కల్వరి ప్రేమ ప్రతిధ్వనులు
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట )
సిలువలో మొదటి మాట: పరమవైద్యుని ప్రాయశ్చిత్త ప్రార్థన
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు
ఎరుగరు గనుక వీరిని క్షమించుము." (లూకా 23:34)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
క్షమాపణ
ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని
ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన సిలువ, భరించరాని
అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ
గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు,
తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ
గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు
ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న మొదటిమాట. "తండ్రీ! వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించు".
సిలువపై
యేసు ప్రభువు పలికిన ఈ మొదటి మాట, క్రైస్తవ్యానికి మకుటాయమానం. శిక్షించే వారిని ప్రేమించడం
అనే అసాధ్యమైన సత్యాన్ని ఆయన ఆచరించి చూపారు.
I. చారిత్రాత్మక మరియు
వైద్యశాస్త్ర విశ్లేషణ (Medical & Historical Reality)
❣️రోమా శిక్షాస్మృతి ప్రకారం, సిలువ వేయబడే నేరస్థులు సాధారణంగా తీవ్రమైన ఆక్రోశంతో, శపించడంతో ఉండేవారు.
▫️నరకయాతన: మేకులు కొట్టినప్పుడు 'మధ్యస్థ నరము' (Median Nerve) చిట్లిపోయి భయంకరమైన
నొప్పి కలుగుతుంది. అట్లాంటి స్థితిలో మనిషి మెదడు కేవలం 'నొప్పి'
మీద మాత్రమే స్పందిస్తుంది. సిలువపై ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం
కోసం తన శరీరాన్ని పైకి నెట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో మేకులు ఉన్న చోట ఘర్షణ జరిగి
నొప్పి మరింత తీవ్రమవుతుంది. ఆ స్థితిలో కూడా యేసు "ప్రార్థన" చేశారంటే
అది ఆయన దైవిక ప్రేమకు పరాకాష్ట
▫️మొదటి స్పందన: యేసు ప్రభువు ఆ భయంకరమైన వేదనలో ఉండి
కూడా తన నోటిని ప్రార్థన కోసం తెరిచారు (లూకా 23:34). ఆయన మొదటి చింత తన ప్రాణం
గురించి కాదు, తనను చంపేవారి ఆత్మల గురించి.
▫️చారిత్రక సాక్ష్యం: సైనికులు ఆయన వస్త్రాలను
పంచుకుంటూ చీట్లు వేస్తున్నారు (కీర్తనలు 22:18).
వారు ఆయన 'భౌతిక సంపద' కోసం చూస్తుంటే, ఆయన వారికి తన 'పరలోక స్వాస్థ్యాన్ని' (క్షమాపణను) ఉచితంగా
ఇస్తున్నారు. మేకులు దిగబడిన ఆ చేతులు శాపనార్థాలు పెట్టడం లేదు, ఆశీర్వదిస్తూ తండ్రికి విన్నపం చేస్తున్నాయి."
II. "తండ్రీ" - తెగిపోని దైవిక సంబంధం
❣️తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు మనుషులు
దేవునిని ప్రశ్నిస్తారు. కానీ యేసు "తండ్రీ" అని పిలిచారు.
▫️విశ్వసనీయత: లోకమంతా ఆయనను తృణీకరించినా, తండ్రితో ఉన్న సంబంధం మారలేదు (యోహాను 10:30).
▫️మర్మం: మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవునిని
అనుమానించకూడదని, ఆయనను ఇంకా దగ్గరగా 'తండ్రీ'
అని పిలవాలని ఈ మాట నేర్పుతుంది (గలతీయులకు 4:6).
III. "వీరు ఎరుగరు" - అజ్ఞానమా? ఆత్మీయ అంధకారమా?
❣️యేసు వారి పాపాన్ని అజ్ఞానం (Ignorance) కింద జమ
కట్టడం వెనుక ఒక గొప్ప న్యాయసూత్రం దాగి ఉంది:
▫️చట్టపరమైన మర్మం: ఒక
వ్యక్తి తెలిసి తప్పు చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటుంది, తెలియక
చేస్తే కనికరం చూపే అవకాశం ఉంటుంది. యేసు తనను చంపేవారికి ఆ 'కనికరం' దక్కాలని వారిని అజ్ఞానులుగా సంబోధించారు.
NOTE:
అజ్ఞానము పాపానికి సాకు కాదు కానీ, క్షమాపణకు
అది ఒక ద్వారం. వారు మెస్సీయను చంపుతున్నామని తెలియక చేశారు కానీ, ఒక మనిషిని చంపుతున్నామని వారికి తెలుసు. అయినప్పటికీ యేసు వారి పక్షాన
నిలబడటం ఆయన "మధ్యవర్తిత్వానికి" నిదర్శనం [హెబ్రీయులకు 7:25].
▫️ఆత్మీయ అంధకారం: వారు
దేవుని కుమారుడిని సిలువ వేస్తున్నారని గ్రహించలేనంతగా సాతాను వారి మనోనేత్రాలకు
గ్రుడ్డితనము కలుగజేశాడు (2 కొరింథీయులకు 4:4).
▫️పౌలు సాక్ష్యం:
"వారు ఎరిగి ఉంటే మహిమస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు" అని
అపొస్తలుడైన పౌలు ఈ మర్మాన్ని వివరించాడు (1 కొరింథీయులకు 2:8).
IV. యాజక ధర్మం మరియు ప్రవచన నెరవేర్పు
▫️ప్రవచనం: సుమారు 700 ఏళ్ల క్రితమే యెషయా ప్రవక్త,
"అతడు అనేకుల పాపమును భరించుచు, అతిక్రమము
చేయువారి పక్షమున విన్నపము చేసెను" అని రాశారు (యెషయా 53:12).
▫️యాజకత్వం: ప్రధాన యాజకుడు ప్రజల పాపముల కోసం రక్తము
ప్రోక్షించి ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు తన స్వంత రక్తమును ప్రోక్షిస్తూ, లోకము కోసం ప్రార్థిస్తున్న 'ప్రధాన యాజకుడు'గా ఉన్నారు (హెబ్రీయులకు 4:14-15).
▫️ప్రారంభం: రక్షణ కార్యము 'క్షమాపణ'తోనే ప్రారంభం కావాలి. అందుకే యేసు అన్నిటికంటే ముందు క్షమాపణను
ప్రకటించారు.
V. ముఖ్య
అంశాలు (Sermon Points):
▫️1. క్షమాపణలో శక్తి:
క్రైస్తవ్యం అంటే నిన్ను గాయపరిచిన వారిని క్షమించడం మాత్రమే కాదు, వారి రక్షణ కోసం ప్రార్థించడం కూడా (మత్తయి 5:44).
▫️2. అజ్ఞానానికి
ముగింపు: మనం రక్షించబడిన తర్వాత కూడా పాపం చేస్తే అది అజ్ఞానం కాదు, ఉద్దేశపూర్వక తిరుగుబాటు అవుతుంది. కాబట్టి క్షమాపణను అలుసుగా తీసుకోకూడదు
(హెబ్రీయులకు 10:26).
▫️3. స్టెఫను మాదిరి:
యేసు పలికిన ఈ మాటే మొదటి హతసాక్షి అయిన స్టెఫనుకు ప్రేరణనిచ్చింది. ఆయన రాళ్లతో
కొట్టబడుతూ కూడా "ప్రభువా, వీరి మీద ఈ పాపము
మోపకుము" అని ప్రార్థించాడు (అపొస్తలుల కార్యములు 7:60).
▫️ముగింపు:
❣️యేసు ప్రభువు వారు ఏమి భోధించారో? దానిని తప్పకుండా
చేసి చూపించారు. తాను చెయ్యడానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై
యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన
చేయుడి. మత్తయి 5:44
ఆయన భోధించినట్లుగానే,
▫️శత్రువులను
ప్రేమించారు.
▫️ఆయనను హింసించే
వారికొరకు ప్రార్ధించారు.
"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని
క్షమించు". ఈ మాట వింటుంటే?
శరీరం జలదరిస్తుంది. కాని ఆ దినాన్న బండలుగా మారిన ఆ రాతి హృదయాలు
చలించలేదు. స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికేమాత్రమూ తీసిపోలేదు. (మనం
ఇతరులను క్షమించకపోతే, పరలోకపు తండ్రి మనల్ని క్షమించడు
[మత్తయి 6:15]) అనుక్షణమూ ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాము. అయినప్పటీ, నేటికినీ నీ గురించి, నాగురించి తండ్రి దగ్గర
ఆయన విజ్ఞాపన చేస్తూనే వున్నాడు. ''వీరిని క్షమించమని"
అట్లా
అని, మార్పు
లేకుండా ఇట్లానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి
దేవుని ఉగ్రతకు పాత్రులవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా
చెయ్యగలిగాడు. నా వల్ల కాదులేనని నీకు నీవే సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు.
యేసు ప్రభువు అడుగు జాడల్లో నడచిన స్తెఫెను కూడా మరణ సమయాన్న కూడా ఆయనను అనుసరించ
గలిగాడు.
▫️గ్లాడిస్
తనభర్త గ్రాహం స్టెయిన్స్ ను,
తన ఇద్దరి కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారిని దేవుని
దగ్గరకు నడిపించ గలిగింది. క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన
పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్ర పరచబడదాం!
ఆయన సమరూపంలోనికి మార్చబడదాం! ఆయన వలే, మన శత్రువులను సహితం
క్షమిద్దాం! వారి కొరకు ప్రార్ధిద్దాం! అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
ముగింపు ప్రార్థన:
"మహాఘనుడవైన
దేవా, సిలువపై
నీ కుమారుడు చూపిన అంతులేని కనికరముకై వందనాలు. ప్రభువా, మా
అజ్ఞాన కాలంలో మేము చేసిన పాపములను క్షమించి, నీ రక్తముతో
మమ్మల్ని కడిగి పవిత్రపరచావు. మా జీవితాల్లో మమ్మల్ని గాయపరిచిన వారిని, మాకు విరోధముగా పనిచేసేవారిని హృదయపూర్వకముగా క్షమించే మనసును మాకు
దయచేయండి. నీ సిలువ ప్రేమను లోకానికి చాటిచెప్పే సాక్షులుగా మమ్మల్ని నిలపండి.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్!" ✨🙏
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన రెండవ మాట )
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను." (లూకా 23:43)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
నిరీక్షణ
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము
ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని
ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన సిలువ, భరించరాని
అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ
గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు,
తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ
గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1️⃣ మొదటి మాట "తండ్రీ, వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట "నేడు నీవు
నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (లూకా 23:43)
అంటూ “నిరీక్షణకు” ప్రకటించింది
✝️ సిలువలో
రెండవ మాట: క్షణమాత్రపు రక్షణ - కృప యొక్క విజయం
ప్రపంచ
చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించు కోవడానికి
ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా వున్నారంటే? అతడు. "ఆ సిలువ వేయబడిన దొంగ
మాత్రమే".
యేసు ప్రభువును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు "తండ్రీ, వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించు" అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప
పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చిందేమో?
ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందరచేసింది. ఇక
ఎంత మాత్రమూ ఆలస్యం చెయ్యక "యేసూ, నీవు నీ రాజ్యము
లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము". అని అర్ధిస్తున్నాడు. అది
అతని పెదవుల నుండి వచ్చిన మాటకాదు. అతని హృదయాంతరంగంలో నుండి పొంగి పొరలివస్తున్న
ఆవేధన.
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను." (లూకా 23:43) ఈ మాట మరణం అంచున ఉన్న ఒక పాపికి దేవుడు
ఇచ్చిన "నిత్యజీవపు హామీ".
I. చారిత్రాత్మక విశ్లేషణ: నిందితుల నేపథ్యం
❣️తీవ్రవాదులు: వీరు కేవలం దొంగలు మాత్రమే కాదు, రోమా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విప్లవకారులు (Lestai) (మార్కు 15:7).
▫️ముందే నిర్ణయించబడిన స్థలం: ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు, యేసు "అతిక్రమము చేయువారిలో ఒకడుగా ఎంచబడాలి" కాబట్టి ఆయనను
ఇద్దరు నేరస్థుల మధ్య ఉంచారు (యెషయా 53:12).
▫️మొదటి వైఖరి: విచారణ ప్రారంభంలో ఇద్దరు దొంగలు యేసును దూషించిన వారే
(మత్తయి 27:44). కానీ ఒకరిలో కలిగిన మార్పు అద్భుతం.
NOTE: యేసుప్రభువు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడటం
అనేది ప్రవచన నెరవేర్పు. ఆ ఇద్దరు దొంగలు మానవాళికి రెండు ప్రతిరూపాలు.
▫️మొదటి దొంగ: లోక సంబంధమైన విడుదల కోరాడు
("నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు"
[లూకా 23:39]). ఇతడు పాపం నుండి కాకుండా శిక్ష నుండి తప్పించుకోవాలని చూశాడు.
▫️రెండవ దొంగ: ఆత్మీయ సంబంధమైన విడుదల కోరాడు. యేసు
రక్తసిక్తుడై, బలహీనుడిగా కనిపిస్తున్నా, ఆయనను ఒక "రాజు"గా గుర్తించడం అతనిలోని అసాధారణ విశ్వాసానికి
గుర్తు.
II. దొంగలో కలిగిన మారుమనస్సు - 4 దశలు
❣️ఒక పాపి రక్షించబడటానికి కావలసిన సంపూర్ణ
ప్రక్రియ ఈ దొంగ మాటల్లో కనిపిస్తుంది:
▫️1. దేవుని భయం:
"నీవు దేవునికి భయపడవా?" - రక్షణకు పునాది దేవుని
భయమే (సామెతలు 9:10).
▫️2. పాపపు ఒప్పుకోలు:
"మనకైతే ఇది న్యాయమే; మనము చేసిన వాటికి తగిన ఫలము
పొందుచున్నాము" - తన పాపాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు (1 యోహాను 1:9)
▫️3. క్రీస్తు
నిర్దోషిత్వము: "ఈయన ఏ తప్పూ చేయలేదు" - యేసు పాపరహితుడని లోకానికి
చాటాడు (2 కొరింథీయులకు 5:21).
▫️4. విశ్వాస ప్రార్థన:
"నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము" -
చనిపోతున్న వ్యక్తిని 'రాజు'గా
గుర్తించడం సామాన్య విశ్వాసం కాదు (రోమీయులకు 10:9).
III. యేసు వాగ్దానంలోని ఆత్మీయ మర్మాలు
❣️"నిశ్చయముగా"
(Amen): యేసు తన వాగ్దానానికి తన దైవత్వాన్నే గ్యారెంటీగా
ఇచ్చారు. రక్షణలో ఎటువంటి సందేహం లేదు (యోహాను 5:24).
▫️"నేడు" (Today): రక్షణకు
కాలయాపన లేదు. క్రీస్తును అంగీకరించిన మరుక్షణమే నిత్యజీవం లభిస్తుంది (2
కొరింథీయులకు 6:2). రక్షణ అనేది రేపు దొరికేది కాదు, అది
ఇప్పుడే సిద్ధంగా ఉన్న కృప.
▫️"నాతో కూడ" (With Me): పరలోకం అంటే స్థలం కాదు, అది యేసు సాన్నిధ్యం.
క్రీస్తుతో ఉండటమే అత్యున్నత ఆశీర్వాదం (ఫిలిప్పీయులకు 1:23).
▫️ "పరదైసు" (Paradise): ఇది దేవుని నివాసస్థలమైన మూడవ ఆకాశమును సూచిస్తుంది (2 కొరింథీయులకు
12:4).
NOTE: పరదైసు - దేవుని సాన్నిధ్యం
'పరదైసు' అనే పదానికి గ్రీకులో
'సుందరమైన తోట' అని అర్థం. ఆదాము
కోల్పోయిన తోటను (Eden), క్రీస్తు తన సిలువ మరణం ద్వారా మరలా
మనకు తెరిచాడు. రక్షణ అంటే కేవలం నరకం నుండి తప్పించుకోవడం కాదు, అది "క్రీస్తుతో ఉండటం" (With Me).
IV. ముఖ్య
అంశాలు (Sermon Points)
❣️1. క్రియలు లేని రక్షణ: ఈ దొంగ బాప్తిస్మం
పొందలేదు, దశమభాగాలు ఇవ్వలేదు. కేవలం కృప చేతనే
రక్షించబడ్డాడు (ఎఫెసీయులకు 2:8-9).
▫️2. చివరి అవకాశం:
ప్రాణం ఉన్నంతవరకు రక్షణకు తలుపులు తెరిచే ఉంటాయి. దేవుడు ఎవరినీ నిరాకరించడు (యోహాను
6:37).
▫️3. రెండు మార్గాలు:
ఇద్దరు దొంగలు ఒకే రక్షకుడి పక్కన ఉన్నారు. ఒకరు విశ్వసించి రక్షించబడ్డారు,
మరొకరు కఠినపరచుకొని నశించారు. రక్షణ అనేది మన 'ఎన్నిక'పై ఆధారపడి ఉంటుంది.
ముగింపు ప్రార్థన:
"కృపామయుడవైన
తండ్రీ, సిలువలో
నీవు పలికిన రెండవ మాట ద్వారా మాకు గొప్ప నిరీక్షణను ఇచ్చావు. మరణం అంచున ఉన్న
పాపికి కూడా నీవు పరదైసును వాగ్దానం చేశావంటే, నీ కృప ఎంత
అగాధమో మాకు అర్థమవుతోంది. ప్రభువా, ఆ దొంగ వలె మేము కూడా మా
పాపములను ఒప్పుకొని, నీ రాజ్యము కొరకు కనిపెట్టే హృదయాన్ని
మాకు దయచేయండి. ఈ రాత్రి చర్చిలో ఈ వాక్యం బోధింపబడుచుండగా, అనేకులు
తమ రక్షణ నిశ్చయతను పొందుకునేలా సహాయం చేయండి. యేసు నామములో, ఆమెన్!" ✨🙏
ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):
▫️లూకా 23:39-43: ప్రధాన సందర్భం.
▫️యెషయా 53:12: నేరస్థులతో ఎంచబడుట.
▫️రోమీయులకు 10:9-10: హృదయపూర్వక విశ్వాసం.
▫️ఎఫెసీయులకు 2:8-9: కృప ద్వారా రక్షణ.
▫️2 కొరింథీయులకు 12:4: పరదైసు గురించిన వివరణ.
▫️ప్రకటన 2:7: పరదైసులో ఉన్న జీవవృక్షము.
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన మూడవ మాట )
"అమ్మా, ఇదిగో నీ కుమారుడు; (శిష్యునితో) ఇదిగో నీ తల్లి." (యోహాను 19:26-27)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
ప్రేమ మరియు బాధ్యత యొక్క అనుబంధం
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని
ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన సిలువ, భరించరాని
అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ
గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు,
తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ
గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1️⃣ మొదటి మాట
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని
క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
(లూకా 23:43) అంటూ “నిరీక్షణకు” ప్రకటించగా
3️⃣ "అమ్మా, ఇదిగో
నీ కుమారుడు; (శిష్యునితో) ఇదిగో నీ తల్లి." (యోహాను
19:26-27) అంటూ బాధ్యతను నెరవేర్చింది
సిలువలో మూడవ మాట: ప్రేమ మరియు
బాధ్యత యొక్క అనుబంధం
గోల్గోతా
కొండపై మరణ వేదన అనుభవిస్తున్న యేసు కళ్లకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు.
ఒకరు—తల్లి అయిన మరియ, మరొకరు—ఆయన ప్రేమించిన శిష్యుడు
యోహాను, ఇంకొకరు—మగ్దలేనే మరియ [యోహాను
19:25].
* మర్మం: ముప్పై ఏళ్ల క్రితం
సిమ్యోను చెప్పినట్లు, "నీ
హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును" అన్న మాట ఇక్కడ నెరవేరుతోంది [లూకా
2:35]. తన కళ్ల ముందే తన కుమారుడు రక్తం ఓడుతూ వేలాడుతుంటే, ఆ
తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆ వేదనలో ఆమెకు ఓదార్పునివ్వడమే ఈ మూడవ మాట
ఉద్దేశం.
"అమ్మా, ఇదిగో నీ కుమారుడు; (శిష్యునితో) ఇదిగో నీ తల్లి." (యోహాను 19:26-27)
మొదటి
మాటలో శత్రువులకు క్షమాపణ,
రెండవ మాటలో పాపికి రక్షణ నిచ్చిన క్రీస్తు, ఇప్పుడు
తన కుటుంబ బాధ్యతను సంపూర్ణం చేస్తున్నారు.
I. చారిత్రాత్మక మరియు సాంస్కృతిక నేపథ్యం
❣️నాటి యూదా చట్టం ప్రకారం, తండ్రి లేని కుటుంబంలో తల్లిని పోషించాల్సిన బాధ్యత జ్యేష్ఠ కుమారుడిదే.
యేసు ఆ ధర్మాన్ని సిలువపై కూడా విస్మరించలేదు.
▫️మరియమ్మ వేదన: 33
ఏళ్ల క్రితం సిమ్యోను ప్రవచించినట్లుగా, యేసు పడుతున్న
శ్రమలు మరియ హృదయంలోకి ఒక ఖడ్గంలా దూసుకుపోతున్నాయి (లూకా 2:35).
▫️జ్యేష్ఠ కుమారుని
బాధ్యత: సిలువపై ఉన్న వ్యక్తి సాధారణంగా తన ప్రాణం గురించి ఆలోచిస్తాడు, కానీ యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు గనుక తల్లిని సన్మానించుమన్న
ఆజ్ఞను (నిర్గమకాండము 20:12) మరణ సమయాన ఆచరించి చూపారు.
ఒక
తల్లి పదిమంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ పదిమంది పిల్లలు కలసి ఆఒక్క తల్లిని
పెంచలేక అనాధనుచేసి విడచి పెట్టేసిన పిల్లలెందరో? అనాధ ఆశ్రమాలలో, వృద్ధ ఆశ్రమాలలో తలదాచుకొంటున్న తల్లులెందరో? అట్లాఅని,
వారి ఆర్ధికస్థితి తల్లిని పోషించ గలిగేదిగా లేదా అంటే? కానేకాదు. అన్నీ సమృద్ధిగా కలిగినవారే. లేదంటే, వారు
తమ భాద్యతను, దేవుని ఆజ్ఞను మరచినవారు. వారి జాబితాలో మనమూ
వున్నామా?
అయితే
ఒక్క మాట! యేసుప్రభువు వారు కల్వరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు
మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన
భాద్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని 'యేసు ప్రభువు రొమ్మును ఆనుకొనియున్న శిష్యుడు'గా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ
పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేల్కొలుపు. పరిశుద్ధ గ్రంధం తలిదండ్రులకు
చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి
తలిదండ్రుల కోసమే. “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో
నీవు దీర్ఘాయుష్మంతు డవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము”. నిర్గమ 20:12
సన్మానించడం
అంటే? శాలువాలు కప్పి, పూల బొకేలు ఇవ్వాలని కాదుగాని, వారి అవసానదశలో వారి
అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడం. తలిదండ్రులకు
విధేయత చూపాలి. వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలొ మొదటిది.
పిల్లలారా, ప్రభువునందు
మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు
కలుగునట్లు నీతండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు
భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన
ఆజ్ఞలలో మొదటిది. (ఎఫెస్సి 6:1-3)
నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని
ఆనందపరచవలెను." (సామెతలు 23:25) అట్లా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి, వారిని
దూషించినట్లయితే? "తన తండ్రినైనను తల్లినైనను
దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును." (సామెతలు 20:20) కారు చీకట్లో నీ దీపం
ఆరిపోతే? నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా
పొందుకోగలవు?
ఒక్కటి
మాత్రము గుర్తుంచుకోవాలి! నేడు మన తలిదండ్రులను ఎట్లా చూస్తున్నామో? రేపు మన పిల్లల చేత
అట్లానే చూడబడతాము. "నీవు చేసినట్టే నీకును
చేయబడును, నీవు
చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును. (ఒబెద్యా 1:15) మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ
పంటనే కోయును. గలతీ 6:7
కొబ్బరి
చెట్టు నుండి, ఖర్జూరాలు ఆశించలేము. అట్లానే, మనము నేడు మన
తలిదండ్రులను నిర్లక్ష్యము చేసి రాబోయే దినాలలో మనము సంతోషాన్ని పొందగలము అనుకోవడం
మన జీవితాలకు శ్రేయష్కరము కాదు. ఒకవేళ ఇంత
వరకూ వారిని నిర్లక్ష్యం చేసామేమో? యేసు ప్రభువు వారు
సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తుచేస్తున్నారు.
II. "అమ్మా" (Woman) - గౌరవం మరియు మర్మం
❣️యేసు తన తల్లిని "మదర్" అని కాకుండా
"స్త్రీ" (గ్రీకులో: Gynai) అని పిలవడం వెనుక
లోతైన ఆత్మీయ కారణాలు ఉన్నాయి:
▫️గౌరవార్థకం: ఆ కాలపు
గ్రీకు సంస్కృతిలో 'Gynai' అనేది ఒక రాణిని లేదా
గౌరవనీయురాలైన స్త్రీని పిలవడానికి వాడే పదము (యోహాను 2:4).
▫️ప్రవచనార్థకం:
ఆదికాండము 3:15లో సాతాను తల చితకద్రొక్కుతానని చెప్పబడిన ఆ "స్త్రీ
సంతానము" తనేనని ఆయన గుర్తు చేస్తున్నారు.
▫️సంబంధం మార్పు:
ఇప్పుడు ఆమె కేవలం ఒక మానవ కుమారునికి తల్లి కాదు, రక్షించబడిన
సంఘానికి ఒక మాదిరిగా మారుతోంది.
III. యోహానుకు అప్పగించిన బాధ్యత - విశ్వాస సంబంధం
❣️యేసు తన తల్లిని తన స్వంత తమ్ముళ్లకు
అప్పగించకుండా యోహానుకు ఎందుకు అప్పగించారో గమనించాలి:
▫️అవిశ్వాసం: ఆ సమయంలో
యేసు తమ్ముళ్లు ఆయనను ఇంకా మెస్సీయగా విశ్వసించలేదు (యోహాను 7:5).
👉NOTE:
క్రీస్తు రక్తము ద్వారా ఏర్పడిన "సంఘము" (The
Church) అనే నూతన కుటుంబానికి ఇది పునాది. విశ్వాసంలో ఉన్నవారే
నిజమైన తల్లి, తండ్రి, సహోదరులు
[మత్తయి 12:48-50]. యోహాను నమ్మకస్థుడు గనుకనే, ప్రభువు తన
తల్లిని అతనికి అప్పగించారు.
▫️విశ్వాస బంధం: రక్త
సంబంధం కంటే క్రీస్తులో ఉన్న విశ్వాస సంబంధమే నిత్యమైనదని యేసు నిరూపించారు
(మత్తయి 12:50).
▫️ధైర్యం: పన్నెండు
మంది శిష్యులలో ప్రాణాలకు తెగించి సిలువ చెంత నిలబడిన ఏకైక వ్యక్తి యోహాను మాత్రమే
(యోహాను 19:26). నమ్మకమైన వానికే బాధ్యత ఇవ్వబడింది.
IV. వైద్యశాస్త్ర మరియు ఆత్మీయ వేదన
❣️సిలువపై
వేలాడుతున్న వ్యక్తి మాట్లాడాలంటే తన ఊపిరితిత్తులలో గాలిని నింపుకోవడానికి
శరీరాన్ని పైకి నెట్టాలి.
▫️ ప్రయాస: ఒక్కో మాట పలకడానికి యేసు అంతులేని
నొప్పిని భరించారు. అంత నొప్పిలో కూడా ఆయన మాట్లాడారంటే, ఆ
మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం గ్రహించాలి.
మాదిరి: సేవలో ఉన్నవారు తమ కుటుంబాలను నిర్లక్ష్యం
చేయకూడదని, సొంత ఇంటివారిని సంరక్షించని వాడు విశ్వాసత్యాగి
అని యేసు ఇక్కడ ముందే హెచ్చరిస్తున్నారు (1 తిమోతి 5:8).
V. అంశాలు
▫️1. సిలువ దగ్గర
ఎవరున్నారు?: కష్టకాలంలో పారిపోయేవారు శిష్యులు కాదు,
సిలువ వరకు వెన్నంటే ఉండేవారే నిజమైన అనుచరులు (యోహాను 19:25).
▫️2. బాధ్యతాయుతమైన
ప్రేమ: దేవుని పని చేస్తున్నానని చెప్పి తల్లిదండ్రులను, కుటుంబాన్ని
వదిలేయడం దైవికం కాదు. యేసు తన చివరి శ్వాస వరకు కుమారుని బాధ్యతను నెరవేర్చారు.
▫️3. నూతన కుటుంబం:
క్రీస్తు సిలువ ద్వారా పరలోకపు తండ్రికి మనం బిడ్డలమయ్యాము. సంఘంలో ఒకరినొకరు
తల్లిగా, సహోదరులుగా ప్రేమించుకోవాలి (1 తిమోతి 5:1-2).
ప్రియ
స్నేహితా! ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే—భక్తి అనేది కేవలం
ప్రార్థనలో మాత్రమే కాదు,
బాధ్యత నెరవేర్చడంలో కూడా ఉంది. యేసు ప్రభువు పరలోకపు తండ్రి
చిత్తాన్ని నెరవేరుస్తూనే, భూలోకపు తల్లి పట్ల తన బాధ్యతను
విస్మరించలేదు. మనం కూడా మన తల్లిదండ్రులను, వృద్ధులను
గౌరవించినప్పుడే క్రీస్తు నిజమైన శిష్యులమవుతాము.
దైవాశీస్సులు!!!
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన నాలుగవ మాట )
"ఏలీ, ఏలీ, లామా
సబక్తానీ? - నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?" (మత్తయి 27:46;
మార్కు 15:34)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
వేదన, వియోగం మరియు విమోచన
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన
ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో
ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన
సిలువ, భరించరాని అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు,
పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన
మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో
వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా
రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1️⃣ మొదటి మాట
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని
క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
(లూకా 23:43) అంటూ “నిరీక్షణకు” ప్రకటించగా
3️⃣ "అమ్మా, ఇదిగో
నీ కుమారుడు; (శిష్యునితో) ఇదిగో నీ తల్లి." (యోహాను
19:26-27) అంటూ బాధ్యతను నెరవేర్చగా
4️⃣ "ఏలీ, ఏలీ,
లామా సబక్తానీ? - నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?"
(మత్తయి 27:46; మార్కు 15:34)
అంటూ
… సిలువపై ఉన్న
"చీకటి గంటల"లో (మధ్యాహ్నం 12 నుండి 3 వరకు) పలికిన ఏకైక మాట.
సిలువలో నాలుగవ మాట: వియోగం మరియు విమోచన
"ఏలీ, ఏలీ, లామా
సబక్తానీ? - నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?" (మత్తయి 27:46;
మార్కు 15:34)
ఏడు మాటలలో ఇది మధ్యలో ఉన్న మాట (Center
Word). మొదటి మూడు మాటలు ఇతరుల కోసం (శత్రువులు, పాపి, కుటుంబం) పలికినవి అయితే, ఈ నాలుగవ మాట తన ఆత్మ వేదనను తండ్రికి వెలిబుచ్చిన మాట.
I. చారిత్రాత్మక మరియు భౌతిక నేపథ్యం (The
Darkness & The Agony)
❣️సిలువ
వేయబడిన ఆరు గంటలలో, చివరి మూడు గంటలు (మధ్యాహ్నం 12 నుండి 3
వరకు) దేశమంతటా చీకటి కమ్మింది (మత్తయి 27:45).
▫️భౌతిక వేదన: మూడు గంటల పాటు మౌనంగా ఉన్న తర్వాత,
యేసు ఎంతో బిగ్గరగా కేక వేశారు. సిలువపై ఊపిరి అందక ప్రాణం పోయే
స్థితిలో ఉన్న వ్యక్తి బిగ్గరగా కేక వేయడం అసాధ్యం. కానీ ఆయన తన ఆత్మలోని భారమును
భరించలేక కేక వేశారు.
▫️భాషా విశేషం: ఆయన తన మాతృభాష అయిన 'అరమాయిక్' (Aramaic) లో ఈ మాట పలికారు. మనిషి అత్యంత
వేదనలో ఉన్నప్పుడు తన హృదయ భాషలోనే మాట్లాడతాడు.
II. "నా దేవా" - "తండ్రీ" అని
ఎందుకు పిలవలేదు?
❣️ఇంతవరకు
యేసు ఎప్పుడూ దేవునిని "తండ్రీ" అని సంబోధించారు (లూకా 10:21; యోహాను 11:41). కానీ ఇక్కడ మాత్రం "నా దేవా" (My God) అని పిలిచారు.
▫️మర్మం: ఈ క్షణాన యేసు 'కుమారుడిగా'
కాదు, లోక పాపములను మోస్తున్న ఒక 'పాపి'గా (ప్రతినిధిగా) నిలబడ్డారు. పాపము దేవుని
నుండి వేరు చేస్తుంది కాబట్టి, ఆ దూరాన్ని ఆయన అనుభవించారు
(యెషయా 59:2).
▫️న్యాయస్థానం: ఒక కుమారుడిని తండ్రి క్షమిస్తాడు,
కానీ ఒక నేరస్థుడికి న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. మన పాపములకు
తగిన తీర్పును తండ్రి తన కుమారునిపై వేస్తున్న క్షణం ఇది.
III. "నన్ను ఎందుకు చేయి విడిచితివి?"
- తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు?
❣️దేవుడు
తన కుమారుని చేయి ఎందుకు విడిచాడు? దీని వెనుక మూడు ప్రధాన
కారణాలు ఉన్నాయి:
▫️1. దేవుని పరిశుద్ధత: దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును చూడలేడు (హబక్కూకు 1:13). ఆ క్షణాన లోక పాపమంతా యేసుపై
మోపబడింది కాబట్టి, తండ్రి తన ముఖాన్ని కుమారుని నుండి
త్రిప్పుకున్నాడు.
▫️2. ప్రాయశ్చిత్తం: పాపానికి శిక్ష దేవుని నుండి
ఎడబాటు (నరకం). మనకు రావలసిన ఆ నరక వేదనను (దేవుని నుండి వియోగాన్ని) యేసు సిలువపై
అనుభవించారు. మనం ఎన్నటికీ చేయి విడువబడకుండా ఉండటానికి, ఆయన
చేయి విడువబడ్డారు (హెబ్రీయులకు 13:5).
▫️3. ప్రవచన నెరవేర్పు: ఈ మాట 1000 ఏళ్ల క్రితమే
కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది (కీర్తనలు 22:1). తాను మేస్సీయనని, లేఖనములు తనలోనే నెరవేరుతున్నాయని ఆయన చాటిచెప్పారు.
IV. ఆత్మీయ మర్మం: త్రిత్వంలో వియోగం?
❣️త్రిత్వము
(Trinity) లోని తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ ఎప్పుడూ విడిపోరు. కానీ సిలువపై వారి మధ్య జరిగిన
వియోగం ఒక అద్భుతమైన మర్మం.
▫️కుమారుడు తండ్రి నుండి వేరవ్వడం అంటే ఒక శరీరం
నుండి ప్రాణం విడిపోవడం కంటే భయంకరమైనది.
▫️ఆయన మన కోసం "శాపముగా" మారారు (గలతీయులకు
3:13). మన శాపాన్ని ఆయన భరించడం వల్లనే మనకు ఆశీర్వాదం లభించింది.
V. ముఖ్య
అంశాలు (Detailed Sermon Points):
▫️1. పాపము యొక్క
భయంకరత్వం: పాపం ఎంత క్రూరమైనదంటే, అది సాక్షాత్తు దేవుని
కుమారుడినే తండ్రి నుండి వేరు చేసింది. మనం పాపాన్ని తేలికగా తీసుకోకూడదు.
▫️2. ఒంటరితనం: యేసు
లోక పాపములను మోస్తున్నప్పుడు సంపూర్ణంగా ఒంటరివాడయ్యారు. శిష్యులు విడిచారు,
ప్రజలు ఎగతాళి చేశారు, చివరికి తండ్రి కూడా
చేయి విడిచారు. మన ఒంటరితనాన్ని అర్థం చేసుకోగలిగే రక్షకుడు ఆయన (హెబ్రీయులకు
4:15).
▫️3. మనకు లభించిన
హామీ: ఆయన చేయి విడువబడ్డారు గనుకనే, నేడు మనము "నేను నిన్ను
ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను" అన్న
వాగ్దానాన్ని పొందుతున్నాము (హెబ్రీయులకు 13:5).
ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):
▫️మత్తయి 27:46 /
మార్కు 15:34: నాలుగవ మాట.
▫️కీర్తనలు 22:1:
మెస్సీయ పలికే వేదన ప్రవచనం.
▫️యెషయా 59:2: పాపము
దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా ఉండుట.
▫️హబక్కూకు 1:13:
దేవుడు పాపమును చూడలేనంత పరిశుద్ధుడు.
▫️గలతీయులకు 3:13: మన
కోసము ఆయన శాపమగుట.
▫️2 కొరింథీయులకు 5:21:
పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.
▫️హెబ్రీయులకు 13:5:
మనకు ఇవ్వబడిన ఎడబాయని వాగ్దానం.
ముగింపు ప్రార్థన:
"ప్రేమమయుడైన
యేసుప్రభువా, మా పాపముల భారమును మోస్తూ తండ్రి చేత చేయి విడువబడిన నీ వేదనను మేము
తలంచుకుంటున్నాము. మేము పొందవలసిన శిక్షను నీవు భరించి, మాకు
తండ్రితో సమాధానమును కలిగించినందుకు వందనాలు. నీవు పొందిన ఆ వియోగం వల్లనే మాకు
నిత్యజీవము మరియు నీ సాన్నిధ్యము లభించాయని నమ్ముతున్నాము. నీ త్యాగాన్ని ఎన్నడూ
మరువకుండా జీవించే కృపను మాకు దయచేయండి. ఆమెన్!" ✨🙏
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన ఐదవ మాట )
"నేను దప్పిగొనుచున్నాను." (యోహాను 19:28)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
మానవత్వం మరియు లేఖన నెరవేర్పు
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన
ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో
ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన సిలువ,
భరించరాని అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు,
పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన
మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో
వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా
రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1️⃣ మొదటి మాట "తండ్రీ, వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట "నేడు నీవు నాతోకూడ
పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (లూకా 23:43) అంటూ “నిరీక్షణకు” ప్రకటించగా
3️⃣ "అమ్మా, ఇదిగో నీ కుమారుడు; (శిష్యునితో)
ఇదిగో నీ తల్లి." (యోహాను 19:26-27) అంటూ బాధ్యతను నెరవేర్చగా
4️⃣ "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ? - నా దేవా, నా
దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?" (మత్తయి 27:46; మార్కు 15:34) అంటూ ఆర్తనాథం
చెయ్యగా....
5️⃣ "నేను దప్పికగొనుచున్నాను."
(యోహాను 19:28) అంటూ
సిలువపై ఆరు గంటల వేదన తర్వాత, మరణానికి కొద్ది నిమిషాల ముందు ప్రభువు
పలికిన మాట ఇది. ఏడు మాటలలో ఇది అత్యంత చిన్న మాట (గ్రీకులో ఇది కేవలం ఒకే పదం: 'Dipsō').
I. చారిత్రాత్మక మరియు భౌతిక నేపథ్యం (Physical
Reality)
❣️వైద్యశాస్త్రం ప్రకారం, సిలువ
వేయబడిన వ్యక్తికి 'Hypovolemic Shock' కలుగుతుంది.
▫️శరీర స్థితి: కొరడా
దెబ్బల వల్ల రక్తము మరియు నీరు కోల్పోవడం, ఎండలో గంటల తరబడి
వేలాడటం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. నాలుక ఎండిపోయి అంగిలికి
అంటుకుపోయే స్థితి ఇది (కీర్తనలు 22:15).
▫️సంపూర్ణ మానవత్వం: ఈ
మాట యేసు కేవలం దేవుడు మాత్రమే కాదు, మనలాంటి ఆకలి, దప్పిక, నొప్పి తెలిసిన 'సంపూర్ణ
మానవుడు' అని నిరూపిస్తుంది (హెబ్రీయులకు 2:17). ఆయన మన
బలహీనతలలో మనల్ని అర్థం చేసుకోగల రక్షకుడు (హెబ్రీయులకు 4:15).
II. లేఖన నెరవేర్పు (Fulfillment of Scripture)
❣️యోహాను సువార్త 19:28లో ఒక ముఖ్యమైన వాక్యం
ఉంది: "లేఖనము నెరవేరునట్లు ఆయన—నేను
దప్పికగొనుచున్నాను అనెను."
❣️కీర్తనలు 69:21: "నా దప్పికి చిరకాను నాకు త్రాగనిచ్చిరి"
అనే ప్రవచనం ఇక్కడ నెరవేరింది.
▫️ప్రభువు నిగ్రహం:
సిలువ వేయబడిన ప్రారంభంలో సైనికులు మత్తు కలిగించే 'గోపరసము
కలిపిన ద్రాక్షారసము' ఇచ్చారు, కానీ
ఆయన దానిని తీసుకోలేదు (మత్తయి 27:34). ఎందుకంటే, ఆయన మన
పాపముల కోసం ఆ వేదనను మత్తులో కాకుండా, సంపూర్ణ స్పృహతో
అనుభవించాలని కోరుకున్నారు.
III. ఆత్మీయ మర్మం: జీవజలపు ఊట దప్పికగొనడం
❣️ఇక్కడ ఒక గొప్ప వైరుధ్యం (Paradox) ఉంది:
▫️సమరయ స్త్రీతో:
"నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిగొనడు" అని చెప్పిన జీవజలపు
ఊట ఆయనే (యోహాను 4:14).
▫️లోకానికి దాహాన్ని
తీర్చే దేవుడు, మన కోసం సిలువపై దప్పికగొన్నారు. మనం నిత్యము
జీవజలము త్రాగాలని, ఆయన ఈ లోకపు చేదు .
చిరక వంటి శ్రమలను అనుభవించారు.
▫️ఆత్మీయ దాహం: ఇది
కేవలం నీళ్ల కోసం దాహం కాదు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం
ఆయన పడుతున్న 'ఆత్మీయ ఆవేదన'. తండ్రి
ముఖాన్ని త్రిప్పుకున్నప్పుడు కలిగిన ఆత్మీయ ఎడబాటు వల్ల కలిగిన దాహం ఇది.
IV. చిరకా (Vinegar) - మానవత్వం
చూపిన క్రూరత్వం
❣️యేసు దప్పిక అని అడిగినప్పుడు, వారు ఆయనకు చిరకా (Sour Wine) ఇచ్చారు (యోహాను
19:29).
▫️ఇది గొంతును మరింత
ఎండుకుపోయేలా చేస్తుంది.
▫️మానవజాతి తన
సృష్టికర్తకు ఇచ్చిన చివరి గౌరవం 'చేదు చిరకా'. మన పాపపు చేదును ఆయన త్రాగి, మనకు రక్షణ అనే మధురమైన
అనుభవాన్ని ఇచ్చారు.
V. ముఖ్య
అంశాలు (Detailed Sermon Points):
▫️1. మనం ఆరాధించే
దేవుడు మన వేదనను ఎరిగినవాడు: ఆయనకు దాహం అంటే తెలుసు, నొప్పి
అంటే తెలుసు. కాబట్టి మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని సంపూర్ణంగా అర్థం
చేసుకుంటారు (హెబ్రీయులకు 4:15).
▫️2. వాక్యము పట్ల
విధేయత: తన ప్రాణం పోయే స్థితిలో కూడా, ఒక చిన్న లేఖన భాగం
నెరవేరాలని ఆయన ఆలోచించారు. మన జీవితంలో వాక్యానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నామా?
▫️3. ఆయన దాహం - మన
బాధ్యత: నేడు యేసుప్రభువు నశించిపోతున్న ఆత్మల కోసం దాహంతో ఉన్నారు. సువార్త
ద్వారా ఆత్మలను ఆయన చెంతకు చేర్చడమే ఆయన దాహాన్ని తీర్చడం (మత్తయి 25:40).
ప్రియ నేస్తమా!
❣️నిత్య నరకంలో మనము దప్పిగొనకూడదని, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నారు. ధనవంతుడు ఒక్క నీటిబొట్టు కొరకు
ఎంత అల్లాడిపోతున్నాడో? అట్లాంటి పరిస్థితి నుండి నిన్నూ,నన్నూ తప్పించడానికి ఆయనే దప్పిగొంటున్నారు.
👉"తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికర పడి, తన
వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి"* లూకా 16:24
❣️అనంత కాలము మనకు దాహము లేకుండా చెయ్యడానికి
ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు దప్పిగొన్నారు.
👉"వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి
తగులదు,ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి
కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును."*
ప్రకటన 7:16,17
ఆయన
నీకోసం ఇంతచేస్తే? దేనికోసం నీ దప్పిక?
శరీరాశా? నేత్రాశా? జీవపుడంబమా? వీటికోసమేనా నీ ప్రాకులాట? ఆత్మ ఫలాలు ఫలించకుండా, శరీర కార్యములనే
నెరవేర్చుకుంటూ నేటికినీ ఆయనకు ఆచేదు చిరకనే మరళా, మరళా త్రాగిస్తావా?
వద్దు! ఒక్కసారి చాలు. ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి. అది చాలు. మోషే
మరళా కొట్టాడు. కనానులో అడుగు పెట్టలేకపోయాడు. ఆయన ఆ చేదుచిరకను ఒక్కసారి త్రాగితే
చాలు. మనము మరళా త్రాగించే ప్రయత్నం చేస్తే? ఆ పరమ కనానులో
అడుగు పెట్టలేము. వద్దు! శరీరకార్యాలకు గతించిన కాలమే చాలు. ఆ దివ్య ప్రేమను అర్ధం
చేసుకో.
ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):
▫️యోహాను 19:28-29: ఐదవ
మాట సందర్భం.
▫️కీర్తనలు 69:21:
దప్పికి చిరకా ఇస్తారన్న ప్రవచనం.
▫️కీర్తనలు 22:15: నా
నాలుక నా అంగిలికి అంటుకొని పోయెనన్న వేదన.
▫️యోహాను 4:14: జీవజలము
ఇచ్చే దేవుడు.
▫️హెబ్రీయులకు 4:15: మన
బలహీనతలలో మనల్ని అర్థం చేసుకునే రక్షకుడు.
▫️యోహాను 7:37:
"ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి త్రాగవలెను."
ముగింపు ప్రార్థన:
"ప్రేమమయుడైన
యేసుప్రభువా, నా కోసం నీవు సిలువపై పొందిన ఆ భయంకరమైన దాహాన్ని బట్టి నీకు వందనాలు.
నీవు ఆ చేదు చిరకాను త్రాగడం వల్లనే, నేడు నాకు జీవజలము
లభించింది. ప్రభువా, లోకపు ఆశల కోసం కాకుండా, నీ నీతి కోసం ఆకలిదప్పులు కలిగే హృదయాన్ని మాకు దయచేయండి. నశించిపోతున్న
ఆత్మల పట్ల నీకున్న ఆత్మీయ దాహాన్ని మేము కలిగి ఉండేలా సహాయం చేయండి. ఆమెన్!"
✨🙏
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన ఆరవ మాట )
"సమాప్తమైనది." (యోహాను 19:30)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
సంపూర్ణ విజయం - విమోచన పరిసమాప్తి
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన
ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో
ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన
సిలువ, భరించరాని అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు,
పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన
మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో
వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా
రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1
️⃣ మొదటి మాట "తండ్రీ, వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట "నేడు నీవు నాతోకూడ పరదైసులో
ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (లూకా 23:43) అంటూ “నిరీక్షణకు” ప్రకటించగా
3️⃣ "అమ్మా, ఇదిగో నీ కుమారుడు; (శిష్యునితో)
ఇదిగో నీ తల్లి." (యోహాను 19:26-27) అంటూ బాధ్యతను నెరవేర్చగా
4️⃣ "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ? - నా దేవా, నా
దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?" (మత్తయి 27:46; మార్కు 15:34) అంటూ ఆర్తనాథం
చెయ్యగా....
5️⃣ "నేను దప్పికగొనుచున్నాను."
(యోహాను 19:28) అంటూ
6️⃣ "సమాప్తమైనది." (యోహాను 19:30) అంటూ
విమోచనకార్యాన్ని
పరిసమాప్తం చేశారు.
సిలువలో
యేసు ప్రభువు పలికిన ఆరవ మాట మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన విజయ నాదం. ఇది
ఓటమిని ప్రకటించే మాట కాదు,
ఒక మహా కార్యం పూర్తయిందని చాటిచెప్పే జయధ్వానం.
విమోచన
పరిసమాప్తి
"సమాప్తమైనది." (యోహాను 19:30)
యేసు
ప్రభువు చిరక పుచ్చుకొని,
ప్రాణము విడిచే ముందు పలికిన మాట ఇది. గ్రీకు మూల భాషలో ఇది కేవలం
ఒకే ఒక్క పదం: 'Tetelestai' (టెటెల్స్టై).
I. 'Tetelestai' - ఆ కాలపు వాడుకలో ఉన్న 4 మర్మాలు
❣️ఈ ఒక్క పదానికి నాటి సామాజిక జీవితంలో నాలుగు
అద్భుతమైన అర్థాలు ఉన్నాయి.
▫️1. న్యాయస్థానంలో (Legal): ఒక
నేరస్థుడు తన శిక్షా కాలాన్ని పూర్తి చేసినప్పుడు, అతని
విడుదల పత్రంపై 'Tetelestai' అని రాసేవారు. అంటే "శిక్ష
అనుభవించడమైనది" అని అర్థం. మన పాపానికి రావలసిన మరణశిక్షను యేసు పూర్తిగా
అనుభవించి ముగించారు.
▫️2. వ్యాపార రంగంలో (Accounting): అప్పు పూర్తిగా చెల్లించినప్పుడు రసీదుపై 'Tetelestai' అని ముద్ర వేసేవారు. దీని అర్థం "అప్పు తీరిపోయింది" (Paid
in Full). మన పాపపు అప్పును యేసు తన రక్తంతో పూర్తిగా చెల్లించారు.
▫️3. యాజక ధర్మంలో (Priestly): బలి
అర్పించే గొర్రెపిల్లను పరీక్షించినప్పుడు, దానిలో ఏ లోపము
లేకపోతే యాజకుడు 'Tetelestai' అనేవాడు. అంటే "ఇది
సంపూర్ణమైనది" అని అర్థం. యేసు తన్ను తాను మచ్చలేని బలిగా అర్పించుకున్నారు.
▫️4. కళాఖండం పూర్తిలో (Artistic): ఒక చిత్రకారుడు తన చిత్రాన్ని పూర్తి చేసినప్పుడు, ఇక
మార్పులు అవసరం లేదన్నట్లుగా 'Tetelestai' అనేవాడు. దేవుని
రక్షణ ప్రణాళికలో ఇక మానవుడు చేసేది ఏమీ లేదు, అంతా ఆయనే
పూర్తి చేశారు.
II. ఏమి సమాప్తమైనది? (What was Finished?)
❣️ప్రభువు
ఏ కార్యాలను ముగించారో ఇక్కడ లోతుగా విశ్లేషించవచ్చు:
▫️ప్రవచనముల నెరవేర్పు: పాత నిబంధనలో మెస్సీయ గురించి
చెప్పబడిన సుమారు 300 పైగా ప్రవచనములు సిలువపై సంపూర్ణమయ్యాయి.
▫️బలి అర్పణల ముగింపు: జంతు బలుల కాలం ముగిసింది.
"ఒకే ఒక్క బలి" ద్వారా నిత్యమైన విమోచన కలిగింది.
▫️సాతాను ఓటమి: సాతాను తల చితకద్రొక్కుతానన్న
వాగ్దానం నెరవేరింది. మరణము యొక్క శక్తి లయపరచబడింది.
▫️దేవుని చిత్తము: తండ్రి తనకు అప్పగించిన రక్షణ
కార్యాన్ని యేసు నమ్మకముగా ముగించారు.
III. దేవాలయ తెర చినిగిపోవుట - మార్గము సుగమము
❣️యేసు
"సమాప్తమైనది" అని పలికిన మరుక్షణమే, దేవాలయపు తెర
పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోయింది.
▫️పాపికి దేవుని సన్నిధికి వెళ్లే మార్గం అడ్డుగా
ఉన్న తెర తొలగించబడింది. ఇప్పుడు మనము ధైర్యముగా కృపాసనము చెంతకు చేరవచ్చు.
▫️ఆ తెరను మనుషులు చించలేదు, దేవుడే
పైనుండి క్రిందికి చించి, తన కుమారుని ద్వారా అందరికీ ద్వారం
తెరిచారు.
IV. ముఖ్య
అంశాలు (Detailed Sermon Points):
▫️1. మనం చేసేది ఏమీ లేదు: రక్షణ అనేది మనం కష్టపడి
సంపాదించేది కాదు. యేసు ఇప్పటికే అంతా పూర్తి చేశారు. మనం చేయాల్సిందల్లా
విశ్వసించడమే.
▫️2. పరిపూర్ణత: యేసు కార్యం సగంలో ఆగిపోలేదు. ఆయన
"అల్ఫా మరియు ఓమెగ"
ప్రారంభించిన పనిని ఆయన తుదముట్టించే దేవుడు.
▫️3. విజయోత్సాహం: ఇది ఒక చనిపోతున్న వ్యక్తి
నిట్టూర్పు కాదు, ఒక యోధుడు యుద్ధం గెలిచిన తర్వాత వేసిన
కేక. క్రైస్తవ జీవితం విజయంతో ప్రారంభమవుతుంది.
ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):
▫️యోహాను 19:30: ఆరవ
మాట.
▫️రోమీయులకు 8:1:
శిక్షా విధి లేని స్థితి.
▫️కొలొస్సయులకు 2:14:
మనకు విరోధముగా ఉన్న పత్రమును కొట్టివేయుట.
▫️హెబ్రీయులకు
10:12-14: ఒక్కటే బలి ద్వారా నిత్యసిద్ధి.
▫️యెషయా 53: శ్రమల
నెరవేర్పు.
▫️మత్తయి 27:51: దేవాలయ
తెర చినుగుట.
▫️యోహాను 17:4:
"నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని."
ముగింపు ప్రార్థన:
"జయశీలుడవైన
యేసుప్రభువా, నా రక్షణ కోసము నీవు సిలువపై సమస్తమును నెరవేర్చినందుకు వందనాలు. నా పాపపు
అప్పును నీ రక్తముతో పూర్తిగా చెల్లించి, నాకు విడుదలనిచ్చావు.
నీవు ముగించిన ఆ రక్షణ కార్యముపై నేను విశ్వాసముంచి, నీ
విజయమును నా జీవితములో పొందుకునే కృపను దయచేయి. నీవు పరిపూర్ణము చేసిన ఈ విమోచనకై
నిన్ను నిత్యము స్తుతిస్తాను. ఆమెన్!" ✨🙏
—- కల్వరిపై
ప్రేమ ప్రతిధ్వనులు—-
( యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడవ మాట )
"తండ్రీ, నీ చేతులకు నా ఆత్మను
అప్పగించుకొనుచున్నాను." (లూకా
23:46)
సిలువపై
యేసుక్రీస్తు మౌనంగా ప్రాణాలు విడవలేదు; ఆయన పలికిన ప్రతి మాట చీకటిని చీల్చుకుంటూ
వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ ఏడు మాటలు కేవలం శబ్దాలు కావు, అవి
పాపికి క్షమాపణను, దుఃఖితుడికి ఓదార్పును, మరియు విశ్వాసికి నిత్యజీవపు నిశ్చయతను ఇచ్చే పరలోకపు ప్రతిధ్వనులు.
సంపూర్ణ సమర్పణ - తండ్రి ఒడిలో
విశ్రాంతి
ఆయన
జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధత నిండి ఉంది. కాని, సర్వమానవాళి పాపం
నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా
క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం
జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.
▫️సిలువతో సాగిన
ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.
▫️కొరడా దెబ్బలతో
ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.
▫️వీపు మీద భారమైన
సిలువ, భరించరాని అవమానం
▫️ముఖమంతా ఉమ్ములు,
పిడిగుద్దులు
▫️గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.
▫️కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
▫️ఆరు అంగుళాలు కలిగిన
మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో
వ్రేలాడుతుంది.
▫️ఆయన దేహమంతా
రక్తసిక్తమై ఏరులై పారుతుంది.
అటువంటి
భయానకమైన పరిస్థితులలో ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి నోటనుండి వెలువడుతున్న
1️⃣ మొదటి మాట
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని
క్షమించుము." (లూకా 23:34) అంటూ “క్షమాపణను” ప్రకటించగా
2️⃣ రెండవ మాట
"నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
(లూకా 23:43) అంటూ “నిరీక్షణకు” ప్రకటించగా
3️⃣ "అమ్మా, ఇదిగో
నీ కుమారుడు; (శిష్యునితో) ఇదిగో నీ తల్లి." (యోహాను
19:26-27) అంటూ బాధ్యతను నెరవేర్చగా
4️⃣ "ఏలీ, ఏలీ,
లామా సబక్తానీ? - నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి?"
(మత్తయి 27:46; మార్కు 15:34) అంటూ ఆర్తనాథం
చెయ్యగా....
5️⃣ "నేను దప్పికగొనుచున్నాను."
(యోహాను 19:28) అంటూ
6️⃣ "సమాప్తమైనది." (యోహాను 19:30) అంటూ
విమోచనకార్యాన్ని పరిసమాప్తం చేస్తూ...
7️⃣ "తండ్రీ, నీ
చేతులకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను."
(లూకా 23:46) అంటూ ముగించారు.
సిలువలో
యేసు ప్రభువు పలికిన ఏడవ మాట, అంటే చివరి మాట, సంపూర్ణమైన
సమర్పణకు మరియు తండ్రిపై ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం. ఇది ఒక మరణ వేదన కాదు,
తన గమ్యాన్ని చేరుకున్న ఒక కుమారుని విశ్రాంతి.
❣️సిలువలో
ఏడవ మాట: సంపూర్ణ సమర్పణ - తండ్రి ఒడిలో విశ్రాంతి
"తండ్రీ, నీ చేతులకు నా ఆత్మను
అప్పగించుకొనుచున్నాను." (లూకా 23:46)
యేసు
ప్రభువు సిలువపై పలికిన మొదటి మాట "తండ్రీ" అని ప్రారంభమైంది. అలాగే
చివరి మాట కూడా "తండ్రీ" అనే ముగిసింది. మధ్యలో పాపభారం వల్ల కలిగిన
ఎడబాటు (నాలుగవ మాట) తొలగిపోయి, తిరిగి తండ్రితో అనుబంధం పునరుద్ధరించబడింది.
I. చారిత్రాత్మక మరియు ఆత్మీయ విశ్లేషణ
❣️సాధారణంగా
సిలువపై చనిపోయే వారు ఊపిరి అందక, శక్తి లేక నీరసించి
మరణిస్తారు. కానీ యేసు విషయంలో అది భిన్నంగా జరిగింది.
▫️మహాశబ్దము: యేసు "గొప్ప శబ్దముతో కేక
వేసి" ఈ మాట పలికారు. ఇది ఆయన బలహీనతతో చనిపోవడం లేదని, తన ప్రాణాన్ని తానే స్వచ్ఛందంగా ఇస్తున్నారని నిరూపిస్తుంది.
▫️అరమాయిక్ ప్రార్థన: యూదా కుటుంబాలలో తల్లిదండ్రులు
తమ పిల్లలు రాత్రి పడుకునే ముందు నేర్పించే ప్రార్థన ఇది (కీర్తన 31:5). యేసు తన
భూసంబంధమైన జీవితాన్ని ఒక చిన్న బిడ్డ వలె తండ్రిపై నమ్మకంతో ముగించారు.
II. "నీ చేతులకు" - సురక్షితమైన స్థలం
❣️దేవుని
చేతులు సృష్టికి, రక్షణకు మరియు తీర్పునకు చిహ్నాలు.
▫️సురక్షితం: సిలువపై మనుషుల చేతులు ఆయనను గాయపరిచాయి,
మేకులు కొట్టాయి. కానీ ఆయన తన ఆత్మను మనుషుల చేతులకు కాక, తండ్రి చేతులకు అప్పగించుకున్నారు. దేవుని చేతుల్లో ఉన్నది ఏదీ
నశించిపోదు.
▫️అప్పగించుట (Commend): గ్రీకులో
'Paratithemai' అంటే "డిపాజిట్ చేయడం" లేదా
"భద్రపరచమని ఇవ్వడం" అని అర్థం. ఆయన తన ఆత్మను తిరిగి పొందే నిశ్చయతతో
(పునరుత్థానం) తండ్రికి అప్పగించారు.
III. స్వచ్ఛంద మరణం - ప్రాణముపై అధికారం
❣️యేసును
ఎవరూ చంపలేదు, ఆయనే తన ప్రాణాన్ని ఇచ్చారు.
▫️అధికారము: "నేను దానిని (ప్రాణమును) పెట్టుటకు
నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసికొనుటకును నాకు
అధికారము కలదు" .
▫️బలియాగం: ఆయన మరణం ఒక ప్రమాదం కాదు, అది ఒక పద్ధతి ప్రకారం జరిగిన యాగం. ఆయన తన ఆత్మను అప్పగించిన మరుక్షణమే
విమోచన కార్యము స్థిరపరచబడింది.
IV. విశ్వాసికి మాదిరి: మరణాన్ని ఎదుర్కోవడం
❣️యేసు
మరణించిన విధానం భవిష్యత్తులో హతసాక్షులకు మరియు విశ్వాసులకు ధైర్యాన్ని ఇచ్చింది.
▫️స్టెఫను: మొదటి హతసాక్షి స్టెఫను రాళ్లతో
కొట్టబడుతున్నప్పుడు, "ప్రభువైన యేసూ, నా ఆత్మను చేర్చుకొనుము" అని ప్రార్థించాడు.
▫️భయం లేని మరణం: క్రీస్తులో ఉన్నవారికి మరణం అంటే
తండ్రి చేతులకు అప్పగించబడటమే కానీ, అంతం కాదు. మరణం యొక్క
ముల్లు విరవబడింది.
V. ముఖ్య అంశాలు
(Detailed Sermon Points):
▫️1. ప్రారంభం మరియు
ముగింపు: మన జీవితం దేవునితో ప్రారంభమై, దేవునితోనే ముగియాలి.
యేసు తన పరిచర్యను, మరణాన్ని తండ్రి చిత్తానికే అప్పగించారు.
▫️2. పూర్తి నమ్మకం:
చీకటి గంటలు గడిచిపోయాయి, వేదన ముగిసింది. ఇప్పుడు తండ్రి
హత్తుకునే సమయం. మన కష్టాల తర్వాత దేవుడు మనల్ని చేర్చుకుంటాడనే నిశ్చయత మనకు
ఉండాలి.
▫️3. సమర్పణ: మనం
చనిపోయేటప్పుడు మాత్రమే కాదు, బ్రతికి ఉన్నప్పుడే మన
జీవితాలను ఆయన చేతులకు అప్పగించాలి.
ముఖ్యమైన రిఫరెన్సుల జాబితా (Reference List):
▫️లూకా 23:46: ఏడవ మాట.
▫️కీర్తనలు 31:5:
ప్రవచన మూల వాక్యము.
▫️యోహాను 10:17-18:
ప్రాణము పెట్టుటకు మరియు తీసికొనుటకు ఉన్న అధికారం.
▫️మత్తయి 27:50:
మహాశబ్దముతో ప్రాణము విడుచుట.
▫️అపొస్తలుల కార్యములు
7:59: స్టెఫను సమర్పణ.
▫️1 పేతురు 2:23:
"న్యాయముగా తీర్పు తీర్చువానికి తన్ను తాను అప్పగించుకొనెను."
ముగింపు ప్రార్థన:
"పరలోకపు తండ్రీ, సిలువపై నీ కుమారుడు చూపిన సంపూర్ణ
విధేయతను బట్టి వందనాలు. తన ఆత్మను నీ చేతులకు అప్పగించడం ద్వారా, మాకు కూడా సురక్షితమైన నిత్యజీవపు నిరీక్షణను ఇచ్చావు. ప్రభువా, మా జీవితాలను, మా భవిష్యత్తును నీ హస్తాలకు
అప్పగించుకుంటున్నాము. మరణ సమయంలోనే కాదు, మా ప్రతి దినము నీ
చేతులలో భద్రముగా ఉండునట్లు సహాయము చేయండి. పునరుత్థానుడైన యేసు నామములో
అడుగుచున్నాము తండ్రి, ఆమెన్!" ✨🙏
🧎➡️/————
ప్రభువు
చిన్ని పరిచర్యలో
✍️ బ్రదర్. సుధాకర్ బాబు కోన
📧
Email: krajsudha2@gmail.com
📢 గమనిక: ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాము. కంటెంట్ లో ఎట్లాంటి మార్పులు చెయ్యకుండా షేర్ చేసి, మీరునూ ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులుకాగలరు. వందనములు!

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి