోజులలో అస్శూరు, మాదీయులు, పర్షియా వారు పురుషులను నపుంసకులుగా మార్చేసి వారి గృహాలమీద గృహనిర్వాహకులుగా , రాజ కార్యాలు చూసేవారుగా పెట్టుకునేవారు కారణం తద్వారా వారి బార్యలకు గాని వారి పిల్లలకు గాని ఇబ్బందులు లేకుండా! ఇంకా యెషయా 39 అధ్యాయంలో గల 6,7 వచనాల ప్రవచనాల ప్రకారం దానియేలు గారు అతని స్నేహితులు హనన్యా, అజర్యా, మిశాయేలు కూడా నపుంసకులుగా మార్చేశారు అని నమ్మవచ్చు!

 

పరిశుద్దుడు, నీతిమంతుడు, పాపులలో చేరని వాడు: మొదటి అధ్యాయం ప్రకారం దానియేలు అతని స్నేహితులు రాజు భుజించే ఆహారం, పానం చేయకుండా తమనుతాము పవిత్రంగా కాపాడుకొన్నారు. (అసలు రాజ భోజనం ఎందుకు చెయ్యలేదు అనేది తర్వాత భాగాలలో ధ్యానం చేసుకుందాం); ఇంకా 6 అధ్యాయం, 9 అధ్యాయం ప్రకారం నీతిమంతుడు, ప్రార్ధనాపరుడు అని అర్ధమవుతుంది.

 

దానియేలు పదవులు:  రెండవ అధ్యాయం ప్రకారం బబులోను సంస్థానమంతతికి అధిపతిగా, బబులోను జ్ఞానులకు ప్రధానిగా నియమించారు. ఇంకా తర్వాత రోజులలో క్రమక్రమంగా ప్రధానమంత్రి పదవికి వెళ్ళినట్లు చూడగలం! అయితే జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే దానియేలు గారు 5గురు రాజుల దగ్గర ముఖ్యమైన పదవులు చేపట్టారు. (నిజానికి ఏడుగురు రాజులు. అయితే బబులోను ఆచారం ప్రకారం మొదటి సంవత్సరాన్ని లెక్కలోనికి తీసుకోరు. ఇంకా ఒక సంవత్సరం మొత్తం పాలించకపోతే వారిని రాజులుగా అంగీకరించరు)

 

రాజులకు నమ్మకమైన వాడు : As per British Museum Series Vol 1, Pl 68, no 1 దానియేలు గారు క్రింది రాజుల దగ్గర పనిచేశారు.

1). నెబుకద్నేజర్  43 సం.లు—BC 606—562

2) అతని కొడుకు ఎవిల్-మెరోదాక్ – 2 సం.లు; BC 561—560

) ఎవిల్-మెరోదాక్ ని చంపి అతని అల్లుడు నెరిగ్లిస్సర్ – 4 సం.లు; BC 560—556

4) నెరిగ్లిస్సర్ కొడుకు లాబాస్ ముర్డుక్ – 9 నెలలు BC 556(ఒక సంవత్సరం కంటే తక్కువ కాలము)

5) నెబుకద్నేజర్ రెండవ భార్య కొడుకు నబోనిదాస్- 1౩ సం.లు; BC 555—542;

6) నెబుకద్నేజర్ మనవడు, నబోనిదాస్ కొడుకు బెల్షస్సర్౩ సం.లు ; BC 542—539

6) దర్యావేషు

7) కోరేషు

ఇంతమంది దగ్గర పనిచెయ్యగలిగారు అంటే నమ్మకమైన వాడు మరియు యోగ్యుడు కాబట్టి ఇంతమంది మారినా ఆయన స్థానం పెరిగింది గాని తగ్గలేదు, పోలేదు.

 

దేవునికి ఇష్టుడు, ప్రియుడు: గ్రంధము ప్రకారం దానియేలు గారి భక్తిని విశ్వాసము నమ్మకాన్ని బట్టి దేవుడు దానియేలు నీవు బహుప్రియుడవు అని దేవుని దూతలచేత పిలువబడ్డారు.  9:23; 10:11; 18; ఇంకా యేహెజ్కేలు గ్రంధంలో దేవునిచేత నీతిమంతులుగా పిలువబడిన వారి లిస్టులో రెండవ పేరు దానియేలు! 14:14; 20;

 

    నీతికి యధార్ధతకు ప్రతిఫలంగా మొదటగా తన స్నేహితులు అగ్ని గుండములో ప్రాణాలతో వేయబడ్డారు, గాని దేవుడు అత్యద్భుతముగా కాపాడారు. ఇక దర్యావేషు కాలంలో ఆయనను సింహపు బోనులో వేశారు. అయతే దేవుడు తనదూతను పంపించి కాపాడారు!

 

దర్శనాలు చూచేవాడు: దానియేలు గ్రంధంలో 1—6 వరకు ఆయన జీవితంలో జరిగిన అంశాలు అయితే 7—12 వరకు ఆయన దర్శనాలు చూడవచ్చు. ఇంకా 2 అధ్యాయంలో ఉన్న నెబుకద్నెజర్ కలదానియేలు దర్శనముగా పిలుస్తారు పండితులు!  కేవలం దర్శనాలు చూడటమే కాకుండా దర్శనాలకు కలలకు అర్ధం చెప్పేవాడుగా 2 అధ్యాయం, 5 అధ్యాయం ప్రకారం చూడవచ్చు!

 

మరణం: కోరేషు పాలన వరకు ఆయన బ్రతికినట్లు 1:21, ఇంకా ప్రకారం తెలుస్తుంది. అయితే ఆయన అదే ప్రాంతంలో చెరలోనే చనిపోయారు. అయితే ఆయన సమాధి షూసను కోటలో ఉన్నట్లు చెబుతారు. ఇంకా కొంతమంది ఆహాష్వేరోసు రాజుదగ్గర నామాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నామాను దానియేలుగారిని ఆయన స్నేహితులను చంపించేశాడు అంటారు .అయితే దీనికి ఆధారాలు తక్కువ! కారణం దానియేలు గ్రంధంలో వ్రాయబడిన ఆహాష్వేరోసు , ఎస్తేరు గ్రంధంలో వ్రాయబడిన ఆహాష్వేరోసు ఇద్దరు ఒకరు కారు. దానియేలు గ్రంధంలో ఆహాష్వేరోసు, ఆహాష్వేరోసు-1; ఎస్తేరు గ్రంధంలో ఆహాష్వేరోసుఆహాష్వేరోసు-2. చరిత్ర ప్రకారం మనకు ఇద్దరు దర్యావేషులు, ఇద్దరు ఆహాష్వేరోసులు, నలుగురు అర్తషహస్తలు కనిపిస్తారు. కాబట్టి ఇద్దరు ఆహాష్వేరోసుల పాలనకు మధ్య సుమారు 60 సం. కాలం ఉంది.

 

   ప్రియ దైవజనమా! ఒక యవ్వనస్తుడు చిన్నతనంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని తన జీవితాన్ని, సాక్ష్యాన్ని,శీలాన్ని కాపాడుకుంటూ ఉండగా అతనిని చెరలోనికి తీసుకుని పోయినా దేవుణ్ణి వదలనందున దేవుడు ఆయనకు ఎన్నెన్నో పదవులు ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి మరవకుండా, ప్రార్ధన మానకుండా నీతిని భక్తిని విడవకుండా ఉన్నందుకు ఆయనను దర్శనాల ప్రవక్తగా మార్చారు. తన జీవితమంతా బబులోను చెరలోనే గడిపినా భక్తిని విశ్వాసమును విడువలేదు!

 

 ప్రియ దైవజనమా! అటువంటి సవాలు కరమైన జీవితం నీవు జీవించగలవా?

దైవాశీస్సులు!

 

*దానియేలు--The Man of God*

*మూడవ భాగం*

*దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా- బెల్తెషాజర్, షడ్రక్, మేషక్, అబెద్నేగో

 

దానియేలు 1:14

1. యూదారాజగు యెహో యాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడివేయగా

2. ప్రభువు యూదా రాజగు యెహో యాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజు చేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.

3. రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

4. తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.  ....

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం!

పై వచనాలలో మొదటగా యెహోయాకీము ఏలుబడి మూడవ సంవత్సరంలో అనగా క్రీ.పూ. 605 సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు యేరూషలేము మీదకు దండెత్తి దేవుని ఆలయాన్ని దోచుకుని  కొంతమందిని చెరలోనికి తీసుకునిపోయాడు. దానిలో యేహెజ్కేలు గారితో పాటు దానియేలు గారు, హనన్యా, మిషాయేలు, అజర్యాలు ఉన్నారు.  అయితే రాజు తన నపుంశకుల అధిపతిని పిలిచి ఇలా అంటున్నాడు. —6 ...

3. రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

4. తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

5. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.

6. యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి. . 

 

అయితే భాగాలు చదవటానికి బాగున్నాయి గాని నిజానికి ఏమి జరిగేది అక్కడ ....

 

అప్పటి పరిస్తితులు: విధముగా చెరలోనికి తీసుకొని వచ్చినవారిని రోజులలో Concentration Camps లో పెట్టేవారు. వీటినే Settlements అనికూడా అనేవారు.  అవి చెక్కలతో తయారుచేయబడిన పెద్ద పెద్ద గదులతో, అనేక బెడ్స్ పెట్టి, క్యాంపు దాటడానికి వీలులేకుండా ఇనుప కంచె వేసేవారు. విధ్యుత్ కనుగొన్న తర్వాత కంచెకు కరెంట్ కనెక్షన్ ఇచ్చేవారు. అనగా ఒకరకమైన జైళ్ళు లాంటివి అన్నమాట!   Concentration Camps  లో ప్రజలను పెట్టి తమ పనులను బలవంతంగా చేయించుకోనేవారు. ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా చంపేసే వారు. అందుకే 10000మంది పరాక్రమశాలులను తమ పక్ష్యంగా పోరాడటానికి, కంసాలివారిని, కమ్మరివారిని తన పట్టణం కట్టుకోడానికి, తమ ఆయుధాలు తయారుచేయడానికి తీసుకొని పోయారు.

 

ఉదా: రెండవ ప్రపంచయుద్దానికి ముందు జర్మనీ వారు తాము జయించిన దేశాలలో skilled persons ని తీసుకొని వచ్చి  Concentration Camps  లో ఉంచి , అమెరికా డాలర్లు, బ్రిటిష్ పౌండ్లు దొంగనోట్లు చేయించేవారు వాటితో అమెరికా మరియు బ్రిటిష్ వారి ఆర్ధిక వ్యవస్తను దెబ్బతీయడానికి. ఇంకా మారణాయుదాలు తయారు చేయించేవారు.

 

     సరిగ్గా ఇలాంటి పనికోసమే ఇశ్రాయేలీయులను కూడా తీసుకొచ్చారు. గాని నెబుకద్నేజర్ అంత దుర్మార్గుడు కాదు కాబట్టి కేవలం తన పట్టణం కట్టడానికి, రాజ్యంకోసం మాత్రమే వారిని ఉపయోగించాడు. వారిలో వీరంతా ఉన్నారు.

 

   కాబట్టి ఇలాంటి పరిస్తితులలో వారు అక్కడకు అడుగుపెట్టారు. అయితే అక్కడకు వెళ్ళిన వెంటనే వారు వీరి పేర్లు మార్చేశారు.

 

దానియేలు: దేవుడే నా న్యాయాధికారి, దేవుడే తీర్పు తీర్చువాడు

హనన్యా/ అననీయ: యెహోవా దయామయుడు లేక దేవుడు దయామయుడు

మిషాయేలు : దేవునితో సమానమెవరు?

అజర్యా: దేవుడు ఆదుకొనేవాడు!

 

వారు పెట్టిన పేర్లు:

 

దానియేలు- బెల్తెషాజర్: బేల్ ( ప్రభువు) అనగా వారి నెగో_నిన్ను కాపాడుతాడు లేక బేల్ యొక్క యువరాజు

హనన్యా: షడ్రక్: చంద్ర దేవత, లేక పాపము యొక్క దాసుడు; పాపానికి దాసుడు

మిషాయేలు: మేషక్:  శుక్ర దేవతపేర్లు

అజర్యా: అబెద్నేగో: నెగో యొక్క బానిస (నెగో వారి ముఖ్య దేవత)

 

పేర్లు ఎందుకు మార్చారు?

 

జవాబు చాలా సింపుల్: మొదటగా వారిని దేవుడైన యెహోవానుండి దూరం చేయడానికి! వారి అసలు పేర్లతో పిలిస్తే వారి దేవుడు వారికి గుర్తుంటాడు అని తలంచి మొదటగా దేవుని నుండి దూరం చేయడానికి, భక్తి నుండి వారి దేవతారాధన మీదకు మరల్చాలని వారి మొదటి తలంపు! ఇంకా దేవుడైన యెహోవా కంటే వారి దేవతలే బలమైన వారు అని, ఎక్కువ భలప్రభావాలు గలవారు అని చెప్పాలని వారి ఉద్దేశ్యం, కారణం ఇశ్రాయేలు వారు బబులోను వారి దగ్గర ఓడిపోయారు కాబట్టి దేవుడైన యెహోవాకు బలప్రభావాలు లేవు అని చెప్పడం వారి ఉద్దేశం!

 

   ప్రియ యవ్వనస్తుడా! ప్రియ విశ్వాసి! క్రైస్తవుడా! ఇది సాతానుగాడి ఎత్తు! నీకు కొత్త పోష్టు ఇచ్చి, లేక గిఫ్టులు ఇచ్చి నిన్ను పొగిడి, నిన్ను దేవునినుండి దూరం చెయ్యాలని సాతాను గాడి ఎత్తు! వారు మన ఆరాధనలకు వచ్చి మేము మీ పండగలకు ఆరాధనలకు వస్తున్నాం కాబట్టి నీవుకూడా మా పండగలకు వచ్చి మేము పెట్టేది తిను అంటారు. వెళ్ళకపోతే ఏమనుకొంటారో? ఇదే కదా మీ ఉద్దేశ్యం! దీనినే దురభిమానపాపము అని బైబిల్ చెబుతుంది. దీనినుండి చాలా జాగ్రత్తతో తప్పించుకోవాలి! మరి ప్రియ చదువరీ! నీవు తప్పించుకుంటున్నావా?

 

   ఇక రెండవదిగా ముగ్గురు యవ్వనస్తులు 814 వచనాల ప్రకారం వారు రాజు బుజించే ఆహారం, రాజు బుజించే పాణం చెయ్యలేదు. ఎందుకు? అసలు దానిలో ఏముంది? బబులోను వారికి-  ఇశ్రాయేలు వారి ఆచారాలు తెలుసు! వారు అపవిత్రమైన జంతువులు తినరు అని! లేవీ 11 అధ్యాయం. ఇంకా విగ్రహాలకు అర్పించినవి అసలే తినరు అని తెలుసు! అయితే బబులోను వారు ఏవైతే ఇశ్రాయేలీయులకు అపవిత్రమో వాటినే వారి దేవతలకు బలిచ్చి, వాటినే తినేవారు. ఇంకా వీరికి కూడా పెట్టేవారు. అయితే చాలామంది చెర సంభంధమైన యూదులు కూడా తినడం మొదలుపెట్టారు. కాని నలుగురు మాత్రం తినలేదు! దానికోసం వారు ఎలా నపుంసకుల అధిపతితో మనవి చేశారో ఇక్కడ చూడగలం! రాజు బుజించే ఆహారం అనగా అపవిత్రమైన జంతువులు మాంసం, విగ్రహాలకు బలిచ్చిన మాంసం తినకుండా, విగ్రహాలకు ప్రార్ధించిన ద్రాక్షాపానం చేయకుండా ఇంకా మధ్యముతో మత్తులై ఉండకుండా నలుగురు తమ జీవితాలను కాపాడుకొన్నారు. దీనికోసం చాలా చరిత్రకారులు రాశారు. మచ్చుకు ఇద్దరిది చూద్దాం!

 

Book of Tobit (1:10-11, RSV) which refers to the exiles of the northern tribes: When I was carried away captive to Nineveh, all my brethren and my relatives ate the food of the Gentiles: but I kept myself from eating it, because I remembered God with all my heart.

 

తోబితు అనే గ్రంథం లో ఇలా ఉంది: నేను చెరలోనికి నీనెవె నగరానికి తీసుకుని రాబడినప్పుడు నా సహోదరులు, బంధువులు అన్యుల ఆహారం, మాంసం తినడం మొదలుపెట్టారు. అయితే నేను  అపవిత్రమైనవి తినలేదు. కారణం నా హృదయపూర్వకముగా దేవున్ని నమ్ముతున్నాను.

 

A similar reference is found in 1 Maccabees (1:62-63, RSV), But many in Israel stood firm and were resolved in their hearts not to eat unclean food. They chose to die rather than to be defiled by food or to profane the holy covenant; and they did die.70

 

మక్కాబీలు:

చాలామంది యూదులు అపవిత్రమైనవి తినలేదు. వారు చనిపోడానికైనా సిద్ధపడ్డారు గాని వారి జీవితాలను అపవిత్ర పరచుకోలేదు.

 

   కాబట్టి యవ్వనస్తులు ఇలా దేవునికోసం నిలబడి తమ జీవితాలు పవిత్ర పరచుకొన్నారు. పదిరోజుల పరీక్షలో గెలుపొందారు. చివరికి మూడు సంవత్సారాలు ట్రైనింగ్లో అందరికంటే ఎక్కువ మార్కులతో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ప్రియ దేవుని బిడ్డ! నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ పక్షంగా నిలబడి నీకు బదులుగా తను కార్యాలు చేస్తారు. నలుగురు దేవునికోసం నిలబడ్డారు. దురభిమానపాపం వారిని ప్రలోభపెట్టినా ప్రలోభంలో పడకుండా జీవితాలు, ఘటాలు, సాక్ష్యాలు కాపాడుకొన్నారు. అందుకే దేవుడు వారిని అసాధారణ స్తితిలో కాపాడి గొప్ప విజయాలు ఇచ్చారు. సాతానుడు వారిపేరులు మార్చి దేవునినుండి దూరం చేద్దామని ప్రయత్నించిన దేవుడే వారి గుండెల్లో ఉన్నాడు గనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవునికోసం నిలిచారు,.

 

మరి నీవు రకంగా జీవించగలవా?

 

దైవాశీస్సులు!

 

 

 

 

*దానియేలు--The Man of God*

*నాల్గవ భాగం-మర్చిపోయిన కల*

దానియేలు 2:1,10,11 ..

1. నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను. .

10. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్యగలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు.

11. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం!

గతభాగంలో ఈ నలుగురు యవ్వనస్తుల భక్తిప్రవర్తనల వలన వారు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చూసుకున్నాం! ఇంకా వారు పనికిమాలిన భోజన పదార్ధాలు కోసం దేవునిపైగల ప్రేమ విశ్వాసాలను వీడనట్లు చూసుకున్నాం! గమనించవలసినది ఏమిటంటే ఈ దానియేలు గ్రంధము 1—6 వరకు ఆయన జీవితంలో ఆయా రాజుల కాలములలో ఏమి జరిగింది అనేదానిని ఒక క్రమబద్ధంగా రాసుకువచ్చారు. ఇక 7—12 వరకు ఆయనకు వచ్చిన దర్శనాలు/ప్రవచనాలు మరల మొదటినుండి క్రమబద్ధంగా రాసుకు వచ్చారు.

 

   సరే, రెండవ అధ్యాయం మొదటి వచనంలో నెబుకద్నెజర్ ఏలుబడిలో రెండవ సంవత్సరం లో ఒక కల వచ్చింది అని వ్రాయబడింది. 13 వచనంలో జ్ఞానులతోపాటు వారికంటే ముందుగ నలుగురిని చంపాలని చూశారు! ఏమిటిది? నెబుకద్నెజర్ పాలన  మొదటి సంవత్సరంలో వీరిని చెరలోనికి తీసుకుని వచ్చి మూడు సంవత్సారాలు ట్రైనింగ్ ఇచ్చారు కదా! మరి ఇప్పుడు రెండవ సంవత్సరంలో ఎలా జ్ఞానులకు బదులు వీరిని చంపాలని చూశారు? అప్పటికి వీరి ట్రైనింగ్ పూర్తికాలేదు అని అనుమానం వస్తుంది కదా! ఇది అర్ధం కావాలంటే  గత రెండు బాగాల్లో చెప్పినట్లు  బబులోను రాజ్యంలో లెక్కలు గుర్తుకు తెచ్చుకోవాలి. మొదటి సంవత్సరాన్ని వారు లెక్కపెట్టరు. దానిని accession year అంటారు అనగా ప్రారంభసంవత్సరం. సంవత్సరం పూర్తయిన తర్వాత సంవత్సరాన్ని అనగా ఇశ్రాయేలీయులు, మన లెక్కలు ప్రకారం రెండవ సంవత్సరాన్ని మొదటి సంవత్సరంగా పరిగణిస్తారు. అప్పుడు మరో అనుమానం రావాలి! మరి నెబుకద్నెజర్ మొదటి సంవత్సరంలో చెరకు తీసుకుని వెళ్ళారు అని వ్రాయబడింది కాబట్టి మన/ ఇశ్రాయేలు లెక్క ప్రకారం రెండవ సంవత్సరం అవుతుంది కదా! గమనించాలి. దానియేలు గారు తను ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశము యొక్క లెక్కలు చొప్పున వ్రాసారు. అయితే తన జీవితం మొత్తమంతా చెరలోనే బబులోను దేశంలోనే గడిపారు కాబట్టి బబులోను వెళ్ళాక బబులోను లెక్క చొప్పున వ్రాస్తున్నారు. అంతేకాకుండా 2:4 వచనం నుండి ఏడవ అధ్యాయం వరకు దానియేలు గారు సిరియా బాషలోనే గ్రంధాన్ని రాశారు.  కాబట్టి ఇక్కడ రెండవ సంవత్సరమంటే వీరు దేశం వెళ్ళిన మూడవ సంవత్సరం! అనగా వారి ట్రైనింగ్ పూర్తిచేసుకుని డాక్టరేట్ పుచ్చుకున్న తర్వాత జరిగిన సంఘటన!

 

     అధ్యాయంలో మనకు మూడు ప్రాముఖ్యమైన సంఘటనలు కనిపిస్తాయి! మొదటిది: చక్రవర్తి కలగని మరచిపోవడం!

రెండవది: దానియేలు గారు, అతని స్నేహితులు ప్రార్ధించి కలను తెలుసుకొని చక్రవర్తికి చెప్పడం!

మూడవది: ప్రాముఖ్యమైన కల! జరుగబోయేది దేవుడు నెబుకద్నరజర్ కి ముందుగానే చెప్పడం, యేసుక్రీస్తుప్రభులవారి గురించి ఆయన శాశ్వత రాజ్యం కోసం ముందుగానే దర్శనభావంగా వివరించడం! (ఈ దర్శన భావం కోసం చివరలో ధ్యానం చేద్దాం)

 

   రాజుకి కలవచ్చింది. అది ఆయనను కలవర పరచింది. ఉదయం లేచి తన ఆస్థానంలో ఉన్న శకునగాండ్రను, గారడీవిద్య గలవారిని మాంత్రికులను, కల్దీయులను పిలిచాడు. వీరికి రాజు చెబుతున్నాడు: నాకో కలవచ్చింది. అది చాలా వింతగా ఉంది. దాని భావం మీరు చెప్పాలి. అంటే వారు అన్నారు: ఓస్ ఇంతేనా? దయచేసి కలను మాకు చెప్పండి మేము దాని భావం చెబుతాము అన్నారు. వెంటనే రాజు అన్నాడు: నేను కలను మరచిపోయాను. మీరు కలను, కల భావాన్ని చెప్పండి అన్నారు. వారు చెప్పలేము అని వారి పరిధిలో రాజుకు వివరించినా, రాజు మండిపడి వీరందరినీ వీరితోపాటు బబులోను జ్ఞానులను చంపమని ఆజ్ఞ జారీచేశాడు. అప్పుడు మొదటగా దానియేలు మరియు ఆయన స్నేహితులను చంపాలని ప్రయత్నం చేశారు.

 

   ఇప్పుడు మీద విషయం చూస్తే మనకు చాలా నవ్వుగా, ఫన్నీగా ఉంది కదా! రాజుకు కల రావడం ఏమిటి? ఆయన మర్చిపోవడం ఏమిటి? వారు చెప్పలేకపోతే చంపమనడం ఏమిటి? కదా?!! అయితే జాగ్రత్తగా అర్ధం చేసుకోకపోతే మనకు నెబుకద్నెజర్ ఒక వెర్రివాడు అని అనిపిస్తుంది! గాని జాగ్రత్తగా పరిశీలన చేసి, చరిత్ర చూసుకుంటే ఏమీ వెర్రివాడు, తిక్కోడు ఎంతమాత్రము కాదు! ఎలా అంటే: ఒకసారి రెండో వచనం చూడండి: రాజుగారు ఎవరిని పిలిచారు? శకునగాండ్రు, గారడీవిధ్యగలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలిచాడు. బబులోను దేశం మొత్తం వీరితో నిండిపోయింది. ఒకసారి వీరిని చూద్దాం!

 

శకునగాండ్రు: అనగా శకునాలు చూసేవారు; వెళ్ళడం మంచిదా కాదా, పని చేయడం మంచిదా కాదా? నక్షత్రాన్ని బట్టి చెప్పేవారు. జ్యోతిష్యులు కూడా!

 

గారడీవిధ్యగలవారు: గారడీలు అనగా మాయలు మంత్రాలు వేసేవారు!

 

మాంత్రికులు: మంత్రాలతో , దయ్యపు శక్తితో ఎన్నో కార్యాలు చేస్తూ, చివరికి చెడుపులు చిల్లంగులు చేసి మనషులను చంపేసేవారు.

 

కల్దీయులు: వీరు తత్వశాస్త్రములో, వేదాంత శాస్త్రములో పట్టబద్దులైన తెలివైన తెగవారు! ట్రైనింగ్ నే ఇప్పించాడు నెబుకద్నెజర్ నలుగురికి.

అయితే బైబిల్ ప్రకారం వీరంతా దేవునికి హేయులు! ద్వితీ 18:10—12

 

  అయితే కొంతమందికి ఇప్పుడు నవ్వు రావచ్చు! మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అవన్నీ ట్రాష్ అని! అయ్యా కానేకాదు!  మొదటగా: ఆరోజులలో డార్క్ మేజిక్ (నల్ల మాంత్రికులు), చిల్లంగి తనము చాలా ఎక్కువగా ఉండేది. విషయం చరిత్ర చదివితే గమనించవచ్చు! మంత్రం వేస్తె వీరు అవతలి వ్యక్తికి/ శత్రువులకు కనిపించకుండా ఉండేవారు. మంత్రాలతో కృత్రిమ పొగమంచు (fog) సృష్టించి సైన్యాలను తారుమారు చేసేవారు! అంతెందుకు? 1 సమూయేలు 28 ప్రకారం కర్ణ పిశాచిగల స్త్రీ మంత్రించి- చనిపోయి, పరదైసులో ఉన్న సమూయేలుగారినే బయటికి రప్పించగలిగింది అని బైబిల్ లో చూడగలం!

కాబట్టి ఇంత శక్తిగలవారు తన రాజ్యంలో ఉన్నారు కాబట్టి వీరిని ఉపయోగించుకోవడానికి రాజుకు 100%హక్కుంది! దానినే ఆయన వాడాడు. దీనిలో తప్పు, ఫన్నీ ఏముంది చెప్పండి?

 

రెండవది: రాజుకు వచ్చిన కల ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో ప్రాముఖ్యమైనది అని తనకు తెలుసు! కలవలన బహుశా సరిగా నిద్రపోలేదు! దానిని తప్పకుండ తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఎలాగైనా కలను దాని భావాన్ని చెప్పమన్నాడు!

 

   ఇక మూడవది: అది దేవుని సంకల్పం! దానియేలు గారిని చెరలోనికి తీసుకునిపోయి అక్కడ గొప్పవ్యక్తిని చేసి, అక్కడ తన మహిమను ప్రపంచమంతా చూపించడానికి, ఇక రాబోయే లేక జరుగబోయే కార్యాలు, సృష్టి అంతమును ముందుగానే బయలుపరచాలని దేవుని మహా ప్రణాళిక! ప్రణాళికలో బాగంగానే దానియేలు గారు అక్కడికి వెళ్ళారు.

 

     ఇక వారు అనగా నాలుగు గ్రూప్ వారు, తామెవరో గొప్పవారమని, తమకు మానవాతీతమైన శక్తులు, దివ్యదృష్టి ఉన్నట్లు కటింగ్ ఇచ్చేవారు, మరికొంతమంది నటించేవారు! ఇప్పుడు వారి శక్తిసామర్ధ్యాలకు పరీక్ష వచ్చింది. వారి అజ్ఞానం బయలు చెయ్యాలని, దానియేలును ఉపయోగించుకుని దేవుని శక్తిని అందరికీ చెప్పాలని దేవుని ప్రణాళిక! అందుకే వారు కలనుగాని, దాని భావాన్ని చెప్పలేకపోయారు. ఒకసారి 1011 చూద్దాం! 10. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి భూమి మీద మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్యగలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు.

11. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలుకాక మరెవరును సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా.

నిజం చెప్పాలంటే ఇది నిజమే! అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు ఒకరున్నారని సర్వసృష్టికి చెప్పాలని దేవుని సంకల్పం!

(ఇంకా ఉంది)

*దానియేలు--The Man of God*

*5 భాగం-మర్చిపోయిన కల-2*

 

దానియేలు 2:1,10,11 ..

       (గతభాగం తరువాయి)

 

  ఇక రెండవ ప్రశ్న: * నలుగురు గ్రూపు వాళ్ళు చెప్పలేకపోతే దానియేలుగారిని ఇంకా ఆయన స్నేహితులను ముందుగా చంపాలని ఎందుకు ప్రయత్నం చేశారు*? 13 వచనము.

ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును ఆతని స్నేహితులను చంపజూచిరి.

 

   గతభాగంలో వివరించడం జరిగింది రకమైన వ్యక్తులతో బబులోను సామ్రాజ్యం మొత్తం నిండిపోయింది అనేది. ఇలాంటి పరిస్తితులలో రాజు ఎవరినో కొంతమందిని తీసుకుని రావడం, అదికూడా చిన్నపిల్లలను లేక యవ్వనస్తులను, వారికి వివిధ రకాలైన ట్రైనింగ్ ఇవ్వడం పరీక్ష పెట్టడం, వీరందిరిలో 1:20 ప్రకారం పదంతల శ్రేష్ఠులు అని నలుగురు దాసులు లేక బానిసలు పేరుతెచ్చుకోవడం! వారిని రాజు స్వయంగా హెచ్చించడం వీరికి అనగా నాలుగు గ్రూపుల వారికి నచ్చలేదు! ఎవరో బచ్చాగాళ్ళు (మా ఊరిబాషలో కొంతమంది గుంటలు) తమకంటే గొప్ప స్తితికి వెళ్తుంటే తట్టుకోలేకపోయారు. ఎప్పుడూ వీరికి అనగా దయ్యాలను పూజించి ఆశ్రయించే వారికీ, దేవుణ్ణి అనుసరించే నలుగురు యవ్వనస్తులకు నిరంతరం పోటీగా ఉండేది. అందుకనే కడుపు మంటతో మొదటగా మూడవ అధ్యాయంలో హనన్యా, మిషాయేలు, అజర్యాలను అగ్ని గుండంలో వేయించడం, 6 అధ్యాయంలో దానియేలు గారిని సింహపుబోనులో వెయ్యడం జరిగింది.

 

    సరే ఇప్పుడు కల్దీయ విద్యలోను అనేక విద్యలోను నలుగురు ప్రముఖులుగా తేలారు కాబట్టి మొదటగా వీరినే చంపమని నాలుగు గ్రూపుల వారు చెప్పి ఉంటారు. అందుకే మొదటగా వీరిని చంపడానికి ప్రయత్నం చేశారు.

 

     అయితే విషయం తెలిసిన వెంటనే దానియేలు గారు రాజు యొక్క రక్షక భటుల అధిపతి దగ్గరికి వెళ్లి అయ్యా ఏమిటి సంగతి అని అడిగితే మొత్తం స్టోరీ ఆయన చెప్పాడు! వెంటనే దానియేలుగారు రాజైన నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్లి తమకు కొంత సమయం ఇస్తే తప్పకుండా రాజు యొక్క కల, దాని భావాన్ని చెప్పగలము అని, అంతవరకూ జ్ఞానులను, ఇంకా నాలుగు గ్రూపులవారిని చంపవద్దు అని బ్రతిమిలాడారు. గమనించాలి మొదటి అధ్యాయంలో కూడా దానియేలు గారు తమ అధికారిని బ్రతిమిలాడి, ఒప్పించారు. క్రైస్తవునికి politeness ఎంతో అవసరం! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే: సంఘటన జరుగబోయేసరికి దానియేలు గారి వయస్సు సుమారు 1720 సంవత్సరాలు. అప్పుడు రాజుకు అనుమానం రావచ్చు! ఇంతమంది హేమాహేమీలు, వృద్ధులు చెప్పలేనిది బాలుడు చెప్పగలడా అని!!! గాని ఆయన అలా అనుమాన పడలేదు. కారణం మొదటగా కొద్దిరోజుల క్రితమే దానియేలు అతిశ్రేష్టమైన బుద్దిగలవాడిగా , ఎంతో తెలివైన వాడిగా రాజు స్వయంగా పరీక్షించి తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే ఆమోదం తెలిపాడు.

రెండవది: ఇది దైవ చిత్తం కాబట్టి వెంటనే ఆమోదం చెప్పాడు.

 

    దానియేలు గారు వెంటనే తన స్నేహితులను పిలిచి, పరిస్తితి వివరించి, మనకు, మనలాంటివారికి జ్ఞానులకు ఆపద వచ్చింది. ఇప్పుడు మన దేవుడైన యెహోవా తప్ప మనలను రక్షించేవారు లేరు. మనం రక్షించబడాలంటే కేవలం కల తెలుసుకోవాలి! గొప్పతనం శక్తి మనదేవునికి ఉంది గాబట్టి మనము ఇప్పుడు ఉపవాసముండి ప్రార్ధన చేద్దాం అని చెప్పారు. తన స్నేహితులు కూడా దీనికి ఆమోదించారు. ప్రార్ధించడం మొదలుపెట్టారు.

గమించండి! కష్టకాలంలో తప్పకుండా మనలను కాపాడేది దేవుడే! అలా చేయాలంటే కావలసినది ఉపవాస ప్రార్ధన, కన్నీటి ప్రార్ధన! తగ్గింపు ప్రార్ధన! విరిగినలిగిన హృదయంతో కూడిన పశ్చాత్తాప ప్రార్ధన! ప్రియ స్నేహితుడా! నీకు అలాంటి ప్రార్ధన ఉందా? అది లేకనే నీవునేను దేవుని నుండి కార్యాలను పొందుకోలేక పోతున్నాము.

 

   చూడండి 19 వచనం..

అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.

అంతట రాత్రిదర్శనము చేత దేవుడు నెబుకద్నెజర్ కన్న కలను దానియేలుగారికి తెలియజేశారు. అనగా రాజు కన్న కల దేవుడు మరలా దానియేలు గారికి చూపించారు. దాని భావాన్ని కూడా చెప్పారు. అదీ ప్రార్ధనకున్న బలం! ప్రియ చదువరీ! ఆ ప్రార్ధనాబలం నీకుంటే ఏమైనా సాధించగలవు! మోకాళ్ళమీద ఒంగినోడు, దేనినైన జయించగలడు!

 

      ఒక విషయం చెప్పనీయండి. కలలు ఎందుకు కలుగుతాయి అనేది యోబు గ్రంథం లో వివరంగా వ్రాయబడింది. యోబు గ్రంథము 33:14,15,16,17,18

14. దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

15. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్రపట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో

16. నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు

17. గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు

18. ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.

కాబట్టి జరగబోయే సంగతులు దేవుడు రాజుకు చెప్పాలని ఈ కలను బయలు పర్చారు.

 

  ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే: ఎప్పుడైతే కలను దేవుడు బయలుపరిచారో వెంటనే ప్రార్ధన మానేసి Thank You అనే చిన్నమాట అనేసి పడుకోలేదు! దేవుని గొప్పతనం కోసం పొగడుతున్నారు దానియేలు గారు. 2023...

20. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.

21. ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు.

22. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది.

23. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించియున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను. .

ప్రియ స్నేహితుడా! ఇలాంటి కృతజ్ఞత గుణం నీకుందా? అవసరం తీరిన వెంటనే తెప్ప తగలబెట్టే లాగున్నావా? లేక కృతజ్ఞత కలిగి ఉన్నావా? నేటి దినాలలో అనేకమంది రోగం వస్తే, సమస్య వస్తే దేవా ఈ సమస్య తీర్చు, లేక ఈ రోగం తీసేస్తే చాలు, జీవితాంతం నిన్ను వదలను, నిన్ను మరవను. నీకు బానిసగా ఉంటాను. ఇదిస్తాను, అదిస్తాను, అది చేస్తాను అని మ్రొక్కులు మ్రొక్కి, అవసరం తీరిన వెంటనే దేవున్ని మరచిపోతున్నారు. దానియేలు గారు అలా చెయ్యలేదు కాబట్టే దేవుడు అంత గొప్పగా హెచ్చించారు.

 

  ఉదయాన్నే మరలా ఆర్యోకు దగ్గరికి వెళ్లి చెబుతున్నారు దానియేలు గారు అయ్యా నన్ను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళు! రాజుగారి కల నేను చెబుతాను. వెంటనే తీసుకుని వెళ్ళాడు ఆయన! 2526 .

25. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగలయొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను.

26. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా .

 

 చూడండి రాజు అడిగిన వెంటనే కాలర్ ఎగరేయలేదు, బుజాలు ఎగరేయలేదు దానియేలు గారు. మొదటగా దేవుణ్ణి పొగడుతున్నాడు. 28..

28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా...

  అదీ కావాలి మనకు! ప్రతీ విషయంలో దేవుణ్ణి ముందు పెట్టాలి. మనం వెనకనుండాలి. దానియేలు గారు అలా చేశారు కాబట్టే దేవుడు దానియేలును కూడా గొప్పచేశారు. 1సమూయేలు 2: 30

కావున యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.

 

ఇక తర్వాత వచనాలలో కలను  కల భావము చెప్పారు చెప్పారు దానియేలు గారు. 29—45...

29. రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను.

30. ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.

31. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.

32. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

33. దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.

34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.

35. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంత మహాపర్వతమాయెను.

36. తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము.

37. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.

38. ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మను ష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు

39. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

40. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.

41. పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.

42. పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.

43. ఇనుమును బురదయు మిళితమైయుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.

44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

45. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహాదేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.

 

  దీని భావం మనము దర్శనాలను ధ్యానం చేసినప్పుడు చూద్దాం!

చూడండి ఈ కలను దాని బావం చెప్పిన వెంటనే రాజు చెబుతున్నాడు:

మొదటగా  దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించండి. అనగా దానియేలుగారిని దేవునితో సమానం చేస్తున్నాడు. గాని బహుశా దానియేలుగారు వారించి ఉంటారు.

 

తర్వాత అంటున్నాడు: దానియేలు 2: 47

మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.

 

దీనిని వెళ్లడి చేయడానికే దానియేలు గారిని దేవుడు అక్కడికి తెచ్చారు. నిజదేవున్ని తెలుసుకున్నాడు.

 

 అందుకే 48..అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను.

 

ఇక్కడ జాగ్రతగా గమనిస్తే తను బబులోనుకు అధిపతిగా, జ్ఞానులకు ప్రధానిగా చేసినవెంటనే వెళ్ళిపోలేదు! తన స్నేహితులకోసం మనవిచేస్తున్నారు కారణం తనకు తెలుసుకేవలం తన ప్రార్ధన వలననే కార్యం జరుగలేదు గాని తన స్నేహితులు కూడా తనతోపాటు ఉపవాసముండి ప్రార్ధన చేశారు కాబట్టి వారికోసం మనవిచేస్తున్నారు దానియేలు గారు. వెంటనే వారిని గవర్నర్లుగా చేసాడు రాజు! ఇదీ ఉండవలసిన లక్షణం: తన మేలుపొందిన వెంటనే తనవారిని స్నేహితులను మరచిపోవడం కాదు! మేలుచేసిన దేవుణ్ణి వదిలెయ్యడం కాదు! మన స్నేహితుల కోసం, బందువులు కోసం, సంఘం కోసం, ప్రార్ధించాలి. వారికి మేలు చెయ్యాలి. అప్పుడే దేవుడు దీవిస్తారు. దానియేలు అలా చేసి మిత్రులకు మేలుచేశారు గాని మిత్రద్రోహి కాలేదు!

 

అట్టిగుణం దేవుడు మనందరికీ దయచేయును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*దానియేలు-6-The Man of God*

*6 భాగం- కళ్ళు తెరిపించిన యవ్వనస్తులు*

 

దానియేలు :16—18  ..

16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.

17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం!

ఈ అధ్యాయంలో తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యా ల జీవితంలో జరిగిన అత్యద్భుతమైన సంఘటన- విశ్వాస వీరుల గాధను తెలియజేస్తున్నారు దానియేలు గారు! రెండవ అధ్యాయంలో చూసుకున్నాం- దానియేలు గారు స్వార్ధపరుడు కారు, తన జీవితంలో జరిగిన విషయాలే కాకుండా తన స్నేహితుల జీవితాలలో జరిగిన అసాధారణమైన అద్భుతం కోసం రాస్తున్నారు.

 

   మొదటి వచనంలో రాజైన నెబుకద్నెజర్ బంగారుబొమ్మను చేయించాడు ఎంత పెద్దది అంటే 60 మూరలు అనగా సుమారు ౩౦మీటర్లు ఎత్తు, మూడు మీటర్ల వెడల్పు. ఎందుకు చేయించాడు? నేనే గొప్ప, నాకు ధనము, బలము ఉంది అని ఒకటి, తన గొప్పతనం, వైభవం అందరూ తెలుసుకోవాలని ఒకటి, ఇంకా తన దేవుళ్ళు, విగ్రహాలే గొప్ప దేవుళ్ళు అని చెప్పడానికి!

గమనించండి 2:47 లో నీ దేవుడే నిజమైన దేవుడు, దేవాదిదేవుడు, రాజాధిరాజు, అలాంటి దేవుడు లేడు అని ఒప్పుకుని నిజమైన మార్గంలో పయనిస్తున్నట్లు కనిపించిన ఇక్కడ మరలా తన పాత స్తితిని, తన గర్వాన్ని చూపిస్తున్నాడు. ఈ విగ్రహాన్ని చేయించడం ద్వారా తన హృదయంలో ఏముందో స్పష్టముగా అందరికీ చెప్పాడు!

 

   ఇక తర్వాత బంగారుబొమ్మ విగ్రహ ప్రతిష్టకు రమ్మని తన సామంతులను, అధికారులను, ప్రముఖులను, సామాన్య ప్రజలందరినీ ఆహ్వానించాడు! అప్పుడు ఒకడు ఇలా చెబుతున్నాడు: :46

4. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.

5. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనీయ వీణ విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.

6. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.  ..

ఇక్కడ తన ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా సరే, తన ఆజ్ఞను పాటించాలి. అందరూ తన దేవున్నే మొక్కాలి అనే గర్వం ఇక్కడ కనిపిస్తుంది.

 

దానియేలు 3: 7

సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ వీణ సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆ యా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.

  చూడండి అందరూ మొక్కేశారట!

 

ఇప్పుడు 8 వచనం చూద్దాం.....

సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి

 

 కల్దీయులు వచ్చి యూదుల పైని కొండెములు చెబుతున్నారు. కల్దీయులు అనగా తత్వశాస్త్రము, వేదాంతశాస్త్రము తెలిసి పట్టబద్రులైన ఒక గుంపు. అయితే స్టడీ బైబిల్ లో జ్యోతిష్కులు అని వ్రాయబడింది. వీరు యూదుల పైన కొండెములు చెబుతున్నారు. ఏమని?

1012..

10. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.

11. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.

12. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజిం చుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.  గమనించండి.. ఇదే కల్దీయులను అదే యూదులు రక్షించారు 2వ అధ్యాయం 16--18 ప్రకారం. అయితే చేసిన ఉపకారం మర్చిపోయి ఇక్కడ కొండెములు చెబుతున్నారు. కీర్తనలు 35:1215 లో దావీదుగారు కూడా ఇలాగే బాధపడ్డారు..

12. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

13. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.

14. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.

15. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. ..

 

ఇంతకూ ఎందుకు చాడీలు చెబుతున్నారు?

ఎవరో బచ్చాగాళ్ళు (మా ఊరిబాషలో కొంతమంది గుంటలు) తమకంటే గొప్ప స్తితికి వెళ్తుంటే తట్టుకోలేకపోయారు. ఎప్పుడూ వీరికి అనగా దయ్యాలను పూజించి ఆశ్రయించే వారికీ, దేవుణ్ణి అనుసరించే నలుగురు యవ్వనస్తులకు నిరంతరం పోటీగా ఉండేది. అందుకనే కడుపు మంటతో మొదటగా అధ్యాయంలో హనన్యా, మిషాయేలు, అజర్యాలను అగ్ని గుండంలో వేయించడం, 6 అధ్యాయంలో దానియేలు గారిని సింహపుబోనులో వెయ్యడం జరిగింది

 

 అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే- లేక అనుమానం రావచ్చు ఏమిటంటే: ఇక్కడ షడ్రక్, మేషాక్, అబెద్నేగోల కోసమే వ్రాయబడింది గాని దానియేలుగారు ఏమయ్యారు?

మనకు మూడు సాధ్యమైన కారణాలు కనబడతాయి.

మొదటిది: రాజకార్యం మీద మరో దేశం గాని, రాజ్యం గాని వెళ్లి ఉండవచ్చు అప్పుడు.

రెండవది: ఒకవేళ నగరంలో ఉన్నా మరో అర్జంటు పనిమీద దానియేలు గారే చెయ్యవలసిన అతి ముఖ్యమైన పనికి వెళ్లి ఉండవచ్చు!

మూడవది: దానియేలుగారు నగరంలోనే ఉన్నా, అక్కడే ఉన్నా, ఆ బొమ్మకు మ్రోక్కకుండా నిలబడి ఉంటారు. అయితే దానియేలుగారు వారి బాస్ కాబట్టి, రాజు దానియేలుగారికి అనేకమైన అధికారాలు ఇచ్చారు (2:48) కాబట్టి దానియేలు గారిమీద కొండెములు చెప్పడానికి భయపడి ఉంటారు. లేక దానియేలు గారిని అడ్డు తొలగించుకోవాలంటే దానియేలు గారికి కొండంత దన్నుగా నిలుస్తున్న స్నేహితులను అడ్డు తొలగించుకోవాలి అని అనుకుని ఉంటారు. అందుకే ఇక్కడ దానియేలు గారి పేరు వారు చెప్పలేదు.

 

    ఇది విన్న రాజుకి వెంటనే కోపం వచ్చింది. వెంటనే పిలిచి అడుగుతున్నాడు రాజు! ఇది నిజమా ? అయితే రాజుకి ముగ్గురు అన్నా ఇష్టమే, కారణం వీరుకూడా దానియేలుగారిలాగా సుభుద్ధి కలిగి పనిచేయడం, తన ఆస్థాన మందున్న అనేకుల కంటే ఎంతో శ్రేష్టమైన బుద్ది తెలివి కలిగి ఉన్నారు కాబట్టి వారికి మరో చాన్సు ఇద్దామని అనుకున్నారు, లేక వీరంటే కిట్టని వారు చాడీలు చెప్పారు, నేను ఏమి చెప్పినా వీరు చేస్తారు కదా అనుకుని మరొక సారి చాన్సు ఇద్దామని అడిగి చూసాడు. అయితే వీరి జవాబు చూడండి.1618 ... షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.

17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

  చూసారా వీరి జవాబు! రాజాదిరాజుని చక్రవర్తిని పేరుపెట్టి పిలుస్తున్నారు. మా దేవుడు రక్షించే సమర్ధుడు. రక్షించకపోతే మేము చావనైనా చస్తాము గాని నీ బంగారుబొమ్మను మొక్కమని తెలుస్కో! అంటున్నారు. ఇదీ ధైర్యమంటే! దేవుడంటే విశ్వాసమంటే!  దేవుని సంకల్పం ఏదైనా సరే వారు దాన్ని మనసారా స్వీకరించారు. కష్టాలను ఎదుర్కోడానికి, మరణాన్ని ఎదుర్కోడానికి అగ్నిజ్వాలను ఎదుర్కోడానికి సిద్దపడ్డారు! వీరు నేటి సంఘానికి ఆదర్శం!

మనకు కూడా ఇలాంటి ఇబ్బందులు కష్టాలు తొందరలోనే రానున్నాయి. కొన్ని దేశాలలో ప్రాంతాలలో చాలామంది ఇలాంటి శ్రమలనే అనుభవిస్తున్నారు. చావుకు సిద్దమవుతున్నారు. చనిపోతున్నారు. చంపబడుతున్నారు. దేవుడు ముందుగానే మత్తయి 24:21 లో చెప్పారు.

లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

. మనకు కూడా అవి రాబోతున్నాయి. అయితే ఇలాంటి పరిస్తితి వస్తే నీవు ధైర్యంగా నిలబడగలవా? ప్రభువుకు సాక్షిగా నిలగలవా? ఈ ముగ్గురు యవ్వనస్తులు నిలబడ్డారు. చదువుతున్న సహోదరీ సహోదరుడా! ఒకవేళ నీవు దేవుణ్ణి నమ్ముకుంటే నీ ఉద్యోగం తీసేస్తాము అని, నీ రిజర్వేషన్ తీసేస్తాము అని, నీ రేషన్ కార్డు తీసేస్తాము అని, లేక మిమ్మును జైలులో పెడతాము, చివరికి చంపేస్తాము అంటే ఎంతమంది చావుకైనా సిద్దపడగలరు? ఎంతమంది ప్రభువుకై సాక్షిగా నిలగలరు? గమనించాలి దేవునికి చెత్త, పొల్లు అవసరం లేదు! ఇలా ఈ ముగ్గురిలా చావుకైన రేవుకైనా తెగించి ఆయన పని చేసేవారు కావాలి!!

ప్రియ స్నేహితుడా! అలా నీవుండగలవా? దేవునికి అట్టివారు కావాలి.

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*దానియేలు-7-The Man of God*

*7 భాగం- కళ్ళు తెరిపించిన యవ్వనస్తులు-2*

 

దానియేలు :16—18  ..

 

         (గతబాగం తరువాయి)

 

  వెంటనే రాజు ఏం చేశాడో చూద్దాం! దానియేలు 3:20,21,22,23

20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.

22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా  

చూడండి వారిని ప్రాణాలతోనే అగ్ని గుండములో పడవేశారు. వారు చావును ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ జరిగింది అసాధారణ అద్భుతం! మహాద్భుతం! యేసుక్రీస్తు ప్రభులవారే తన బిడ్డలకోసం ఆ మండుచున్న అగ్ని గుండములోకి అడుగుపెట్టేశారు. దేవుడు తన బిడ్డలను వదిలేసే దేవుడు కానేకాదు! ఆయన ఆపదలో సహాయకుడు! తన బిడ్డలను ఆదుకొనే దేవుడు! వారితో పాటు ఆయనకూడా అగ్ని గుండములో తిరుగుతున్నారు. అయితే వారు మాడిపోలేదు, కాలిపోలేదు! హాయిగా తిరిగుతున్నారు అగ్నిగుండములో! అగ్నిగుండము AC రూమ్ అయిపొయింది.

 

   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! ఎందుకు ముగ్గురు కాలిపోలేదు? దేవుడే వారితోపాటు అగ్నిగుండములో ఉన్నారు కాబట్టి కాలిపోలేదు అని మాత్రం చెప్పొద్దు! దానిని ఇప్పుడే చెప్పుకున్నాం! దానికి నా దగ్గర ఒకలాజిక్ ఉంది. నా ఉద్దేశం సుమా! కీర్తన 104:4; హెబ్రీ 1:7

తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు ...

 కాబట్టి ఇప్పుడు తన సేవకులు అగ్ని కాబట్టి పెద్ద అగ్ని వెళ్లి చిన్న అగ్నిలో పడింది. అగ్ని వెళ్లి అగ్నిలో పడితే అగ్నికి ఏమి జరుగుతుంది? ఏమీ జరగదు. వీరే పెద్ద అగ్ని కాబట్టి చిన్న అగ్ని వారికి AC రూములా మారిపోయింది. అదిచూసిన రాజు గుండె గుబేలుమంది. రాజు గర్వం విరిగిపోయింది. రాజు కళ్ళు తెరువబడ్డాయి.

 అంటున్నాడు తన దాసులతో 24—25..

24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగ లేచి -మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమి గదా యని తన మంత్రుల నడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.

25. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. .

ఇప్పుడు తన సేవకులు కూడా అవును రాజా అని అన్నారు, వెంటనే అంటున్నాడు మండుచున్న వేడిమిగల వాకిలి దగ్గరకు వచ్చి దానియేలు 3: 26

అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చిషద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకు లారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయ టికి వచ్చిరి.

 

 చూడండి పిలుపు మారిపోయింది. నా చేతిలో నుండి మిమ్మును తప్పించే దేవుడెక్కడ ఉన్నాడు అని పొగరుపట్టిన మాటలు పలికిన రాజు- మహోన్నతుడగు దేవుని సేవకులారా! అంటున్నాడు. మహోన్నతుడైన దేవుడు ఎవరో నిజమైన దేవుడెవరో తెలిసింది

 

   ఇక తర్వాత ఇలా అంటున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. 28౩౦ ...

28. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడు వారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

30. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను..

 

ఇక్కడ రెండు గుర్తించదగిన మాటలు చెబుతున్నాడు ఒకరాజు/ చక్రవర్తి. వీరి దేవుడు పూజార్హుడు!

ఇక రెండవది ఇవ్విధముగా రక్షించుటకు సమర్దుడగు దేవుడు గాక మరి దేవుడును లేడు......

ఇంతవరకు దేవుళ్లలో ఒక దేవుడు అనుకున్నాడు గాని ఈయన మాత్రమే నిజమైన దేవుడు అని గ్రహించలేదు. గాని సంఘటన రాజు కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నిజదేవున్ని తెలుసుకోడానికి నిజమైన దారిలో మరో అడుగు ముందుకు వేస్తున్నాడు.  చూడండి విగ్రహారాధికుడైన రాజు నోట నుండి మరే దేవుడు ఇలా రక్షించలేడు! ఎంతబలమైన వాస్తవమైన సాక్ష్యం కదా ఇది!  బబులోను దేవుళ్లలో ఎవరూ ఇలాంటి దేవుడు లేడు! ఈయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. దర్యావేషు కూడా ఇలాగే ఒప్పుకున్నాడు దానియేలు 6: 26

నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయ పడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.

 

    గమనించాలి.. వ్యక్తి ఇలా చెప్పాడు అంటే కారణం : ముగ్గురు విశ్వాసుల విశ్వాసం- తెగువ, ధైర్యం- భక్తి! ఇది రాజు కళ్ళు తెలిపించింది. ముగ్గురు యవ్వనస్తులు నిలబడ్డారు. అనేకులకు దేవునికోసం గెలుచుకున్నారు

 

           ప్రియ చదువరీ! నేడు నీ పరిస్తితి ఎలా ఉంది? పరీక్షలకు ఓలిపౌతున్నావా లేక పారిపోతున్నావా/ లేక దైర్యంగా నిలబడి ప్రార్ధనాయుధముతో పోరాడి జయిస్తున్నావా? జయించువానికి ఇలా చేస్తాను, అలా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభులవారు ప్రకటన గ్రంధంలో అనేక వాగ్దానాలు ఇచ్చారు. 2:11; 17; 3:5; 21:7; అవి కావాలంటే, నిజమైన దేవున్ని అందరూ తెలుసుకోవాలంటే, నీవు సాక్షిగా నిలబడాలి! నీ ప్రవర్తన గొప్ప సాక్ష్యంగా మారిపోవాలి! ఒక కరపత్రముగా మారిపోవాలి!

శోధన ఎదురైనా వేదన ఎదురైనా చెరసాల ఎదురైనా చివరకు చావు వచ్చినా క్రీస్తుకోసం నిలబడగలవా?.

నేను సిద్దము! నీవు సిద్దమా?

దైవాశీస్సులు!

 

 

 

*దానియేలు-8-The Man of God*

*8 భాగం- గర్విష్టి గడ్డిమేత*

 

దానియేలు 4:1—  ..

1. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.

2. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.

3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం! అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు తన యొక్క జీవితానుభవాలను, తనే స్వయంగా సకల ప్రజలకు ఉత్తరం రాసి, తన తప్పును తెలుసుకోవడం, దేవుడే నిజమైన చక్త్రవర్తి నేనొక యాక్టింగ్ చక్రవర్తిని గాని నిజంగా చక్రం తిప్పేవాడు పరలోకమందున్న దేవుడు అని తన అనుభవాన్ని రాస్తున్నాడు లేఖద్వారా!

 

   మొదటి వచనంలో లోకమందున్న సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడువారికి కూడా రాస్తున్నాడు. అయితే నా చేతిలో నుండి మిమ్మును తప్పించగలిగే దేవుడెక్కడ ఉన్నాడు అనియు, తన హోదాని గర్వాన్ని చూపించడానికి పెద్ద బంగారు బొమ్మ చేసిన నెబుకద్నెజర్ జ్ఞానోదయం అయ్యాక మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అని ఎంతో సౌమ్యంగా కోరుకుంటున్నాడు. ఇది నిజమైన మార్పు!

 

 రెండవ వచనంలో మహోన్నతుడగు దేవుడు నాయెడల చేసిన అద్భుతకార్యములను సూచక క్రియలను మీకు చెప్పాలని ఉంది అని మొదలు పెట్టి వివరిస్తున్నాడు. మూడవ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు...

ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ..... చూసారా ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. నా రాజ్యము ఈరోజు ఉంది రేపు పోవచ్చు గాని దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము అని ఒప్పుకుంటున్నాడు. నేటిరోజులలో అనేకులు తమకు కలిగిన ధనం బట్టి, అధికారం బట్టి ఎంతెంతో విర్రవీగుతున్నారు గాని ఈ చక్రవర్తి మొదట విర్రవీగినా తర్వాత మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నాడు. అయ్యా గమనించండి: నీ ధనం, నీ అధికారం, నీ బలం శాశ్వతం కాదు. నేడు ఉండి రేపు పోతాయ్! ఈ విషయం తెలుసుకుని గర్వం విడిచి సౌమ్యం నేర్చుకుని నిజ దేవుణ్ణి తెలుస్కుని ప్రజలందరితో సామరస్యంగా ప్రేమతో మెలగడం నేర్చుకోవడం మంచింది.

ఇక తర్వాత వచనంలో తనకు వచ్చిన కలను వివరిస్తున్నాడు రాజు. నేను పడుకున్నప్పుడు భయం కలిగించే ఒక కల వచ్చింది. అది నన్ను చాలా కలవరపెట్టింది. దాని భావాన్ని చెప్పమని నా రాజ్యంలో ఉన్న అందరినీ అనగా జ్ఞానులను, శకునగాళ్ళను,మాంత్రికులను, సోది చెప్పేవాల్లను, జ్యోతిష్యులను అందరినీ అడిగాను గాని ఎవరూ చెప్పలేకపోయారు. చిట్టచివరికి దానియేలు ను పిలిచాను. అతని దగ్గర పవిత్రదేవుని ఆత్మ ఉంది.

ఓ శకునగాళ్ళ అధిపతియైన బెల్తెషాజర్ (ఇది వారు దానియేలుగారికి పెట్టిన పేరు) నీ దగ్గర పరిశుద్ద దేవతల ఆత్మ ఉంది అని నాకు తెలుసు అంటున్నాడు.

ఇంకా దానియేలుగారు ఒక మాంత్రికుడు కాదని చక్రవర్తి గ్రహించలేదు. దానియేలు గారి దగ్గర ఏదో మంత్రశక్తి ఉంది, దానివలననే దానియేలు గారు ఈ క్రియలు చేస్తున్నారు అనుకుంటున్నాడు తప్ప ఆయన నిజమైన దేవుని సేవకుడు కుమారుడు అని గ్రహించలేదు! 

   

    సరే , ఇక్కడ తన కలను వివరిస్తున్నాడు. నా కలలో నాకు ఒక చెట్టు కనిపించింది , చెట్టు అనడం కన్నా వృక్షం అనడం శ్రేష్టం! అది చాలా పెద్దగా ఎత్తుగా ఉంది. ....... ఇలా చెబుతూ అప్పుడు ఆకాశం నుండి ఒక జాగరూకుడగు పరిశుద్దుడు అనగా మన భాషలో దేవుని దూత అనుకోవచ్చు. దూతవచ్చి చెబుతున్నాడు ఈచెట్టుని నరికెయ్యండి, కొమ్మలను తెగగొట్టి దాని ఆకులను తెంపేయండి. దాని నీడన ఉన్న పక్షులను జంతువులను తోలివేయండి. గాని దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన బలమైన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డిపాలగు నట్లు దానిని భూమిలో ఉంచండి. ఏడుకాలముల వరకు దానికి మానవ మనస్సు కు బదులుగా పశువు మనస్సు కలుగుతుంది. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగుతుంది అని చెబుతూ.... మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నా డనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును. .....  అని చెప్పాడు. ఓ దానియేలు నీవు తప్ప ఈ కలకు అర్ధం చెప్పేవాడు ఎవడూ లేదు కాబట్టి దయచేసి దీని భావం నాకు తెలుపు అని మనవిచేశాడు.

 

  కల విన్న వెంటనే దానియేలు గారు ఒక గంటసేపు నిర్ఘాంతపోయారట. అలా నిర్ఘాంతపోడానికి కారణం ఏమిటంటే 2 అధ్యాయంలో చూపించిన కల ప్రకారం ఈయన పాలనను దేవుడు శిరస్సుతో పోల్చారు. మరి ఇప్పుడు నరికెయ్యడం ఏమిటి అని నిర్ఘాంతపోయారు. వెంటనే రాజు అంటున్నాడునా కలవలన నీవు కలవర పడొద్దు గాని ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు. వెంటనే దానియేలు గారు కలకు భావం చెప్పడం మొదలుపెట్టారు.

 అయితే ఇక్కడ గమనించాలి: దేవుని సేవకులకు కొన్నిసార్లు మనుషులకు ఇష్టం కాని నిజాలు ఉన్నదిఉన్నట్లు చెప్పవలసి వస్తుంది. అప్పుడు నిజమైన సేవకుడు తప్పకుండా చెబుతాడు. అవతలి వ్యక్తి బాధపడతాడు అని తెలిసిన, అవతలి వ్యక్తిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదుగాని అవతలి వ్యక్తి బాగుపడాలి, గుణపడాలి అనే ఉద్దేశంతో ఇలా చెబుతుంటారు.

 

  దానియేలు గారు కూడా చెప్పడం మొదలుపెట్టారు. రాజా దీని భావం నీ శత్రువులకు కలగాలి అని కోరుకుంటున్నాను గాని దీని భావం ఏమిటంటే చెట్టు/ వృక్షం మీరే! బైబిల్ గ్రంధంలో దేవుడు అనేకసార్లు వ్యక్తులను రాజ్యాలను చెట్లతో పోల్చారు. కీర్తన 1:; 37:35; 52:8;92:12; యెషయా 17:6; యిర్మియా 11:16; యేహెజ్కేలు 17:2224; రోమా 11:17;  కాబట్టి ఇక్కడ కూడా రాజును వృక్షంతో పోలుస్తున్నారు.

 

2226

22. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

23. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.

24. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా

25. తమయొద్దనుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీ మీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును.

26. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన(ఆకాశములు అధికారమనియున్నది) సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము. ..

 

    ఇక్కడ ఏడు కాలములు అంటున్నారు. కాలము అనగా దానియేలు గ్రంథం లో సంవత్సరం అని అర్థం.  ఒకసారి 7:25 చూద్దాం.

25. రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశముననుంచబడుదురు. కాబట్టి కాలము అనగా సంవత్సరం అని అర్థం.

 

ఇక్కడ 25 వచనం ముఖ్యంగా ధ్యానం చెయ్యాలి. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై ఉన్నాడు, నీవు కాదు అధికారివి, చక్రం తిప్పేవాడు పైవాడు అని నీవు తెలిసికొనే వరకు ఇలాజరుగుతుంది అంటున్నారు. కీర్తన 10:16; 47:2; 93:1; 96:10; 97:1; యెషయా 52:7; ప్రకటన 19:6;

(ఇంకాఉంది)

     

 

*దానియేలు-9-The Man of God*

*9 భాగం- గర్విష్టి గడ్డిమేత-2*

 

దానియేలు 4:1—  ..

 

    (గతభాగం తరువాయి)

 

      ఇక్కడ దానియేలుగారు ఉన్నదిఉన్నట్లు బల్లగుద్ది మరీ చెప్పేశారు. ఇదీ దైవసేవకుని లక్షణం! ఇలా చెప్పి హెచ్చరించడమే కాదు తనకుతోచిన సలహా కూడా ఇస్తున్నారు..

27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను. ..

ఇక్కడ సలహానే కాదు సువార్త కూడా చెబుతున్నారు. అక్కడ ఉన్నది చక్రవర్తి అని అసలు భయపడటం లేదు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రియ స్నేహితుడా నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలకు నీ కొలీగ్ కి, నీ ఇరుగుపొరుగు వారికి సువార్తను చెబుతున్నావా లేక భయపడుతున్నావా లేక సిగ్గుపడుతున్నావా? లూకా 9: 26

నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. జాగ్రత్త!

..దానియేలు 4: 27

రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

..

  ఇక్కడ ఒకసారి చరిత్రను జ్ఞాపకం చేసుకుందాం. దానియేలుగారు చెప్పిన ఈ సలహామేరకు ఒక సంవత్సరం పాటు నెబుకద్నెజర్ తన పాపాలు మానేసి అనేకమందికి సహాయం చేసినట్లు, పేదలకోసం అనేక మంచిపనులు చేసినట్లు ప్రజల బాగుకోసం ఎన్నెన్నో సంక్షేమపధకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుంది. అయితే ఉండుండి గర్వం వచ్చింది.  29--౩౩

29.​ పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా

30. రాజు బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.

31. రాజు నోట ఈ మాటయుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.

32. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

33. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభవించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను. 

 

ఇదీ జరిగింది. నా గర్వపాటు వలన నేను గడ్డిమేశాను అని చక్రవర్తి ప్రజలందరి ముందు ఒప్పుకుంటున్నాడు. చరిత్ర చెబుతుంది కాలంలో అతని కొడుకు ఎవిల్-మెరోదాక్ acting కింగ్ గా పాలించినట్లు చరిత్ర చెబుతుంది.

 

  346

34. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవ బుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకునున్నవి.

35. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

36. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ...  

ఇక్కడ మానవబుద్ది నాకు వచ్చాక ఆకాశము వైపు నా కండ్లు ఎత్తి దేవుణ్ణి ఘనపరిచాను అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్యం, స్థిరమైన బుద్ధి రాజుకు మరల వచ్చింది అనేది సూచిస్తుంది. ఎప్పుడొచ్చింది అంటే తన తప్పు తెలుసుకున్నాక! తన గర్వం విడిచిపెట్టాక! దేవుని వైపు తిరుగని వారు, దేవుని గొప్పతనాన్ని, ఆయన అధికారాన్ని ఒప్పుకోని వారు ఆధ్యాత్మికంగా వెర్రివారు. కీర్తన 14:1; 53:1; దేవుడు ఏం చెప్పారో అదే చేశారు. తను ఎవరూ, దేవుడు ఎవరూ అనేది రాజు గుర్తించే వరకు ఇలా జరిగింది. ఇక మరల 34 లో మరల దేవుని ఆధిపత్యము అధికారం తరతరములకు ఉంటుంది అని మరోసారి ఒప్పుకుంటున్నాడు. 

35 చూడండి...

భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

     ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేస్తాడు, అయితే ఆయన చేయి పట్టుకొని నీవేం చేస్తున్నావ్ అని అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అంటున్నాడు. ఇంకా ఆయన దృష్టిలో లోకప్రజలంతా శూన్యం. యెషయా 40:15—17..

ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.

 

   ఇక అధ్యాయానికి, కలభావాన్ని తానే 37 లో చెబుతున్నాడు...

ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.

 

  వచనం చూస్తే ఒక వ్యక్తి అదికూడా ఒక గర్విష్టి తననుతాను పొగుడు కోవడం వదలి, దేవుణ్ణి స్తుతించడం ఆయన కార్యాలను గోప్పచేయడం మొదలు పెట్టడం అనేది గొప్ప విషయం! ఇది కేవలం దేవుడు జరిగించిన అద్భుత కార్యమని చెప్పవచ్చు!  ఇంకా తన నోటితో దేవుడు చేసేవి న్యాయమైనవి అని ఒప్పుకుంటున్నాడు అనగా దేవుడు తనను గడ్డిమేయించడం న్యాయమైనదే అని ఒప్పుకుంటున్నాడు. అనగా దేవుడు గర్విష్టులను గడ్డిమేయిస్తాడు అని ఒప్పుకుంటున్నాడు. కీర్తన ౩౩:45

4. యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ..

 18:26,27

26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు

27. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. ..;

సామెతలు 16: 18

నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

అందుకే యాకోబు గారు చెబుతున్నారు

 యాకోబు 4:10

ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

 

   కాబట్టి ప్రియ స్నేహితుడా! గమనించావా? రాజు ఎలా ఒప్పుకుంటున్నాడో, ఒకవేళ నీలో అలాంటి గర్వం ఉంటే నేడే విడిచిపెట్టు. గర్విష్టులు గడ్డిమేస్తారు అని రాజు తనే ఒప్పుకుంటున్నాడు. నీవుకూడా అదే గర్వ హృదయంతో ఉంటే నీవు కూడా గడ్డిమేయాల్సి వస్తుంది.

 

వద్దు! మనలను మనం తగ్గించుకుందాం,  సరిచేసుకుందాం!

 

  దేవుని రాజ్యం పొందుకుందాం!

 

ఆమెన్!

 

దైవాశీస్సులు!

 

 

 

*దానియేలు-10-The Man of God*

*10 భాగం- మెనే మెనే టేకేల్ ఉఫార్సీన్*

 

దానియేలు 5:24—27

24. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ఉఫార్సీన్‌.

25. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.

26. టెకేల్అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.

27. ఫెరేన్అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ..

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం!

ఈ అధ్యాయంలో మొదటివచనంలో రాజైన బెల్షస్సర్ విందు చేయించాడు అని వ్రాయబడి ఉంది.

ఇంతకీ బెల్షస్సర్ ఎవరు? యితడు రాజైన నెబుకద్నెజర్ యొక్క రెండవ భార్య యొక్క మనవడు.

గాని ఈ అధ్యాయంలో మనకు నీ తండ్రియైన నెబుకద్నెజర్ అని బెల్షస్సర్ తో దానియేలుగారు అంటారు.

గమనించాలి: పూర్వకాలంలో వారి వంశంలో ఎవరైతే గొప్పవారు ఉంటారో, వారి కుమారుడు అని పిలువబడే వారు. ఉదా: తండ్రియైన అబ్రాహామా, దావీదు కుమారుడా ... ఇలా అన్నమాట! కాబట్టి ఈ గోత్రంలో వారి తాత నెబుకద్నెజర్ గొప్పవాడు కాబట్టి నెబుకద్నెజర్ కొడుకుగా దానియేలు గారు చెబుతున్నారు.

 

విందు ఎప్పుడు జరిగింది? BC 539 లో

 

ఎందుకు జరిగింది?

    బబులోను, అస్శూరు వారి యొక్క ప్రాబల్యం నుండి, వారి అధికారం నుండి మిగిలిన ప్రాంతాలను విడిపించాలని- మాదీయులు (Mede) –పారశీకులు (పర్షియా) కలిపి ఒక ట్రీటీ (Treaty- రెండు కన్నా ఎక్కువ దేశాలు ఒకే సామాజిక దృక్పదంతో ఒకే విషయం కోసం అంతర్జాతీయ పరస్పర ఒప్పందం చేసుకోవడం, దానికి చట్టపరమైన అధికారం కల్పించడం)  గా ఏర్పడ్డారు. గాని నెబుకద్నెజర్ బ్రతికి ఉండగా ఇది జరగలేదు. నెబుకద్నెజర్ BC 562 లో మరణించాక వీరు బబులోను అధికారంలో ఉన్న ఒక్కో రాజ్యాన్ని తమ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. అలా ఈజిప్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మాదీయ రాజ్యానికి దర్యావేషు రాజు, పర్షియాకు కోరేషు రాజు. వీరిద్దరూ ట్రీటీ కి అనుగుణంగా వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా కలుపుకున్నారు. అయితే ఈ క్రమంలో బబులోను మీద దండెత్తినప్పుడు మొదట్లో వీరు బెల్షస్సర్ చేతిలో ఓడిపోయారు. ఆ విజయానికి గుర్తుగా బెల్షస్సర్  ఈ విందు చేస్తున్నాడు.

 

   ఇప్పుడు విందు చేసుకొనే వాడు మామూలుగా చేసుకోవాలి గాని తన తాత యేరూషలేము దేవాలయంనుండి తీసుకుని వచ్చిన దేవుని మందిర పాత్రలను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. దీనిని ఒకసారి స్టడీబైబిల్ నుండి చదువుకుందాం....24

2 బెల్షస్సరు ద్రాక్షమద్యం త్రాగుతూ, తన పూర్వీకుడైన నెబుకద్నెజరు జెరుసలంలో ఉన్న దేవాలయం నుంచి తీసుకువచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. తానూ తన ప్రముఖులూ భార్యలూ ఉంపుడు కత్తెలూ వాటిలో ద్రాక్షమద్యం పోసి త్రాగాలని అతడి ఉద్దేశం.

3  జెరుసలంలో ఉన్న దేవాలయంనుంచి తేబడ్డ బంగారు గిన్నెలు లోపలికి తీసుకువచ్చాక రాజూ అతడి ప్రముఖులూ అతడి భార్యలూ ఉంపుడు కత్తెలూ వాటిలో ద్రాక్షమద్యం పోసి త్రాగారు.

4 అలా ద్రాక్షమద్యం త్రాగుతూ, బంగారు వెండి కంచు ఇనుము కర్ర రాళ్ళతో చేసిన దేవతలను కీర్తించారు....

దీని ప్రకారం వీడో త్రాగుబోతు! త్రాగుబోతులకు విందు చేశాడు. చేసిన తర్వాత ఆ విందులో దేవుని మందిర సంబంధమైన పాత్రలలో వీడు, వీడు అధికారులు వీడి భార్యలు ఉంపుడుగత్తెలు కలిసి మందు తాగుతూ దేవదూషణ చేస్తున్నారు. చరిత్ర ప్రకారం అదికూడా ఇశ్రాయేలు దేవుని మీద! అయితే ఈ రాజుకు గతంలో జరిగిన సంఘటనలు తెలియక చేస్తున్నాడా అంటే కానేకాదు. వీడు తెలిసే చేస్తున్నాడు. వాడి తాత నెబుకద్నెజర్ చనిపోయేముందు దేవాదిదేవుడైన యెహోవామీద విశ్వాసముంచాడు. వీడు ఇపుడు ఆ దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. లేకపోతే ఆ దేవాలయపు వస్తువులనే కావాలని ఎందుకు ప్రత్యేకముగా అడిగాడు?!!  పడిపోవుటకు ముందు గర్వము, ఘనతకు ముందు వినయము ఉంటుంది అని రాజైన సొలోమోను ఆత్మపూర్నుడై ఎప్పుడో చెప్పారు. సామెతలు 16: 18

నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

వీడు అలాగే చేస్తున్నాడు. వెంటనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి గోడమీద ఏదో రాసి వెళ్ళిపోయింది. అది చూసిన వెంటనే వీడి నాడులు వదిలేశాయి. దానియేలు 5: 6

అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను......

 వెంటనే వీడి తాతలాగ గారడీ విద్య కలవారిని, కల్దీయులను జ్యోతిష్కులు ను పిలిచాడు గాని వారి వల్లకాలేదు. ఇంతకుముందు బబులోను రాజ్యంలో గారడీవిద్య చేసేవారు మాంత్రికులు ఎన్నో గారడీలు చేస్తూ ఉంటే వీడు ఆనందిస్తూ ఉండేవాడు. ఇప్పుడు గారడీ లేకుండా నిజమైన వ్రాత, నిజమైన దేవుని నుండి వచ్చి రాస్తే వీడి కీళ్ళు వదిలేశాయి. ఇప్పుడు ఎవడూ దానిని చదవలేకపోయారు. కారణం అది దేవునిరాత పరలోకపు తీర్పు రాత! ఎన్నెన్నో బహుమతులు ఇస్తానని ప్రకటించిన ఎవడితరమూ కాలేదు.

 

  అప్పుడు రాణి అనగా పట్టపురాణి అన్న మాట! అయితే జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంతవరకు వాడితోటే వాడిబార్యలు ఉంపుడుగత్తెల ఉన్నట్లు చూసుకున్నాం కదా. అంటే ఈవిందులో ఈమె లేదు అంటే బహుశా ఈమె బెల్షస్సర్ తల్లిగాని, లేక నాన్నమ్మ గాని అయి ఉండాలి. ఆమెకు చరిత్ర మొత్తం త్తెలుసు. వెంటనే ఆమె చెప్పింది పనికిమాలిన వారిని ఎందుకు అడుగుతావు గాని నీ రాజ్యంలో దానియేలు అనే ఒకాయన ఉన్నారు. ఆయనయితే దీనిని తప్పకుండా చదివి చెప్పగలరు. వెంటనే పిలిపించు అని చెప్పింది.

అందుకే వృద్ధుల సలహాలు కావాలి. వారికి బాగా తెలుసు. ఏ సమస్యను ఎవరు పరిష్కరించగలరో! ఈ కాలములో యువతకు ముసలివారంటే పడటం లేదు. వీడికి కూడా పడకనే ఇంతవరకు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులమాట, పెద్దల మాట నచ్చక ఇలాంటి పనులు చేస్తున్నాడు.

 

    పిలిచిన వెంటనే దానియేలు గారు వచ్చారు. అసలు ఇలాంటి పనికిమాలిన విందులు ఆయనకు పడవు గాని రాత అక్కడే ఉంది కదా, అందుకే వచ్చారు. వెంటనే అంటున్నాడు రాజు నా తాత తీసుకొచ్చిన దానియేలువి నీవేకదా, .... అంటూ మా వారు ఎవరు చెప్పలేక పోయారు నీవు చెబితే నీకు గొప్ప బహుమతులు ఇచ్చి సామ్రాజ్యానికి మూడవ అధిపతిగా చేస్తాను అన్నాడు. దానియేలుగారికి బహుశా మండిపోయి ఉంటుంది. కారణం అక్కడ తమ దేవాదిదేవుని సన్నిధిలో, మందిరంలో ఉపయోగించే పవిత్రమైన పాత్రలను అపవిత్రులు అపవిత్రమైన విందులో త్రాగి తందనాలు ఆడటానికి తీసుకొచ్చారు. వెంటనే అంటున్నారు దానియేలు నీ దానాలు ఎవరికైనా ఇచ్చేయ్ గాని నాకొద్దు. గాని చదివి చెబుతాను అంటున్నారు. నా భాషలో చెప్పాలంటే: నీ బోడి బహుమానాలు ఎవడికి కావాలి? దానిని ఎవడికైనా ఇచ్చేసుకో! అన్నారు. ఎందుకు అలా అంటున్నావు అంటే ఆయన చెప్పిన తర్వాత మాటలు అలాగే ఉన్నాయి. వీడు చేసిన పనులు నచ్చలేదు ఈయనకి. ఆయన ఉక్రోషమంతా తన మాటలలో వ్యక్తం చేస్తున్నారు.

 

(ఇంకాఉంది)

 

*దానియేలు-11-The Man of God*

*11 భాగం- మెనే మెనే టేకేల్ ఉఫార్సీన్*

 

దానియేలు 5:24—27  ..

        (గతభాగం తరువాయి)

 

   గమనించాలి: * సన్నివేశం జరిగినప్పుడు దానియేలు గారి వయస్సు సుమారుగా 84 నుండి 90 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇప్పుడు తన కళ్ళముందు పుట్టిన గుంటడు తమకు అతి పవిత్రమైన దేవుని పాత్రలు అపవిత్రం చేస్తే తట్టుకోలేక తిన్నగా రాతను చదవకుండా పూర్వం తన తాత ఎలా విర్రవీగాడో ఎలా గడ్డిమేశాడో వివరించి అప్పుడు దాని భావం చెబుతున్నారు.

ఇక్కడ ఆలోచిస్తే మీదన వివరించినట్లు ఆ గారడీవాళ్ళు, కల్దీయులు మాంత్రికులు చదవలేనిది ఈయన ఇట్టే చదివేసి అర్ధం చేసుకుని ముందుగా వీడిని కడిగేస్తున్నారు....17—27

17. అందుకు దానియేలు ఇట్లనెను నీ దానములు నీయొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను.

18. రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.

19.​ దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.

20.​ అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.

21.​ అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.

22. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగియుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోక మందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.

23. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.

24. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ఉఫార్సీన్‌. ....;

చూడండి ఎంత స్ట్రాంగ్ గా బుద్ధిచెప్పారో! 22వ వచనంలో అంటున్నారు: ఈ విషయమంతా తెల్సిన నీవు అణచుకొనక, తగ్గించుకోక పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు అందుకే నీకు ఇలాగయ్యింది.

ఇక 24వ వచనం వ్రాసిన శాసనమేదనగా...... ఒకసారి ఆగుదాం! శాసనం ఎవరు చేస్తారు? రాజులూ, చక్రవర్తులు కదా! ఇప్పుడు ఒక చక్రవర్తి మీద ఆయనకు వ్యతిరేఖంగా శాసనం వచ్చింది అట!

ఎవరు పంపించారు? రాజాధిరాజు! ప్రభువులకు ప్రభువు! దేవాదిదేవుడు!! అందుకే నెబుకద్నెజర్ ఒప్పుకున్నాడు, చక్రం తిప్పేది నేనుకాదు నామీద ఒకడున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. నా రాజ్యం కాదు శాశ్వతం, ఆయనరాజ్యం శాశ్వతం! ఇది తెలిసి కూడా వీడు ఇలా ప్రవర్తించాడు.

మినే మినే టేకేల్ ఉఫార్శిన్! బైబిల్ పండితులు ఈ మాటలు- హీబ్రూ-అరామిక్ భాషలు రెండు కలిపిన ఒత్తులు హల్లులు గలవి కాబట్టి వారివల్ల కాలేదు చదవటానికి అంటారు. సరే ఈ మాటలకు దానియేలు గారు డైరెక్ట్ గా భావాన్ని చెప్పారు గాని దీనిని ఇంగ్లీషు లోనికి తర్జుమా చేస్తే- Measured, Measured, Weighed and Divided! అని వస్తుంది. అనగా లెక్కపెట్టాడు, కొలిచాడు, తూచాడు, విడదీశాడు!!

ఇప్పడు ఆయన చెప్పిన భావం చూద్దాం! 25—27 ...

25. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.

26. టెకేల్అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.

27. ఫెరేన్అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.

 

   చూశారా గర్విష్టికి దేవుడు చెప్పిన తీర్పు!అందుకే బైబిల్ గ్రంధంలో ఎత్తకుడి కొమ్ము ఎత్తకుడి అన్నారు దేవుడు. కీర్తనలు 75: 5

కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

 ఇప్పుడు అలాగే జరిగింది.

 

    రాత్రి దానియేలుగారిని సామ్రాజ్యానికి మూడవ అధిపతిగా చెయ్యడం జరిగింది.

 

ఇంకా ఏమి జరిగింది అంటే మాదీయ రాజైన దర్యావేషు రాజయ్యాడు ఎలాగంటే, కుట్ర జరిగింది బెల్షస్సర్ యొక్క సొంత బాడీగార్డులు ఆయనను చంపేశారు ఇందిరాగాంధీ గారిని సొంత బాడీగార్డులు చంపినట్లు! అయితే అంతకుముందు అదే సమయంలో నగరం అనగా బబులోను నగరం ను, కోరేషు ఆధ్వర్యంలో మాదీయ పారశీక సేనలు వశం చేసుకున్నాయి. ఎలా అంటే అది అసాధ్యం! కారణం పట్టణానికి బలమైన కోట ఉంది, బలమైన గోడలున్నాయి. అంతేకాకుండా పట్టణం యూఫ్రటీస్ నదికి ఇరుప్రక్కలా 28కి.మీ. విస్తీర్ణంలో కట్టబడింది. Hanging Gardens కట్టించాడు. అప్పటి పట్టణ జనాబా పదిలక్షల మంది.  ఇంకా ఎవరైనా నది మార్గం గుండావచ్చి యుద్ధం చేయకుండా ఉండడానికి నదికి కూడా రోజుల టెక్నిక్ ఉపయోగించి ఇరుప్రక్కలా గొప్ప గేట్లు ఏర్పాటు చేశాడు. సాయంత్రమైతే గేట్లు మూసివేసి కాపలా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా కోటగుమ్మం దగ్గరికి వచ్చి గెలవడం అసాధ్యం. నది మార్గంలో కూడా అసాధ్యం!  గాని కోరేషు అర్ధరాత్రి పూట నడిమార్గంలో వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎలా స్వాధీనం చేసుకున్నాడు అంటే అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆరోజు నది గేట్లు మర్చిపోయి మూయలేదు. రకంగా ఆరోజు, రాత్రియే బెల్షస్సర్ హతమైపోయాడు. దర్యావేషు 62 సంవత్సారాలు వయస్సులో రాజయ్యాడు. ఇంతటితో బబులోను సామ్రాజ్యం అంతమయింది. మాదీయ పారశీక సామ్రాజ్యం మొదలయ్యింది.

 

  ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, దర్యావేషు రాజైనట్లు వ్రాయబడింది, కోరేషు యుద్ధం చేసాడని ఎందుకు చెబుతున్నావు అంటే, వారియొక్క ట్రీటీ ప్రకారం కోరేషు పట్టణాన్ని గెలిచి స్వాధీనం చేసుకున్నా దర్యావేషుని బబులోనులో ఉండి పాలించమని చెప్పి ఉండాలి. అందుకే క్రీ.పూ.539 లోబెల్శస్సర్ హతమయ్యి, దర్యావేషు రాజయ్యాడు.

 

    కాబట్టి అధ్యాయం ప్రకారం మనకు అర్ధమయ్యేది ఏమిటంటే:

మొదటగా గర్విష్టులు అహంకారులను దేవుడు ఈలోకంలో ఉండకుండా తీసివేస్తారు.

రెండవది  త్రాగుడు వలన మనిషి విచక్షణా జ్ఞానం కోల్పోయి ఏం చేస్తాడో తెలియదు, గనుక త్రాగుడు నుండి దూరంగా ఉండాలి. వాడు త్రాగకపోతే, ఆ విందు జరుగక పోతే ఆ రోజు అధికారులు వాడితో లేకపోతే ఆ కుట్ర జరిగి ఉండకపోను. వీడు చావకపోను. పట్టణం పట్టబడక పోను!

మూడవది: దేవునికి వ్యతిరేఖంగా నిలిచిన వాడు ఎవడూ వర్దిల్లడు!

నాల్గవది: ఈ సృష్టిని పాలిచేంది రాజులు అధికారులు కాదు. దేవాదిదేవుడు. ఆయన ఆయనకిష్టమైన వారిని రాజులుగా చేస్తారు, రాజులుగా తీసేస్తారు.

ఐదవది, ప్రాముఖ్యమైనది: దేవుని వస్తువులను అపవిత్రం చేయకూడదు. అనగా సంఘంలో మందిరంలో ఉన్నవి అపవిత్రం చేయకూడదు. మరీ ముఖ్యంగా దేవుడు నీకిచ్చిన దేవుడు వస్తువులను కూడా అపవిత్రం చేయకూడదు. కన్ఫ్యూజ్ గా ఉంది కదా. నీ దేహమే దేవుని ఆలయం. దానిని కూడా నీవు అపవిత్రం చేయకూడదు. నీ తలంపుల ద్వారా, నీ త్రాగుడు, వ్యభిచారం లాంటి పాపపు పనుల ద్వారా అపవిత్రం చేయకూడదు. చేస్తే రాజుకి పట్టిన గతే మీకుకూడా వస్తుంది.

 

     విషయాలు గమనించి ప్రియ దైవజనమా! మనం అహంకారం విడిచి, అజ్ఞానం విడచి, దేవునికి లోబడి, త్రాగుడు మాని దేవుని భక్తిలో సాగిపోదాం! ఇక ఏమి జరిగిన దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది కాబట్టి మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఆయన మీద విశ్వాసముంచి ఆయనమీద భారం వేసి సాగిపోదాం!

 

దైవాశీస్సులు!

   

*దానియేలు-12-The Man of God*

*12 భాగం- సింహాల బోను*

 

దానియేలు 6: 16

అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకుంటున్నాం!

ఈ అధ్యాయంలో చాడీగొట్టోల్లు దానియేలు గారి మీద చాడీలు చెప్పి ఆయనను సింహాల బోనులో పడవెయ్యడం, దేవుడు అత్యద్భుతముగా, అసాధారణ రీతిలో కాపాడటం చూడవచ్చు!

 

ఎప్పుడు జరిగింది? BC 539 లోనే అయ్యుండవచ్చు కారణం 6:1—2 వచనాలు జవాబు చెబుతాయి.

 

అప్పటికి దానియేలుగారి వయస్సు ఎంత? సుమారు 84 –87 సంవత్సారాలు. కారణం అప్పటికి 9 అధ్యాయం ప్రకారం దానియేలు గారు చెరలోనికి వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

 

   ఎందుకు వేశారు? ఎందుకు చాడీలు చెప్పారు అంటే గతభాగాలలో వివరించినట్లు దానియేలు గారి ప్రారంభంలోనే బబులోను సామ్రాజ్యంలో హేమాహేమీలు మీద అధికారిగా చిన్న వయస్సులో నియమింపబడ్డారు. అప్పటినుండి ఆయనమీద పగబట్టారు. అయితే రాజులు మారినా ఆయన ఇంకా అంచెలంచెలుగా పైకి ఎక్కుతున్నారు గాని ఆయనను ఎవడూ అధిగమించలేక పోతున్నాడు. ఇంకా వారి తండ్రులు పోయారు గాని ఆయనమాత్రం ఇంకా అధికారంలోనే ఉంటున్నారు. చివరికి బబులోను సామ్రాజ్యం కూలిపోయి మాదీయ- పారశీక రాజ్యం వచ్చింది. ఇప్పుడు కూడా ఆయనే అధికారిగా ఉన్నారు. దర్యావేషు రాజైన వెంటనే సామ్రాజ్యంలో కొత్త విధివిధానాలు ప్రవేశపెట్టాడు. కొత్త పన్ను విధానం, ఇంకా అధికారాన్ని వికేంద్రికరణ చేయడం, పాలనలో అనేకులను భాగస్వాములుగా చేయడం, తద్వారా న్యాయం వెంటనే జరగడం, ఎన్నో సంక్షేమ పధకాలు పెట్టడం చేసాడు. దీనికోసం 12 మందిని ప్రత్యేకమైన అధికారులుగా నియమించి వారిమీద ముగ్గురుని అధికారులుగా పెట్టాడు. ముగ్గురిలో దానియేలుగారు ఒకడు, మరియు ముఖ్యుడు! అదీ వీరిభాద! రాజులు మారినా వీడిబాధ మనకు తప్పడం లేదు అని కుళ్ళిపోయారు. అసూయ అనేది ఏమి చేస్తుందో బైబిల్ లో మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. సామెతలు 14:౩౦; అపో 7:9; 17:5..; యాకోబు :14,16..

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

 

   45..

4. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైన ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.

5. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. .ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే శత్రువులకు మనం ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంది. అయితే అలాంటి శత్రువులకు కూడా దానియేలుగారిలో తప్పు, చెడ్డతనము కనబడలేదంట. అందుకే దేవుని విషయంలో నేరం మోపుదామని అనుకుంటున్నారు. చివరకు ఏమిచేశారంటే రాజు దగ్గరకు వచ్చి రాజుని పొంగించేశారు. నీవు ఇంతోడివి అంతోడివి. నీలాంటివాడు ఈలోకంలోనే ఎవరూ లేరు అంటే పొంగిపోయాడు. వారి మాయలో పడిపోయాడు రాజు! తెలుగులో ఒక పాత సామెత ఉంది: మనిషికి పొగిడింపు; గుడ్డకు జాడింపు; కూరకు తాలింపు కావాలంట!

 

67..

6. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

7. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధి పతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి...

  ఇక్కడ అబద్దమాడుతున్నారు వీరు: ఏమిటంటే రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు, అధిపతులు మంత్రులు ఇలా అందరూ నిర్ణయం తీసుకున్నారు అనే అబద్దం. అది తీసుకున్నది దానియేలుగారంటే కిట్టని వారు అదికూడా ఆయనను చంపించాలి అనే దురుద్దేశంతో! సరే, ఇప్పుడు రాజు పొంగిపోయి శాశనం చేసేశాడు.

10. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ... చూశారా ఎంతధైర్యమో! ప్రార్ధన చేస్తే  ఏం జరుగుతుంది? మహా అయితే తన ప్రాణం పోతుంది అంతేకదా అని అనుకుని ఉంటారు. ఇంకా గమనించవలసిన విషయం ఏమిటంటే దానియేలు గారు అంతపెద్ద అధికారి, హోదాలో ఉండికూడా రోజుకు మూడుసార్లు ప్రార్ధనచేస్తున్నారు. ప్రియ చదువరీ నీవు ఎన్నిసార్లు ఎంతసేపు దేవునికి ప్రార్ధన చేస్తున్నావు? దానియేలు గారి జయజీవితానికి ప్రార్దనే మెట్టు! నీకు కూడా జయజీవితం కావాలంటే ప్రార్ధనా బలిపీటం కడితే నీకు కూడా సాధ్యమే!

 

         అయితే ఇక్కడ దానియేలు గారు తలుపులు అన్ని మూసేసుకుని రహస్యప్రార్ధన చేయడం లేదు. దేవుని పట్ల తనకున్న నమ్మకత్వం వలన ప్రమాదం ఎదురైనా అతనిలో కనబడే ధైర్యం ఆనాటి వారికే కాక అతని తర్వాత వారికి కూడా గొప్ప ఆదర్శం! ఒకపని చేద్దామని నిర్ణయం తీసుకుంటే అందువలన కలిగే ఫలితాలను లెక్కచేయకుండా ముందుకు సాగిపోయేవారాయన. 

 

   వెంటనే చాడీగొట్టువాళ్ళు సందడిగా కూడివచ్చి రాజుతో అంటున్నారు: రాజా నీవు ఒక శాసనం చేశావు గాని మన రాజ్యంలో ఒకడు పాటించడం లేదు అంటే రాజు ఎవరూ అని అడిగాడు, వెంటనే వారు దానియేలు గారి పేరు చెప్పారు. అప్పుడు విలిగింది లైట్ రాజుకు! ఇది దానియేలుగారిని చంపడానికి వారు పన్నిన పన్నాగంలో తను ఇరుక్కుపోయాడు అని! సాయంత్రం వరకు తప్పించాలి అని ఎంతో ప్రయత్నం చేసిన తప్పించలేకపోయాడు ఒక చక్రవర్తియై ఉండికూడా!

14. రాజు మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యుడస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. . చూడండి రాజు ఇది విని చాలా విచారపడ్డాడు అట! ఇలాంటి సంఘటన యేసుక్రీస్తుప్రభులవారికి కూడా జరిగింది. పిలాతు యేసయ్యను విడిపించాలి అనుకున్నా  విడిపించలేకపోయాడు. అలాగే మార్కు 6:26 ప్రకారం హేరోదు కూడా బాప్తిస్మమిచ్చు యోహాను విషయంలో విడిపించలేకపోయాడు. పరిపాలకులు కొన్నిసార్లు తాము గొప్పలకు పోయి చేసిన తెలివితక్కువ నిర్ణయాలకు ఫలితంగా తమపైకి ఇతరుల పైకి కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఇంతకీ ఎందుకు దానియేలుగారిని విడిపించాలి అనుకున్నాడంటే ఆయన- తనకన్నా చాలా పెద్ద, సుమారు 25౩౦ సంవత్సారాలు పెద్ద దానియేలు గారు. పరిపాలనా విషయంలో ఈయన ఆరితేరి ఉన్నారు కాబట్టి దానియేలుగారి ఆలోచనా విధానం వలన ఆయన చెప్పిన సలహాల వలన రాజ్యానికే కాకుండా రాజ్యంలో ఉన్న పౌరులందరికీ ఎంతో మేలు కలిగేది. అందుకే ఆయనను ఒక మిత్రుడుగా, ఒక పెద్ద దిక్కుగా భావించేవాడు దర్యావేషు. అందుకే తప్పించాలని చూశాడు గాని ఫలితం లేక ..అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

..చూడండి నీవు అనుదినము సేవించు చున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని అంటున్నాడు రాజు!

చూడండి సుమారు 90ఏళ్ల వృద్ధుడిని వీరు కక్షతో సింహాల బోనులో వేయించారు. ఎన్ని సింహాలు ఆ బోనులో ఎన్నాయో మనకు తెలియదు.

 

18 వచనం దానియేలు గారిమీద తనకున్న ప్రేమను తెలియజేస్తుంది..దానియేలు 6: 18

అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

ఒక చక్రవర్తి ఒక ఉద్యోగి కోసం ఉపవాసమున్నాడు.

 

(అయితే Bel and Dragon పుస్తకం ప్రకారం, chabad and OCA ప్రకారం రాత్రి దానియేలు గారు ఆకలితో ఉంటే దేవుడు తనదూతను పంపి, హబక్కూకు గారు యెరూషలేము శివారులో తన పనివారికి ఆహారం తీసుకుని వెళ్తుండగా ఆహారం దానియేలు గారి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఆకలి తీర్చి, హబక్కూకు గారి సంశయాలు దానియేలు గారి ద్వారా తీర్చడం జరిగింది అంటారు. ఇక హబక్కూకు ద్వారా యెరూషలేము యొక్క పరిస్థితి తెలుసుకుని తర్వాతనే దానియేలు గారు చెరవిముక్తి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంటారు.)

 

సరే మన పాఠానికి వద్దాము. 19—22...

19. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను.

20. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచిజీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.

21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక.

22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను. .

19లో తెల్లవారుజామున లేచి గుహదగ్గరకు వెళ్లి చిన్న ఆశతో అడుగుతున్నాడు... 20 లో జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు... చూడండి ఒక అన్యుని నోటనుండి ఎంత దొడ్డ మాట వస్తుందో! ఈమాట రాడానికి దానియేలుగారి మచ్చలేని జీవితమే అని నా ఉద్దేశ్యం! మన ప్రవర్తన వలననే దేవునికి పేరు వచ్చినా అవమానం వచ్చినా! అందుకే క్రైస్తవుడు అనుదినం అనుక్షణం ఎంతో జాగ్రత్తగా జీవించాలి.

వెంటనే అక్కడనుండి జవాబు వస్తుంది. రాజు చిరకాలము జీవుంచును గాక! నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు. నేను క్షేమము! హల్లెలూయ!

చూశారా దేవుడు తనయందు నమ్మికయుంచే తనవారిని ఎప్పుడూ వదలరు. నిన్ను విడువను ఎడబాయను అని మాటిచ్చారు. యెహోషువ 1:6; యోహాను14:18; హెబ్రీ 13:5;  నిన్ను ముట్టినవాడు నాకనుపాప ను ముట్టినట్లే అంటున్నారు. జెకర్యా 2:8;

కీర్తనలు 91: 2--16;

నీ ప్రక్కను వేయిమంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.

 అలాంటి దేవుడ్ని సంపూర్తిగా నమ్మాలి తప్ప అనుమానించకూడదు. దానియేలుగారు నమ్మారు, దేవుడు విడిపించారు. హనన్యా, మిషాయేలు, అజర్యాలు నమ్మారు. దేవుడు విడిపించారు. నీవుకూడా నమ్ము దేవుడు నిన్నుకూడా విడిపిస్తారు.

 

వెంటనే రాజు ఆనందబరితుడై దానియేలు గారిని బయటకు తీయించి, చాడీగొట్టు వారిని, వారి కుటుంబాలతో సహా అదే సింహాల బోనులో వేయించడం జరిగింది.

 

ఇక  రాజు అంటున్నాడు 25—27

25. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.

26. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.

27. ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ....

 

ప్రియ దేవుని బిడ్డా! ఇదేమాట ఈరోజు నీకు నాకు చెబుతున్నారు: ఆయన విడిపించువాడు, రక్షించువాడు. నీకు వచ్చిన శోధనలను చూసి కృంగిపోకు, పరమందు సూచకక్రియలు భూమిమీద కూడా అద్భుతాలు చేసే శక్తిగల దేవుడు. కాబట్టి నీవు నేను ఆయనకు భయపడి ఆయన సముఖమున వణకాలి. ఆయనే జీవము గలదేవుడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు.

మరినీవు దానియేలుగారిలా నమ్ముతున్నావా ప్రియ స్నేహితుడా!

 ఆయనను మనస్పూర్తిగా నమ్ముదాం!

 సాగిపోదాం! పరమకానాను చేరేవరకు!

 

దైవాశీస్సులు!

*దానియేలు-13-The Man of God*

*13వ భాగం*

*దానియేలు దర్శనాలు- బ్రహ్మాండమైన ప్రతిమ-1*

 

దానియేలు  2:28,29

28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా

29. రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను.   ..

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి జీవితంలో జరిగిన అనుభవాలు- తద్వారా దేవుడు మనతో ఏమి చెబుతున్నారో మనం ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ రోజునుండి దానియేలు గారికి కలిగిన దర్శనాలు ఏమిటి? వాటి భావం ఏమిటి అనేది క్లుప్తంగా చూసుకుందాం! గమనించాలివీటిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం! అంతేకాకుండా నేను బైబిల్ పండితుడను అసలు కాదు, కాబట్టి సామాన్యులకు అర్ధమయ్యేరీతిలో ఎంతవరకు కావాలో, పరిశుద్దాత్ముడు వాటిద్వారా ఏమి మాట్లాడుతున్నారో అది మాత్రం చూసుకుందాం. గమనించాలి ఈ సందర్భంగా కొంచెం చరిత్ర జ్ఞాపకం చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ చరిత్ర ఉదహరించడం లో నా ఉద్దేశం నాకు చరిత్ర తెలుసు అని ఎంతమాత్రము కాదు. అది సందర్భం కాబట్టి కొంచెం చరిత్ర చూసుకుందాము అంతే!

 

   ఇక మరీ ముఖ్యమైన సంగతులు. ఏమిటంటే

మొదటగా: దానియేలు గారికి నాలుగు దర్శనాలు కలిగాయి. గాని పండితులు ఐదు అని లెక్కపెడతారు కారణం 2వ అధ్యాయంలో గల కల నెబుకద్నెజర్ కి కలిగినా ఆయన మర్చిపోయినందువలన దానిని దేవుడు దానియేలుగారికి దర్శనంలో చూపించినందువలన, దానికి ఆయనే అర్ధం చెప్పినందువలన దానిని కూడా దానియేలు గారి దర్శనముగా చెబుతారు.

ఇక 7వ అధ్యాయంలో ఒకటి, ఎనిమిదవ అధ్యాయంలో మరొకటి, తొమ్మిదవ అధ్యాయంలో మరొకటి, ఇక 10—12 అధ్యాయాలలో చివరి దర్శనం మొత్తం ఐదు దర్శనాలు కలిగాయి.

 

రెండవది: ఈ దర్శనాలు అన్నింటికీ ఒకదానితో ఒకటి లింకులు ఉన్నాయి. రెండవ అధ్యాయానికి కొనసాగింపు 7వ అధ్యాయం, ఎనిమిదవ అధ్యాయం, దానిని తొమ్మిదవ అధ్యాయంలో కొనసాగించారు, దానికి కొనసాగింపు 10—12 అధ్యాయాలు. అనగా ఈ దర్శనాలు వేర్వేరు సమయాలలో కలిగినా ఒకే క్రమంలో అన్ని దర్శనాలు కలిగాయి. అయితే ఈ దర్శనాలు కలగటానికి కారణం *2:29 రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను*.   ....... అందుకే దేవుడు మొదట కలరూపంలో నెబుకద్నెజర్ కి చూపించారు. గాని ఆయన మర్చిపోయాడు. కల నిశ్చయం, దాని భావం రూఢిగా జరుగుతుంది కాబట్టి అది రెట్టింపు చేయబడింది- రాజుకి, దానియేలుగారికి. రెండవ అధ్యాయంలో మొదలుపెట్టిన దర్శనాలు- పన్నెండవ అధ్యాయం వరకు కొనసాగాయి. అన్నింటి భావము రాబోయేదినాలలో ఏమి జరుగబోతున్నాయి, అభిషక్తుని మొదటి రాక, రెండవ రాక!

 

మూడవది: దానియేలు గ్రంధము గాని, యేహెజ్కేలు గ్రంధములో ఉన్న దర్శనాలు గాని, జెకర్యా గ్రంధ ప్రవచనాలు గాని అర్ధం చేసుకోవాలంటే ప్రకటన గ్రంధముతో కలిపి చదువుకుంటే లేక ప్రకటన గ్రంధముతో పోల్చుకుంటేనే అర్ధం అవుతాయి లేకపోతే సరిగ్గా అర్ధం కావు. నెబుకద్నెజర్ కాలం నుండి, దేవునిరాజ్యం అనగా పరలోకరాజ్యం అనగా క్రీస్తుయేసు విలువపెట్టి కొన్న సంఘం లేక విశ్వాసుల సమూహం ఏర్పాటు వరకు దానియేలు గారిని బబులోను చెరకు పంపి రాయిస్తే, ఆ తర్వాత జరుగబోయే సంగతులను అనగా దేవుని రాకడ, తీర్పు, ఈ సృష్టి అంతము మరియు కొత్తసృష్టి వరకు దేవుడు భక్తుడైన యోహాను గారిని పత్మాస్ దీవికి  బందీగా పంపించి రాయించారు. కాబట్టి ప్రతీ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంధంతో పోల్చుకుంటేనే భావము పూర్తి అవుతుంది.

 

నాల్గవది: ఒక వచనానికి మరో సపోర్టింగ్ వచనం ఇవ్వడం జరిగింది. లేఖనముల పరిశీలన ఇలాగే జరగాలి. ఒకదానికి మరో సపోర్టింగ్ వచనం ఉంటేనే అది నిజం అని, ఒకవేళ అలా లేకపోతే అది కేవలం అలా జరుగుతుంది అని ఉద్దేశించడమే అవుతుంది. అందుకే దానికి సపోర్టింగ్ వచనాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంచెం ఈ అధ్యాయంలో కొంచెం ఆ గ్రంధం నుండి వివరణ ఇవ్వడం జరిగింది. కారణం యెషయా గ్రంధంలో 28:10—13 లో  దేవుడు స్పష్టంగా చెప్పారు- కొంత ఇచ్చట- కొంత అచ్చట దేవుని ప్రత్యక్షత కలుగుతుంది అని. కాబట్టి కొంత అచ్చటను, ఇచ్చటను కలుపుకుంటేనే ముచ్చటగా అర్ధమవుతుంది.

 

   సరే, ఈ రోజు మనము రెండవ అధ్యాయంలో గల నెబుకద్నెజరు రాజు కల, దానియేలుగారి దర్శనంఅనగా బ్రహ్మాండమైన ప్రతిమకోసం ధ్యానం చేద్దాం! 31—35.

31. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను.

32. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,

33. దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను.

34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.

35. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ...

 

ఇక దాని భావం ఆయన మాటలలో

37—45....

37. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు.

38. ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మను ష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు

39. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.

40. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.

41. పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.

42. పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును.

43. ఇనుమును బురదయు మిళితమైయుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.

44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

45. చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహాదేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.  ఇదీ కల- కల భావము.

 

అయితే ఇప్పుడు ఆ దర్శనం ఎప్పుడు, ఎలా నెరవేరింది? అనేది చూసుకుందాం! దేవుడు సుమారు 2500 సంవత్సరాలు క్రితమే అప్పటినుండి  ఇప్పటివరకు జరిగే ఘటనలు చూపించారు.

దేవుడు ఏమి జరుగబోతుందో ముందుగానే తన భక్తులకు చూపించే దేవుడు! అందుకే తనను నూటికి నూరుపాళ్ళు నమ్మి తనను అనుసరించే భక్తులను వాడుకుంటారు. దానికి ఒక సాధనం దానియేలు గారు.

ఈ ధర్శనములో ఒక ప్రతిమ నాలుగు రకాలైన లోహాలతో తయారుచేయబడింది. తల మేలిమిబంగారం, దాని రొమ్మును, భుజములు వెండివి, దాని ఉదరము అనగా కడుపు తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి దాని పాదములలో ఒక భాగం ఇనుము, మరోభాగం మట్టి. ఆ తర్వాత చేతిసహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమను కొట్టి పొడిచేసింది.

దానికి భావంగా దానియేలుగారు ప్రపంచాన్ని పాలించే నాలుగు సామ్రాజ్యాలు రాబోతున్నాయి. దానికి తల మీరు. ఆ తర్వాత మీకంటే తక్కువ బలము, తెలివి కల రాజ్యాలు మూడు వస్తాయి. ఆ తర్వాత మిశ్రమ రాజ్యం, ఆ తర్వాత శాశ్వతరాజ్యం వస్తాయి అని చెప్పారు.

ఇది నిజంగా నెరవేరింది. ఆయన చెప్పినట్లే ఇంతవరకు నాలుగు మహా సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పాలించాయి. అవి బబులోను సామ్రాజ్యం, రెండు మాదీయ-పారశీక సామ్రాజ్యం, మూడు మాసిదోనియ-గ్రీకు సామ్రాజ్యం, నాలుగు రోమన్ సామ్రాజ్యం! ఆ తర్వాత  ప్రజాస్వామ్యం!

(ఇంకాఉంది)

 

 

     

 

*దానియేలు-14-The Man of God*

*14 భాగం*

*దానియేలు దర్శనాలు- బ్రహ్మాండమైన ప్రతిమ-2*

 

దానియేలు 2:28--29  ..

                                                                 (గతభాగం తరువాయి)

 

  మొదటగా మేలిమిబంగారుతో పోల్చబడిన శిరస్సు! అది రాజా మీరే అని స్పష్టంగా చెప్పారు దానియేలు గారు.

 కాబట్టి మొదటి రాజ్యం- బబులోను సామ్రాజ్యం. దీనికోసం చరిత్రలో చూసుకుంటే బబులోను సామ్రాజ్యం మొదలుపెట్టింది

1) నెబుకద్నెజర్ రాజు యొక్క తండ్రి నెబోపోలస్సార్, తర్వాత నెబుకద్నెజర్ 43 సంవత్సారాలు పాలించాడు. బబులోను సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది కూడా నెబుకద్నెజర్. BC 605 నుండి 562 వరకు పాలించాడు.

2) అతని కొడుకు ఎవిల్-మెరోదాక్ 2 సం.లు; BC 561560

) ఎవిల్-మెరోదాక్ ని చంపి అతని అల్లుడు నెరిగ్లిస్సర్ – 4 సం.లు; BC 560—556

4) నెరిగ్లిస్సర్ కొడుకు లాబాస్ ముర్డుక్ – 9 నెలలు BC 556(ఒక సంవత్సరం కంటే తక్కువ కాలము)

5) నెబుకద్నేజర్ రెండవ భార్య కొడుకు నబోనిదాస్- 1౩ సం.లు; BC 555—542;

6) నెబుకద్నేజర్ మనవడు, నబోనిదాస్ కొడుకు బెల్షస్సర్౩ సం.లు ; BC 542—539..........

అయితే గమనించాలి నబోనిదాస్ మరియు బెల్షస్సర్ కలిసి పాలించారు కాబట్టి కొన్ని చరిత్ర పుస్తకాలలో బెల్షస్సర్ 555 నుండి క్రీ.పూ 539 వరకు పాలించినట్లు చూడవచ్చు. చివరి మూడు సంవత్సారాలు ఆయన ఒక్కడే పాలించాడు. ఈ బబులోను సామ్రాజ్యం క్రీ.పూ. 539 లో కోరేషు బెల్షస్సర్ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో ముగిసింది. అనగా బబులోను సామ్రాజ్యం BC 605 నుండి 539 వరకు సాగింది.

 

   గతబాగాలలో వివరించినట్లు నెబుకద్నెజర్ ఉన్నప్పుడే మాదీయ-పారశీక దేశాల అలయన్స్ మొదలయ్యింది రెండు దేశాల మధ్య కుదిరిన ట్రీటీ ప్రకారం. నెబుకద్నెజర్ రాజు మరణించిన రెండు సంవత్సరాలు నుండి ప్రయత్నం చేస్తే చివరకు 539 లో సాధించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి, గతభాగం లో బబులోను నగరాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యం అని వివరించడం జరిగింది. అయితే ఎలా స్వాధీనం చేసుకున్నాడంటే అది కేవలం దేవుని అనుగ్రహం . అంతే! అంతేకాకుండా కోరేషు పుట్టకముందు 15 సంవత్సారాలు క్రితమే దేవుడు ప్రవక్తయైన యెషయాగారికి ఒక ప్రవచనమిచ్చారు. 45:14

1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.

2. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.

3. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.

4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని .... ప్రియులారా! ఇది కేవలం ఇశ్రాయేలీయుల చెరనుండి విముక్తి చేయడానికే దేవుడు కోరేషు ను ఏర్పాటుచేసుకుని ఆయన గెలిచేలా చేశారు. ద్వారములు వేయకుండా తలుపులు తీస్తాను అనగా తలుపులు బబులోను నగరం యొక్క నది తలుపులు గేట్లు. అందుకే వెంటనే ఆయన రాజ్య పరిపాలనకు వచ్చిన వెంటనే ఇశ్రాయేలీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవచ్చు అని శాసనం చేశాడు. 2దినవృత్తా 36:23;.ఎజ్రా 1:2;.. తర్వాత శాశనం 80 సంవత్సారాలు గడిచాక రాజైన అర్తషహస్త కాలంలో వచ్చింది. సరే, ఇప్పుడు మాదీయ పారశీక అలయన్స్ లో చాలామంది పాలించారు. BC 539 నుండి అలెగ్జాండర్ BC ౩౩౩లో స్వాధీనం చేసుకున్నంత వరకు.  గమనించాలి- కోరెషు వంశము పాలించారు , మరో ప్రక్క మరికొన్ని దేశాలను దర్యావేషు వంశం పాలించారు. కోరేషు -1, కంబైసిస్-1, ఆయన తర్వాత కోరేషు-2, అతని తర్వాత కంబైసిస్-2,, బారిద్యా  వరకు పాలించారు.  ఇక దర్యావేషు వంశంలో   హతాస్పెస్- దర్యావేషు-1 తండ్రి , దర్యావేషు-1, అతనికొడుకు ఆహాష్వేరోషు-1, అతని కొడుకు దర్యావేషు-2, అర్తషహస్త-1, ఇలా అర్తషహస్త-4 వరకు పాలించారు. గమనించాలివీరి అలయన్స్ లోనే వీరిసేనలు క్రీ.పూ. 518లో భారతదేశం వరకు వచ్చి, భారతదేశంలో ఉత్తరపంజాబ్ ప్రాంతం వరకు (ప్రస్తుతం ఇది పాకిస్తాన్ లో ఉంది) గెలిచినట్లు చరిత్ర చెబుతుంది. అందుకే ఎస్తేరు గ్రంధంలో హిందూదేశము మొదలుకొని .. అంటూ రెండుసార్లు వ్రాయబడింది. మరోమాట గుర్తుంచుకోవాలి- విషయాలు జరిగేటప్పటికి భారదేశము లేక హిందూదేశము అనగా ప్రస్తుతం మన ఇండియా, టిబెట్, నేపాల్, పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు భారదేశమే! ఇదీ అనగా మాదీయ పారశీక సామ్రాజ్యము బ్రహ్మాండమైన ప్రతిమ యొక్క  వెండితో చేయబడిన భుజము, మరియు రొమ్మును సూచిస్తుంది.

 

     ఇక రాజ్యమును అంతము చేసింది అలగ్జాండర్ the గ్రేట్ ని పిలుబడిన మాసిదోనియాకి చెందిన గ్రీకు రాజు. యితడు BC 356 జూలై 21 పుట్టాడు. తన తండ్రియైన ఫిలిప్ -2 BC ౩౩6 లో హత్యకావించబడినందువలన 20 సంవత్సరముల వయస్సులోనే అధికారమునకు వచ్చాడు. తన గురువు ఆరిస్టాటిల్! యితడు BC ౩౩6 నుండి 23 వరకు పాలించాడు. ఇతడు యుద్ధకాంక్ష గలవాడు, ప్రపంచాన్ని మొత్తం పాలించాలి అనుకున్నాడు. దానికి అనుగుణంగా రాజ్యాలు గెలుచుకుంటూ  భారతదేశం కూడా వచ్చి, రాజైన పురుషోత్తమునితో రెండుసార్లు యుద్ధము చేసినట్లు మనం చరిత్రలో చూడగలము. చివరకు 23 లో భారతదేశంలో గల అడవులకు, నదుల మధ్యలో తన సైన్యము చిక్కుకున్నందువలన అనేకులను కోల్పోయి తిరిగి వెళ్తుంటే చనిపోయినట్లు చూసుకుంటాము. కొందరు విపరీతంగా త్రాగినందువలన చనిపోయాడు అంటే మరికొంతమంది భారతదేశంలో గల మలేరియా దోమలు కుట్టడం వలన మలేరియా వలన చనిపోయాడు అంటారు. ఏదిఏమైనా 32 సంవత్సరముల వయస్సులో చనిపోతాడు. రాజ్యము నాలుగు రాజ్యాలుగా నలుగురి వశము అవుతుంది. చివరకు గ్రీకు సామ్ర్యాజ్యం BC 47లో అంతమైపోయింది. ఇదే బ్రహ్మాండమైన ప్రతిమలో ఇత్తడితో చేయబడిన ఉదరము, తొడలు సూచిస్తుంది.

 

  తర్వాత సామ్రాజ్యము రవి అస్తమించని రోమా సామ్రాజ్యం!  కారణం క్రీ.పూ 47లో సామ్రాజ్యం మొదట కొద్దిగా మొదలైనా చివరకు వీరు మొత్తం యూరోప్, ఆసియాలో కొంతభాగం, ఇంకా ఉత్తర ఆఫ్రికాఖండమును కూడా పాలించారు. సామ్రాజ్యము కొన్ని రోజుల తర్వాత క్రీ.. నాల్గవ శతాబ్దంలో  తూర్పు రోమా సామ్రాజ్యం,  పశ్చిమ రోమా సామ్రాజ్యంగా విభజించబడింది. ఒక భాగానికి రోమ్ రాజధానిగా, మరోదానికి కాన్స్టాంటినోపుల్ . ఇది క్రీ.. 1453 లో అంతమయింది. చివరలో పదిరాజ్యాలుగా కూడా విభజించబడింది. ప్రకటన 17:12;  దీనికోసం తర్వాత ధ్యానం చేద్దాం! ఇదే ప్రతిమలో మోకాళ్ళు, పాదములను సూచించే ఇనుము, మట్టిలాంటి రాజ్యము. 2:4244 ; అవును నేడు కూడా ఒకరితో ఒకరు పొంతన లేకుండా ఉన్నారు. గమనించాలి తర్వాత అనగా రోమా సామ్రాజ్యం, రోమన్ కేథలిక్ ఆధిపత్యం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్య రాజ్యాలు వచ్చాయి, గాని వీటిని 5 రాజ్యంగా చెప్పడంలేదు. కాబట్టి చేతిసహాయం లేని రాయి ప్రజాస్వామ్య రాజ్యాలు కానేకాదు. గమనించాలి ఇంకా పూర్తి వివరణ మనకు మిగతా దర్శనాలలో కనిపిస్తాయి. ఈమట్టి రాజ్యము పగులగొట్టబడుతుంది. కీర్తన 2:9.

ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు.

ప్రకటన 2:27

అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;

 

   అయితే ఇక్కడ ముఖ్యంగా మనము గుర్తించదగినది ఏమిటంటే

.దానియేలు 2: 44

ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

    ఆ రాజుల కాలంలో అనగా ఈ రోమా రాజుల కాలంలో దేవుడు ఒకరాజ్యము స్తాపించును. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఇక్కడ ముఖ్యమైన విషయం దానిని పొందినవారికే తప్ప మరెవరికి చెందదు. ఈ కాలంలోనే యేసుక్రీస్తుప్రభులవారు .దానియేలు 9:25లో చెప్పబడిన అభిషక్తుని యొక్క మొదటి రాకడ జరిగింది. మనకందరికీ తెలుసు రోమా పాలనలో నేటికి సుమారు 2024 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టారు యూదయ బెత్లెహేములో. ఆయన పుట్టకమునుపు ఆయన కోసం చెప్పబడిన ప్రవచనాలుచూద్దాం...,

యెషయా 9:6—7I

6.ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.  

లూకా 1:౩౦౩౩ 

30. దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. ...

 

     ఆయన వయస్సు ముప్పై సంవత్సరంలో  దేవుని రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొంది రక్షణపొందుడి అనేమాటతో మార్కు 1:15తో దేవునిరాజ్యం ప్రారంభమయ్యి, ఆయన మరణం ద్వారా దానికి పునాదులు ఏర్పడ్డాయి. ఇంతవరకు సాతానుగాడు తన రాజ్యం ఏర్పాటుచేసుకుంటే దానిని యేసయ్య పారద్రోలి పవిత్ర పరలోక రాజ్యము/ దేవునిరాజ్యము అనే చెప్పబడిన క్రీస్తుయేసు వధువు సంఘము కట్టబడుతుంది. అందుకే దానిని పొందినవారికి తప్ప అది ఎవరికీ చెందదు అని వ్రాయబడింది. రోజుల్లో అనేకులు కోట్లాదిమంది సుమారుగా 600 కోట్లమంది ప్రపంచంలో ఉన్నా సత్యాన్ని అనగా యేసుక్రీస్తుప్రభులవారే నిజమైన దేవుడని, ఆయన ద్వారానే స్వర్గం చేరుకోగలరనే సత్యాన్ని తెలుసుకున్న వారు, దేవుని రాజ్యాన్ని / పరలోక రాజ్యాన్ని పొందుకున్న వారు చాలాతక్కువ మంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారే దీనిని పొందుకుంటారు. అయితే రాజ్యాన్ని నాశనం చెయ్యాలని Charlemagne ప్రయత్నం చేశాడు,  Charles V ప్రయత్నం చేశాడు, లూయీస్-14 ప్రయత్నం చేశాడు, నెపోలియన్ ప్రయత్నం చేశాడు, హిట్లర్ ప్రయత్నం చేశాడు. కమ్యూనిస్టులు ప్రయత్నం చేశారు, ఎవడివల్ల కాలేదు, కాబోదు. రోజులలో మరలా ISIS వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలామంది మతఛాందసవాదులు ప్రయత్నం చేస్తున్నారు గాని ఎవరూ ఏమీచెయ్యలేరు. ఆయన రాజ్యం నిత్యరాజ్యము, శాశ్వత రాజ్యము!

 

   ఇక చేతిసహాయం లేని రాయి ప్రతిమను చితుకకొట్టి పొడిచేసినట్లు చూస్తున్నాం రాయి మూలకు తలరాయి యేసుక్రీస్తు ప్రభులవారు

(లూకా 20:1718

17. *ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి*?

18. * రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.*

యెషయా 28: 16

*ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.*)

 

 అనగా అభిషక్తుడు స్తాపించిన సంఘం అనబడే దేవునిరాజ్యం అనగా దేవుని పరిశుద్ధులు ఒకరోజు సర్వ రాజ్యములను పడగొట్టి కాలాంతములో సాతాను అధికారాన్ని సాతానుని ఓడించి చివరకు రాజ్యపరిపాలన చేస్తారు. రాజ్యానికి అంతము లేదు. యుగయుగములు దేవునితో రాజ్యము చేస్తారు ప్రకటన 22:5; దీనినే దానియేలుగారి 7:18, 27 లో దూత చెబుతున్నాడు.

18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంత ములవరకు రాజ్యమేలుదురు.

27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. ;

 

 మరి నీవు సిద్దమా?

గలతీ :29.

మీరు క్రీస్తు సంబంధులైతే (మూలభాషలో- క్రీస్తువారైతే) పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

మత్తయి 25:34

అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింప బడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

           ప్రియ దైవజనమా! ఇది దానియేలుగారి మొదట దర్శనం. దీనిలో నాలుగు బాగాలు జరిగిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది . అది నేడే రేపో జరుగబోతుంది. ఎప్పుడు జరుగబోతుంది అనేది తెలియదు. కారణం యేసుక్రీస్తు ప్రభులవారే ఆ దినమును గూర్చి గడియ గూర్చి అది దేవదూతలకు గాని చివరకు మనుష్యకుమారునికి కూడా తెలియదు అది తండ్రి చిత్తము అని చెప్పారు మార్కు 13:32,33; కాబట్టి అది మనకు తెలియదు. గాని ఆయన చెప్పిన రాకడ గుర్తులు అన్నీ జరుగుతున్నాయి. ఆ రాకడగడియలు అతి సమీపముగా ఉన్నాయి అని మాత్రం చెప్పగలం. కాబట్టి కాలమునెరిగి మనస్సు మార్చుకుని, దేవునితో సమాధాన పడి, ఆ రాజ్యమును సంపాదించుకో! దానిని పొందినవారికి తప్ప అది ఎవరికీ తెలియదు. భాప్తిస్మం తీసేసుకున్నాను కదా పరలోకానికి టికెట్ వచ్చేసింది అని మాత్రము అనుకోవద్దు. ప్రకటన 3:5 ప్రకారం నీపేరు జీవగ్రంధము నుండి తుడుచిపెట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పుడంటే నీ బ్రతుకు బాగులేనప్పుడు.

 అందుకే ఇప్పుడే సరిచేసుకో!

ఆ రాజ్యమును స్వతంత్రించుకో!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*దానియేలు-15-The Man of God*

*15 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-1*

 

దానియేలు 7:27

ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 7 అధ్యాయం నుండి 12 అధ్యాయం వరకు దానియేలుగారికి వివిధ సమయాలలో కలిగిన దర్శనాలు.

 

    గమనించాలి: 7 అధ్యాయం దర్శనం, 2 అధ్యాయంలో గల దర్శనం రెండూ ఒకటే భావాన్ని కలిగియున్నాయి. రెండూ ఒకటే. అయితే అధ్యాయంలో ఇంకా లక్షణాలను బాగా వివరించడం జరిగింది.

 

 2 అధ్యాయంలో

ప్రతిమ యొక్క శిరస్సు- మేలిమి బంగారం- ఇక్కడ సింహము;

వెండి భుజములు రొమ్ము ఎలుగుబంటి

ఇత్తడి ఉదరము తొడలు- చిరుతపులి

ఇనుము కాళ్ళు, మట్టి పాదములు పదికొమ్ములు, ఇనుప దంతముల భయంకరమైన జంతువు

కాబట్టి రెంటి భావము ఒకటే అని తెలుసుకోవాలి.

 

    7:1 ప్రకారం బెల్షస్సర్ మొదటి సంవత్సరంలో దర్శనం కలిగింది దానియేలుగారికి. అనగా 5 అధ్యాయంలో గోడమీద వ్రాత జరుగకముందు వచ్చిన దర్శనం. అనగా సుమారుగా క్రీ.పూ. 542 లో వచ్చిన దర్శనం!

గమనించాలి ఈ అధ్యాయము మొత్తం ప్రకటన గ్రంధముతోను, ఇతర లేఖనాలతోనూ సరిచూసుకుంటేనే గాని బాగా అర్ధం కాదు.

7:2 ఇక్కడ ఆకాశం నలుదిక్కులు నుండి సముద్రం మీద గాలి విసరుతుంది అట! గమనించాలి నేను సముద్రంలో ప్రయాణం చేస్తుంటాను గనుక నాకు బాగా తెలుసు. ఏదో ఒక ప్రక్కనుండి గాలి అలాగా వీస్తేనే భయంకరమైన అలలు వస్తాయి, అలాంటిది నాలుగు ప్రక్కలనుండి గాలివీస్తే ప్రళయమే వస్తుంది. భయానకమైన తుఫాను కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గాలులు అనగా నాలుగు దిశలనుండి వీచే లేక రాబోయే నాలుగు సామ్రాజ్యాలను లేపేందుకు దేవుడు పంపిన లోకశక్తులు, లేక నాలుగు సామ్రాజ్యాలు చేసే భయంకరమైన యుద్ధాలు కూడా సూచించవచ్చు.

ఇక మహా సముద్రం అంటే బైబిల్ లో సాధారణంగా మధ్యధరా సముద్రం! అయితే ఈ సముద్రం ఉపమాన రీతిగా ప్రపంచ దేశాలను జనాలను కూడా సూచిస్తున్నాయి.

దానియేలు 7: 17

ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.

 

    కాబట్టి సముద్రం నుండి నాలుగు జీవులు వచ్చాయి కాబట్టి ప్రపంచం నలుమూలలనుండి నాలుగు భయంకరమైన సామ్రాజ్యాలు పుడతాయి అని అర్ధం వస్తుంది.

యెషయా 17:12—13 ;  కాబట్టి దీని ప్రకారం కూడా జనాల నుండి వస్తాయి నాలుగు రాజ్యాలు.

12. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును. జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

13. జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. 

 

  7 వరకు నాలుగు మృగాలు నాలుగు సామ్రాజ్యాలు అని చెప్పడంజరిగింది.

మొదటి మృగం: సింహం లాంటిది. దానికి పక్షిరాజు వంటి రెక్కలున్నాయి. ఇది బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది.

2వ అధ్యాయంలో గల ప్రతిమ తల. క్రీ.పూ. 605 నుండి క్రీ.పూ. 539 వరకు సాగింది. ప్రవక్తలు నెబుకద్నెజర్ ను సింహం తోనూ పక్షిరాజుతోను పోలుస్తారు. ఈ పక్షిరాజు కోసం:

 యిర్మియా 4:7.

పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది; జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి యున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును.

యిర్మియా 48: 40

యెహోవా సెలవిచ్చునదేమనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది.

49:22..;  50:17; యిర్మియా 50: 17

ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱెలు, సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.

 

 Ezekiel(యెహెజ్కేలు) 17:3,12,14

3. నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.

12. తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసికొనిపోయెను.

14. అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమ వంతులను తీసికొనిపోయెను. ;

 

కాబట్టి పై అన్ని రిఫరెన్సులు ప్రకారం పక్షిరాజు బబులోను నెబుకద్నెజరు.

 

  ఇక రెండవ మృగం: ఎలుగుబంటి:  ఇది మాదీయ- పారశీక రాజ్యాల అలయన్స్ పాలించిన సామ్రాజ్యం! క్రీ.పూ 539 లో మొదలై ౩౩౩లో అలంగ్జాండర్ ద్వారా అంతమయింది. ఇక దానినోటిలో ఉన్న మూడు ప్రక్కటెముకలు మాదీయ- పారశీక రాజ్యం బబులోను నుండి స్వాధీనం చేసుకున్న మూడు  రాజ్యాలు/ అనగా లూదియ, ఈజిప్ట్, బబులోను.

 

  ఇక మూడవ మృగం: చిరుతపులి. ఇది అలగ్జాండరు ద్వారా స్తాపించబడిన గ్రీకు సామ్రాజ్యం! చిరుతపులి వేగవంతమైన జంతువు. అసలే వేగవంతమైనది దానికి తోడు నాలుగు రెక్కలు కూడా ఉన్నాయి. రెక్కలు- అక్షరార్ధంగా వేగానికి గుర్తు! కాబట్టి ఇది అలంగ్జాండర్ అతి తక్కువ సమయంలో సాధించిన ఘనమైన విజయాలు, స్వాధీన పరుచుకున్న దేశాలు సూచిస్తుంది. ఇక మృగానికి నాలుగు తలలున్నాయి. వాటికి ఆధిపత్యము కూడా ఇవ్వబడింది. తలలు- అలగ్జాండర్ యొక్క నలుగురు జనరల్ లను/ సైన్యాదికారులను సూచిస్తుంది. వీరికి ఆధిపత్యం కూడా లభించింది చరిత్ర ప్రకారం. జనరల్ లు ఎవరంటే:

 కేసేందర్ గ్రీకు ప్రాంతము పాలించాడు;

 లైసిమాకుస్- ఆసియా మైనర్ ను పాలించాడు;

ప్టోలెమీఈజిప్ట్ ను పాలించాడు;

 సెల్యూకస్-సిరియా, బాబిలోనియా ను పాలించాడు. ఈ సామ్రాజ్యం క్రీ.పూ 6౩ లో అంతమయింది.

   

(ఇంకాఉంది)

 

*దానియేలు-16-The Man of God*

*16 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-2*

 

దానియేలు 7:27  ..

 

        (గతభాగం తరువాయి)

 

        ఇక భయంకరమైన పదికొమ్ములు, ఇనుపపళ్ళు /దంతములు కలిగిన మృగము- ఇది 2 అధ్యాయంలో గల ఇనుము, మట్టి రాజ్యం! అలాగే ప్రకటన 17లో వివరించబడిన మృగం/స్త్రీ, రోమా సామ్రాజ్యం!

దానియేలు 2: 40

పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును.

 ఈ సామ్రాజ్ర్యం తనకున్న ఇనుప దంతములతో అన్ని రాజ్యాలను విరిగగొట్టింది.

 

ఇక దీనికి పదికొమ్ములున్నాయి. దానియేలు 7:24 ప్రకారం పదికొమ్ములు పదిమంది రాజులను సూచిస్తాయి. ప్రియులారా పది కొమ్ముల కోసం రెండు విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. రెండు కూడా మీముందు పెడతాను.

 

మొదటిది: పది కొమ్ములు- రోమా సామ్రాజ్యంలో జరిగిన సంఘటనలు. రోమా సామ్రాజ్యం క్రీ.పూ. 6౩లో ప్రారంభమై 476 లో అంతమయింది అంటారు. అయితే వెస్ట్ అనగా పశ్చిమ రాజ్యం క్రీ.. 1453 వరకు ఉంది. అయితే రోమా సామ్రాజ్యం జూలియస్ సీజర్ ద్వారా స్తాపించబడి ఇనుములాంటి పటిష్టమైన రాజ్యముగా ఉండేది. జూలియస్ సీజర్ రాజవంశం తర్వాత డియోక్లేటన్  రాజవంశం 13 వరకు పాలించింది. తర్వాత రోమా సామ్రాజ్యం తూర్పు పడమరలుగా విడిపోయింది. ఇక ఇనుము పోయి మట్టిలాంటి రాజ్యాలు వచ్చాయి. 1453 లో అంతమయ్యాయి.

 

ఇక పది రాజులు: లేక పదికొమ్ములు:

1. జూలియస్ సీజర్ BC 27-- AD 68

2. నలుగురు చక్రవర్తులు గల్బా, ఓతో, విటిరస్, వేస్పియన్ 68-69

. ఫ్లవియన్ రాజవంశం- 69--96

4. నెర్వా-అంతోనిన్ రాజవంశం-96--12

5. 5గురు రాజుల పాలన- 192-19

6. సేవరన్ రాజవంశం- 19—235

7. డియోక్లేషియన్ రాజవంశం- 284--౩౦5

8. కాన్స్తాన్టియన్ రాజవంశం-౩౦5--363

9. వేలంటేనియాన్ రాజవంశం- 364--378

10. థియోడోసియన్ రాజవంశం- 378--476

 

ఇక ప్రవచనం ప్రకారం మూడు కొమ్ములు తీసివేయబడ్డాయి. అవి 8. కాన్స్తాన్టియన్ రాజవంశం-౩౦5-363; 9. వేలంటేనియాన్ రాజవంశం- 364-378; 10. థియోడోసియన్ రాజవంశం- 378-476 ఈ మూడు వేళ్ళతోపాటు పెళ్ళగించబడ్డాయి.

 

     కాలంలో సంఘము పరిశుద్ధులు చాలాచాలా హింసలు పడ్డారు. ఎప్పటినుండి అంటే- యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయాక- ఆరోహణ మయ్యాక- యేరూషలేములో శ్రమలు మొదలయ్యాయి. అపోస్తలుడైన పౌలుగారి ద్వారా అన్యులమధ్య విస్తారంగా సేవ జరిగింది. ఎఫెసు, అంతియోకయ, కొరింథీ, కొలస్సీ, సిరియా, కిలికియ, ఇలా ఎన్నెన్నో చోట్ల సువార్త జరుగుతున్నప్పుడు యూదులద్వారా, రోమనుల ద్వారా , నీరో ద్వారా శ్రమలు కలిగి మొత్తం అన్ని దేశాలకు చెదిరిపోయారు. 70 లో దేవాలయం నాశనం అయ్యింది నీరో ద్వారా. చెదిరిపోయిన వారు ఎక్కడకు వెళ్ళినా క్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు బిడ్డలుగా మార్చినట్లు చూడగలం. అప్పుడు మొదలైన శ్రమలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే 476 లో శ్రమలు చాలా వరకు ఆగాయి, మరలా మొదలయ్యాయి- ఇక రోమన్ కేథలిక్ సంఘాల నుండి. దీనికోసం తర్వాత మాట్లాడుకోవచ్చు!

 

        ఇక రెండవ అభిప్రాయం ఏమిటంటే: పదిమంది రాజులు పదికొమ్ములు కధ ఏమిటంటే 2:44 ప్రకారం రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్తాపిస్తారు. అది జరిగింది. రాజ్యం అన్ని రాజ్యాలను పొడిచేస్తుంది. దానికి అంతం లేదు. అయితే రాజ్యం బౌతిక రాజ్యం కాదు. అది దేవుడు మానవుల హృదయాలలో స్తాపించిన దేవుని రాజ్యం. ఎందుకంటే రాజ్యం- రోమా రాజుల కాలంలో మిగతా రాజ్యాలను పొడిచేసి అంతం చేయలేదు. క్రీస్తుయేసు లోకానికి వచ్చి సువార్త స్తాపించిన వెంటనే రోమా సామ్రాజ్యం అంతమవ్వలేదు. అలాగే ప్రపంచమంతా దేవుని రాజ్యం వ్యాపించనూ లేదు.

 

    అయితే యోహానుగారికాలంలో పదిమంది రాజులు ఉనికిలో లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా అంత్యకాలంలో జరుగబోయే దానిని సూచిస్తుంది అంటారు. మాట అనడానికి మరోకారణం 7:9 లో సింహాసనాలు కనబడతాయి.

దానియేలు 7: 9

ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను......

 కాబట్టి ఇది ఖచ్చితంగా రాబోయే తీర్పుదినం కోసమే చెప్పబడుతుంది.

ఇక 11వ వచనం ప్రకారం ఆ కొమ్ము పలుకు గర్వపుమాటల వలన ఆ జంతువును చంపినట్లు చూస్తున్నాం. అనగా దీనిని ప్రకటన 17వ అధ్యాయంతో పోల్చుకుంటే గర్వపుమాటలు, దేవదూషణ మాటలు పలికెడి మృగము, ఆ మృగము మీదనున్న స్త్రీ- అనగా ఆ రాజులు- మతసంస్థ. ఇది ప్రకటన గ్రంధములో వివరించ బడిన యుద్ధములను సూచిస్తుంది. అనగా హార్మెగిద్దోను, మరియు గోగుమాగోగు యుద్ధములను సూచిస్తుంది. కాబట్టి ఇవి ఖచ్చింతంగా ఈ యుగాంతమందు జరుగబోయేవి అని రెండవ అభిప్రాయము.

 

   ఏదిఏమైనా ఈ రెండు అభిప్రాయాలు- ఒకటే సామ్రాజ్యమును సూచిస్తున్నాయి. అది రోమా సామ్రాజ్యం- ఆ సామ్రాజ్యం చేతిలో ఉన్న మతసంస్థకు సంభంధం ఉంది.

 

(ఇంకాఉంది)

*దానియేలు-17-The Man of God*

*17 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-*

దానియేలు 7:27  ..

          (గతభాగం తరువాయి)

 

 అయితే దీనికి మనం ప్రకటన 13 ,17 అధ్యాయాలతో చూసుకుని దానితో సరిచూసుకోవాలి. అక్కడ కూడా పదికొమ్ములు కనిపిస్తాయి. అయితే ఒకటి నిజం-  జలాలమీద కూర్చొన్న మహావేశ్య ఒక మతసంస్థను సూచిస్తుంది. దేవునికి దూరమై ఇతర దేవుల్లవైపు, దేవుణ్ణి కాక తమనే పూజించాలి అనేవారిని ఇది సూచిస్తుంది. యెషయా 1:21

అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

 

 యిర్మియా 2:20; యేహెజ్కేలు 16:154;

అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి.

 

అలాగే నీనేవే కోసం, తూరు పట్టణం కోసం కూడా అనగా నగరాలను దేవునినుండి దూరమైన, విగ్రహారాధనతోఉన్న నగరాలను కూడా వేశ్యతో పోల్చారు. కాబట్టి నగరం ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద మత సంస్థకు, దానికి అనుగుణంగా ఉన్న వర్తక వ్యవస్థకూ గుర్తుగా ఉంది. కాబట్టి మృగానికి రోమ్ నగరానికి, రోమ్ నగరంలో పాతుకుపోయిన మతసంస్తకు సంభంధం ఉంది అని స్పష్టముగా తెలుస్తుంది.

ఇక 17: ప్రకారం మృగం మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. ప్రకటన 17 అధ్యాయంలో మృగము, 7 అధ్యాయంలో పది కొమ్ముల గల మృగాన్ని సూచిస్తుంది. మృగము రాజుకు, రాజ్యానికి సూచనగా ఉంది. పదికొమ్ములు పదిమంది రాజులను, రాజ్యాలను సూచిస్తుంది. (ప్రకటన 13).

ఇక 17:3 లో ఇక్కడ  మృగం మీద ఒక స్త్రీ ఉంది. కాబట్టి రాజ్యానికి స్త్రీ ఆధారంగా ఉంది. అయితే తరువాత స్త్రీని అదుపులో పెట్టుకోలేక స్త్రీ వల్ల మృగమే, పట్టణమే నాశనమైపోయింది.

 

ఇక 17:9 ప్రకారం- ఇందులో జ్ఞానమున్నది. ఏడు తలలు స్త్రీ కూర్చుని ఉన్న ఏడుకొండలు. మనకు తెలుసు రోమ్ పట్టణం ఏడుకొండలపై కట్టబడింది. 17:18 ప్రకారం నీవు చూస్తున్న స్త్రీ భూరాజులను పరిపాలిస్తున్న మహా నగరమే! పరిపాలిస్తున్న అనగా అప్పటికే అనగా యోహాను గారి కాలంలో పరిపాలిస్తున్న రోమా నగరమే! తర్వాత మనకు తెలుసు రాజులను తన వశం చేసుకుని మత సంస్థ ఎన్ని ఘోరాలు చేసిందో! ఇక మత సంస్థ రోమన్ ఆచారాలు, వారి విగ్రహపూజలకు చెందిన అనేకమైన పూజలు క్రైస్తవ మతాచారాలుగా మార్చింది. ఉదాహరణ సిలువ. అది తమ్మూజు దేవత, అనగా సూర్య దేవుడు, సూర్యారాధన నుండి వచ్చింది సిలువ. ఇలాగ అనేకమైన పండుగలు, ఆచారాలు వచ్చాయి. ఉదాహరణ: క్రిస్మస్! 

 

    చివరికి నీవు  భూమిమీద పోలికగాను విగ్రహాలు చేసుకోగూడదు అంటే, బాలయేసు, మరియమ్మ, ఇంకా అనేకుల దైవసేవకులకు సెయింట్ అనే పేరుపెట్టి వారి విగ్రహాలు చేసి, విగ్రహారాధన తీసుకుని వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. దేవుణ్ణి పూజించకుండా దేవుని స్థానం లో మనిషిని పూజించడం మొదలయ్యింది.

 

       కాబట్టి మృగమునకున్న దేవదూషణ కోసం ఒకసారి ఆలోచిస్తే నీదేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలి అని బైబిల్ చెబితే మొదటగా వాళ్ళ నాయకున్నే ముద్దుపెట్టుకోవాలి. ఒంగి నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే కొంతమంది పోప్ లు మొదటగా కైసర్ ని మొక్కమన్నారు. ఇక మృగం మొదటగా దేవదూషణ చేసింది, తర్వాత దేవుని బిడ్డలను హింసలు పెట్టి హతమార్చింది, దేవుని న్యాయవిధులకు బదులుగా తమ నిభందనలు చేసింది. అలాగే మత సంస్థ పాపములు క్షమించే అధికారం దేవునికి ఉంటే- అధికారం వారి ప్రీస్టులకు కట్టబెట్టింది. తర్వాత పాప క్షమాపణ పత్రాలు ప్రవేశపెట్టింది. వారి పెద్దలను Vicar of Christ గా చెప్పుకున్నారు. అంటే క్రీస్తు యొక్క స్థానం వారికి వచ్చింది భూమిమీద. ఇది పరిశుద్దాత్ముని దూషించినట్లే! యేసుకీస్తు ప్రభులవారు భూలోకాన్ని వదిలి వెల్లెముందు ఆత్మను అనగా ఆదరణ కర్తను పంపిస్తాను అని చెబితే స్థానాన్ని వీరు లాక్కున్నారు. అపొస్తలుల కార్యములు ప్రకారం సంఘానికి మీరు అధ్యక్షులు, యెహేజ్కేలు ప్రకారం కాపలా వాళ్లు, పేతురు పత్రిక ప్రకారం విచారణ కర్తలు అని బైబిల్ చెబితే వీరు దేవునికి ప్రతిగా ఉన్నామని ప్రకటించుకున్నారు.

 గ్రీకు భాషలో ante అంటే take the place of అని అర్ధం. అనగా వికార్ లు క్రీస్తు స్థానాన్ని లాక్కున్నారు అంటే వీరే anti-christ లు అవుతారు ఒకరకంగా. క్రీస్తుకు విరోధి ఎవడైనా Anti-Christ అవుతాడు. అంత్యక్రీస్తు కాదు.  కేథలిక ఎన్సైకోప్లీడియా ప్రకారం vol.6. P.48 : పోప్ మామూలు వ్యక్తి కాదు, భూమిమీద దేవునికి ప్రతిగా ఉన్నాడు. ప్రతినిధి కాదు ప్రతిగా ఉన్నాడు.  మరొకాయన అనగా పోప్ లియో 13 : పోప్ మామూలోడు కాదు, భూమిమీద నున్న దేవుడు అన్నాడు .ఇంకా అన్నాడు- పోప్ యేసుక్రీస్తు ప్రతినిధి మాత్రమే కాదు క్రీస్తే పోప్ రూపంలో భూమిమీద ఉన్నాడు... అన్నాడు. మరి ఇది దేవదూషణ కాదా?

 

2. సంఘాన్ని హింసించడం: మనం చరిత్ర చూసుకుంటే ఆదినుండి రోమా రాజులు కొన్ని లక్షలమంది యూదులను చంపారు.  రోమా రాజులు గాని, తర్వాత రాజులను వశం చేసుకున్న మతసంస్థ గాని ఇంతవరకు కొన్ని లక్షలమంది క్రైస్తవులని  చంపారు అనగా  నిజమైన క్రైస్తవులను చంపారు. వారిని అంగీకరించని వారిని నిర్దాక్షిణ్యంగా చంపారు. ఇక పవిత్ర యుద్దాలు (క్రూసేడ్లు) పేరుతొ ఎంతోమందిని చంపారు. యుద్దాలు కిట్టని వారు ముస్లిం లుగా మారిపోయారు. ఇక ముస్లింలు కూడా దేవుని బిడ్డలను లక్షలమందిని చంపారు, చంపుతున్నారు.  ఇక సంఘాన్నే కాదు, అనేకమందిని హింసలు చేశారు. కాబట్టి మృగము- రోమా సామ్రాజ్యం- తర్వాత రోమా రాజులను వశం చేసుకున్న మత సంస్థ.

 

(ఇంకాఉంది)

*దానియేలు-18-The Man of God*

*18 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-4*

                                                                          (గతభాగం తరువాయి)

 

         ఇక మనం మరలా 9 వచనం చూసుకుంటే 914 తీర్పు సమయాన్ని సూచించే సన్నివేశం!

 

9. ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను.

10. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.

11. అప్పుడు నేను చూచుచుండగా, కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.

12. మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను; సమయము వచ్చువరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను.

13. రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి, మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.

14. సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.

 

దానియేలు 2:34, 44, 45;

34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను.

44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

45.​ చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహాదేవుడు ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. 

 

ఇక సింహాసనాలు ప్రకటన 4:4 లో కూడా కనిపిస్తాయి. కాబట్టి వీటికి వాటికి సంభంధం ఉంది.....

సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.

 

  ఇక మహావృద్ధుడు అనగా దీర్ఘకాలం పాలించేవాడు, జీవించేవాడు- అనగా తండ్రియైన దేవుడు.

 

      *ఇక్కడ ఒక విషయం గమనించాలి. 9-14 వచనాలు మొదటగా ప్రకటన 20 అధ్యాయంలో గల ధవళ సింహాసనం తీర్పును సూచిస్తుంది. ఇక 13,14 వచనాల సారాంశం లో కొంత ప్రకటన 4,5 అధ్యాయాలలో ఇక్కడ చెప్పిన  మనుష్య కుమారుడు అక్కడ దావీదు చిగురు, వధింపబడిన గొర్రె పిల్ల, యూదా గోత్రపు సింహమును సూచిస్తున్నాయి. ప్రకటన 4 సన్నివేశం పైన ఉదాహహరించిన 9-14 వచనాల తో సరిపోతుంది*

 

    ఇక చక్రాలు కనబడుతున్నాయి. దీనికోసం మనకు యేహెజ్కేలు గ్రంధంలో దేవుని  ప్రభావ స్వరూప దర్శనంలో దీనికోసం వివరంగా వ్రాయబడింది. 1:1521;

15. జీవులను నేను చూచుచుండగా నేల మీద నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను.

16. చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను.

17. అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను.

18. వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను.

19. జీవులు కదలగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్ర ములుకూడ లేచెను.

20. ఆత్మ యెక్కడికి పోవునో అక్క డికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.

21. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను. 

 

గమనించాలి- అక్కడ కూడా మనకు సింహాసనం కనిపిస్తుంది.

యేహెజ్కేలు 1:26—27;

26. వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.

27. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను.

28. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. *ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము*. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.

 

   ఇక అక్కడ అగ్నిజ్వాలలు కనిపిస్తున్నాయి. దీనికోసం బైబిల్ లో చాలాచోట్ల కనిపిస్తుంది మనకు. *అగ్ని దేవుని ప్రభావానికి, ఆయన ఉగ్రత, తీర్పును సూచిస్తుంది*. యేహెజ్కేలు గ్రంధంలో కూడా మనకు ఆయనకు ముందుగా అగ్నిజ్వాలలు కనిపిస్తున్నాయి. ఇక కీర్తన 50:..

మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టు ప్రచండ వాయువు విసరుచున్నది.

యెషయా 29:6..

ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

 

 యెషయా ౩౦:2728;

27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

30. యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. 

 

Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:6,7

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు.....

కాబట్టి అగ్ని జ్వాలలు దేవుని ప్రభావానికి ఆయన తీర్పును సూచిస్తున్నాయి.

(ఇంకాఉంది)

 

       

 

 

 

 

 

 

 

 

*దానియేలు-19-The Man of God*

*19 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-5*

           (గతభాగం తరువాయి)

  

ఇకతర్వాత జరిగే సంఘటనలు ప్రకటన 20: 11—15 వరకు జరిగేసంఘటనలు ఇవి. అనగా ధవళ సింహాసనం తీర్పు సన్నివేశమన్నమాట!

 

అక్కడ వేలాదిమంది కనబడుతున్నారు. అంటే ప్రకటన 5:11..

మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.

 యూదా 1:14,15;

14. ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,

15. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

 

ఇక న్యాయసభ:

ప్రకటన 20:11—15;

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

15. ఎవని పేరైనను (మూలభాషలో- ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

 

ఇక గ్రంధాలు కోసం-

*బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన గ్రంధాలు కనిపిస్తాయి.

1) *జీవ గ్రంథము అనగా రక్షించబడి సాక్ష్యాన్ని కాపాడుకొన్నవారి పేర్లు గలది.*

2). *గొర్రె పిల్ల జీవ గ్రంథము: కొంత మంది అభిప్రాయం జీవగ్రంధం, గొర్రె పిల్ల జీవగ్రంధం వేరు అంటారు. ఇది మనకు ప్రకటన 13:8లో కనిపిస్తుంది. దీనిలో కేవలం నూతన నిభందన సంఘములో సభ్యులుగా ఉండి, ఆత్మానుసారమైన సాక్షార్ధమైన జీవితం జీవించి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన, అర్హతపొందిన వారి పేర్లు గల గ్రంథము అంటారు*. 

3) *ఇంకా ప్రకటన 20:12లో వ్రాయబడిన వేరొక గ్రంధము. దీనికోసం బైబిల్ లో ఏమీ వ్రాయబడలేదు గాని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయం ఏమిటంటే రక్షణ పొందిన వారి పేర్లు ఎలా జీవ గ్రంథంలో రాయబడతాయో అలాగే రక్షణ పొందని వారిపేర్లు అనగా శిక్ష/నరకానికి పోయే వారిపేర్లు ఇక్కడ రాయబడతాయి, ఇంకా రక్షణ పొందిన తర్వాత సాక్ష్యం, రక్షణ పోగొట్టుకున్న వారిపేర్లు జీవ గ్రంథం నుండి తుడిచి పెట్టబడి ఈ వేరొక గ్రంధంలో రాయబడతాయి అంటారు*.  

4) *ఇక జ్ఞాపకార్ధ గ్రంథం లేదా సాక్షార్ధమైన గ్రంథం- దేవుని సేవకోసం కష్టబడిన వారు, తమ మాన ప్రాణ, ఆస్తులను అర్పించిన వారి కొరకు, దేవుణ్ణి స్తుతించిన వారి, దేవునికోసం చెప్పిన వారి సాక్షార్దంగా వ్రాయబడినది. మలాకి 3:16*;  

5) *ఇంకా దానియేలు 10వ అధ్యాయంలో ఉదాహరించబడిన సత్యగ్రంధము. ఇది జరగబోయే సంఘటనలు తెలిపే గ్రంథం అనగా దేవుడు ఏమి జరగాలో ఎప్పుడు ఎలా జరగాలో ముందుగానే నిర్ణయించి ఆయన సన్నిధిలో వ్రాయబడిన గ్రంథము. కారణం దానియేలు10:21 లో సత్యగ్రంధమందు వ్రాసినది నీకు చెబుతాను విను అని చెప్పి తర్వాత రెండు అధ్యాయాలలో జరగబోయే సంగతులు వివరించారు*.

 

*అయితే గ్రంధంలో మనపేర్లు రాయబడక పోయినా పర్వాలేదు గాని జీవ గ్రంథంలో పేరు లేకపోతే మన జీవితం వ్యర్ధమని, మన భక్తి వ్యర్ధమని గ్రహించగలరు*

 

 దానియేలు 12:1..

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

  కీర్తన 69:28;

జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.

 నిర్గమ 32:2;

మలాకి ౩:16

అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

 

   ఇక 11 వచనంలో గల చిన్నకొమ్మును హతం చేశారు  చిన్న కొమ్ము ప్రకటన 19:20 లో గల మృగము. ....

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

గమనించాలి ఈ రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ రెండు మృగాలు అనగా అంత్య క్రీస్తు లేదా క్రీస్తు విరోధి ఇంకా అబద్ద ప్రవక్త ఇద్దరూ ఒకేసారి ప్రాణములతో అగ్నిగుండములో త్రోయబడ్డారు.

 

ఇక 13 వచనంలో మనుష్యకుమారుని పోలినవ్యక్తి కనబడతారుఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుప్రభులవారు!

ప్రకటన 1:13....

తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

 

 మత్తయి 16:1315

13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్యకుమార డెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా

14. వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

15. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.

16.అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను.

17. అందుకు యేసుసీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.

 

 మత్తయి 24:27, ౩౦;

27. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

కాబట్టి మనుష్య కుమారుడు మన యేసు క్రీస్తు ప్రభులవారు.

 

 ఆయన మేఘాలమీద వచ్చినట్లు చూడవచ్చు! బైబిల్ గ్రంధంలో మేఘము అనేది- దేవుని సన్నిధిని సూచిస్తుంది. అంతేకాకుండా ఆయన వాహనముగా కూడా మనం చూడవచ్చు.

ద్వితీ ౩౩:26..

యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.

 కీర్తన 97:2..

మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.

కీర్తనలు 104:..

జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు

యెషయా 19:1

ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది

 మత్తయి 24:౩౦...

అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

మత్తయి 26:64...

ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా...

 ప్రకటన 1:7..

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

కాబట్టి వీటి ప్రకారం ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది యేసు క్రీస్తు ప్రభులవారి బహిరంగ రాకడను సూచిస్తుంది.

 

   ఇక 14 వచనంలో ఆయనకు పరిపాలన, అధికారం ఇవ్వబడ్డాయి, సర్వజనాలు అన్నిదేశాల వారు అన్ని భాషలవారు ఆయనకు సేవకులయ్యారు. ఆయన పరిపాలన శాశ్వత మైనది. అది ఎప్పటికీ గతించదు. ఇది యుగాంతములో తీర్పు తర్వాత, యేసుక్రీస్తుప్రభులవారి ప్రత్యక్ష పాలనను సూచిస్తుంది. అనగా మూడు మృగాలు నాశనం అయ్యాక నాలుగవ మృగము, అలాగే ప్రకటన 17లో చెప్పిన మృగంతో పాటు స్త్రీ నాశనం అయ్యాక, యుగాంతములో జరుగుతుంది. అనగా సంఘం ఎత్తబడ్డాక అనగా ఆయన రహస్య రాకడ జరిగాక, ఏడేండ్ల మహా శ్రమలకాలం గడిచాక జరుగుతుంది. అలాగే ప్రకటన 5 అధ్యాయంలో వివరించబడిన సంభవాలతో కూడా దీనికి సంభంధం ఉంది. అయితే ఇక్కడ గమనించాలి యేసుక్రీస్తుప్రభులవారు మరణించి తిరిగిలేచిన తర్వాత ఆయనకు భూలోకమందును పరలోకమందును అధికారం కలిగింది అది నిజమే. అందుకే మత్తయి 28:18 అంటున్నారు ...

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.

 

    అయితే అది మానవుల హృదయాలలో ఆయన రాజ్యస్థాపన జరిగింది. అయితే లోకానికి యేసుక్రీస్తుప్రభులవారు ఇంకా ప్రత్యక్షంగా రాజుగా రాలేదు. ప్రత్యక్షంగా వచ్చి రాజ్యస్తాపన చెయ్యలేదు. అయితే సమయం దగ్గరపడుతుంది. తన శత్రువులు తనకు పాదపీటంగా తయారయ్యే సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. అపో 2:35....

 దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. 

హెబ్రీ 10:13...

అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.

 

    మానవ రాజ్యాలకు తీర్పు తీర్చి, నాశనం జరిగే సమయం- అంతం వచ్చినప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా తన రాజ్యాన్ని స్తాపిస్తారు. ప్రకటన 19:1116....

11. మరియు పరలోకము తెరువబడి యుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13. రక్తములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో-చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

 

(ఇంకాఉంది)

*దానియేలు-20-The Man of God*

*20 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-6*

 

           (గతభాగం తరువాయి)

       ఇక 2325 వరకు కూడా రోమా సామ్రాజ్యం కోసం చెప్పబడింది. పదికొమ్ములు-పదిమంది రాజులు. ఇక్కడ వచనాలు ప్రకటన 13 అధ్యాయంలో కనబడే మొదటి మృగంతో పోల్చుకోవాలి.

(ఒక విషయం చెప్పనీయండి. మనకు ప్రకటన 13 అధ్యాయం లో రెండు మృగాలు కనిపిస్తాయి. మొదటి మృగము క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తుకు సాధృశ్యం అయితే రెండవ మృగం అబద్ద ప్రవక్త ను సూచిస్తుంది.)

 

*25 వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే వచనం ఇశ్రాయేలు జాతికోసమే వ్రాయబడినట్లు మనకు అర్ధమవుతుంది.*

 Daniel(దానియేలు) 7:25

25. రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశముననుంచబడుదురు.

 

మొదటగా వచనంలో రోమా సర్వోన్నతునికి వ్యతిరేఖంగా మాట్లాడటం అనగా రోమా రాజులు గాని, మత సంస్థ గాని దేవునికి వ్యతిరేఖంగా మాట్లాడటం, దేవుని స్థానంలో వారిని పెట్టుకోవడం సూచిస్తుంది.

 చివరకు అంత్యక్రీస్తు, అపవాది, మహా ఘటసర్పము మృగము కూడా అంత్యకాలములో ఇలాగే మాట్లాడుతారు  ప్రకటన 13:5—6 ...

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను(లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

 

         ఇక భక్తులను బాదిస్తాడు అనేది- యేసయ్య కూడా చెప్పారు- మహాశ్రమలు వస్తాయి అని- మత్తయి 24:1922 ...

19. అయ్యో, దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.

20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.

22. దినములు తక్కువ చేయబడక పోయిన యెడల శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము దినములు తక్కువ చేయబడును. 

 

     కాబట్టి మహాశ్రమలు కలుగుతాయి. అయితే ఒక్కమాట శరీరి తప్పించుకోడు అనేది ఒకటి, ఏర్పరచబడిన వారి నిమిత్తము దినములు తక్కువచేయబడును, ఇంకా దానియేలు 12:12 1335 రోజులు తాలుకునే వాడు ధన్యుడు, మాటలు చూసుకుంటే- మహా శ్రమల కాలంలో సంఘం ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. Mid-Tribulation వాదనకు ఆధారం ఇదే!

 

         అయితే ఇక్కడ తర్వాత మాట  *అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశముననుంచబడుదురు.*  *ఇది ఖచ్చితంగా అంత్యకాలంలో యూదులకు జరుగబోయే సంభవాలను సూచిస్తుంది.* కారణం ఇంతవరకు యూదులు యేసుక్రీస్తుప్రభులవారిని మెస్సీయగా అంగీకరించలేదు. వారు ఇంకా మెస్సీయ వస్తాడు అని ఎదురుచూస్తున్నారు. ఇలా ఎంతవరకు  ఎదురుచూస్తారు అంటే మొదటగా యేరూషలేములో మందిరం కట్టబడే వరకు, అంత్యకాలంలో రెండు మృగాలు అనగా ప్రకటన 13 అధ్యాయంలో కనబడే రెండు మృగాలు కనబడే వరకు. మొదట మృగం అంత్యక్రీస్తు- క్రీస్తు విరోధి అయితే రెండవ మృగం అబద్దప్రవక్తను సూచిస్తుంది. మొదట మృగానికి డంబముగా పలికే నోరు ఉంది. దానివలన అనేకులను మోసం చేస్తుంది. ఇక రెండవ మృగము అనగా అబద్ద ప్రవక్త మొదట మృగమే దేవుడు., గొప్పవాడు వాడిని పూజించమని అందరిని బలవంతం చేస్తాడు.. అందుకుగాను అనేకమైన అద్భుతాలు మహత్తులు చేస్తుంది. ఇలా యూదులు కూడా వాడి మాయలో పడిపోయి వాడే మెస్సీయ అని ఒప్పుకుంటారు. మొదటి మూడు సంవత్సరాలు వాడినే మెస్సీయగా అంగీకరించి మ్రోక్కుతారు. అదే సమయంలో ప్రకటన 11 అధ్యాయంలో చెప్పబడినట్లు దేవుని ఇద్దరు సాక్షులు వచ్చి, వీడు మెస్సీయ కాదు, నిజమైన మెస్సీయ యేసుక్రీస్తు ప్రభులవారు అని బోధిస్తారు. వారి బోధ విని 144000 మంది ఇశ్రాయేలువారు రక్షించబడతారు.  అయితే అప్పుడు వాడు నాశనకరమైన హేయవస్తువును ఎప్పుడైతే బలిపీటం మీద అర్పిస్తాడో వెంటనే వీడు మెస్సీయ కాదు మోసపరచబడ్డామని తెలుసుకుని ఇశ్రాయేలు వారు పారిపోతారు. ఇక వచనానికి ప్రకటన 12 అధ్యాయంతో పూర్తిగా సంభందముంది. 12 అధ్యాయంలో కనబడే సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే-సంఘం కానేకాదు. అది ఇశ్రాయేలు జాతి. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఇశ్రాయేలు 12 గోత్రాలు,  స్త్రీ నొప్పులు ఎందుకు పడుతుంది అంటే ఆమె ఏడేండ్ల కాలంలో పడే శ్రమలే బహుశా ఆమె నొప్పులు. నొప్పులు కనీ ఆమె ప్రసవించేది 144000 మంది రక్షించబడే ఇశ్రాయేలీయులు అని అనేకమంది బైబిల్ పండితుల అభిప్రాయము. ప్రకటన 7:4;

 

మీకా 5: 3

కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగి వత్తురు.

 ఇంకా యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఇశ్రాయేలు జాతినుండే పుట్టారు. ఇంకా సమస్త జనములను ఏలనైయున్న మగ శిశువు  యేసుక్రీస్తు ప్రభులవారే, అయితే కొంతమంది ఆయనను అంగీకరించిన రక్షించబడి, ఎత్తబడిన సంఘం అంటారు. అయితే సంఘాన్ని కన్యకగా పోల్చారు.

కాబట్టి ఎప్పుడైతే వీరు అనగా ఇశ్రాయేలువారు నిజం తెలుసుకుంటారో ప్రకటన 12:6 లో చెప్పబడిన స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అని చెప్పబడినట్లు ఇశ్రాయేలు వారు పారిపోతారు. అక్కడ వారు 1260 రోజులు అనగా మూడున్నర సంవత్సారాలు దాచబడి పోషింపబడతారు. అనగా మహాశ్రమల కాలంలో!  కాబట్టి వారు కాలము కాలములు అర్థకాలము అతని వశముననుంచబడుదురు అనగా ఇదే. వారు అనగా ఇశ్రాయేలువారు మోసగించబడి అంత్య క్రీస్తు వశంలో ఉండడాన్ని సూచిస్తుంది.

(ఇంకాఉంది)

*దానియేలు-21-The Man of God*

*21 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-7*

 

           (గతభాగం తరువాయి)

అయితే మనం మహా శ్రమల కోసం మాట్లాడుకొంటున్నాము కదా, ప్రకటన గ్రంధం ప్రకారం శ్రమలు కలుగుతాయి. అయితే పరిశుద్దులు ఎంతవరకు ఉండవచ్చు అనగా అవి ఎంతవరకు అంటే  కాలము కాలములు అర్ధకాలము- అనగా దానియేలు 4:16 ప్రకారం కాలము అనగా సంవత్సరం- కాలములు అనగా రెండు సంవత్సరములు, అర్ధకాలం- ఆరునెలలు. ప్రకటన 11:2— లో కూడా వ్రాయబడింది- ఈసమయంలో దేవాలయం సాతానుగాడి సేనల ద్వారా అపవిత్ర పరచబడుతుంది.  *అయితే 12 అధ్యాయం ఇశ్రాయేలు జాతికోసం వ్రాయబడింది*. గాని బహుశా శ్రమలు పరిశుద్దులకు మూడున్నర సంవత్సరములు ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. చాలామంది కాలంలోనే సంఘం ఎత్తబడుతుంది అంటారు. దీనినే Mid-Tribulation అంటారు. అయితే పరిశుద్దులు కేవలం ఇశ్రాయేలు జనులలో రక్షించబడిన వారు అనికొందరు, కాదు మొత్తం పరిశుద్దులు అనే వాదన కూడా కనిపిస్తుంది.

 

అయితే సందర్బంగా అసలు Pre-Tribulation, Mid-Tribulation, Post-Tribulation అంటే ఏమిటో చూసుకుందాం. చాలామంది చాలా అభిప్రాయాలు కలిగిఉన్నారు. వారి అభిప్రాయాలు ఒకసారి చూసుకుందాము!

 

*Pre-Tribulation- అనగా శ్రమలకు ముందుగానే సంఘం ఎత్తబడుతుంది*. దీనిని నమ్మేవారు చాలా ఎక్కువ! దీనికి వారు చూపించే రిఫరెన్సులు:

లూకా 21:34—36 ...

34. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

35. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.

36. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు (కొన్ని ప్రాచీన ప్రతులలో-పాత్రులనియెంచబడునట్లు అని పాఠాంతరము) ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.... ,

ముఖ్యంగా 36 వ వచనంలో వ్రాయబడిన కాబటి మీరు జరుగబోయే వాటిని తప్పించుకుని మనుష్యకుమారుని ఎదుట..... అనగా వీరి ఉద్దేశ్యం- సంఘం శ్రమలలో ఉండదు. వాక్యానుసారమైన, సాక్షార్ధమైన జీవితం, ఆత్మానుసారంగా నడుచుకుంటే శ్రమలను తప్పించుకుని- శ్రమలకు ముందుగానే ఎగిరిపోతాము అనేది వీరి ఉద్దేశ్యం!

 

తర్వాత రిఫరెన్సు: బుద్దిలేని కన్యకల ఉపమానం. మత్తయి 25; దీనిలో బుద్దిలేని కన్యకలు విడువబడ్డారు గాని బుద్దిగల కన్యకలు పెండ్లివిందుకు పెండ్లికుమారుడైన క్రీస్తుతో వెళ్ళిపోయారు.

 

తర్వాత రిఫరెన్సు: నోవాహు దినములలో జరిగినట్లు జరుగును అనగానోవాహుగారు అతని కుటుంబం తప్పించబడింది, కాబట్టి పరిశుద్ధులు శ్రమలలో తప్పించబడతారు. ఆదికాండం 6--8;

తర్వాత రిఫరెన్సు: 1థెస్సలొనికయులకు 1: 10

దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో సంగతి వారే తెలియజేయుచున్నారు.

 ఇక్కడ రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న- అనగా రాబోవు మహాశ్రమల నుండి మనలను తప్పించును అంటారు.

 

*ఇంకా ప్రకటన 4:1 లో ఇక్కడకు రమ్ము అనే మాట, పరలోకమందు తలుపు తెరువబడెను అనేమాటలు ప్రకారం అప్పుడు సంఘం ఎత్తబడుట సూచిస్తుంది అంటారు*.

 

చివరి రిఫరెన్సు: యెషయా 26:21 ..... నీవు వెళ్లి నీ అంతఃపురములో ప్రవేశించు, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము అన్నారు కాబట్టి శ్రమలలో సంఘం దాచబడుతుంది అంటారు.

వీటన్నిటిని బట్టి సంఘము శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుంది అంటారు.

 

*Mid-Tribulation అనగా శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది*. దీనిని కూడా చాలా మంది నమ్ముతారు. *అయితే శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుంది అనేదానినే అనేకులు నమ్ముతారు*. ఇక Mid-Tribulation యొక్క రిఫరెన్సులు ఏమిటంటే:

   దానియేలు 12 అధ్యాయం ప్రకారం మూడున్నర సంవత్సారాలు సంఘం, యూదులు మహాశ్రమలను అనుభవిస్తారు. కారణం మనం కూడా యూదులతో పాటు సమానపౌరులము, సహా వారసులం. వారు శ్రమలు అనుభవిస్తే మనం కూడా అనుభవించాలి. ఇక  శరీరియు తప్పించుకోలేడని యేసయ్య చెప్పారు. మత్తయి 24:22; ఇంకా ఇందులో పరిశుద్దుల ఓర్పు కనబడును అనియు, ప్రకటన 13:10; 14:12; ఏర్పరచబడిన వారికొరకు దినములు తక్కువ చేయబడును అనేమాటలు! మత్తయి 24:22; ఇంకా దానియేలు 12:12 లో వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు కనిపెట్టుకొనువాడు ధన్యుడు అనివ్రాయబడింది. అనగా మూడున్నర సంవత్సారాలు కంటే ఎక్కువ! కాబట్టి సంఘము/ పరిశుద్ధులు మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలలో ఉంటారు.

ఇది శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేవారి వాదన!

 

*Post-Tribulation-అనగా శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది*. దీనికి చూపించే రిఫరెన్సు: మత్తయి 24:291 .....

29. దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.

31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క చివరనుండి చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

అయితే వచనాలలో 29లో మహాశ్రమల కోసం యేసయ్య చెప్పారు. ౩౦ లో రాకడను గూర్చి చెప్పారు. *అయితే అనేకులు నమ్మేది ఏమిటంటే వచనం యేసుక్రీస్తుప్రభులవారు ఆయన బహిరంగ రాకడ కోసం చెప్పారు. ఆయన రహస్యరాకడకే సంఘం ఎత్తబడుతుంది.*

 

*అయితే ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనగా రహస్య రాకడ జరుగుతుంది* అనగా:

 1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 4:15,16,17

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను,* ప్రధానదూత శబ్దముతోను*, *దేవుని బూరతోను* పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద(మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

దీనిని వ్యతిరేకంగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. భూర ఎప్పుడు మ్రోగునో మన పోక ఎప్పుడో తెలియదు.

 

         *అయితే గమనించాలి: అయితే ఇలాంటి సందేహాత్మక విషయాల కోసం- ముఖ్యంగా దేవుని మర్మాల కోసం ఇదే జరుగుతుంది అని బల్లగుద్ది చెప్పడం తగదు, అవివేకం అవుతుంది జాగ్రత్త! అది దేవుని ఇష్టం- దానిని అర్ధం చేసుకోవడం కష్టం. కావున ఆయన పరమకుమ్మరి. ఆయన ఇష్టం వచ్చినట్లు కార్యాలు చేస్తారు. కాబట్టి ఇలాగే జరుగుతుంది అని చెప్పడం తప్పు!*

 

      అయితే మీరు అడగవచ్చు నీవు దేనిని నమ్ముతావు అని. దానికి నా జవాబు నేను దేనిని నమ్ముతాను అనేదికాదు గాని మనం సిద్దపాటు కలిగి ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా? అర్హత, సిద్దపాటు మనలో ఉందా లేదా అనేది ముఖ్యము అని తెలుసుకోమని మనవి చేస్తున్నాను.

*అయితే ఒక్క విషయం చెప్పనీయండి. మనం సిద్ధపడి ఉందాం. ఉండాలి. మనం సిద్దంగా ఉంటే Pre-tribulation అయినా(శ్రమలకి ముందుగా),  Mid-tribulation (శ్రమలకు మద్యలో) గాని, Post-Tribulation (శ్రమల తర్వాత) అయినా ఎప్పుడైనా ఆయన రాకడ రానీయండి. సిద్ధంగా ఉంటే ఇప్పుడే రానీయండి, రాత్రికి రానీయండి, రేపు రానీయండి, ఎప్పుడైనా రానీయండి. ధైర్యంగా ఉందాం. ఎత్తబడతాం.*

 

      ప్రియమైన స్నేహితులారా! సహోదరి సహోదరులారా! నేడే ప్రభువు వస్తే నీవు ఎత్తబడగలవా? సిద్దపాటు నీకుందా?

సిద్దం లేకపోతే- సిద్దపాటులేని బుద్ధిలేని కన్యకలు విడిచిపెట్టబడినట్లు మనం కూడా విడిచిపెట్టబడతాము.

కాబట్టి సిద్దముగా ఉండి సిద్దెలలో నూనె అనగా పరిశుద్దాత్ముని కలిగి ఉందాం!

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

*దానియేలు-22-The Man of God*

*22 భాగం*

*దానియేలు దర్శనాలు- నాలుగు జంతువులు-8*

           (గతభాగం తరువాయి)

    ఇక 26వచనం మరల న్యాయసభ- అంత్యతీర్పు కోసం చెప్పబడింది.......;

దానియేలు 7: 26

అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.

 27వ వచనం...

ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.

  హల్లెలూయ!

అయితే ఈ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రపంచదేశాలు నాశనం అయిపోయాయి అని వ్రాయడం లేదు- అవి పరిశుద్దుల వశం చేయబడ్డాయి అంటున్నారు. వారు క్రీస్తుతో కూడా పరిపాలిస్తారు. అయితే అనేకమంది నమ్మేది ఏమిటంటే (నేనుకూడా) ప్రకటన 21:1 లో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసాను అంటున్నారు యోహాను గారు. క్రొత్తది అంటే పాతది గతించిపోవాలి నాశనం అయిపోవాలి కదా!. ఏది ఏమైనా క్రొత్త ఆకాశం రావడం ఖాయం! లేదా వెయ్యేండ్ల పాలనలో పాత భూమి అనగా నేటి భూమి అనేకమార్పులు పొంది , కాలుష్యం పెరిగిపోయి, దేవుని ఉగ్రతకు పాత్రమైపోయింది గనుక దేవుడు దానిని ఏదోరకంగా పునరుద్ధరించి రూపాంతరం చెందించవచ్చు. లేదా సొదొమ గొమొర్రాలను దేవుడు లయం చేసినట్లు ఈ భూమి ఆకాశాలు లయమైపోయి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కలుగుతుంది. దానికి సాదృష్యంగా పేతురుగారు రాస్తున్నారు

2 Peter(రెండవ పేతురు) 3:7,10,11,12

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు(త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.  ....

ఇలా జరిగిన తర్వాతనే  దానిపై నూతన యేరూషలేము దిగుతుంది ప్రకటన 21 ప్రకారం!

 

సరే, ఇక పరిశుద్దులే రాజ్యం చేస్తారు. :దానియేలు 7: 18

అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంత ములవరకు రాజ్యమేలుదురు.

 

 ప్రకటన 2:2627..

26.నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి(లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.

27.అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు; 

ప్రకటన 20:4

అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

 ..ప్రకటన 22:5....

రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

 

    ప్రియ దైవజనమా! మరి నీకు ఆరాజ్యము కావాలా? పరలోకం కావాలా? అయితే ఇప్పుడు నీ బ్రతుకు సరిచేసుకుని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ ఘటము, శీలము, సాక్ష్యము కాపాడుకుంటూ, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ప్రార్ధనాపూర్వకంగా ఉంటే, శ్రమలను సహిస్తూ ఉంటే తప్పకుండా నీవు రాజ్యాన్ని పొందుకుంటావు. శ్రమలకు భయపడితే, ఓడిపోతే, భక్తిని వదిలేస్తే, సాక్ష్యం పోగొట్టుకుంటే నరకమే!

ఏమి కావాలో నిర్ణయించుకో!

ప్రకటన 22:7,14,12..

7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

14. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు. ..

12.ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

దైవాశీస్సులు!

*దానియేలు-23-The Man of God*

*23 భాగం*

*దానియేలు దర్శనాలు- పొట్టేలు మేకపోతు-1*

దానియేలు 8:2—21

20. నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.

21. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ...  ..

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈ ఎనిమిదవ అధ్యాయములో బబులోను సామ్రాజ్యం కోసం ఏమీ వ్రాయబడలేదు. దానికి కారణం మొదటి వచనంలో ఉంది. ఈ దర్శనం రాజగు బెల్షస్సర్ మూడవ సంవత్సరం లో జరిగింది, 5వ అధ్యాయంలో వివరించిన గోడమీద వ్రాతకు ముందుగా. అనగా క్రీ.పూ. 539 లో- అనగా బబులోను సామ్రాజ్యం అంతమవ్వడానికి కొద్దిరోజులు-గడియలకు ముందుగా ఈ ప్రవచానాత్మకమైన దర్శనం కలిగింది. కాబట్టి ఇక బబులోను కోసం ఏమీ వ్రాయబడలేదు.

 

  ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మాదీయ-పారశీక అలయన్స్ రాజ్యం కోసం, గ్రీకు సామ్రాజ్యం కోసం- ఇంకా అంత్యకాలం కోసం వ్రాయబడింది తప్ప రోమా సామ్రాజ్యం కోసం కూడా అధ్యాయంలో వ్రాయబడలేదని నా ఉద్దేశం!

 

   రెండవ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే- దర్శనంలో- దానియేలు గారు ఏలాము అనే ప్రాంతమునకు చెందిన షూషను కోటలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ఒకసారి ఆగుదాం! చరిత్ర ఒకసారి చూసుకుంటే- షూషను అనేది ఇరాన్ పశ్చిమ భాగంలో ఉన్న పారశీక రాజ్యపు ముఖ్య రాజధాని. దీనిని కట్టించింది దర్యావేషు-1. ఎప్పుడు కట్టించాడు అంటే- బబులోను సామ్రాజ్యాన్ని హస్తగతము చేసుకున్నాక, కట్టించాడు. ఇక ఎస్తేరు గ్రంధంలో ఉన్న చరిత్ర మొత్తం నగరంలోనే జరిగింది. దానియేలు గారి సమయంలో ఇది ఒక చిన్న పట్టణం మాత్రమే, అప్పటికి దీనిని బాగా కట్టించలేదు. అనగా బెల్షస్సర్ బ్రతికి ఉండగానే దేవుడు బబులోను లేక ఇరాక్ ఉత్తరభాగంలో ఉన్న దానియేలు గారికి షూషను అనే పట్టణం ఇరాన్ లో కట్టబడుతుంది, రాజధాని అవుతుంది అని చూపించారు. కారణం ప్రధాన మంత్రులు- అధికారులు రాజధానిలోనే ఉంటారు కదా!

 

    ఇక దర్శనంలో ఆయన షూషను పట్టణం ప్రక్కన ఉన్న ఊలయి అనే నది ఒడ్డున ఉన్నారు. ఊలయి నది ప్రస్తుత పేరు ఖార్కె.  4....

3. నేను ఊలయియను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.

4. పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరము గాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.

 

       ఇక్కడ ఆయనకు దర్శనంలో పోట్టేలు కనబడింది- రెండు కొమ్ములు ఉన్నాయి దానికి. కొమ్ములు అధికారానికి, రాజులకు సాదృశ్యం! కాబట్టి వచనం యొక్క అర్ధం 20 వచనంలో ఉంది. ఇక నాలుగవ వచనంలో కొమ్ము పడమరగా, ఉత్తరంగా, దక్షిణంగా పొడుచుకుంటూ వెళ్తుంది- గమనించాలి తూర్పుగా మాత్రం పొడవలేదు. ఇక ఇరవై వచనం నుండి దీని అర్ధం ఉంది. పొట్టేలు మాదీయ- పారశీక రాజ్యానికి సూచనగా ఉంది అని గబ్రియేలు దేవదూత స్పష్టంగా చెప్పాడు. మాదీయ పారశీక సామ్రాజ్యం కోసం మనం చాలా సుదీర్ఘంగా చూసుకున్నాం గతబాగాలలోకావున వివరించడం లేదు.

 

512.....

5. నేను సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమియందంతట పరుగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.

6. మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములుగల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

7. నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

8. మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

9. కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షి ణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

10. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగ ద్రొక్కుచుండెను

11. సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.

12. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.

 

వచనాలలో మేకపోతు కనిపిస్తుంది- 21 వచనం ప్రకారం- మేకపోతు గ్రీకు సామ్రాజ్యానికిముఖ్యంగా అలగ్జాండర్ ని సూచిస్తుంది. కారణం కాలు నేలమీద మోపకుండా సుడిగాలిలా తిరుగుతుంది. అనగా చాలా త్వరగా అలగ్జాండర్ ప్రపంచ దేశాలలో అనేకమైన దేశాలు వశపరచుకుని సామ్రాజ్యాన్ని స్థాపించడాన్ని సూచిస్తుంది.

 

 ఇక దాని కాళ్ల మధ్య ఉన్న కొమ్ము అలగ్జాండర్. ఇక 67 వచనాలలో మేకపోతు- పొట్టేలుని కోపంతో నేలకు అణచి తొక్కేస్తున్నట్లు- పొట్టేలు మేకపోతుని ఏమీ చేయలేక ఉండిపోయినట్లు చూస్తున్నాం. (పట్టణాలలో ఉన్న కాలం యవ్వనస్తుల కోసం- పొట్టేలు అనగా గొర్రెలలో మగది, మేకపోతు- మేకలలో మగది).

BC 334-330 వరకు అలగ్జాండర్ గ్రేట్, మాదీయ- పారశీక సామ్రాజ్యాన్ని అణచివేసి- ఇక నామరూపాలు లేకుండా చేసేశాడు. అంటే దానియేలు గారికి వచ్చిన ప్రవచానాత్మక దర్శనం 200 సంవత్సరాలు గడిచాక జరిగింది అన్నమాట!

 

   ఇక 8 వచనంలో కొమ్ము బాగా అభివృద్ధి పొంది- చివరకు పుటుక్కున విరిగిపోయింది. దాని స్థానంలో నాలుగు కొమ్ములు వచ్చాయి. మీకు తెలుసు- అలగ్జాండర్ పెరిగిపెరిగి- చిన్న మలేరియా జ్వరానికి పుటుక్కున చచ్చాడు- ఇండియానుండి తిరిగి వెళ్ళేటప్పుడు క్రీ.పూ. 323లో. దానిని సూచిస్తుంది. ఇక కొమ్ము స్థానంలో  నాలుగు కొమ్ములు పుట్టాయి అంటే చరిత్ర ప్రకారం అలగ్జాండర్ తర్వాత పాలించిన నలుగురు జనరల్ లు/సైన్యాధికారులు: వారు........

కేసేందర్గ్రీకు ప్రాంతము పాలించాడు;

 లైసిమాకుస్- ఆసియా మైనర్ ను పాలించాడు;

ప్టోలెమీఈజిప్ట్ ను పాలించాడు;

 సెల్యూకస్-సిరియా, బాబిలోనియా ను పాలించాడు.

ఇంకా ఆ గ్రీకు సామ్రాజ్యం నాలుగు ముక్కలయ్యింది.  దీనినే దానియేలు 7:6 లో కూడా చూసుకున్నాం.

 

    ఇక 9-12 వచనాలలో మఖ్యంగా 9 వచనంలో ఒకమాట ఉంది. అది * కొమ్ములలో* దీనిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. అనగా గ్రీకు సామ్రాజ్యపు కొమ్ములలో ఒకకొమ్ము అని అర్ధం వస్తుంది. సరే, 912 వచనాలలో గల కొమ్ముకోసం చాలా భిన్నాభిప్రాయా లున్నాయి. దానికోసం చెప్పేముందు కొమ్ము- దక్షిణం వైపు, తూర్పు వైపు అనగా ఇండియా వైపు, చివరకు అలా వచ్చి ఆనంద దేశం వైపు వెళ్ళింది- గమనించాలి ఆనందదేశం అనగా ఇశ్రాయేలు దేశం. దానియేలు 11:16, 41; యేహెజ్కేలు 20:6; చివరకు ఇంకా బాగా ఎదిగి ఆకాశ నక్షత్రాలను కూడా కొన్నింటిని పడవేసింది. 11-12 వచనాల ప్రకారం దేవుడు మీద కూడా తిరగబడింది. చివరకు యేరూషలేములో బలియర్పణలు చేయకుండా ఆపివేసినట్లు చూడగలం.

 

    ఇప్పుడు మనం కొమ్ముకోసం గల భిన్నాభిప్రాయాల కోసం చూసుకుందాం. చిన్న కొమ్ము కోసం చాలామంది బైబిల్ పండితులు బిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

కొంతమంది: చిన్న కొమ్ము దానియేలు 7:8, 20—25  లలో ఉదాహరించబడిన కొమ్ము అని అంటారు. వచనాలలో మొదటగా అక్కడ రోమా సామ్రాజ్యం కోసం- అది క్రైస్తవులను-సంఘమును అణచివేయడం- యూదులను అణచివేయడం- హింసించడం కోసం చూస్తాము. ఇక చివరి దినాలలో జరుగబోయే సంఘటనలు-అనగా ఒక రోమా పట్టణం వలన జరుగబోయే సంఘటనల కోసం వ్రాయబడింది. కాబట్టి వీరు అభిప్రాయపడేది ఏమంటే ఇది రోమా సామ్రాజ్యం కోసం వ్రాయబడింది అంటారు.

 

మరికొంతమంది: కాదు కాదు- ఇది ఖచ్చితంగా గ్రీకు సామ్రాజ్యంలో గల ఒక రాజు చేసే క్రియలకోసం వ్రాయబడింది. కారణం కొమ్ములలో ఒకటి అన్నారు. అంటే గ్రీకులలో ఒక రాజు అంటారు. దానియేలు 7:8లో చెప్పబడింది గ్రీకు సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత కదా వచ్చింది అంటారు.

 

అయితే అధిక సంఖ్యాకులు అభిప్రాయపడేది ఏమిటంటే: కొమ్ము గ్రీకు సామ్రాజ్య కాలంలో ఏలిన ఒకరాజు-  అంతియోకాస్ ఎపిఫానిస్ అంటారు. వీడు యూదులకు బద్ద శత్రువు, పరమ మూర్ఖుడు!  సిరియా దేశంనుండి రాజ్యమేలాడు. అనేక దేశాలను గెలిచాడు. అంతేకాదు వీడు రాబోయే క్రీస్తువిరోదికి కూడా సూచనగా ఉన్నాడు. దానియేలు 11:21—25; కారణం వీడు యూదులను బాధపెట్టడమే కాకుండా యేరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరచి (పంది రక్తాన్ని అర్పించి, జూస్ దేవత విగ్రహాన్ని పెట్టాడు) బల్యర్పణలు జరుగకుండా ఆపివేశాడు.

25 ప్రకారం అతడు ఉపాయం గలవాడు తెలివైన వాడు.  నేను గొప్పోడ్ని అనుకుంటాడు. అందుకే దేవునికి వ్యతిరేఖంగా బయలుదేరాడు. 

13—14 వచనాల ప్రకారం వాడు 2300 రోజులు వారిని హింసిస్తాడు.  అంతేకాకుండా బల్యర్పణలు ఆపివేసి నాశనకరమైన హేయవస్తువు దానిమీద అర్పిస్తాడు. ఇది నిజంగా జరిగింది. వీడు యూదులను బాధపెట్టింది సరిగ్గా అంతేకాలం. అనగా 2300 రోజులు.  యూదులను క్రీ. పూ. 170 నుండి 164 వరకూ చాలా ఘోరంగా హింసించాడు.   అనగా సుమారు 6సంవత్సరాల నాలుగు నెలలు. మరికొందరు అంటారు కాదుకాదు 2300 ఉదయసాయంత్రాల బల్యర్పణలు ఆపుతాడు, అనగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అలా 1150 రోజులు అంటారు. చరిత్రప్రకారం ఇశ్రాయేలు వారు మరలా దేవాలయాన్ని శుద్ధిచేసి బలి అర్పించటానికి 1150 రోజులు పట్టింది. BC168-165.

 

*ఇక వీడిని క్రీస్తువిరోది- ఇంకా అంత్యక్రీస్తు తో ఎందుకు పోలుస్తారు అంటే*: *యేసుక్రీస్తుప్రభులవారు మత్తయి 24లో అంత్యకాలము-రాకడ సూచనల కోసం మాట్లాడుతూ మరలా నాశనకరమైన హేయవస్తువు, శ్రమలు-హింసలు, కరువులు కోసం మాట్లాడారు కాబట్టి, మాట్లాడినది స్వయాన యేసుక్రీస్తుప్రభులవారు కాబట్టి- సూచన మరోసారి అంత్యకాలంలో జరుగబోతుంది. అనగా అంత్యక్రీస్తు అంత్యకాలంలో అదే సిరియాకు చెందిన, లేక రోమా సామ్రాజ్యపు సరిహద్దులలోనుండే పుడతాడని అభిప్రాయపడతారు*.

 

అయితే మరికొంతమంది ఏమంటారు అంటే: అంతియోకాస్ సంగతి దానియేలు గ్రంధంలో ఎత్తి వ్రాయడానికి కారణం క్రీస్తువిరోది సిరియాలోనే పుడతాడు అనికాదు గాని క్రీస్తువిరోది యొక్క లక్షణాలను ఎత్తి వ్రాయడమే అధ్యాయం యొక్క ఉద్దేశం అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. నా ఉద్దేశం కూడా ఇదే!

 

         *అయితే గమనించాలి: అయితే ఇలాంటి సందేహాత్మక విషయాల కోసం- ముఖ్యంగా దేవుని మర్మాల కోసం ఇదే జరుగుతుంది అని బల్లగుద్ది చెప్పడం తగదు, అవివేకం అవుతుంది జాగ్రత్త! అది దేవుని ఇష్టం- దానిని అర్ధం చేసుకోవడం కష్టం. ఇంకా దేవుని చిత్తమైతే అలా జరుగకుండా మార్చేస్తారు. కారణం యోనాగారిని దేవుడు నీనేవే వెళ్లి పట్టణానికి నాశనం అయిపోతుంది 40రోజులలో అని చెప్పమన్నారు. ఆయన చెబితే వారు మారుమనస్సు పొంది- పశ్చాత్తాప పడితే దేవుడు తాను చేస్తానన్న కీడు చెయ్యడం మానేసి కనికరపడ్డారు. కావున ఆయన పరమకుమ్మరి. ఆయన ఇష్టం వచ్చినట్లు కార్యాలు చేస్తారు. కాబట్టి ఇలాగే జరుగుతుంది అని చెప్పడం తప్పు!*

 

(ఇంకాఉంది)

*దానియేలు-24-The Man of God*

*24 భాగం*

*దానియేలు దర్శనాలు- పొట్టేలు మేకపోతు-2*

 

దానియేలు 8:2—21...  ..

          (గతభాగం తరువాయి)

 

  సరే, ఇప్పుడు కొన్ని వచనాలలో ఉన్న కొన్ని విషయాల కోసం క్లుప్తంగా చూసుకుందాం. 10 వచనంలో ఆకాశమంత మట్టుకు ఎదిగి నక్షత్రాలలో కొన్నింటిని భూమిమీద పడవేసినట్లు కనబడుతుంది. ఆకాశ సమూహం అనేది ఇజ్రాయెల్ లోని విశ్వాసులను సూచించవచ్చు.  12:....

బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.

కాబట్టి ఇలాంటి బుధ్దిమంతులైన వారి పరిశుధ్దులను కూడా హింసిస్తాడు.

 

 అంతియోకాస్ ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చి కొన్ని వేలమందిని హతమార్చి- దేవాలయాన్ని అపవిత్రపరచి యూదులను బలులు అర్పించకుండా చేశాడు. అంతేకాకుండా చివరిరోజులలో దేవునిపరిశుద్దులను కూడా సూచించవచ్చు.

 

11 వచనంలో సైన్యముయొక్క అధిపతి అంటే సైన్యముల కధిపతియగు యెహోవా అని అర్ధం చేసుకోవచ్చు.

 

12 వచనంలో తిరిగుబాటు కారణంగా అంటూ రాశారు. ఇంతకీ తిరుగుబాటు అనగా ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేఖంగా ప్రవర్తించడం వలననే ఇది జరిగింది. మరిదానికి ప్రతిదండన అనుభవించారు కదా, చెరకు వెళ్లి 70 సంవత్సరాలు ఉన్నారు కదా అనవచ్చు. BC 518 నుండి తిరిగి వచ్చారు. మలాకీ గ్రంధం నుండి మత్తయి సువార్తకు 420సంవత్సరాలు. దీనిని చీకటి కాలం అంటారు. కాలంలో దేవుడు ఎవరితోనూ మాట్లాడటం మానేశారు. ప్రజలు అంతగా చెడిపోయారు. దానిలో మచ్చుకు ఒకటి, చీకటి కాలానికి ముందుగా బెరక్యా కుమారుడైన ప్రవక్తయైన జెకర్యా గారిని (యూదులు తిరిగివచ్చాక దేవాలయం కట్టినప్పుడు ప్రవచన పరిచర్య ప్రారంబించారు. హగ్గయి గారి సమకాలికుడు) చంపడం! అదీకూడా మందిరానికి బలిపీటానికి మధ్యలో చంపేశారు.  దానిని యేసుక్రీస్తు ప్రభులవారు కూడా ఎత్తి చెబుతున్నారు...... మత్తయి  23:35 , లూకా 11:51;

కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.

 

ఇంకా  Ezra(ఎజ్రా) 9:1,2 ప్రకారం

1.ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిఇశ్రాయేలీయులును యాజకులును లేవీయు లును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,

2. వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.

 

 మరి ఇది తిరుగుబాటు కాదా. అందుకే ఇలా జరిగింది అని చెప్పుకుంటున్నారు దేవుని దూతలు!

 

   ఇక తర్వాత వచనాలలో దానియేలు గారు దర్శనం కోసం (దర్శనంలోనే) ఆలోచిస్తుంటే వివేచిస్తుంటే- ఇద్దరు దేవదూతలు మాట్లాడుకునే మాటలు విన్నారు. దాని ప్రకారం మనం మీద ధ్యానం చేసుకున్నట్లు 2300 రోజులు అలా దేవాలయానికి జరుగుతుంది. తర్వాత తీర్పు తీర్చబడుతుంది అని చెప్పారు.

 

ఇక 15—16 వచనాలలో గబ్రియేలు దేవదూత కనిపిస్తాడు. గమనించాలి- దానియేలుగారి దగ్గరకు చాలాసార్లు గబ్రియేలు దేవదూత వచ్చాడు. గబ్రియేలు దేవదూతదేవుని నుండి వర్తమానములు తన ప్రజలకు తీసుకుని వచ్చేవాడు- మిఖాయేలు దేవుని తరుపున యుద్దాలు చేసేవాడు. మరియ దగ్గరకు వచ్చి యేసయ్య జనన వర్తమానం అందించిన వాడు కూడా గబ్రియేలు దేవదూతనే! లూకా 1:19,26;

 

17 వచనంలో గబ్రియేలు దేవదూతను చూసి దానియేలు గారు భయపడినట్లు 18 వచనంలో కూడా సాగిలపడినట్లు చూస్తున్నాం. ఇంకా దానియేలుగారిని ముట్టి బలపరచినట్లు చూస్తున్నాం. ఇంకా నరపుత్రుడా అని పిలుస్తున్నారు. అంత్యకాలపు వర్తమానాలు ఇచ్చేటప్పుడు దేవుడు యేహెజ్కేలు గారితో గాని, దానియేలు గారితోనూ నరపుత్రుడా అనే ఉచ్చరించారు. అదే యేసుక్రీస్తుప్రభులవారికి మాత్రం మనుష్యకుమారుడు అని చెప్పబడింది.

 

     ఇక 19 వచనం ప్రకారం దర్శనభావం అంత్యకాలంలో నెరవేరుతుంది అని ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా నిర్ణీతకాలంలో నెరవేరుతుంది అని కూడా అర్ధం వస్తుంది. ఇంకా నిర్ణీతకాలంలో అంతం వస్తుంది అనికూడా అనువదించవచ్చు! కారణం దీని తర్వాత వచనాల ప్రకారం: 314 వచనాలలో గల విశేషాలు దేవుడు చెప్పిన కోపకాలం, దినముల అంతం చివరి రోజులలో లేక అంత్యకాలంలో నెరవేరుతుంది అని అర్ధం అవుతుంది.

 ముఖ్యంగా అంతియోకాస్ కాలంలో జరుగుతుంది. అలాగే ఆరోజులు యుగాంతంలో రాబోయే క్రీస్తువిరోది కాలాన్ని సూచిస్తుంది.

 

ఇక 20—22 మాదీయ పారశీక సామ్రాజ్యం కోసం, గ్రీకు సామ్రాజ్యములను సూచిస్తాయి అని గబ్రియేలు స్పష్టంగా చెప్పాడు. 22లో అలగ్జాండర్ చనిపోయాక నలుగురు పాలించడం కోసం చెబుతుంది.

 

   ఇక 2325 లో కనబడే రాజు- మొదటగా అంతియోకాస్. చివరిగా క్రీస్తువిరోధి. 2థెస్సలొనికయులకు 2: 8

అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

ప్రకటన  13:2..

నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.

 

     25లో అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును అనగా అలగ్జాండర్ గాని, అంతియోకాస్ గాని యుద్ధాలలో చావలేదు. వీరిద్దరూ రోగాల వలన చచ్చారు. అలాగే క్రీస్తువిరోది- న్యాయవిరోది కూడా అలాగే చస్తాడు. 2థెస్సలొనికయులకు 2: 8

అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

 

  ప్రకటన 19:20...

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

 

26 వచనం ప్రకారం ఇది అంత్యదినాలలో జరుగుతుంది.

 

   సందర్భంగా ఒక విషయం చెప్పనీయండి.  దానియేలుగారు అంత భక్తుడు- దేవుని ఆత్మ కలిగి దర్శనాలకు కలలకు అర్ధం చెప్పగలవాడు కూడా దర్శనం యొక్క భావమును సరిగ్గా అర్ధం చేసుకోడానికి ఇంకా వివేకం కావాలని, దేవుని సహాయం కోసం ఎదురుచూశారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నేను వాక్యం బాగా అర్ధం చేసుకుని చెప్పగలుగుతున్నాను కదా, నేను ఆత్మపూర్నుడిని, నాకు అంతా తెలుసు అని విర్రవీగకూడదు. ఇంకా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కనిపెడుతూ సరియైన వివేకం పొందుకోవాలి.

 

మనం కూడా దేవుడు చెప్పినట్లుగా విర్రవీగకుండా భక్తిలో నిలిచి, ఇప్పటిశ్రమలను, రాబోయే శ్రమలను తట్టుకుని, మనకు కలిగింది అంత్యము వరకు గట్టిగా పట్టుకుని నిలకడగా ఉంటే మనం కూడా మనవంతులో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము.

 

అలా సిద్దపడదాం! దైవరాజ్య వారసులవుదాం!

 

మరినీవు సిద్దమా!

దైవాశీస్సులు!

*దానియేలు-25-The Man of God*

*25 భాగం*

*దానియేలు దర్శనాలు- డెబ్బది వారములు-1*

 

దానియేలు 9:22—27..

22. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.

23. నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు, ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము.

24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను.

25. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.

26. ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము(పాడైన దానికి) చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేసుకుంటున్నాము!

ఈ తొమ్మిదవ అధ్యాయములో మొదటిభాగంలో వివరించినట్లు దానియేలుగారి ప్రార్ధన కనిపిస్తుంది. దానికోసం మరోసారి గుర్తుచేయడం లేదు. యిర్మియాగారి ద్వారా చెప్పబడిన ప్రవచనం 70 సంవత్సరాలు పూర్తికావచ్చాయని దానియేలుగారు గ్రహించి, ఉపవాసముండి దేవునితో గోజాడుతున్నారు ఈ అధ్యాయం మొదటి భాగంలో. ఇక రెండవ భాగంలో అతిప్రకాశమానుడైన దేవదూతగబ్రియేలు దానియేలుగారికి ఒక వర్తమానం తీసుకుని వస్తాడు. దానిని దర్శనంలో చూస్తున్నారు దానియేలు గారు.

 

  23వ వచనంలో దానియేలు! నీవుబహు ప్రియుడవు అంటున్నాడు గబ్రియేలు! ఎంత ధన్యతో కదా! గమనించాలి ఎవరైతే దేవునికి ప్రియంగా ఇష్టంగా ఉంటారో వారికే పరలోక రాజ్యం! అనగా దానియేలుగారికి పరలోకం పక్కా అయ్యింది అన్నమాట! ఇలాంటి దేవునితో బిరుదులూ పొందినవారు చాలా తక్కువమంది. అబ్రాహాము గారు- దేవునికి స్నేహితుడు, మోషే- నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దావీదు- నాకిష్టానుసారుడైన మనిషి! యోబు- యదార్ధవంతుడు, నీతిమంతుడు. నోవాహు- ఈ తరమువారిలో నీతిమంతుడు. నిజంగా దేవునిచే ఇలాంటి బిరుదులూ పొందడం గొప్ప భాగ్యం! ధన్యత!

 

  ఇక 24 వచనంలో ఆరు విషయాలు చెబుతున్నారు.  ఇది మొత్తం యెరూషలేము తిరిగి కట్టబడుటకోసం, యేసయ్య రాకకోసం, బలియాగం కోసం, వ్రాయబడిన మాటలు!

1). తిరిగుబాటు మాన్పుటకు,

2) పాపమును నివారించడానికి,

) దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు,

4) యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలు పరచడానికి;

5) దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు

6) అతి పరిశుద్ధమైన స్థలమును అభిషేకించుటకు

ఇవన్నీ జరగటానికి నీ జనమునకు అనగా ఇశ్రాయేలీయులకు- 70 వారములు విధించబడ్డాయి అని చెబుతున్నారు.

 

  గమనించాలి : మొదటగా తిరుగుబాటు మాన్పుటకు- అనగా ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేఖముగా తిరుగుబాటు చేసి- విగ్రహారాధన చేసినందుకు గాను దేవుడు ఇంతఘోరమైన ఉగ్రతను కలిగించారు. ఇప్పుడు తిరుగుబాటును మాన్పుతున్నారు దేవుడు;

 

రెండవది: పాపమును నివారించుటకు-అయితే విషయం మీద అనేకులకు సందేహాలు ఉన్నాయి. కారణం యేసుక్రీస్తుప్రభులవారు మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, నివారించడానికే వచ్చారు. పనిపూర్తి చేశారు. ఇది నెరవేరింది గాని వారు అనగా యూదులు దానిని అంగీకరించలేదు. స్వీకరించలేదు. కాబట్టి సకలమైన వారికి పాపముల విషయమై నివారణ కలిగింది కాని యూదులు ఇప్పటివరకు అంగీకరించలేదు.

 

సరే, మనమేమి చేయాలి, పాపలోకంలో ఉన్న మనలో పాపము ఎలా నివారించ బడుతుంది. యేసుక్రీస్తు ప్రభులవారు సిలువయాగం వలన పాపక్షమాపణ కలిగినా మనకు, ఇంకా పాపము మనలను ఏలకుండునట్లు మొదటగా నిజమైన మారుమనస్సు, పశ్చాత్తాపం కలిగి దానిలోనే జీవిస్తూ, వాక్యాన్ని అనుదినం మదిలో ఉంచుకొని, ఆత్మాభిషేకం పొందుకుని ఆత్మపూర్ణులుగా ఉండాలి.

కీర్తనలు 119: 11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

గలతియులకు 5: 16

నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

 

మూడవది: దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు- ఇది అక్షరాలా నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభులవారు మనందరి కోసం ప్రాయశ్చిత్తం చేశారు ఒక్కసారే, కలువరి సిలువమీద!

 అయితే యూదులు దీనిని అంగీకరించడం లేదు. వారు ఇంకా మెస్సీయా వస్తాడు-వారిని విడిపిస్తాడు- అని ఎదురుచూస్తున్నారు. అయితే యేసుక్రీస్తుప్రభులవారు వచ్చి సమస్తజనుల కోసం తానే పస్కా పశువుగా వధింపబడి, మానవుల పాప పరిహార బలిగా తన సొంత రక్తం కార్చారు. అయితే కొంతమంది కనుగొన్నారు- యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయినప్పుడు గొప్ప భూకంపం కలిగింది, అప్పుడు కొండలు బ్రద్ధలయ్యాయి. అప్పుడు ఈ గొల్గొతా కొండకూడా బ్రద్దలయ్యింది. అప్పుడు ఆయన కార్చిన రక్తం- ఆ బీటల మధ్యనుండి గొల్గొతా కొండ సొరంగం లో మరుగు పడిన మోషేగారి సమయంలో బెసలెలు చేసిన బలిపీటం మీద పడ్డాయి. దానివలన ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుడే బలిగా తన రక్తాన్ని బలిపీటం మీద అర్పించారు అంటారు. మరి ఇప్పుడు ఇది నెరవేరింది కదా!

 

నాల్గవది: యుగాంతం వరకు ఉండు నీతిని బయలుపరచడానికి- యుగాంతం వరకు ఉండే నీతి ఏమిటి? దీనికోసం రోమా పత్రిక ధ్యానములు వ్రాసినప్పుడు విస్తారంగా ధ్యానం చేయడం జరిగింది. అది ఏమిటంటే: యూదులని కాదు, అన్యులని కాదు ఎవరైనా సరే, దేవుని రక్షణ సువార్త విని, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి- రక్షణ పొందితే వారు నూతన సృష్టి, ఇంకా వారు యూదులతో పాటు సమానవారసులు- దేనికీ? దేవుడు యూదులకు చేసిన వాగ్దానాలు అన్నింటికీ సమానవారసులు. దీనినే గొప్ప మర్మము అన్నారు. అయితే రక్షణ సొంత క్రియల వలన కాకుండా దేవుని మీద విశ్వాసం వలననే జరుగుతుంది. దీనినే దేవుని నీతి అని అంటారు.

ఇంకా రోమీయులకు 8: 30 ప్రకారం

 ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. నోవహు గారిని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు, అందుకే ఈతరంలో నీవే నీతిమంతుడుగా కనబడ్డావు అని సర్టిఫై చేశారు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతారు. నీ అంతట నీవు నీతిమంతుడవు కాలేవు. పరిశుద్ధాత్మ సహాయం అవసరం.

 

మరి ఇది నెరవేరిందా అంటే- నెరవేరింది అని చెప్పాలి. క్రీస్తుయేసు రావడం పని పూర్తిచేయ్యడం జరిగింది- గాని ఇంకా ప్రపంచమంతా దీనిని అంగీకరించలేదు.

 

ఐదవది: దర్శనమును- ప్రవచనమును ముద్రించుటకు: ముద్రించడం అనగా మరొక అర్ధం- నానార్ధం- స్థిరపరచడం అంటారు బైబిల్ పండితులు- అనగా వాగ్దానాన్ని- శాసనాన్ని స్తిరపరచడానికి యేసుక్రీస్తుప్రభులవారుశాశనం చెయ్యడమే కాదు అది నెరవేరాలి అంటే- వీలునామా వ్రాసిన వ్యక్తి చనిపోవాలి- కాబట్టి ఆయన చనిపోయి- వాగ్దానానికి ఉనికిని- లేక చెల్లుబాటును కలిగించారు.

హెబ్రీ 9:16-17 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.

17.ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?

 

ఆరవది: అతి పరిశుద్దమైన స్థలమును అభిషేకించుటకు- అయితే దీని విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అతి పరిశుద్దమైన స్థలము యేరూషలేము దేవాలయంలో ఉంది. దానిని యేసుక్రీస్తు ప్రభులవారు అభిషేకించలేదు కదా అంటారు కొంతమంది. పౌలుగారు ప్రవేశించారు అంటే వీరు కాదంటారు. (హెబ్రీ 9:12) అయితే ఆయన- అనగా దేవాదిదేవుడే తన సొంత రక్తమును చిందించడం అభిషేకించడమే కదా! అయితే మీదన ఉదాహరించిన దానిని బట్టి- ఆయన రక్తం- బలిపీటం మీదన కారింది లేక దానిమీద ప్రోక్షించబడింది  అంటే బలిపీటం కన్నా- అతి పరిశుద్దమైనది ఏముంది? అందుకే కదా, పౌలుగారు హెబ్రీ పత్రికలో మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు- ఆయన కోడెల రక్తము, గొర్రెల రక్తము కాకుండా తనసొంత రక్తమును తానే చిందించి, ఒక్కసారే అందరికోసం అర్పించారు అనివ్రాయడం జరిగింది

Hebrews(హెబ్రీయులకు) 9:11,12,16,17,24

11.అయితే క్రీస్తు రాబోవుచున్న(అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనది యునైన గుడారముద్వారా,

12. మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

24. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 

కాబట్టి పౌలుగారు చెప్పినట్లు ఇది కూడా జరిగింది.

 

అయితే ఒక్కమాట: ఇశ్రాయేలు జాతి, యెరూషలేము నగరానికి సంబంధించినంతవరకు ప్రవచనం యొక్క ఉద్దేశాలు అన్నీ నెరవేరలేదు. గాని అన్యజనాంగమైన మనకోసం అన్నీ నెరవేరాయి అని గ్రహించాలి. ఆయన చెప్పినట్లు ఆయన పనిపూర్తిచేసి ముగించారు. ప్రియ చదువరీ! మరి నీపని సంపూర్ణ చేస్తున్నావా?

(ఇంకాఉంది)

*దానియేలు-26-The Man of God*

*26 భాగం*

*దానియేలు దర్శనాలు- డెబ్బది వారములు-2*

 

దానియేలు 9:22—27...  ..

                (గతభాగం తరువాయి)

 

    సరే, ఇవి జరగటానికి 70 వారాలు నీ ప్రజలకు ఇవ్వబడింది అని చెప్పాడు గబ్రియేలు. ఇక తర్వాత వచనాలలో ఇంకా వివరంగా చెబుతున్నారు.

25....యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును. 

యెరూషలేము మరలా కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకుని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు. ఆ అభిషక్తుడగు అధిపతి ఎవరో కాదు మన *యేసుక్రీస్తు ప్రభులవారు- యేసు అనగా- రక్షకుడు*; క్రీస్తు అనగా అభిషక్తుడు అని మనం క్రొత్త నిభందనలో చూడగలం!

మత్తయి 1: 1

అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) వంశావళి.

 కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారే ఈ అభిషక్తుడు. 25—26

 

అయితే 70 వారాలు కోసం చాలా చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం చెబుతాను.

 

        యెరూషలేము తిరిగి కట్టించవచ్చు అనే శాసనాలు మనకు నాలుగు కనిపిస్తాయి. అయితే పండితులు అందరూ తీసుకునేది- నెహేమ్యా కాలంలో రాజైన అర్తషహస్త ఇచ్చిన డిక్రీ- ఇది క్రీ.పూ. 457 లో ఇవ్వబడింది.  కారణం కోరెషు, దర్యావేషులు మందిరం కట్టించాలని ఆజ్ఞ జారీ చేశారు గాని అర్తహశస్త యెరూషలేము తిరిగి కట్టించమని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దానినే ప్రమాణంగా తీసుకుని ఉండవచ్చు వేద పండితులు.

 కాబట్టి ఏడువారములు + 62 వారములు= 69 వారములు. (అయితే ఇక్కడ యేహెజ్కేలు గ్రంధం 4:5--8లో చెప్పబడిన విధముగా ఒక్కసంవత్సరం నకు బదులుగా ఒకరోజు) 69 వారములు అనగా 69 x 7= 483 సంవత్సారాలు. అనగా క్రీ.పూ. 457 నుండి- క్రీ. . 27 వరకు. అనగా అప్పటికి యేసుక్రీస్తుప్రభులవారు పుట్టి- భాప్తిస్మం తీసుకుని- ప్రభువు రాజ్యం సమీపించి యున్నది మారుమనస్సు పొంది రక్షణపొందుడి అనే ఆయన పరిచర్య ప్రారంభించిన రోజులు. 69 వారములు అయిపోయాయి.

 

     ఇక మిగిలిన వారం- కోసమే ఇన్ని భిన్నమైన అభిప్రాయాలు.

ఒకరు అంటారు- అప్పుడు లెక్క- లేక గడియారం ఆగింది, మరలా యుగాంతములో యూదులు క్రీస్తు విరోధి చేత మోసగింపబడినప్పుడు ప్రారంభమవుతుంది అని కొందరు.

మిగతా వారం మహాశ్రమల ఆరంభంలో ప్రారంభం అవుతుంది అని కొందరు.

* అయితే- మరికొంతమంది- యేసయ్య బాప్తిసం తీసుకున్న సరిగ్గా మూడున్నర సంవత్సారాలకు ఆయన రక్తముతో అభిషేకించి ప్రవచనాన్ని నెరవేర్చారు. అనగా సగం వారం అయ్యింది- మిగతా సగం వారం- క్రీ.. 70తో అంతమయింది. కారణం ప్రవచనం ప్రకారం 70 వారాలు పూర్తి కాబోయేసరికి అభిషక్తుడు హతమవుతాడు- ఇంకా దేవాలయం నాశనం కాబడుతుంది. కాబట్టి 70లో ఇజ్రాయేలు దేశం- యేరూషలేము దేవాలయం నాశనం అవడం జరిగింది కాబట్టి-70తో ప్రవచనం నెరవేరింది అంటారు.

*మరికొంతమంది ఏడువారాలు ఖచ్చితంగా యూదులు క్రీస్తు విరోధి చేత మోసగింపబడిన తర్వాతనే ప్రారంభం అవుతుంది కారణం 27 వచనం ప్రకారం వారం వరకు అనేకులకు నిభందన స్థిరపరచును అని ఉంది- అనేకులు అంటే యూదులు. కాబట్టి వాడు యూదులతో నిభందన చేస్తాడు- గాని రోమా చక్రవర్తులు ఎవరు యూదులతో నిభందన చేయలేదు. ఒడంబడిక కూడా చెయ్యలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా యుగాంతంలో జరుగుతుంది. మరోసారి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు జరుగుతుంది అంటారు.

 

    సరే, ఏదిఏమైనా ఇలాగే జరుగుతుంది అని చెప్పడం కష్టం! అలా చెప్పినవాడు గతభాగంలో వివరించినట్లు- అవివేకి అవుతాడు. అయితే ఒకటిమాత్రం చెప్పాలి అనుకుంటున్నాను. ఏడులు, 70వారాలు, వారము అనేది కేవలం ఉదాహరణగా చెప్పబడి ఉంటుంది. కారణం- ఏడు అనేది బైబిల్ లో సంపూర్ణ సంఖ్య. కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు. కాబట్టి మొదటి ఏడు వారములలో యేరూషలేము కట్టబడుతుంది అని చెప్పాడు- గాబ్రియేల్నిజంగా జరిగింది. క్రీస్తు పూర్వం 515లో మందిరం పూర్తిగా కట్టబడింది. క్రీ పూ.440 కి నెహేమ్యా- ఎజ్రా గారి కాలంలో యెరూషలేము నగరం, గోడలు సంపూర్తిగా కట్టబడింది. మిగతా 62 తొందరగల సమయములు అని చెప్పారు- అనగా మిగతా వారములు పూర్తి అవ్వబోయేసరికి యేసయ్య మొదటి రాకడ జరిగింది. అనగా దేవుని రక్షణ- విమోచనా ప్రణాళిక కోసం చెప్పబడింది.

 

         మిగతా వారం బహుశా అది యేసయ్య మరణం- యేరూషలేము నాశనం కోసమైనా చెప్పబడిఉండాలి. తర్వాత ఆయన చనిపోయి- నూతన నిభందన చెయ్యడం జరిగింది. తన మరణం ద్వారా నిబంధనకు చట్టబద్దత- అధికారం కల్పించడం జరిగింది. 

లేక రెండూ అనగా యేసయ్య మరణం- యేరూషలేము నాశనం- ఆ తర్వాత యుగాంతములో జరుగబోయే సంగతులు కోసం కూడా చెప్పబడి యుండాలి.  కారణం 26వ వచనం ప్రకారం 62 వారాలు గడిచాక అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చునట్టి రాజుయొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ద ఆలయమును నశింప చేయుదురు అంటూ- మరియు యుద్ద కాలంతము వరకు నాశనం  జరుగుతుంది అని నిర్ణయించబడింది అని వ్రాయబడింది. 70 లో పట్టణం- దేవాలయం నిర్మూలం చేయబడ్డాయి. గాని యుద్ద కాలాంతం అనేమాట ఉంది కదా. దీనిని మనం స్టడీ బైబిల్ లో చదువుకుంటే ఇలాగుంది....

26. ఈ అరవై రెండుఏడులతరువాత అభిషిక్తుడు హతం అవుతాడు. అప్పటికి ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తరువాత వచ్చే పరిపాలకుడి యొక్క ప్రజలు నగరాన్నీ పవిత్రస్థానాన్నీ నాశనం చేస్తారు. అంతం వరదలాగా వస్తుంది. *అంతంవరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది.* నాశనం సంభవించాలని నిర్ణయం అయింది.

*ఇంకా వేద పండితుల అభిప్రాయం ప్రకారం మహా శ్రమలకాలం అయినా కావచ్చు.

 

   కాబట్టి బహుశా యుగాంతంలో జరుగబోయే విషయాల కోసం వ్రాయబడి ఉంటుంది. అయితే దేవుని లెక్కలు- దేవుని మర్మాలు మనకు అర్ధం కావు. అవి మన ఊహలకు అందవు. యేహెజ్కేలు గ్రంధం ప్రకారం ఒకరోజు-ఒక సంవత్సరాన్ని సూచిస్తే- పేతురు గారు- ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలతో సమానం అన్నారు. 2పేతురు 3:8;  కాబట్టి లెక్కలు మనకు పూర్తిగా అర్ధం కావు.

 

      ఏదిఏమైనా మనం మాత్రం సిద్దపడి ఉందాము. సిద్దం లేకపోతే- సిద్దపాటులేని బుద్ధిలేని కన్యకలు విడిచిపెట్టబడినట్లు మనం కూడా విడిచిపెట్టబడతాము.

కాబట్టి సిద్దముగా ఉండి సిద్దెలలో నూనె అనగా పరిశుద్దాత్ముని కలిగి ఉందాం!

 

దైవాశీస్సులు!

 

 

 

 

 

 

 

 

*దానియేలు-27-The Man of God*

*27వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-1*

 

దానియేలు 10:11—14...

11. దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.

12. అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని

13. పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

14. ఈ దర్శనపు సంగతి ఇంక అనేక దినముల వరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.   ..

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేసుకుంటున్నాము! ఇక 1012 వరకు ఈ మూడు అధ్యాయాలు ఒకటే దర్శనము. చాలా పెద్ద దర్శనం! ఈ మూడు అధ్యాయాలలో గల దర్శనమును ముఖ్యంగా రెండుబాగాలుగా చేయవచ్చు! 10:1 నుండి 11:35 వరకు ఒకభాగం. దీనిలో- పారశీక-మాదీయ రాజ్యాలు, గ్రీకు సామ్రాజ్యం వలన జరిగే సంఘటనలు, వారు యూదులను ఏ రకంగా హింసిస్తారు అనేది. ఇక 11:36 నుండి 12వ అధ్యాయం చివరి వరకు అంత్యకాలం లేక యుగాంతంలో జరుగబోయే సంఘటనలు కోసం వ్రాయబడింది.

 

   10:1 లో దానియేలు గారికి ఒక సంగతి బయలుపరచబడింది- అది గొప్ప యుద్దాలు జరుగబోతున్నాయి అని. అవును దేవుని బిడ్డలకు దేవుడు తాను చేయబోయేవి ముందుగానే బయలుపరుస్తారు. ఒక వ్యక్తి దేవునికి తననుతాను సంపూర్తిగా అప్పగించుకుంటే, దేవుని హస్తాలలో తన జీవితాన్ని పెట్టి, నీకిష్టమొచ్చినట్లుగా నన్ను చెక్కు/తీర్చిదిద్దు అని దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఆ వ్యక్తిని ఉపయోగించుకుని అసాధారణమైన కార్యాలు చేస్తారు. దానికి ఉదాహరణ దానియేలు గారు.

 ఇక ఈ దర్శనం ఎప్పుడు కలిగింది అంటే: పారశీకరాజైన కోరేషు పాలనలో మూడవ సంవత్సరంలో! బహుశా కోరేషు ఆత్మహత్య చేసుకునే రోజులకు ముందుగా ఈ దర్శనం వచ్చింది. అనగా క్రీ.పూ. 536 లో. దానియేలుగారు ఈ దర్శనం చూడబోయేసరికి పరిపూర్ణ వృద్ధుడు! ఖచ్చితంగా 90+ అన్నమాట! యువకుడిగా/ టీనేజ్లో  ఈ బబులోను వచ్చారు. పూర్తి వృద్దాప్యం కలిగి దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నారు ఇప్పటికి కూడా! 

 

10:2 ప్రకారం ఆ రోజులలో దానియేలు గారు మూడువారాలు ఒకరకమైన ఉపవాసమున్నారు. ఎందుకు ఉన్నారో వ్రాయబడలేదు గాని బహుశా మొదటివచనంలో ఉన్నట్లు యుద్ధాలు జరుగబోతున్నాయి కాబట్టి ఇంకా వివరంగా తెలుసుకోవాలని కావచ్చు, లేక తొమ్మిదవ అధ్యాయంలో మాదిరి తన జనులు/ యూదులు ఇంకా సంపూర్తిగా చెరనుండి విడుదల కలగలేదు. చాలామంది అనేకచోట్ల ఇంకా చెరలోనే ఉన్నారు. చెరనుండి విముక్తి కలిగి జెరుబ్బాబెలుతో యెరూషలేము వెళ్ళినవారు చాలా అగచాట్లు పడుతున్నారు. దానికోసమైనా అయిఉండవచ్చు. తను ఇంకా చెర సంబంధమైన పట్టణము లోనే ఉన్నారు, కారణం తనకున్న హోదా అలాంటిది. లేకపోతే తనతోపాటు ఉన్నవాళ్ళు ఇంకా అదే పాపంలో మారుమనస్సు లేకుండా ఉన్నారు, తన కోరికమేరకు కోరేషు యేరూషలేముకి వెళ్ళవచ్చు అని చెప్పినా అనేకమంది అక్కడే ఉండిపోయారు. వెళ్లి ఆ మందిర పనులో సహాయం చేయలేదు. అందువలన కలిగిన విచారం కావచ్చు. బహుశా ఈ ఏ కారణముల వలన గాని ఆయన విచారంతో ఉపవాస ప్రార్ధన చేస్తున్నారు. (ఒక విషయం చెప్పనీయండి: చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే- బబులోను కోరేషు అధికారంలోనికి వచ్చాక- దానియేలు గారు, కోరేషుకి యెషయా 45లో ప్రవచనాలను చూపించి, నీకు కలిగిన విజయం నీకు దేవుడైన యెహోవా ముందుగానే చేసిన నిర్ణయం వలన వచ్చింది. కాబట్టి మా ప్రజలను విడిపించి, మందిరం కట్టడానికి అనుమతి ఇవ్వమని అడిగారు అంటారు. అందుకే కోరేషు వచ్చిన వెంటనే యూదులు తమ పట్టణాలకు తిరిగి వెళ్ళవచ్చు అని, మందిరాన్ని కట్టవచ్చు అని శాసనం చేశారు అంటారు. ఏమో తెలియదు! అయితే ఇన్ని విషయాలు రాసిన దానియేలు గారు మరి ఈ విషయం ఎందుకు వ్రాయలేదు అనేది అర్ధం కాదు)

*అయితే ఒక విషయం చెప్పనీయండి: ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. గనుక ఆత్మ నడిపించి ఉండవచ్చు. ఉపవాసానికి ఒప్పించి ఉండవచ్చు. అందుకే ఆయన ఉపవాసం ఉండి ఉండవచ్చు*

 

10:4 మొదటి నెల 24వ తారీకున హిద్దెకలు అనే గొప్ప నది ఒడ్డున ఉన్నట్లు దర్శనం కలిగింది. హిద్దెకలు అంటే నేటి రోజులలో టైగ్రిస్ నది అన్నమాట! దానియేలు గారి ఒక దర్శనం 8వ అధ్యాయంలో ఊలయి నది ఒడ్డున ఉన్నట్లు వస్తే- ఈ దర్శనం టైగ్రిస్ నది ఒడ్డున ఉన్నట్లు వచ్చింది.

 

57 వచనాలలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు......

5. నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.

6. అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

7. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. 

 

   పై లక్షణాలు జాగ్రత్తగా గమనిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు- మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుప్రభులవారు అని తెలుస్తుంది. కారణం అరవ వచనంలో గల వివరణ, ఇంకా ప్రకటన 1:1316 వరకు ఉన్న వివరణతో పోలిఉంది.

 

12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారుని పోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;

15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. .....

కాబట్టి దానియేలుగారు తను చనిపోయే ముందు- యేసుక్రీస్తుప్రభులవారి ప్రభావ దర్శనం చూశారు అన్నమాట! అభిషక్తుడు-అభిషక్తుడు- మెస్సీయ అని వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు కాబట్టి దేవుడే ఈయనకు చూపించి ఉంటారు.

 

ఇక తర్వాత వచనాలలో దానియేలుగారు భయపడి దాక్కున్నట్లు, బలమంతా పోయినట్లు చూడవచ్చు. కారణం నిజంగా ఇలాంటి దర్శనాలు చూస్తే, అదీకూడా దైవ సాక్షాత్కారం కలిగితే బలం పోతుంది అంటారు. దానియేలు గారికే కాదు యెహేజ్కేలు గారికి కూడా ఇలాగే జరిగింది.  దానియేలు దేవుని దృష్టిలో ప్రియుడు, ఇష్టుడు, ఇంకా పరిశుద్దుడు కాబట్టి పరిశుద్ద దర్శనాన్ని చూసి మొదటగా బలము, శక్తి మొత్తం కోల్పోయినప్పటికీ దేవుడు బలపరచి బాగుచేశారు.

 

  ఇక దేవుని స్వరము విని నిర్ఘాంతపోయి బలము పోయి ఉంటే-ఒక చేయి దానియేలుగారిని తాకి బలపరచింది. అయితే అది ఎవరి హస్తమో వ్రాయబడలేదు. అది దేవునిదూత హస్తము కావచ్చు లేక యేసయ్య హస్తము అయినా కావచ్చు. ఇక్కడ యేసయ్య ప్రభావంతో ఉన్నారు కాబట్టి బహుశా దేవదూత చెయ్యి అయి ఉండవచ్చు అని నా ఉద్దేశం!

 

1112 వచనాలలో అతడు-అంటున్నారు అంటే దేవదూత దానియేలుగారికి విషయం చెబుతున్నాడు. కాబట్టి తాకిన హస్తం దేవదూతదే కావచ్చు. అంతేకాదు మరోసారి దానియేలు నీవు బహు ప్రియుడవు. కంగారుపడకు. దైర్యంగా ఉండు అని బలపరుస్తున్నారు ఇక్కడ!

 

12వ వచనం చాలా అర్ధవంతంగా ఉంటుంది......

అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పినమాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని

 

 నీవు భావము తెలుసుకోవాలని నిన్నునీవు తగ్గించుకొనిన మొదటి దినం మొదలుకుని ఇంతవరకు నీవు చేసిన ప్రార్ధన మొత్తం వినబడింది అంటున్నారు. అంటే- ఎవరైతే తగ్గించుకుని దేవునికి ప్రార్ధన చేస్తారో వారి ప్రార్దనే దేవుడు వింటారు అని మనకు ఖచ్చితంగా అర్ధమవుతుంది. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభులవారు పరిసయ్యుడు- సుంకరి ప్రార్ధన ఉపమానంలో స్పష్టముగా చెప్పారు. లూకా 18:10-14; తగ్గించుకున్న సుంకరిప్రార్ధన విని దేవుడు అతనిని నీతిమంతుడుగా తీర్చారు గాని హెచ్చించుకున్న పరిసయ్యుడు వేషధారిగా ఉండిపోయాడు. కాబట్టి ప్రియ దైవజనమా! నీ ప్రార్ధనకు జవాబు రావడం లేదా మొదటి కారణం : నీవు తగ్గించుకోక పోవడం వలననే! మిగతా కారణాలు తర్వాత వచనాలలో ఉన్నాయి.

 కాబట్టి వినయం గలవారి ప్రార్ధన వినడం దేవునికి ఎంతో ఇష్టం! 2దినవృత్తా 14:11; 2రాజులు 19:1; 2రాజులు 20:2,3.

 

13వ వచనంలో భయంకరమైన మర్మం ఉంది:

పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

 

 పారశీక దేశం మీద ఉన్న అధిపతి 21 రోజులు దేవునిదూతని ఎదిరించి అడ్డగించాడు. గమనించండి. అడ్డగించినది కోరేషు కాదు. అధిపతి. అర్ధం కావడానికి ఇంగ్లీష్ బైబిల్ లో ఉన్నది చదువుదాం.....Daniel 10: 13

But the prince of the kingdom of Persia withstood me one and twenty days: but, lo, Michael, one of the chief princes, came to help me; and I remained there with the kings of Persia.

 

   It is Prince of Kingdom of Persia not the King of Persia.

పౌలుగారు చెప్పింది ఈ అధిపతుల కోసమే.......

ఎఫెసీయులకు 6: 12

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

 అదృశ్యమైన ఆత్మల ప్రపంచంలో కోరేషుని కంట్రోల్ చేస్తున్న ఒక ఆత్మ లేక పారశీకదేశాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకున్న ఒక దురాత్మల సమూహానికి అధిపతి, 21 రోజులు దేవుడు- కోరేషుని ఉపయోగించుకుని చేద్దామన్న తన కార్యాన్ని జరుగకుండా అడ్డుకున్నాడు! కాబట్టి ఇది మన ప్రార్ధనకు జవాబు రాకపోవడానికి మరో కారణమని గ్రహించండి. ప్రార్ధనకు జవాబు రావాలంటే ఉపవాస ప్రార్ధన , తర్వాత వినయం కలిగితగ్గింపు మనస్సు కలిగి చేసే ప్రార్ధన ఉంటే దేవుడు నీ ప్రార్ధనకు జవాబు ఎలాగైనా పంపిస్తారు. తర్వాత వచనాలలో మిఖాయేలుని పంపినట్లు.

 

  మన విషయానికి వద్దాం! కాబట్టి దేవునికి వ్యతిరేఖంగా దురాత్మల సమూహాలు పనిచేస్తున్నాయి అని గ్రహించాలి. ఇక తర్వాత వచనాలో గ్రీసు దేశం అధిపతి, లేక మరో దేశం అధిపతి అంటే దురాత్మల అధిపతి -- ఆకాశమండలంలో ఉన్న ఆ ప్రాంతానికి చెందిన దురాత్మల అధిపతి అని గ్రహించాలి. ఇక రాజు అని వ్రాయబడితే మాత్రం-అది రాజ్యానికి రాజు అని గ్రహించండి.

 

ఇక మరోవిషయం గమనించాలి- అదృశ్యంగా మనకోసం పోరాటం చేయడానికి దేవదూతలకు-దురాత్మల సమూహానికి నిత్యమూ అదృశ్యలోకంలో పోరాటం జరుగుతూ ఉంటుంది అని అర్ధం చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రార్ధన చేస్తే మన తరుపున పోరాటం చేసే దేవునిదూతకు ఎక్కువగా బలం కలుగుతూ ఉంటుంది అని నా ఉద్దేశం! అయితే దురాత్మల సమూహాలు ఏమిటో కావు- అవి పతనమైన దేవదూతల సమూహాలు. యెషయా 14:12--15; యెహేజ్కేలు 28:13--15;

 

ఇక 14వచనంలో దర్శనం ఎందుకు కలిగింది, దేవునిదూత ఎందుకు వచ్చాడో వివరంగా చెప్పాడు- అది నీ ప్రజలు అనగా ఇశ్రాయేలు వారికి రాబోయే దినాలలో ఏమి సంభవించబోతున్నాయో చెప్పడానికి వచ్చాడు. తర్వాత వచనాలలో దేవునిదూత మాట్లాడినా దానియేలు గారు సొమ్మసిల్లినట్లు, దూత బలపరచినట్లు చూస్తున్నాం.

 

20 వచనములో ఈ దూత మరలా చెబుతున్నాడు నేను ఎందుకు వచ్చానంటే నీప్రజలకు కలగబోయే విషయాలు నీకు చెబుదామని. ఈ విషయాలు చెప్పి నేను మరలా వెళ్లి నేను వదలి వచ్చిన పోరాటము, యుద్ధం చేస్తాను. అయితే సత్య గ్రంధంలో వ్రాయబడింది నీకు చెప్పి వెళ్తాను అంటున్నారు.

*సత్యగ్రంధము అంటే ఏమిటి? ఇది బహుశా దేవుడు నిర్ణయించిన జరుగబోయే సంగతులను రాసిపెట్టిన పరలోక గ్రంధం కావచ్చు!* ఇక ఆ గ్రంధంలో ఏముందో తర్వాత అధ్యాయాలలో ఉంది.

 

 ఇక 20వచనలో ఉదాహరించిన గ్రీకు దేశ అధిపతి అంటే ఆ దేశంలో తన దుష్ట సంకల్పం నెరవేర్చడానికి సైతాను నియమించిన దురాత్మల సమూహానికి అధిపతి అన్నమాట!

 

ఇక పదవ అధ్యాయం చివరలో అంటున్నాడు దేవునిదూత- నేను వెళ్ళి చేసే పోరాటంలో నాకు నీ ప్రజల అధికారియైన మిఖాయేలు మాత్రమే నాకు సహాయంగా ఉన్నాడు అంటున్నాడు. ప్రియ దేవునిబిడ్డా! నీకోసం పోరాడే దేవుడు ఉన్నారు.  అయితే నీవు ఎంత బలంగా  వినయం కలిగిన ప్రార్ధన చేస్తే నీ తరుపున దేవుడు తనదూతను పంపి యుద్ధాన్ని జరిపిస్తారు. యుధ్ధం యెహోవాదే!  దానియేలు గారికోసం తనదూతను పంపి విడిపించిన దేవుడు, పేతురు గారు చెరలో ఉండగా దూతను పంపి విడిపించిన దేవుడు నీకుకూడా తనదూతను పంపి నీ పక్షముగా యుద్ధం చేయగలరు. నీకోసమే కాదు, నీ ప్రజలకోసం కూడా! మరి నీవు సహాయంగా ప్రార్ధన చేస్తావా? అలా ప్రార్ధించినప్పుడే మొదటగా దేవునినుండి జవాబును పొందగలవు.  శత్రువులను జయించగలవు!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*దానియేలు-28-The Man of God*

*28వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-2*

 

       (గతభాగం తరువాయి)

దానియేలు 11:1—2...

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు... మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.

2. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

 

   ప్రియ దైవజనమా! దానియేలు గారి దర్శనాలను ధ్యానం చేసుకుంటున్నాము! ఈ అధ్యాయంలో 35వ వచనం వరకు పారశీక- మాదీయ సామ్రాజ్యంలో ఎంతమంది ఏలుతారు, గ్రీకు సామ్రాజ్యంలో ఏమి జరుగుతుంది. తన ప్రజలకు ఏమి జరుగబోతుంది అనేది దర్శనాత్మకంగా చెబుతున్నాడు దూత, ఇక తర్వాత 11:36 నుండి 12:4 వరకు యుగాంతంలో ఏమి జరుగబోతుంది అనేది చెప్పారు. ఆశ్చర్యరీతిలో దానియేలు గారు భవిష్యత్ ను తొంగిచూశారు. ఇక ఈ అధ్యాయం 11:2 నుండి 11:36 వరకు గల విషయాలు 362 సంవత్సారాలలో నెరవేరాయి.

 

   *గమనించాలి- ఈ భాగాలు కొంచెం బోరింగ్ గా ఉంటాయి, గాని ముందు జరుగబోయే విషయాలు దానియేలుగారికి దేవుడు బయలుపరచడం, అవి అలాగే ఉన్నదిఉన్నట్టు జరగడం సంభవించాయి. కాబట్టి దేవుడు భవిష్యత్ తెలిసిన వాడు, నీ కాలగతులు ముందుగానే దేవుని గ్రంధంలో వ్రాయబడి ఉన్నాయని, నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయని గ్రహించడానికి ఈభాగాలు ఉపయోగ పడతాయి. కాబట్టి ఓర్పుతో చదవమని మనవిచేస్తున్నాను*

 

  2వ వచనంలో చెబుతున్నారు- ఇంకా ముగ్గురు పారశీక రాజులు ఏలిన తర్వాత  ధనికుడైన నాలుగో రాజు వస్తాడు అంటున్నారు. అతడు తనకు కలిగిన ఐశ్వర్యం వలన గ్రీకు రాజుకి వ్యతిరేఖంగా పోరాటం చేస్తాడు అంటున్నారు. నిజంగా చరిత్రలో గమనిస్తే అంతకంటే ఎక్కువ రాజులు పాలన చేశారు గాని నలుగురు రాజులే పేరిన్నిక గలవారు. వారు మొదట ముగ్గురు రాజులు కంబైసిస్, సూడోస్మెర్దిస్, దర్యావేషు హిస్తాఫిస్. ఇక ఇక్కడ చెప్పబడిన నాలుగవ రాజు- ఆహాష్వేరోషు-2 . ఎస్తేరు గ్రంధంలో కనబడే రాజు ఈయనే. జాగ్రత్తగా ఆ ఎస్తేరు మొదటి అధ్యాయం గమనిస్తే ఆరునెలలు తన రాజ్యంలో ఉన్న అధిపతులందరికీ విందు చేశాడు. ఆరునెలలు విందు చేశాడు అంటే ఎంత ధనికుడు అనేది అర్ధం చేసుకోవచ్చు.

ఇక కోరేషు  చనిపోయిన 50 సంవత్సారాలుకి యితడు క్రీ.పూ 480 లో గ్రీకు దేశం మీద దండెత్తి ఓడిపోయాడు.

 

౩వ వచనంలో తర్వాత మహా పరాక్రమం గలరాజు లేక శూరుడైన ఒకరాజు పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని స్తాప్తిసాడు. అనగా రాజు అలగ్జాండర్ గ్రేట్ అన్నమాట. తన ఇష్టానుసారంగా పరిపాలన చేశాడు అలగ్జాండర్. క్రీ.పూ 336-23 వరకు పాలన చేశాడు.

 

4వ వచనంలో అతని రాజ్యం ఆకాశపు నలుదిక్కుల విభాగింప బడును అంటున్నారు అనగా అలగ్జాండర్ చనిపోయాక అతని నలుగురు జనరల్ లు/సైన్యాధికారులు రాజ్యాన్ని పాలించారు. గ్రీకు సామ్రాజ్యం నాలుగు ముక్కలయ్యింది అని గతంలో చెప్పడం జరిగింది. ఇక ఈ వచనంలో మరో విషయం- అతని రాజ్యం అతని సంతానం పొందరు గాని అన్యులు పొందుతారు అన్నారు. అది నిజంగానే జరిగింది. అలగ్జాండర్ చనిపోయేనాటికి అతని కొడుకు చిన్నవాడు. కొంతకాలం తర్వాత కొడుకు తనతండ్రి రాజ్యం అడుగుతాడేమో అని అలగ్జాండర్ కొడుకిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఈ జనరల్లు.

 

5. అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. . గతంలో చెప్పడం జరిగింది- ఈ నాలుగు జనరల్ లలో ఇద్దరు బలవంతులుగా ఎక్కువ సామ్రాజ్యాని ఏలుతారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఎన్నో తగాదాలు జరిగాయి. 5వచనం నుండి 34 వచనాలలో గల చరిత్ర గ్రీకు సామ్రాజ్యంలో ఆధిపత్యం కోసం జరిగిన యుద్దాలు కుట్రలు చూడవచ్చు. ఇక ఇక్కడ దక్షిణ రాజు అనగా దక్షిణం ప్రాంతాన్ని అనగా ఈజిప్టు ను ఏలిన రాజు, ఉత్తర రాజు అనగా సిరియాను, బబులోనును ఏలిన రాజు. దక్షిణ రాజు అనగా టాలెమీసోటేర్ (ప్టోలెమీ). ఇతడు మాసిదోనియాకు చెందినవాడు. ఉత్తరం రాజు అనగా సెల్యూకస్. ఈ రెండు రాజ్యాల మధ్యలోనే ఇజ్రాయేలు దేశముంది. అందుకనే వీరిద్దరూ మధ్య జరిగిన యుద్దాల వలన ఎక్కువగా నష్టపోయింది- ప్రభావితమయ్యింది ఇజ్రాయేలు దేశమే!

 

6వ వచనం. కొన్ని రోజులు పోయాక వీరిద్దరి మధ్య సంధి కుదురుతుంది.

6. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు. 

ఇక్కడ దక్షిణ రాజు కుమార్తె అనగా బెర్నికే! అయితే జరిగిన సంధి ఏమిటంటే దక్షిణం రాజు కూతురుని అంతియోకాస్-2 కి ఇచ్చి పెళ్లి చేయడానికి సంది కుదిరింది. తద్వారా రాజ్యాన్ని ఇద్దరు సరిసమానంగా పంచుకుంటారు. అయితే దానికి ఒక మెలిక. ఏమిటంటే అంతియోకాస్-2  కి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ఆమె పేరు లావోడేస్. కాబట్టి దక్షిణ రాజు కుమార్తె ను అనగా బెర్నేకే ని ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే మొదటగా లావోడేస్ కి విడాకులు ఇచ్చి అప్పుడు బెర్నికే ను వివాహం చేసుకోవాలి. అలాగే అంతియోకాస్-2  లావోడేస్ కి విడాకులు ఇచ్చి, అవివాహిత అయిన బెర్నికేని పెళ్లి చేసుకున్నాడు.

గమనించాలి- పూర్వకాలంలో ఇదే రాజనీతి-యుద్దనీతి. కేవలం ఆ దేశాలలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి రాజనీతి ఉండేది. శత్రువుల మధ్య యుద్ధంలో సంది కుదరాలంటే ఏదైనా ప్రాంతాన్ని గాని, ధనము గాని లేక వివాహం ద్వారా అనగా ఒకరాజు కుమార్తెను మరొక రాజుకి ఇచ్చేవారు- ఆ కుమార్తె వయస్సుతో సంభందం లేకుండా.

 

ఇక 7 వచనం-యొక్క భావం ఏమిటంటే: వివాహం జరిగాక అంతియోకాస్-2  ఆమెను తన రాజ్యానికి తీసుకుని పోతాడు. బెర్నీకే కి ఒక కుమారుడు కూడా పుడతాడు. గాని కొంతకాలమయ్యాక అంతియోకాస్-2  బెర్నికేకు విడాకులు ఇచ్చేస్తాడు. ఆమె అంటే ఇతనికి ఇష్టం ఉండదు. విడాకులు ఇచ్చి- తన పాత భార్య- లావోడేస్ ని తిరిగి వివాహం చేసుకుంటాడు. లావోడేస్- వీడు రాజ్యం కోసం నన్ను వదలి బెర్నేకి ని పెళ్ళిచేసుకున్నాడు, మరలా ఎన్ని నాటకాలు ఆడుతాడో అనుకుని మొదటగా బెర్నికే ని, ఆమెకు పుట్టిన కొడుకుని హత్య చేయిస్తాది. తర్వాత అంతియోకాస్-2 ని తనే హత్య చేసింది అంటారు. అంతియోకాస్-2  నే కాదు, తనకు సహాయం చేసిన ప్రతీ ఒక్కరిని చంపుతుంది. అప్పుడు రాజ్యం- లావోడేస్ కొడుకు టాలెమీ- కి దక్కుతుంది. యితడు ఉత్తరం దేశపు రాజు కొడుకు అయిన సెల్యూకస్- యుద్దానికి వెళ్తాడు సిరియాకి. అక్కడ టాలెమీ- గెలిచి అక్కడున్న విగ్రహాలను, వెండిబంగారాలు దోచుకొని ఈజిప్టు వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు సిరియా రాజుకంటే గొప్పగా, ఎక్కువ ప్రాంతాలను పాలిస్తాడు.

 

911 : అప్పుడు సెల్యూకస్-౩ ఈజిప్టు మీదకు యుద్దానికి వెళ్ళాడు గాని గెలవకుండా తిరిగి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలకు అతని కొడుకులు అనగా సెల్యూకస్-౩ కొడుకులు సెల్యూకస్-4, అంతియోకాస్-౩ లు గొప్ప సైన్యాన్ని సమకూర్చి మరలా ఈజిప్తుకి వచ్చి మహా ఘోరమైన యుద్ధం చేశారు. అప్పటికి ఆ దక్షిణ దేశపు రాజు టాలెమీ-4 అంతియోకాస్-౩ రఫియా దగ్గర యుద్ధం చేసి ఓడిస్తాడు. ఆ యుద్ధం లో కొన్ని వేలమంది చనిపోతారు.

 

అయితే 13—14: ఆనందం టాలెమీ-4 లు ఎక్కువ కాలం ఉండదు కారణం అంతియోకాస్- ఇంకా ఎక్కువ సైన్యాన్ని, వేరొక అద్దెకు తెచ్చుకున్న సైన్యాన్ని వెంటబెట్టుకొని మరలా టాలెమీ-4 మీదకు ఈజిప్టుకు యుద్దానికి వస్తాడు. అయితే అప్పటికి టాలెమీ-4  చనిపోయి, అతని కుమారుడు టాలెమీ-5 రాజయ్యాడు. అప్పుడు అనేక దేశాలు కలిసి ఈజిప్టు మీదకు వ్యతిరేఖంగా కూడి యుద్దానికి వస్తారు. అప్పుడు నీ ప్రజలు అనగా యూదులలో కొంతమంది  వీరితో అనగా ఉత్తర దేశం రాజుతో కలుస్తారు. ఇక్కడ నీ ప్రజలలో బందిపోటు దొంగలు దర్శనమును నెరవేర్చుకోడానికి వీరితో కూడుదురు గాని నిలవలేక పోదురు- దీని అర్ధం ఏమిటంటే: బందిపోటు దొంగలుఅనగా మిగతా ప్రతులలో బలత్కారులు అని తర్జుమా చేయబడింది. బలత్కారులు అనగా బహుశా- మక్కాబీలు కావచ్చు. అప్పుడే వీరు తమ దేశ స్వాతంత్ర్యము కోసం తిరుగుబాటు మొదలుపెట్టారు. బహుశా బరబ్బా కూడా పార్టీకి చెందినవాడే! అయితే ఓడిపోవుదురు అని వ్రాసినట్లు ఓడిపోయారు.

 

1516 : అయితే ఈలోగా సిరియా రాజు అనగా ఉత్తరదేశపు రాజు, ప్రాకారముల పట్టణాన్ని పట్టుకుంటాడు అనగా కొంతమంది అభిప్రాయం సీదోనుని గెలిచాడు అంటారు. మరికొంతమంది సైప్రస్ ని (కుప్ర) ని గెలిచాడు అంటారు. అప్పుడు వచ్చినరాజు అనగా అంతియోకాస్-౩ తనకు ఇష్టమొచ్చినట్లు పాలనచేసి అనేకులను చంపుతాడు. కొన్ని సంవత్సారాలు ఆనందదేశం అనగా ఇశ్రాయేలు దేశంలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత సిరియా వెళ్లి ఎక్కువమంది సైన్యాన్ని పోగుచేసుకుని వచ్చి ఈజిప్టు రాజు టాలెమీ-5 తో యుద్ధం చెయ్యాలని అనుకుని తన దేశం వెళ్తాడు. ఈలోగా ప్రజలు చెప్పినమాటలు విని టాలెమీ-5ని యుక్తిగా చంపాలని తన కుమార్తె క్లియోపాత్రను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు సంది కుదురుతుంది ఇద్దరిమద్య! ఇక్కడ మీరు ప్రాచీన చరిత్ర చదివితే క్లియోపాత్రా అందం కోసం, మోసం కోసం మీకు అర్ధం అవుతుంది. ఈమె కోసం యుద్దాలు జరిగాయి. క్లియోపాత్రకు టాలెమీ-5 అంటే ఇష్టం ఉండక కాపురం చెయ్యదు. అందుకే టాలెమీ-5 కి కోపం వచ్చి చాలా ఘోరమైన కార్యాలు చేస్తాడు. అనేకులను గెలుస్తాడు.

 

ఇక 18వచనంలో కనబడే అధిపతి- సేనాధిపతి స్కిపియా ఆసియాటిక్ అనే రోమా నాయకుడు, ఇతని పక్షంగా యుద్ధం చేసి పగతీర్చుకుంటాడు. అప్పుడు అంతియోకాస్ తనదేశంలోకి వెళ్లి క్రీ.పూ 187 ఎలిమయాస్ అనే ప్రాంతంలో మరణిస్తాడు.

 

20.వచనం: అతనకి మారుగా అధికారానికి వచ్చినవాడు సెల్యూకస్-5. ఇతను ఘనమైన రాజ్యాన్ని స్తాపించాడు. పన్నులు అనే విధానాన్ని తీసుకుని వచ్చాడు. అయితే కొన్ని దినాలకు రోగంతో చనిపోతాడు.

(ఇంకాఉంది)

*దానియేలు-29-The Man of God*

*29వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-*

 

దానియేలు 11:21-25...

 

                       (గతభాగం తరువాయి)

 

   ఇక 21 వచనంల్ ఉన్న వ్యక్తి- ఇతనిని నీచుడు అని బైబిల్ ఉదాహరించింది. అనగా ఎంతనీచుడో అర్ధమవుతుంది. వీడు అంతియోకాస్ -4 లేక అంతియోకాస్ ఎపిఫానిస్ అని పేరు. దానియేలు 8:913, 2325 వచనాలు వీడికోసమే వ్రాయబడింది. నిజానికి అంతియోకాస్-౩ కి కుమారుడు ఉన్నా, అతడు బాల్యంలో ఉన్నాడని ఇచ్చకపు మాటలు చెప్పి అన్యాయంగా రాజ్యాన్ని సంపాదించుకుని అతనిని హతమారుస్తాడు. ఇక వీడు యూదులను చిత్ర హింసలు పెట్టాడు. మొదట్లో వీడితో పాటు వచ్చిన అధికారులను, రాజులను కూడా మోసం చేస్తాడు. ఇలా నెమ్మదినెమ్మదిగా గొప్ప రాజ్యాన్ని సంపాదించాడు. 24...Daniel(దానియేలు) 11:24

అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయని దానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును.

అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును  నెమ్మది కాలంలో ఎవరైతే ఎక్కడైతే ధనవంతులైన వారు ఉంటారో ఆరాజ్యాన్ని ప్రాంతాన్ని ఆక్రమించి, ఆ ధనాన్ని తన సైనికులకు అధిపతులకు పంచేవాడు.

 

25 వచనం: తర్వాత గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని దక్షిణరాజు అనగా టాలెమీ-6 తో యుద్దానికి వెళ్తాడు. అయితే టాలెమీ-6 కూడా అంతకంటే గొప్ప సైన్యాన్ని సమకూర్చి యుద్దానికి వెళ్తారు. అయితే వీడు నీచుడు కదా అంతియోకాస్-4, వీడు చేసిన కుయుక్తులు వలన టాలెమీ-6 సైన్యంలో కొందరు అతనికి వ్యతిరేఖంగా కుట్రలు పన్నడం వలన టాలెమీ-6 ఓడిపోయాడు. కొన్ని లక్షలమంది చనిపోతారు.

 

27. ఆ ఇద్దరు రాజులు అనగా అంతియోకాస్ ఎపిఫానిస్, టాలెమీ-6 ఒకే బల్లదగ్గర కూర్చుని భోజనం చేసి పైకి సంది బేరాలు ఆడుతారు గాని ఏమి లాభం ఉండదు. అయితే సంగతి నిర్ణీత కాలంలో అంతం అవుతుంది అనగా ఇది దేవుడు నిర్ణయించిన సమయానికి జరుగుతుంది.

 

దానియేలు 11: 28

అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.

..అప్పుడు ఈ నీచుడు గొప్ప ధనం (దోపుడు సొమ్ము) తీసుకుని తన దేశానికి వెళ్తాడు. మధ్యదారిలో తన నిభందన అనగా దానినే పరిశుద్ద నిబంధన- అన్నారు-దీనికోసం రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటిది: దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన మరియు ధర్మశాస్త్రము. రెండవ అభిప్రాయం:  వాడు గెలిస్తే యూదులకు సహాయం చేస్తానని మాటవరుసకు అన్నాడు కుయుక్తిగా. దానిని ఉల్లంఘించి కొన్నివేలమంది యూదులను హతం చేశాడు. యేరూషలేము దేశంలో దొరికిన సొమ్ము, ఆలయంలో ఉన్న సొమ్ము మొత్తం దోచుకుని పోయాడు. ఇది క్రీ.పూ. 169 లో జరిగింది.

 

29. నిర్ణీత కాలం అనగా దేవుడు అంతియోకస్ ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చడానికి నిర్ణయించిన కాలములో వీడు మరలా సిరియా రాజు మీదకు వెళ్ళాడు. కాని ఉపయోగం ఉండదు.

౩౦. కిత్తీయులు ఓడలు అనగా కిత్తీము నుండి అనగా రోమా సామ్రాజ్యం నుండి ఓడల మీద సైన్యం వస్తుంది- వారికి నాయకుడు పాపిలియస్ లాయినాస్. రోమా సైన్యం వచ్చినందువలన అంతియోకాస్-ఎపిఫానిస్ ఓడిపోయి- ఆ కోపంతో ఇశ్రాయేలు దేశం వచ్చి దేవాలయాన్ని పాడుచేసి, బలులను చేయకుండా అపవిత్ర పరచి, ఆటంకపరుస్తాడు. అయితే అనేకులైన యూదులు తిరుగబడతారు. కొంతమంది బ్రష్టులైన యూదులు అతనితో కలుసుకుంటారు. అప్పుడు వీడు క్రీ.పూ 168 లో యేరూషలెం వచ్చి దానిని ఆక్రమించుకునేందుకు సైన్యాన్ని పంపాడు. అదికూడా విశ్రాంతిదినాన. విశ్రాంతి దినాన యూదులు యుద్ధం చెయ్యరు. గమనించాలి- పూర్వకాలంలో యుద్ధనీతిరాత్రిపూట గాని, కొన్ని ప్రత్యేకదినములలో ఒడంబడిక ప్రకారం యుద్ధం విరమిస్తారు. వీడికి యూదులు విశ్రాంతి దినాన యుద్ధం చేయరు. ఏ పని చేయరు అని తెలిసికూడా విశ్రాంతి దినాన్న హటాత్తుగా సైన్యాన్ని పంపి, అనేకమందిని చంపించి, పిల్లలను స్త్రీలను చెరలోనికి తీసుకునిపోయాడు. దేవాలయం వారి హస్తగతమయ్యింది. ఇక ఈ దేవాలయంలో బలులు అర్పించకూడదు అని ఆజ్ఞ జారీచేశాడు. ఎందుకైనా మంచిది అని దేవాలయంలో దేవుని బలిపీటం మీద పంది రక్తాన్ని అర్పించి, గ్రీకు దేవతయైన జూస్ విగ్రహాన్ని పెట్టించాడు. ఇది మూడు సంవత్సరాలు కంటే ఎక్కువ అనగా 1150 రోజులు జరిగింది. అయితే గమనించాలి- మత్తయి 24:15 లో యేసయ్య చెప్పిన నాశనకరమైన హేయవస్తువు ఇది కాదు అని గ్రహించాలి.....

కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక......

 కారణం ఇది యేసుక్రీస్తుప్రభులవారు ఈ భూలోకానికి రాకముందే ఒకసారి జరిగింది అని గ్రహించాలి. అందుకే చదువువారు గ్రహించుదురు గాక అన్నారు. ఇది అనగా మత్తయి 24:15 యుగాంతంలో మరల ఇంకోసారి జరుగబోతుంది. దానియేలు 9:27; 12:11...

11. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినములగును. ;

 

32.....

32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు. .

ఎందుకు ఇలా వ్రాయబడింది అంటే: అప్పుడు యూదులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బ్రష్టులు, దుర్మార్గులు అంతియోకాస్ ఎపిఫానిస్ కి లొంగిపోయారు. వాడితో కలిసిపోయారు. మిగిలిన వారు ఎదిరించారు. ప్రజలకు సత్యాన్ని వివరించారు. వాడునిజంగా ఏమి చేస్తున్నాడో గ్రహించమని ధైర్యంగా అందరికీ భోదించడం మొదలుపెట్టారు. ఈ కాలంలో మనం సువార్తను ప్రకటిస్తున్నట్లు. అప్పుడు యూదులమీద భయంకరమైన హింసలు బయలుదేరాయి. వీరు దేవునికోసం, సత్యం కోసం శ్రమలునైనా భరించారు గాని వాడిని వాడి క్రియలను సహించక ఎదిరించారు. గమనించాలి దానికోసమే హెబ్రీ 11:36—38 వరకు ఉన్న విషయాలు జరిగాయి అంటారు. మనకు 11 వ అధ్యాయంలో విశ్వాసవీరుల పట్టీ ఉంది. దానిక్రిందన ఉదాహరించబడిన వారు వీరే అంటారు. హెబ్రీయులకు 11:36,37,38

36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి.

37. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,

38. అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. .......... 

 

 మరలా 32 చివరిమాట చూద్దాం : అయితే తమదేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. అవును ప్రియ సహోదరి/ సహోదరుడా! నీవు నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటే, ఆయన నిజంగా ఎవరు- ఆయన శక్తి ఏమిటో తెలుసుకుని ఆయనకు విదేయుడవై మెలిగితే దేవుడు నిన్ను ఉపయోగించుకుంటారు. అప్పుడు నీవు గొప్పకార్యాలు చేయగలవు- దానియేలు గారు సింహపు బోనులో సజీవంగా ఉన్నట్లు, సింహములను ఎదిరించినట్లు, అగ్నిబలం చల్లార్చినట్లు ఇలాంటివి నీవుకూడా చేయగలవు.

౩౩...... దానియేలు 11: 33

జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడు దురు.

 గమనించాలి- బుద్ధిమంతులు అనేకులకు భోధిస్తారు. దానికి వచ్చే ప్రతిఫలం మొదటగా అనేకదినాలు ఖడ్గము వలనను, అగ్నివలన కృంగిపోతారు కారణం వారు పెట్టు శ్రమలు. గాని వారికి కొద్దిగా స్వల్ప సహాయం దొరుకుతుంది. తర్వాత వచనాలలో కొంతమంది కపటమైన ఆలోచన కలిగి వీరితో చేరారు. ఇలాంటి కపటమైన వారు ఆ నాటినుండి ఈనాటి వరకు ఉన్నారు.

 

35.....దానియేలు 11: 35

నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీ లించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.

   ఇక్కడ నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు అనగా యుగాంతం వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటున్నారు. గమనించాలి కేవలం అంతియోకాస్ ఎపిఫానిస్ మాత్రమే కాకుండా అనేకులు యూదులను హింసించారు. పాపిలియస్, పాంపే అనేవాడు, డొమిషియాస్, నీరో, అగష్టస్ సీజర్, హిట్లర్, టైటస్ అనేవాడు ఇలా చాలాచాలా మంది యూదులకు వ్యతిరేఖమైన కార్యాలు చేసి వారిని హింసించారు. ఇక ఈ వచనం ప్రకారం అంత్యకాలం వరకు అనగా యుగాంతం వరకు జరుగుతూనే ఉంటుంది అని గ్రహించాలి.

 

  ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన మరో విషయం: జనులను పరిశీలించుటకు, పవిత్ర పరచుటకు అనేమాటలు: ఇలా జనులను పరిశీలించడం అనగా శ్రమలు ద్వారా, శోధనల ద్వారా పయనించడం లేదా వాటిని విశ్వాసి జీవితంలో ఆమోదించడం ద్వారా దేవుడు వారిని మరింత పదును పెడుతున్నారు అని అర్ధం చేసుకోవాలి. వారి విశ్వాస జీవితంలో ఒక్కోమెట్టు మీదకు ఎక్కిస్తున్నారు దేవుడు అని గ్రహించాలి. ఇంకోమాట పవిత్ర పరచుటకు- అనగా బంగారం వెండి ముందు శోధన కొలిమిలో వేసి కాల్చిన తర్వాత ఆ కొలిమిలో  వెండిబంగారాలలో ఉన్న మలినం పోయి శుద్ధమైనట్టు విశ్వాసి కూడా ఈ శోధన కొలిమిలో పరిశీలించబడిన తర్వాత పవిత్రంగా శుద్ధంగా దేవునికి వాడబడే పాత్రగా మారగలరు.

యోబు 23: 10

నేను నడచుమార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.

 

         కాబట్టి ప్రియమైన విశ్వాసి నీవుకూడా శ్రమల సుడిగుండంలో చిక్కుకు పోయావా ? నిరాశపడకు! దేవునిమీద ఆనుకో! ఎప్పుడైతే నీవు బలహీనతలో దేవునిమీద ఆనుకుంటావో అప్పుడు దేవునిలో ఉన్న బలాన్ని నీవు గ్రహించగలవు.

యెషయా 40:31.

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

 కీర్తన 66:10—12...;

10. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.

11. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుములమీద గొప్పభారము పెట్టితివి.

12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృధ్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.

 

ప్రియ దేవుని జనమా! దేవునిమీద ఆనుకుందాం!

శ్రమలను సహిద్దాం!

దేవునికోరకు సాక్షులమై జీవిద్దాం!

దైవాశీస్సులు!

(ఇంకా ఉంది).

 

 

  

 

*దానియేలు-౩౦-The Man of God*

*30వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-4*

 

Daniel(దానియేలు) 11:36,37,38

36. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.

37. అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.

38. అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి,ఆ దేవతను ఘనపరచును.

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియ దైవజనమా! 11:35 వరకు 362 సంవత్సారాల కాలంలో పారశీక- గ్రీకు సామ్రాజ్యాల వలన ప్రపంచంలో ఏమిజరుగుతుందో మనం గతభాగంలో చూసుకున్నాం. అయితే ఇక 36 నుండి 12 అధ్యాయం చివరి వరకు అంత్యకాలంలో లేక యుగాంతంలో ఏమి జరుగబోతుందో వ్రాయబడి ఉన్నాయి అని గ్రహించాలి. గమనించాలి- దానియేలుగారి దర్శనాలలో, యేహెజ్కేలుగారి దర్శనాలలో కొన్ని అలాగే మధ్యలో ఆపివేసి- యుగాంతం/ అంత్యకాలమునకు వెళ్ళిపోయాయి. ఇక్కడ కూడా అంతియోకాస్-4 తో ఆగిపోయి అంత్యకాలమునకు వెళ్ళిపోయింది.

 

3638 ...  ఇక్కడ ఆ రాజు అంటున్నారు- ఆ రాజు అంతియోకాస్ ఎపిఫానిస్ మాత్రము కాదు. ఇక్కడ ఈరాజు 36,37 లో చేసినట్టు అంతియోకాస్ దేవతల కంటే తననుతాను హెచ్చించుకోలేదు. తన జూస్ దేవతను ఘనపరిచాడు వాడు. ఇంకా 44,45 వచనాలలో వచ్చిన మరణం వంటి చావు వీడికి రాలేదు. కాబట్టి ఇక్కడ చెప్పబడిన రాజు వాడు కాదు. బహుశా అంత్యదినాలలో రాబోయే ఒకరాజు.

ఇక 36 ప్రకారం ఈ రాజు ఈ క్రింద ఉదహరించిన రిఫరెన్సులకు సూచిస్తున్నాడు. అనగా క్రీస్తువిరోధిని సూచిస్తున్నాడు.

దానియేలు 7:8

నేను ఈ కొమ్ము లను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

 

రెండవ థెస్సలొనీకయులకు 2:3,4

3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. ...;

ప్రకటన 13:5—6

5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పాటాయెను(లేక, నలుపదిరెండు నెలలు ఉండుటకు దాని కధికార మియ్యబడెను)

6. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

 

ఇక్కడ పాపం యొక్క ఫలితం మనకు కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్లు జరిగించడం, తనగురుంచి తానూ గొప్పలు చెప్పుకోవడం ఇలాంటివి అక్కడ కూడా జరిగింది. ఇక ఏదేను వనంలో ఆదాముహవ్వలు చేసిన ఒక స్వేచ్చాపూర్వక క్రియతో ప్రారంభమైన పాపం యుగాంతంలో అంతమవుతుంది. యుగాంతంలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు వాడు తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. డంబాలు పలుకుతాడు. వాడికి లోకంలో అనేకులు వంగివంగి దండాలు పెడతారు.

 

ఇక వచనంలో ఉగ్రత సమాప్తి అయ్యేవరకు/ కోపకాలం అనగా దేవుడు చెప్పిన ప్రతిదండన కాలం! దానికోసం బోలెడు రిఫరెన్సులు ఉన్నాయి.యెషయా 26:20—21; ౩౦:27—28; 4:2; యిర్మియా ౩౦:4—8; దానియేలు 8:19; 12:1; యోవేలు :12—16; మత్తయి 24:21—22;

 

ఇక 37 వచనంలో ఉదహరించబడినవాడు బ్రష్టుడైన క్రైస్తవుడు గాని బ్రష్టుడైన యూదుడు గాని అయి ఉంటాడు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం!

ఇక 38వచనం : ప్రాకారాల దేవత అనగా యుద్దంలో తనకు విజయం ఇచ్చే దేవత అనిగాని, లేక ఎవరివలన తనకు అత్యధికంగా విజయాలు కలుగుతున్నాయో వ్యక్తిని గౌరవిస్తాడు. 36,37 ప్రకారం రాజు 2థెస్స 2:—4 లోని న్యాయవిరోది, క్రీస్తువిరోది. ప్రకటన 13 అధ్యాయంలో కనబడే మృగాలలో రెండవ మృగానికి అనగా అబద్ద ప్రవక్తకు సాదృశ్యమై ఉండవచ్చు. కారణం అక్కడ మృగం మొదటి మృగానికి పూజించమని బలవంతం చేస్తూ అధ్బుతాలు చేస్తుంది.

 

39 ..దానియేలు 11: 39

మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహా ఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వ మిచ్చును.

 ఈ వచనంలో కనబడే దేశం బహుశా ఇశ్రాయేలు దేశమే కావచ్చు.

 

40..... దానియేలు 11: 40

అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

ఈ వచనంలో వ్రాయబడిన ఉత్తరం రాజు – 36వ వచనంలో చెప్పబడిన రాజు ఒకరే కావచ్చు. కాకపోవచ్చు కూడా. కారణం ఈ వచనం హీబ్రూ బాషలో స్పష్టముగా రాయబడలేదు అంటారు. అయితే ఇక్కడ ఎన్నో విజయాలు సాధిస్తున్నాడు కాబట్టి ఆ రాజే అయి ఉంటాడు అనుకోవచ్చు. ఒకసారి ప్రకటన 6:2; 13:4,7 వచనాలు పోల్చి చూడండి.

 

4143.

41. అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతని చేతిలోనుండి తప్పించు కొనెదరు.

42. అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.

43. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును. .

 

41 లో చెప్పబడిన ఆనందదేశం ఇశ్రాయేలు దేశమే. యుగాంతంలో కూడా మరల ఇశ్రాయేలు దేశం మీద దండెత్తుతారు. ఇక అక్కడ చెప్పబడిన మోయాబు, ఎదోము, అమ్మోను  వీరందరూ ఇశ్రాయేలు దేశానికి తూర్పుగా, ఆగ్నేయం వైపు ఉన్న దేశాలే. కాబట్టి వీరిలో ముఖ్యులు మాత్రమే ఆ రాజు చేతిలోనుండి తప్పించుకుంటారు. కూషు అనగా ఇథియోపియా లో ఉండే కూషు కాదు, టర్కీ లో ఉన్న కూషు.

 

(ఇంకాఉంది)

*దానియేలు-1-The Man of God*

*31వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-5*

 

     (గతభాగం తరువాయి)

 

44.......దానియేలు 11: 44

అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.

 

 ఇక్కడ తూర్పు నుండి, ఉత్తరం నుండి వచ్చిన వార్తల వలన చాలా కలవరపడినట్లు చూస్తున్నాం.

 

మొదటగా ఉత్తర తూర్పు దిక్కులనుండి వార్తలు వచ్చి కలవరపరచి ఉండొచ్చు?

బహుశా ఆత్మీయార్దంగా ఇవి కావచ్చు!

 

1) కీర్తనలు 48: 2

ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోటనుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది.

 

2) ఇక తూర్పు:

మత్తయి 2: 2

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

మొదటగా అది యేసుక్రీస్తు ప్రభులవారిని సూచిస్తుంది.

 

రెండవది: మలాకీ 4: 2,3

అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.

నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభులవారు నీతి సూర్యుడు. కాబట్టి తూర్పు అనగా ఆత్మీయ అర్థంగా క్రీస్తు ఉండే చోటుగా చూసుకోవచ్చు.

 

ఇంకా చివరిగా: ఆదికాండము 2: 8

దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.

 

ఏదెను సంఘానికి గుర్తు. అయితే సంఘాన్ని సాతానుగాడు అవునా ఇది నిజమా అని చెప్పి పాడుచేశాడు. అయితే ఇది మన పాటము కాదు కాబట్టి ఇంతటితో వదిలేద్దాం. అయితే అది సంఘానికి గుర్తు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.

 

కాబట్టి ఇక్కడ వీడిని కలవరపరచిన వారు మొదటగా రారాజు పట్టణమైన పరమ సీయోను, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభులవారు, ఇంకా ఆయన సంఘము, ఆయన బిడ్డలు (ఇశ్రాయేలు ప్రజలతో సహా). ప్రకటన గ్రంథం 12: 17

అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.

 

అందుకే వాడు రెచ్చిపోయి అందరినీ సమకూర్చు తున్నాడు యుద్దానికి. దిక్కునుండి వాడికి సమస్యలు వచ్చాయో అదే దిక్కున ఉన్న వాడి అనుచరులను దేశాలను బ్రమపెట్టి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కూర్చుతున్నాడు. గమనించాలి ఇశ్రాయేలు బిడ్డలను ఎక్కువగా బాధించింది ఉత్తర దిక్కున ఉన్నవారే! అందుకే వారు చెరపట్టక మునుపే ఉత్తర దిక్కునుండి కీడు వస్తుంది అని యెషయా ద్వారా, యిర్మియా ద్వారా, యెహేజ్కేలు ద్వారా ఇంకా అనేకమంది ప్రవక్తల ద్వారా పలికించారు. యిర్మియా 1:13; 6:1; యెహేజ్కేలు 1:4; అందుకే వీరికి దేవుడు తీర్పుతీర్చారు. ఇంకా తీర్చబోతున్నారు. జెకర్యా ప్రకారం ఉత్తర దిక్కునకు దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నారో చెప్పారు. జెకర్యా 6:6,8.

అందుకే వీడు దిక్కున ఉన్న అనుచరులను తీసుకుని వస్తున్నాడు.

 

అయితే ఉత్తర తూర్పు దేశాల కోసం చూస్తే: యేహెజ్కేలు 38:1—9 లో ఉన్న దేశాలు .........

 

యెహేజ్కేలు 38:2 నరపుత్రుడా! మాగోగు దేశపు వాడైన గోగు. . .అనగా మాగోగు దేశానికి గోగు అనేవాడు అధిపతిగా ఉన్నాడు! మాగోగు ఆదికాండం 10:2 లో కనిపిస్తుంది. యాపేతు కుమారులలో మనకు మాగోగు, మెషెకు, తుబాలు కనిపిస్తారు. వీరు అన్నదమ్ములు! వీరు కనాను దేశానికి ఉత్తరాన స్తిరపడ్డారు! 2000 సం. క్రితం చరిత్రకారుడు జోషేఫెస్ ఇలా రాసాడు- మాగోగు అంటే నల్ల సముద్రం (black sea) అవతల ఉత్తరంగా నివసించే ఒక సిథియ జాతికి చెందిన అనాగరికమైన ఒక జాతి అన్నాడు. 

నరపుత్రుడా! నీవు మాగోగు వైపు, ఇంకా రోషుకు, తుబాలు, మెషెకుకి అధిపతియైన గోగువైపు ముఖం త్రిప్పి . . అంటున్నారు. రోషు అనగా రష్యా! అదికూడా నల్లసముద్రానికి ఉత్తరంగా ఉంది!  ఇక మెషెకు, తుబాలు దాని ప్రక్కపక్కనే ఉండే దేశాలు కావచ్చు!. ప్రస్తుతం మెషెకు- తుబాలు అనగా టర్కీ దేశానికి తూర్పున నివసించే కొన్ని జాతులు అంటారు. అయితే 2 వచనం ప్రకారం వీరందరికీ గోగు అధిపతి అవుతాడు. అనగా వీరంతా కలసి ఒక కూటమిగా ఏర్పడి గోగుని ప్రతినిధిగా నియమించి అతనికి అధికారం ఇస్తారు! ప్రకటన 20:8 లోనూ ఇదే విషయం వ్రాయబడింది.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. . . . 

 

      దీని భావం ఏమిటంటే గోగుమాగోగులు తిరుగుబాటు చేసిన ప్రపంచదేశాలకు ప్రతినిధులుగా ఉన్నారు. బహుశా వీరు ముస్లిం దేశాలతో కలవవచ్చు! లేదా ఐక్యరాజ్య సమితే వ్యతిరేఖి కావచ్చు! ఏం జరుగబోతుందో మనకు తెలియదు గాని ప్రపంచమంతా ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేఖంగా మారుతుంది అని మాత్రం అర్ధం అవుతుంది. 3వ వచనంలో నేను మీకు విరోధిని అని వ్రాయబడింది- ఎందుకంటే వారు దేవునికి భయపడక, ఆయనమీద, ఆయన స్వాస్త్యము మీద తిరుగుబాటు చేస్తున్నారు! ఎంతమంది కలసినా దేవుని సార్వభౌమత్వాన్ని, సర్వాధిపత్యాన్ని ఎదిరించలేరు! అందుకే దేవుడు నీ దవడకు గాలంవేసి నిన్ను నీ సైన్యాన్ని బయటకి రప్పిస్తాను, నీతోపాటు, నీ గుర్రాలు, సైన్యం, రధాలు (అనగా కూటమి), అందరిని మహా సైన్యంగా కూరుస్తాను! ఇంకా నీతోపాటు అనేకజనాలు వస్తాయి. అవి ఏమిటంటే పారశీకులు (అనగా పర్షియా, అనగా నేటి ఇరాన్), కూషు, పూత్ లు.

బైబిల్లో రెండు కూషులు, రెండు పూతులు ఉన్నాయి. మోషేగారు కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈ కూషుదేశం నేటి ఇథియోపియా! అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్నది కూషు ప్రాంతం! ప్రస్తుతం ఇరాక్ లో ఉన్న పురాతన కూషు! ఇక పూత్: ఒకటి లిబియాలో ఉంది. అదికాదు ఇక్కడ ప్రస్తావించినది. ఆసియాలో ఉన్న ఇరాక్ లోని కూషు ప్రాంతానికి ప్రక్కన ఉన్న పురాతన పూత్ ప్రాంతం! వీరంతా యుద్ధసన్నద్ధులై వస్తారు. ఇక 6వ వచనంలో గోమెరు దేశ సైన్యాలు, తోగార్మా సైన్యాలు వస్తాయి అని వ్రాయబడింది. గోమెరు అనగా ఆదికాండం 10:3 లో గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా. వీరుకూడా నల్ల సముద్రానికి ఉత్తరంగా అనగా రష్యా దేశంలో ఒక భాగం లేదా ప్రక్కన ఉన్న దేశాలు కావచ్చు!

 

    7వ వచనం ప్రకారం ఉత్తరాన గల దేశాలు బ్రహ్మాండమైన కూటమిగా ఏర్పడతాయి, దానికి నాయకుడు గోగు ఉంటాడు!

 

ఇంకా ప్రకటన 16:12—16 ఇక్కడ హర్మెగిద్దోన్ ప్రాంతములో అనేకులైన రాజులను దేవుని మహా దినాన ఆయనకు వ్యతిరేఖముగా పోగుచేయడం చూస్తున్నాం. అయితే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రకటన 16 అధ్యాయంలో దేవునికి వ్యతిరేఖంగా హార్మెగిద్దోన్ ప్రాంతంలో సమకూర్చినట్లు చూస్తున్నాం గాని, యుద్ధం జరిగినట్లు కనబడటం లేదు. అయితే 19:19—21 లలో ఒక యుద్ధం జరిగింది. అక్కడ భూరాజులు గుర్రం మీద కూర్చున్నవానితో యుద్ధం చేయడానికి కూడారు. వారంతా గుర్రం మీద కూర్చున్న వానియొక్క నోటనుండి వచ్చిన ఖడ్గం వలన వధింపబడ్డారు. ఇంకా మృగము అనగా అంత్యక్రీస్తు/ క్రీస్తువిరోది వానితోపాటు అబద్దప్రవక్త పట్టబడి అగ్నిగుండములో వేయబడ్డారు అని ఉంది. అయితే దీనినే పండితులు హార్మెగిద్దోను యుద్ధం అంటారు. అయితే అది అక్కడే జరిగింది అని స్పష్టంగా వ్రాయబడిలేదు. అయితే 20 అధ్యాయంలో గోగు మాగోగుల యుద్ధం కన్పిస్తుంది. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ప్రకటన 17-19 అధ్యాయాలు రోమా పట్టణానికి, పట్టణం మీద కూర్చున్న మహావేశ్యకు (బహుశా మత సంస్థ) దేవుని తీర్పు జరిగినట్లు చూస్తున్నాం. ఇక 20 అధ్యాయంలో ఆది సర్పమును, అపవాదిని వెయ్యి సంవత్సారాలు అగాధములో బందించడం కనబడుతుంది.  వెయ్యి సంవత్సారాలు గడిచాకనే అనగా వెయ్యేండ్ల పాలన తర్వాత గోగుమాగోగు యుద్ధం జరుగుతుంది. అంటే హార్మెగిద్దోను సన్నివేశానికి గోగుమాగోగుకి మధ్య 1000 సంవత్సారాలు  సమయం ఉంది అన్నమాట. గమనించాలి లోతుగా పరిశీలిస్తే హార్మెగిద్దోను యుద్దానికి ముందుగానే సంఘం ఎత్తబడుతుంది.

 

  కాబట్టి ఈ 44 వ వచనం కోసం ఖచ్చితంగా ఎప్పుడు ఏ క్రమంలో జరుగుతుందో చెప్పలేము గాని తప్పకుండ యుగాంతంలో భూమిపై నున్న అన్ని గొప్ప సైన్యాలు దేవునికి, ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేఖముగా యుద్దానికి దిగుతాయి అని మాత్రం చెప్పవచ్చు! అంతేకాదు-ఇశ్రాయేలు దేశానికి చుట్టూ ఎప్పుడైతే అనేకదేశాల సైన్యాలు యుద్దానికి వస్తాయో- అప్పుడే అంతం జరుగుతుంది అని గ్రహించాలి. లూకా 21:20.... యేరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలిసికొనుడి...

 ప్రకటన 20:812....

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి (కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుని యొద్దనుండి, అని కూర్చబడియున్నది)అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.  యోవేలు ౩:916;

 

అయితే ఇలా గోగుమాగోగు యుద్ధం ద్వారా ఎప్పుడైతే భూరాజులంతా ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేఖంగా కూడివస్తారో అప్పుడు ఇశ్రాయేలు వారు దేవునికి మొర్రపెడతారు. వెంటనే దేవుడు లేచి ఇశ్రాయేలునకు సహాయంగా వస్తారు. అప్పుడు ఆయన ఒలీవల కొండమీద తన పాదం మోపుతారు వెంటనే అది రెండుగా చీలిపోతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభులవారి బహిరంగ రాకడను సూచిస్తుంది.

జెకర్యా 12:2—...

2. నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.

3. ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు. 

14:2—4...

2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చ బోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.

4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

 

ఇక 45 వచనంలో చెప్పబడిన సముద్రాల మధ్య అనగా మధ్యధరా సముద్రం మరియు మృతసముద్రం మధ్య అనగా యేరూషలేము అని అర్ధం చేసుకోవచ్చు.  కీర్తన 48:1—2;

అయినా వాడు అనగా క్రీస్తువిరోది అంతరించిపోతాడు.

2థెస్స 2:8...

అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

 ప్రకటన 19:19—20 ....

19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.

ప్రకటన 20:9—10..........

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి (కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుని యొద్దనుండి, అని కూర్చబడియున్నది)అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

 

ఇలా జరిగాకనే ధవళ సింహసనపు తీర్పు జరుగుతుంది.

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. 

   ఇదీ యుగాంతంలో జరిగే సంఘటనలు- దేవుడు దానియేలు గారికి చూపించిన గొప్ప విషయాలు.

 

(ఇంకాఉంది)

 

  

 

*దానియేలు-32-The Man of God*

*32వ భాగం*

*దానియేలు దర్శనాలు- అంత్యకాలం/ యుగాంతం-6*

 

దానియేలు 12:1—3...

1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

3. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.   ..

 

     (గతభాగం తరువాయి)

 

మొదటి వచనంలో కాలంలో అనగా యుగాంతం జరిగిన తర్వాత కానేకాదు, తీర్పు జరిగాక కానేకాదు. కాలంలో అనగా సంభవాలు జరిగే కాలంలో అని అర్ధం అనగా 11:36—45 లో చెప్పబడిన రోజులలో మొదటగా మిఖాయేలు వస్తాడు. రెండు: మహాశ్రమలు కలుగుతాయి. మిఖాయేలు దూత ఇశ్రాయేలు తరుపున యుద్ధం చేయడానికి వస్తాడు. అయితే తర్వాత ఇంతవరకు కలగనటువంటి గొప్ప శ్రమలు ఆపదలు కలుగుతాయి అంటున్నారు. ఇక్కడ మిఖాయెల్ వచ్చినంత మాత్రాన వారికి శ్రమలు ఆగుతాయి అనడం లేదు. తప్పకుండా మహాశ్రమల కాలంలో వారుకూడా అనగా ఇశ్రాయేలీయులు కూడా శ్రమలు అనుభవిస్తారు.

మత్తయి 24:21

లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.

  కాబట్టి దీనివలన మనకు అర్ధమయ్యేది ఏమిటంటే మహాశ్రమలకు కేంద్రస్థానంగా యూదులు ఉంటారు..

 

2౩ వచనాలు  పునరుత్థానం కోసం చెబుతున్నారు. 2... మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

3. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.   ..

 

  మృతులు సజీవులై తిరిగి లేస్తారు అని రాసి ఉంది. అయితే రక్షణ పొంది పాపక్షమాపణ పొందినవారే లేస్తారని, పాపులు లేవరని  రాయబడలేదు. గాని పైరెండు గ్రూపులకు చెందినవారు లేస్తారని బైబిల్ లో చెప్పబడింది. ప్రకటన 20:46 ప్రకారం.....

ప్రకటన గ్రంథము 20:4,5,6,12

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. .

 

ఇక్కడ పై వచనాలు ప్రకారం రెండు పునరుత్థానములు కనిపిస్తున్నాయి. ఈ రెండిటికి మధ్య అనగా రెండు పునరుత్థానములకు మధ్య వెయ్యి సంవత్సరాలు ఉన్నాయి అని తెలుస్తుంది. కాబట్టి పాత నిభందనలో చాలావిషయాలు క్రొత్త నిభంధనతో పోల్చుకుంటే గాని అర్ధం కావు. ముఖ్యంగా దానియేలు/ యేహెజ్కేలు గ్రంధాలు. అంతేకాకుండా చాలాచోట్ల పాతనిభంధన లో చెప్పబడిన విషయాలు వాటిమధ్య కాలం- గేప్- ఎంతో చెప్పకుండా ముగించబడ్డాయి. అందుకే క్రొత్త నిభందనతో పోల్చుకోవాలి.

 

  ఇక తర్వాత వచనాలలో ఈ విషయాలు రాసి ముద్రించమని చెబుతున్నాడు దూత!

తర్వాత వచనాలలో దానియేలు గారికి ఇద్దరు మనుష్యులు కనిపిస్తున్నారు. అనగా 10వ అధ్యాయంలో ప్రారంభమైన దర్శనం ఇంకా 12వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. అప్పుడు ఒక మనుష్యుడు మరో మనిషిని అడుగుతున్నాడు- ఈ ఆశ్చర్యకరమైన సంగతులు ఎప్పుడు సమాప్తమవుతాయి అని. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సంగతులు జరగటానికి ఎంతకాలం పడుతుంది అని అడగటం లేదు. ఒకసారి మొదలైతే ఎన్నిరోజులలో ఈ సంభవాలు పూర్తి అవుతాయి అన్నట్లు కనబడుతుంది ఈ ప్రశ్న! దానికి జవాబు దానియేలు 11:35 లో ఉంది...

 

8వ వచనంలో కాలం కాలములు అర్ధకాలం పడుతుంది అంటున్నాడు. దానియేలు 7:25; 9:27; ప్రకటన 13:5; గమనించాలి- దీనికోసం గతభాగాలులో వివరించడం జరిగింది. అనగా మూడున్నర సంవత్సారాలులో సంపూర్తి చేయబడుతుంది.

ఇక ఇక్కడ పరిశుద్ధ జనము అని చెప్పబడింది. అనగా ఇశ్రాయేలు జాతి అని చెప్పుకోవచ్చు, కారణం దేవుడు తనకొరకు వారిని పవిత్రమైన ప్రజగా చేసుకున్నారు. నిర్గమ 19:6; ద్వితీ 7:6;

 

(అయితే వారేకాకుండా మనం కూడా పరిశుద్దజనముగా చేయబడ్డాము. 1పేతురు 2:910...

9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

కాబట్టి మనం పరిశుద్ధ జనముగా చేయబడ్డాము కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించాలి)

 

  *అయితే ఎవరికోసం చెప్పబడింది ఈ మాట అంటే ఇశ్రాయేలు దేశ జనులకోసం చెప్పబడింది.*  ఎప్పుడైతే ఇశ్రాయేలు జాతి అణచబడుతుందో, వారు దీనావస్తకు వస్తారో అప్పుడు అంతం వస్తుంది.

 

తర్వాత దానియేలు గారు నేను బాగా అర్ధం చేసుకోలేదు బాగా చెప్పమంటే ఇక చాలు. అంతకంటే ఎక్కువ తెలుసుకోకు అన్నారు. అంతేకాకుండా ఇవి అంత్యకాలం వరకు మరుగుగా ఉండేలాగా ముద్రించబడ్డాయి. కాబట్టి నీవు ఊరుకో అన్నారు

 

.10...... దానియేలు 12: 10

అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.

  ఇక్కడ ప్రజలు పరీక్షలకు/శ్రమలకు నిలబడాలి అని మరోసారి చెబుతున్నారు. 11:35; జెకర్యా 13:9; మలాకి ౩:2—4; కీర్తన 66:10—12;

 

ఇక 11—12..... 

11. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినములగును.

12. వెయ్యిన్ని మూడువందల ముప్పదియైదు దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు.

అర్పణలు నిలిపివేయడం, నాశనకరమైన హేయవస్తువును నిలపడం 9:2 లోను, 11:౩ లోను కనిపిస్తున్నాయి.

ఇక 1290 రోజుల తర్వాత ఏమి జరుగుతుందో ఈ వచనంలో చెప్పడంలేదు. అయితే క్రీస్తువిరోది పెట్టే శ్రమలు మాత్రం 1260 అనగా మూడున్నర సంవత్సారాలు. మరి మిగతా ౩౦ రోజులలో ఏమిజరుగుతుందో దేవుడు మనకు, దానియేలుగారికి చెప్పలేదు. 

అయితే 13....దానియేలు 12: 13

నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంత మందు నీ వంతులో నిలిచెదవు.

 

దీని ప్రకారం నీవు అంతం వరకు నమ్మకముగా సాగిపో అని మాత్రం చెబుతున్నారు. అలా చేస్తే నీకోసం నిర్ణయించిన వారసత్వం పొందుకుంటావు అంటున్నారు. అపో 20:32; రోమా 8:17; ఎఫెసీ 1:11; కొలస్సీ 1:12; :24; హెబ్రీ 9:15;

ఇదేమాట దేవుడు నీకు నాకు కూడా చెబుతున్నారు.

 

     ప్రియ దైవజనమా! ఈ సంగతులు దేవుడు దానియేలుగారిని ఉపయోగించుకుని జరుగబోయే సంభవాలు మనకు అర్ధం కావాలని సిద్ధపడాలని ముందుగానే రాయించారు. ముందు చెప్పడం జరిగింది కలలు ఎందుకు సంభవిస్తాయి అనేది.

 Job(యోబు గ్రంథము) 33:14,15,16,17,18

14. దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు

15. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్రపట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో

16. నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు

17. గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు

18. ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.  అంతేకాకుండా ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అని 1కొరింథీ పత్రిక10:11లో పౌలుగారు చెబుతున్నారు.

 

        పియ దైవజనమా! ప్రియ స్నేహితుడా! నేడో రేపో యేసయ్య రాకడ సంభవించబోతుంది. కారణం ఆయన రాకడ గడియలు సమీపంగా ఉన్నాయి. ఆయన చెప్పిన రాకడ గుర్తులు జరుగుతున్నాయి. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? నీ బ్రతుకు దేవుని దృష్టిలో బాగుందా? దేవుని త్రాసులో నీవు తూయబడితే బరువు తూగుతావా లేక తేలిపోతావా బెల్షేస్సర్ లాగ. సిద్దపడి ఉన్నావా? లేక బుద్దిలేని కన్యకల వలె సిద్దేల్లో నూనె లేకుండా ఉన్నావా? అనగా సిద్దేఅనగా నీ జీవితం/ హృదయం. నూనె దేవుని పరిశుద్ధాత్మ! నీలో దేవుని పరిశుద్ధాత్ముడు నింపబడి, పరిశుద్ధమైన జీవితం లేకపోతే విడువబడతావు జాగ్రత్త!

నీ పేరు జీవగ్రంధమందు వ్రాయబడి ఉందా?

 Revelation(ప్రకటన గ్రంథము) 20:12,15

12.మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

15.ఎవని పేరైనను (మూలభాషలో-ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. 

ప్రకటన గ్రంథం 21: 27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

విడువబడితే భాధలు పడలేవని మర్చిపోకు! అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగములు మండేఅగ్నిలో భాధపడతావు అని మర్చిపోకు! ఆధనవంతుడు అలాగే దేవుణ్ణి ప్రజలను లెక్కచేయకుండా జీవించాడు. నరకానికి కొనిపోబడి అగ్ని గుండములో బాధపడ్డాడు. తండ్రియైన అబ్రాహామా! నా మీద కనికరపడు అని మొర్ర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. లూకా 16; దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకో! నేడు అనే సమయముండగానే దేవుణ్ణి తెలుసుకుని, పాపమును విడిచి, వాక్యానుసారమైన జీవితం జీవించు! హెబ్రీ 3:14;

 

Ecclesiastes(ప్రసంగి) 11:9

9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

బుద్దిలేని కన్యకలు తర్వాత వచ్చి తలుపుతట్టినా మీరెవరో నాకు తెలియదు అంటారు దేవుడు!Matthew(మత్తయి సువార్త) 25:11,12

11. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా

12. అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 ఏం కావాలో నిర్ణయించుకో!

 

కాబట్టి ఆయన చెప్పినట్లు నడుచుకుందాం! నిత్యరాజ్యం పొందుకుందాం!

ఎత్తబడే గుంపులో ఉందాం!

 

అట్టి కృప ధన్యత దేవుడు మన అందరికీ మెండుగా కలుగజేయును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*****††****************

 

ప్రియ దైవజనమా! దానియేలు గ్రంధం రాయడానికి నేను గొప్ప బైబిల్ పండితుడను అని కాదు. కారణం నేను బైబిల్ పండితుడను కాను గాని సామాన్యులకు అర్ధమవ్వాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయడం జరిగింది. ఇక ఇలాగే జరుగుతుంది- అనగా నేను రాసినట్టే జరిగితుంది అని చెప్పడానికి లేదు. అలా ఎవరైనా చెబితే బుద్ధిహీనులే! జరుగబోయేది కేవలం దేవుని చిత్తము మీద ఆధారపడి ఉంటుంది.

ఇంతవరకు మీ అభిప్రాయాలు పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు.  మాకొరకు మా ఉద్యోగాలు కొరకు పరిచర్య కొరకు, పేజీలు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిరీక్షణ ద్వారం, వెబ్సైట్ ఆధ్యాత్మిక సందేశాలు కోసం ప్రార్థన చెయ్యండి.

మరో భక్తుని జీవితానుభావాలతో మరల కలుసుకుందాం! దైవాశీస్సులు!

 

ఇట్లు

ప్రభువునండు మీ సహోదరుడు

రాజకుమార్. దోనే

 

History source:

 

Jeff Asher

Understanding Daniel and Revelation-P G Temple;

British Museum Series, Vol I

Chabad

Oca

Forerunner

Biblestudy.org

Google wikepedia

Study Bible.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము