కొరింథీయులకు వ్రాసిన పత్రికలు-1

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*మొదటి భాగము- ఉపోద్ఘాతము*

 

1కొరింథీ 1:13

1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా *క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని*, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

3. మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక.

 

     దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు-10 సిరీస్ లో భాగంగా పౌలు మహాశయుడు వ్రాసిన మరో పత్రికలు ద్వారా మిమ్మల్ని మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇట్టి కృపనిచ్చిన దేవాదిదేవునికి నిండు వందనాలు! ఈసారి కొరింథీయులకు పౌలుగారు రాసిన రెండు పత్రికలను ధ్యానం చేస్తూ తద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నారో ధ్యానం చేసుకుందాము! క్రైస్తవ సంఘము ఎలా ఉండాలో అనేది దేవుడు పౌలుగారిని ఉపయోగించి ఘనమైన పత్రికలు వ్రాయించారు! వాటిని చదివి అర్ధం చేసుకుని వాటి ప్రకారం జీవించవలసిన అవసరం ప్రతి క్రైస్తవునికి ఉంది!

 

  ప్రియులారా! ఈ పత్రికలను ధ్యానం చేసేముందుగా అసలు ఈ పత్రికలను ఏ నేపధ్యంలో పౌలుగారు వ్రాసారో తెలుసుకుంటే ఈ పత్రికలోని భావం మరింత స్పష్టముగా మనకు అర్ధమవుతుంది. కాబట్టి నేపధ్యం చూసుకుందాం! మొదటగా మొదటి పత్రిక యొక్క నేపధ్యం చూసుకుందాం!

 

*వ్రాసినది*: అపోస్తలుడైన పౌలు మహాశయుడు!!!

 

*ఎప్పుడు రాశారు?* క్రీ.శ. 5255 మధ్యలో!

 

*ఎక్కడ నుండి రాశారు?* ఎఫెసీ పట్టణం నుండి! గమనించాలి- అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం ప్రకారం- పౌలుగారు ఎఫెసీ పట్టణంలో సుమారుగా మూడు సంవత్సరాలు ఉన్నారు! మొదటి సంవత్సరంలో మొదటి పత్రికను, మూడో సంవత్సరంలో అనగా సుమారు క్రీ.శ. 56-57లో రెండో పత్రికను వ్రాసారు!

 

*ఇంతకీ కొరింథీ పట్టణం ఎక్కడుంది?*

రోమా సామ్రాజ్యంలో అకయ ప్రాంతానికి ముఖ్య పట్టణం కొరింథీ. ఇది మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉన్న ఒకరేవు పట్టణం! ఇది ఒక వ్యాపారకేంద్రం!! గ్రీకులు ఎక్కువగా నివసించేవారు! కాబట్టి గ్రీకు నాగరికత ఈ పట్టణంలో ఉంది! ఏథెన్స్ పట్టణం నకు పశ్చిమంగా సుమారు 80 కి.మీ దూరంలో ఉంది! ఎఫెసీ పట్టణానికి సుమారు 180 మైళ్ళు అనగా 290 కి.మీ. దూరంలో ఉంది ఈ కొరింథీ పట్టణం! ప్రస్తుతం టర్కీ దేశం బోర్డర్ లో ఉంది!

 

*ప్రత్యేకతలు*: ఓడ రేవు! వ్యాపార కేంద్రం! విభిన్న సంస్కృతులు కలది! గొప్ప ధనిక నగరం! ఆడంభరంగా జీవించడం అలవాటు! విచ్చలవిడి తనం ఎక్కువ! కారణం వివిధమైన సంస్కృతులు గల పట్టణం కాబట్టి విచ్చలవిడితనం అలవాటు అయ్యింది ప్రజలకు! భయంకరమైన వ్యభిచారం, మద్యముకు బానిసలు అయిపోయారు! ఇంకా అనేకమైన మతాలు గల పట్టణం!

 

*సంఘమును ఎవరు స్థాపించారు?*

అపోస్తలుడైన పౌలుగారు!! అపోస్తలుడు నాలుగు సువార్త దండయాత్రలు (మిషనరీ యాత్రలు) చేస్తే, మూడు పూర్తిగా చేశారు, చివరిది పూర్తిచెయ్యకుండానే శిరచ్చేధనం కావించబడ్డారు అని మీకు తెలుసు! ఇలా మిషనరీ యాత్రలు చేసేటప్పుడు- రెండో మిషనరీ యాత్రలో థెస్సలోనికయ పట్టణంలో అల్లర్లు చెలరేగితే సంఘము ఆయనను ఎఫెసీకి పంపించింది. ఆ మార్గమధ్యంలో బెరయ, ఏథెన్స్ పట్టణాలలో పరిచర్య చేసి సంఘాలు స్తాపించి  కొరింథీ పట్టణంలో సుమారుగా సంవత్సరమున్నరకంటే ఎక్కువ రోజులు  ఉన్నారు పౌలుగారు! ఆ రోజులలో పౌలుగారు సంఘం స్థాపించారు అని మనకు అపోస్తలుల కార్యములు 18వ   అధ్యాయంలో కనిపిస్తుంది!

 

*ఈ పత్రిక ఎందుకు రాశారు?*

పౌలుగారు ఎఫెసీ పట్టణంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్నట్లు చెప్పుకున్నాము కదా! ఇలా ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తున్నప్పుడు పౌలుగారికి వర్తమానాలు వచ్చాయి! తీసుకుని వచ్చిన వారు క్లోయే ఇంటివారు! కొరింథీ సంఘంలో పౌలుగారు సేవచేసి వెళ్ళిన తర్వాత తిమోతి గారు సీల గారు సేవచేశారు. వారు కూడా వెళ్ళిన తర్వాత అపొల్లో గారు సేవ చేశారు! వారు వెళ్ళిపోయాక లోకల్ గా ఉన్న సంఘపెద్దలకు పరిచర్య అప్పగిస్తే అక్కడ మొదటగా వర్గ విభేదాలు వచ్చాయి! మన దేశంలో సంఘాలలో కుల వర్గాలు ఏర్పడినట్లు అక్కడ ధనికులకు పేదలకు మధ్య వర్గ విభేదాలు వచ్చాయి, ఇంకా ఫేవరిటిజం వచ్చింది. ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అనడం మొదలుపెట్టారు! వీరు కొట్టుకుంటూ ఉంటే మరికొందరు భయంకరమైన వ్యభిచారమునకు మత్తుపానీయాలకు అలవాటు పడ్డారు! సంఘంలో కొంతమంది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడం మొదలుపెట్టారు! ఈ సందర్భంగా క్లోయె ఇంటివారికి కొరింథీ పట్టణంలో ఏ రకంగా వ్యాపారాలు ఉన్నాయో అలాగే ఎఫెసీ పట్టణంలో కూడా వ్యాపారం ఉంది! కాబట్టి క్లోయె ఇంటివారు ఎఫెసీ పట్టణం వెళ్ళేటప్పుడు కొందరు పౌలుగారికి ఉత్తరం రాసి పంపించారు- బలి ఇచ్చిన వాటిని తినవచ్చా? చాలామంది ఆత్మపూర్ణత కలిగి సంఘములో మాట్లాడుచున్నారు, గాని ఎవరికీ ఏమీ అర్ధం కావడం లేదు! ఆత్మ వరాలు ఎలా ఉపయోగించాలి? పెళ్లి చేసుకోవచ్చా? ఒకవేళ తండ్రి తన పిల్లలను పెళ్లి చేసుకోకుండా ఉంచాలని నిర్ణయిస్తే ఆ నిర్ణయం మంచిదా కాదా? విశ్వాసులు పునరుత్థానం అవుతారు అని మీరు చెప్పారు- అయితే ఆ పునరుత్థానం కోసం మరింతగా దయచేసి చెప్పండి అంటూ ఉత్తరం రాశారు!

 

ఈ ఉత్తరం అందుకుని చదివి ఆత్మీయ సంబంధమైన విషయాలకోసం తెలుసుకోవాలనే వారి ఆలోచన  కొంచెం ఆనందం కలిగించినా, క్లోయె ఇంటివారు సంఘం కోసం చెప్పిన విషయాలు గుండెను బ్రద్దలు చేశాయి! సంఘం ముక్కలయిపోయేలా ఉంది. నేను అపోల్లో వాడను అంటూ ఒకడు, నేను పౌలు వాడను అంటూ ఒకడు, ఇంకా ధనిక పేద వర్గాలుగా అయిపోయింది సంఘం! ఇది ఎలా ఏర్పడింది అంటే కొరింథీ పట్టణం అత్యధిక ధనవంతమైన పట్టణం! అయితే మన దేశం లాగానే అక్కడ సంఘంలో కూడా అత్యధికులు పేదలే! అయితే ధనవంతులైన విశ్వాసులు పేదలైన విశ్వాసుల మీద పెత్తనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇంకా పేదలైన సంఘస్తులు ఉదయం పనికి వెళ్లి సాయంత్రం పూట జరిగే ఆరాధనలకు హాజరయ్యేసరికి ఆరాధన అయిపోయేది ఇంకా ప్రభు బల్ల ఆరాధన కూడా అయిపోయేది! ధనవంతులైన విశ్వాసులు ఆరాధన సమయం కంటే ముందుగా వచ్చేసి ఆరాధన ప్రారంభించమని పెద్దల మీద వత్తిడి చేసేవారు! వాళ్ళు ఎప్పటికో పనిపాటులు ముగించుకుని వస్తారు, అంతవరకూ మేము వేచి ఉండాలా అంటూ గొడవ చేసేవారు! ధనవంతులైన సంఘస్తులు గొప్ప కానుకలు ఇచ్చేవారు ఇంకా రాజకీయంగా కూడా పలుకుబడి గలవారు! అందుకే పెద్దలు ఏమీ అనలేక ఆరాధన ప్రారంభించేవారు, పేదలు రాబోయేసరికి ఆరాధన అయిపోయేది, ప్రభు సంస్కారం అయిపోయేది, ఇంకా వండినవంటలు కూడా అయిపోయేవి. పేదలకు ఏమీ ఉండేవి కావు! (ఆరోజులలో సంఘంలో ప్రతీరోజు ఆరాధన, ప్రతీరోజు ప్రభు బల్ల, అనంతరం బోజనాల కార్యక్రమం ఉండేవి). ఇది పేదలకు నిరాశ కలిగించి ధనికవర్గము పేద వర్గము క్రింద సంఘము విడిపోయింది!! 

ఇలాంటి స్తితిలో ఒకడు తన తండ్రి చనిపోతే తన తండ్రి రెండవ భార్య అనగా తన పిన్నిని ఉంచుకుని ఆమెతో సంసారం చెయ్యడం మొదలుపెట్టాడు! వాడు ధనికుడు! రాజకీయ నాయకుడు! సంఘం సంఘపెద్దలు అతని పలుకుబడి అతని ఆస్తి కుటుంభం చూసి భయపడి ఏమీ అనలేదు! ఈ విషయాలన్నీ తెలుసుకున్న పౌలుగారికి గుండె బ్రద్దలయ్యింది! ఎన్నో రోజులు ఉపవాసముండి ఏడ్చి ప్రార్ధన చేశారు! చివరికి ఆలోచించి ఒక ఉత్తరం రాసి పంపుతున్నారు! అదే ఈ కొరింథీ మొదటి పత్రిక!

 గమనించాలి- ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కాదు, దీనికి ముందుగా అనేక ఉత్తరాలు క్షేమ సమాచారం- సంఘాదరణ కోసం వ్రాసారు. అవి మనకు లభ్యం కాలేదు! అయితే ఈ మొత్తం ఉత్తరం సంఘానికి అవసరం కాబట్టి ఇది క్రొత్త నిబంధనలో చేర్చారు!

 

*ఎవరు రాశారు*?

పౌలు మహాశయుడు చెబుతుండగా సోస్తెనేసు అనే అసిస్టెంట్ సువార్తికుడు రాశాడు!

 

   *విషయ సూచిక*!! లేక *ముఖ్యాంశాలు*

 

పరిచయం:  1:19

సంఘంలో గల వర్గ విభజనలు 1:104:21

అనైతిక జీవనం కోసం 5:17:40

క్రైస్తవుడు బహు దేవతారాదికుడు  8:111:1

సంఘ జీవితం మరియు ఆరాధనా క్రమం 11:214:40

క్రీస్తు పునరుత్థానం మరియు విశ్వాసుల పునరుత్థానం 15:158

పేదలకు యూదయ సంఘం కోసమైన విరాళాలు  16:14

వందన విషయాలు మరియు ముగింపు  16:524

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*రెండవ భాగము*

 

1కొరింథీ 1:12

1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

     ప్రియదైవజనమా! నేపధ్యము చూసుకున్నాము గనుక ఇక మనము ఈ పత్రికను ధ్యానం చేసుకుందాం!

 

ప్రియులారా! మొదటి వచనంలో దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సోస్తెనేసును అంటూ మొదలుపెట్టారు! దేవుని చిత్తము వలననే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండటానికి నేను పిలువబడ్డాను అంటున్నారు! దీనికోసం మనం విస్తారంగా గలతీపత్రిక ధ్యానాలు ధ్యానించేటప్పుడు ధ్యానంచేసుకున్నాము! నాకు అపొస్తలత్వము దేవుని నుండే కలిగింది అని చెబుతున్నారు. ఇంకా  ఇదే మొదటి కొరింథీ 15:9--10 లో అంటున్నారు నేను అపోస్తలుడుగా పిలువబడటానికి అర్హుడను కాను ఎందుకంటే నేను సంఘమును హింసించాను. అయినా గాని దేవుడు తన మహా అద్భుతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను క్షమించి తన అపోస్తలునిగా చేసుకున్నారు అని చెబుతున్నారు....

9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

 

ఇక గతభాగంలో చెప్పుకున్నట్లు పౌలుగారు చెబుతుండగా సోస్తెనేసు అనే అసిస్టెంట్ పరిచారకుడు రాశారు కాబట్టి పౌలుగారు ఆయన పేరుకూడా రాస్తున్నారు!

 

ఇక రెండవ వచనములో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అంటూ అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికిని ఇంకా యేసుక్రీస్తు నామంలో ప్రతీస్థలంలో ప్రార్ధించు వారికిని అనగా మనలాంటి వారికిని శుభమని చెప్పి వ్రాయునది అంటున్నారు! మొదటి వచనంలో తాను యేసుక్రీస్తు యొక్క అపోస్తలునిగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటూ తనకోసం చెప్పుకుని, రెండో వచనంలో యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటూ విశ్వాసులకోసం రాస్తున్నారు! పౌలుగారు యేసుక్రీస్తునందు అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడితే కొరింథీ సంఘము లేక సార్వత్రిక సంఘము క్రీస్తుయేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు అని ఆత్మావేశుడై రాస్తున్నారు!

 

గమనించారా! సార్వత్రిక సంఘములో అంగములై ఉన్న ప్రతీ విశ్వాసి మొదటిగా పరిశుద్ధ పరచబడ్డారు తర్వాత పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు!! ఈ విషయం కోసం నేను రాసే ప్రతీ శీర్షికలోనూ తప్పకుండా రాస్తుంటాను! ఎందుకంటే విశ్వాసి క్రైస్తవుడు లోకములోనుండి పిలుబడ్డాడు! ఎందుకోసం పిలువబడ్డాడు అంటే  పరిశుద్దులుగా ఉండుటకోసం దేవుడే వారిని పరిశుద్ధ పరిచారు కాబట్టి పరిశుద్దులుగా తమ జీవితాంతము జీవించాలని పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు! కాబట్టి విశ్వాసి అన్యజనుల వలే మాట్లాడకూడదు, అన్యుల వలే  ప్రవర్తించకూడదు, అన్యుల వలే వస్త్రధారణ చేసుకోకూడదు, అన్యుల వలే మధ్యపానీయాలు తీసుకోకూడదు! అన్యజనుల వలే వారి ఆచార వ్యవహారాలూ చేయనే కూడదు! నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండాలి అనే ఖండితమైన ఆజ్ఞ మనకు లేవీకాండంలో మాటిమాటికి కనిపిస్తుంది.

లేవీ 11:44-45; 20:26; 21:8;

అదే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పారు!

1 Peter(మొదటి పేతురు) 1:14,15,16

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

ప్రతీ శీర్షికలో దీనికోసం చెబుతున్నా ప్రస్తుతం ఇది సంఘానికి అవసరం కాబట్టి మరోసారి దీనికోసం మీకు గుర్తుచేసి మిమ్మల్ని కదిలించాలని ఆశిస్తున్నాను!

 

1). మొదటగా పరిశుద్ద పరచబడిన వారై...

2) పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారు

 

  పౌలుగారు అంటున్నారు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడను అని చెప్పుకుంటున్నారు రోమా పత్రిక 1:1లో.

 

   పౌలుగారే కాదు ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన జనము. మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని అనిపించగలిగారు! దానియేలు 3;

నీవు ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడుఅని అనిపించగలిగావా??!!

పౌలుగారు 2 కొరింథీ 6:17 లో అంటున్నారు 

17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . .  

 

 కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ప్రత్యేకముగా ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి పాపిష్టి పనులు చేయకూడదు. మీరు రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడ్డారు.1పేతురు 2: 9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

 అంతేకాకుండా వెండి బంగారముల వంటి వెలగల వస్తువులచేత మీరు విమోచించ బడలేదు గాని క్రీస్తు రక్తముద్వారా విమోచించ బడ్డారు 1పేతురు 1:18; కాబట్టి ప్రత్యేకముగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎందుకు అంటే:

 

2) కారణం మనము దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. గతములో హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని, దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు దేవున్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,పరిశుద్దముగా జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవునికి ఇష్టులుగా జీవించగలము!  

 

  ఇక్కడ పౌలుగారు ఇంకా స్పష్టముగా దేవునికి ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45; 20:26; 21:8;

 

 అంతే తప్ప నన్ను కేవలం నమ్ముకో! కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, ఆ తరువాత నీవెలా ఉన్నా పర్వాలేదు. వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోక రాజ్యము ఇచ్చేస్తానని దేవుడు చెప్పలేదు. మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును ఉంటారు. అదే విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో

1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? 

2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.  . . . .

 

 ఇంకా అంటున్నారు ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన జీవితం. నీ డబ్బులు, ఇంకా మరేదో ఆశించడం లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు మందిరమైపోవాలి,. ఆ మందిరములో దేవుడు నిత్యమూ ఉండాలని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్దమైన జీవితం జీవిస్తావో, అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు పరిశుద్దముగా జీవిస్తే దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు ముచ్చటించినట్లు దేవుడే దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ నివాసం చేస్తారు. 

 

   కాబట్టి ప్రియ దైవజనమా! నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం జీవించు! సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పేరుకు తగ్గట్టు జీవించు! అప్పుడు దేవుడు నీతో అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు! 

మరి నీవు సిద్ధమా?

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*మూడవ భాగము*

 

1కొరింథీ 1:12

1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

గతభాగంలో పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడిన వారు అనేది ధ్యానం చేసుకున్నాము! ఈ రోజు ఇంకా మనము దేనికోసం పిలువబడ్డామో చూసుకుందాము....

 

ఈ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం: *పిలువబడిన వారికి*

చూశారా మనమందరం దేవునిచేత పిలువబడిన వారము. దేనికోసం పిలువబడిన వారు?

 

పౌలుగారు అంటున్నారు: పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు ...

రోమీయులకు 1: 2

దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది.

 

చూశారా మనము పరిశుద్దులముగా ఉండాలనే దేవుడు , మనలను పిలిచారు గాని ఈ పాపపు లోకంలో పాపపు పనులు చేసి పాపులుగా మారడానికి కానేకాదు! అందుకే పౌలుగారు అంటున్నారు: తన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తము....1థెస్సలొనికయులకు 4: 5

పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.

 

యాకోబు గారు భక్తికి ఇచ్చిన నిర్వచనంలో అంటున్నారు ఇహలోక మాలిన్యము అంటకుండా తన ఘటమును కాపాడుకోవడమే భక్తీ.... 1:27

తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.

 

కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్దులుగా ఉండాలి ....లేవీ 11:44,45; 21:8;

 

ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవరూ తండ్రిని చూడలేరు పరలోకం చేరలేరు అని గ్రహించాలి

హెబ్రీయులకు 12: 14

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

ఇక అదే పౌలుగారు దేనికోసం పిలువబడిన వారు అని చెబుతున్నారు అంటే కొంతమంది అపోస్తలులుగా ఉండటానికి పిలువబడ్డారు!

రోమీయులకు 1: 1

యేసు క్రీస్తు( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,

1కోరింథీయులకు 1: 1

దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

 

ఇదే వచనాన్ని ఇంకా మిగిలిన వాటికి వర్తింపజేస్తే కొంతమంది కాపరులుగా ఉండటానికి, కొంతమంది ప్రవక్తలగా ఉండటానికి, కొంతమంది భోధకులుగా ఉండటానికి కొంతమంది పరిచర్య చేయడానికి, కొంతమందిని విశ్వాసులుగా ఉండటానికి, కొంతమందిని అద్భుతాలు చేయడానికి పిలిచారు. అయితే వీరందరినీ పరిశుద్దులుగా ఉండటానికే పిలిచారు అంటి గ్రహించాలి.........

1కోరింథీయులకు 12: 28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

 

ఇక  స్వాతంత్రము పొందటానికి పిలువబడ్డారు.

1కోరింథీయులకు 7: 22

ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

 

ఇంకా మనందరిని నిత్యమైన స్వాస్త్యము పొందటానికి పిలువబడ్డాము... హెబ్రీ 9:15

ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.

 

నిత్యమైన స్వాస్త్యము అంటే: పరలోకంలో మనము అనుభవించబోయే మేలులు అన్నమాట!!!

 

అసలు నీ పిలుపు ఎంత మహత్తరమైనదో నీకు తెలుసా?

 

ఒకసారి రోమా 8:28౩౦ చదువుదాం....

28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

మరి ఇంతటి ప్రశస్తమైన పిలుపు, ఏర్పాటు కదా దానికి తగిన జీవితం జీవిస్తున్నావా?

 

అందుకే పేతురు గారు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటున్నారు

2పేతురు 1: 10

అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.

 

రోమా 1:7, 9:24

మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*4వ భాగము*

 

1కొరింథీ 1:12

1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

గతభాగంలో పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడిన వారు అనేది ధ్యానం చేసుకున్నాము! ఇంకా మనము దేనికోసం పిలువబడ్డామో చూసుకుందాము....

 

ఈ వచనంలో మరో ప్రాముఖ్యమైన విషయం: *పిలువబడిన వారికి*

 

      (గతభాగం తరువాయి)

 

ఇంకా దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచారు అంటే ఆయన కుమారుని సహవాసానికి పిలిచారు 1కొరింథీ 1:9

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

 

అది చాలా ఉన్నతమైనది ఫిలిప్పీ 3:14

క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

 

ఇంకా మనకు పాప విముక్తి దయచేయాలని మనలను పిలిచారు

2తిమోతికి 1: 10

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

ఇంకా చీకటినుండి తనవెలుగు లోనికి పిలిచారు! ఎందుకోసం పిలిచారు అంటే తన గుణాతిశయములను ప్రకటించడానికి:

1పేతురు 2:9

అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

 

ఇంకా దీవెనకు ఆశీర్వాదాలకు వారసులవ్వడానికి

1పేతురు 3: 9

ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

 

ఇంకా శాశ్వత మహిమకు పిలిచారు

1పేతురు 5: 10

తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

 

ఇంకా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డారు.

ప్రకటన గ్రంథం 19: 9

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.

 

గమనించాలి- ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు అతిశ్రేష్టులు అన్నమాట! గమనించాలి దేవునికి పక్షపాతం అనేది లేదు! అందరూ దేవునికి సమానులే! కాబట్టి రక్షణ  పొందిన వారినందరినీ దేవుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలిచినా కొందరే ఆ విందులో పాల్గొనే అర్హతను పొందుకుంటారు! వారు ఎవరంటే జయించిన వారు! జయజీవితం పొందిన వారు! తమ ఘటమును కాపాడుకున్నవారు! తమ సాక్ష్యమును కాపాడుకున్నవారు!  వాక్యానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించిన వారు అన్నమాట!  వీరే జయించిన వారు! పాపము మీద జయం! లోకాశల మీద జయం! ఆలోచనలో జయం! తలంపులలో జయం! చూపులో జయం! అన్నింటిమీద జయం కలిగిన జయవీరులు అన్నమాట! వీరే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు!

 

ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే గొర్రెపిల్ల పెండ్లివిందు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది. అనగా ఈ గొర్రెపిల్ల పెండ్లివిందులో ఎవరుంటారు? ఎత్తబడిన వారు! ఎత్తబడిన వారే జయించిన వారు! వీరే అర్హులు!

 

 ప్రియ దైవజనమా! నీవు నేను ఈ గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడ్డాము కదా! మరి అందుకు తగినట్లు జీవిస్తున్నావా? ఎత్తబడే గుంపులో నీవున్నావా? ఒకవేళ ఈరోజే యేసయ్య వస్తే ఈరోజే సంఘము ఎత్తబడితే నీవు ఎత్తబడతావా? అటువంటి జీవితం జీవిస్తున్నావా? విడువబడితే ఆ శ్రమలు నీవు పడలేవు అని నీకు గుర్తుందా?

 

అందుకే పౌలుగారు అంటున్నారు ఎఫెసీ 4:2లో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకోండి అంటున్నారు....

 

పేతురు గారు అంటున్నారు:

1 Peter(మొదటి పేతురు) 1:14,15,16

14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు  అంటున్నారు:  పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు కొందరే!!!

మత్తయి 22: 14

కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

 

మరి నీవు పిలువబడ్డావు కదా, ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా?

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*5వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-1*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! గతంలో చెప్పినట్లు 49 వచనాలు వందన వచనాలు!

ఎవరికి వందనాలు చెబుతున్నారు?

 పౌలుగారు దేవునికి వందనాలు చెబుతున్నారు! దేనికోసం వందనాలు చెబుతున్నారు?

వారు విశ్వాసములో నిలిచి ఫలిస్తున్నారు అని దేవునికి వందనాలు చెబుతున్నారు!

 

గమనించాలి- పౌలుగారు ఈ విధంగా వారికోసం అనగా సంఘస్తుల కోసం  దేవునికి వందనాలు చెప్పడం దాదాపు అన్ని పత్రికలలోనూ ఉంది. కేవలం గలతీ పత్రిక తప్పించి మిగిలిన అన్ని సంఘాలకు రాసిన పత్రికలలోనూ ఈ వందనాలు ఉంటాయి! దేవునికి కృతజ్ఞత ప్రతీ పత్రికలోను చెప్పారు. గలతీయులకోసం  ఎందుకు చెప్పలేదు అంటే వారు విశ్వాసంలో ఉండక, పౌలుగారు బోధించిన సత్యములో ఉండక భిన్నమైన మార్గములోనికి శీఘ్రముగా తొలిగిపోయారు అందుకే వందనాలు చెప్పకుండా అక్షింతలులాంటి కొరడా తీసుకుని వారికి ఉత్తరం రాశారు!

 

ఒకసారి ఏ ఏ సంఘాల కోసం  దేవునికి ఎలాంటి కృతజ్ఞతలు చెప్పారో చూద్దాం!

రోమీయులకు 1: 8

మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

తర్వాత ఈ పత్రికలో మీద వచనాలు!

 

Philippians(ఫిలిప్పీయులకు) 1:3,4,5,6

3. మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైయుండుట చూచి,

4. మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

5. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు,

6. నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

Ephesians(ఎఫెసీయులకు) 1:15,16

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును (అనేక ప్రాచీన ప్రతులలో-  ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

 

Philippians(ఫిలిప్పీయులకు) 1:5,6,7

5. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు,

6. నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

7. నా బంధకముల యందును, నేను సువార్త పక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతో కూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియున్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 1:2,3

2. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

3. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:3,4

3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

4. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.

 

  2 Timothy(రెండవ తిమోతికి) 1:3,4

3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,

4. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనైయున్నాను.

 

Philemon(ఫిలేమోనుకు) 1:4,5

4. నీ ప్రేమను గూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని

5. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

 

ఇలా ప్రతీ పత్రికలోను సంఘము విషయమై పౌలుగారు దేవునికి వందనాలు చెబుతున్నారు! అందుకే ప్రతీ విషయములోను మీరు వందనాలు చెప్పమని రాస్తున్నారు!

 

కొలస్సీయులకు 3: 17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

 

ఎఫెసీయులకు 6: 18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

ఇక పౌలుగారు కొరింథీయుల విషయమై దేవునికి వందనాలు చెబుతున్నారు అని చూసుకున్నాము గనుక ఏఏవిషయాల కోసం పౌలుగారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో చూసుకుందాం!

 

ప్రియులారా 4వ వచనంలో క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నారు!

మొట్టమొదటిది మీకు అనుగ్రహించబడిన దేవుని కృప! దేవుడు వారికి ఎలాంటి కృపలను ఇచ్చారో క్రింద వచనాలలో వ్రాయబడి ఉంది!

అవును మనము కూడా మనకు అనుగ్రహించబడిన కృప విషయంలో అనుదినం అనుక్షణం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నాము! పౌలుగారు అంటున్నారు నేనైమైయున్నానో అది దేవుని కృపవలన మాత్రమై అయి ఉన్నాను అంటున్నారు!

1కోరింథీయులకు 15: 10

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

 

అవును మనము ఇంతవరకు సజీవముగా ఉన్నామంటే అది దేవుని కృప వలన మాత్రమే!  నిజం చెప్పాలంటే గతకాలంలో కరోనా విషయంలో మనం బ్రతుకుతాము అనే ఆశ మనలో లేదు! కొన్ని కోట్లమంది కాలగర్భంలో కలిసిపోయారు! ఉదయాన్నే ఫోన్ మోగింది అంటే ఎవరో చనిపోయారు అని అర్ధం! భయముతో వణికిపోయాము! సుమారు రెండు సంవత్సరాలు మాస్క్ ముసుగులో బ్రతికాము!నేడు ఈరకంగా సజీవంగా ఆరోగ్యంగా  ఉన్నాము అంటే అది కేవళం కేవలం దేవుని కృపమాత్రమే! దానిని బట్టి నేనైతే అనుదినం దేవునికి వందనాలు చెబుతూనే ఉంటాను!

 

ఇంకా అనేకమందికి లేని రక్షణభాగ్యము దేవుడు మనకు ఇచ్చారు! ఇది దేవుని కృప వలన మాత్రమే ఈ రక్షణ మనకు దొరికింది! మనము భక్తిపరులము నీతిమంతులము మంచివారము గొప్పకులము వారము అని ఎంతమాత్రము కాదు! నిజానికి మనము పనికిమాలిన వారము! పాపులము! పాపములో పుట్టి పాపములో కొట్టుకుపోతున్న వారలము! అయినా దేవుడు తన ఉచితమైన కృపద్వారా మనలను ఎన్నుకుని ఏర్పరచుకుని తన రక్షణ భాగ్యము మనకు ఇచ్చారు!  మనకంటే భక్తిపరులకు  గొప్ప వారికి ధనవంతులకు బలవంతులకు ఇలాంటి రక్షణ లేదు! కాబట్టి మనకు లభించిన రక్షణ దేవుని కృపవలన మాత్రమే దొరికింది కాబట్టి ఈ కృప విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నాము!

 

ఎఫెసీ పత్రికలో ఈ కృప కోసం మొదటి రెండు అధ్యాయాలలో పౌలుగారు చాలా వివరంగా రాస్తున్నారు! ఒకసారి చూద్దామా!!

ఎఫెసీ 1:312

3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,

9. *మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను*.

10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.

11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని,

12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

 

2:110

 

1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున (మూలభాషలో- యుగము చొప్పున) మునుపు నడుచుకొంటిరి.

3. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై (మూలభాషలో- ఉగ్రత పిల్లలమై) యుంటిమి.

4. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.

5. *కృపచేత మీరు రక్షింపబడియున్నారు*.

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము,

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.

8. *మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే*.

9. *అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు*.

10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

చివరకి మనకు కలిగిన ప్రతీ ఈవి, మనం అనుభవిస్తున్న ప్రతీది ఆయన కృపవలనే మనం పొందుకున్నాము! కాబట్టి ఆయన కృప విషయమై అనునుదినము కృతజ్ఞత కలిగిఉండాలి!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*6వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-2*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  పౌలుగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని చూసుకుంటూ కృప విషయంలో మొదటగా కృతజ్ఞత చెబుతున్నట్లు ధ్యానిస్తున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

ఇక మనం కృప కోసం విస్తారంగా చూసుకుంటే దేవుని కృప కోసం దాదాపు భక్తులందరూ దానిని అనుభవించి చెబుతున్నారు! కృప వలన తాము ఏమేమి పొందుకున్నామో, కృప లేకపోతే దేనిని పోగొట్టుకుంటామో వివరంగా చెబుతున్నారు! ఇంకా కృప యొక్క విశిష్టతలు కూడా చూసుకోవచ్చు!

 

నోవాహు గారు దేవుని కృప పొందుకున్నారు అందుకే జల ప్రళయములో తప్పించుకున్నారు. ఆదికాండం 6:8

అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

 

ఇక గర్భఫలం కావాలంటే దేవుని కృప కావాలి! ఇది రాహేలు మరియు సమూయేలు గారి తల్లి హన్నా మాటలు! ఆదికాండం 30:8

1 సమూయేలు 1:18

 

సౌలు రాజు తన రాజరికం పోగొట్టుకోవడానికి మరో కారణం దేవుని కృపకు దూరం కావడమే!

2సమూయేలు 7: 15

నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.

 

దేవుడు దావీదును సోలోమోనును రాజుగా స్తాపించడానికి ఆయన కృప కారణమైంది!

2 దిన వృత్తా 1:8

సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెను నీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక

 

కృప కోసం యోబు గారి మాటలు విందాం!

యోబు 10: 12

జీవము ననుగ్రహించి నా యెడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి.

 

దావీదు గారి మాటలు విందాం!

కీర్తనలు 26: 3

నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను

 

కీర్తనలు 32: 10

భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది.

 

కీర్తనలు 33: 22

యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక.

 

36:5,7

5. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.

7. దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.

 

ఇంకా మిగిలిన కీర్తనాకారులంటున్నారు

57:9

కీర్తనలు 57: 9

నీ కృప ఆకాశము కంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది.

 

కీర్తనలు 63: 3

నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.

 

కీర్తనలు 69: 16

యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతను బట్టి నాతట్టు తిరుగుము.

 

కీర్తనలు 86: 13

ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.

 

కీర్తనలు 94: 18

నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

 

103:11, 18

11. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

18. ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

 

కీర్తనలు 117: 1

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది....... ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.

 

కీర్తనలు 130: 7

ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

 

136 వ కీర్తన మొత్తము ఆయన కృప నిరంతరమూ ఉండును అని చెబుతున్నారు!

 

కృపను గూర్చి దేవుని వాగ్దానములు :-

యెషయా 54: 10

పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

యిర్మియా 31: 3

చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

 

యెరూషలేము కట్టించే విషయంలో

జెకర్యా 4: 7

గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.

 

అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు

యోహాను 1: 16

ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.

 

యేసయ్య అంటున్నారు:

యోహాను 6: 65

మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువును బట్టి మీతో చెప్పితిననెను.

 

పౌలుగారి మాటలు విందాం:

రోమా 5:21

ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

 

రోమా 6:1

ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా?

రోమీయులకు 6: 2

అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

 

రోమా 10:12

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

 

1కొరింథీ 15:10

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

 

2కొరింథీ 12:9

అందుకు: *నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను*. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము (లేక, నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

 

కృపవలన మాత్రమే అపోస్తలత్వము నాకు కలిగింది అంటున్నారు:

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

చివరికి మనము పాపులమై యున్నా దేవుడు మనలను ప్రేమించి రక్షించారు కాబట్టి మనము  తప్పులు అపరాధాలు చేసినప్పుడు పశ్చాత్తాప పడి ఆయనను వేడుకుంటే ఆయన క్షమిస్తారు అంటున్నారు :

హెబ్రీ 4:16

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

 

హెబ్రీయులకు 12: 28

అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,

 

యాకోబు గారు అహంకారులకు ఈ కృప లేదు అంటున్నారు

యాకోబు 4: 6

కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

 

పేతురు గారు అంటున్నారు:

1పేతురు 1: 13

కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.

 

1పేతురు 5: 5

చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.

 

కాబట్టి మనము కూడా అట్టి కృపను పొందుకుందాం!

హెబ్రీ 13:25

కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్‌!

 

ఫిలేమోను 1:25

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్‌!

 

ప్రకటన 22:21

ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు (కొన్ని ప్రాచీన ప్రతులలో, పరిశుద్ధులకందరికి అని పాఠాంతరము) తోడై యుండును గాక. ఆమేన్‌!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*7వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-3*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! గతంలో చెప్పినట్లు 49 వచనాలు వందన వచనాలు!

పౌలుగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని చూసుకుంటూ కృప విషయంలో మొదటగా కృతజ్ఞత చెబుతున్నట్లు ధ్యానిస్తున్నాము!

 

     ఇక మనము ఏ ఏ విషయాలలో వారి విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి యున్నదో చూసుకుందాం! అనగా ఇవి ఒకరకంగా కొరింథీ సంఘము యొక్క ధన్యతలు అని భావించాలి!

 

5వ వచనంలో మొదటి కృప ఉన్నది: క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి యున్నందున ఆయన యందు మీరు ప్రతీ విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానము లోను ఐశ్వర్యవంతులైరి అంటున్నారు. గమనించాలి మొదటగా వారిలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచిబడింది! కారణం- కేవలం యేరూషలేములోనే కాకుండా భూలోకంలో ఎక్కడ ఈ సత్య సువార్త ప్రకటించ బడిందో అన్ని చోట్ల మొదట అసమ్మతి వ్యతిరేకత ఏర్పడింది! ఎక్కడెక్కడ ఈ సువార్త ప్రకటించబడిందో ప్రతీచోట సువార్తకు ఆటంకము కలిగి విశ్వసించిన వారికి మరియు ప్రకటించే వారికి శ్రమలు హింసలు శోధనలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది. అనేకమంది చంపబడ్డారు, బాధించబడ్డారు, అవమానాలు పొందారు! సువార్త ప్రారంభించిన యేసుక్రీస్తుప్రభులవారితో ప్రారంభమైన ఈ హింస దానిని ఇప్పుడు  ప్రకటిస్తున్న మనకు కూడా జరుగుతుంది. సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి! కారణం ఈ యుగ సంబంధమైన దేవత అన్యులు రక్షించబడకుండా వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలిగిస్తూ వారు సువార్తను అంగీకరించకుండా చేస్తూ వారిని సువార్తకు వ్యతిరేకులుగా చేస్తుంది! అది వారి తప్పు కాదు! సాతాను గాడి కార్యము!

2కోరింథీయులకు 4: 4

దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

 

గనుక మనము ముందుగా సాతానుని బంధించి అప్పుడు సువార్త ప్రకటిస్తే అప్పుడు సువార్త ఫలిస్తుంది!  ఇందంతా ఎందుకు చెబుతున్నాను అంటే సువార్తకు ఆటంకాలు కొరింథీ పట్టణంలో కూడా కలిగాయి! ఈ విషయం మనకు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో కనిపిస్తుంది! మొదటగా పౌలుగారు సువార్తను ప్రకటిస్తే కొరింథీ పట్టణంలో ఉన్న చెదిరిపోయిన యూదులు ఆటంకాలు కలిగించారు! 

ఎదిరించారు! అందుకని పౌలుగారు సీలగారు తిమోతి గారు అన్యుల యొద్దకు వెళ్లి తీతియు అనే యూస్తూ అనే ఒక విశ్వాసి ఇంట్లో నివాసం చేసి అక్కడ 18 నెలలు సువార్త ప్రకటించారు. అప్పుడు గొప్ప అల్లరి కలిగి పౌలుగారిని బలవంతంగా న్యాయసభకు ఈడ్చుకుని పోయారు! న్యాయాధిపతి పట్టించుకోక పోతే పౌలుగారు సైనికుల చేతిలో ఉన్నారు కాబట్టి ఆయనను ఏమీ చేయలేక సమాజమందిరపు అధికారిని అనగా సోస్తెనేసుని కుక్కను కొట్టినట్లు న్యాయాధిపతి ముందే కొట్టారు!  ఆ ఆతర్వాత కూడా పౌలుగారు అనేకదినములు ఈ ఆటంకాలు మధ్యనే సేవచేసి ఎఫెసీ పట్టణం వెళ్ళారు! పౌలుగారు వెళ్ళిపోయాక అక్కడ సువార్తకు ఆటంకాలు శ్రమలు హింసలు ఆగలేదు! కొనసాగాయి! అన్ని సంఘాలవలె శ్రమలు విస్తరించే కొలదీ సువార్త విస్తారంగా వ్యాపించింది గాని వారి విశ్వాసము సడలలేదు, వారు విశ్వాసమును కాపాడు కొన్నారు! అందుకే  క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్తిరపరచబడినందున అంటున్నారు. ఇన్ని శ్రమలు కలిగినా గాని క్రీస్తుయేసు పట్ల వారికున్న సాక్ష్యము చెక్కుచెదరలేదు!!! ఇలాంటి సాక్ష్యము మనము కూడా కలిగి ఉండాలి!

 

  ఒకసారి పౌలుగారు వారికి ఏమని సువార్త సాక్ష్యము చెప్పారో చూసుకుందాం!

1కోరింథీయులకు 15: 15

దేవుడు క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

 

పౌలుగారు కొరింథీ సంఘానికి దేవుడు క్రీస్తుయేసు ప్రభులవారిని మరణము నుండి లేపారు అనిచెప్పారు. ఆ సాక్ష్యమును వారు నమ్మి విశ్వసించి స్థిరముగా నిలబడ్డారు!

కొరింథీ సంఘమే కాదు థెస్సలోనికయ సంఘానికి కూడా పౌలుగారు రాస్తున్నారు మేము మీకిచ్చిన సాక్ష్యమును మీరు నమ్మి విశ్వసించారు 2 థెస్స 1:10

ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

 

తిమోతి కి కూడా చెప్పారు సాక్ష్యము

1తిమోతికి 2: 6

ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

1తిమోతికి 2: 7

ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.

 

కాబట్టి అదే సాక్ష్యమును సువార్త సత్యమును మనమును విన్నాము విశ్వసిస్తున్నాము. దానిలో స్థిరపడి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు!

 

దేవుని గూర్చిన సాక్ష్యమే కాదు- మనము కూడా మన సాక్ష్యమును కాపాడుకోవాలి! సాక్ష్యమును కాపాడుకోవాలి అంటే మన శీలాన్ని కాపాడుకోవాలి! సాక్ష్యము అనగా కేవలం శీలము మాత్రమే కాదు, మన నడవడి ప్రవర్తన!! దురదృష్టవశాత్తూ నేటిరోజులలో అనేకులకు చివరికి గొప్పగొప్ప దైవసేవకులకు కూడా బయట మంచి సాక్ష్యము ఉంది గాని తమ సొంత ఇంట్లో సొంత గ్రామలో పట్టణంలో సంఘంలో మంచి సాక్ష్యము లేక జీవిస్తున్నారు! సాక్ష్యార్ధమైన జీవితం లేనేలేదు! పౌలుగారు నేను క్రీస్తును పోలి నడుచుకొన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అనగా నా లాగే క్రీస్తుని పోలి నడుచుకోండి అని సవాలుచేస్తున్నారు! 1కొరింథీ 11:1;

ఇంకా మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. నా పరుగు తుదముట్టించిని... అంటున్నారు. 2తిమోతి 4:7,8

 అలాంటి జీవితం అనేకులకు లేదు! బయట మంచివాడు గాని ఇంట్లో త్రాగుబోతు, తిట్టుబోతు, వ్యభిచారి, లంచగొండి. ఇలాంటి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి నేటి రోజులలో! బయట మంచి ప్రసంగీకుడు, ప్రార్ధనాపరుడు, దేవునికి ఇచ్చేవాడు, సువార్త ప్రకటించేవాడు! గాని సొంత ఇంట్లో సొంత గ్రామంలో సొంత సంఘంలో సాక్ష్యము లేనివారిగా జీవిస్తున్నారు! అబ్రాహాము గారి గురుంచి నోవాహు గురుంచి హనోకు గారి గురించి దానియేలు దావీదు గారి గురించి బైబిల్ మంచి సాక్ష్యము చెబుతుంది. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఒకరిని, నా స్నేహితుడు అని, నా ఇష్టానుసారుడు అని, నీతిమంతుడు యధార్ధవర్తనుడు అనియు ఇలాంటి సాక్ష్యము సాక్షాత్తుగా దేవుడే చెప్పారు. హెబ్రీ 11:4,5,39 మరి నీకోసం ఎలాంటి సాక్ష్యం చెప్పబడుతుంది? నీవు సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నావా లేక పోగొట్టుకున్నావా?

 

యెషయా గారు అంటున్నారు అయ్యా మేము చేసిన తిరుగుబాటు మేము చేసిన పాపములు  మామీద సాక్ష్యము చెబుతున్నాయి 59:12

 

హోషేయ అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలయొక్క గర్వము వారిమీద సాక్ష్యము పలుకుతుంది  7:10

 

ఒకరోజు మన అందరికోసం దేవుడు సాక్ష్యము పలుకబోతున్నారు అంటున్నారు మీకా గారు 1:2

 

కీర్తన గ్రంధములో కూడా దేవుడు అంటున్నారు నేను మీమీద సాక్ష్యము పలుకుతాను అంటున్నారు! 50:7

 

ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును మనమీద సాక్షులుగా పెట్టారు! యెషయా 1:2

ద్వితీ 31:28 .... కారణం మనిషి చేసే పాపం ఆకాశం క్రింద, భూమి మీదనే చేస్తారు కాబట్టి ఈ రెంటిని సాక్ష్యం పెట్టారు! మరి అవి నీమీద సాక్ష్యం పలుకబోతున్నాయి!

ఆ సాక్ష్యము ఎలాంటిదిగా ఉండబోతుంది?? ఆ సాక్ష్యము మంచిదై ఉంటే నీవు బ్రతుకుతావు! పరలోకాన్ని పొందుకుంటావు! ఒకవేళ మంచిది కాకపోతే విడిచిపెట్టబడి అగ్ని గుండములో త్రోయబడతావు!

 

కాబట్టి మొట్టమొదటిగా నీవు పొందిన సాక్ష్యాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా హింసలు బాధలు ఎదురైనా కడవరకు నిలబెట్టుకో! విశ్వాసం కాపాడుకో!

రెండవదిగా నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకో! కష్టాలు శోధనలు ఎదురైనా సాతాను శోధనలు శోదించినా దానియేలు షడ్రక్ మేషక్ అబెద్నేగోల వలే కాపాడుకో!

 

 కొరింథీ సంఘము కాపాడుకుంది, వారి సాక్ష్యము స్థిరపరచిబడి యుంది అని పౌలుగారు సాక్ష్యం పలుకుతున్నారు. మరి నీవు నిలబెట్టుకుంటావా??!!!

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

ఆమెన్!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*8వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-4*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! పౌలుగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని చూసుకుంటూ కృప విషయంలో మొదటగా కృతజ్ఞత చెబుతున్నట్లు ధ్యానిస్తున్నాము!

 

     ఇక మనము ఏ ఏ విషయాలలో వారి విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి యున్నదో చూసుకుందాం! అనగా ఇవి ఒకరకంగా కొరింథీ సంఘము యొక్క ధన్యతలు అని భావించాలి!

 

ఇక రెండవ కృప లేక ధన్యత ఏమిటంటే మీరు ప్రతీ విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి! గమనించాలి ప్రతీ విషయము అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి అంటున్నారు!  పౌలుగారు ఉపదేశించిన ఉపదేశాలు అన్నీ పాటించి సమస్త జ్ఞానమును పొందుకున్నారు అన్నమాట! పౌలుగారు ఎప్పుడూ తన పత్రికలలో భౌతిక ఆశీర్వాదాల కోసం చెప్పలేదు! గాని ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయాల కోసమే చెప్పారు! అనగా ఇప్పుడు కొరింథీయులు ఆధ్యాత్మిక విషయాలలో ఆధ్యాత్మిక ఉపదేశంలో ఆత్మీయ జ్ఞానముతో నింపబడి ఐశ్వర్యవంతులైరి అన్నమాట! ఇక్కడ ప్రకటన ౩:౩లో సార్దీస్  సంఘమునకు చెప్పినట్లు ఏమి వింటిరో ఏ ఉపదేశము పొందితిరో దానిని పట్టుకోండి అనడం లేదు! దానిలో ఐశ్వర్యవంతులయ్యారు అనగా చాలా గొప్పగా ఆ విషయంలో ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి చెందారు అంటున్నారు! ....ప్రకటన గ్రంథం 3: 3

నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.

 

దేవుడు కొరింథీయులకే కాదు తనకు ఎవరు మొరపెట్టినా ఈ ఆధ్యాత్మిక దీవెనలు మెండుగా కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు! అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తియ్యబడును అంటూ చెబుతూ యేసుక్రీస్తుప్రభులవారు తనను అడిగిన ప్రతీవారికి పరిశుద్ధాత్మను తప్పకుండా ఇస్తారు అంటున్నారు లూకా సువార్తలో...

లూకా 11: 13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

 

పౌలుగారు రోమా పత్రికలో అంటున్నారు 10:12 లో తనకు మొరపెట్టే ప్రతీవారికి దేవుడు తప్పకుండా ఇస్తారు ఏ బేధం లేదు అంటున్నారు!..

రోమీయులకు 10: 12

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

రోమీయులకు 10: 13

ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.

 

అలా మీకు ఇవ్వాలనే ఆయన మనకోసం దరిద్రుడు అయిపోయారు అంటున్నారు 2కొరింథీ 8:9 లో

2కోరింథీయులకు 8: 9

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

 

మత్తయి 7:11 లో మీరు చెడ్డవారు అయి ఉండి కూడా మీ పిల్లలకు మంచివి ఇవ్వాలని చూస్తారు కదా అలాంటిది మన పరలోకపు తండ్రి మీరు అడిగితే తప్పకుండా మంచివి ఇస్తారు అనగా ఆధ్యాత్మిక మేలులు అన్నీ తప్పకుండా ఇస్తారు. మీరు కేవలం అడగండి అంటున్నారు...

మత్తయి 7: 10

మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా

మత్తయి 7: 11

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.

 

ఇక్కడ ఈ సంఘానికి దేవుడు తన సేవను పరిచర్యను సంపూర్ణంగా ధైర్యంగా చెయ్యడానికి కావలసిన ప్రతీ ఈవి ప్రతీ ఆధ్యాత్మిక సామర్ధ్యాలు అన్నీ ఇచ్చారు అంటున్నారు. వాటిని ఉపయోగించి వారు ముందుకు సాగిపోవాలి అంతే!! 

 

చూడండి 7వ వచనంలో అంటున్నారు గనుక మీరు ఏ కృపావరంలో కూడా లోపము లేకుండా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అంటున్నారు.. అంతటి ఆధ్యాత్మిక స్థాయిలో ఈ కొరింథీ సంఘము ఉంది! ఆధ్యాత్మిక దీవెనలే కాదు అన్ని కృపావరాలు పొందుకుంది అంటున్నారు! ఇంకా వరాలు ఫలాలు పొందుకున్న వీరు దేవుని రాకడకొరకు ఎదురుచూస్తున్నారు అంటున్నారు!

 

గమనించాలి- కొరింథీ సంఘమైతే దేవుని రాకడ కొరకు సిద్దపడి ఆయనను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారు! మనమైతే ఆయన రాకడకు ఇంకా సిద్దముగా లేము! మన బ్రతుకులు బాగాలేవు! మనలో ఆధ్యాత్మిక జీవమే లేదు! ఆధ్యాత్మిక ఫలములు వరములు ఫలములు లేనేలేవు! ఈ సంఘము అన్నింటినీ పొందుకుని రాకడకు సిద్దముగా ఉంది! సంఘమా నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన రాకడకు??!!!

 

పౌలుగారు ఈ సంఘానికి బోధించిన సత్యము లేక సువార్త విశ్వాసులలో గల ఆధ్యాత్మిక జీవము కనబడాలి అని! దానిని వీరు నమ్మి విని ఆ జీవాన్ని పొందుకుని ముందుకు పోతున్నారు! ఆ ఆధ్యాత్మిక జీవము సత్యము అని వీరు ఋజువుచేస్తున్నారు! నులివెచ్చని స్తితి కనబడటం లేదు! నేటి మన సంఘాలలో కనిపిస్తున్న జీవము లేని స్థితి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధానము, నిర్జీవము లేదు ఈ సంఘములో! ఆధ్యాత్మిక జీవము ఉట్టి పడుతుంది! వరాలు ఫలాలతో ఈ సంఘము పరలోకము వైపుకు దూసుకుపోతుంది!

 

గమనించాలి ఈ సంఘములో ఉన్న కేవలం నాయకులకు ఉపదేశకులు పరిచారకులు మాత్రమే కాదు, విశ్వాసులు అందరూ ఈ ఆధ్యాత్మిక జీవములో పాలుపొందారు అని మాట్లాడుతున్నారు పౌలుగారు!

 

ఒకసారి కృపావరము అంటున్నారు కాబట్టి పౌలుగారి భాషలో కృపావరాలు ఏమిటో ఒకసారి చూసుకుందాం!

1కొరింథీ 12:411 , 2731

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

 

ఇంకా రోమా పత్రికలో అంటున్నారు ఇలా పొందుకున్న కృపావరాలు పెట్టిలో పెట్టి మూడు తాళాలు వేసి భద్రపరచుకోవాలి అనడం లేదు! వాటిని ప్రతీరోజు ఉపయోగిస్తూ వాడుతూ అందరినీ వెలిగిస్తూ మనము వెలుగుతూ ఉండాలి!

రోమా 12:68

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

దైవజనుడు- మెథడిస్ట్ మిషనరీ- ప్రపంచంలో వీధులలో సువార్త ప్రకటన అనే విధానం మొదలుపెట్టిన వీరుడు జార్జి విట్ఫీల్డ్ గారు ఒకమాట అంటూ ఉండేవారు: *తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలు*! కేవలం స్లోగన్ చెప్పి ఊరుకోలేదు! భయంకరమైన మంచు కురవడం వలన టీబీ వ్యాధి సోకినా ఆగిపోకుండా సువార్త ప్రకటిస్తూ, రక్తం కక్కుకుంటూ దేకురుకుంటూ గుఱ్ఱం మీద ఇంగ్లాండ్, స్కాంట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ దేశాలలో సువార్తను ప్రకటిస్తూ రక్తం కక్కుకుని చనిపోయాడు ఆ మహానుభావుడు! దేవుడు ఆయనకిచ్చిన సమస్త తలాంతులు దేవునికోసమే వాడారు, అలాగే దేవుడిచ్చిన ఆరోగ్యం, గొంతు, ప్రకటించే టెక్నిక్ అన్నీ దేవునికోసమే వాడి నూటికి నూరు పాళ్ళు అరిగిపోయి కరిగిపోయారు కొవ్విత్తిలా!

మరి నీవు కూడా ఇలాంటి వరాలు ఫలాలు పొందుకున్నావు కదా! వాటిని దేవునికోసం ఉపయోగిస్తున్నావా లేక నీ స్వార్ధం కోసం, నీ ధన సంపాదన కోసం, కార్లు బంగళాలు కట్టుకోవడం కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగిస్తున్నావా?

ఆ దైవజనులు మిషనరీలు దేనిని లెక్కించకుండా   సువార్తను ప్రకటించారు గనుకనే నీవునేను ఈ రక్షణను పొందుకున్నాము! మరి నీవు అలా చేస్తావా? దేవుడిచ్చిన వరాలు ఫలాలు దేవునికోసం ఉపయోగిస్తావా? దేవుడు నీకిచ్చిన గాత్రము, దేవుడు నీ కిచ్చిన బోధించే చాకచత్యము దేవుడు నీకిచ్చిన వాద్య పరికరాలు వాయించే తలాంతు దేవునికోసం వాడతావా??!!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*9వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-5*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

     ఇక మనము ఏ ఏ విషయాలలో వారి విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి యున్నదో చూసుకుంటున్నాము! అనగా ఇవి ఒకరకంగా కొరింథీ సంఘము యొక్క ధన్యతలు అని భావించాలి!

 

ప్రియులారా! దేవుడు వారికీ కృపావరాలు ఇచ్చారు అని గతభాగంలో చూసుకున్నాము గనుక ఈ కృపావరాల లోనే పది మడతల (టెన్ ఫోల్డ్ మినిస్ట్రీ)& ( ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ) లేక ఐదు మడతల పరిచర్య కూడా ఉంది. కాబట్టి వాటిని మరోసారి క్లుప్తంగా ధ్యానం చేద్దాం!

 

        *దేవుని సేవ-పరిచర్య రకములు-1*

 

  Ephesians(ఎఫెసీయులకు) 4:13,15

13. _పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను_.

15. _ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము_.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11

4. _కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే_.

5. _మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే_.

6. _నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే_.

7. _అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది_.

8. _ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును_,

9. _మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను_

10. _మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి_.

11. _అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు_.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30

28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.

29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?

30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?

 

సేవలో గల రకాలు కోసం ధ్యానం చూడండి:

*సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు , సంఘంలో ప్రతీ ఒక్కరికి వారి వారి విశ్వాస పరిమాణం ప్రకారం, కొన్ని వరాలు-ఫలాలు ఇస్తారు*!

 

కొందరిని ప్రత్యేకమైన సేవకోసం ఎన్నుకొంటారు!

వారు అనేక రకాలుగా ఉన్నారు.

 

వీరిని రెండు వర్గాలు చేసారు.

1. Fivefold Ministry- ఐదు మడతల/ఐదు మెట్ల సేవ,

2. Tenfold Ministry- పదిమెట్ల / పది మడతల సేవ .

Fivefold ministry is a part of Tenfold Ministry.

 

Fivefold ministry లో సేవ చేసేవారు చాలా వరకు fulltime minstry (సంపూర్ణ సేవ) చేస్తారు.

 

మిగతా ఐదు భాగాల వారు, తమ తమ పనులు చేసుకొంటూనే part time ministry చేస్తారు.

 

     ఈరోజు Fivefold ministry కోసం ధ్యానిద్దాం!

వీరు 1. అపోస్తలులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,

 

మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.

 

రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!

 

Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.

 

తర్వాత *కాపరులు*: Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.

 

తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ- సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.

 

తర్వాత *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.

 

పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.

 ఇది అత్యంత గొప్పవిషయం!

 

Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20

20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.

 

    ప్రియ దైవసేవకుడా! నీవు సువార్తికుడివా? కాపరిగా మారుటకు ప్రయత్నం చేయు.

కాపరివా- ప్రవచనవరం కోసం, అద్భుతాలు చేసే వరం కోసం ప్రయత్నం చేయు.

ప్రవక్తగా, అపోస్తులుడిగా మారడానికి ప్రయత్నం చేయమని ప్రభుప్రేమతో ప్రోత్సాహపరుస్తున్నాను.

అయితే దానికోసం గొప్ప ప్రార్ధనా శక్తి అవసరం. పరిశుద్దాత్ముని అభిషేకం పొందుకొని అద్భుతాలు చేసే శక్తిని వాడుతూ ఉండాలి. (Operate చెయ్యాలి) అప్పుడు దేవుడు నీసేవను ఆశీర్వదిస్తారు. నిన్ను ఒక లైట్ హౌస్ లా వాడుకొంటారు!

 

  అట్టి కృప ధన్యత దైవ సేవకులందరికి కలుగును గాక!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*10వ భాగము*

*పౌలుగారి కృతజ్ఞతలు-6*

 

1కొరింథీ 1:47

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

పౌలుగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని చూసుకుంటూ కృప విషయంలో మొదటగా కృతజ్ఞత చెబుతున్నట్లు ధ్యానిస్తున్నాము!

 

     ఇక మనము ఏ ఏ విషయాలలో వారి విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి యున్నదో చూసుకుంటున్నాము! అనగా ఇవి ఒకరకంగా కొరింథీ సంఘము యొక్క ధన్యతలు అని భావించాలి!

 

ప్రియులారా! దేవుడు వారికీ కృపావరాలు ఇచ్చారు అని గతభాగంలో చూసుకున్నాము గనుక ఈ కృపావరాల లోనే పది మడతల (టెన్ ఫోల్డ్ మినిస్ట్రీ)& ( ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ) లేక ఐదు మడతల పరిచర్య కూడా ఉంది. కాబట్టి వాటిని మరోసారి క్లుప్తంగా ధ్యానం చేద్దాం!

 

* దేవుని సేవ-పరిచర్య రకములు-2*

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:28,29,30

28. _మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను_.

29. _అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా_?

30. _అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా_?

 

ప్రియ దైవ జనాంగమా! ఇంతవరకు మనం Fivefold ministry కోసం ధ్యానించాము. ఇక మిగతా భాగాలు కోసం ధ్యానం చేద్దాము.

 

అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వరములు ఎన్నో ఉన్నాయిగాని, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!

మనమంతా ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!

 

 గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరుపనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము. అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు. దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*

 

Fivefold ministry తర్వాత విభాగం వారు *అద్భుతాలు చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.

 

    తర్వాత విభాగం *భాషలు మాట్లాడువారు- భాషలకు అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.

 

    తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది.యాకోబు 1:27; యెషయా 58

 

   తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, Commitment (స్తిరమైన ఒడంబడిక)ఉండాలి.

ఈరోజుల్లో కుర్చీల్లో కూర్చోడానికి చూస్తున్నారు గాని కుర్చీలు, చాపలు ఎత్తడానికి ఇష్టపడటం లేదు. ఆలయాన్ని తుడవటానికి, కడగటానికి ఎవరు సిద్దపడటం లేదు.

కారణం ప్రిస్టేజ్, ఇగో, అయితే వీటిని పక్కన పెట్టి ఎవరైతే ఈ పరిచర్యలు చేస్తారో దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తారు.

దానికి ఉదాహరణ నేనే! నా చిన్నతనములో ప్రతీరోజు ఆలయం తుడిచేవాడిని, ఆరాధనకు చాపలు వేయడం, తీయడం, ఎంగిలాకులు ఎత్తడం, నీరు మోయడం ఇవన్నీ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తాను. ఫలితం- ఆశ్చర్యంగా దేవుడు నన్ను ఆత్మీయంగా, ఆర్దికముగా దీవించారు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే ఇలాంటివి చెయ్యాలి.

 

   చివరగా *ప్రభుత్వాలు చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్దా! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపాడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.

 

    చివరగా రక్షింపబడిన విశ్వాసి అది ఎవరైనా సరే ఈ Tenfold Ministry లో ఏదో ఒక పని చెయ్యాలి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఒకటే కాకుండా నాలుగైదు విభాగాలలో భాగస్తులై ఉండాలి. అయితే వీటిలో ఏదీ చెయ్యడం లేదా, అలా అయితే నీవు నులివెచ్చగా ఉన్నావన్నమాట!!! అందుకే యేసయ్య నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు కాబట్టి నానోట నుండి నిన్ను ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను అంటున్నారు. (ప్రకటన 3:15-16)

ఒకవేళ నీకు సువార్త ప్రకటించడం వీలు కాదా- అయితే వెళ్ళేవారిని పంపండి. మీ  ప్రవర్తన ద్వారా సువార్త చెయ్యండి. మరీ ముఖ్యముగా భారముతో కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి. అట్లు జరిగించిన నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇంకా తనసేవలో వాడుకొంటారు. లేదంటే విడువబడే గుంపులో ఉంటావు.

 

  దయచేసి ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకో/సరిదిద్దుకో!

 

   అయితే ఇప్పటికే  కొన్ని వరాలు-ఫలాలు ఉన్నాయా? అయితే మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయు. కొరింథీ సంఘానికి ఇవన్నీ ఉన్నాయి. సిద్దపడి రాకడలో ఎత్తబడటానికి సిద్ధముగా ఉన్నారు! మరి నీవు సిద్దమా!!!!

 

   అట్టి కృప ధన్యత మనందరికీ మెండుగా కలుగును గాక!

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*11వ భాగము*

 

1కొరింథీ 1:89

8. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

పౌలుగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అని చూసుకుంటూ కృప విషయంలో మొదటగా కృతజ్ఞత చెబుతున్నట్లు ధ్యానిస్తున్నాము!

 

ఇక తర్వాత విషయం: పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం! గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పౌలుగారి ప్రార్ధనలో భూలోక సంబంధమైన విషయాల కోసం ఆశీర్వాదాల కోసం ఎప్పుడు ఉండవు! ఆధ్యాత్మిక విషయాల కోసమే ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటారు!

 

     ఇక మనము ఏ ఏ విషయాలలో వారి విశ్వాసము లేక దేవుని కృప విస్తరించి యున్నదో చూసుకుంటున్నాము! అనగా ఇవి ఒకరకంగా కొరింథీ సంఘము యొక్క ధన్యతలు అని భావించాలి!

 

ఇక ఎనిమిదవ వచనంలో అంటున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు అనగా ఆయన రాకడలో తీర్పు దినమందు మీరు నిరపరాదులుగా ఉండునట్లు అంతమువరకు మిమ్మును స్థిరపరచును! ఇక్కడ పౌలుగారు కొరింథీ సంఘము కొరకు మీద వచనములో మీరు ఏ కృపావరమునందు లోపము లేకుండా ఉన్నారు, మన దేవుని రాకడకొరకు ఎదురుచూస్తున్నారు అని చెప్పిన తర్వాత ఆయన రాకడలో యేసుక్రీస్తు దినమునందు మిమ్మల్ని నిరపరాదులుగా ఉండేటట్లు ఆయన అంతము వరకు మిమ్మును స్థిరపరచును అంటున్నారు.

ఈ వచనంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి మనకు!

 

మొదటిది: యేసుక్రీస్తు దినము: దీనికోసం ప్రత్యక్షతల గ్రంధము అనే శీర్షికలో వివరంగా చూసుకున్నాము! ప్రభువు దినము, దేవుని దినము, యెహోవా దినము, యేసుక్రీస్తు దినము ఇవన్నీ ఆయన రాకడ తర్వాత వెయ్యేండ్ల పాలన తర్వాత జరుగబోయే తీర్పును మరియు బహిరంగ రాకడ అనంతరము జరుగబోయే దేవుని తీర్పుకాలమును సూచిస్తుంది!

 

రెండవది: అంతము వరకు స్థిరపరచును అంటున్నారు : గమనించాలి యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువుల వారు అంతము వారికి వారిని ప్రేమించెను! ...యోహాను 13: 1

తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు (లేక, సంపూర్ణముగా) ప్రేమించెను.

 

 అలా ప్రేమించిన దేవుడే ఇక్కడ పౌలుగారిని ఉపయోగించుకుని ఆయన మిమ్మును అంతము వరకు స్థిరపరచును అంటున్నారు! గమనించాలి- బాప్తిస్మము తీసుకున్న అనంతరము- అంతము వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు నీకు దేవుడు జీవకిరీటం ఇచ్చును అని చెబుతూ ఉంటారు దైవజనులు! అంతము వరకు నమ్మకముగా ఉంటేనే జీవకిరీటం! అందుకే ప్రకటన గ్రంధంలో ఈ మాట పదేపదే చెప్పడంజరిగింది!

మత్తయి 24: 13

అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.

మార్కు 13: 13

నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.

ప్రకటన గ్రంథం 2: 26

నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి(లేక, గైకొనువానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.

 

ఈ మాట పౌలుగారు చాలాసార్లు సంఘాలకు వ్రాసారు! ఎందుకు అంతము వరకు నమ్మకముగా లేక స్థిరంగా ఉంచుతారు అంటున్నారు అంటే వీరు దేవుని కుమారుని లేక యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు లేక రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు, సిద్దపడి ఉన్నారు, ఆరోజు వీరిలో ఏమైనా నింద లేక డాగు కళంకం ఉంటే ఆరోజు వీరు సిగ్గుపడతారు! అందుకే ముందుగానే సంఘాన్ని సిద్ధము చేసి కాచి ఉంచుతున్నారు!

 

ఫిలిప్పీయులకు 1: 4

మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

 

రోమా 5:910

9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.

10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

 

1థెస్స 3:1213

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

యోహాను 10:2829

28. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.

29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు;

30. నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.

 

హెబ్రీ 7:25

ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

 

1పేతురు 1:5

కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.

 

కాబట్టి మీరు పొందుకున్న ఈ రక్షణ భాగ్యమును మనము అంతము వరకు నమ్మకముగా కాపాడుకోవాలి!

 

ఇక మూడవది: నిరపరాదులుగా ఉండునట్లు లేక నిందారహితముగా ఉండునట్లు... ఎందుకు నిందారహితముగా లేక నిరపరాదులుగా ఉండాలి? ఎందుకంటే అపరాధాలు గలవాడు, కళంకము గలవాడు దేవుని రాజ్యము సరిహద్దులలో కూడా ఉండలేడు దీనిని ప్రకటన 21వ అధ్యాయం చెబుతుంది మనకు!...

ప్రకటన గ్రంథం 21: 27

గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

 

కాబట్టి ఆరోజు నిందారహితముగా ఉండాలి! ఇది సాధ్యమా అంటే భూమిమీద మనుష్యులు అంతా చెడిపోయినప్పుడు దేవుడు స్కాన్ చేసి చూస్తే భూలోకం మొత్తం మీద నోవాహు గారు నీతిమంతుడుగా కనబడ్డారు!. ఆదికాండం 6

ఆదికాండము 6: 9

నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

 

అదేవిధంగా మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నారు!

దావీదు గారు దేవునికి ఇష్టానుసారముగా ప్రవర్తించారు, బైబిల్ చెబుతుంది దావీదు ఊరియా విషయంలో తప్ప మరిదేనియందు అపరాధం చెయ్యలేదు అని! ఊరియా అని ఎందుకు అన్నారు అంటే అతని భార్యను ఆశించి, అతనిని చంపడం వలన!!

 

యోబు కోసం దేవుడే సైతాను గాడితో పందెం కాస్తూ అతడు యధార్ధవర్తనుడు నీతిమంతుడు చెడుతనమును అసహ్యించుకొన్నవాడు అంటున్నారు దేవుడే....యోబు 1: 8

అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.

 

దానియేలు గారికోసం లోపములు వెదికారు శత్రువులు, గాని దేని విషయంలో కూడా ఆయనలో లోపం కనుగొనలేకపోయారు, అందుకే దేవుని విషయంలో అతనిని చంపాలని ప్రయత్నం చేసి సింహాల గుహలో వేశారు!

దానియేలు 6: 4

అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.

 

ఇక యేసుక్రీస్తు ప్రభులవారు సవాలుచేస్తున్నారు- నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును?

యోహాను 8: 46

నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

 

ఆదిమ సంఘము ఆది అపోస్తలులు ఒక్కసారి ప్రభువు కృపను ఆయన ప్రేమను రుచి చూశాక నిందారహితులుగా జీవించారు! అందుకే పౌలుగారు మంచి పోరాటం పోరాడితిని నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక నాకొరకు నీటికిరీటం ఉంచబడినది అని ధైర్యంగా నిందలేని జీవితం గలవాడై చెబుతున్నారు!

 

ఆ భక్తులందరూ నిందారహితముగా జీవించగలిగారు!

మనము కూడా ఇదేవిధంగా నిందలేని జీవితం జీవించవలసిన అవసరం ఉంది!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*12వ భాగము*

 

1కొరింథీ 1:89

8. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక తర్వాత విషయం: పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదం! గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పౌలుగారి ప్రార్ధనలో భూలోక సంబంధమైన విషయాల కోసం ఆశీర్వాదాల కోసం ఎప్పుడూ ఉండవు! ఆధ్యాత్మిక విషయాలకోసమే ఎప్పుడూ ప్రార్ధిస్తూ ఉంటారు!

 

       (గతభాగం తరువాయి)

గతభాగంలో నిందారహితముగా నిరపరాదులుగా ఉండాలి అంటూ మూడో విషయం ధ్యానిస్తున్నాము కదా ఇది బాగా అర్ధం కావాలంటే మరోసారి మనము ఈ క్రింది రిఫరెన్స్ బాగా అధ్యయనం చెయ్యాలి!

 

1థెస్స 3:1213

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

13. మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.

 

పౌలుగారి మిగతా పత్రికలలో గల ప్రార్ధనలకు ఈ థెస్సలోనికయ  పత్రికలో గల ప్రార్ధనలకు చాలా తేడా ఉంటుంది! మిగతా సంఘాలకు వారు ఇంకా విశ్వాసంలో భక్తిలో ఎదగాలని ప్రార్ధన చేస్తే ఈ పత్రికలో రెండవ రాకడకు సంబంధించిన ప్రార్ధన కనిపిస్తుంది మనకు! కారణం గతంలో చెప్పిన విధంగా వారు అప్పటికే విశ్వాసంలో భక్తిలో స్థిరులై పరిపూర్ణతకు దగ్గరగా ఉంటూ కేవలం యేసుక్రీస్తుప్రభులవారి రాకడకొరకు ఆసక్తితో కనిపెడుతున్నారు కాబట్టి ఈ పత్రికలో కనబడిన ప్రార్ధన కూడా రాకడకు సంబంధించిన ప్రార్ధన లాంటి ఆశీర్వాదంగా మనం తలంచవచ్చు! అలాగే ఈ కొరింథీయులు కూడా దేవుని రాకడకు కనిపెడుతున్నారు!

 

 చూడండి ప్రార్ధన!...

12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై...

 

12వ వచనంలో యేసుక్రీస్తుప్రభులవారు పరిశుద్ధులతో వచ్చేటప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయంలో అనింద్యముగా అయన స్థిరపరచాలి! ఇది మొదటిది!!!

ఇక 13వ వచనంలో మరో రకమైన ప్రార్ధన కనిపిస్తుంది

 

మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్దులందరితో వచ్చినప్పుడు తండ్రియైన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో  అనింద్యముగా ఉండాలి అని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నారు! ఇది బాగా అర్ధం కాలేదు కదా! పౌలుగారు వారి ఆధాత్మిక స్థాయిని అంచనా వేసాకనే ఈ మాట అంటున్నారు! ప్రభువైన యేసు తొందరగా రావాలని మీరు ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు కదా అప్పుడు మీ హృదయాలు దేవుని ఎదుట అనింద్యముగా అనగా నిందమోపలేనంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు పౌలుగారు! ఇది నిజంగా ఆధ్యాత్మికంగా పరిణితి చెందిన స్టేజ్! ఎందుకు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలని కోరుకుంటున్నారు?

 

జవాబు చాలా సింపుల్! *పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు* కాబట్టి! వీరు ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభులవారు ఎప్పుడొస్తారు... అంటూ అడుగుతుండే వారు.! ఇప్పుడు ఆయనను చూడాలంటే పరిశుద్ధత కావాలి!

 

 అందుకే మొదటగా పరిశుద్దత విషయంలో ఎవడు నిన్ను వేలెత్తి చూపడమే కాకుండా దేవుని ఎదుట కూడా మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండాలి! నిజం చెప్పాలి అంటే మన క్రియలు దేవుని యెదుట మురికి గుడ్డలా ఉంది అని బైబిల్ సెలవిస్తుంది! మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండలేడు అనికూడా చెబుతుంది బైబిల్!

 యోబు 15: 14

శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

Job(యోబు గ్రంథము) 25:4,6

 

4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

6. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

 

అయితే మరి దేవుని ఎదుట ఇప్పుడు ఒక మనిషి నిందారహితుడుగా అదికూడా పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఎలా ఉండగలడు? అబ్రాహాము గారిలాంటి వ్యక్తినే దేవుడు నా ఎదుట నిందారహితుడుగా ఉండమని హెచ్చరించారు దేవుడు! ఆది 17:1;  

 

ఇది సాధ్యమా? అంటే అవును సాధ్యమే! సాధ్యం కాని విషయాలు దేవుడు ఎప్పుడు చెప్పరు! మానవునికి ఇది సాధ్యం కానేకాదు! అయితే ఒకవ్యక్తి క్రీస్తుయేసు రక్తంలో కడుగబడి పరిశుద్దాత్మతో నింపబడితే ఆత్మద్వారా నడిపించబడితే ఆత్మలో ముందుకు సాగిపోతే ఇది సాధ్యమే! ....

Galatians(గలతీయులకు) 5:16,18

16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.

 

కీర్తనలు 119: 11

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

 

అనగా పౌలుగారు మీరు దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే వారు ఆత్మానుసారులై ఉండమని చెబుతున్నట్లు లెక్క! ఎందుకంటే ఆత్మానుసారులై ఉండండి అప్పుడు మీరు శరీరకార్యాలు చెయ్యలేరు అంటున్నారు పౌలుగారు!

ఇంకా వాక్యాన్ని మన హృదయం లో ఉంచుకుంటే, మన హృదయం నిండా వాక్యముతో నిండిపోతే నీవు పాపము చేయనే చేయవు!  అప్పుడు నీవు నిందారహితుడుగా ఉండగలవు!

 

  ఇదే విషయాన్ని పౌలుగారు 5:23 లో కూడా చెబుతున్నారు....

1థెస్సలొనికయులకు 5: 23

సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. *మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు* కాపాడబడును గాక.

 

ఇంకా 1కొరింథీ 1:8 చూసుకుంటే

మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

 

ఎఫెసి 5:2627

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 

2పేతురు 3: 14

ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, *ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు* జాగ్రత్తపడుడి.

 

ఈరోజు పౌలుగారు మనకు కూడా చెబుతున్నారుమనం కూడా ప్రభువైన యేసు తన పరిశుద్దులందరితో పాటు వచ్చేటప్పుడు మన హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితముగా ఉండాలి! నీవు ఎవరిని మోసగించినా దేవుణ్ణి మోసగించడం నీ చేతకాదు! అలా మోసగిద్దాము అనుకున్నారు అననీయ సప్పీరలు! మందిరంలోనే పడి చచ్చారు! నీవుకూడా గొప్పోడివి కాదు! అలా ఘోరమైన తీర్పు పొందకముందే ఇప్పుడే మారుమనస్సు నొంది దేవునితో సమాధాన పడు! కారణం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అంటున్నారు.

యిర్మియా 17: 9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

 

 ఏ వ్యాధి అంటే పాపరోగం! ఆ పాపరోగానికి మందు యేసు రక్తము!

 

  కాబట్టి ఆయన రక్తముతో కడగబడి ఆయనాత్మతో నింపబడదాము ఆత్మద్వారానే నడిపింపబడదాము! దేవునిఎదుట నిందారహితముగా ఉందాము!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*13వ భాగము*

 

1కొరింథీ 1:89

8. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.

9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక తర్వాత విషయం: పౌలుగారి ప్రార్ధన లాంటి ఆశీర్వాదంలో 9వ వచనం  మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినదేవుడు!

 

ఇక్కడ తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని ఎందుకు  అంటున్నారు అంటే మీద వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాదులై ఉండునట్లు అంతము వరకు మిమ్మల్ని స్థిరపరచును అంటున్నారు కదా ఎందుకు ఎలా స్థిరపరుస్తారు అంటే ఆయన నమ్మదగినవాడు కనుక ఆయన మిమ్మల్ని అంతము వరకు స్థిరపరుస్తారు అంటున్నారు!

 

ఈ వచనంలో మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి!

మొదటిది: ఆయన నమ్మదగిన వాడు!

రెండు: ఆయన కుమారుని సహవాసము!

 

మొదటిది: దేవుడు నమ్మదగిన వాడు! అంతము వరకు మనలను స్థిరముగా విశ్వాసములో కాపాడగలరు!  అంతేకాకుండా అంతము వరకు మనలను సాతాను నుండి కూడా కాపాడతారు! ఆయన మనతో చేసిన వాగ్దానాలు నెరవేర్చే శక్తివంతుడు! దీనిని అబ్రాహము గారు నమ్మారు! వాగ్ధానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు మరియు దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడు అని అబ్రాహాము గారు మరియు శారా గారు నమ్మారు కాబట్టి నూరు సంవత్సరాల వయస్సులో ఇస్సాకుని కనీ, మనకు విశ్వాసులకు తండ్రిగా తల్లిగా నిలబడ్డారు....

Hebrews(హెబ్రీయులకు) 10:23

వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

Hebrews(హెబ్రీయులకు) 11:10,11,12,13

 

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.

13. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

 

1థెస్సలొనికయులకు 5: 24

మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

 

తీతు 1:2

నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

 

2తిమోతి 2:13

మనము నమ్మదగని వారమైనను (నమ్మకపోయినను), ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు (ఆయన తన్ను తానెరుగననలేడు).

 

ద్వితీ 7:9

కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

 

ద్వితియోపదేశకాండము 32: 4

ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

 

1కొరింథీ 10:13

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

 

2థెస్సలొనికయులకు 3: 3

అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి (దుష్టునినుండి) కాపాడును.

 

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

 

కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము ధైర్యంగా విశ్వాసంలో సాగిపోదాం!

 

ఇక రెండవ విషయం: తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసము:  దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసములోనికి పిలిచారు! మనము ఆయన సహవాసము లోనే ఉండాలి గాని అన్యుల సహవాసములోను ఇంకా లోకము సహవాసము లోను, సాతాను గాడి సహవాసములోను ఉండకూడదు! ఎందుకంటే తుంటరుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు అని సామెతల గ్రంధంలో బైబిల్ చెబుతుంది. అంతేకాకుండా ఆరునెలలు సహవాసం చేస్తే వారే వీరు అవుతారు అని మనకు తెలుగు నానుడి పలుకుతుంది!

 

దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో మనం ఉండాలని- సాతాను గాడి కబంధహస్తాలలో పాపములో ఉన్న మనలను ప్రేమించి కరుణించి రక్షించి తన రక్షణను ఇచ్చారు! మనము అదే సహవాసంలో ఉండాలి గాని సాతాను సహవాసంలోనికి లోకం సహవాసం లోనికి వెల్లరాదు! దేవుడు ఇశ్రాయేలు జనము విషయంలో నేను మిమ్మును ఐగుప్తు నుండి రప్పించి నా దేశంలో పెడితే మరలా ఐగుప్తు దేశం దారిలోకి నీవు ఎందుకు వెళ్లావు అని అడుగుతున్నారు!

యిర్మియా 2: 18

నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది? యూఫ్రటీసునది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గములో నీకేమి పనియున్నది.

 

ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి శాపమును పొందుకొన్నారు, ఎన్నో ఇక్కట్లు తెచ్చుకున్నారు! కాబట్టి మనము ఆ సహవాసంలో ఉండకూడదు!

 

బైబిల్ సహవాసం కోసం ఏమనిచెబుతుందో చూద్దాం!

 

1యోహాను 1: 3

మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. *మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) తో కూడను ఉన్నది*.

 

యోహాను 14: 23

యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.

 

యెహోషువ 23: 7

మీయొద్ద మిగిలియున్న యీ జనుల సహవాసము చేయక వారి దేవతల పేళ్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక

 

1రాజులు 11:1

మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి....

 

యోబు 15: 19

అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

 

కీర్తనలు 106: 35

అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

కీర్తనలు 106: 36

వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.

 

యెషయా 2:6

యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.

 

సామెతల గ్రంధంలో గల అమూల్యమైన మాటలు చూద్దాం!

సామెతలు 13: 20

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగల వాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

 

సామెతలు 15: 31

జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.

 

సామెతలు 22: 24

కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము

 

సామెతలు 24: 1

దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

 

సామెతలు 28: 7

ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.

 

సామెతలు 31: 3

నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము

 

పౌలుగారు దేవుని బిడ్డలలో కొందరితో సహవాసం చెయ్యవద్దు అన్నారు: వీరు దేవుని బిడ్డలే గాని అన్యులవలే ప్రవర్తిస్తున్నారు, మరికొందరు దేవుని బిడ్డలే గాని మద్యపానం చేస్తూ విగ్రహారాధన చేస్తూ లోకంలో కలసిపోయారు, అట్టివారితో సహవాసం చెయ్యవద్దు అన్నారు!....

1కోరింథీయులకు 5: 11

ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.

 

మరలా మనం 1యోహాను 1:3 కి వద్దాం మన సహవాసం దేవునితోను ఆయన కుమారునితోను ఉంది కాబట్టి అదే సహవాసంలో కొనసాగుదాం! అన్యుల దారిలోకి వెళ్ళవద్దు, వారి సహవాసం చెయ్యవద్దు! వారి ఆచారాలు చెయ్యవద్దు! దేవునితో సాంగత్యము చేస్తూ దేవునిలోనే ఉందాం!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*14వ భాగము*

 

1కొరింథీ 1:1011

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ఇక పదవ వచనం నుండి ఈ పత్రిక వ్రాయడానికి ముఖ్య ఉద్దేశానికి వచ్చేస్తున్నారు! మీరంతా ఏకభావముతోను ఏకాభిప్రాయం తోనూ ఉండాలని బ్రతిమిలాడుతున్నాను అంటున్నారు! ఇంకా మీలో కక్ష్యలు లేకుండా అందరు ఏక మనస్సు ఏక తాత్పర్యము తోనూ మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను అంటూ బ్రతిమిలాడుతున్నారు!!

 

గమనించాలి: మీరు ఏకభావంతో ఏకాభిప్రాయంతో ఏక తాత్పర్యముతో ఉండాలని చెబుతూ- ఏక మనస్సుతో సన్నద్దులై ఉండాలి అంటున్నారు! దేనికి సన్నద్ధులై ఉండాలి? ఇంతవరకు పౌలుగారు చెప్పుకుంటూ వచ్చారు కదా- మీరు ఏ కృపావరమునందు లోపం లేకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్నారు అంటూ- అలా ఎదురు చూస్తున్నప్పుడు మీలో అందరూ ఏకాభిప్రాయం ఏక మనస్సు ఏక భావముతో ఉండాలి అలా దేవుని రాకడకొరకు సన్నద్ధులై ఉండాలి అని హితవుచెబుతున్నారు!

 

చూడండి- ఇంతటి గొప్ప సంఘములో కూడా లోపాలు కనిపిస్తున్నాయి! ఈ సంఘము దేవుని రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపడి ఉంది! ఇంకా అనేకమైన కృపావరాలు పొందుకుని ఆత్మపూర్ణులై ఉన్నారు! ఇంకా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోని ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి ఈసంఘములో అనేక లోపాలు కనిపిస్తున్నాయి! ఈ లోపాలు చాలు- శత్రువులు సంఘమును విమర్శించడానికి, ఈ లోపాలు చాలు పరలోకం వెళ్ళకుండా ఆపెయ్యడానికి! అందుకే ఎంతో కోపం కలిగినా కోపమును నిగ్రహించు కుంటూ బ్రతిమిలాడుతున్నాను అని ఎంతో వేదనతో ఉత్తరం రాస్తున్నారు పౌలుగారు కొరింథీయులకు!!!

 

ఇలా వ్రాయడానికి కారణం కూడా 11వ వచనంలో రాస్తున్నారు- మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను!! మీలో ఇలాంటి కోపతాపాలు- బేధాలు విభేదాలు ఉండనే కూడదు! అందరూ ఐకమత్యముతో ఉండాలి సంఘము- అయితే మీరు కలహములతో కక్ష్యలతో విభేదాలతో ఉన్నారు అని బాధపడుతున్నారు!

 

గమనించాలి- సంఘములో అందరూ సమానమే- వారు ప్రవక్తలైనా కాపరులైనా నాయకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా అంటూ మనకు రోమా పత్రికలో వివరంగా రాస్తున్నారు! ఒక దేహములో అనేక భాగములున్నట్లు లేక అనేక అవయవములున్నట్లు అలాగే మీరు కూడా సార్వత్రిక సంఘములో ఒక్కో అవయములై ఉన్నారు, దేవుడు కొందరిని నాయకులుగా ప్రవక్తలుగా కాపరులుగా చేస్తే మరికొందరిని విశ్వాసులుగా పరిచర్య చేసేవారిగా చేశారు! అందరూ ఒకే సంఘముగా సార్వత్రిక సంఘముగా వధువు సంఘముగా కట్టబడుతున్నారు అని రాశారు కొరింథీ పత్రికలో! ...

ఇంకా  ఇదే కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో చాలా వివరంగా దీనికోసం చెప్పుకుని వచ్చారు! అందరూ సంఘములో సమానమే!!!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:12,13,14,20,25,26,27

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

 

రోమా 12:16

ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

 

ఎఫెసీ 4:1 లో అంటున్నారు దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను పొందుకొనండి అంటున్నారు...

ఎఫెసీయులకు 4: 1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

ఎఫెసీయులకు 4: 2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

మరి విశ్వాసులంతా ఏకాభిప్రాయం సాధించడం సాధ్యమా? ఇతరుల మనస్సులోని ఉద్దేశాలతో విశ్వాసులంతా ఏకీభవించడం సాధ్యమా!!!

బైబిల్ సాధ్యమే అని చెబుతుంది!

ఇదే 1కొరింథీ 2:16 లో మనమంతా క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాము కాబట్టి అది సాధ్యమే అంటున్నారు..

1కోరింథీయులకు 2: 16

ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

 

అందరూ ఒకటే ఆత్మను పొందుకున్నారు- అందరూ ఒకే క్రీస్తుమనస్సు కలిగి ఉన్నప్పుడు అందరూ ఒకే ఏకాభిప్రాయం ఏక మనస్సు ఏక తలంపు ఏక భావము కలిగి ఉండగలరు!

ఇది పరిశుద్ధాత్మ వలన తప్పకుండా జరిగి తీరుతుంది!

 

పరిశుద్ధాత్మ కాకుండా మరో ఆత్మ లేక  భ్రమపరచే దురాత్మను పొందుకుంటే మాత్రం అది సాధ్యం కాదు! 

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:4,5,6,7,8,9,10,11

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

5.మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

Ephesians(ఎఫెసీయులకు) 4:4,5,6

4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి (మూలభాషలో- అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.

 

సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండమని చెప్పడం అందుకే ఎఫెసీ 4:1!!

 

ఇంకా దీనికోసం వివరంగా రాస్తున్నారు మిగిలిన పత్రికలలో...

2కొరింథీ 13:11

తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

 

ఎఫెసీ 4:13

పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

ఎఫెసీయులకు 4: 14

అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక,

 

ఫిలిప్పీ 1:27

నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.

 

ఫిలిప్పీయులకు 2: 2

మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

 

అపో 4:32

విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

 

గమనించాలి- ఇది కేవలం కొరింథీ సంఘానికి లేక ఫిలిప్పీ సంఘానికి లేక ఎఫెసీ సంఘానికి రాశారు అనుకోవద్దు! నేటి రోజులలో అంతకంటే ఎక్కువైన విభేదాలతో సంఘములు బాధపడుతున్నాయి!

సంఘాలు - కులసంఘాలు రాజకీయ సంఘాలు- ఆస్తి అంతస్తుల విభేదాలు గల సంఘాలుగా ఉన్నాయి! కొన్ని సంఘాలు బాగా డబ్బుండి పలుకుబడి ఉంటేనే గాని వారి సంఘాలకు రానివ్వడం లేదు! అవి స్టేటస్ సంఘాలు- ఆ సంఘాలలో స్టేటస్ ఉంటాది సెంట్రలైజ్డ్ AC ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది గాని యేసయ్యకి ఎంతమాత్రము స్థానం ఉండదు!  దేవుడు ఇలాంటి దానిని కోరుకోవడం లేదు!యేసుక్రీస్తు ప్రభులవారు గాని, అపోస్తులలు గాని అంతా విశ్వాసులైన వారు అందరూ సమాధానముగా ఐక్యముగా ఉండాలని బేధాలు లేనివారై ఉండాలని రాస్తున్నారు! ఇంకా యేసయ్య చేసిన ఉపదేశాలు గాని మిగిలిన అపోస్తలులు రాసిన పత్రికలలో గల ఉపదేశాలు గాని వీటివిషయంలో సంఘమంతా ఏకాభిప్రాయం కలిగి ఉండాలి! మనస్సులో కక్షలు ఉండకూడదు, ఇంకా దేవుని బోధలయందు కూడా సంఘమంతా ఏకాభిప్రాయం కలిగి ఉండాలని పౌలుగారి ఉద్దేశం! ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి! సగం సగం చదివి ఊరుకోకూడదు, ఎవరో చెప్పారని చేయకూడదు! బెరయ సంఘస్తుల వలే వారు చెప్పింది నిజంగా లేఖనాలలో అలా ఉందా లేదా పరీక్షించి నమ్మాలి! ఇంకా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి! పరిశుద్దాత్మను పొందుకుని ఆత్మలో ఆనందించినప్పుడే  ఇలాంటి బేధాలు కక్షలు లేకుండా సమాధానముగా ఉండగలరు!

 

మరినీవు అలా ఉండగలవా??!!!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*15వ భాగము*

 

1కొరింథీ 1:1113

11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.

12. మీలో ఒకడునేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! 10వ వచనం నుండి మొదలుపెట్టి ఇంకా రాస్తున్నారు: మీలో కలహాలున్నాయని నాకు క్లోయె ఇంటివారి వలన తెలిసింది- మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపోల్లో వాడను మరి యొకడు నేను కేఫా వాడను (పేతురు వాడను) ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు అంటూ క్రీస్తు విభజించబడి యున్నాడా? మీకొరకు పౌలనే నేను సిలువవేయబడితినా? మీరు పౌలు నామమున లేక నానామమున బాపిస్మము పొందారా లేదుకదా అని తూర్పారబడుతున్నారు!!

 

నేటి రోజులలో కూడా ఒకడు మేము ఫ్రంట్ లైన్ సంఘాలకు చెందిన వారము అని విర్రవీగుతున్నాడు! మరొకడు మేము పెంతుకోస్తు వారము మీరు బాప్టిస్టులు పాపిష్టులు అంటూ మరొకరి మీద అసూయపడుతున్నాడు- చీదరించుకుంటున్నాడు! మీకు పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేవు, ఫలాలు లేవు, మారుమనస్సు లేదు అంటూ రెచ్చిపోతున్నాడు! మరొకడు నేను ఓఫీరిజంనకు చెందినవాడను అంటున్నాడు! మరొకడు నేను బోయ్ కి చెందినవాడను అంటున్నాడు! మరొకడు నేను సతీస్ కుమార్ సంఘానికి చెందినవాడను మా సంఘానికి ఇన్ని లక్షలమంది వస్తారు తెలుసా అంటూ విర్రవీగుతున్నాడు! మరొకడు మేము దేవుడు దేవదాసు అయ్యగారికి బయలుపరచిన సంఘానికి చెందిన వారము అంటున్నాడు! మరొకడు నేను హోసన్నా మినిస్ట్రీస్ కి చెందిన వాడను అంటున్నాడు! మరొకడు అసలు మీరు చెప్పే సంఘాలు బైబిల్ లో లేవు! బైబిల్ లో కేవలం క్రీస్తు సంఘము అని ఉంది, కాబట్టి క్రీస్తు సంఘము అనే సంస్త యొక్క సంఘ సభ్యులే క్రైస్తవులు విశ్వాసులు గాని మిగిలిన సంఘాలకు వెళ్ళేవారు దేవుని బిడ్డలు క్రీస్తు బిడ్డలు కారు వారు సార్వత్రిక సంఘములో సభ్యులు కారు అంటున్నాడు! మరొకడు మీరు చెప్పేవి అన్నీ సంస్థలు అవి సార్వత్రిక సంఘము కాదు దేవుడు పంపించిన ఈ కాలపు అంత్యకాలపు ప్రవక్త విలియం బ్రెన్హాం- ఆయనను ప్రవక్తగా అంగీకరించక పోతే మీరు సార్వత్రిక సంఘములో ఉండరు! మీరు క్రైస్తవులే గాని వధువు సంఘము యొక్క సభ్యులు  కాదు అంటున్నాడు! ఇలా ప్రపంచమంతా నేటి రోజులలో కొట్టుకు చస్తున్నారు! దీనిని చూసి అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు- ఆయన కుమారుడు మాత్రమే ఆయన వలన పరలోకం లేదు అని యెహోవా సాక్షులు అంటే, ఆయన కేవలం దేవుడు పంపగా వచ్చిన దూత మాత్రమే అని ముస్లింలు విరుచుకు పడుతున్నారు! దీనికి కారణం క్రైస్తవులమైన మనలో ఏకాభిప్రాయం లేనందువలన మాత్రమే!!!

 

గమనించాలి- ఇలాంటి బేధాలు క్రీ.శ. 51 లో ఆ సంఘములో మొదలై- నేటికి 1972 సంవత్సరాలు జరిగినా అనగా ఈ క్రీ.శ. 2023 లో కూడా ఇంకా కొనసాగుతున్నాయి! కారణం క్రీస్తు ప్రేమను సరిగా అర్ధం చేసుకోకపోవడం! సంఘంలో ఐకమత్యం లేకపోవడం! క్రీస్తుప్రేమను పంచలేక పోవడం వలననే- ఇంతవరకు ఈ వర్గాభేదాలు! అందుకే 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఈ ప్రపంచం క్రీస్తును పూర్తిగా తెలిసికోలేకపోతుంది!

 

ఇలాంటి భేదాలు కోసం ఈ అధ్యాయంలో కొద్దిగా చెప్పినా ఈ మొదటి పత్రిక మూడో అధ్యాయం పూర్తిగా దీనికోసమే వ్రాసారు పౌలుగారు! దయచేసి ఒకసారి మూడో అధ్యాయం చూసుకుందాం!

ఈ మూడో అధ్యాయంలో అంటున్నారు పౌలుగారు మీరు ఇంకా క్రీస్తులో ఎదగలేదు, చిన్న పిల్లలు వలే ఉన్నారు! క్రీస్తునందు ఇంకా బాల్యంలోనే ఉన్నారు! మీరు భోజనం చేసే వయస్సు మీది- ఇంకా మీరు పాలు త్రాగుతున్నారు అంటున్నారు! ఇంకా భౌతికమైన మనుష్యుల వలే మాట్లాడుచున్నారు గాని ఆధ్యాత్మికతను సంతరించుకుని ఆధ్యాత్మిక మనుష్యుల వలే మాట్లాడటం లేదు అంటున్నారు! ౩:14

 

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైయుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా?

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

 

నిజానికి వారికి మాటలు బాగా వచ్చు! వాక్యమును బాగా చదివారు గాని దానిని ఆచరణలో పెట్టడం లేదు! కేవలం కొన్నింటిని వారికి అనుకూలంగా ఉన్నవాటిని మాత్రము ఆచరణలో పెట్టారు గాని వారి ఆస్తికి సంభందించిన విషయాలలో ఇంకా వారి ఈగోకి సంబంధించిన విషయాలలో వాక్యమును ఆచరణలో పెట్టడం మానేశారు! ఇది అప్పుడే కాదు ఈరోజు కూడా అన్నిసంఘాలలోను ఇలాగే చేస్తున్నారు, తమకు కష్టం కలిగించేవి చెయ్యడం లేదు- బోధించడం లేదు!

 

మరో ముఖ్య విషయం ఏమిటంటే తమకు నచ్చినవారిని, ప్రసంగాలు బాగా చేసేవారిని, ఇంకా చెప్పాలంటే తమకు నచ్చిన ప్రసంగాలు చేసేవారిని దేవుని కంటే ఇంకా తగినదానికంటే ఎక్కువగా హెచ్చిస్తున్నారు! మా ప్రాంతంలో దైవ సేవకునికి దేవునికంటే ఎక్కువగా గౌరవిస్తూ పూజిస్తున్నారు! దైవసేవకున్ని గౌరవించాలి గాని భయపడి పూజించకూడదు, ఆ పాదిర్లు కూడా మీరే గాని నాకు ఇలా చెయ్యకపోతే మీకు శాపం వచ్చేస్తుంది అనిచెప్పడమే బహిరంగంగా శపించడం కూడా చేస్తున్నారు! ఇదే కూడదు అని పౌలుగారు చెబుతున్నారు!

 

దీనినే ౩:511 లో చెబుతున్నారు....

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,6,7,8,9,10,11

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

 

ఇక్కడ అందరూ పరిచారకులే! అందరూ దేవునికొరకు క్రీస్తు కొరకు పనిచేసే వారే! అందరూ ఒకే తోటలో కూలి చెయ్యడానికి తోటయజమాని పెట్టుకున్న కూలివారు లేక పరిచారకులు! అలాంటప్పుడు వ్యక్తులను పొగడటం ఎందుకు?? వ్యక్తులను గౌరవిస్తూ వారిని ఘనపరుస్తూ సినిమా యాక్టర్ల అభిమాన  సంఘాల వలే  విడిపోయి కొట్టుకోవడం ఎందుకు!!!??? ఇదే పౌలుగారి సూటి ప్రశ్న!!

ఈ సూటి ప్రశ్న ఎవరో నాలాంటి థర్డ్ పర్సన్ అడగటం లేదు! ఎవరికోసమైతే వారు కొట్టుకుంటున్నారో ఆయనే మేమంతా ఆయన తోటలో జతపనివారము! మాకోసం మీరు కొట్టుకోవద్దు! మీకోసం మేము సిలువ వేయబడలేదు! మీకోసం రక్తం కార్చింది బలి అయిపోయింది వెల చెల్లించ్చింది యేసుక్రీస్తుప్రభులవారు! ఆయనను మాత్రమే పూజించండి ప్రేమించండి ఇలా మేము మేము వేరు అన్నట్లు మీరు విడిపోయి భేదాభిప్రాయాలు కలుగజేసుకోవద్దు అని భాదపడుతూ ఈ ఉత్తరం రాస్తున్నారు!

నేను నాటాను అనగా వాక్యమును వెదజల్లాను అపోల్లో భక్తుడు నీరు పోశాడు అనగా ఇంకా అదే భోధలో కొనసాగేలే వివరించి చెప్పారు! నాటిన నాలో ఏమీలేదు, నీరుపోసిన అపోల్లో లో కూడా ఏమీలేదు! గాని మీరు ఏపుగా పెరిగేలా చేసిన దేవునిలోనే అంతా ఉంది అంటున్నారు!

 

మనము కూడా ఈ బోధను సరిగా అర్ధం చేసుకుని అలాంటి అభిప్రాయబేధాలు వదిలివేసి మనమంతా సార్వత్రిక సంఘములో అంగములై ఉన్నామని తెలుసుకొని, డినామినేషన్- సంస్థ భేధాలు, సంఘ‌ భేధాలు వదలి సహోదర ప్రేమతో క్రీస్తుకలిగించు ఐక్యముతో ముందుకు సాగిపోదాం!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*16వ భాగము*

 

1కొరింథీ 1:1217

12. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

14. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు,

15. క్రిస్పునకును గాయియుకును తప్ప మరియెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

16. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.

17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను పౌలుగారు ఎత్తిచూపుతూ రాస్తున్నారు....

 

ప్రియులారా! ఇక ఇంకా ముందుకు పోతే క్రీస్తు విభజించబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువవేయబడెనా? మీరు పౌలు నామమున భాప్తిస్మం పొందారా అని అడుగుతూ మీలో ఎవరూ నానామమున భాప్తిస్మం పొందారు అని చెప్పకుండునట్లు క్రిస్పస్ కి గాయస్ కి, ఇంకా స్తెఫెనాస్ ఇంటివారికి మాత్రమే నేను భాప్తిస్మం ఇచ్చాను అంటున్నారు! ఇక 17వ వచనంలో దేవుడు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు గాని క్రీస్తుసిలువ వ్యర్ధం కాకుండునట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించారు అంటున్నారు!

 

ఈవచనాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి!

 

మొదటిది: క్రీస్తు విభజించబడలేదు! అందరికీ క్రీస్తు ఒక్కడే! అందరికీ యజమానుడు ఒక్కడే! 12వ అధ్యాయంలో అంటున్నారు 12:1213 శరీరం ఒక్కటే గాని అవయవాలు వేరువేరు! అలాగే మనం ఏ దేశంలో ఉన్నా సార్వత్రిక సంఘంలో ఉన్న అవయవాలు- మన అందరికీ యజమాని ఒక్కడే- మనలో ప్రవహించే ఆత్మ ఒక్కడే అంటున్నారు...

 

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

ఈ విషయాన్ని విశ్వాసులు గ్రహించి క్రీస్తులో వారికున్న ఐక్యతను గుర్తెరిగి కలసిమెలిసి ఉండాలి!!

 

రెండవది: కొరింథీ ప్రజలు పౌలుగారిని పేతురు గారిని అపోల్లో గారిని అభిమాన సంఘాల్లా విడిపోయి దేవునితో లేక క్రీస్తుతో సమానంగా ఎంచితే పౌలుగారు అంటున్నారు క్రీస్తుతో పోల్చుకుంటే ఏ మనిషైనా ఎంతటివాడు? ఏ మనిషిని మరీ ఉన్నత స్థానానికి పెంచకండి, దేవునికంటే ఎక్కువ ఆధిక్యత మనిషికి ఇవ్వకండి అని రాస్తున్నారు! పౌలు ఎవడు అపోల్లో ఎవడు! అందరూ దేవుని తోటలో జతపనివారు అంటున్నారు!

 

మూడవది: బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు అనడంలో పౌలుగారి ఉద్దేశం  బాప్తిస్మం పొందడం లో ఏమీ లేదు గాని నిజమైన పశ్చాత్తాపం పొందాలని కానేకాదు! బాప్తిస్మం పొందాలి ఎప్పుడంటే ఒకవ్యక్తికి నిజమైన పశ్చాత్తాపం మరియు పాపములు చేసినందుకు తనలో పశ్చాత్తాప భావం రావాలి! అప్పుడు వాటివిషయమై దుఃఖిస్తూ పశ్చాత్తాపంతో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని అడిగి క్షమాపణ పొందుకుని బాప్తిస్మం పొందుకోవాలి!  ఇక్కడ నిజానికి బాప్తిస్మం కోసం ప్రశ్నల కంటే విశ్వాసులందరూ క్రీస్తుయేసులో ఐక్యమై ఉన్నారని గ్రహించి విశ్వాసులంతా ఐక్యమత్యంతో ఉండాలి అనేది ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశం!!!

 

నాల్గవది: క్రిష్పస్ గాయస్ స్తెఫనస్ వీరు కొరింథీ సంఘములో గల విశ్వాసులని 16వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. పౌలుగారు తన జీవితంలో కేవలం వీరికి మాత్రమే కాదు కొన్ని వేలమందికి బాప్తిస్మం ఇచ్చి ఉంటారు! ఉదాహరణకు ఫిలిప్పీ పట్టణంలో పౌలుగారిని సీలగారిని గుండగా తన్ని చెరసాలలో పెడితే వారు పాటలుపాడి ప్రార్ధనచేస్తే చెరసాల బ్రద్దలైపోయినప్పుడు చెరసాల నాయకుడు రక్షణ పొందగా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడిగితే ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని చెబితే అప్పుడే అక్కడే చెరసాల నాయకుడు తన కుటుంభంతో పాటుగా బాప్తిస్మం పొందారు! మరివారికి బాప్తిస్మం ఇచ్చింది పౌలుగారే కదా!

 

ఐదవది: క్రిష్పస్ కి గాయస్ కి స్తెఫనాస్ ఇంటివారికి మాత్రమే నేను బాప్తిస్మం ఇచ్చాను బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పిలువలేదు! వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను పంపించారు అని చెప్పడంలో పౌలుగారు ఒక విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు! గమనించాలి- పౌలుగారు అపోస్తలుడు! అపోస్తలుడు అంటే నాలుగు రకాలైన పరిచర్యలను ఆపరేట్ చేయగలిగాలి! భోధకుడు, సువార్తికుడు అయి ఉండాలి, కాపరిగా ఉండాలి, మరియు ప్రవక్తగా ఉండాలి అప్పుడే అపోస్తలుడు! కొన్నివేల మైళ్ళు కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించి సువార్తికుడు అయ్యారు! ఎందరినో సరిచేసి బోధించి సువార్తికుడు అయ్యారు! ఎన్నో ఆత్మఫలాలు పొందుకుని భాషలతో మాట్లాడుతూ ప్రవచనాలు చెబుతూ ప్రవక్త అయ్యారు! ఎందరినో స్వస్తపరచి స్వస్తపరిచే కృపావరం పొందుకుని ఉన్నారు! ఎన్నో సంఘాలు స్తాపించి కాపరిగా ఉన్నారు! ఇన్ని రకాలైన పరిచర్యలు చేస్తున్న తానూ తననుతాను గొప్పచేసుకోవడం చెయ్యడం లేదు! ఇంకా నేను అక్కడ సువార్త ప్రకటించగా ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది స్వస్తత పొందరు అనిడబ్బా కొట్టుకోవడం లేదు ముఖ్యంగా తన పరిచర్య మొత్తం సువార్త ప్రకటన  మరియు సిలువ వేయబడిన యేసు అనే అంశం మీదనే ఫోకస్ పెట్టారు గాని కేవళం స్వస్తతలు రక్షణ పొందారు అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెట్టలేదు!

 

నేటిదినాలలో అందుకు భిన్నంగా గొప్పగొప్ప ప్రసంగీకులు దైవజనులు జీవిస్తున్నారు! వారు చేసిన సువార్త లేక పరిచర్య వలన అనేకులు రక్షణ పొందుతున్నారు అనేకులు స్వస్తత పొందుతున్నారు! దేవునికి స్తోత్రం! అయితే వారి ఫోకస్ అంతా నేను ప్రార్ధన చేయగా ఇంతమంది స్వస్తత పొందారు అంతమంది రక్షణ పొందారు అని సువార్త ప్రకటన మీద ఫోకస్ పెట్టకుండా అద్భుతాల మీద ఫోకస్ పెట్టి ప్రజలను ఆకర్షిస్తూ తాము ధనసంపాదన మరియు ప్రేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు! దయచేసి నా భాషను క్షమించండి- ఈ గొప్పగొప్ప దైవజనులు- టీవీ ప్రసంగీకులు గాని పౌలుగారి కాలిగోటికి సరిరారు! గాని పౌలుగారు ఇంతటి పరిచర్య చేసినా తాను యేసుక్రీస్తు కంటే తగ్గించుకుంటున్నారు!

 

 విశ్వాసులు తనను క్రీస్తుతో సమానంగా ఎంచితే కాదు ఆయన హెచ్చాలి- నేను ఆయనకు సరిపోను అంటున్నారు! మీరు నానామున బాప్తిస్మం పొందలేదు, మీకోసం సిలువ భరించింది మీకోసం బాధలు భరించి రక్తం చిందించింది యేసుక్రీస్తు ప్రభులవారు! ఆయనకు చెందవలసిన గౌరవం, ఆయనకు చెందవలసిన ఘనత, దైవత్వం ఆయనకే చెందాలి, మనుష్యులకు కాదు అని చెబుతున్నారు! ఆ తరువాత ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు జరుగుతున్నా తన తపన అంతా సువార్త ప్రకటన, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు! అద్భుతాలు స్వస్తతల మీద ఆధారపడలేదు! కనీసం బాప్తిస్మం ఇవ్వడానికి కూడా తొందరపడలేదు! కాపరిగా అపోస్తలునిగా ఒక ప్రాంతంలో సెటిల్ అయిపోయి అక్కడ బంగళా కట్టుకుని ఆస్తి అంతస్తులు సంపాదించు కోలేదు! పౌలుగారే కాదండి శిష్యులు ఎవరూ కూడా కనీసం తనకోసం ఇల్లు కూడా కట్టుకోలేదు! దినదినం అవమానాలు ఆకలిదప్పులు అనుభవిస్తూ కేవలం సువార్త ప్రకటన మీదనే తమ ఆసక్తి చూపించారు! మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి భాప్తిసం పొందువాడు రక్షించ బడును అని చెప్పారు కాబట్టి ప్రజలను రాబోయే ఉగ్రతనుండి ఎలా తప్పించాలి అనేదే వారి ఆశ, ఆసక్తి గాని ధనసంపాదన మీద గాని ఆస్తి అంతస్తు పేరు ప్రతిష్టలు మీద గాని నా సంఘానికి ఇన్ని వేలమంది వస్తారు అన్ని లక్షలమంది వస్తారు అని గాని, నేను మీటింగ్ పెడితే ఇన్ని లక్షలమంది వస్తారు అని కానేకాదు వారి దృష్టి తపన! అందుకే వారిని దేవుడు అత్యధికంగా వాడుకున్నారు!

 

ఇక నేటి విశ్వాసులు కూడా మా అయ్యగారు ప్రార్ధించగా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ అయ్యగారిని పొగడటం చేస్తున్నారు! కొంతమంది డబ్బులిచ్చి సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు! మీటింగ్ జరుగక ముందే సాక్ష్యాలు రెడీ అయిపోతున్నాయి! కూటాలు జరుగలేదు దైవజనుడు వచ్చి వాక్యం చెప్పలేదు ప్రార్ధన చెయ్యలేదు గాని ఆ ప్రాంతంలో అయ్యగారు ప్రార్ధించగా నాకు ఇలా జరిగింది అంటూ కూలికి సాక్ష్యాలు చెప్పేవారు రెడీ అయిపోయారు! అలా చెప్పించుకుంటున్నారు! ఇంకా అరగంట టీవీ కార్యక్రమంలో  ప్రసంగం 15 నిమిషాలు, అయ్యగారు ప్రార్ధన చేస్తే ఇలా జరిగింది అంటూ గొప్పలు పన్నెండు నిమిషాలు, మాకు కానుకలు పంపండి అంటూ గోల ఒకటి! మొత్తం పెద్ద బిజినెస్ అయిపోయింది సువార్త ప్రకటన నేటి రోజులలో! దయచేసి నా భాషనూ క్షమించండి! నేను నిజం చెబుతున్నాను!

 

ఇదీ నాటి సువార్తకు నేటి సువార్తకు తేడా! ఈ రోజులలో మనకు సువార్త ప్రకటించడానికే అనేక మాధ్యమాలు అనుకూలంగా ఉన్నాయి! ఆ రోజులలో లేవు! ఆ రోజులలో ఎవరూ ఘనతను కోరుకోలేదు! క్రీస్తుని ముందు పెట్టారు! ఈ రోజు అందరూ అనగా చాలామంది ఘనతను అధికారాన్ని పేరుప్రతిష్టలను ధనమును కోరుకుంటున్నారు! పౌలుగారు అన్ని అధ్బుతాలు చేసినా అద్భుతాలను ఆధారం చేసుకోలేదు! ఇన్ని పత్రికలు రాసినా గాని వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నారు! నాడు దేవునికి ఘనతను తెచ్చే సేవచేశారు! నేడు తమ ఘనతకొరకు తమలాభం కొరకు దేవుని పేరు ఉపయోగించుకుంటున్నారు! ఆనాడు రోమన్ కతోలిక సంఘము దేవుని బిరుదులను, దేవుని ఘనతను, దేవుని దైవత్వాన్ని దొంగిలించి తమ పేర్లకు ముందు రెవరెండ్ అంటూ, పూజనీయుడు అంటూ పెట్టుకున్నారు, దేవుడే పూజించదగిన వాడు అయితే పరలోకంలో దేవుడు- భూలోకంలో పోప్ అంటూ దేవుని ఘనతను దైవత్వాన్ని దొంగిలించారు! ఈ రోజులలో దానిని ఖండిస్తున్న గొప్ప నాయకులు దేవునికి రావలసిన ఘనతను మా అయ్యగారు ప్రార్దిస్తే ఇలా జరిగింది మా అయ్యగారు ప్రార్ధిస్తే ఇంతమంది స్వస్తత పొందారు అంటూ దేవుని ఘనతను దేవుని స్థానాన్ని దొంగిలిస్తున్నారు!

రక్షణ పొందని వారిని, నామకార్ధ క్రైస్తవ విశ్వాసులకు దేవుని స్థానాన్ని మొబైల్ భర్తీ చేస్తే, నేడు మేము రక్షించబడిన వారము విశ్వాసులము అని చెప్పుకునే అనేకమందికి దేవుని స్థానాన్ని తమ పాదిరితో భర్తీ చేసుకున్నారు! మీకు నేను చెప్పింది జీర్ణించుకోవడం కష్టంగా ఉన్నా నన్ను క్షమించండి నిజము ఇదే!

 

కాబట్టి దైవసేవకులారా! దేవుని స్థానాన్ని దయచేసి దొంగిలించ వద్దు! జరుగుతున్న అద్భుతాలు గాని పరిచర్య గాని దేవుని కృప మీలో ఉండి జరిగిస్తుంది అని గ్రహించి దేవుని ఘనతను దేవునికే దయచేసి ఇవ్వమని బ్రతిమిలాడుతున్నాను!

విశ్వాసులారా! దేవునికి చెందవలసిన ఘనతను దేవునికే ఇవ్వండి గాని దేవుని స్థానాన్ని మీ పాదిరికి దయచేసి కట్టబెట్టవద్దు!!!

 

ఆ రీతిగా ప్రభువు మనలను నడిపించి తన మహిమలో వాడుకొనును గాక!

ఆమెన్!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*17వ భాగము*

 

1కొరింథీ 1:1719

17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను పౌలుగారు ఎత్తిచూపుతూ రాస్తున్నారు....

 

ప్రియులారా! ఇక ఇంకా ముందుకు పోతే క్రీస్తు విభజించబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువవేయబడేనా? అంటూ దేవుడు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పిలువలేదు గాని క్రీస్తు సిలువయొక్క శక్తి వ్యర్ధము కాకుండునట్లు వాక్చాతుర్యం లేకుండా  సువార్త ప్రకటించడానికే దేవుడు నన్ను పంపెను అంటూ ఇంకా ముందుకు పోతున్నారు!

 

ఇక్కడ పౌలుగారికి ఒకమాట అర్ధమయ్యింది ఏమిటంటే పౌలుగారికి ఎంతో వాక్చాతుర్యం ఉండి, దానిని ఉపయోగించి ప్రజలను ఉద్రేకపరచి ఆత్మలను రక్షిస్తే ఆ రక్షణ ఉద్రేకం ఉన్నంత వరకే పనిచేస్తుంది, ఒక్కసారి ఆ ఉద్రేకం పోయిన వెంటనే సోడాబుడ్డిలోని గేస్ పోయిన వెంటనే ఎలా తుస్సుమంటుందో  అలాగే వీరి రక్షణ కూడా తుస్సుమంటుంది! మరొకటి ఇలా వాక్చాతుర్యం వలన సిలువ యొక్క శక్తి ఉన్నదిఉన్నట్లుగా ప్రజలకు అర్ధం కాదు! అలా బోధిస్తే సిలువయొక్క శక్తి, దాని ప్రభావం తక్కువైపోతుంది అనిపౌలు గారి ఉద్దేశం! తానూ ఇంకా అపోస్తలులు ఎప్పుడూ సిలువవేయబడిన యేసును, ఆయన సిలువ విలువను, సిలువ శక్తిని ప్రకటించడానికే ప్రయత్నం చేశారు, కాబట్టి ఈ వాక్చాతుర్యం వలన ఆ శక్తి దాని విలువ తగ్గిపోకుండా సిలువ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు! కారణం ఉద్రేకపూరితమైన వాక్యము, వాక్చాతుర్యముతో గల వాక్యము వలన ఆత్మల రక్షించబడవు గాని క్రీస్తుయేసు యొక్క సువార్తలో సిలువను గూర్చిన నిజసువార్తలో సిలువమీద జరిగిన మానవుల విముక్తి కార్యంలోనే గొప్ప శక్తి ఉంది! అందుకే మానవ జ్ఞానంతో సువార్తప్రకటిస్తే మనుష్యులు రక్షణ పొందలేరు!

 

ఇక 18వ వచనంలో : సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెఱ్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నారు!

ఇక్కడ మనకు రెండు గ్రూపులను చూపిస్తున్నారు పౌలుగారు!

మొదటిది: నశించిపోతున్నవారు!

రెండవది: రక్షించబడుతున్న/రక్షించబడిన వారి గుంపు!!  ఇలా చెప్పడం వలన గుంపుల యొక్క లక్షణాల బట్టి ప్రతీ మనిషి ఏ గుంపులో ఉన్నవారో తెలిసిపోతుంది! క్రీస్తు సిలువపట్ల మనుష్యుల కున్న మనస్తత్వం ఆలోచనలు వారిని ఈ రెంటిలో ఏదో ఒక గుంపుని సూచిస్తుంది!

 

మొదటిది: నశించిపోతున్న వారు! ఇంతకీ పౌలుగారి మాటలలో లేక పరిశుద్ధాత్ముని భాషలో నశించిపోతున్న వారు ఎవరు?  మతనిష్టకలిగి- ధర్మశాస్త్రాన్ని పాటించే వారు అనగా యూదులు, ఈ పత్రిక కొరింథీపట్టణ వాసులకు రాస్తున్నారు కాబట్టి వేదాంతం పట్ల ఆసక్తి కలిగి నక్షత్రాలు, ఆకాశంలో గల రూపములు, వాటి జ్ఞానము కలిగిన గ్రీకులు  మరియు ఇప్పుడు అప్పుడు తమ చేతులతో చేసుకున్న విగ్రహాలు తమను పాపమునుండి విమోచిస్తాయి, తమకు పరలోకం ఇస్తాయి అని నమ్మే విగ్రహారాధికులు! వీరే నశించిపోతున్నవారు!!! వీరికే సిలువను గూర్చిన వార్త వెఱ్రితనముగా కనిపిస్తుంది!

 

మరి ఎందుకు వీరు దీనిని అర్ధం చేసుకోలేక పోతున్నారు? అంటే 2కొరింథీ 4:4 లో పౌలుగారు చెబుతున్నారు ఈ యుగ సంభంధమైన దేవత వీరి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసింది కాబట్టి నిజాన్ని గ్రహించలేకపోతున్నారు! ఈ సిలువను గూర్చిన సువార్త అవసరము వారికి, అది పాపిని రక్షించి పవిత్రునిగా చేసి పరలోకం ఇస్తుంది అని వారు నమ్మలేరు! నమ్మరు కూడా! ఎందుకంటే ఆ ఆలోచనా విధానం దేవునిది! వీరి ఆలోచనా విధానం వారిని కంట్రోల్ చేసే సైతానుది! రోమా 8:57 ..

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

 

మరో విషయం ఏమిటంటే వారికి సిలువ అవసరం లేదు! వారు ఎంతో ఆత్మస్థైర్యం మరియు అహంకారము, ఈగో గలవారు!  గాని సిలువ అనేది వారిని శ్రమలగుండా శ్రమల మార్గంలో తీసుకుని వెళ్తుంది. కాబట్టి వారికి శ్రమలు అవసరం లేదు! సిలువ వారి యొక్క అహాన్ని త్రుంచి ధూళిలో కలిపి క్రీస్తులో ఐక్యంచేస్తుంది! వారికి వారి అహం దెబ్బతినకూడదు! నీవు పాపివి అని చెప్పకూడదు! నీవు లంచగొండివి వ్యభిచారివి అబద్దికుడవు, పాపివి అని చెప్పకూడదు! అలా చెప్పకుండా వారు చేసే పాపాలు వారు చేసేస్తూ వారు చేతులతో చేసుకున్న విగ్రహాల ముందుకు వెళ్లి దవడల మీద లేక చెంపల మీద కొట్టుకుని మమ్మల్ని క్షమించు,  మేము వాటిని అనగా మా పాపములు మానలేము, నీవు మాత్రం ఈ కొబ్బరికాయలు పాలు ఫలహారాలు క్రొవ్వొత్తులు తీసుకుని మమ్మల్ని క్షమించేయ్ అని చెప్పేస్తూ ఉంటారు! ఇంకా వంగి నమస్కారం చేసి, పొర్లు దండాలు పెడితే, ఏడుసార్లు ప్రదిక్షణలు చేస్తే పాపం పోతుంది అని భావిస్తున్నారు! వీరికి ఇది వెఱ్రితనముగా అనిపించదు గాని సిలువ మాత్రము వెఱ్రితనముగా అనిపిస్తుంది! వీరే నశించిపోతున్నవారు! వీరికే దేవుని సిలువ వెఱ్రితనముగా కనిపిస్తుంది!

 

నిజానికి ఇలాంటి వారిని అనగా నశించి పోతున్న వారిని వెదకి రక్షించడానికే క్రీస్తుయేసు ఈలోకమునకు వచ్చారు!! లూకా 19:10

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అందుకే ఆయన అనగా దేవుడు తన అద్వితీయ అనగా ఒకేఒక కుమారుని బలిగా అర్పించి మానవులను విమోచించడానికి ఈ లోకమునకు వచ్చెను అని యోహాను ౩:16 లో వ్రాయబడి ఉంది! ఇలా క్రీస్తుయేసు ఈ లోకమునకు తన పాపముల కోసం పాపములను క్షమించడానికి వచ్చారు అని ఎందరు నమ్మి విశ్వసిస్తారో వారిని విమోచించి తన పిల్లలుగా చేసుకుంటారు దేవుడు!

John(యోహాను సువార్త) 1:12

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

 ఇలా అంగీకరించిన వారే రక్షించబడిన/రక్షించబడుతున్న వారు!

 

గాని ఆ నశించిపోతున్న వారు దీనిని అంగీకరించరు! వారి జ్ఞానము వారి వేదాంతము వారి జ్యోతిష్య శాస్త్రాలు పురాణాలు అన్నీ వారిని మరింత వెఱ్రివారినిగా చేస్తున్నాయి! ఇలాంటి అనుభవమే ఒకసారి కొలస్సీ సంఘములో వచ్చింది. అక్కడ కొంతమంది వచ్చి మీరు రక్షణ పొందుకున్నారు మంచిది! అయితే పరలోకం చేరాలంటే రక్షణతో పాటుగా వేదాంత శాస్త్రాన్ని, తర్కజ్ఞానమును నేర్చుకోవాలి అప్పుడు మీకు దేవుడు పూర్తిగా అర్ధమవుతాడంటూ భోధించి వారిని గందరగోళంలో త్రోసేసారు! పౌలుగారు వారికి రాస్తూ అంటున్నారు- అరేయ్ వెఱ్రివారలారా! ఆ జ్ఞానము కాదు కావాల్సింది కారణం బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తము చేయబడ్డాయి అని రాశారు! కొలస్సీ2:3.

 

(ఇంకాఉంది)

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*18వ భాగము*

 

1కొరింథీ 1:1719

17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను పౌలుగారు ఎత్తిచూపుతూ నశించి పోతున్నవారు, రక్షించబడుతున్న వారు అనే రెండు గుంపుల కోసం రాస్తున్నారు....

 

   (గతభాగం తరువాయి)

 

ఇక రెండవది: సువార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి! ఇది ఎంతటి శక్తి అంటే సాతాను యొక్క కబంధహస్తాలను బ్రద్దలగొట్టి పాపపుసంకెళ్ళు విరుగగొట్టి ఆధ్యాత్మిక మరణం నుండి నిత్యజీవమునకు తీసుకుని వెళ్ళేది ఈ సిలువను గూర్చిన సువార్త!!  ఇది ఒక్కసారి జరిగి ఆగిపోదు! రక్షించబడిన విశ్వాసిని మరణం నుండి లేపి ఈ లోకంలో విశ్వాసము గలవారిగా చేసి, ఆటుపోటులు శ్రమలు తట్టుకుని సాతాను పన్నాగాలు ఎదుర్కొని ఒకరోజు నిన్ను మహిమ రూపిగా మార్చేవరకు క్రీస్తుతో ఐక్యమయ్యేవరకు ఈ సువార్త నిన్ను వెలిగిస్తూ ఉంటుంది!

యోహాను 1:1213

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

John(యోహాను సువార్త) 3:3,4,5,6,7,8

3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా( లేక, పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేము  ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

ఇది దేవుడిచ్చే నూతన జీవము మరియు నిత్యజీవము! ఇది అప్పటితో ఆగకుండా మహిమలో ప్రవేశించేవరకు నీవెంటే ఉంటుంది!

 

రోమా 8:23లో మన దేహ విమోచనం కోసం ఎదురుచూస్తున్నాము అంటున్నారు!  .....

రోమీయులకు 8: 23

అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

 

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఇలాంటి వారికే సిలువ అంటే దేవుని శక్తి! దేవుని ప్రభావము!!!  1కొరింథీ 1:18, 24

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

 

రోమా 1:16లో పౌలుగారు ఏమంటున్నారో చూద్దాం...

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

 

పౌలుగారు గారు ఇంకా సంఘము ఈ బలప్రభావాలను అనుభవించారు కాబట్టి ఈ మార్గములో గల ఆనందం వారికి తెలుసు!  ఈ సిలువ వారి పాతరోత బ్రతుకులను మార్చి వారి చీకటి జీవితంలో వెలుగుని ప్రసాదించింది! గత త్రాగుడు, వ్యభిచారం, అబద్దాలు, లంచాలు, విగ్రహారాధన అంటే అసహ్యం కలిగించి, ఆధ్యాత్మిక విషయాల మీద, పరలోక వ్యవహారాల మీద, తేజోవాసులు పొందబోయే స్వాస్త్యము మీద, గొర్రెపిల్ల పెండ్లివిందు మీద వెయ్యేండ్ల పాలనమీద, మహిమ దేహాల మీద ఆసక్తిని ప్రసాదించి వాటివైపే తీసుకుని వెళ్తుంది! బంగారమంటే అనాసక్తి ని కలిగిస్తుంది ఎందుకంటే ఒకరోజు బంగారువీదులలో బంగారం మీద నడుస్తారు! అలా నడవాలి అంటే ఈ బంగారం చెవుల్లో ముక్కులో చేతులలో పెట్టుకోరు!  ఇప్పుడు ఈ సిలువ వీరి బ్రతుకులను పూర్తిగా మార్చివేసింది! ఇప్పుడు వారు నూతన సృష్టి! దేవుని పిల్లలు!!

 

 2కొరింథీ 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

 

అందుకే 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసుదేశస్తులకేమి పిలువబడిన వారికి అనగా రక్షణకోసం దేవునిచే పిలువబడిన వారికి, క్రీస్తు- దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు అంటున్నారు! అందుకే కొలస్సీ పత్రికలో బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అంటున్నారు! 2:3; ఇంకా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివశించుచున్నది అంటున్నారు కొలస్సీ 2:9 లో. 

2:15 లో ఈ ప్రధానులను అధికారులను జ్ఞానవంతులు అని చెప్పుకునే వారిని నిరాధాయులుగా చేసి వారిని వేడుకకు కనుపరిచెను అంటున్నారు....

కొలస్సీయులకు 2: 15

ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

 

చివరిగా ఒక్కమాట! క్రీస్తుని ఎరుగని నమ్మని ప్రపంచదేశాల వేదాంతులు, తత్వజ్ఞాన సంపూర్ణులు, విద్వాంసులు, జ్ఞానులు రాసిన పుస్తకాలు అన్నింటికంటే ఎంతో ఎక్కువైన దైవజ్ఞానం సిలువలో, సిలువ దారిలో ఉంది! ఇది అంత శక్తివంతమైనది!

 

కాబట్టి ఆ సిలువ విలువ తెలిసిన మనము కూడా విలువైన పనులు చేస్తూ ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్త్యములో పాలుపొందడానికి సరిపోయే కార్యక్రమాలే చేద్దాం! పరిశుద్దులకు తగినట్లుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

 

(ఇంకాఉంది)

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*19వ భాగము*

 

1కొరింథీ 1:1825

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

20. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు (మూలభాషలో- ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.

22. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

23. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

25. దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను పౌలుగారు ఎత్తిచూపుతూ నశించి పోతున్నవారు, రక్షించబడుతున్న వారు అనే రెండు గుంపుల కోసం చెబుతూ ఇంకా ఈలోక జ్ఞానము కోసం ఈలోకపు జనాల కోసం ఎత్తి రాస్తున్నారు...

 

సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెఱ్రితనము అదేవిధంగా రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అంటూ 19 వ వచనంలో అంటున్నారు ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యం చేస్తాను అని వ్రాయబడినది అంటున్నారు! ఇది ఎక్కడ ఉంది అంటే యెషయా 29:14 లో...

కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

 

ఇక 20 వచనంలో అంటున్నారు జ్ఞాని ఎక్కడ ఈలోకపు తర్కవాది ఏమయ్యెను ఈలోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసేశారు అంటున్నారు! ఈ మాటలు అంటున్నది ఎవరు? ఫిలాసఫీలో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఒకానొకప్పుడు సన్హెడ్రీన్ సభ్యుడు, ఎంతో విద్యాభ్యాసం చేసి ఎన్నెన్నో పురష్కారాలు పొందిన పౌలుగారే అంటున్నారు: ఈలోక జ్ఞానాన్ని దేవుడు వెఱ్రితనముగా చేసేశారు అంటున్నారు! అందుకే క్రీస్తు సిలువకోసం సమస్తము అనగా తనకు ఏమేమి లాభకరంగా ఉన్నాయో లాభకరంగా ఉండేవో వాటిని పెంటగా ఎంచుకుని క్రీస్తు మార్గాన్ని ఎన్నుకొన్నాను అంటున్నారు పౌలుగారు....

Philippians(ఫిలిప్పీయులకు) 3:7,8,9,10,11

7. అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.

9. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

10. ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,

11. ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

 

నిజమైన జ్ఞానం ఏకైక నిజ దేవుని పట్ల భయభక్తులతో ఆరంభమౌతుంది అని యోబుగారు చెబుతున్నారు

యోబు 28: 28

మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

 

కీర్తనలు 111: 10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెత 1:7

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

 

ఈ లోకానికి చెందిన జ్ఞానులకూ మేధావులకూ విద్వాంసులకూ వేదాంతులకూ ఇది లేదు. అందువల్ల వారికి నిజమైన జ్ఞానం ప్రాథమిక దశలో కూడా లేదు. అయితే ఇక్కడి విషయమేమంటే జ్ఞానమని వారనుకుంటున్న దాన్నంతటినీ సిలువ మూలంగా దేవుడు తెలివితక్కువ తనంగా చేసేశాడు. మనుషులను రక్షించడానికి దేవునికున్న ఏకైక మార్గం సిలువ. మనుషుల్లో అందరిలోకీ జ్ఞానులెవరూ ఇలాంటి మార్గం గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదు. వారి జ్ఞానమార్గం ఎవరికీ విముక్తిని తేవడం అసాధ్యం. అది దేవుని మార్గం కాదు.

కొలస్సీయులకు 2: 8

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన (భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

కొలస్సీయులకు 2: 9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 

ఇక 21వ వచనం అర్ధం చేసుకోవం కష్టంగా ఉంటుంది. దేవుని జ్ఞానం కారణంగా లోకము తన జ్ఞానమును అంతా ఉపయోగించి దేవుణ్ణి తెలిసికోవాలని ప్రయత్నించింది గాని అది వారికి అర్ధం కాలేదు, అర్ధం కాదు! అయితే ఈ జ్ఞానులు దేనినైతే వెఱ్రితనము అని భావించారో అదే వెఱ్రితనమును ఉపయోగించి ఆ వెఱ్రితనమును అంగీకరించిన వారిని రక్షించాలని దేవునియొక్క ఇష్టపూర్వకమైన సంకల్పం అంటున్నారు!

 

ఇక్కడ మూడు రకాలైన ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి.

 

మొదటిది: మనుషులు తమ వేదాంత సారం, తత్వశాస్త్రం, మేధాశక్తి, గూఢమైన జ్ఞానమంతా ఉపయోగించి కూడా దేవుణ్ణి  ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. నిజానికి అందుకు వ్యతిరేకంగానే జరిగింది. మానవజాతికి గతంలో ఒకప్పుడు దేవుణ్ణి గురించి ఉన్న జ్ఞానాన్ని కూడా వారు కోల్పోయారు! పౌలుగారు చెబుతున్నారు:

రోమ్ 1:21-23

21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.

22. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

 

రెండవది: జ్ఞానులనబడిన వారికి తెలివితక్కువతనంగా అనిపించే దాని ద్వారా అంటే సిలువను ప్రకటించడం ద్వారా దేవుడు మనుషులకు పాపవిముక్తిని కలిగిస్తున్నాడు

1కోరింథీయులకు 1: 18

సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

 

 మూడవది:  ఈ సిలువసువార్తను నమ్మినవారికి పాపవిముక్తి, రక్షణ కలుగుతుంది

రోమా 1:16-17

16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

17. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

 

ఇక 22వ వచనంలో...1కోరింథీయులకు 1: 22

యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.

 

యూదులు ఎప్పుడు సూచక క్రియలు అడిగారు మార్కు 8:11

అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి.

 

యోహాను 6: 30

వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

 

మత్తయి 12:3941

39. వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.

40. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.

41. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

 

అయిత గ్రీసు దేశస్తులు ఎప్పుడూ జ్ఞానము జ్ఞానము అని చెప్పబడే విషయాలు, క్రొత్త‌విషయాలు వినేవారు, కొంతమంది పనిపాటులు మానేసి సహితం వీటిని వినేవారు అని మనకు అపొ 17:21 ఆధారంగా తెలుస్తుంది!!

 

అయితే 23వ వచనంలో అంటున్నారు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము! అయితే ఈ సిలువవేయబడిన క్రీస్తు యూదులకు ఆటంకం గాను అన్యజనులకు వెఱ్రితనముగా కనిపిస్తున్నాడు అంటున్నారు!

ఇంతకీ సిలువ వేయబడిన క్రీస్తు ఆటంకం ఎందుకు యూదులకు?

యూదులు ఎదురు చూచినది, కోరినది సిలువ వేయబడిన అభిషిక్తుణ్ణి కాదు. రాజుగా ఉండి తమ తరుపున యుద్ధాలు చేస్తూ తమకు లాభం తెచ్చిపెట్టే మెస్సయ్యను! వారికోసం చనిపోయి పాపమునుండి విమోచించే క్రీస్తుయేసుని కాదు! తమ రక్షకుడు చనిపోకూడదు వారికి!!! ఇదే ఆటంకం!

 

అన్యులకు వెర్రితనంగా  ఎందుకు అనిపిస్తుంది?

వారి ఉద్దేశం ఏమిటంటే: నేరస్థులను మాత్రమే సిలువ వేస్తారు గదా, సిలువ వేయబడిన నేరస్థుడికి ఎవరి విముక్తితోనైనా ఏమి సంబంధం ఉండగలదు? ఒక శిక్ష విధించబడిన నేరస్తుడు మరొకరి పాపాలు ఎలా క్షమించగలడు అంటూ ఇది వారికి వెర్రిగా పిచ్చిగా  అనిపిస్తుంది, తాము వెదికే జ్ఞానం అలాంటివారిలో ఎలా వెల్లడౌతుంది? అనీ వారు వాదించేవారు. వాదిస్తున్నారు ఇప్పుడు కూడా!

 

అయితే పిలువబడిన వారికి వారు యూదులైనా గ్రీసు దేశస్తులైనా గాని క్రీస్తు మరియు సిలువ  వారికి దేవుని శక్తియై ఉన్నది అంటున్నారు పౌలుగారు ఆ దేవుని శక్తి బలప్రభావాలు దేవుని జ్ఞానమును అనుభవించి రుచిచూసి!!!

ఇది జ్ఞానులు అని చెప్పుకునేవారికి అర్ధం కాదు!

 

కాబట్టి ఆ నిజదేవుని బలప్రభావాలు ఎరిగిన మనము ఆశక్తిని ఆశ్రయించి దాని ప్రకారముగా సాగిపోదాం!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*20వ భాగము*

1కొరింథీ 1:2431

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

25. దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో- శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను పౌలుగారు ఎత్తిచూపుతూ నశించి పోతున్నవారు, రక్షించబడుతున్న వారు అనే రెండు గుంపుల కోసం చెబుతూ ఇంకా ఈలోక జ్ఞానము కోసం ఈలోకపు జనాల కోసం ఎత్తి రాస్తున్నారు...

 

ఇక 24వ వచనం మరోసారి చూసుకుంటే ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అంటున్నారు! గతభాగంలో యూదులకు ఎందుకు ఆటంకము గా ఉన్నారో యేసయ్య, అన్యజనులకు ఎందుకు వెఱ్రితనముగా ఉన్నారో చూసుకున్నాము!

అయితే ఇక్కడ పిలువబడిన వారికే దేవునిశక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నారు.  ఇక్కడ పిలువబడిన వారు అనగా రక్షించబడుతున్న వారు అని మనము 18వ వచనం ప్రకారం అర్ధం చేసుకోవచ్చును!

రోమీయులకు 8: 29

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

రోమీయులకు 8: 30

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

ఇక దేవుడు మనలను దేనికోసం పిలిచారో గతభాగాలలో చూసుకున్నాము గనుక ముందుకు పోదాము! అయితే మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దేవుడు తమను ఎన్నుకుని తనకోసం పిలుచుకున్నారు, పిలుచుకుని మనలను తన రక్తముతో కడిగి నిర్దోషులనుగా మనలను తీర్చారని గుర్తెరిగి ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్దులుగా జీవించాలని ఎరిగి పరిశుద్ధమైన జీవితం జీవించాలి!

 

ఇక ఈ వచనంలో మరో ముఖ్యమైన మాట క్రీస్తే దేవుని జ్ఞానము!  మరియు క్రీస్తే దేవుని బలప్రభావము లేక దేవుని శక్తి!!! అందుకే ఆయన మరణమును సాతానుని పాపమును గెలిచి విజయుడై మనకు విమోచనము తీసుకుని వచ్చారు!

 

25వ వచనంలో దేవుని వెఱ్రితనము మనుష్య జ్ఞానముకంటే జ్ఞానమైనది దేవుని బలహీనత మనుష్యుల బలముకంటే బలమైనది.

యెషయా 55:89 లో అంటున్నారు దేవుడు నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా ఉద్దేశాలు నా విధానాలు మీ ఉద్దేశాలు వంటివి కావు!

 

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

 

అందుకే రోమా 11:౩౩36 లో పౌలుగారు దేవుని బుద్ధి కుశలతకు పరవశుడై పలుకుతున్నారు...

 

33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.

34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?

35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?

36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.!

 

అవును దేవుని జ్ఞానమును ఆయన ప్రణాళికను ఎరగడం అసాధ్యం! అవి మానవుల ఊహలకు అందనివి!! యూదులు తమ మెస్సయ్య రాజుగా వస్తాడు రాజుల గృహంలో పుడతాడు అని ఎదురుచూస్తే పశువుల పాకలో పుట్టి, దీనుడుగా పెరిగి, మనలాగే ఆకలిదప్పులు కష్టసుఖాలు అనుభవించి, మన భాధలు ముందు తెలుసుకుని,  రోగాలు స్వస్తపరచి చివరికి పాపరోగానికి తానే మందుగా బలిగా సిలువలో బలైపోయారు! యూదులు కోరుకున్నట్లు చేయలేదు! సమస్తమానవాళిని రక్షించే మాస్టర్ ప్లాన్ ఆయనది! కేవలం యూదులను యూదులకు మాత్రమే రక్షణ పొందాలి అనేది యూదుల ప్లాన్! ఇలాంటివి ఎన్నో మానవ హృదయాలకు అర్ధం కావు దేవుని మార్గాలు!!!

 

ఇదే దేవుని జ్ఞానానికి మానవుల జ్ఞానానికి తేడా!! ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది!!!

 

ఇక 2629 వచనాలలో బైబిల్ గ్రంధంలో గల మహోన్నతమైన మాటలలో కొన్ని ఉన్నాయి! అదికూడా మానవుల జ్ఞానమునకు అతీతమైనవి!!

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని (మూలభాషలో- శరీరరీతిని) జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

 

సోదరులారా మీరు లేక మీకు కలిగిన పిలుపును చూడండి లోక సంబంధంగా చూసుకుంటే మీలో జ్ఞానులు ఘనులు గొప్ప వంశానికి చెందిన వారు అనేకులు లేరు! అవును కదా మన భారతదేశంలో కూడా దేవుణ్ణి అంగీకరించిన వారిలో మేధావి వర్గానికి చెందినవారు గాని పెద్దకులాలలో పుట్టిన వారు గాని ధనవంతులు గాని ఎక్కువగా లేరు! అత్యధికులు దీనులు, కూలిపని చేసుకునే వారు, లోకం అంటరానివారు అని పిలిచిన వారు, విద్యలేని వారు, పేదలు ఇలాంటివారినే దేవుడు ఎన్నుకున్నారు మన దేశములోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో! దీనిని ఎవరూ కాదనలేరు!

 

ఇలా దీన స్థితిలో ఉన్నవారిని, తిరస్కారాలకు గురి అయినవారిని తన బిడ్డలుగా చేసుకోడానికి దేవుడు ఇష్టపడ్డారు! ఎందుకంటే వీరు తమ గతము తెలుసుకుని జీవితాంతం దేవునికి ఋణపడి ఉంటారు కాబట్టి! ప్రజలు వీరిని తిరస్కరించారు అయితే దేవుడు వీరిని కోరుకున్నారు! అలా కోరుకుని గర్విష్టులైన ప్రజలను సిగ్గుపరచాలని దేవుని ఉద్దేశము! దేవునికి మనిషిలో గర్వము అహము లేక అహంభావము అంటే పరమ అసహ్యము! మనిషిలో దీనత్వము యధార్ధత ప్రేమ జాలి పవిత్రత దేవునికి ఇష్టము!!! ఇంకా తమకున్న ధనము బట్టి తమకున్న కులము బట్టి మరోదాని బట్టి అతిశయించేవారంటే దేవునికి చిరాకు!

 

యిర్మియా 9: 23

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.

యిర్మియా 9: 24

అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

 

Proverbs(సామెతలు) 6:16,17,18,19

16. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

17. అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

18. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును

19. లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

 

సామెతలు 16: 5

గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.

 

Isaiah(యెషయా గ్రంథము) 2:9,10,11,12,13,14,15,16,17

9. అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము.

10. యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.

11. నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

12. అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.

13. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని

14. ఉన్నత పర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని

15. ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును

16. తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.

17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.

 

యెషయా 13: 11

లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవు చున్నాను అహంకారుల అతిశయమును మాన్పించెదను బలాత్కారుల గర్వమును అణచివేసెదను.

 

యిర్మియా 17: 5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.

 

యాకోబు 4:6

కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.

 

చూశారా! మనిషి దేని విషయంలో గర్విస్తాడో అదంతా వ్యర్ధంయ్యేలా దేవుడు చేశారు! ఏ మనిషి దేవుని సన్నిధిలో గొప్పలు చెప్పుకోకుండా ఉండేలా ఆయన ఏర్పాట్లు చేశారు!

 

రోమీయులకు 3: 27

కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయ బడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టి వేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే.

 

ఎఫెసీ 2:9

అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

కాబట్టి చివరి వచనంలో చెప్పినట్లు ఎవడైనా అతిశయించాలి అంటే ప్రభువును బట్టి అతిశయించాలి కారణం ఆయనే మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత మరియు విమోచనము అయ్యారు! కాబట్టి ప్రభువునందే ఆనందిద్దాం! లోకములో కలిగిన వాటివిషయం అతిశయించవద్దు! లోకము మనలను తృణీకరించినా గాని దేవుడు మనలను ఎన్నుకుని తనవారిగా చేసుకున్నారు కాబట్టి జీవితాంతం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉందాము!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*21వ భాగము*

 

1కొరింథీ 1:3031

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను గూర్చి పౌలుగారు చెబుతున్నారు!

 

ప్రియులారా ఇక ౩౦వ వచనంలో అంటున్నారు: అయితే ఆయన మూలముగా మీరు (మనము) క్రీస్తుయేసునందున్నారు! అవును యేసుక్రీస్తు ప్రభులవారిని బట్టి ఆయనచేసిన బలిదానం బట్టి మనము ఆయనలో ఉన్నాము! కాబట్టి రోమా 8:1 ప్రకారం క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిదియు లేదు! కారణం మన యొక్క శిక్షను ఆయన భరించారు! మనకు చెందవలసిన శిక్షకు ఆయన పరిహారం చేసి మనలను పాపమునుండి పాపముయొక్క చెరనుండి విడుదల చేశారు! ఇప్పుడు మనకు ఏ శిక్షావిదియు లేదు!

ఎఫెసీ 1:1 లో పౌలుగారు చెబుతున్నారు క్రీస్తుయేసునందు విశ్వాసులైన వారికి శుభము ఎందుకంటే ౩వ వచనం ప్రకారం ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంభంధమైన ప్రతీ ఆశీర్వాదం  మనకు ఇచ్చారు ఎలాగంటే తన ప్రియుని యందు అనగా యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు కృపామహిమ కీర్తి వచ్చేలా తన చిత్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా ఏర్పాటుచేసుకున్నారు అంటున్నారు! ఎఫెసీ 1:37

3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,

5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

 

కాబట్టి ఇప్పుడు విశ్వాసుల యొక్క రక్షణకు విముక్తికి అవసరమైనదంతా ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తుయేసే!!!

 

మరో విషయం: మనము క్రీస్తుయేసులో ఉంటే మనము తండ్రితో కూడా సహవాసం కలిగి ఉన్నామని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభులవారు స్వయముగా చెప్పారు!...

John(యోహాను సువార్త) 17:6,9,11,20,21,22,23,24

6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

9. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

11. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.

20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

24. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.

 

1యోహాను 1: 3

మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) తోకూడను ఉన్నది.

 

కాబట్టి మనము తండ్రియైన దేవునితోను కుమారుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారితోను పరిశుద్ధాత్ముని తోను ఉంది కనుక ఒంటరివి అని భయపడక గొప్ప సాక్షి సమూహము మనతో ఉంది అని ధైర్యముగా గమ్యము చేరుదాము!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*22వ భాగము*

 

1కొరింథీ 1:3031

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! కొరింథీ సంఘములో గల బేధములను గూర్చి పౌలుగారు చెబుతున్నారు!

 

ఇక  31వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలయును అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధత విమోచనము ఆయెను అంటున్నారు! మన తెలుగులో ఆయన మనకు నీతియు జ్ఞానము పరిశుద్ధత విమోచనము ఆయెను అని తర్జుమా చేయబడినా ప్రాచీన ప్రతులలో : ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధత విమోచనము ఆయెను అని ఉంది!

గమనించారా! యేసుక్రీస్తు ప్రభులవారే మనయొక్క జ్ఞానము, యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క నీతి,  యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క పరిశుద్ధత, యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క విమోచనం!!!

 

దీనికోసం క్లుప్తంగా ఆలోచిస్తే:

మొదటిది: యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క జ్ఞానము! లోకంలో మనిషి తెలుసుకున్న ఇంకా తెలుసుకోగలిగిన వాటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభులవారే అత్యున్నత జ్ఞానము అయి ఉన్నారు! అందుకే కొలస్సీయులకు ఉత్తరం రాస్తూ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనయందే గుప్తమై ఉన్నవి ఇంకా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనయందు ఉన్నది అంటున్నారు....

Colossians(కొలొస్సయులకు) 2:2,3,8,9

 

2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

8. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన (భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 

 ఈ లోకపు తత్వజ్ఞానము గాని మరో శాస్త్రం గాని వేదాంత శాస్త్రము గాని ఆయన దగ్గర పనిచెయ్యదు! ఇంకా చెప్పాలంటే క్రీస్తుయేసునందున్న ఏ మాత్రం చదువు సంధ్యలు లేని నిశాని విశ్వాసి కూడా, నిరుపేద విశ్వాసి కూడా క్రీస్తుయేసునందు లేని ఏ మేధావి లేక జ్ఞాని లేదా వేదాంత పండితుల కంటే నిజమైన జ్ఞానము గలవాడు! అంతకంటే ఎక్కువ జ్ఞానము గలవాడు!!!

 

ఒక ఉదాహరణ చెప్పనీయండి: బుద్ధిమంతుడు రాబోయే ఉగ్రతనుండి తప్పించుకునే మార్గం కోసం పరమునకు పోయే మార్గంలో ప్రయాణం చేస్తాడు అని బైబిల్ చెబుతుంది! సామెతల గ్రంధంలో..

సామెతలు 15: 24

క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును.

 

 అయితే ఈలోకంలో జ్ఞానులు అని పిలువబడే వారు దేవుడు లేడు అంటున్నారు, బైబిల్ వారిని బుద్దిహీనుడు అనగా ఫూల్స్ అంటుంది! కీర్తన 14:1;53:1;

 వీరికి ఏ మొబైల్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ షేర్స్ కొంటే లాభపడతారో ఎలాంటి వాటిని తీసుకుంటే మరింత మరుగైన జీవితం జీవించగలరో బాగా తెలుసు! గాని వారికి పరలోకం పోయే మార్గం తెలియదు! రాబోయే ఉగ్రత వస్తుంది తప్పించుకోవాలంటే మనలను వెఱ్రివారిగా చూస్తున్నారు! ఇప్పుడు చదువులేని ఆ విశ్వాసి జ్ఞానవంతుడా/జ్ఞానవంతురాలా లేక చదువుకున్న ఈ మూర్కుడు జ్ఞానవంతుడా??!!!!

 

రెండు: యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క నీతి!!: యేసుక్రీస్తు ప్రభువుల వారు మన యొక్క నీతి! ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి మనలను నిర్దోషులనుగాచేసి మన నీతి అయ్యారు!

 

రోమా ౩:2126

21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.

22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.

23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

రోమా 10:910

9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

 

ఫిలిప్పీ ౩:9

క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

 

చాలామంది తమ యొక్క మంచిపనుల ద్వారా పుణ్య కార్యాల ద్వారా దేవుని యొక్క నీతిని పరలోకాన్ని మోక్షాన్ని పొందుకోవాలని చూస్తున్నారు! అయితే ఇది మోక్షానికి సరిపోదు! క్రీస్తుయేసునందు వారు పశ్చాత్తాప పడి ఆయన రక్తములో కడుగబడితేనే పరిశుద్దులుగా మార్చబడి అప్పుడు దేవుని నీతిని పొందుకొంటారు!

యెషయా 64: 6

మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

 

మూడు: యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క పరిశుద్ధత: గమనించాలి క్రీస్తుయేసు మనలను పిలిచినది పరిశుద్దులుగా ఉండటానికి!

రోమా 1:2

దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడు నైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా *పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి* (శుభమని చెప్పి) వ్రాయునది.

 

కొరింథీ 1:2

కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా *క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని*, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

 

ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూలోకము విడిచి వెళ్లేముందు మనలను ఆయన వాక్యముచేత మనలను ప్రత్యేకపరిచి పవిత్రులనుగా చేశారు! యోహాను 17:1719

17. సత్యమందు (మూలభాషలో- సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.

18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.

19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

 

ఒక విషయం చెప్పనీయండి: బైబిల్ ప్రకారం పరిశుద్ధులు అనగా క్రైస్తవ్యంలో ఏదో అసాధారణ  విశేషమైన పవిత్రత కలిగి దేవుడు అంటే మితిలేని శ్రద్ధాభక్తులు కలిగి విజయవంతమైన జీవితం కలిగిన కొద్దిమంది విశ్వాసులని కాదు! ఏ తేడాలేకుండా విశ్వాసులందరూ పరిశుద్దులే! కారణం దేవుడు వారిని బాప్తిస్మం పొందుకున్న వెంటనే వారిని పరిశుద్దులుగా మార్చారు తీర్చారు! అయితే అలా పొందుకున్న తర్వాత యాకోబు 1:27 ప్రకారం ఇహలోక మాలిన్యం తమ ఘటములకు అంటకుండా తమ పరిశుద్దతను కాపాడుకోవాలి! నేను పరిశుద్ధుడను కనుక మీరునుపరిశుద్దులై ఉండండి అని దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించాలి తప్పకుండా!!! అలా పరిశుద్దతను అంతము వరకు కాపాడుకున్నవాడే పరిశుద్ధుడు!!

 

నాల్గవది: యేసుక్రీస్తుప్రభులవారే మనయొక్క విమోచనము!: యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయే ముందు ఒకమాట అన్నారు: మత్తయి 20:28 లో మనుష్యకుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి మరియు అనేకుల కొరకు విమోచనం అవ్వడానికి వచ్చాడు అని!

మత్తయి 20: 28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

ఆయన మనలను ఎలా విమోచించుకున్నారో మనకు మీదన వ్రాయబడిన ఎఫెసీ మొదటి అధ్యాయంలో వివరించబడింది! కాబట్టి విశ్వాసులకు ఈ విమోచనం జన్మతహా లేదు గాని వారు క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తములో కడుగబడ్డారు కాబట్టి ఆయనే మనకు విమోచనం అయ్యారు!

 

హెబ్రీ 9:11,15

11. అయితే క్రీస్తు రాబోవుచున్న (అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా, ....

15. ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు. ....

 

1తిమోతి 2:6

ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

 

లూకా 1:69

ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను

 

రోమా ౩:24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

కొలస్సీయులకు 1: 14

ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.

 

కాబట్టి ఇట్టి క్రీస్తుయేసు మనకు ఇన్నివిధాలుగా నీతియు సమాధానము జ్ఞానము విమోచనము పరిశుద్ధతయు అయి ఉన్నారు కాబట్టి మనము అతిశయ పడాలంటే ప్రభువునందే అతిశయించాలి!!

 

అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*23వ భాగము-సువార్త వాగ్ధాటి-1*

1కొరింథీ 2:13

1. సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను.

2. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.

3. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇంతవరకు మొదటి అధ్యాయము నుండి అనేకమైన ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాము! ఈ రెండవ అధ్యాయం కూడా మొదటి అధ్యాయానికి కొనసాగింపుగా రాస్తున్నారు! గత భాగాలలో పౌలుగారు నేను వాక్చాతుర్యం లేక మాటకారితనమును ఉపయోగించకుండా కేవలం సిలువ వేయబడిన క్రీస్తును మాత్రము నేను ప్రకటించాను! వాక్చాతుర్యంను ఉపయోగిస్తే దేవుని సిలువ యొక్క శక్తి ప్రజలకు సరిగా అర్ధం కాదు అని అభిప్రాయపడ్డారు! ఇప్పుడు దానినే కొనసాగిస్తున్నారు

 

  మొదటి వచనం చూసుకుంటే సహోదరులారా! నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో లేక మంచి మాటకారితనముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించలేదు గాని నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీమధ్య ఎరుగకుందునని నిశ్చయించు కున్నాను అంటున్నారు .

 

ఇక్కడ రెండో వచనంలో సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరొకదానిని ఎరుగకుండాలని నిర్ణయించుకున్నారు అనగా పౌలుగారికి మాటకారితనము లేక వాక్చాతుర్యం లేక రాక కాదు! గాని వాటివలన సిలువయొక్క శక్తి ప్రజలకు పూర్తిగా అర్ధం కాదు కాబట్టి వాక్చాతుర్యం గాని మనుష్యులు దేనిని జ్ఞానము అని అనుకుంటారో ఆ జ్ఞానము లేక కాదు! గమనించాలి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం ప్రకారం గతభాగాలలో చెప్పినట్లు పౌలుగారు కొరింథీ పట్టణానికి వచ్చేముందు ఏథెన్స్ పట్టణంలో పరిచర్య చేసి వచ్చారు! గ్రీకు పండితుల ముఖ్య కొలువు ఏథెన్స్! లోకంలో మేమే తెలివైన వారము అని వారి ఉద్దేశ్యం! అలాంటి జ్ఞానుల మధ్య పౌలుగారు వాక్యపరిచర్య మరియు సిలువను గూర్చిన వార్త ప్రకటించి వచ్చారు! (అపో 17:15; 18:1). ఆ గ్రీకు పండితులు, గ్రీసు దేశస్తులలో చాలామంది సిలువసువార్తను అంగీకరించలేదు అనుకోండి గాని అక్కడ ప్రకటించాలి అంటే గొప్ప జ్ఞానము అవుసరం! అయినా అక్కడ సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు సిలువవైపుకే నడిపించగలిగారు! ఇక్కడ పౌలుగారి ముఖ్య ఉద్దేశం అనగా ఇలా వాక్చాతుర్యం లేకుండా జ్ఞానాతిశయము లేకుండా ప్రకటించాను అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే *సువార్త లేక సిలువను గూర్చిన వార్త అనేది కల్తీ లేకుండా ప్రకటించాలి*!!!

 

విచారమేమిటంటే నేటి రోజులలో సువార్త మరియు వాక్య పరిచర్య ఎన్నో కల్తీలు కలిగి ఉంటుంది! పౌలుగారు సిలువను గూర్చిన వార్తను మాత్రమే చెబుతాను లేక సిలువవేయబడిన యేసుక్రీస్తును మాత్రమే చెబుతాను అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటే నేడు పరిచర్యలలో లేక వాక్య ప్రసంగాలలో మధ్యలో సైన్సు చెప్పేవారు ఒకరు, వారి చాతుర్యం చూపించడానికి వివిధమైన భాషలు మధ్యలో మాట్లాడుతూ తనకు అనేకరకాలైన భాషలు వచ్చినట్లు చెబుతూ నేను  జ్ఞానిని నాకు ఇన్ని భాషలు వచ్చు అని అందరూ తెలిసికోవాలనే తపన కొందరికి! క్రీస్తుయేసు ప్రభులవారు గాని, అపోస్తలులు గాని సరియైన బట్టలులేకుండా దీనులై జీవిస్తూ జీవపు ఢంభాన్ని చూపించకుండా సువార్తను ప్రకటిస్తే నేటి భోధకులు ఖరీదైన సూట్లు భూట్లు వేసుకుని నన్ను చూడు నా షూట్ చూడు అన్నట్లు తమ దర్పాన్ని చూపిస్తున్నారు సిలువ వేయబడిన క్రీస్తు కనబడటం లేదు! స్త్రీ సేవకులైతే ఖరీదైన చీరలు బట్టలు, ఫుల్ గా మేకప్ వేసుకుని వారి అందచందాలు దర్పాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు! ఇంకా మరికొంతమంది ప్రసంగాల మధ్యలో పిట్టకధలు అనేకం చెబుతున్నారు!కామెడీ సర్కస్ అయిపోయాయి ప్రసంగపీటాలు!! బైబిల్ చెబుతుంది ఉపమానం లేకుండా యేసుక్రీస్తు ఏమీ చెప్పలేదు అని, ఉపమానాలు కావాలి- అవి పరలోక రాజ్యమునకు సంభందించినవి అయి ఉండాలి! ఇంకా 5వ వచనం ప్రకారం దేవునిశక్తిని కలిగి ఉండాలి! వాటినే యేసయ్య ఉపయోగించారు!గాని పిట్టకధలు చెప్పి నవ్వించలేదు!! ఈ రోజుల్లో కామెడీ జోకులు పిట్టకధలు ఎక్కువ- ప్రసంగం తక్కువ అయిపోతుంది! కొలస్సీ సంఘములో కూడా కొంతమంది వచ్చి మీరు పరలోకం చేరాలంటే మారుమనస్సు బాప్తిస్మం ఇవన్నీ కావాలి మంచిది వాటితో పాటుగా మీరు తత్వ శాస్త్రం, వేదాంత శాస్త్రము కూడా నేర్చుకోవాలి అప్పుడే మీకు దేవుడు అనేవాడు బాగా అర్ధమవుతాడు! అప్పుడు మీరు పరలోకం వెళ్ళగలరు అని చెబితే చదువురాని విశ్వాసులు బెంబేలేత్తుపోయారు మాకు చదువే రాదు, తత్వశాస్త్రము వేదాంతము ఎలా నేర్చుకోవాలని! ఇలా వారిమీద అజమాయిషీ చేయాలని వారిద్వారా తమ పొట్ట పోషించుకోవాలని అక్కడ తప్పుడుభోధకుల పన్నాగం! పౌలుగారు దీనిని చీల్చి చెండాడారు!!

 

ఇప్పుడు పిట్టకధలు లేక ఉపమానాలు విషయానికి వస్తే అవి ఉండాలి గాని ఒకటి లేక రెండు ఉండాలి అవి కూడా పరలోకానికి చేరడానికి పాపి రక్షించబడటానికి సహాయపడేవిగా ఉండాలి గాని మనిషి విరగబడి నవ్వేలా అన్యుల జబర్ధస్ట్ షోకి తగ్గకుండా కామెడీ చేయడానికి కానేకాదు! పౌలుగారు వీటిని ఉపయోగించ లేదు! అపోస్తలులు గాని వారి శిష్యులు గాని ఎవరూ ఉపయోగించలేదు!!  నేటి భోధకులు తమ జ్ఞానాన్ని తమ వాక్చాతుర్యం ప్రదర్శించడానికి ఇలాంటివి ఉపయోగిస్తూ సిలువ యొక్క శక్తిని తగ్గించేస్తున్నారు! ఆత్మల రక్షణ వెనుకబడి- ప్రసంగీకుల జ్ఞానము వాక్చాతుర్యం మాత్రమే కనిపిస్తుంది!

 

ప్రియ దైవజనుడా! కాపరీ! ప్రసంగీకుడా! దయచేసి నీ సైన్సు, నీ పిట్టకధలు కామెడీ జోకులు ప్రజలను మెప్పించగలవు గాని దేవుని మెప్పించలేవు ఇంకా పాపిని ఏ మాత్రము రక్షించలేవు అని తెలుసుకుని, నీ భోధ సిలువ వేయబడిన ఏసుక్రీస్తుని గూర్చినది మరియు అపోస్తలుల బోధ కలిగి ఉండాలని తెలుసుకోమని యేసయ్య పేరిట బ్రతిమిలాడుతున్నాను!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*24వ భాగము-సువార్త వాగ్ధాటి-2*

 

1కొరింథీ 2:35

3. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.

4. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొనియుండవలెనని,

5. నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! పౌలుగారు వాక్చాతుర్యం ఉపయోగించకుండా నేను మీకు భోధించాను అని చెబుతూ వాక్చాతుర్యం వలన సిలువశక్తి తగ్గిపోతుంది అని రాస్తున్న విషయాన్ని ధ్యానం చేస్తున్నాము!

 

          (గతభాగం తరువాయి)

 

ఇక మూడవ వచనంలో మరియు బలహీనత తోనూ భయముతోను ఎంతో వణకుతోనూ మీ యొద్ద ఉన్నాను అంటున్నారు! ఇక్కడ మరియు అనే మాట ఉపయోగిస్తున్నారు అంటే మొదటి రెండు వచనాలు దీనితో కలుపుకోవాలి అని అర్ధం! అనగా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యం గాని జ్ఞానాతిశయమును గాని ఉపయోగించలేదు గాని, (ఇప్పుడు మూడో వచనం) ఎంతో శరీర దౌర్భల్యముతోనూ ఎంతో వణకుతోనూ భయముతోను మీ మధ్య ఉన్నాను అంటున్నారు! ఈ వచనంలో తెలుగులో బలహీనతతోను అని తర్జుమా చేయబడినా ప్రాచీన ప్రతులలో: మరియు నేను మీ మధ్య శరీర దౌర్భల్యము తోనూ భయముతోను ఎంతో వణకుతోనూ ఉన్నాను అని తర్జుమా చేయబడింది!

 

ఇక్కడ మొదటగా శరీర దౌర్భల్యంతోను అంటే మనకు 2కొరింథీలో చెబుతున్నారు నాకున్న ప్రత్యక్షతలు అనేకమై ఉన్నాయి కాబట్టి నేను అతిశయించకుండా ఉండాలని దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టారు అని! అదే బహుశా ఈశరీర దౌర్భల్యం!

2కొరింథీ 12:710

 

7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.

8. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము (లేక, నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

 

ఇక భయముతోను వణకుతోనూ అని ఎందుకు అన్నారంటే: మనుష్యులు ఏమి చేస్తారో అన్న భయము పౌలుగారికి ఎంతమాత్రము లేదు, అయితే అతని భయము లేక దేనికోసం భయపడుతున్నారు అంటే ఏథెన్స్ పట్టణంలో జ్ఞానులు అని చెప్పబడిన వారు సిలువను సిలువసువార్తను పెడచెవిని పెట్టి పౌలుగారిని వెఱ్రివాడు అని ముద్రవేసి వదిలేశారు! సిలువ వారికి అర్ధం కాలేదు! అయితే ఇక్కడ అక్కడ ఉపయోగించినట్లు జ్ఞానము గాని మరో విధమైన మాటకారితనం వాక్చాతుర్యం ఉపయోగిస్తే ఈ కొరింథీ వారు కూడా వాక్యానికి పెడచెవిని పెడతారేమో అని, తద్వారా తను భోధించిన సిలువ సువార్త వారిలో వ్యర్ధమై పోతుందని భయముతోను దేవుడంటే వణకుతోనూ వారి మధ్య సువార్త పరిచర్య చేశాను అంటున్నారు!

 

 ఇక్కడ పౌలుగారి ఉద్దేశ్యం సువార్త ప్రకటించేవాడు వాక్య పరిచర్య చేసే వాడు ఎవడైనా గాని తన ఆత్మ నిబ్బరం, సొంత తెలివితేటలూ జ్ఞానము వాక్చాతుర్యం ఉపయోగిస్తే ఆత్మలు రక్షించబడవు, అలా నిర్లక్షంగా ఉండటం కంటే తాము చేస్తున్న పరిచర్య ఎక్కడ నిష్ఫలం అయిపోతుందేమోనని ఎంతో భయుతోను వణకుతోనూ ఉండటం మేలు అని అభిప్రాయపడుతున్నారు!!

మరో విషయంలోనూ పౌలుగారు భయపడ్డారు!

1కోరింథీయులకు 9: 27

గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

ఇక 4,5 వ వచనాలలో మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక దేవుని శక్తిని ఆధారము చేసికొని ఉండాలని నేను మాట్లాడినా సువార్త ప్రకటించినా జ్ఞానయుక్తమైన తియ్యటి మాటలను వినియోగించక పరిశుద్దాత్మయు దేవునిశక్తియు కనపరచు దృష్టాంతములానే వినియోగించితిని అంటున్నారు!

గమినించారా మన విశ్వాసము మనుష్యుల జ్ఞానాన్ని ఆధారము చేసికొన్నది అయి ఉండకూడదు గాని దేవుని శక్తిని ఆధారం చేసుకొన్నది అయి ఉండాలని హితవు చెబుతున్నారు పౌలుగారు! అందుకే నేను కూడా మాట్లాడినా సువార్త ప్రకటించినా జ్ఞానయుక్తమైన తియ్యటి మాటలు ఉపయోగించ లేదు గాని పరిశుద్దాత్మ తోనూ దేవుని శక్తి కనపరచు దృష్టాంతాలు అనగా ఉపమానాలు ఉపయోగించాను అంటున్నారు! పౌలుగారు కూడా ఉపమానాలు ఉపయోగించారు గాని పిట్టకధలు తన జ్ఞానాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ఏదో సైన్సు వేదాంతం తత్వశాస్త్రం ఏమీ ఉపయోగించలేదు అంటున్నారు! కేవలం ఆ ఉపమానాలు కూడా పరిశుద్ధాత్మ శక్తిని దేవుని శక్తిని బయలుపరిచేవే ! గమనించాలి మనుష్యులను మెప్పించాలి అనుకుంటే పౌలుగారు ఏ విధముగా నైన మనుష్యులను మెప్పించగలరు! గాని అలాంటి మాటలు వర్తమానాలు ఏ సంఘానికి చెప్పలేదు! ఖండించి గద్దించి బుద్ధి చెప్పే ప్రసంగాలు చెప్పారు- పత్రికలు రాశారు! అయితే అలాంటి ప్రసంగాలు తనకు వచ్చా అంటే చూడండి అపో 17:2231 లో ఏథెన్స్ ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి జ్ఞానయుక్తమైన తియ్యటి మాటలను వేదాంత, తత్వానికి చెందిన మాటలను ఉపయోగించారో ! గాని అవి లేక ఆ ప్రసంగం ఏథెన్స్ ప్రజలను రక్షించలేకపోయింది అని పౌలుగారు గుర్తెరిగారు! అయితే పౌలుగారు అర్ధం చేసుకున్నది ఏమిటంటే (ఇది అందరూ అనగా సువార్త ప్రకటించేవారు మరియు వాక్య పరిచర్య చేసేవారు గ్రహించాలి) : *సువార్త ప్రకటనలో గాని వాక్య పరిచర్యలో గాని అతి ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏమిటంటే*:

*మొదటిది:సరియైన సందేశం అందించాలి!* *రెండు: దానిని ప్రజల హృదయాలకు తాకి వారిని కదిలించాలి అంటే దేవుని శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి అవసరం!* ఈ రెండు కలిపి చెబితే అనేకులను మార్చుతుంది కదిలిస్తుంది పాపిని అని ఒప్పిస్తుంది ఆ సువార్త/ ప్రసంగం!!

 

గాని ఈరోజులలో విచారకరమైన విషయం ఏమిటంటే చాలామంది దైవజనులలో సరియైన సందేశం ఉంది, బోధించే మాటకారితనము ఉంది ప్రజలను ఆకట్టుకునే వ్యవహార భోధనాశైలి కూడా ఉంది వారి సొంతమాటలతో నచ్చచెప్పి ప్రజలను దేవునిలోనికి నడిపించాలి అని చూస్తున్నారు  గాని దేవుని రాజ్యములోని వారిని నడిపించటానికి అవసరమైన దేవుని శక్తి అనగా పరిశుద్ధాత్మ శక్తి లోపించి అనేకులను నడిపించలేక పోతున్నారు! 

 

ఒకసారి యేసుక్రీస్తుప్రభులవారు పునరుత్తానుడైన తరువాత ఏమన్నారు- వెంటనే మీరు వెళ్లి సువార్త ప్రకటించండి అనలేదు మీరు పైనుండి శక్తిని పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నారు!

 

లూకా 24: 49

ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.

 

అపో 1:8 లో అంటున్నారు ఆ పైనుండి శక్తిని పొందుకున్నాక మీరు యూదయ సమరయ ఇంకా భూలోకమంతా నాకు సాక్షులై ఉంటారు!

అపో.కార్యములు 1: 8

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

 

 ఈ బేసిక్ విషయం చాలామంది దైవసేవకులకు ప్రసంగీకులకు అర్ధం కాలేదు! ఈ లాజిక్ మిస్ అయిపోయారు కాబట్టి మంచి వక్తలు అని పేరు తెచ్చుకున్నా ఫలవంతమైన పరిచర్య చేయలేకపోతున్నారు!!

 

గమనించాలి మనిషిని మార్చగలిగేది పాప విముక్తులనుగా చేసేది ఇంకా విశ్వాసంలో స్థిరపడేటట్లు చేసేది ప్రసంగీకుని వాక్చాతుర్యం గాని, అతని జ్ఞానము గాని కానేకాదు! అది మొదటగా దేవుని యందలి అచంచల విశ్వాసం మరియు దేవుని పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే!!

 

పరిశుద్ధాత్మ శక్తి మూలంగానే నిజమైన నమ్మకం విశ్వాసుల లేక మనుషుల హృదయాలలో కల్గుతుంది! వారి నమ్మకం లేక విశ్వాసం ప్రసంగీకుని జ్ఞానం మీద గాని, లేక అతని వాగ్ధాటి మీద గాని లేక అతని నమ్మించే వాదనలు లాజిక్ ల మీద ఆధారపడితే అది పైపై నమ్మకమే, ఉత్తుత్తి విశ్వాసమే గాని పాపిని పాపవిముక్తిని చేసేటటువంటిది కాదు! అవి ఎట్టి పరిస్తితులలో కూడా నూతన జీవానికి నూతన జన్మకు ఈ ప్రసంగాలు ఆధారం కావు! దేవుని దైవసేవకులు ఎల్లప్పుడూ సిలువవేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాలి గాని యేసయ్య చేసిన అద్భుతాలు మీద కాదు! ఆయన చేసిన అద్భుతాలు కోసం చెప్పవచ్చు గాని ముఖ్యమైన భావము తప్పకుండా సిలువ వేయబడిన యేసు పునరుత్తానుడైన యేసు అయి ఉండాలి! వాటికి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావములు ఆధారం చేసుకుని ఉండాలి అలాగే ప్రకటించాలి! అప్పుడు ఆత్మల పంట విరివిగా పండుతుంది!  అది లేకపోతే నీకు కాసుల పంట పండినా గాని ఆత్మల పంట పండదు అని గ్రహించి మన భోదలు ప్రసంగాలు సువార్త పరిచర్యలు మన రాతలు సిలువ వేయబడిన యేసు మరియు పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకొనేలా ఉండేలా చూసుకుందాం!

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*25వ భాగము*

 

1కొరింథీ 2:610

6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక (మూలభాషలో- ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని

7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.

9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఈ రెండో అధ్యాయంలో ఇంకా ముందుకుపోతే 610 వచనాలలో మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి!

పరిపూర్ణులైనవారి మధ్య మనము జ్ఞానము బోధించుచున్నాము! అది ఈలోక జ్ఞానము కాదు నిరర్ధకులై పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కూడా కాదు గాని దేవుని యొక్క జ్ఞానమును మనము మరుగై ఉన్నట్లు బోధిస్తున్నాము! ఈ జ్ఞానము మరుగైయుండెను. అయితే దేవుడు జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు చేశాడు ఎవరికోసమంటే మన మహిమ నిమిత్తం అనగా విశ్వాసుల మహిమ నిమిత్తం!! అయితే ఈ విషయం ఈ లోకాధికారులకు మరియు జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారికి కూడా ఈ మర్మము తెలియదు! తెలిస్తే మహిమా స్వరూపియైన మన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారిని సిలువ వేసి ఉండకపోదురు అంటున్నారు!

 

   ఇక్కడ పౌలుగారు మనము ప్రకటించే సువార్త అది దేవుని జ్ఞానము అనియు, అది లోకాధికారులకు జ్ఞానులకు అర్ధం కాదు అనియు చెబుతున్నారు! జాగ్రత్తగా గమనిస్తే వారు వెఱ్రితనము అని చెప్పుకుంటున్న సువార్త సత్యము ఎంతో జ్ఞానమైనది అది మర్మమైనది అంటున్నారు పౌలుగారు! మనుష్యులు జ్ఞానము అని చెప్పుకుంటున్న జ్ఞానము అది భౌతికమైనది! అయితే వారు వెఱ్రితనము అని చెబుతున్న మన సువార్త సత్యము యొక్క జ్ఞానము అది ఆధ్యాత్మిక మైనది! అందుకే అది వారికి అర్ధం కావడం లేదు! ఇంకా అది ఈలోకానికి చెందినది కాదు మరియు ఈ లోకాధికారులకు చెందిన జ్ఞానము కాదు గాని దేవుని రహస్య సత్యము లేక మరుగైన మర్మము లేక మరుగై ఉన్న జ్ఞానము , అది విశ్వాసుల కోసం దేవుడు ఈ భూలోకాన్ని చేయకముందే మనయొక్క ఘనత కోసం దేవుడు నిర్ణయించారు అని చెబుతున్నారు!

 

ఇక్కడ పౌలుగారి ఉద్దేశం ఏమిటంటే జ్ఞానము విషయంలో క్రీస్తుయేసు విశ్వాసమునకు చెందిన విశ్వాసులు ఎవరూ ఈలోకంలో జ్ఞానులు అని చెప్పుకుంటున్న ఈలోక జ్ఞానుల కంటే అల్పులు కానేకారు అని చెప్పాలని వాగ్దానాలతో ఋజువుచేస్తున్నారు! ఎవరైనా విశ్వాసులు ఈలోక జ్ఞానుల కంటే తక్కువ జ్ఞానము గలవారు అని పిలువబడటం పౌలుగారికి అసలు ఇష్టం లేదు! ఎందుకంటే విశ్వాసులకు దేవుని యొక్క మరుగైయున్న జ్ఞానము లేక రహస్య సత్యము అందుబాటులో ఉంది! అందుకే కొరింథీ 1:31 లో ఈయనే మనకు దేవుని ద్వారా జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను అని చెబుతున్నారు...

1కోరింథీయులకు 1: 31

అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

ఇంకా కొలస్సీ 2:2౩ లో బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని కూడా చెబుతున్నారు!

2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

 

అయితే దురదృష్టవశాత్తూ ఈ విషయము అనగా ఈ మరుగైయున్న జ్ఞానము విషయము ఈలోకములో ఉన్న జ్ఞానులకు ఘనులకు అధికారులకు తెలియలేదు! ఒకవేళ తెలిసి ఉంటే మన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేసి ఉండకపోదురు అని అభిప్రాయపడుతున్నారు పౌలుగారు!

 

ముందుకు వెళ్లేముందు బైబిల్ గ్రంధంలో ఈ జ్ఞానము కోసం ఏమని చెప్పబడిందో ఒకసారి చూసుకుందాం!

కీర్తన 51:6

నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

 

కీర్తనలు 90: 12

మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

 

కీర్తనలు 111: 10

యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.

 

సామెతలు 1:7, 20

7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

 

సామెతలు 2:16

1. నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

2. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

3. తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల

4. వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

5. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

 

సామెతలు 3: 13

జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.

 

సామెతలు 8:136

 

సామెతలు 9: 10

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.

 

ఎఫెసీ 1:17 --19

17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

యాకోబు 1:5

మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

 

గమనించాలి: దేవుడు ప్రపంచాన్ని సృష్టించక ముందే తన ప్రజలను ముందుగా ఎరిగి ఏర్పరచుకున్నారు

 

రోమా 8:29౩౦

29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

 

    ఇలా ఎన్నుకున్న ఏర్పరచుకున్న వారికి జ్ఞానము అని పిలువబడే జ్ఞానముకంటే అత్యున్నతమైన జ్ఞానం వారికి అనగా విశ్వాసులకు కలగాలని దేవుడు నియమించారు 7వ వచనం ప్రకారం! అయితే ఆ జ్ఞానము- దేవుని గూర్చిన జ్ఞానము మరియు క్రీస్తును గూర్చిన జ్ఞానము! సిలువవేయబడిన క్రీస్తుని గూర్చిన జ్ఞానము!!  ఈ జ్ఞానమే ఈ లోకాధికారులకు తెలియదు వారు అర్ధం చేసుకోలేదు! లోకాదికారులే కాదు- ఇశ్రాయేలు ప్రజలకు- ఆలయపెద్దలకు, శాస్త్రులకు పరిసయ్యులకు సన్హెడ్రిన్ సభలో ఉన్న వారికి ఎవరికీ తెలియలేదు! అర్ధం కాలేదు! అందుకే వారు యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేశారు! తెలిసియుంటే వారు యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేసి ఉండకపోదురు అంటున్నారు పౌలుగారు!

 

ఇటువంటి అత్యున్నతమైన జ్ఞానము పొందుకున్న ఓ విశ్వాసి! నీ రక్షణ నీ పిలుపు నీ ఏర్పాటు ఎంత ఉన్నతమైనదో ఎంతో అమోఘమైనదో గమనించావా!!! ఈలోకంలో గొప్పవారికి ధనవంతులకు బలవంతులకు జ్ఞానవంతులకు విధ్యాదికులకు ఈ నిజమైన వార్త అర్ధం కాలేదు! దేవుడు వారిని ఎన్నుకోలేదు! గాని ఎందుకు కొరగాని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుని పిలుచుకుని ఏర్పరచుకుని తన రక్తంలో కడిగి పవిత్రునిగా చేసి తన కుమారులనుగా చేసుకొన్నారు కదా మరి ఆయన పిల్లలకు తగినట్లుగా ఆయన జ్ఞానమునకు తగినట్లుగా జీవిస్తున్నావా లేదా ప్రియ విశ్వాసి?!!!

 

ఒకసారి నిన్నునీవు సరిచూసుకుని సరిచేసుకోమని యేసయ్య పేరిట ప్రేమపూర్వకముగా మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*26వ భాగము*

1కొరింథీ 2:610

6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక (మూలభాషలో- ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని

7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.

9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము దేవుడు మనకు ఎలాంటి జ్ఞానము అనుగ్రహించారో ధ్యానము చేసుకుంటున్నాము! అది ఈలోక జ్ఞానుల కంటే మిన్నైన జ్ఞానము అనియు, అది లోకాధికారులకు లేదు అనియు, అది మరుగైయున్న జ్ఞానము అనియు, అది భౌతికమైనది కాదు అది ఆధ్యాత్మిక మైనది అనియు, అది ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందే తన విశ్వాసుల కోసం దేవుడు నియమించారు అనియు, ఈ విషయం తెలిసి ఉంటే లోకాధికారులు యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేసి ఉండకపోదురు అనియు ధ్యానం చేసుకున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 910 వచనాలలో చెబుతున్నారు: ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడింది అంటున్నారు! జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఆ జ్ఞానము అనగా మరుగైయున్న జ్ఞానము  మనకు ఇచ్చారు, ఇంకా బోలెడు మనకోసం అనగా తన్ను ప్రేమించు వారికోసం దేవుడు సిద్దపరచిన అమోఘమైన విషయాలు వస్తువులు కార్యములు సిద్ధపరిచారు అయితే అవి మానవుల కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మానవుల హృదయాలకు గోచరం కావు అనగా అర్ధం కావు అంటున్నారు పౌలుగారు! అవును కదా ఈ జ్ఞానమే ఇంతటి అమోఘమైనదైతే ఆయన సిద్దపరచినవి మరెంతటి అమోఘమైనవి మహిమగలవి ఘనమైనవి!!

దేవుని జ్ఞానము దేవుని ప్రేమ మనకు అర్ధం కాదు!

 

అందుకే సోదెగాడు మొట్టమొదట అన్యజనులలో నుండి ఏర్పరచబడిన దేవుని ప్రవక్త బిలాముగారు అంటున్నారు: ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు.......

సంఖ్యాకాండము 24:17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరిని నాశనము చేయును.

 

ఆయనను అనగా దేవుని జ్ఞానమైన, మరుగైయున్న క్రీసును, క్రీస్తుయేసు సిలువ సత్యాన్ని జ్ఞానమును చూసి పరవశించిపోయి ప్రవచిస్తున్నాడు ఆయన!

 

అలాగే కీర్తనాకారుడు ఆయన ప్రేమను ఆయన జ్ఞానమును ఆయన సృష్టిని చూసి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపడుతూ 139 వ కీర్తన రాశారు!  ఇట్టి తెలివి నాకు మించినది అది నాకు అందదు నాకు అగోచరము అంటున్నాడు కీర్తనాకారుడు , ఇంకా నన్ను కలుగజేసిన విధానం చూస్తే నాకు భయమును వణకును  ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటున్నారు.....116

1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.

6. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.

7. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?

8. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12. చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు

16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

ఇంతటి గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు ప్రేమగల దేవుడు మనుష్యులను ప్రేమించారు! అందుకే తానుండే స్థలములో మనలను లేక విశ్వాసులను కూడా ఉండాలి అని ఆశించే భూలోకమును అందముగా చేసుకున్నారు! గాని సాతాను ప్రోద్భలముతో మానవుడు పడిపోగా అప్పుడు తానుండే పరలోకములో మనము ఉండేలాగా ఆయన సొంతకుమారుని బలిగా చేసి, రక్షణ ప్రణాళిక ఏర్పాటుచేసి మనలను తనకోసం పిలచుకున్నారు! ఇక ఆ పరలోకంలో రాబోయే విశ్వాసుల యొక్క స్వాస్త్యము భాగ్యము ఎలాంటిదో మనకు ప్రకటన గ్రంధంలో ఎంతో వివరంగా వ్రాయబడింది...

దేవుడు మనకొరకు సిద్దపరచినవి ఏమిటో అవి కన్నులకు కనబడవు, చెవులకు వినబడవు హృదయాలకు గోచరం కావు!

 

యెషయా 64: 4

తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

 

అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు, ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించు చున్నాడు అని పరిశుద్దాత్ముని కోసం చెబుతున్నారు పౌలుగారు! ఇక్కడ పౌలుగారు చెబుతున్న ఈ జ్ఞానం మనిషి తెలివితేటల వలన గాని వేదాంత శాస్త్రము వలన గాని తర్కశాస్త్రము వలన గాని మనుషులకు దొరకదు అర్ధం కాదు! మతాలు తరచినా, వ్రతాలు కొలిచినా, నిగూఢవాదాన్ని వెదకినా, క్షుద్రశక్తులను నేర్చినా ఈ జ్ఞానము దొరకదు! కేవలం దేవుని ఆత్మవలన మాత్రమే ఇది దొరుకుతుంది! దీనిని పొందేటందుకు మరో మార్గం లేనేలేదు! యొహాను 16:1315 దీనికోసం వ్రాయబడింది!

13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

15. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

 

అయితే ఆయన ఆత్మను పొందగలిగే ఏకైక మార్గము క్రీస్తుయేసు నందు విశ్వాసముంచి నమ్మి భాప్తిస్మం పొందటమే! అప్పుడే మనకు పరిశుద్దాత్ముడు లభిస్తాడు! ఆ పరిశుదాత్మను పొందుకున్న తర్వాతనే మనకు దేవుడు మనకోసం సిద్దపరచిన మేలులు పొందుకోగలము కారణం పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోకములో చేరగలరు పరలోక విషయాలలో పాలుపొందగలరు!!!

 

ఆయన మనకోసం సిద్దపరచిన తేజోవాసుల స్వాస్త్యములో, గొర్రెపిల్ల పెండ్లివిందులో పాలుపొందుకుని, తండ్రియైన దేవునితోను మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారితో సహవాసం చేస్తాము, వారితో పాటుగా పాతనిబంధన పరిశుద్ధులు క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనగా నోవాహు గారు, హనోకుగారు అబ్రాహాము గారు దావీదు గారు ఏలీయా గారు ఎలీషా గారు యెషయా గారి లాంటి పాత నిబంధన పరిశుద్దులే కాదు పేతురు గారితో పౌలుగారితో యోహాను గారితో చాటింగ్ చేస్తాము ప్రత్యక్షంగా! ఇంకా మన మరణించిన  ప్రియులను ఆత్మీయులను  గొప్పగొప్ప దైవసేవకులను కలుసుకోగలము! ఇంకా దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు తినగలము, రెండో మరణం మనలను ఏమీ చెయ్యదు, మరుగై ఉన్న మన్నా తింటాము, తెల్లని రాయి దానిమీద చెక్కబడిన దేవుడు మనకిచ్చే పేరు, ఇంకా వెయ్యేండ్ల పాలనలో ప్రజలమీద అధికారము, దేవుడు నిన్ను కమీషనర్ గానో, పెద్ద అధికారి గానో జిల్లాకు కలెక్టర్ గానో చేస్తారు, వేకువచుక్కను పొందుకుంటావు, ఇంకా దేవుడు ఇచ్చే తెల్లని వస్త్రాలు పొందుకుంటావు, జీవ గ్రంధములో నుండి నీ పేరు ఎంతమాత్రం తుడచివేయబడదు, ఇంకా దేవుని ఆలయములో ఒకస్తంభముగా చేస్తారు నిన్ను, దేవుని పేరు నీ మీద వ్రాయబడుతుంది చివరిగా  యేసుక్రీస్తు ప్రభువుల వారితో   పాటుగా ఆయనతో కూడా ఆయన ప్రక్క కూర్చునే అవకాశం పొందుకుంటావు! ఇంతటి అమూల్యమైన అమోఘమైన విషయాలు దేవుడు మనకోసం దాచి ఉంచారు అక్కడ ఆకలిదప్పులు కష్టాలు ఉండవు రోగాలు ఉండవు ఎల్లప్పుడూ స్తుతుల రాగాలు మాత్రమే ఉంటాయి!!

 

మరివాటిని పొందుకోవడానికి నీవు సిద్దంగా ఉన్నావా? సిద్దపడి ఉన్నావా? లేకపోతే నేడే మారుమనస్సు పొంది పశ్చాత్తాప పడి దేవునితో సమాధాన పడి ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన రాకడకు సిద్దపడు!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*27వ భాగము*

 

1కొరింథీ 2:1013

10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.

12. దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.

13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! రక్షించబడిన విశ్వాసి ఎటువంటి జ్ఞానం పొందుకున్నాడో చూసుకుంటూ ఆ జ్ఞానము మరుగైనదనియు ఆధ్యాత్మికమైనదనియు చూసుకుంటూ దానిని మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఆ మరుగైన జ్ఞానమును అర్ధము చేసుకోగలము అని చూసుకున్నాము!

 

ఇంకా ముందుకుపోయే ముందు ఈ మొదటి రెండు అధ్యాయాలలో పౌలుగారు ఒక విషయాన్ని ఆత్మద్వారా చెబుతున్నారు: ఈ లోక జ్ఞానము వేరు, పరలోక జ్ఞానము వేరు! పరలోక ఆధ్యాత్మిక జ్ఞానము కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనకు దొరుకుతుంది! అయితే  ఆ జ్ఞానము మరెవరో కాదు యేసుక్రీస్తుప్రభులవారే!!  యోహాను పత్రిక ప్రకారం మనకు యేసుక్రీస్తుప్రభులవారే వాక్యము! ఆయనే వాక్యమై యున్న దేవుడు! కుమారుడై యున్న దేవుడు అని మనకు అర్ధమైతే ఈ కొరింథీ మొదటి పత్రిక రెండు అధ్యాయాల ద్వారా మనకు అనాదినుండి మరుగైయున్న జ్ఞానముగా యేసుక్రీస్తు ప్రభులవారు మనకు కనిపిస్తారు!

 

  ఇక 10వ వచనంలో ఈ జ్ఞానము దేవుడు మనకు తన ఆత్మవలన బయలుపరిచారు! ఆ పరిశుద్ధాత్మ అన్నింటిని అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అంటున్నారు! దీనికోసం మరింతగా చూసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములను ఎలా పరిశోధించగలుగుతున్నాడు అంటే:

 మొదటగా ఆయన అనగా పరిశుద్ధాత్ముడు- దేవుడు! త్రిత్వములో ఒక వ్యక్తిత్వము! తనకుతానుగా శక్తి ప్రభావాలు గలవాడు! ఆయనకు కూడా జ్ఞానముంది!! 

 

రెండవది: యోహాను 16:1315 ప్రకారం యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పారు- నేను వెళ్ళిపోయాక మీ వద్దకు సత్యస్వరూపియగు ఆత్మను ఆదరణ కర్తను పంపుతాను అతడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటూ తనంతట తానూ ఏమీ చెప్పడు గాని నా వాటిని తీసుకుని మీకు చెబుతాడు అంతేకాకుండా తండ్రియైన దేవుని దగ్గర విని ఆయన చెప్పినవి కూడా మీకు చెబుతాడు ఇంకా జరుగబోయేవి మీకు ముందుగానే చెబుతాడు అని చెప్పారు!!!..

John(యోహాను సువార్త) 16:13,14,15

 

13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

15. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

 

అనగా ఇప్పుడు పరిశుద్దాత్మునికి శక్తి బల ప్రభావాలు ఉన్నాగాని తండ్రితోను కుమారునితోను సంభాషించి మనకు వారి హృదయాన్ని అర్ధం చేసుకుని మనకు వివరిస్తాడు పరిశుద్దాత్ముడు!!! ఇంకా మనకు దేవుణ్ణి ఎలా అడగాలో మనకు తెలియదు కాబట్టి మన బలహీనతల యందు మనకు సహాయం చేసి ఎలా ప్రార్ధనచేయాలో మనకు నేర్పిస్తాడు!...

రోమీయులకు 8: 26

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 

ఈ రకంగా ఆ మరుగైయున్న జ్ఞానమును తండ్రియైన దేవుడు మనకోసం సిద్దపరచిన స్వాస్థ్యమును పొందుకోడానికి అన్నివిధాల సహకరిస్తాడు పరిశుద్దాత్ముడు!!!

 

ఇక 11వ వచనంలో ఒక మనుష్యుని సంగతులు మనిషికి లేక మనుష్యాత్మకు ఎలా తెలుసో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు అంటూ వివరిస్తున్నారు! పరిశుద్దాత్మ దేవుడు ఒక ఉద్రేకం, ఒక పూనకం కానేకాదు! ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను నడిపిస్తూ అన్నివేళలా అన్నివిధాలా నీకు సహకరించే వాడు! కాబట్టి నీకు ఏమి కావాలో దేవుని సంగతులు తీసుకుని వాటిని నీకు విశిధపరచి నిన్ను గమ్యమునకు నడిపిస్తాడు! 

అంతేకాదు అలా తండ్రివిషయాలు కుమారుని విషయాలు తీసుకుని బలమైన కార్యాలు మనుష్యుల ద్వారా చేయిస్తాడు!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:7,8,9,10,11

 

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

మనుష్యుల సంగతులు మనిషికే అర్ధమవుతాయి! అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్ధమవుతాయి! అందుకే దేవుడు మనిషికి తనరాజ్యములో చేర్చడానికి అలా చేరాలంటే ఎలాంటి జీవితం జీవించాలో ఏవి పొందుకోవాలో అర్ధం కావడానికి మనిషికోసం తన ఆత్మను భూలోకమునకు పంపించారు! ఆ పరిశుద్దాత్మను పొందుకుంటే దేవుని సంగతులను నీవు అర్ధం చేసుకోగలవు!!! ఇంకా చెప్పాలంటే మనిషి కోసం మనిషికే తెలుస్తుంది కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు ఆత్మస్వరూపిగా ఈ భూలోకమునకు రాలేదు, ఇంకా మరో రూపంలో అనగా సింహముగానో ఏనుగు గానో మరో విధంగా రాలేదు గాని మనిషిని అర్ధం చేసుకోవడానికి మనుష్యులు తనను అర్ధం చేసుకోవాలంటే మనిషిగా పుట్టాలని మనిషిగా ఈ భూలోకమునకు వచ్చి మనిషిలా బ్రతికి మనలాగే కష్టసుఖాలు అనారోగ్యాలు ఆకలిదప్పులు శ్రమలు నిందలు భాధలు అన్నీ అనుభవించారు! అందుకే కేవలం యేసుక్రీస్తుప్రభులవారే మనిషిని అర్ధం చేసుకోగలరు! ఆయన దైవమానవుడు! అనగా దేవుడు మరియు మనిషి! ఇప్పుడు మనిషి దేవుని విషయాలు ఎలా పొందుకోగలడు? ఎలా అర్ధం చేసుకోగలడు అనగా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే! ఆ ఆత్మను పొందుకోవడం వలన మాత్రమే! అందుకే పరిశుద్ధాత్మను ప్రతీ ఒక్కరు పొందుకోవాలి!!! ఆయానాత్మలేనివాడు ఆయనవాడు కాదు అని చెబుతున్నాడు భక్తుడు ఆత్మావేశుడై!!!...

రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

ఇదే 12వ వచనంలో చెబుతున్నారు: దేవునివలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకిక ఆత్మను అనగా ఈ భూలోకంలో ఉన్న ఆత్మను పొందుకోలేదు గాని దేవుని యొద్దనుండి వచ్చిన ఆత్మను పొందుకున్నాము!!! హల్లెలూయ!!!

 

ఇక 13వ వచనం థియాలజీకి ఆయువుపట్టు!! దేవుని లేఖనాలు ఎలా అర్ధం చేసుకోవాలి అనేది ఈ వచనం ద్వారానే మనకు అర్ధమవుతుంది! ఇక్కడ అంటున్నారు: దేవుని మాటలను బాగా అర్ధం చేసుకోవాలంటే మనుష్య జ్ఞానంతో కాకుండా- ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి! ఆత్మ నేర్పు మాటలతో చెప్పాలి! ఇది లేఖనాలను అర్ధం చేసుకోవడానికి ఎలా సహకరిస్తుంది అని మీకు అనుమానం వస్తే: బైబిల్ లో ఏదైనా ఒక వచనం లేక లేఖనం ఉంటే దానికి సపోర్టింగ్ లేఖనం లేక వచనం మరో దగ్గర ఉంటుంది! అప్పుడు ఆ రెండు లేక మూడు లేఖనాలు కలిపి చదువుకుని అర్ధం చేసుకోవాలి! అలా కలుపగా వచ్చినదే సరియైన అర్ధం!! అందుకే యెషయా గ్రంధంలో ఆయన వర్తమానం కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ వస్తుంది అని వ్రాయబడింది....

Isaiah(యెషయా గ్రంథము) 28:10,11,12,13

10.ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

 

 ఆ అచ్చట ఇచ్చట కలుపుకుని చదువుకుంటేనే మనకు ముచ్చటగా అర్ధం అవుతుంది తప్ప అలా కలుపుకుని చదవకపోతే అర్ధమే మారిపోతుంది!!! ఇదీ వాక్యాన్ని అర్ధం చేసుకునే విధానం! పరలోక సంగతులు పొందుకునే విధానం! పరలోక సంగతులు వాక్యాధారాముగా అర్ధం చేసుకొనే విధానం! ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మసంబంధమైన విషయాలతో పోల్చుకుని అర్ధం చేసుకోవాలి! ఆత్మను పొందుకోవాలి!!

 

ప్రియ స్నేహితుడా! చదువరీ! నీవు ఆ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నావా??? పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడ్ని ప్రతీరోజూ అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావా? లేక నీ పాప కార్యాల వలన ఆ ఆత్మను పోగొట్టుకున్నావా? దావీదు గారు వ్యభిచారం చేసి, హత్య జరిగించి పరిశుద్దాత్మను సన్నిధిని కోల్పోతే పశ్చాత్తాప పడి పడక కొట్టుకుపోయేటంతగా ఏడ్చి విలపించి మరలా పొందుకొన్నారు! అందుకే దేవునికి ఇష్టానుసారుడైన మనిషి అని పించుకున్నారు! మరి నీవు మరల పొందుకుంటావా? ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు! ఆయన వాడు కాకపొతే నీవు సాతానుగాడి పార్టీ! నరకానికి పోయే బ్యాచ్ అని మరచిపోవద్దు! అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయని మర్చిపోవద్దు!

 

నేడే ఆయన ఆత్మను పొందుకుందాం!

పరలోక సంబంధమైన జ్ఞానము విషయాలు పొందుకుందాము !

 

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*28వ భాగము*

 

1కొరింథీ 2:1316

13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

15. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

గతభాగంలో పరలోక సంబంధమైన విషయాలు లేక ఆత్మసంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకోవడం వలన అర్ధమవుతాయి అంటూ చూసుకున్నాము!

 

13వ వచనం ద్వారా పౌలుగారు ప్రతీ దైవజనునికి చెప్పకనే చెబుతున్నారు:  భోదించేవాడు ఎవరైనా సరే- అవి ఆత్మ సంబంధమైనవి అని తెలుసుకుని ఆత్మ నేర్పించే మాటలతోనే బోధించాలి గాని మీ సొంత జ్ఞానముతో గాని మీ సొంత వివరాలతో గాని సైన్సు లేక వేదాంతము లేక తర్కము కలుపుకుని బోధించడమువలన అవి మనుష్యులకు పూర్తిగా అర్ధం కావు!! ఈ విషయం తప్పకుండా ప్రతీ సేవకుడు దైవజనుడు భోధకుడు అర్ధం చేసుకోవాలి!!!

 

ఇక 14వ వచనంలో ప్రకృతి సంభందమైన మనిషి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు అర్ధం చేసుకోలేడు, అంగీకరించడు ఎందుకంటే అవి అతనికి వెఱ్రితనముగా ఉంటాయి! అలాంటివి ఆత్మానుభవముచేతనే వివేచించబడతాయి! గనుక ప్రకృతి సంబంధమైన మనిషి దీనిని అర్ధం చేసుకోలేడు అంటున్నారు పౌలుగారు! అవును కదా- ప్రకృతి సంబంధమైన మనిషి బౌతికమైన జ్ఞానం కలిగి ఉంటాడు గాని దేవుని గూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు దేవుని ఆత్మ వానిలో లేదు కాబట్టి ఆ ఆధ్యాత్మిక సంగతులు అర్ధం చెసుకోలేదు!

1:18, 24

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

 

 అందుకే రోమా 8:58 లో అంటున్నారు....

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

ఇక ప్రకృతి సంబంధమైన స్వభావం లేక శరీర స్వభావం కోసం ఆలోచిస్తే

 (7:5; గలతీ 5:17).

పౌలు ఇక్కడ రెండు రకాల వ్యక్తులను వర్ణిస్తున్నారు. ఈ భూమిపై ఉన్న వారంతా ఈ రెండు గుంపులకే చెందుతారు. ఒక రకంవారు ఒక విధంగా ఆలోచిస్తారు. రెండో రకం వారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అవిశ్వాసుల మనస్సుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నిటినీ ప్రవేశపెడుతుంది. వారు వాటివెంట వెళ్తారు. దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సు ల్లోకి తెస్తాడు. ఆయన వారికోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే వారు వాటివెంట వెళ్తారు.

గలతియులకు 5: 17

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

 

 ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది అందువల్ల దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలను దేవుని ఆత్మవలన ఎదిరించగలము!  2 కొరింతు 10:5

మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి

 

ఫిలిప్పీ 4:8

మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

 

కొలస్సీయులకు 3: 16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

 

ఇవి ఆత్మను పొందుకున్నవాడు ఆలోచించే ఆత్మ సంబంధమైన విషయాలు!!

 

 శరీర స్వభావానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనుషులకు పాపభరితమైనవిగా అనిపించకపోవచ్చు. అవి మత సంబంధమైన, బుద్ధిసంబంధమైన విషయాలు కూడా అయి ఉండవచ్చు. అయితే అవి దేవునికి సంబంధించినవి కావు! ఉదాహరణకు పేతురు గారు ఆలోచించినట్లు మత్తయి 16:23

అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను.

 

 భూసంబంధమైన వాటికోసం ఆలోచించే వారికి:

ఫిలిప్పీయులకు 3: 19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

 

గానీ పరలోక సంబంధమైనవి కావు !

దేవుని ఆత్మలేని మనుషులకు అవి సహజంగా సబబైనవిగా అనిపిస్తాయి.

అందుకే పౌలుగారు అంటున్నారు

కొలస్సీయులకు 3: 2

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

 

 క్రీస్తులో లేని ప్రతి వ్యక్తి సహజ మనస్సు తనకేవి ప్రియంగా సంతోషకరంగా అనిపిస్తాయో వాటిమీదే ఉంటుంది. అయితే అవి ఏకైక నిజ దేవునితో ఎలాంటి సంబంధమూ లేనివి, ఆయనకు వ్యతిరేకమైనవి. అలాంటి మనిషి తాను దేవుని పక్షానే ఉన్నానని తలంచవచ్చు. ఆయనను ప్రేమిస్తున్నానని కూడా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం భ్రమ. పాపాత్ముడి మనసు తనకు తాను ఎన్నడూ మారదు, దేవునికి లోబడదు. అలాంటిది దానికి అసాధ్యం. ఒక మనిషి దేవునికి లోబడడం ఆరంభించాలంటే మౌలికమైన గొప్ప మార్పు అవసరం. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవాన్నిచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి. ఇది జరగకుండా ఎవరూ దేవునికి ఆనందం కలిగించేవాడుగా ఉండలేడు. ఒక వ్యక్తి చాలా మత నిష్ఠగలవాడై ఉండవచ్చు. చాలా నీతిగలవాడై, బాగా చదువుకున్నవాడై, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుని ఆత్మ లేకుండా చేస్తే ఇదంతా పాపమే, మరణమే. దేవునికి ఇలాంటిది ఎన్నటికీ అంగీకారం కానేరదు. యోహాను 3:3-8

John(యోహాను సువార్త) 3:3,4,5,6,7,8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

 ఒక మనిషిలోని భ్రష్ట స్వభావం మతం, నైతిక వర్తన అనే ముసుగులో ఉన్నంత మాత్రాన అది దేవునికి ఇష్టమౌతుందని మనం అనుకోకూడదు. దేవుడు మతం పొరలు తొలగించి హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చూస్తారు! పాపులైన మనుషుల మత సంబంధమైన ఆలోచనలూ అనుభూతులూ అతనిలోని ఇతర విషయాలన్నిటి లాగే పాపంతో కూడినవని ఆయనకు తెలుసు. అందుకే శరీర సంబంధి ఆత్మ సంబంధమైన విషయాలు అర్ధం చేసుకోలేడు!

 

కాబట్టి ఇప్పుడు మనమైతే దేవుని సత్యాన్ని అర్ధం చేసుకుని అంగీకరించాలంటే దేవుని ఆత్మ మాత్రమే మనకు బోధించాలి!! అందుకే పౌలుగారు ఎఫెసీ సంఘం కోసం ఇలా ప్రార్ధిస్తున్నారు 1:1519

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును(అనేక ప్రాచీన ప్రతులలో- ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

ఇక 15వ వచనంలో ఆత్మ సంబంధమైన మనిషి అన్నింటినీ వివేచిస్తాడు గాని అతడు మరొకరి చేత వివేచించబడడు అంటున్నారు  ఎందుకంటే ఆధ్యాత్మిక వ్యక్తి అన్నింటినీ సరిగా పరిశీలిస్తాడు! అద్ది మంచిదా చెడ్డదా దేవునికి మహిమ తెస్తుందా లేక అవమానం తెస్తుందా, ఈ పని ద్వారా ఆత్మ ఫలభరితముగా అవుతుందా లేక అంతరంగపురుషుడు దీనిద్వారా కృంగి కృశించిపోతాడా? ఈ బోధ ఆత్మలను రక్షిస్తుందా లేక నవ్విస్తుందా !! ఇది ఆత్మసంబంధమైన వ్యక్తి ఆలోచించి వివేచించేది!! అందుకే 1యోహాను పత్రికలో భక్తుడు అంటున్నారు 2:20,27

20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు భోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).

 

దేవుని ఆత్మ మూలంగా ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారిన క్రీస్తు విశ్వాసులు మాత్రమే లోక విషయాలను, మనుషుల నిజ స్థితిని గుర్తించ గలుగుతారు. ఆత్మలేని వారు అలా అర్థం చేసుకోలేరు గనుక అలాంటి విషయాల్లో సరైన అభిప్రాయానికి రాలేరు. సరైన నిర్ణయానికి రాగలగడం ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఇది సహజంగా ఎవరికీ ఉండదు.

 

ఇక చివరి వచనం: ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు అనగా దేవునికి బోధించ గలవాడు ఎవడు?

యెషయా 40: 13

యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

 

మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము! మనకు క్రీస్తుయేసు మనస్సు ఉంది అంటున్నారు! క్రీస్తుమనస్సు ఎలా ఉంది అంటే ఆయనాత్మ వలన మనము క్రీస్తుయేసు మనస్సును అర్ధం చేసుకోగలము! క్రీస్తు మనస్సు కలిగి ఉండుట లేక అర్ధం చేసుకోవడం అనగా దేవునికి ఇష్టమైనవి చేయడం ఆయనకు ఇష్టం లేనివి మానెయ్యడం! దేవుని ఆత్మ ఏ విషయంలో ఆయాసపడతాడో ఆ క్రియలంటే అసహ్యించుకోవడమే క్రీస్తు మనస్సుని కలిగి ఉండటం!

 

ఒక ఉదాహరణ చెప్పనీయండి: ఎలియాజర్ కుమారుడు ఫీనేహాసు ఆయన మోషే గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో బిలాము బోధవలన మోసపోయి వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఓర్వలేక తెగులు పంపించారు! అప్పుడు ఫీనేహాసు ఏమి చేశాడు అంటే ఒక గోత్రపు పెద్ద యొక్క కొడుకు మోయాబు దేశంలో ప్రధాని కూతురితో పాపం చేస్తుంటే ఇద్దరినీ ఒకే బల్లెముతో పొడిస్తే అది ఇద్దరు కడుపులు చీల్చుకుని పోయింది! తెగులు ఆగిపోయింది! అప్పుడు దేవుడు  ఏమన్నారు: నేను ఓర్వలేనిదానిని ఫీనేహాసు ఓర్వలేకపోయాడు కాబట్టి అతనితో నేను నిబంధన చేస్తున్నాను అన్నారు! ఇదే దేవునిమనస్సుని అర్ధం చేసుకోవడం!!! క్రీస్తు మనస్సుని కలిగి ఉండటం!!! (సంఖ్యా 25)

 

పై సత్యాలకు ఆధారంగా దీనిని రాశారు పౌలుగారు. సహజసిద్ధమైన మనుషులు (దేవుని ఆత్మ లేనివారు) దేవుని మనసును గ్రహించలేరు, కాబట్టి విశ్వాసుల మనసులను కూడా గ్రహించలేరు. ఇది ఎందుకంటే విశ్వాసులు ఈ లోకానికి చెందిన మనుషుల వలె ఆలోచించడం మానుకున్నారు. క్రీస్తు ద్వారా దేవుని మనసు కొంత వరకు వారికి ఉంది. అంటే క్రీస్తుకూ దేవునికీ తెలిసినవన్నీ విశ్వాసులకు తెలుసని కాదు. క్రీస్తు వారిలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ వారికి ఉన్నాడు కాబట్టి వారు దేవుని సత్యం మూలాధారం దగ్గరే ఉన్నారనీ, ఆ సత్యంలో ఏ భాగమైనా వారు అర్థం చేసుకునేలా ఆయన చేయగలడని దీని అర్థం. ఇది క్రీస్తు అపొస్తలులు సేవకుల విషయంలో, గొప్ప జ్ఞానం ఉన్న క్రైస్తవ నాయకులకు మాత్రమేనా? కాదు. ఆధ్యాత్మిక విశ్వాసులందరి విషయంలోనూ ఇది నిజమే (1:26-28). చదువు, గొప్ప మేధాశక్తి, మానవ జ్ఞానం మొదలైనవాటితో దీనికి పని లేదు. మనిషి ఆత్మకు దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడం అదే అత్యంత అవసరమైన సంగతి. ఈ చర్చ అంతటిలో దేవుని ఆత్మ మానవ ఆత్మకు వేరుగా ఉన్నాడనే తలంపు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూచినా దేవుని వాక్యమంతటిలోనూ కనిపించే ఉపదేశం ఇదే.

(యోహాను 14:17; రోమ్ 8:9, 16; గలతీ 3:2; ఎఫెసు 4:18; యూదా 19)

 

కాబట్టి ఈ సత్యాన్ని గ్రహిద్దాం!

దేవుని ఆత్మను కలిగి ఆయన మనస్సుని అర్ధం చేసుకుని ఆయనకు తగినట్లుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*29వ భాగము*

 

1కొరింథీ 3:14

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా?

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మూడవ అధ్యాయంలో మరలా ఈ పత్రికను రాసిన ఉద్దేశానికి వచ్చేస్తున్నారు! మొదటి అధ్యాయంలో కొద్దిగా చెప్పి మూడవ అధ్యాయంలో విభేదాలు కక్షలు గ్రూపులు కోసం వివరంగా రాస్తున్నారు! మరి మొదటి రెండు అధ్యాయాలలో మరుగైయున్న జ్ఞానము, అది పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడింది, ఆధ్యాత్మిక వ్యక్తులు శరీర సంబంధమైన వ్యక్తులు అనే విషయాలుకోసం  ఎందుకు చెప్పారు?

 

ఇప్పుడు మూడో అధ్యాయంలో మీరు గత రెండు అధ్యాయాలలో చెప్పిన సంగతులతో పోల్చుకుంటే మీరు శరీరసంబంధమైన వ్యక్తులుగానే కనిపిస్తున్నారు గాని మీలో ఎవరూ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కనబడటం లేదు అని చెప్పడానికి ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా ఉంటారు, శరీర స్వభావులు ఎలా ఉంటారో చెప్పారు! ఇప్పుడు వీరిలో కలహాలు విభేదాలు కక్షలు కనిపిస్తున్నాయి కనుక ఆ లక్షణాల ద్వారా మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు అని చెబుతున్నారు!

 

ఈ అధ్యాయం మొదలు పెట్టేముందుగా ఒక విషయం మరోసారి మీకు గుర్తుకు చేయాలని అనుకుంటున్నాను! ఆదాము గారి కాలమునుండి సాతాను గాడు సంఘాన్ని పాడుచెయ్యాలి, తాను పరలోకం నుండి త్రోయబడ్డాడు కాబట్టి దేవుడు ఎంతో ఇష్టపడి మనిషిని చేసుకున్నాడు కాబట్టి ఆ మనిషి దేవుణ్ణి చేరకుండా ఉండాలని పరలోకం చేరకుండా ఉండాలని అప్పటినుండి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు! దేవుడు తన ప్రవక్తల ద్వారా మరొకరి ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు! యేసయ్య పుట్టకుండా చూడాలని చూశాడు! గర్భములోనే చంపుదాము అనుకున్నాడు- చేయలేకపోయాడు! పుట్టాక బలియాగం చెయ్యకుండా చెయ్యాలని చూశాడు, ఆపలేకపోయాడు! ఇలా కాదని దేవాలయ పెద్దలలోను పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను పడ్డాడు, సాధించలేకపోయాడు! మరణం ద్వారా ఆపాలని చూశాడు, యేసుక్రీస్తుప్రభులవారు మరణాన్ని జయించి లేచారు! ఇక యేసయ్య ఆరోహణమైపోయారు శిష్యులను చంపితే ఇంకా సంఘాన్ని హింసిస్తే సువార్తసత్యము ఆగిపోతుంది అని చూశాడు! ఎంతగా హింసిస్తే అంతగా విస్తరించింది! రాజులలోను అధికారులలోను పడ్డాడు గాని ఆపలేకపోయారు! ఇక క్రుద్రవిధ్యలు మంత్రాలు తో ఆపాలని చూశాడు చాలా దేశాలలో, గాని ఆపలేకపోయాడు! ఓడిపోయాడు! చివరికి దేవుని బిడ్డలను దేవుని బిడ్డలతోనే వారి విశ్వాసాన్ని బ్రష్టులుగా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ ఎన్నోసార్లు విజయం సాధిస్తున్నాడు!! అప్పటినుండి ఇప్పటివరకు! జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలకు శరీరాస, నేత్రాస జీవపు డంభము చూపి, శరీరకార్యాలతో విశ్వాసులను దైవసేవకులను మోసగించడం వలన  మోసగించబడిన వారి శాతం తక్కువ! అయితే మన క్రైస్తవ్యంలో శాఖాబేధాలు చూపి పడగొట్టిన వారి సంఖ్య చాలాచాలా ఎక్కువ! మనలో మనకే పడకుండా చేస్తున్నాడు వాడు! క్రైస్తవుల మధ్యలో బేధాలు సృష్టిస్తూ మీరు పెంతుకోస్తు వారు మీరు బాప్తిష్టు వారు, మీరు మరో వారు మరో వారు అంటూ క్రైస్తవుల మధ్యలో బేధాలు పెట్టి మత బ్రష్టులుగాను వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా చేస్తున్నాడు! మరికొందరిని లేపి అబద్ధబోధలు చేస్తూ సంఘాలను పాడు చేస్తున్నాడు! యెహోవాసాక్షులు అంటూ, మోర్మోన్స్ అంటూ, జాంగిల్ జా అంటూ, అంత్యకాల ప్రవక్త బ్రెన్హాం గారిని ప్రవక్తగా అంగీకరించాలి అంటూ ఇలా ఎన్నెన్నో అబద్దబోధలతో తప్పుడుబోధలతో సంఘాలను పాడుచేస్తూ సాతానుగాడు విజయం సాధిస్తూ వికట్టాట్టహాసం చేస్తున్నాడు! అది అప్పటినుండే అనగా క్రీ.శ 51 నుండే మొదలయ్యింది! ఇంకా కొనసాగుతుంది! ప్రియ దైవజనమా! ఈ విషయాన్ని గ్రహించి ఇలాంటి బేధములనుండి దూరంగా పొమ్మని మనవిచేస్తున్నాను!!!

 

  ఇక మొదటి వచనం చూసుకుంటే సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పోతున్నాను! మీరు శరీర సంబంధులే అనియు, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది అంటున్నారు! అప్పటిలో మీకు అనగా మీరు బాప్తిస్మం తీసుకున్న మొదట్లో మీకు బలము చాలకపోయినందు వలన నేను మిమ్ములను క్రీస్తులో పాలతో పెంచాను గాని మీకు అన్నాన్ని పెట్టలేదు! అనగా మీరు ఇంకా చంటిబిడ్డలే గాని మీరు ఎదిగి అన్నం తినే వయస్సు మీకు క్రీస్తులో రాలేదు అని పౌలుగారు అభిప్రాయపడుతున్నారు!

ఎందువలనా? మీరింకను శరీర సంబంధులై ఉండుటవలన!  మీరు ఇప్పుడు కూడా బలహీనులై ఉన్నారు కదా అంటున్నారు! మూడో వచనంలో మీలో మీకు ఇంకా అసూయలు కలహాలు ఉంటే మీరు శరీర సంభందులే, శరీర సంబంధంగానే నడుచుకుంటున్నారు కదా అని వాపోతున్నారు!!

 

గమనించాలి మొదటి రెండు అధ్యాయాలలో శరీర సంబంధులు ఆత్మ సంబంధులు వారి లక్షణాలు చెప్పారు! ఆత్మానుసారమైన వ్యక్తులు లేక ఆత్మసంబంధులు లేక ఆధ్యాత్మికవ్యక్తులు పరిశుద్దాత్మ వలన నడిపించబడతారు వారిలో దేవునియొక్క మరుగైయున్న జ్ఞానము పనిచేస్తుంది అని చెప్పి- ఇప్పుడైతే మీలో శరీర సంబంధమైన కార్యాలు పనిచేస్తున్నాయి కాబట్టి మీరు శరీరానుసారులు మరియు క్రీస్తులో ఇంకా చంటి బిడ్డలవలె ఉన్నారు అంటున్నారు! మొదటి అధ్యాయం మొదట్లో మీరు ఏ కృపావరములోను లోపం లేకుండా క్రీస్తుయేసు ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తున్న ఆధ్యాత్మిక పరిపక్వత గల సంఘము అని చెప్పి ఇప్పుడేమిటి శరీర సంబంధులు అంటున్నారు పౌలుగారు! అవునండీ! వీరిలో అనేకులు బైబిల్ లో చెప్పబడిన అన్ని కృపావరాలు పొందుకుని ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినవారే గానీ పౌలుగారు వెళ్ళిపోయాక అపొల్లోగారు పరిచర్యచేసి వెళ్ళిపోయాక క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి! మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ సంఘాన్ని చీల్చేసాయి ఫేవరిటిజం పేరుతో! నేను పౌలువాడను, నేను పేతురు వాడను నేను అపోల్లో వాడను మరొకడు నేను వారెవరివాడను కాదు నేను క్రీస్తువాడను అంటూ! సంఘములో బేదములు అసూయలు, గొప్ప - పేద అనే తారతమ్యము, ధనికులు-  పేదలు అనే తారతమ్యములు వచ్చేశాయి! వాటిని తీసుకుని వచ్చింది సైతానుగాడు! గాని వీరికి ఆ విషయం తెలియలేదు!  కొరింథీ సంఘము పతనావస్తకు వచ్చేసింది! అందుకే కొరడా తీసుకుని ఈ లేఖ వ్రాయాల్సి వచ్చింది!

 

ఇక్కడ పౌలుగారు మూడు రకాలైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్నారు!

మొదటిది: ఆధ్యాత్మిక వ్యక్తులు లేక ఆత్మసంబంధులు: వీరు దేవుని ఆత్మ కలిగి అత్మానుసారంగా నడచుకునే వారు! గమనించాలి- దేవుని ఆత్మలేని మనుషులతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఆధ్యాత్మిక మనుష్యులే లేక ఆత్మ సంబంధులే! అయితే విశ్వాసులలో చాలామంది మరింత ఆత్మానుసారంగా నడుచుకుని ఆత్మసంబంధమైన వ్యక్తులుగా మారుతున్నారు!

 

ప్రకృతి సంబంధులు: దేవుని ఆత్మలేని వారు, క్రీస్తును అంగీకరించని వారు!

 

శరీర సంబంధులు: దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తే గాని ఆత్మానుసారంగా నడుచుకోకుండా ఆత్మలేని ప్రకృతి సంబంధమైన వ్యక్తులు వలే ప్రవర్తించేవాడు!!!

 

మరి మనం ఈ బేధాలు ఎలా కనుగొనగలము అంటే 1కొరింథీ 2:1416

14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

15. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

 

రోమా 8:59

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

కాబట్టి ఇప్పుడు విశ్వాసులైన వారు దురదృష్టవశాత్తూ చాలామంది తమ పాత బ్రష్ట స్వభావాన్ని అనుసరించి నడచుకుంటూ లోకానుసారులైన ప్రజలవలె ప్రవర్తిస్తూ ఉన్నారు! వీరు కొరింథీ సంఘములోనూ ఉన్నారు నేటి రోజులలో ప్రతీ సంఘములోనూ ఉన్నారు! అది ఏ డినామినేషన్ అయినా ప్రతీ సంఘములోనూ ఈ బ్యాచ్ ఉంది! ఈ బ్యాచ్ నే మీరు ఇంకా చంటి పిల్లలవలె ప్రవర్తిస్తున్నారు అందుకే మీలో ఇకడు నేను పౌలువాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను అనగా నేను పేతురు వాడను నేను క్రీస్తు వాడను అని కలహాలు పెట్టుకుని చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు అంటున్నారు పౌలుగారు!

హెబ్రీ 5:1114

11. ఇందునుగూర్చి (లేక, ఇతనిగూర్చి) మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.

12. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.

13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.

14. వయస్సు వచ్చిన వారు (లేక, పరిపూర్ణులు) అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.

 

వారు శరీర సంబంధులు అని చెప్పడానికి వారు చేస్తున్న లేక విశ్వాసుల మధ్యలో ఉన్న కక్షలు విబేదాలే కారణం! కారణం ఈ విభేదాలు గాని కలహాలు గాని పరిశుద్దాత్మ వలన రానేరావు!! అవి మానవుల యొక్క బ్రష్ట స్వభావం వలన వస్తాయి!

గలతీ పత్రికలో దీనికోసం చెప్పారు  5:1926

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

24. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

25. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

 

యాకోబు ౩:1418

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

 

దేవుని బిడ్డలు లేక క్రైస్తవులు సాధారణ మనుష్యులు లేక ప్రకృతి సంబంధమైన మనుష్యుల వలే ప్రవర్తించకూడదు! వారు దేవునిచేత ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడిన వారు కనుక మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందారు కనుక ఈ తరమువారు ప్రవర్తించినట్లు వారు ప్రవర్తించ కూడదు! ఆత్మానుసారంగా నడుచుకోవాలి! ఆత్మ నడిపించినట్లు నడవాలి గాని శరీరకార్యాలు ఏమాత్రం వారిలో పనిచెయ్యకూడదు!!!

 

  దీనిని చదువుతున్న ప్రియ దేవుని బిడ్డా! ఒకవేళ నీలో ఇలాంటి స్వభావం ఉందా? నీవు పౌలుగారు చూపించిన ఆ మూడు గుంపులలో ఏ గుంపులో ఉన్నావు?? ఆత్మానుసారంగా నడచుకోడానికే దేవుడు నిన్ను పిలిచారు! ప్రకృతి సంబంధుల వలే శరీర సంబందులవలె లోకానుసారంగా నడచుకోడానికి కానేకాదు!

 

 కాబట్టి ఒకసారి నిన్నునీవు సరిచూసుకుని పరిశీలించుకుని ఆత్మానుసారమైన జీవితం జీవించమని శరీరానుసారమైన పనులు అలవాట్లు వదిలెయ్యమని క్రీస్తుయేసు పేరిట మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*30వ భాగము*

 

1కొరింథీ 3:49

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక 4వ వచనం నుండి విభేదాల కోసం మరింత వివరంగా రాస్తున్నారు!

 గతభాగాలలో దీనికోసం చూసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

 

ఒకడు నేను పౌలువాడను మరియొకడు నేను అపోల్లోవాడను అని చెప్పుకుంటే మీరు ప్రకృతి సంబంధులు కారా? అని ప్రశ్నించి 5వ వచనంలో అంటున్నారుఅపోల్లో ఎవడు? పౌలెవడు ? ఇద్దరూ పరిచారకులే కదా! ఒక్కక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారిద్వారా మీరు దేవుణ్ణి విశ్వసించారు, నేను నాటితిని అపోల్లో నీళ్ళు పోశారు, అయితే వృద్దిచేసినవాడు దేవుడే కదా! అందువలన వృద్ధిచేసిన దేవునిలోనే ఉంది గాని నాటిన నాలోగాని నీరు పోసిన అపోల్లోలోను ఏమీ లేదు! నాటువాడు అనగా విత్తనాలు నాటిన పౌలనే నేను గాని, నీరు పోసిన అపోల్లో గాని ఇద్దరమూ జీతం కోసం పనిచేశాము అంటూ 9వ వచనంలో మేము దేవుని తోటలో జతపనివారము!

మీరు దేవుని వ్యవసాయము,

రెండవది దేవుని గృహము!!!

 

  గమనించాలి క్రీ.శ. 51 లోనే కాదు నేటికీ కూడా సంఘాలు ఇలా వర్గాల ద్వారా తమశాఖల ద్వారా సంఘాల యొక్క డినామినేషన్ ల ద్వారా సంస్థల ద్వారా చీలికలైపోయారు! తమయొక్క సంఘపు పేరు వలన గర్విస్తున్నారు ఒక్కక్కరు!!! గర్వము మాట ప్రక్కనపెడితే వీరంటే వారికి పడదు! వారంటే వీరికి పడదు! వీరు వారిని చూస్తే ఏదో పురుగును, వ్యభిచారిని చూసినట్లు ముఖం ప్రక్కకు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు! ఇద్దరూ సేవించేది ఆ యేసుక్రీస్తుప్రభులవారినే! ఇద్దరినీ రక్షించింది, కడుగబడింది యేసురక్తం లోనే! మరి వీరికి ఏవిధమైన కక్షలు ఉన్నాయా అంటే లేవు! ఆస్తి తగాదాలు గాని అన్నదమ్ముల పోరు గాని,  స్త్రీల కోసం కొట్లాడుకుంటున్నారా లేనేలేదు! గాని వీరు దేవునిలో సహోదరి/సహోదరులే గాని వీరువీరు మాట్లాడుకోరు! ఎందుకంటే వీరిలో దేవుని ప్రేమ లేదు! వీరు విశ్వాసులే గాని పరిశుద్దాత్మునిచేత నడిపించబడక తమ శరీరానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టే వీరిలో శాఖా బేధాలు వర్గ బేధాలు పేద-ధనిక తారతమ్యాలు, సంఘములో కులవర్గాలు!! జాగ్రత్త వీరంతా నరకంలోనికి పోతారు! వీరిలో పరిశుద్దాత్ముడు పనిచెయ్యడం లేదు! పరిశుద్దాత్మను మేము నమ్ముతాము, బాషలతోనే జీవిస్తాము అని చెప్పుకుంటున్న మా పెంతుకోస్తు విశ్వాసులు పాదిర్లు కూడా బాప్తిష్టు వారిని చూస్తూ మరొకరిని చూస్తూ RCM వారిని చూస్తూ అయ్యో వీరికి పరిశుద్దాత్మ లేడు, వీరు లోక సంబంధులు అంటూ చెప్పుకుంటూ వారితో ప్రేమగా మాట్లాడకుండా వారిని చీదరించుకుంటున్నారు చాలామంది! ఇలాంటివారు కూడా పరలోకం వెళ్ళరు! వాడు పెంతుకోస్తు వాడైనా గొంతుకోసు వాడైనా, బాప్తిష్టు అయినా పాపిష్టు అయినా దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే ప్రేమ చూపించక పోతే నరకానికి పోతాడు! అందుకే కదా యోహాను గారు అంటున్నారు: నీకు కనిపించే నీ సహోదరున్ని నీవు ప్రేమించలేక పోతే నీకు కనబడని దేవుణ్ణి నీవు ఎలా ప్రేమించగలవు? నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీవు అబద్ధాలు చెబుతున్నావు అంటున్నారు!

1యోహాను 4: 20

ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)

1యోహాను 4: 21

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

 

కాబట్టి ఈ చిన్నపిల్లలవలే వర్గ భేదాల తోను కులవర్గాలతోను శాఖా భేదాలను విసర్జించి దేవుడు అనుగ్రహించిన సహోదర ప్రేమ కలిగి ముందుకు పోదాం!

 

   ఇక్కడ పౌలుగారు తననుతాను తగ్గించుకుని పౌలు ఎవడు అపోల్లో ఎవడు అంటున్నారు!! ప్రభువే ప్రాముఖ్యం గాని ఆయన పరిచారకులమైన మాలో ఏమీలేదు! కష్టపడింది మాలో ఉండి నడిపించిన దేవుని కృప మాత్రమే! మాకు దేవుడిచ్చిన కృపావరము కొలదీ మేము కష్టపడ్డాము! నేను విత్తనాలు నాటాను అపోల్లో నీరు పోశాడు అంటున్నారు! కాబట్టి విశ్వాసులారా! మీరు గ్రహించవలసినది ఏమిటంటే దైవసేవకులంతా దేవుని తోటలో జతపనివారు! వారు చేసిన సేవా ఫలము ఒకరోజు వారు పొందుకుంటారు అనగా సేవకు కూలి వారు పొందుకుంటారు! సేవకులంతా దేవునితోటలో పనివారు! దేవుని తోట మీరే! అనగా సంఘమే!! 

 

కాబట్టి విశ్వాసులారా! మీ సేవకున్ని గౌరవించండి గాని ఉన్నదానికంటే గొప్పచేసి పూజించకండి! వారికి దేవుని స్థానాన్ని ఇవ్వకండి! ఇంకా సేవకులు -సేవకుల మధ్య అభిమాన సంఘాలుగా ఏర్పడి కొట్టుకోకండి! మా అయ్యగారు గొప్ప మీ అయ్యగారికి ఏమీ లేదు అంటూ చెప్పకండి!  మీ అయ్యగార్లు ఇద్దరు దేవుని తోటలో పనివారు! మీ దైవసేవకులు మీ యొక్క పనివారు! దేవుడు మీకోసం పరిచర్య చేయడానికి దేవునిచేత పంపబడిన పనివారు మీ దైవసేవకులు! వారిని గౌరవించండి గాని వారిని పూజించవద్దు వారికోసం మీరు తగవులాడుకోవద్దు!!!

దేవుడు మాత్రమే సత్యానికి ఆధ్యాత్మిక జీవానికి ఆశీర్వాదాలకు మూలకేంద్రం!!! పౌలుగారు గాని అపోల్లో గాని లేక నేటి సేవకులు గాని వారి గురి ఏమిటంటే విశ్వాసులను ఈలోకంలో  పాపములో పడిపోకుండా వారి ఆత్మీయ జీవితం వాడిపోకుండా వారి అంతరంగ పురుషుడు బలపడే ఆహారం వారికి ఇచ్చి పోషించి అబద్ద బోధలు సాతాను శోధనల వంటి చీడపురుగులు వస్తే వాటిని కత్తిరించి  సంఘమును కాపాడటం వారి పని!!!

 

   ఇక దైవసేవకులు కూడా పౌలుగారిలా సమస్త ఘనత దేవునికే ఆపాదించాలి గాని రెండు ప్రసంగాలు మూడు అద్భుతాలు జరిగితే తమనుతాము గొప్ప చేసుకోకూడదు! ఇంత గొప్ప ఘనమైన సేవచేసిన పౌలుగారు తననుతాను పొగుడుకోకుండా  అరే పౌలు ఎవడు వాడు, అపోల్లో ఎవరు అని తననుతాను తగ్గించుకుంటున్నారు, మేము దేవునితోటలో జతపనివారము అని వినయముగా తగ్గించుకుని దేవుడు మా యజమాని, నేను ఆయన యొక్క బానిసను అని ఎంతో వినయముతో చెప్పుకుంటున్నారు! దేవునికోసం గొప్పగా వాడబడిన దైవసేవకుడు గాని పాత నిబంధన భక్తులు గాని క్రొత్త నిబంధన భక్తులు గాని ఇలానే తమను తాము తగ్గించుకున్నారు! ఇక్కడ పౌలుగారు తగ్గించుకున్నారు! ఇక్కడే కాదు తన పత్రికలలో అనేకసార్లు పౌలుగారు తగ్గించుకున్నారు:

 

1కోరింథీయులకు 15: 9

ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

 

2కోరింథీయులకు 3: 5

మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

1తిమోతి 1:15

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

 

ఇక పౌలుగారే కాదు మోషేగారు తగ్గించుకున్నారు నిర్గమ ౩:11

అందుకు మోషే: నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా

 

న్యాయాధిపతులు 6: 15

అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

 

యిర్మియా 1:6

అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

 

నెహేమ్యా గారు దానియేలు గారు ఎజ్రా గారు తగ్గించుకున్నారు! అందుకే కదా దేవుడు వారిని అంతగొప్పగా వాడుకున్నారు! ఆ తగ్గింపే వారి ఘనమైన సేవకు మూల కారణం! మనుష్యుల యొక్క పొగడ్తలు,నిందలు గౌరవం తృణీకారం వీటిని దైవసేవకుడు ఎట్టిపరిస్తితులలోను పట్టించుకోకూడదు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు:

లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

అట్టివిధంగా దైవసేవకులను  విశ్వాసులైన వారిని దేవుడు నడిపించును గాక!!!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*31వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-1*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

వ్యవసాయం విషయంలో: నేను విత్తనాలు విత్తాను, అపోల్లో నీరు పోశాడు అన్నారు!

 

కట్టడం విషయంలో : దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలే పునాది వేశాను! మరియొకడు దానిని కట్టుచున్నాడు అంటున్నారు!!

 

అయితే ఈ రెంటి విషయములో కూడా అనగా దేవుని వ్యవసాయం విషయంలోను దేవుని గృహము విషయంలోనూ తనను తానూ తగ్గించుకుని దేవునికి ఘనత తెస్తున్నారు!

 

వ్యవసాయం విషయంలో: నాటిన నాలో ఏమీలేదు,  నీరు పోసిన అపోల్లోలో ఏమీలేదు గాని వృద్ధిచేసిన దేవునిలోనే ఉంది అంటున్నారు!

 

కట్టడం విషయంలో : ఈ పునాది క్రీస్తే అంటూ వేయబడిన పునాది తప్ప మరో పునాది వేయకూడదు, ఆ పునాది మీద ఎవడైనా వేర్వేరు పదార్ధాలతో అనగా వేరువేరు బోధలతో కడితే చివరకు అది అగ్నిచేత పరీక్షించబడుతుంది అనగా శ్రమలు శోధనల ద్వారా పరీక్సించబడుతుంది ఒకవేళ నీ పునాది నిలిస్తే నీవు కట్టిన దేవుని గృహము నిలిస్తే నీవు జీతం పుచ్చుకుంటావు, కాల్చివేయబడితే నీకు నష్టము కలుగుతుంది అన్నారు!

 

ఈ రెండింటి విషయం కొంచెము లోతుగా పరిశీలించడం మంచిది అని అభిప్రాయపడుతున్నాను!

వీటికోసం గతంలో చెప్పినా గత శీర్షికలలో సందర్భము కాబట్టి కొంచెం పరిశీలిద్దాం!

 

మొదటగా దేవుని తోట లేక వ్యవసాయం గూర్చి ఈరోజు ఆలోచన చేద్దాం!

9వ వచనంలో  మేము జతపనివారం, మీరు దేవుని పొలము మరియు దేవుని గృహము అంటున్నారు!

 

              *దేవుని పొలము*

దేవుని పొలము కోసం చూసుకుంటే మత్తయి సువార్తలో దేవుడు అనేక ఉపమానాలు చెప్పారు, దానిలో దేవుని పొలం కోసం ఉన్న  ఉపమానాలలో తలమానికమైనది 13:24౩౦

 

24. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

25. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.

26. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

27. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.

28. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

29. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

30. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

 

ఈ ఉపమానంలో ప్రభువు తానే ఈ ఉదాహరణను వివరించి చెప్పారు. పొలం అంటే ఈ లోకం పోకడలకు గుర్తుగా ఉంది. మరియు దేవుని సంఘమునకు గుర్తుగా ఉంది!  లోకం దేవునిది. ప్రపంచమంతటిలో  నలుమూలలా తన రాజ్య స్థాపన జరగాలని ఆయన ఉద్దేశం. విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో లాగా విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్కు కాదు గానీ దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలోకి జన్మించిన ఆయన సంతానం!!

 

John(యోహాను సువార్త) 1:12,13

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

John(యోహాను సువార్త) 3:3,5,6,7,8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా (లేక, పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

ప్రస్తుతం ఈ లోకంలో, సంఘంలో మంచి చెడులు కలిసి ఉన్నాయి. “కలుపు మొక్కలు లేదా గురుగులు” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి మొలకెత్తే దశలో సరిగ్గా గోధుమ పైరులాగానే కనిపించే ఒక విధమైన పిచ్చి మొక్క అని అర్థం !

అనగా తప్పుడుబోధలు!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:13,14,15

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.

ఇవి సైతాను సంతానానికి గుర్తు!

 

యోహాను 8: 44

మీరు మీ తండ్రియగు అపవాది ( అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి జనకుడునై) యున్నాడు.

 

1యోహాను 3: 8

అపవాది (సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

 

  దేవుని శత్రువు ఈ లోకంలో చెడ్డవిషయాలను అబద్దబోధలను  వెదజల్లి వెళ్లిపోయే సైతాను గాడు. స్థూలంగా చెప్పాలంటే ఈ భూమిపై రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారు దేవుని రాజ్యంలో ఉన్న ఆయన పిల్లలు, దానిలో లేనివారు.

 

అయితే ఇప్పుడు సంఘములో రెండు బోధలు ఉన్నాయి! నీవు సరియైన బోధను తీసుకుని పెరిగితే గోధుమ గింజవలె పెరిగి కోయబడి కొట్టులో వేయబడతావు! లోకపుటాసలు గల అబద్ద బోధలకు లొంగితే గురుగుల వలే పెరిగి చివర్లో కూర్చబడి అగ్నిలో వేయబడి కాలిపోతావు! కాబట్టి ఇప్పుడు దేనిని తీసుకుంటావో నీ ఇష్టం!

 

అయితే ఆ విత్తిన వారు దేవుని వాక్యమును విత్తుతున్నారా లేక మరొకటి విత్తుతున్నారా చూసుకుని వాక్యముతో పరిశీలించుకుని మంచివి తీసుకుని చెడ్డవి విసర్జించుకునే భాద్యత నీదే!!

 

కాబట్టి దేవుని తోటలో పెరుగుచున్న ఓ ఆత్మీయ మొక్కా! నేడే నిన్నునీవు పరిశీలించుకుని సరియైన వాక్యమును తీసుకుని ఎదిగి ఫలించి దేవుని తోట యజమాని చేతిలోనికి పొమ్మని మనవిచేస్తున్నాను!!

 

దైవాశీస్సులు!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*32వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-2*

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక దేవుని వ్యవసాయం లేక పొలము కోసం ఇంకా ధ్యానం చేస్తే పొలములో పంట బాగా పండాలంటే లేక చెట్లు బాగా ఫలించాలి అంటే వేరు బాగా నాటాలి! వేరు నాటబడాలి అంటే మొదట ఆ పొలాన్ని దున్ని రాళ్ళు ముళ్ళు తీసి పారవేయాలి! అప్పుడే ఆ పొలము బాగా ఫలిస్తుంది! పౌలుగారు కొలస్సీయులకు పత్రిక రాస్తూ మీరు క్రీస్తునందు వేరుపారిన వారై ఉండాలి అని చెబుతున్నారు!

 

   కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.

 

    ప్రియ దైవజనమా! ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి!

 

1) ఆయనయందు వేరు పారినవారై;

2) ఇంటివలె కట్టబడుచూ;

3) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచూ. .

 

  ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ మూడూ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. గాని మూడింటికి సంబంధం ఉంది. అది ఎలాగో చూద్దాం!

 

1). *ఆయనయందు వేరు పారినవారై*: వేరుపారడం అనగా విశ్వాసులను పౌలుగారు మొక్కలతో/ చెట్లతో పోలుస్తున్నారు! అయితే ఇక్కడ వారి వేర్లు ఎక్కడ వ్యాపించాలి? సారవంతమైన నేలలో, యేసుప్రభులవారిమీద వ్యాపించాలి అని యేసయ్య విత్తువాడు- విత్తనాల ఉపమానంలో మనం చూసుకోవచ్చు! అయితే పౌలుగారు ఎఫెసీ 3:17 లో ప్రేమయందు వేరుపారాలి అంటున్నారు! వేర్లు ఒకదానితో ఒకటి అంటుకొని, ఒకదానిలో ఒకటి ఎలా ఉంటాయో, అలాగే విశ్వాసులు కూడా దేవుని ప్రేమతో నింపబడి, ఒకరియందు ఒకరు ప్రేమకలిగి ఉండాలి అంటున్నారు!!

 

     ఇక యేసుప్రభులవారు వ్యవసాయం కోసం చెప్పిన మరో  ఉపమానం ప్రకారం: మత్తయి 13వ అధ్యాయంలో: ఒకవ్యక్తి/ చెట్టు ఫలించడం అనేది ఆ విత్తనాలు ఏ నేలమీద పడ్డాయి అనేదాని మీద ఆధారపడి యుంటాయి!.....

Matthew(మత్తయి సువార్త) 13:3,4,5,6,7,8,9,13,14,15,18,19,20,21,22,23

 

3. ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.

4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను

5. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

6. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

7. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను.

8. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను.

9. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

13. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి

14. మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

15. గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.

18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.

19. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

20. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానినంగీకరించువాడు.

21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

22. ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

23. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

 

 దారిప్రక్కన పడిన విత్తనాలు అసలు ఫలించలేదు! కారణం పక్షులు వచ్చి వాటిని తినివేసాయి!! ఇక్కడ విత్తనాలు(వాక్యం) వినేవాడి నిర్లక్ష్యం వలన సాతానుడు (పక్షులు) ఆ విత్తనాలను ఎత్తుకుపోవడం జరిగింది! మరికొన్ని విత్తనాలు రాతినేలమీద పడ్డాయి. అక్కడ మన్నులేనందువలన మొలకెత్తిన కొద్దిరోజులలో వాడిపోయాయి! అనగా వీరికి దేవునివాక్యం పట్ల లోతైన ఆశక్తి లేక వారు ఫలించలేక పోయారు! అందుకే యేసయ్య అంటున్నారు: అతనిలో వేర్లు అనగా లోతైన విశ్వాసం లేనందువలన, కొద్దికాలమే విశ్వాసంలో నిలిచి ఉంటాడు అయితే కష్టాలుగాని, నేడు మనదేశాలలో ఎదురౌతున్న హింసలు లాంటివి ఎదురవ్వగానే, వెంటనే తొట్రుపడి వెనుకడుగు వేస్తాడు! ప్రియ చదువరీ! ఈ లెక్కలో నీవున్నావా?

 

   ఇక కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి! విత్తనాలు మొలకెత్తాయి గాని ముండ్లతుప్పలు వాటిని అణచివేశాయి! అనగా వీరికి దేవుడంటే ఇష్టమే! గాని ఈలోక ఐహిక విచారములు మీద ఆశ ఎక్కువ! ఈలోకభోగాలమీద ఆశలు వదులుకోరు!! ధనం మీద, బంగారం మీద, అధికారం మీద ఆశ!! ఇవి వారిని దేవునిలో సాగనీయవు! ఉదా: దేవుని ఆరాధనకు వెళ్లాలని వీరికి ఆశ ఉంటుంది, పాటలు పాడాలని, ప్రార్ధించాలని ఉంటుంది గాని అదే సమయంలో వీరికిష్టమైన టీవీ సీరియల్ గాని, క్రికెట్ మాచ్ గాని వస్తే, ఆరాధనకు వెళ్ళరు! వీరికున్న దేవునిమీద ఆశను, వీరిలో ఉన్న నేత్రాశ నొక్కేసింది! ప్రియ చదువరి! ఇలాంటివారు పరలోకం వెళ్తారా??!!

 

    చివరగా మంచినేలమీద పడ్డ విత్తనాలు; ఆ నేల మంచిది కాబట్టి వారి వేరు లోతుకు పారుతుంది, తద్వారా బలమైన, మంచి విత్తనాలు ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలించాయి!!

 

   ప్రియ విశ్వాసి! నీవు ఎక్కడ వేరు పారావు? రోడ్డుప్రక్కనా? రాతినేలమీదనా? ముండ్లపొదలలోనా? లేక మంచినేలమీదనా? రాతినేలమీద, ముండ్లపొదలలో పడిన విత్తనాలు లాగ ఉంటే, అనగా లోతైన విశ్వాసం లేకుండా, ఐహికవిచారాలమీద, ఈ లోకాచారాలమీద ఉంటే, ఈలోక శ్రమలను తట్టుకోలేకపోతే, నీకు పరలోకం లేదు అని గమనించు!!

 

   ఈ సందర్భముగా మరోసారి మీకు గుర్తుచేస్తున్నానుఒకవ్యక్తికి ఆ సం.ము వరదల వలన భూమి పంట నాశనం అయిపోతుంది. వెంటనే ఆ వ్యక్తి ఎంతో భక్తి నిష్టలతో దేవునికి ప్రార్ధన చేశాడు- వచ్చే సం.ము వర్షాలు పడాలి గాని గాలి రాకూడదు, ఉరుములు, పిడుగులు పడకూడదు అని, వెంటనే దేవుడు సరే అన్నాడంట! ఆ సం.ము వర్షాలు బాగా పడ్డాయి, గాలి లేదు, పిడుగులు, ఉరుములు లేవు. పంట బాగాపండిది! కోతకోసాక చూస్తే, ఆ గింజలన్నీ పొల్లుగింజలే! కారణం గాలికి మొక్కలు ఊగుతున్నప్పుడు, తట్టుకోడానికి మొక్కలు తమ వేర్లను లోతుకు పంపిస్తాయి! తద్వారా లోతున ఉన్న లవణాలు గ్రహించి, మంచి పంట పండుతుంది. ఇంకా ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు వాతావరణంలో గల నైట్రోజన్- హైడ్రోజన్ తో కలసి అమ్మోనియంగా మారి వర్షంతో కలసి భూమిమీదకు వచ్చి, మొక్కలకు బలం చేకూర్చుతుంది! ఇవన్నీ వద్దన్నాడు రైతు తెలియక!! అందుకే పొల్లుగింజలు పండాయి!

 

   ప్రియ చదువరీ! 1.  నీవెక్కడ నాటబడ్డావు?? మంచి ఫలాలు ఫలిస్తున్నావా? లేక పొల్లుగింజలా? 2. శ్రమలలో (గాలి వానలలో) నీ విశ్వాసం అనెడి వేరు లోతుకు పారుతుందని గ్రహించావా? ఓరి దేవుడా! ఈ కష్టాలు అన్నీ నాకే రావాలా అని విసుక్కుంటూ ప్రార్ధన చేస్తున్నావా? అలా ప్రార్ధన చేస్తే నీవు మంచి విత్తనాలు ఫలించలేవు!! ప్రభువా! శోధనలు తట్టుకునే శక్తి/ ఉపాయం నాకు ఇవ్వు అని ప్రార్ధించు!! అప్పుడు నీవు వేరు పారి, దేవునిలో ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలిస్తావు!

ఇంకా ప్రేమలో వేరుపారి ఫలిస్తావు!!

 

  అట్టి కృప, చదువరులందరికీ దేవుడు దయచేయును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*33వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-౩*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక దేవుని గృహము కోసం చూసుకుందాం!

 

        (గతభాగం తరువాయి)

 

సంఘాన్ని దేవుని పొలముతోను లేక వ్యవసాయముతోనే కాకుండా మీరు దేవుని గృహము అంటున్నారు 9వ వచనంలో!! అయితే మనము బుర్రలు పాడుచేసుకోకుండా 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడు అనియు మీరెరుగరా అంటున్నారు! అనగా మనము ఏ గృహముగా కట్టబడుచున్నాము అంటే దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము! ఇంకా ఎఫెసీ 2:22 లో కూడా అంటున్నారు మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు....

ఎఫెసీయులకు 2: 22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

అయితే పేతురు గారు ఆత్మావేశుడై అంటున్నారు మీరు దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయనకోసం పరిశుద్ధమైన యాజకులుగా ఉండేలాగున మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు!

 

(గమనించాలి: గతభాగాలలో లేఖనాలు పరిశీలించడం అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి అని చెబుతూ లేఖనాలు పరిశీలించడం ఇలానే చెయ్యాలి అని చెప్పడం జరిగింది! పౌలుగారు మనము దేవుని ఆలయముగా దేవుని గృహముగా కట్టబడుచున్నాము అని ఆత్మావేశుడై ఇక్కడ చెబితే అనగా కొరింథీ పత్రికలో చెబితే అదే పరిశుద్దాత్ముడు పేతురు గారిని ఉపయోగించుకుని పరిశుద్ధ యాజకులుగా ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని దేవునిచేత మీరు ఆత్మ సంబంధమైన మందిరము అనగా దేవాలయముగా కట్టబడుచున్నారు అని రాశారు! లేఖనం- లేఖనము తో పోల్చబడి సరిగా ఉంది! ఇదీ లేఖనాలు పరిశీలించే విధానం!!!)

 

కాబట్టి ఇక్కడ మనకు మనము దేవునికి ఆలయముగా దేవుడు నివశించే మందిరముగా కట్టబడుచున్నాము అని అర్ధం అవుతుంది! మరి ఇలా కట్టబడాలంటే కొద్దిగా కట్టడాల కోసం ధ్యానం చేద్దాం!

 

ప్రియులారా! గతభాగములో కొలస్సీ పత్రిక 2:6-7 ధ్యానం చేసుకుంటూ, క్రీస్తులో వేరుపారడం కోసం ధ్యానం చేసుకున్నాం!

ఇక ఈరోజు ఇంటివలె కట్టబడటం కోసం ధ్యానం చేద్దాం!

 కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.. .

 

గతభాగంలో మనం పౌలుగారు విశ్వాసులను మొక్కలతో/ చెట్లతో పోల్చడం చూశాం!

నేడు ఈ భాగంలో పౌలుగారు విశ్వాసులను ఇంటితో/ కట్టడంతో పోలుస్తున్నారు! అయితే అది ఏ ఇల్లు? దేవుని ఇల్లు! ఎఫెసీ 2:19-22 వరకు చూసుకుంటే చాల విపులంగా కనిపిస్తుంది మనకు!

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిమీద కట్టబడియున్నారు అంటున్నారు.

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

ఇక్కడ వారు ఏ పునాది మీద కట్టబడుతున్నారు? క్రీస్తుయేసు అనే పునాదిమీద! ఆ పునాది క్రీస్తే!! 1కోరింథీయులకు 3: 11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 1పేతురు 2: 4,5

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

   ఇక ఇల్లు కట్టాలి అంటే పునాది వేయాలి! ఆ పునాది దేనిమీద కట్టబడింది అనేది చూసుకోవాలి.  ఇప్పుడు మనమూ యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మరో ఉపమానం: .......

Matthew(మత్తయి సువార్త) 7:24,25,26,27

 

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

 

బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కట్టిన ఇల్లుకోసం యేసయ్య చెప్పిన ఉపమానంలో చూసుకుంటే, ఒకడు తన ఇల్లు ఇసుకమీద కట్టాడు; మరొకడు బండమీద కట్టాడు. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడి నందువలన గాలి, తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!! ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను! నీవు కేవలం Material Blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలి పోక తప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోదనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు!!

 

అయితే గతంలో చెప్పిన విధముగా క్రీస్తుమీద ఆనుకొన్న వారికి బండమీద కట్టబడిన వారికి- గాలి, వాన లాంటి శ్రమలు రాకతప్పవు! వాటిని తట్టుకొంటేనే పరలోకం!

 

ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంతలోతుగా తీసి కడితే, అంత బలంగా ఉంటుంది ఆ ఇల్లు! అలాగే శ్రమలయందు వేరుపారినప్పుడునీకు ఎన్ని కష్టాలు, శోధనలు వస్తాయో, నీవు అంత విశ్వాసంలో లోతుకు వేరుపారుతావు! అప్పుడు నీ విశ్వాస స్థాయి / పరిమాణం పెరిగి ఎన్ని కష్టాలు,శోధనలు వచ్చినా ధైర్యంగా ఉండగలవు!

కేవలము Material Blessings కోసం చూస్తే, కష్టనష్టాలలో సోలిపోక తప్పదు!

 

  ఇక పునాది తీసేటప్పుడు రాళ్ళు, చిల్లపెంకులు, గాజుపెంకులు, ఎముకలు లాంటివి ఉంటే తీసిపారేస్తారు! అలాగే నీలో ఉన్న బండలాంటి హృదయం,

లోకాశలు, లోకాచారాలు అన్నీ తీసి పారేస్తే, ఆ పునాది దిట్టంగా ఉంటుంది!

 

    ఇక చివరగా, 1 కొరింథీ 3:11-17 వరకు చూసుకుంటే క్రీస్తు అనీ పునాది మీద కాకుండా ఎవడైనా మరో పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివాటితో కడితే- ఆ పనితనం అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ అగ్ని- శ్రమలు అనే పరీక్షలు! ఇక బంగారం, వెండి వెలగల రాళ్ళు అనేవి వివిధ రకాలైన బోధలు!!

 

   అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు!

 

  ప్రియ చదువరీ!  నీ పునాది దేనిమీద? క్రీస్తుమీదనా?

ధనం మీదా?

శ్రమలలో తట్టుకొంటున్నావా? సోలిపోతున్నావా?

 పరీక్షించుకో!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*34వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-4*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! గతభాగంలో దేవుని గృహముగా విశ్వాసులు ఎలా కట్టబడాలి అనేది చూసుకున్నాము! ఈరోజు దైవసేవకులు దేవుని కట్టడాలు లేక ఆలయమును ఎలా కట్టాలి అనేది చూసుకుందాం!

 

గతభాగంలో ధ్యానం చేసుకున్నాము: అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు! అని ధ్యానం చేసుకున్నాము!

 

అయితే బోధిస్తున్న  ఓ నాయకుడా నీవు ఎలాంటి బోధలు చేస్తున్నావు? ఇక్కడ 1115 వచనాలు చూసుకుంటే నీవు కట్టేది క్రీస్తు అనే పునాది మీద ఉండాలని, ఆ పునాది మీద నీవు కడుతున్న పదార్ధాలు అనగా నీవు చేస్తున్న బోధలు అవి వెండి బంగారం ఇత్తడి లాంటి పదార్ధాలతో పోల్చబడ్డాయి! అవి నీవు చేసే ప్రసంగాలు! నీ ప్రసంగం కేవలం అపోస్తలుల బోధమీద, సిలువవేయబడిన క్రీస్తుమీద, పరిశుద్ధాత్మ శక్తి మరియు పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరిచే దృష్టాంతాలు మీదనే ఉండాలి గాని నీ బోధలు సైన్సు చేత మరియు తర్కము వేదాంతము చేత కట్టబడ్డాయా అని చూసుకో! నీ బోధలు పిట్టకధలు మరియు హాస్యకధలు లేక కామెడీ మీద ఆధారపడిందా? లేక నీ బోధ కేవలం వాక్యం మీద అపోస్తలుల బోధమీద పరిశుద్దాత్మ శక్తితో ఉందా పరిశీలించుకో! నీ బోధ సైన్సు చేత పిట్టకదల చేత కామెడీతో ఉంటే ఒకరోజు అగ్నిలాంటి శ్రమలు శోధనలు విశ్వాసులు అనే దేవుని ఆలయము మీద పడితే అప్పుడు ఒకవేళ ఆ దేవుని ఆలయము లేక విశ్వాసుల హృదయాలు చలించి పోయి బ్రష్టులై పోతే నీవు నష్టపడతావు అని పౌలుగారు చెబుతున్నారు ఆత్మావేశుడై!!! ఒకవేళ నీ పని అగ్నిచేత కాల్చబడిన తర్వాత నిలిస్తే అనగా అగ్నిలాంటి శోధనలు విశ్వాసులను బాధించినా ఆ గృహాలు లేక క్రీస్తు నిలయాలు పరిశుద్దాత్మ నిలయాలుగా నిలిస్తే విశ్వాస వీరులుగా నీ విశ్వాసులు లేక నీ సంఘము నిలిస్తే నీవు ధన్యుడవు!

దేవుడు ఒకరోజు అంటారు: భళా నమ్మకమైన మంచిదాసుడా!! అని నిన్ను కోట్లాదిమంది మధ్యలో సెహబాస్ అంటారు!! మరి నీ బోధ దేనిమీద ఉంది ప్రియ దైవసేవకుడా! ప్రసంగీకుడా!!! కాపరీ!!

 

కొలస్సీయులకు 1: 23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

 

  ప్రియులారా! ఈవచనంలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి.

1). పునాదిమీద కట్టబడిన వారు;

2) స్థిరముగా ఉండాలి(విశ్వాసంలో)

3) విన్న సువార్తవలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు!

పై విషయాలు కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకందాం!

 

*పునాదిమీద కట్టబడిన వారై*:  ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే: ఒక ఇల్లు కట్టాలంటే దానికి మొదటగా పునాదివేయాలి!  పునాది ఎంత బలంగా కట్టాలో ఆ ఇంటిని బట్టి ఆధారపడుతుంది. ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పెద్ద, బలమైన, లోతైన పునాది వేయాల్సిఉంటుంది. అంతేకాకుండా, ఆ పునాది దేనిమీద లేదా ఎక్కడ వేయబడింది అనేది కూడా అవుసరమే! అందుకే పెద్దబిల్దింగ్ కట్టేటప్పుడు Soil టెస్ట్ చేస్తుంటారు.

 

  ఇక్కడ పునాది అనేది సుస్థిరత, భద్రత, ధృఢత్వమునకు సూచనగా ఉంది. అలాగే క్రీస్తుయేసునందు మన విశ్వాసము కూడా ఓలిపోకుండా, సోలిపోకుండా సుస్థిరంగా, ధృడంగా ఉండాలి! ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్టసుఖాలు, కలిమిలేములు వచ్చినా మన విశ్వాసమును కోల్పోకుండా దృడంగా ఉండాలని పౌలుగారి కోరిక! ఇదే పరిశుద్దాత్ముని కోరిక!

పౌలుగారు తను చనిపోయే ముందు, తిమోతికి లేఖ రాస్తూ గొప్ప అమోఘమైన మాట (remarkable statement) అంటున్నారు: మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని! ఇక నాకు నీతికిరీటము ఉంచబడినది! 2 తిమోతి 4:7-8; చూశారా ఆయన విశ్వాసం! దేనియందు సంతోషిస్తున్నారు? తన విశ్వాసాన్ని కాపాడుకొన్నందుకే ఆయన సంతోషం, ధైర్యం! కారణం ఆయనకోసం నీతికిరీటం, మహిమకిరీటం- తేజోవాసుల స్వాస్థ్యము అన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆ విశ్వాసం నీకుందా?!!!

 

ఇక ఈ వచనంలో : క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 ఈ మూలరాయి క్రీస్తు! ఇంతకుమునుపు పునాది క్రీస్తు అన్నారు. ఇప్పుడు మూలరాయి క్రీస్తే!  అయితే ఆ మూలరాయియైన క్రీస్తును ఆధారం చేసుకొని, అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. దానిమీద మీరు అనగా సంఘం కట్టబడి ఉన్నది! అనగా యేసయ్యనే ఆధారం చేసుకొని సంఘం ఉండాలి. లోకవిషయాలు గాని, సైన్సుగాని, మీ పాండిత్యం గాని, పిట్టకధలు గాని, మరేదైనా యేసయ్యను substitute చేయకూడదు! అన్నింటికీ యేసయ్యే ప్రధముడై ఉండాలి. ఇక ఆ భోధ అపోస్తలుల భోదయై ఉండాలి! గతబాగాలలో అపోస్తలుల బోధకోసం మనము ధ్యానం చేసుకున్నాం! మరలా తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది!!!

 

అపోస్తలుల భోధ.

👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)

🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:16-35).

🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:22-24).

🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:31-36).

*యేసే-మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).

🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని, ప్రభువని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:36).

🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).

 

*ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41)

 

చివరగా మరోసారి గుర్తుకు చేస్తున్నాను! 1కొరింథీ 3:12-15 వరకుఈ పునాదిమీద ఎవడైనా వెండి, బంగారం, కొయ్య, కర్ర . . లాంటి వస్తువులతో కడితే, ఆ కట్టబడింది అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలో నిలబడి తట్టుకొని నిలిస్తే, కట్టినవానికి, తట్టుకొన్నవాడికి ఫలము కలుగుతుంది. ఇక్కడ బంగారం, వెండి .. లాంటి వస్తువులు అనగా మీ బోధ అపోస్తలుల బోధయై యుండాలి గాని మీ సొంతమాటలు, సైన్సు, పిట్టకధలు, వేదాంతము కాదు. అవి ప్రజలను ఆకర్షించవచ్చు గాని, వారిని పరలోకం చేర్చలేవు! మీ బోధలు వారిని కష్టాలు తట్టుకొని, ప్రభుకొరకు నిలబడేలా చేయాలి తప్ప ,ఎప్పుడూ Material Blessings కోసమో, ప్రభువును నమ్ముకొంటే మీకు కష్టాలు రానేరావు అనే తప్పుడుభోదలు కాకూడదు!! అలాంటి బోధలు విన్నవారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే విశ్వాస బ్రష్టులైపోతారు. అప్పుడు నీ పని ఇసుకమీద ఇల్లు కట్టినట్టే! నీవు కట్టిన వెండి, బంగారం లాంటి వస్తువులు శోధన అనే అగ్నిని తట్టుకోలేక , కరిగిపోతే, కనబడటం లేదు కాబట్టిసోమరివైన చెడ్డదాసుడా! అని పిలువబడతావు!

 

 కాబట్టి ప్రియ సేవకులారా! సంఘాన్ని అపోస్తలుల బోధపై కట్టండి.

విశ్వాసులారా! మీ విశ్వాసాన్ని కాపాడుకోండి పౌలుగారిలా!

అప్పుడే మీకోసం నీతికిరీటం రడీగా ఉంటుంది.

లేదా ఇసుకమీద కట్టిన ఇంటిలా మీ విశ్వాసం పేకమేడలా కూలిపోయి, రెంటికీ చెడ్డ రేగడి అయిపోతుంది.

 కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో!

 

దైవాశీస్సులు!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*35వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-5*

 

1కొరింథీ 3:915

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును

15.​ ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! గతభాగాలలో చెప్పినవి మరోసారి క్లుప్తంగా మీకు గుర్తుకు చెయ్యాలని అనుకుంటున్నాను!

 

9వ వచనం ప్రకారం దైవసేవకులంతా దేవునితోటలో జతపనివారు! ఒకరు గొప్ప ఒకరు పనికిరాని వారు కారు! అందరూ సమానమే!!

 

11వ వచనంలో వేయబడినది తప్ప మరో పునాది లేదు, ఆ పునాది యేసుక్రీస్తే!!!

పౌలుగారు యేసుక్రీస్తు ప్రభులవారు పునాది అని కొరింధీ పత్రికలో చెబితే ఎఫెసీ పత్రికలో మూలరాయి అంటున్నారు దైవాత్మ సంభూతుడై!

ఎఫెసీయులకు 2: 20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

 పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభులవారు మూలరాయి అని చెబుతున్నారు!

1 Peter(మొదటి పేతురు) 2:5,6,7

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

 

యెషయా 28: 16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

ఇళ్ళు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి. అది దానినుంచి కట్టబడే గోడలను నిటారుగా చక్కగా ఉంచుతుంది. ఈ విధంగా కట్టడం అంతటికీ స్థిరత్వం, సౌందర్యం ఇస్తుంది.

 

యేసుక్రీస్తు ప్రభులవారు కూడా మన దేవుని ఆలయమునకు మూలరాయి వలే ఉంటూ నిన్ను పరలోకం చేరేవరకు నడిపిస్తారు! అయితే నీ హృదయమనే దేవాలయమును క్రీస్తుయేసు మీదనే కట్టాలి! నీ మనస్సు ,ఆత్మ మూలరాయి మీదనే కేంద్రీకృతం చేయాలి తప్ప, మరో విషయాల మీద లోకము మీద నీ మనస్సు ఆత్మ నిలిపితే నీ హృదయమనే దేవాలయంలో మరియు  నీ దేహమనే దేవాలయంలో లోకముంటే సాతాను గాడు నివాసం చేసి నిన్ను దయ్యాల కొంపగా చేసేస్తాడు! అప్పుడు నీవు బ్రష్టుడవై నరకపాత్రుడుగా మారతావు!

 

నిర్గమ 25:8

నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

 

ప్రకటన 21:3

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

 

 ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయం యేసు క్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలోనూ నిజ దేవుడు లేడు

అపొ కా 17:24-25.

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.

 

 సరే, ఇక ఈ వచనాలలో ఉన్న మరో ఆత్మీయ మర్మములు కూడా దాగి ఉన్నాయి! పౌలుగారు విశ్వాసులను కేవలం దేవుని గృహము గాను దేవుని ఆలయముగానే కాదు ఇంకా చాలా విదాలతో పోల్చారు! అవి ఒకసారి ధ్యానం చేసుకుని ముందుకుపోదాం!

 

క్రీస్తుయేసు విశ్వాసులు దేవుని ఇల్లు, దేవుని ఆలయం కూడా.

1 కొరింతు 3:16;

 

1కోరింథీయులకు 6: 19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

 

1 పేతురు 2:4-5.

 

విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలుగారు  ఎఫెసీ పత్రికలో ఎన్ని రకాల మాటలను వాడుతున్నాడో చూడండి.

 *వారు దేవుని సంతానం*

ఎఫెసీయులకు 1: 5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

 

*దేవుని స్వాస్థ్యము లేక వారసత్వం*

ఎఫెసీయులకు 1: 17

మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

 

*దేవుని కుమారుని శరీరం*

ఎఫెసీయులకు 1: 23

ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

*దేవుడు చేసినవారు*

ఎఫెసీయులకు 2: 10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

దేవుని ప్రజలు, దేవుని పరలోక పౌరులు, దేవుని ఇల్లు 2:19;

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

ఎఫెసీయులకు 2: 20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

సరే ఇక ముందుకుపోతే దేవుని ఆలయం అనగా

ఆరాధన, దేవునికి అర్పణలు జరిగే స్థలం దేవాలయం. ఆయన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం కూడా అంతే రోమ్ 12:1;

అందుకే రోమీయులకు 12: 1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

 హెబ్రీ 13:15-16

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని. ....

 

పై వచనాలన్నీ చదివి అర్ధం చేసుకుంటే దేవుడు నిన్ను తనకు ఏవిధంగా ఉండాలో తన ఏర్పాటు అర్ధమవుతుంది! నిజంగా దీనిని అర్ధం చేసుకున్నవారు దేవునినుండి కుడిఎడమలకు తిరుగరు!!!

 

3:10 వచనంలో  పౌలుగారు తనలో ఏమీ లేదని చెప్పారు. ఇక్కడ క్రీస్తు సేవకుడుగా తాను చేసినదంతా దేవుని కృపవల్లే అంటున్నారు. తన సమర్థతలు, అవకాశాలు అన్నీ దేవుడే ఉచితంగా ఇచ్చినవి. 2 కొరింతు 3:5-6

 

5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

అలాగే ప్రతీ సేవకుడు తననుతాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించాలి!

 

ఇక 11వ  వచనంలో పునాదికోసం చెబుతున్నారు!

యెషయా 28:16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

అపొ కా 4:11

ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

 

ఎఫెసు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

 పేతురు 2:6.

 

పౌలుగారు  క్రీస్తుయేసును గురించిన సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఉపదేశించడం ద్వారా తనలో పని చేస్తున్న దేవుని ఆత్మ ప్రభావం మూలంగా మనుషులను క్రీస్తులో నమ్మకం పెట్టుకొనేలా నడిపించడం ద్వారా కొరింథీలో పునాది వేశారు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్ళిపోయారు. కట్టేవారు ఇతరులు అక్కడ పని మొదలు పెట్టారు.

 

3:12వ వచనంలో కట్టేవారు ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండి దేవుని వాక్కులోని అమూల్య సత్యాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించేవారైతే వారు కట్టేదానిలో విలువ గల లోహాలు, మణిమాణిక్యాలూ వాడుతున్నట్టన్నమాట. అలా కాకుండా వారు లోక సంబంధులు, సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఉంటే వారు చెక్క, గడ్డి, కసవును ఉపయోగిస్తున్నారన్నమాట.

 

3:13-15 వచనాలు చూసుకుంటే:  తన సేవకులందరి పనికీ దేవుడు తీర్పు తీర్చే రోజు గురించి పౌలుగారు మాట్లాడుతున్నారు.  13వ వచనంలో అది తేటతెల్లం చేసే తీర్పు, మంటలతో లేక శ్రమలు శోధనలవలన వచ్చే తీర్పు, పరీక్షించే తీర్పు అని దాని గురించి పౌలు వివరిస్తున్నారు. ఒక మనిషి చేసిన పని ఎంత అన్నది కాదు ఆ రోజున వచ్చే ప్రశ్న. దాని నాణ్యత ఎలాంటిది అని చూడడం జరుగుతుంది. దేవుని అగ్నిపరీక్షకు ముందు కంటికి చక్కగా కనిపించడం కాదు. దాని తరువాత ఏమి మిగిలి ఉంది అన్నది ముఖ్యం. ఎంత శ్రద్ధగా, భయం, వణకుతో (2:3) దేవుని సేవకులు తమ పని చెయ్యాలో గదా!

కాబట్టి ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని పరిచర్య చెయ్యాలి! మీద చెప్పిన విషయాలు గ్రహించి విశ్వాసులు తాము వినే బోధల విషయంలో జాగ్రత్తపడాలి!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*36వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-6*

 

1కొరింథీ 3:1617

16. మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇంతవరకు విశ్వాసులు దేవుని వ్యవసాయమని దేవుని గృహమని దేవుని ఆలయమని పౌలుగారు మనకు వివరించారు!

 ఇక 1617 వచనాలలో మీరు దేవుని ఆలయము అని, ఎవడైనా దేవుని ఆలయమును పాడుచేస్తే దేవుడు వానిని పాడుచేయును అంటున్నారు!

 

 గమనించాలి :వ్యక్తిగతంగానూ, సమూహంగానూ కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయమైయున్నారు. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం !

 

రోమా 12:1-2;

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

హెబ్రీ 13:15-16;

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని. ...

 

1పేతురు 2: 5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

ఇంకా కీర్తనల గ్రంధం ప్రకారం  దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం అది కీర్తన 11:4;

కీర్తనలు 11: 4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

 

రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

అయితే  దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయం విశ్వాసులు మాత్రమే. దేవుణ్ణి, ఆయన విశ్వాసులను తిరస్కరించేవాడు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళవచ్చు గానీ దేవుడు అక్కడ ఉండరు!!

 

అపొ కా 17:24

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

 

ఇక్కడ  ఇప్పుడు పాడు చెయ్యడం అంటే ఇక్కడ గాయపరచడం, హాని చేయడం, చెడగొట్టడం అని అర్థం. విశ్వాసులు దేవుని ఆలయాన్ని నాశనం చెయ్యరు. వారే ఆయన ఆలయం. ఆ రోజుల్లో (ఈ కాలంలో కూడా) అనేక క్రైస్తవ సంఘాల్లో గందరగోళం కలిగిస్తూ ఉన్న కపట బోధకులను దృష్టిలో ఉంచుకుని పౌలుగారు ఈ మాట చెబుతున్నారు

 రోమా 16:17-18.

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

 

కొరింథీ సంఘములో ఇలాంటివారు కొందరు క్రీస్తు సిలువను అలా ఉంచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, సువార్తను కలిపిచెరుపు తున్నారు!

2 కొరింతు 11:4, 13-15, 18

4. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే.

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

 

దేవుని ఆలయాన్ని పాడు చేసేది అలాంటి ఉపదేశమే. తన పవిత్రమైన పనిని పాడు చేసేందుకు చూచే మనుషులతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడన్న విషయంలో సందేహం అవసరం లేదు.

 

సరే, ఇక విశ్వాసులు యొక్క మనస్సులే కాకుండా విశ్వాసుల యొక్క దేహము కూడా దేవుని మందిరం లేక ఆలయము అని మనము 1కొరింథీ 6:1920 వచనాల ప్రకారం చూసుకోవచ్చు!!...

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

ఇంకా అప్పుడు దేవుని ఆలయమును నీ దేహమును పాడు చేసేవి నీ ఆలోచనలు అని యేసయ్య చెబుతున్నారు....

Matthew(మత్తయి సువార్త) 15:18,19,20

 

18. నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

20. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

 

ఇంకా నీ పాడు అలవాట్లు కూడా నీ దేహాన్ని పాడు చేస్తాయి నీ త్రాగుడు, నీ వ్యభిచారం, ఇలాంటి దురలవాట్లు నిన్ను నీ దేహాన్ని నీ దేహమనే దేవుని ఆలయమును పాడుచేస్తాయి కాబట్టి వాటికీ దూరంగా ఉండాలి!!! నీ దేహము దేవుని ఆలయము!! 1కొరింథీ 6:1920

 

కాబట్టి మన దేహముతో మనము దేవున్ని మహిమ పరచాలి గాని మరో స్త్రీని గాని, నిన్ను నీవు గాని సుఖపెట్టుకోడానికి కాదు! ఆ ధనవంతుడు తనకు విస్తారమైన పంట పండింది అని తననుతాను సుఖపెట్టుకోవాలని చూశాడు, అనుకుంటున్నాడు: నా ప్రాణమా! అనేక సంవత్సరాలకు సరిపోయే పంట నీకు పండింది కాబట్టి సుఖించుము తినుము త్రాగుము!! అయితే దేవుడు అంటున్నారు: వెఱ్రివాడా! ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, అప్పుడు నీవు సంపాదించినవి అన్ని ఎవడిపాలు అవుతాయి??? అలాగే మనము మన దేహాన్ని మన కోరికలను సంతోషపెట్టుకోవాలని చూస్తుంటే అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నారు!!! లూకా 12: 16--21

 

కాబట్టి నీ దేహమును లేక దేహమనే ఆలయమును పాడుచేస్తావా లేక శుభ్రముగా కాపాడుకుని దానిలో దేవునికి అర్పణలు బలియాగాలు అర్పిస్తావా? అనగా ప్రార్ధనలతోను యాచనలతోను స్తుతులతోను సంగీతములతోను పరిశుద్ధాత్మ క్రియలతోను నీదేహమును నీ హృదయమును కాపాడుకుంటావా??

నీ దేహమును దేవునికి నిలయంగా చేస్తావా? లేక సాతాను గాడి అడ్డాగా చేస్తావా?

పరిశుద్దాత్మకు స్థావరంగా మారుస్తావా? లేక పేకాట మందిరంగానో వ్యభిచార గృహంగానో మారుస్తావా?

నేడే పరిశీలించుకుని ఏది కావాలో నిర్ణయించుకో!!!

 

దైవాశీస్సులు!!!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*37వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-7*

 

1కొరింథీ 3:1823

18. ఎవడును తన్నుతాను మోసపరచు కొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.

19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కు యుక్తిలో ఆయన పట్టుకొనును;

20. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.

21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.

23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇంతవరకు దేవుని గృహము దేవుని తోట లేక దేవుని వ్యవసాయము అని విశ్వాసుల కోసం చెప్పారు! ఇక ఈ అధ్యాయం చివర్లో ఈ ఆత్మీయమర్మాలు అన్నీ బోధించాక చెబుతున్నారు పౌలుగారు: మీరు దేవుని తోట మరియు ఇల్లు, మేము పనివారము! లోకము మరణం జీవం పరలోకం పౌలు పేతురు అపోల్లో  అన్నీ మీకోసమే అనగా విశ్వాసుల కోసమే! కాబట్టి విశ్వాసులు ఒకరికంటే ఒకరు ఎక్కువకారు సేవకులు ఒకరికంటే ఒకరు తక్కువ కారు! అందరూ క్రీస్తుకు చెందిన వారు క్రీస్తు దేవునికి చెందిన వారు అని చెప్పి ముగిస్తున్నారు!

 

ఒకసారి ఈ వచనాలలో ఏవి వ్రాయబడ్డాయో క్లుప్తంగా చూసుకుందాం!

 

18వ వచనం: ఎవరూ తమనుతాము మోసం చేసుకోకూడదు! ఇంకా మీలో ఎవడైనా ఈలోకంలో తానూ జ్ఞానిని అని అనుకుంటే వాడు జ్ఞాని అయ్యేలా వెఱ్రివాడు కావాలి!! ఇది అర్ధం కాలేదు కదా!!

జ్ఞాని అనగా దేవుని దృష్టిలో జ్ఞాని ఎవరు? లోక సంబంధమైన విషయాల వెనుక లోక సంబంధమైన జ్ఞానమును వెంటాడే వారు కానేకారు! ఆ లోకసంబంధమైన జ్ఞానమును త్రోసిపుచ్చి క్రీస్తుయేసు సిలువ సువార్తను నమ్మి దానియందు కొనసాగేవారు! ఆధ్యాత్మిక జ్ఞానవంతులు! వారు ఆధ్యాత్మిక సంగతులమీద మనస్సు పెడతారు!! గాని 1:18, 24 వచనాల ప్రకారం ఇలాంటివారిని లోకం వెఱ్రివారు అంటుంది!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:18,24

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

కాబట్టి దేవుని దృష్టిలో జ్ఞానులు కావాలంటే లోకం దృష్టిలో వెఱ్రివారు కావాలి అంటున్నారు!!

ఇక ఎవడూ తననుతాను మోసగించుకోగూడదు అంటున్నారు! ఇదే పత్రిక 6:9 లో అంటున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారని మీకు మీకు తెలియదా అంటూ మోసపోకుడి అంటూ కొంతమంది లిస్టు చెబుతున్నారు పౌలుగారు, వీరు తమనుతాము మోసం చేసుకుంటున్నారు వీరు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటున్నారు.....

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

 

ఇక 15:౩౩ లో కూడా అంటున్నారు పౌలుగారు: మోసపోకండి దుష్ట సహవాసం మంచి నడవడిని చెరిపివేయును అంటున్నారు! అనగా దుష్టులతో సహవాసం చేసేవాడు తనయొక్క మంచి ప్రవర్తనను చెడగొట్టుకుని తనను తానూ మోసం చేసుకుని నరకానికి పోతున్నాడు అన్నమాట!!

 

 కాబట్టి దేవుని బిడ్డలారా! మిమ్మును మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేక మీద చెప్పిన లిస్టులో ఉన్న మనుష్యుల వలెనే మీరు కూడా ప్రవర్తించి మిమ్మును మీరు మోసం చేసుకుని నరకానికి పోతున్నారా పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!!

 

 ఇక 19వ వచనంలో ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెఱ్రితనము మరియు తెలివితక్కువ తనము!!  ఆయన జ్ఞానులను తమ సొంత కుయుక్తిలోనే పట్టుకోనును అని వ్రాయబడింది! ఎక్కడ వ్రాయబడింది? యోబు 5:13 లో...

జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టు కొనును కపటుల ఆలోచనను తలక్రిందు చేయును

 

అందుకే ఇదే పత్రిక 1:20 లో అంటున్నారు పౌలుగారు .......

జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు (మూలభాషలో- ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

 

ఇక 20వ వచనంలో జ్ఞానుల ఆలోచనలు వ్యర్ధములని ప్రభువునకు తెలుసునని వ్రాయబడియున్నది ఎక్కడ వ్రాయబడి ఉంది?

కీర్తనలు 94: 11

నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.

 

మన సొంత జ్ఞానము వ్యర్ధము మరియు తెలివితక్కువ తనము గనుక పరలోకయాత్రలో మన సొంత తెలివితేటలూ మన జ్ఞానమును నిరాకరించి సిలువసువార్తను పట్టుకుని ముందుకుపోవాలి! ఆ సిలువసువార్తనే ప్రకటించాలి!! ఇదీ పౌలుగారి ఉద్దేశ్యం!!!

 

ఇక 20-23 వరకు అసలు సంగతికి వచ్చేశారు! కాబట్టి ఇప్పుడు మనిషి ఎవడూ ఇతర మనుష్యులను బట్టిగాని లేక మీ అయ్యగారి బట్టి గాని మీ ప్రవక్త బట్టి గాని మరో ఎవరిని బట్టో అతిశయించకూడదు ఎందుకంటే పౌలుగారి అపోల్లో గాని కేఫా గాని లోకము గాని బ్రతుకు గాని మరణం గాని జీవము గాని ఇప్పుడు ఉన్నవి గాని రాబోయేవి అనగా పరలోకంలో నిత్యత్వంలో మీరు పొందుకోబోయే ఏవైనా గాని అవన్నీ మీవే!!! మీరు క్రీస్తువారు! క్రీస్తు దేవుని వాడు అంటున్నారు పౌలుగారు! ఇదంతయు జరిగిన తర్వాత తేలిన ఫలితార్ధమిదే అంటూ సోలోమోను ఎలా చెబుతున్నారో అలాగే ఇక్కడ పౌలుగారు కూడా ఇదంతా చెప్పి మీరు ఎవ్వరికోసం అతిశయపడవద్దు! మేమూ మేమూ అంతా దేవుని జత పనివారం! మేము మీకోసమే ఉన్నాము! అలాగే రాబోయే విషయాలు కూడా మీకోసమే! మీరైతే క్రీస్తు వారు క్రీస్తుకోసం! క్రీస్తుయేసు దేవునికోసం ఉన్నారు అంటూ తేల్చి చెబుతున్నారు!! కాబట్టి మీరు మీలో మీరు తగవులాడుకుని విబేధాలు పెట్టుకుని విడిపోవద్దు అంటున్నారు!!

 

గమనించాలి మనుష్యులు దేవుని చేతిలో కేవలం సాధనాలు! ఆ సాధనాలను తయారుచేసి ఉపయోగిస్తున్నది దేవుడే! కనుక వారు మీకొరకు వాడబడేటట్టు చేస్తున్న దేవునికే స్తుతులు చెల్లించాలి గాని వాడబడుతున్న మనుష్యులకు స్తుతులు చెప్పొద్దు అంటున్నారు పౌలుగారు!! ఇదే మనకు 4వ వచనం లోను 1:12, 29, 31 వచనాలలో కూడా చెప్పారు!!!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:12,19,27,28,29,31

 

12. మీలో ఒకడునేను పౌలువాడను, ఒకడునేను అపొల్లవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

దేవుడు తన విశ్వాసుల మేలుకోసం తన సేవకులను నియమించారు! ఇదే మనకు ఎఫెసీ 4:1113 లో చెప్పబడింది...

 

11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 

ఇంకా హెబ్రీ పత్రికలో ఇంకా చెబుతున్నారు హెబ్రీయులకు 1: 7

తన దూతలను వాయువులుగాను (లేక, ఆత్మలుగాను) తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు

 

అదే సమయంలో విశ్వాసులను దేవుని తోటలో నాటి నీరుపోసి ఎదిగేలా చేసే ఈ పొలము మరియు భూమి దేవుడే! ఈ జీవితంలో జరిగే సంభవాలు అన్నీ దేవుడు విశ్వాసుల మేలుకే చేస్తున్నారు!

రోమీయులకు 8: 28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

 

చివరికి చావు కూడా మనిషికి మంచిదే!! చావు కూడా విశ్వాసులదే! వారి ఈ మర్త్యమైన దేహము నుండి, ఈ పాపలోకమునుండి పాపమునుండి, తాము పడే కష్టాల నుండి రోగాల నుండి ఆకలిదప్పుల నుండి విడుదల పొంది దేవునితో మరింత ఉన్నతమైన ఉత్తమమైన జీవితానికి తలుపులు తెరిచే మంచి బహుమానం ఈ చావు లేక మరణం!! కాబట్టి చావుకు భయపడకూడదు!

 

ఇంకా రాబోయే కాలంలో లేక వారికి సంభవించబోయే విషయాలు కూడా వారివే! అనగా తేజోవాసుల స్వాస్థ్యము గాని, పరలోకంలో పొందుకోబోయే బహుమానాలే గాని మహిమదేహము గాని వెయ్యేండ్ల పాలనలో పొందుకోబోయే అధికారమే గాని అన్నీ విశ్వాసులవే! ఎందుకంటే వారు దేవుని వారసులు!!

రోమా 8:17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

రోమీయులకు 8: 18

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

 

మత్తయి 5:5

సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

 

ఎఫెసీ 1:14

దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

ప్రకటన 21:7

జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.

 

కాబట్టి మనుష్యుల విషయంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పౌలుగారు! ఒకరికన్నా మరొకరిని మీకుమీరే గొప్పచేసుకుని పౌలుగారు గొప్పోడు అపోల్లో గారు గొప్పోడు మా అయ్యగారు గొప్పోడు మీ అయ్యగారు తక్కువ అని చెప్పుకోకూడదు! అందరూ మీకు పరిచారం చెయ్యడానికే ఉన్నారు! మీరు యేసయ్య కోసం ఉన్నారు! యేసయ్య దేవునికోసం అంటున్నారు!

కాబట్టి ఇప్పుడు విశ్వాసులు క్రీస్తుకి చెందిన వారు కనుక మనుష్యులకు చెందిన వారు కనుక ఇక మనుష్యుల కోసం అతిశయ పడకూడదు!  కాబట్టి విశ్వాసులు దేవునికోసమే ప్రభువు కోసమే అతిశయించాలి 1 కొరింథీ 1:31

 

ఇప్పుడు క్రీస్తు దేవుని వాడు అని క్రింద రిఫరెన్సుల ద్వారా తెలుస్తుంది

(1కొరింథీ 11:౩,15:28, మత్తయి ౩:17, యోహాను 14:28)

 

కాబట్టి ఎవరినీ కోసం అతిశయ పడవద్దు! తగవులాడుకోవద్దు!

దేవునియందు ప్రభువుయందు మాత్రమే అతిశయపడదాం!

 ప్రభువుప్రేమను పంచుదాం!

దైవాశీస్సులు!!!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*38వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-8*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 4వ అధ్యయము ధ్యానం చేద్దాం! ఈ 4వ అధ్యాయం కూడా 2,3 అధ్యాయాలు దేనికోసమైతే చెప్పబడ్డాయో అదే విషయాన్ని ఇంకా కొంచెము లోతుగా మరో కోణంలో చెబుతున్నారు! మరుగైయున్న జ్ఞానము పొందుకున్నామనియు, దేవుని సేవకులంతా జతపనివారలు అనియు చెప్పి విశ్వాసులు దేవునియొక్క గృహము అనియు వ్యవసాయము అని చెప్పారు కదా, అదే మరో కోణంలో మేము అంతా జతపనివారము కాబట్టి మీరు ఒకరిమీద ఒకరు అతిశయపడవద్దు, ఒకరికోసం మరొకరు తీర్పు తీర్చవద్దు అనేది ఈ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం!!!

 

మొదటి వచనంలో ఈలాగున క్రీస్తుసేవకులమనియు అని మొదలుపెట్టారు ఈ 4వ అధ్యాయం! అనగా మొదటివచనంలో తెలుస్తుంది ఇది మూడో అధ్యాయానికి కొనసాగింపు అని! మూడవ అధ్యాయం ఏమి చెబుతుంది? దేవుని సేవకులంతా జతపనివారలు అని చెప్పి, విశ్వాసులు దేవునియొక్క గృహము అనియు, దేవుని యొక్క వ్యవసాయము అనియు చూసుకున్నాము, అంతేకాకుండా క్రీస్తుయేసు పునాది మరియు మూలరాయిగా ఉండి సంఘమనే గృహాన్ని కడుతున్నారు, క్రీస్తుయేసు పునాది మరియు మూలరాయి అయితే కొరింథీ సంఘంలో ఆ పునాదిని వేసింది పౌలుగారు, అపోల్లో గారు దానిని కట్టారు అనియు,

ఇంకా కొరింథీ సంఘములో దేవుని వ్యవసాయము అనే పొలంలో పౌలుగారు విత్తనాలు జల్లితే అపొల్లోగారు నీరుపోసి పెంచారు అనేది మనకు మూడవ అధ్యాయంలో కనిపిస్తుంది, కాబట్టి పౌలుగారు అపొల్లోగారు పేతురు గారు ఎలా దేవునితోటలో జతపనివారో అలాగే నేడు సేవకులంతా దేవునితోటలో జతపనివారు గనుక ఏ సేవకుని బట్టి అతిశయపడక వారికి కృపావరములు ఇచ్చి వాడుకునే క్రీస్తుయేసు ప్రభువునందు అతిశయపడాలని నేర్చుకున్నాము కదా, ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నారు!

 కాబట్టి ఈలాగున మేము క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతీ మనుష్యుడు మమ్మును అనగా దైవసేవకులను భావించాలి అంటున్నారు!

 

మూడో అధ్యాయంలో దేవుని తోటలో మేము జతపనివారలము అని పరిచయం చేసుకుంటే ఈ అధ్యాయంలో మేము దేవుని గృహము యొక్క గృహనిర్వాహకులము అని పౌలుగారు పరిచర్యం చేసుకుంటున్నారు! తోటలో జతపనివారు, గృహంలో గృహనిర్వాహకులు!!!

పౌలుగారు ఈ అధ్యాయంలోనే కాకుండా తన పత్రికలలో అనేకసార్లు తానూ దేవుని ఇంటిలో  గృహనిర్వాహకుడు అనియు, తాను కోరుకోకపోయినా గృహనిర్వాహకత్వము తనకు దొరికింది అది ఎవరూ ఇవ్వలేదు దేవుడే ఇచ్చారు అనియు మనము చూడగలము!!!

 

1కొరింథీ 9:17

ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

 

ఎఫెసీయులకు 3: 2

మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక, గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

కొలస్సీ 1:26

మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు (గృహనిర్వాహకత్వము) ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.

 

పేతురు గారు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు 1పేతురు 4:10

దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

 

సరే, ఇక్కడ ఒక విషయం నిర్ధారణకు వచ్చింది! దైవసేవకులు అందరూ దేవుని గృహంలో గృహనిర్వాహకులు! అయితే 2వ వచనంలో గృహనిర్వాహకులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం కోసం పౌలుగారు రాస్తున్నారు!!! మరియు గృహ నిర్వాహకులలో ప్రతీవాడును నమ్మకమైన వాడై ఉండాలి!!! ఇది ముఖ్య లక్షణం! ప్రతీవాడు నమ్మకమైన వాడుగా ఉండాలి, ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు!!!  అనగా దైవసేవకులు ప్రతీఒక్కరు దేవుని సేవలో దేవుని గృహంలో పరిచారకత్వంలో తప్పకుండా నమ్మకముగా ఉండాలి, లేక విశ్వతనీయత కనపరచాలి!!!

 

గమనించాలి దేవుని ఇంటిలో మొట్టమొదటి గృహనిర్వాహకుడు యేసుక్రీస్తుప్రభులవారు ఆయన తండ్రియైన దేవునికి నమ్మకముగా ఉన్నారు అని హేబ్రీపత్రికలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు 3:2,5,6

Hebrews(హెబ్రీయులకు) 3:2,5,6

 

2. దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థ ముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

అలాగే సేవకులు కూడా అందరూ నమ్మకముగా ఉండాలి!!

 

యేసుక్రీస్తు ప్రభులవారు ఎన్నో ఉపమానాలు గృహనిర్వాహకుల కోసం చెప్పారు, ......

మత్తయి 24; లూకా 16;

వారిలో కొందరిని భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిచారు!!!

మత్తయి 25:21, 23, లూకా 19:17

 

Matthew(మత్తయి సువార్త) 25:21,23

21.అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

23.అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

 

ప్రతీ విషయంలోనూ నమ్మకముగా ఉండాలి అంటున్నారు దేవుడు  లూకా 16:10,

లూకా 16: 10

మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

 

గృహనిర్వాహకత్వతము- నమ్మకము కోసం చూసుకుంటే మొదట మనకు గుర్తుకు వచ్చేది- యోసేపు గారు! గతశీర్షిక ఫలించేది కొమ్మ లో మనం ధ్యానం చేశాము- పోతీఫర్ ఇంటిలో నమ్మకముగా ఉన్నందువలనే గృహనిర్వాకునిగా చేశాడు పోతీఫర్! అలాగే జైలులో నమ్మకముగా ఉన్నందువలన జైలు నిర్వాహకునిగా లేక గృహనిర్వకత్వము దొరికింది! అక్కడ నమ్మకముగా ఉన్నారు- చివరికి ఐగుప్తు దేశము యొక్క గృహనిర్వాహకత్వము దొరికింది యోసేపు గారికి!!

 

ఇక ఏ ఏ విషయాలలో నమ్మకముగా ఉండాలి అంటే యేసుక్రీస్తుప్రభులవారి ఉపమానాలలో సిరియందు  నమ్మకముగా ఉండాలి...

ధనము విషయము నమ్మకముగా ఉండాలి.

లూకా 16: 12

మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

 

ఇంకా దాసులకు పెట్టుటలో పోషించుటలో నమ్మకముగా ఉండాలి...

Matthew(మత్తయి సువార్త) 24:45,46,47

45. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

47. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

సరియైన సమయమునకు నీ మందకు మేత పెట్టాలి! ఎప్పుడూ ఒకేరకమైన మేత కాకుండా బైబిల్ మొత్తంలో తీసుకుని మేత పెట్టాలి! అవసరమైనప్పుడు ఖండిచి గద్దించి బుద్ధిచెప్పే మేత పెట్టాలి!

తిమోతి పత్రికలు రెండు, తీతు పత్రిక ఈ మూడు పత్రికలు పౌలుగారు గృహనిర్వాహకత్వపు భాద్యతలు తిమోతి గారికి తీతుకు గారికి అప్పగిస్తూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పినవే! అనగా గృహనిర్వాకత్వము యొక్క భాద్యతలు మొత్తం ఈ మూడు పత్రికలలో ఎన్నో ఉన్నాయి!

 

కాబట్టి ప్రియ దైవజనుడా! గృహనిర్వాహకత్వము నీకు అనుగ్రహించబడింది గనుక నీవు నమ్మకముగా ఉంటున్నావా?

 

చివరిగా చివరి సాతాను- యేసుక్రీస్తుప్రభులవారి యుద్ధంలో యేసుక్రీస్తుప్రభులవారు విజయం సాధించటానికి కారణం ప్రకటన గ్రంధంలో రాస్తూ మొదటగా యేసుక్రీస్తుప్రభులవారు రాజులరాజు ప్రభువులకు ప్రభువు అని చెబుతూ, తనతో ఉన్నవారు పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును చివరగా నమ్మకమైన వారు కాబట్టి ఆ యుద్ధంలో విజయం కలిగింది!

ప్రకటన గ్రంథం 17: 14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

 

మరి ఓ గృహ నిర్వాహకుడా! దేవుని గృహంలో గృహనిర్వాహకత్వమునకు నీవు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు, అయితే నీవు నమ్మకముగా ఉంటున్నావా???!!!

యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు:

మత్తయి 22: 14

కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

 

కాబట్టి నీవు నమ్మకముగా ఉన్నావా లేక లోకముతో కలిసిపోతున్నావా??

ధనము నిన్ను ఆకర్షిస్తుందా?

 పేరు ప్రతిష్టలు నిన్ను దారి తప్పిస్తున్నాయా?

లేక లోకాశలు నిన్ను బ్రష్టు పట్టిస్తున్నాయా??!!

 ఒకసారి పరిశీలించుకుని ఒకవేళ గృహనిర్వాహకత్వములో ఏదైనా తేడా కనిపిస్తే ఇప్పుడే దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని సమాధాన పడు! లేకపోతే సోమరియైన చెడ్డదాసుడా అని పిలిపించుకుని అగ్నిగుండములో వేయబడతావు!!

మత్తయి 25: 26

అందుకు అతని యజమానుడు వానిని చూచి: సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?

మత్తయి 25: 30

మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

 

అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంది అని మర్చిపోవద్దు!

నేడే రక్షణ దినము!

ఇదే అనుకూలసమయము!!!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*39వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-9*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 4వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! గతభాగంలో గృహ నిర్వాహకత్వము దైవసేవకులకు అప్పగించబడింది కాబట్టి మొదటగా నమ్మకముగా ఉండాలని ధ్యానం చేసుకున్నాము! మోషేగారు దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు ప్రతీ దైవసేవకుడు దేవుని సేవా పరిచర్యలో నమ్మకముగా ఉండాలని ధ్యానం చేసుకున్నాము!

 

  కారణం: వారు బోధించే వర్తమానాలు వారి సొంతవి కాకూడదు! పౌలుగారు గాని లేక ఇతర అపోస్తలులు గాని వారు బోధించిన సువార్త వారు కల్పించి చెప్పలేదు! దేవుడు వారికి ఏమి నేర్పించారో ఏవి వెల్లడించారో అవే చెప్పారు, అవే రాశారు! కాబట్టి బోధయందు నమ్మకముగా ఉండాలి! విశ్వాసులు కూడా ఈ విషయం గ్రహించి అందరూ దైవసేవకులు దేవునికి సమానమని కొందరు ఎక్కువ కొందరు తక్కువ అని భావించకూడదు అని పౌలుగారు చెప్పారు!

1కొరింథీ 2:7

దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,7,10

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

 

రోమా 16:25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

గలతీ 1:1112

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

Ephesians(ఎఫెసీయులకు) 3:2,3

2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక, గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

ఇక మూడవ వచనంలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకోను ఎందుకంటే నాలో నాకు ఏ దోషము పాపము కనబడదు, నాలో నాకు ఏదోషము కనబడటం లేదు కనుక నేను నీతిమంతుడిగా ఎంచబడతానా అంటే కానేకాదు! విమర్శించవలసినది దేవుడే అంటున్నారు!

 

ఇక 5వ వచనంలో సమయం రాకముందు అనగా ప్రభువు వచ్చేవరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చవద్దు అంటూ ఎందుకంటే దేవుడు ఆ తీర్పు తీర్చు సమయంలో అందకారమందలి రహస్యాలు వెలుగులోనికి తెచ్చి హృదయాలను దాని ఆలోచనలను బయలుపరచేటప్పుడు ప్రతీవానికి మెప్పు దేవునివలన మాత్రమే కలుగును అంటున్నారు!

 

ఇక్కడ కొరింథీ సంఘస్తులు తనలో విశ్వసనీయత లేక సంఘము పట్ల దేవునిపట్ల నమ్మకత్వము ఉన్నదో లేదో అని అనుకుంటున్నారు అని పౌలుగారికి పట్టింపు లేదు ఎందుకంటే తాను, తనకుతానుగా ఈ పరిచర్యకు రాలేదు! దేవుడు తనకుతానుగా పౌలుగారికి దమస్కు మార్గములో కనబడి తనకు బుద్ధిచెప్పి తన సాధనముగా ఏర్పాటుచేసుకుని తన మార్గమును ఆయనకు నేర్పించారు! ఇది మనకు గలతీ పత్రికలో ఆయన స్వయముగా చెప్పారు!  కాబట్టి ఇప్పుడు తాను కొరింథీ సంఘముయొక్క గృహ నిర్వాహకుడు! తాను దైవసేవకుడు! కొరింథీయులకు కాదు!క్రీస్తుకు సేవకుడు! కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసు తనను కొరింథీ సంఘానికి పంపించి తనకు కొరింథీ ప్రజలకు ఏమి ఉపదేశించాలో నేర్పించారు అదే వారికి చెప్పారు పౌలుగారు! ఇప్పుడు దేవుడు నేర్పించిన సందేశాలు కొరింథీ వారికి ఉపదేశించారా లేదా అనేది, జవాబు పౌలుగారు క్రీస్తుయేసు ప్రభులవారికి జవాబు చెప్పాలి గాని కొరింథీ ప్రజలకు కానేకాదు! దురదృష్టవశాత్తూ నేడు అనేక సంఘాలలో దైవసేవకులు సంఘపెద్దలకు జవాబు చెప్పవలసి వస్తుంది! సంఘపెద్దలు ఎలా చెప్పమంటే అలా చెబుతున్నారు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు దైవసేవకులు! ముఖ్యంగా సంఘములో జీతమునకు పనిచేస్తున్న దైవ సేవకులలో అనేకులు!!!  ఇది బైబిల్ నేర్పిన సత్యము కాదు, బైబిల్ బోధించే పద్దతి కూడా కాదు! దేవుడు చెప్పమన్నవి దేవుడు బైబిల్ లో వ్రాసినవి ఉన్నది ఉన్నట్లుగా విశ్వాసులకు బోధించాలి నేర్పించాలి! అవసరమైతే ఖండించి గద్దించి బుద్ధిచెప్పి మరీ నేర్పించాలి! 2తిమోతి 4:1--3; అలాచేస్తే సంఘమునుండి తనను తరిమేస్తారు అని దైవసేవకులు భయపడుతున్నారు గాని నిజంగా అలా చేస్తున్న దైవసేవకులు విశ్వాసులను నరకములోనికి పోకుండా కాపాడుతున్నారు అని ప్రతీ విశ్వాసి గ్రహించాలి!

 

4వ వచనంలో  నాలో నాకు ఏ దోషము కనబడదు అంటున్నారు! అవును మనకు మనము పరిశీలించుకుంటే మనకు మనలో ఏ తప్పు కనబడదు! అందుకే సామెతల గ్రంధంలో ఇలా ఉంది... అయితే అది చివరికి నాశనమునకు నడిపిస్తుంది. ...

సామెతలు 14: 12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

సామెతలు 16: 2

ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.

 

మనకు మనం నీతిమంతులం మిగతావారు పాపులు అనుకుంటారు అయితే అది తప్పు అంటున్నారు!

5వ వచనంలో ఒకరోజు ప్రతీ విషయము అనగా అంధకారములో ఉన్న సంగతులు దేవుడు బయలుపరచినప్పుడు ప్రతీవానికి మెప్పు ప్రభువు వలన కలుగుతుంది!

 

ఈ వచనంలో మూడు విషయాలు కనిపిస్తాయి మనకు!

 

మొదటిది: దేవుడు అందకారమందలి విషయాలు ఒకరోజు బయలుపరుస్తారు! లేక ప్రతీ మానవుని హృదయంలో ఉన్న రహస్యాలు ఒకరోజు బట్టబయలు కాబోతున్నాయి!

 

రెండు: దేవుడు ఒకరోజు వారివారి క్రియల చొప్పున మెప్పు లేక ఘనత ఇవ్వబోతున్నారు!

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

 

మొదటి విషయం చూసుకుంటే దేవుడు ఒకరోజు ప్రతీ విషయానికి తీర్పు తీరుస్తారు! అందుకే మనుష్యులు చేసే ప్రతీ పనికి ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి అని బైబిల్ చెబుతుంది! చివరికి మనిషి పలికే వ్యర్ధమైన ప్రతీమాటకు కూడా లెక్క అప్పగించాలి!

 

రోమీయులకు 14: 12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

 

మత్తయి 12:36

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

 

ప్రసంగి 12: 14

గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

 

అందుకే ప్రసంగీ ఇలా పలుకుతున్నాడు: యవ్వనుడా నీ యవ్వనంలో నీ ఇష్టమొచ్చినట్లు ఉండు అయితే ఒకరోజు నీవు చేసిన ప్రతీ కార్యమును దేవుడు లెక్క అడుగుతాడు!!!

 

ప్రసంగీ 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

రెండు: ఒకరోజు దేవుడు నీవు మంచి చేస్తే ఘనత ఇవ్వబోతున్నారు! ఇది బహుశా గొర్రెపిల్ల పెండ్లి విందులో మధ్యాకాశములో దేవుడు ఇచ్చే అవార్డ్ ఫంక్షన్ సెరెమనీ లో ఉంటుంది అని కొందరి బైబిల్ పండితుల ఉద్దేశం! నేను కూడా దీనిని నమ్ముచున్నాను! బైబిల్ గ్రంధంలో దేవుడు చెప్పిన భళానమ్మకమైన మంచిదాసుడా సన్నివేశం ఆ రోజులలోనే జరుగుతుంది!

మీద చూపిన రిఫరెన్సులు ప్రకారం అప్పుడు నీవు సేవచేసిన లేక ఎంత నమ్మకముగా దేవునికి పనిచేశావో ఎందరిని దేవుని దగ్గరికి నడిపించావో ఎంత ప్రయాసపడ్డావో దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు!

 

మరినీవు దేవునికోసం కష్టపడుతున్నావా ప్రియ సహోదరీ సహోదరుడా!!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*40వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-10*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనం 5వ వచనంలో మూడు ప్రాముఖ్యమైన విషయాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

మొదటిది: దేవుడు అందకారమందలి విషయాలు ఒకరోజు బయలుపరుస్తారు! లేక ప్రతీ మానవుని హృదయంలో ఉన్న రహస్యాలు ఒకరోజు బట్టబయలు కాబోతున్నాయి!

 

రెండు: దేవుడు ఒకరోజు వారివారి క్రియల చొప్పున మెప్పు లేక ఘనత ఇవ్వబోతున్నారు!

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

 

         (గతబాగం తరువాయి)

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

ఇక పౌలుగారు చెబుతున్న మరోమాట: ప్రభువు రాకముందు ఎవరికీ తీర్పు తీర్చకండి!

 

 చాలామంది వీరు అలాగా వారు అలాగా అంటూ తీర్పులు తీరుస్తుంటారు, ఇలా చెయ్యకూడదు అంటున్నారు పౌలుగారు!!  తీర్పు తీర్చడం మన పని కాదు! అది దేవుని పని! చివరికి మనకు మనమే తీర్పు తీర్చకూడదు! దేవునిపనిని దేవుణ్ణి చేయనియ్యండి! మనపని మనము చేద్దాం! దేవుడు ప్రతీ మనిషికి ఏ పనిని అప్పగించారో ఆ పనినే చెయ్యాలి! అంతేకాదు అలా చేసేటప్పుడు ఆవ్యక్తి యొక్క ఉద్దేశాలు మానసిక పోరాటాలు పరీక్షలు బాధలు అన్నీ ఆ వ్యక్తికే తెలుసు మరియు దేవునికి తెలుసు! కాబట్టి ఇతరులకోసం మనము తీర్పు తీర్చకూడదు! ఈ విషయాన్ని యాకోబు గారు కూడా రాస్తున్నారు!

 

యాకోబు 4:1112

11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి (తీర్పరివైతివి).

12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్పరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

 

 11,12 వచనాలలో ప్రాముఖ్యమైన విషయం కోసం రాస్తున్నారు! తన సహోదరుడు చేసిన పనులకోసం చాడీలు / కామెంట్లు/ జడ్జిమెంట్లు ఇస్తారు కదా- వారికోసం చెబుతున్నారు!

 

   పదకొండులో అంటున్నారు: సహోదరులారా! ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి! తన సహోదరునికి వ్యతిరేఖంగా మాటలాడి తన సహోదరునికి తీర్పుతీర్చువాడు ధర్మశాస్త్రానికి  తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చితే ధర్మశాస్త్రాన్ని పాటించే వాడివి కాదు గాని న్యాయాన్ని విధించేవాడవు అయిపోయావు!!!

 

జాగ్రత్తగా గమనిస్తే ఎవడైనా తన సోదరునికి వ్యతిరేఖంగా మాట్లాడితే వాడు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చేవాడు అయిపోతాడు అని పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నారు యాకోబు గారు! ఇలా అయితే మనము చాలాసార్లు తప్పులు చేశాము కదా! చాలామంది ఆడవారు మధ్యాహ్నం ఒకదగ్గర కూర్చుని అది ఇలాగ, ఇది ఇలాగ, ఆ స్త్రీకి వాడితో లింకు ఉంది, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటూ మాటామంతి వేసుకుంటారు! వీటిలో నూటికి ఎనబైశాతం తమకోసం మాట్లాడుకుంది బహుశా 20% ఉంటాదేమో! కాని ఇతరుల కోసం మాట్లాడుకుంది 80% ఉంటాది! మరి అలాంటప్పుడు ఈ అమ్మలక్కలు ప్రతీరోజు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చి జడ్జీలు అయిపోతున్నారు అన్నమాట! ఇది మంచిది కాదు ఇలా చెయ్యకూడదు, కాబట్టి మీరు ఒకరికి విరోధముగా మాట్లాడుకోవద్దు అంటున్నారు! ఇక్కడ ఒకమాట జాగ్రత్తగా గమనించాలి! మరొకరి కోసం మాట్లాడుకోవద్దు అని చెప్పడం లేదు! మానవుడు సంఘజీవి! మామూలుగా ఇతరులకోసం కూడా మాట్లాడుకోవడం మానవనైజం! అయితే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే: నీ సోదరునికి లేక సోదరికి లేక పొరుగువారికి వ్యతిరేఖంగా మాట్లాడుకోవద్దు! అది తప్పు, నీవు ధర్మశాస్త్రానికంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకుని ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు అంటున్నారు! ఇంకా పన్నెండో వచనంలో అంటున్నారు: నిజానికి ధర్మశాస్త్రమును నియమించి న్యాయాన్ని విధించువాడు ఒక్కడే, ఆయనే రక్షించుటకు శిక్షుంచుటకు నశింపజేయుటకు సమర్ధుడు! అసలు పరులకు తీర్పు తీర్చడానికి నీవెవడవు అని సూటిగా అడుగుతున్నారు!!

 

ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే- ఇలా వీడిమీద వాడిమీద చాడీలు చెప్పే డ్యూటీ ఎవరిదీ? యోబు 1,2 అధ్యాయాల ప్రకారం సాతాను గాడిది! ఒరేయ్ సాతానుగా సాతానుగా- నీవు ఎక్కడనుండి వచ్చావురా అని దేవుడు అడిగితే నేను భూమిమీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వస్తున్నాను అన్నాడు వాడు! విశ్వాసులు చేసిన పనులన్నీ దేవునికి చాడీలు చెప్పే డ్యూటీ వాడిది! బాగున్న వారిని పాడుచేసే డ్యూటీ వాడిది! మరి ఇప్పుడు విశ్వాసి- అనగా దేవుని బిడ్డ- సాతాను గాడి పని చెయ్యడమేమిటి బుద్ధి శుద్ధి లేకుండా!!! విశ్వాసి పవిత్రుడు పరిశుద్ధుడు కడుగబడిన వాడు! దేవుని వాడు- మరి ఇప్పుడు ఆ విశ్వాసి దేవునికోసం పనిచెయ్యాలి గాని సాతానుగాడి కోసం పనిచెయ్యడం ఏమిటండి?!!!  ఇదీ యాకోబు గారి ప్రశ్న! మనలో ఎవరైనా మరొకరికి వ్యతిరేఖంగా మాట్లాడితే అతడు లేక ఆమె ఆ వ్యక్తికీ తీర్పు తీర్చేస్తున్నారు! అసలు నిన్నువలె లేక తననువలే ఇతరులను ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంటే (యాకోబు 2:8), ప్రేమించడం మానేసి ఇతరులకు తీర్పు తీర్చే స్టేజికి నీవు వచ్చేశావు! అంటే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు సరికదా- ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు! ధర్మశాస్త్రం కంటే నిన్ను నీవు హెచ్చుంచుకుని ధర్మశాస్త్రం కంటే పైవాడుగా పైదానిగా నిన్నునీవు చేసేసుకుని- తీర్పు తీర్చేస్తున్నావు, అంటే ధర్మశాస్త్రానికి నీ దగ్గర ఏమీ ప్రాధాన్యత లేదు అన్నమాట! జడ్జీలకే పెద్ద జడ్జివి అన్నమాట నీవు!

నిజానికి తీర్పు తీర్చేవాడు దేవుడు! ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, నియమించింది, శాసించింది దేవుడు నిర్గమ 20:1 ప్రకారం! ఈ మాటలు దేవుడే పలికాడు! అనగా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమునకే నీవు తీర్పు తీర్చేస్తున్నావు అన్నమాట!

 

యెషయా 33:23 లో అంటున్నారు: యెహోవాయే మనకు న్యాయమూర్తి, యెహోవాయే శాసనకర్త, ఆయనే మనకు రాజు! ఆయనే మనలను రక్షించువాడు! మరి ఇప్పుడు దేవుని పనిని నీ చేతులలో తీసుకుంటున్నావు! ఇది నీకు మంచిదా? దేవుని కంటే నీవు గొప్పోడివా గొప్పదానివా?!!!

దేవుడు రక్షించడానికి నాశనం చెయ్యడానికి సమర్ధుడు! మరి నీవు అలా రక్షించే కెపాసిటీ నీకేమైనా ఉందా? నాశనం చేసే కెపాసిటీ నీకేమైనా ఉందా? అలాంటప్పుడు ఈ కామెంట్లు జడ్జిమెంట్లు ఎందుకు?

 

మత్తయి 10: 28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

యెషయా 43: 11

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

యెషయా 43: 12

ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

 

యోబు 5: 18

ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు... మత్తయి 7:12

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

 

పౌలుగారు కూడా అంటున్నారు:

రోమా 14:4, 1013

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.

11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.

 

అందుకే యాకోబు గారు 5:9 లో అంటున్నారు మీకు శిక్షావిధి రాకుండా ఉండాలంటే ఒకనిమీద ఒకడు సణుగుకోవద్దు! కారణం న్యాయమూర్తి తలుపుదగ్గరే నిలుచిని ఉన్నారు! జాగ్రత్త!!!

ద్వితీ 32:36 ఆయన తన ప్రజలకు న్యాయం తీరుస్తారు అంటున్నారు

కీర్తన 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

 

కీర్తనలు 50: 6

దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

 

కీర్తనలు 98: 9

భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

 

హెబ్రీ 12:23

పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,

 

గమనించాలి ఒకరోజు నీవు నేనుక్రీస్తు న్యాయపీఠం వద్ద నిలబడాలి!

ఆరోజు నీవు నిందారహితునిగా కనబడాలి అంటే ఇతరులకు తీర్పు తీర్చడం మానేయ్!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*26వ భాగము*

1కొరింథీ 2:610

6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక (మూలభాషలో- ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని

7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.

9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనము దేవుడు మనకు ఎలాంటి జ్ఞానము అనుగ్రహించారో ధ్యానము చేసుకుంటున్నాము! అది ఈలోక జ్ఞానుల కంటే మిన్నైన జ్ఞానము అనియు, అది లోకాధికారులకు లేదు అనియు, అది మరుగైయున్న జ్ఞానము అనియు, అది భౌతికమైనది కాదు అది ఆధ్యాత్మిక మైనది అనియు, అది ఈ ప్రపంచాన్ని సృష్టించక ముందే తన విశ్వాసుల కోసం దేవుడు నియమించారు అనియు, ఈ విషయం తెలిసి ఉంటే లోకాధికారులు యేసుక్రీస్తుప్రభులవారిని సిలువవేసి ఉండకపోదురు అనియు ధ్యానం చేసుకున్నాము!

 

      (గతభాగం తరువాయి)

 

ఇక 910 వచనాలలో చెబుతున్నారు: ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడింది అంటున్నారు! జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఆ జ్ఞానము అనగా మరుగైయున్న జ్ఞానము  మనకు ఇచ్చారు, ఇంకా బోలెడు మనకోసం అనగా తన్ను ప్రేమించు వారికోసం దేవుడు సిద్దపరచిన అమోఘమైన విషయాలు వస్తువులు కార్యములు సిద్ధపరిచారు అయితే అవి మానవుల కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మానవుల హృదయాలకు గోచరం కావు అనగా అర్ధం కావు అంటున్నారు పౌలుగారు! అవును కదా ఈ జ్ఞానమే ఇంతటి అమోఘమైనదైతే ఆయన సిద్దపరచినవి మరెంతటి అమోఘమైనవి మహిమగలవి ఘనమైనవి!!

దేవుని జ్ఞానము దేవుని ప్రేమ మనకు అర్ధం కాదు!

 

అందుకే సోదెగాడు మొట్టమొదట అన్యజనులలో నుండి ఏర్పరచబడిన దేవుని ప్రవక్త బిలాముగారు అంటున్నారు: ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు.......

సంఖ్యాకాండము 24:17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరిని నాశనము చేయును.

 

ఆయనను అనగా దేవుని జ్ఞానమైన, మరుగైయున్న క్రీసును, క్రీస్తుయేసు సిలువ సత్యాన్ని జ్ఞానమును చూసి పరవశించిపోయి ప్రవచిస్తున్నాడు ఆయన!

 

అలాగే కీర్తనాకారుడు ఆయన ప్రేమను ఆయన జ్ఞానమును ఆయన సృష్టిని చూసి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపడుతూ 139 వ కీర్తన రాశారు!  ఇట్టి తెలివి నాకు మించినది అది నాకు అందదు నాకు అగోచరము అంటున్నాడు కీర్తనాకారుడు , ఇంకా నన్ను కలుగజేసిన విధానం చూస్తే నాకు భయమును వణకును  ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటున్నారు.....116

1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు

2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

4. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు.

6. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.

7. నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును?

8. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10. అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11. అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12. చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండ లేదు

16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

 

ఇంతటి గొప్ప దేవుడు, భయంకరుడైన దేవుడు ప్రేమగల దేవుడు మనుష్యులను ప్రేమించారు! అందుకే తానుండే స్థలములో మనలను లేక విశ్వాసులను కూడా ఉండాలి అని ఆశించే భూలోకమును అందముగా చేసుకున్నారు! గాని సాతాను ప్రోద్భలముతో మానవుడు పడిపోగా అప్పుడు తానుండే పరలోకములో మనము ఉండేలాగా ఆయన సొంతకుమారుని బలిగా చేసి, రక్షణ ప్రణాళిక ఏర్పాటుచేసి మనలను తనకోసం పిలచుకున్నారు! ఇక ఆ పరలోకంలో రాబోయే విశ్వాసుల యొక్క స్వాస్త్యము భాగ్యము ఎలాంటిదో మనకు ప్రకటన గ్రంధంలో ఎంతో వివరంగా వ్రాయబడింది...

దేవుడు మనకొరకు సిద్దపరచినవి ఏమిటో అవి కన్నులకు కనబడవు, చెవులకు వినబడవు హృదయాలకు గోచరం కావు!

 

యెషయా 64: 4

తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

 

అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు, ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించు చున్నాడు అని పరిశుద్దాత్ముని కోసం చెబుతున్నారు పౌలుగారు! ఇక్కడ పౌలుగారు చెబుతున్న ఈ జ్ఞానం మనిషి తెలివితేటల వలన గాని వేదాంత శాస్త్రము వలన గాని తర్కశాస్త్రము వలన గాని మనుషులకు దొరకదు అర్ధం కాదు! మతాలు తరచినా, వ్రతాలు కొలిచినా, నిగూఢవాదాన్ని వెదకినా, క్షుద్రశక్తులను నేర్చినా ఈ జ్ఞానము దొరకదు! కేవలం దేవుని ఆత్మవలన మాత్రమే ఇది దొరుకుతుంది! దీనిని పొందేటందుకు మరో మార్గం లేనేలేదు! యొహాను 16:1315 దీనికోసం వ్రాయబడింది!

13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

15. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

 

అయితే ఆయన ఆత్మను పొందగలిగే ఏకైక మార్గము క్రీస్తుయేసు నందు విశ్వాసముంచి నమ్మి భాప్తిస్మం పొందటమే! అప్పుడే మనకు పరిశుద్దాత్ముడు లభిస్తాడు! ఆ పరిశుదాత్మను పొందుకున్న తర్వాతనే మనకు దేవుడు మనకోసం సిద్దపరచిన మేలులు పొందుకోగలము కారణం పరిశుద్ధులు మాత్రమే ఆ పరలోకములో చేరగలరు పరలోక విషయాలలో పాలుపొందగలరు!!!

 

ఆయన మనకోసం సిద్దపరచిన తేజోవాసుల స్వాస్త్యములో, గొర్రెపిల్ల పెండ్లివిందులో పాలుపొందుకుని, తండ్రియైన దేవునితోను మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారితో సహవాసం చేస్తాము, వారితో పాటుగా పాతనిబంధన పరిశుద్ధులు క్రొత్త నిబంధన పరిశుద్ధులు అనగా నోవాహు గారు, హనోకుగారు అబ్రాహాము గారు దావీదు గారు ఏలీయా గారు ఎలీషా గారు యెషయా గారి లాంటి పాత నిబంధన పరిశుద్దులే కాదు పేతురు గారితో పౌలుగారితో యోహాను గారితో చాటింగ్ చేస్తాము ప్రత్యక్షంగా! ఇంకా మన మరణించిన  ప్రియులను ఆత్మీయులను  గొప్పగొప్ప దైవసేవకులను కలుసుకోగలము! ఇంకా దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు తినగలము, రెండో మరణం మనలను ఏమీ చెయ్యదు, మరుగై ఉన్న మన్నా తింటాము, తెల్లని రాయి దానిమీద చెక్కబడిన దేవుడు మనకిచ్చే పేరు, ఇంకా వెయ్యేండ్ల పాలనలో ప్రజలమీద అధికారము, దేవుడు నిన్ను కమీషనర్ గానో, పెద్ద అధికారి గానో జిల్లాకు కలెక్టర్ గానో చేస్తారు, వేకువచుక్కను పొందుకుంటావు, ఇంకా దేవుడు ఇచ్చే తెల్లని వస్త్రాలు పొందుకుంటావు, జీవ గ్రంధములో నుండి నీ పేరు ఎంతమాత్రం తుడచివేయబడదు, ఇంకా దేవుని ఆలయములో ఒకస్తంభముగా చేస్తారు నిన్ను, దేవుని పేరు నీ మీద వ్రాయబడుతుంది చివరిగా  యేసుక్రీస్తు ప్రభువుల వారితో   పాటుగా ఆయనతో కూడా ఆయన ప్రక్క కూర్చునే అవకాశం పొందుకుంటావు! ఇంతటి అమూల్యమైన అమోఘమైన విషయాలు దేవుడు మనకోసం దాచి ఉంచారు అక్కడ ఆకలిదప్పులు కష్టాలు ఉండవు రోగాలు ఉండవు ఎల్లప్పుడూ స్తుతుల రాగాలు మాత్రమే ఉంటాయి!!

 

మరివాటిని పొందుకోవడానికి నీవు సిద్దంగా ఉన్నావా? సిద్దపడి ఉన్నావా? లేకపోతే నేడే మారుమనస్సు పొంది పశ్చాత్తాప పడి దేవునితో సమాధాన పడి ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన రాకడకు సిద్దపడు!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*27వ భాగము*

 

1కొరింథీ 2:1013

10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.

12. దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.

13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! రక్షించబడిన విశ్వాసి ఎటువంటి జ్ఞానం పొందుకున్నాడో చూసుకుంటూ ఆ జ్ఞానము మరుగైనదనియు ఆధ్యాత్మికమైనదనియు చూసుకుంటూ దానిని మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఆ మరుగైన జ్ఞానమును అర్ధము చేసుకోగలము అని చూసుకున్నాము!

 

ఇంకా ముందుకుపోయే ముందు ఈ మొదటి రెండు అధ్యాయాలలో పౌలుగారు ఒక విషయాన్ని ఆత్మద్వారా చెబుతున్నారు: ఈ లోక జ్ఞానము వేరు, పరలోక జ్ఞానము వేరు! పరలోక ఆధ్యాత్మిక జ్ఞానము కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మనకు దొరుకుతుంది! అయితే  ఆ జ్ఞానము మరెవరో కాదు యేసుక్రీస్తుప్రభులవారే!!  యోహాను పత్రిక ప్రకారం మనకు యేసుక్రీస్తుప్రభులవారే వాక్యము! ఆయనే వాక్యమై యున్న దేవుడు! కుమారుడై యున్న దేవుడు అని మనకు అర్ధమైతే ఈ కొరింథీ మొదటి పత్రిక రెండు అధ్యాయాల ద్వారా మనకు అనాదినుండి మరుగైయున్న జ్ఞానముగా యేసుక్రీస్తు ప్రభులవారు మనకు కనిపిస్తారు!

 

  ఇక 10వ వచనంలో ఈ జ్ఞానము దేవుడు మనకు తన ఆత్మవలన బయలుపరిచారు! ఆ పరిశుద్ధాత్మ అన్నింటిని అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అంటున్నారు! దీనికోసం మరింతగా చూసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు దేవుని మర్మములను ఎలా పరిశోధించగలుగుతున్నాడు అంటే:

 మొదటగా ఆయన అనగా పరిశుద్ధాత్ముడు- దేవుడు! త్రిత్వములో ఒక వ్యక్తిత్వము! తనకుతానుగా శక్తి ప్రభావాలు గలవాడు! ఆయనకు కూడా జ్ఞానముంది!! 

 

రెండవది: యోహాను 16:1315 ప్రకారం యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పారు- నేను వెళ్ళిపోయాక మీ వద్దకు సత్యస్వరూపియగు ఆత్మను ఆదరణ కర్తను పంపుతాను అతడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అంటూ తనంతట తానూ ఏమీ చెప్పడు గాని నా వాటిని తీసుకుని మీకు చెబుతాడు అంతేకాకుండా తండ్రియైన దేవుని దగ్గర విని ఆయన చెప్పినవి కూడా మీకు చెబుతాడు ఇంకా జరుగబోయేవి మీకు ముందుగానే చెబుతాడు అని చెప్పారు!!!..

John(యోహాను సువార్త) 16:13,14,15

 

13. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

15. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

 

అనగా ఇప్పుడు పరిశుద్దాత్మునికి శక్తి బల ప్రభావాలు ఉన్నాగాని తండ్రితోను కుమారునితోను సంభాషించి మనకు వారి హృదయాన్ని అర్ధం చేసుకుని మనకు వివరిస్తాడు పరిశుద్దాత్ముడు!!! ఇంకా మనకు దేవుణ్ణి ఎలా అడగాలో మనకు తెలియదు కాబట్టి మన బలహీనతల యందు మనకు సహాయం చేసి ఎలా ప్రార్ధనచేయాలో మనకు నేర్పిస్తాడు!...

రోమీయులకు 8: 26

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.

 

ఈ రకంగా ఆ మరుగైయున్న జ్ఞానమును తండ్రియైన దేవుడు మనకోసం సిద్దపరచిన స్వాస్థ్యమును పొందుకోడానికి అన్నివిధాల సహకరిస్తాడు పరిశుద్దాత్ముడు!!!

 

ఇక 11వ వచనంలో ఒక మనుష్యుని సంగతులు మనిషికి లేక మనుష్యాత్మకు ఎలా తెలుసో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు అంటూ వివరిస్తున్నారు! పరిశుద్దాత్మ దేవుడు ఒక ఉద్రేకం, ఒక పూనకం కానేకాదు! ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను నడిపిస్తూ అన్నివేళలా అన్నివిధాలా నీకు సహకరించే వాడు! కాబట్టి నీకు ఏమి కావాలో దేవుని సంగతులు తీసుకుని వాటిని నీకు విశిధపరచి నిన్ను గమ్యమునకు నడిపిస్తాడు! 

అంతేకాదు అలా తండ్రివిషయాలు కుమారుని విషయాలు తీసుకుని బలమైన కార్యాలు మనుష్యుల ద్వారా చేయిస్తాడు!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:7,8,9,10,11

 

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

మనుష్యుల సంగతులు మనిషికే అర్ధమవుతాయి! అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్ధమవుతాయి! అందుకే దేవుడు మనిషికి తనరాజ్యములో చేర్చడానికి అలా చేరాలంటే ఎలాంటి జీవితం జీవించాలో ఏవి పొందుకోవాలో అర్ధం కావడానికి మనిషికోసం తన ఆత్మను భూలోకమునకు పంపించారు! ఆ పరిశుద్దాత్మను పొందుకుంటే దేవుని సంగతులను నీవు అర్ధం చేసుకోగలవు!!! ఇంకా చెప్పాలంటే మనిషి కోసం మనిషికే తెలుస్తుంది కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు ఆత్మస్వరూపిగా ఈ భూలోకమునకు రాలేదు, ఇంకా మరో రూపంలో అనగా సింహముగానో ఏనుగు గానో మరో విధంగా రాలేదు గాని మనిషిని అర్ధం చేసుకోవడానికి మనుష్యులు తనను అర్ధం చేసుకోవాలంటే మనిషిగా పుట్టాలని మనిషిగా ఈ భూలోకమునకు వచ్చి మనిషిలా బ్రతికి మనలాగే కష్టసుఖాలు అనారోగ్యాలు ఆకలిదప్పులు శ్రమలు నిందలు భాధలు అన్నీ అనుభవించారు! అందుకే కేవలం యేసుక్రీస్తుప్రభులవారే మనిషిని అర్ధం చేసుకోగలరు! ఆయన దైవమానవుడు! అనగా దేవుడు మరియు మనిషి! ఇప్పుడు మనిషి దేవుని విషయాలు ఎలా పొందుకోగలడు? ఎలా అర్ధం చేసుకోగలడు అనగా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే! ఆ ఆత్మను పొందుకోవడం వలన మాత్రమే! అందుకే పరిశుద్ధాత్మను ప్రతీ ఒక్కరు పొందుకోవాలి!!! ఆయానాత్మలేనివాడు ఆయనవాడు కాదు అని చెబుతున్నాడు భక్తుడు ఆత్మావేశుడై!!!...

రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

ఇదే 12వ వచనంలో చెబుతున్నారు: దేవునివలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకిక ఆత్మను అనగా ఈ భూలోకంలో ఉన్న ఆత్మను పొందుకోలేదు గాని దేవుని యొద్దనుండి వచ్చిన ఆత్మను పొందుకున్నాము!!! హల్లెలూయ!!!

 

ఇక 13వ వచనం థియాలజీకి ఆయువుపట్టు!! దేవుని లేఖనాలు ఎలా అర్ధం చేసుకోవాలి అనేది ఈ వచనం ద్వారానే మనకు అర్ధమవుతుంది! ఇక్కడ అంటున్నారు: దేవుని మాటలను బాగా అర్ధం చేసుకోవాలంటే మనుష్య జ్ఞానంతో కాకుండా- ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి! ఆత్మ నేర్పు మాటలతో చెప్పాలి! ఇది లేఖనాలను అర్ధం చేసుకోవడానికి ఎలా సహకరిస్తుంది అని మీకు అనుమానం వస్తే: బైబిల్ లో ఏదైనా ఒక వచనం లేక లేఖనం ఉంటే దానికి సపోర్టింగ్ లేఖనం లేక వచనం మరో దగ్గర ఉంటుంది! అప్పుడు ఆ రెండు లేక మూడు లేఖనాలు కలిపి చదువుకుని అర్ధం చేసుకోవాలి! అలా కలుపగా వచ్చినదే సరియైన అర్ధం!! అందుకే యెషయా గ్రంధంలో ఆయన వర్తమానం కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ వస్తుంది అని వ్రాయబడింది....

Isaiah(యెషయా గ్రంథము) 28:10,11,12,13

10.ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు

13. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

 

 ఆ అచ్చట ఇచ్చట కలుపుకుని చదువుకుంటేనే మనకు ముచ్చటగా అర్ధం అవుతుంది తప్ప అలా కలుపుకుని చదవకపోతే అర్ధమే మారిపోతుంది!!! ఇదీ వాక్యాన్ని అర్ధం చేసుకునే విధానం! పరలోక సంగతులు పొందుకునే విధానం! పరలోక సంగతులు వాక్యాధారాముగా అర్ధం చేసుకొనే విధానం! ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మసంబంధమైన విషయాలతో పోల్చుకుని అర్ధం చేసుకోవాలి! ఆత్మను పొందుకోవాలి!!

 

ప్రియ స్నేహితుడా! చదువరీ! నీవు ఆ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నావా??? పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడ్ని ప్రతీరోజూ అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావా? లేక నీ పాప కార్యాల వలన ఆ ఆత్మను పోగొట్టుకున్నావా? దావీదు గారు వ్యభిచారం చేసి, హత్య జరిగించి పరిశుద్దాత్మను సన్నిధిని కోల్పోతే పశ్చాత్తాప పడి పడక కొట్టుకుపోయేటంతగా ఏడ్చి విలపించి మరలా పొందుకొన్నారు! అందుకే దేవునికి ఇష్టానుసారుడైన మనిషి అని పించుకున్నారు! మరి నీవు మరల పొందుకుంటావా? ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు! ఆయన వాడు కాకపొతే నీవు సాతానుగాడి పార్టీ! నరకానికి పోయే బ్యాచ్ అని మరచిపోవద్దు! అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయని మర్చిపోవద్దు!

 

నేడే ఆయన ఆత్మను పొందుకుందాం!

పరలోక సంబంధమైన జ్ఞానము విషయాలు పొందుకుందాము !

 

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*28వ భాగము*

 

1కొరింథీ 2:1316

13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

15. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

గతభాగంలో పరలోక సంబంధమైన విషయాలు లేక ఆత్మసంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకోవడం వలన అర్ధమవుతాయి అంటూ చూసుకున్నాము!

 

13వ వచనం ద్వారా పౌలుగారు ప్రతీ దైవజనునికి చెప్పకనే చెబుతున్నారు:  భోదించేవాడు ఎవరైనా సరే- అవి ఆత్మ సంబంధమైనవి అని తెలుసుకుని ఆత్మ నేర్పించే మాటలతోనే బోధించాలి గాని మీ సొంత జ్ఞానముతో గాని మీ సొంత వివరాలతో గాని సైన్సు లేక వేదాంతము లేక తర్కము కలుపుకుని బోధించడమువలన అవి మనుష్యులకు పూర్తిగా అర్ధం కావు!! ఈ విషయం తప్పకుండా ప్రతీ సేవకుడు దైవజనుడు భోధకుడు అర్ధం చేసుకోవాలి!!!

 

ఇక 14వ వచనంలో ప్రకృతి సంభందమైన మనిషి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు అర్ధం చేసుకోలేడు, అంగీకరించడు ఎందుకంటే అవి అతనికి వెఱ్రితనముగా ఉంటాయి! అలాంటివి ఆత్మానుభవముచేతనే వివేచించబడతాయి! గనుక ప్రకృతి సంబంధమైన మనిషి దీనిని అర్ధం చేసుకోలేడు అంటున్నారు పౌలుగారు! అవును కదా- ప్రకృతి సంబంధమైన మనిషి బౌతికమైన జ్ఞానం కలిగి ఉంటాడు గాని దేవుని గూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు దేవుని ఆత్మ వానిలో లేదు కాబట్టి ఆ ఆధ్యాత్మిక సంగతులు అర్ధం చెసుకోలేదు!

1:18, 24

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

 

 అందుకే రోమా 8:58 లో అంటున్నారు....

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

ఇక ప్రకృతి సంబంధమైన స్వభావం లేక శరీర స్వభావం కోసం ఆలోచిస్తే

 (7:5; గలతీ 5:17).

పౌలు ఇక్కడ రెండు రకాల వ్యక్తులను వర్ణిస్తున్నారు. ఈ భూమిపై ఉన్న వారంతా ఈ రెండు గుంపులకే చెందుతారు. ఒక రకంవారు ఒక విధంగా ఆలోచిస్తారు. రెండో రకం వారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అవిశ్వాసుల మనస్సుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నిటినీ ప్రవేశపెడుతుంది. వారు వాటివెంట వెళ్తారు. దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సు ల్లోకి తెస్తాడు. ఆయన వారికోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే వారు వాటివెంట వెళ్తారు.

గలతియులకు 5: 17

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

 

 ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది అందువల్ల దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలను దేవుని ఆత్మవలన ఎదిరించగలము!  2 కొరింతు 10:5

మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి

 

ఫిలిప్పీ 4:8

మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

 

కొలస్సీయులకు 3: 16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

 

ఇవి ఆత్మను పొందుకున్నవాడు ఆలోచించే ఆత్మ సంబంధమైన విషయాలు!!

 

 శరీర స్వభావానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనుషులకు పాపభరితమైనవిగా అనిపించకపోవచ్చు. అవి మత సంబంధమైన, బుద్ధిసంబంధమైన విషయాలు కూడా అయి ఉండవచ్చు. అయితే అవి దేవునికి సంబంధించినవి కావు! ఉదాహరణకు పేతురు గారు ఆలోచించినట్లు మత్తయి 16:23

అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను.

 

 భూసంబంధమైన వాటికోసం ఆలోచించే వారికి:

ఫిలిప్పీయులకు 3: 19

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సునుంచుచున్నారు.

 

గానీ పరలోక సంబంధమైనవి కావు !

దేవుని ఆత్మలేని మనుషులకు అవి సహజంగా సబబైనవిగా అనిపిస్తాయి.

అందుకే పౌలుగారు అంటున్నారు

కొలస్సీయులకు 3: 2

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

 

 క్రీస్తులో లేని ప్రతి వ్యక్తి సహజ మనస్సు తనకేవి ప్రియంగా సంతోషకరంగా అనిపిస్తాయో వాటిమీదే ఉంటుంది. అయితే అవి ఏకైక నిజ దేవునితో ఎలాంటి సంబంధమూ లేనివి, ఆయనకు వ్యతిరేకమైనవి. అలాంటి మనిషి తాను దేవుని పక్షానే ఉన్నానని తలంచవచ్చు. ఆయనను ప్రేమిస్తున్నానని కూడా చెప్పవచ్చు. కానీ ఇది కేవలం భ్రమ. పాపాత్ముడి మనసు తనకు తాను ఎన్నడూ మారదు, దేవునికి లోబడదు. అలాంటిది దానికి అసాధ్యం. ఒక మనిషి దేవునికి లోబడడం ఆరంభించాలంటే మౌలికమైన గొప్ప మార్పు అవసరం. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవాన్నిచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి. ఇది జరగకుండా ఎవరూ దేవునికి ఆనందం కలిగించేవాడుగా ఉండలేడు. ఒక వ్యక్తి చాలా మత నిష్ఠగలవాడై ఉండవచ్చు. చాలా నీతిగలవాడై, బాగా చదువుకున్నవాడై, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుని ఆత్మ లేకుండా చేస్తే ఇదంతా పాపమే, మరణమే. దేవునికి ఇలాంటిది ఎన్నటికీ అంగీకారం కానేరదు. యోహాను 3:3-8

John(యోహాను సువార్త) 3:3,4,5,6,7,8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా( లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

4. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

 ఒక మనిషిలోని భ్రష్ట స్వభావం మతం, నైతిక వర్తన అనే ముసుగులో ఉన్నంత మాత్రాన అది దేవునికి ఇష్టమౌతుందని మనం అనుకోకూడదు. దేవుడు మతం పొరలు తొలగించి హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చూస్తారు! పాపులైన మనుషుల మత సంబంధమైన ఆలోచనలూ అనుభూతులూ అతనిలోని ఇతర విషయాలన్నిటి లాగే పాపంతో కూడినవని ఆయనకు తెలుసు. అందుకే శరీర సంబంధి ఆత్మ సంబంధమైన విషయాలు అర్ధం చేసుకోలేడు!

 

కాబట్టి ఇప్పుడు మనమైతే దేవుని సత్యాన్ని అర్ధం చేసుకుని అంగీకరించాలంటే దేవుని ఆత్మ మాత్రమే మనకు బోధించాలి!! అందుకే పౌలుగారు ఎఫెసీ సంఘం కోసం ఇలా ప్రార్ధిస్తున్నారు 1:1519

15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును(అనేక ప్రాచీన ప్రతులలో- ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి

16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని,

19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

 

ఇక 15వ వచనంలో ఆత్మ సంబంధమైన మనిషి అన్నింటినీ వివేచిస్తాడు గాని అతడు మరొకరి చేత వివేచించబడడు అంటున్నారు  ఎందుకంటే ఆధ్యాత్మిక వ్యక్తి అన్నింటినీ సరిగా పరిశీలిస్తాడు! అద్ది మంచిదా చెడ్డదా దేవునికి మహిమ తెస్తుందా లేక అవమానం తెస్తుందా, ఈ పని ద్వారా ఆత్మ ఫలభరితముగా అవుతుందా లేక అంతరంగపురుషుడు దీనిద్వారా కృంగి కృశించిపోతాడా? ఈ బోధ ఆత్మలను రక్షిస్తుందా లేక నవ్విస్తుందా !! ఇది ఆత్మసంబంధమైన వ్యక్తి ఆలోచించి వివేచించేది!! అందుకే 1యోహాను పత్రికలో భక్తుడు అంటున్నారు 2:20,27

20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు భోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).

 

దేవుని ఆత్మ మూలంగా ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారిన క్రీస్తు విశ్వాసులు మాత్రమే లోక విషయాలను, మనుషుల నిజ స్థితిని గుర్తించ గలుగుతారు. ఆత్మలేని వారు అలా అర్థం చేసుకోలేరు గనుక అలాంటి విషయాల్లో సరైన అభిప్రాయానికి రాలేరు. సరైన నిర్ణయానికి రాగలగడం ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఇది సహజంగా ఎవరికీ ఉండదు.

 

ఇక చివరి వచనం: ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు అనగా దేవునికి బోధించ గలవాడు ఎవడు?

యెషయా 40: 13

యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

 

మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము! మనకు క్రీస్తుయేసు మనస్సు ఉంది అంటున్నారు! క్రీస్తుమనస్సు ఎలా ఉంది అంటే ఆయనాత్మ వలన మనము క్రీస్తుయేసు మనస్సును అర్ధం చేసుకోగలము! క్రీస్తు మనస్సు కలిగి ఉండుట లేక అర్ధం చేసుకోవడం అనగా దేవునికి ఇష్టమైనవి చేయడం ఆయనకు ఇష్టం లేనివి మానెయ్యడం! దేవుని ఆత్మ ఏ విషయంలో ఆయాసపడతాడో ఆ క్రియలంటే అసహ్యించుకోవడమే క్రీస్తు మనస్సుని కలిగి ఉండటం!

 

ఒక ఉదాహరణ చెప్పనీయండి: ఎలియాజర్ కుమారుడు ఫీనేహాసు ఆయన మోషే గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో బిలాము బోధవలన మోసపోయి వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఓర్వలేక తెగులు పంపించారు! అప్పుడు ఫీనేహాసు ఏమి చేశాడు అంటే ఒక గోత్రపు పెద్ద యొక్క కొడుకు మోయాబు దేశంలో ప్రధాని కూతురితో పాపం చేస్తుంటే ఇద్దరినీ ఒకే బల్లెముతో పొడిస్తే అది ఇద్దరు కడుపులు చీల్చుకుని పోయింది! తెగులు ఆగిపోయింది! అప్పుడు దేవుడు  ఏమన్నారు: నేను ఓర్వలేనిదానిని ఫీనేహాసు ఓర్వలేకపోయాడు కాబట్టి అతనితో నేను నిబంధన చేస్తున్నాను అన్నారు! ఇదే దేవునిమనస్సుని అర్ధం చేసుకోవడం!!! క్రీస్తు మనస్సుని కలిగి ఉండటం!!! (సంఖ్యా 25)

 

పై సత్యాలకు ఆధారంగా దీనిని రాశారు పౌలుగారు. సహజసిద్ధమైన మనుషులు (దేవుని ఆత్మ లేనివారు) దేవుని మనసును గ్రహించలేరు, కాబట్టి విశ్వాసుల మనసులను కూడా గ్రహించలేరు. ఇది ఎందుకంటే విశ్వాసులు ఈ లోకానికి చెందిన మనుషుల వలె ఆలోచించడం మానుకున్నారు. క్రీస్తు ద్వారా దేవుని మనసు కొంత వరకు వారికి ఉంది. అంటే క్రీస్తుకూ దేవునికీ తెలిసినవన్నీ విశ్వాసులకు తెలుసని కాదు. క్రీస్తు వారిలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ వారికి ఉన్నాడు కాబట్టి వారు దేవుని సత్యం మూలాధారం దగ్గరే ఉన్నారనీ, ఆ సత్యంలో ఏ భాగమైనా వారు అర్థం చేసుకునేలా ఆయన చేయగలడని దీని అర్థం. ఇది క్రీస్తు అపొస్తలులు సేవకుల విషయంలో, గొప్ప జ్ఞానం ఉన్న క్రైస్తవ నాయకులకు మాత్రమేనా? కాదు. ఆధ్యాత్మిక విశ్వాసులందరి విషయంలోనూ ఇది నిజమే (1:26-28). చదువు, గొప్ప మేధాశక్తి, మానవ జ్ఞానం మొదలైనవాటితో దీనికి పని లేదు. మనిషి ఆత్మకు దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడం అదే అత్యంత అవసరమైన సంగతి. ఈ చర్చ అంతటిలో దేవుని ఆత్మ మానవ ఆత్మకు వేరుగా ఉన్నాడనే తలంపు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూచినా దేవుని వాక్యమంతటిలోనూ కనిపించే ఉపదేశం ఇదే.

(యోహాను 14:17; రోమ్ 8:9, 16; గలతీ 3:2; ఎఫెసు 4:18; యూదా 19)

 

కాబట్టి ఈ సత్యాన్ని గ్రహిద్దాం!

దేవుని ఆత్మను కలిగి ఆయన మనస్సుని అర్ధం చేసుకుని ఆయనకు తగినట్లుగా జీవిద్దాం!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*29వ భాగము*

 

1కొరింథీ 3:14

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా?

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మూడవ అధ్యాయంలో మరలా ఈ పత్రికను రాసిన ఉద్దేశానికి వచ్చేస్తున్నారు! మొదటి అధ్యాయంలో కొద్దిగా చెప్పి మూడవ అధ్యాయంలో విభేదాలు కక్షలు గ్రూపులు కోసం వివరంగా రాస్తున్నారు! మరి మొదటి రెండు అధ్యాయాలలో మరుగైయున్న జ్ఞానము, అది పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడింది, ఆధ్యాత్మిక వ్యక్తులు శరీర సంబంధమైన వ్యక్తులు అనే విషయాలుకోసం  ఎందుకు చెప్పారు?

 

ఇప్పుడు మూడో అధ్యాయంలో మీరు గత రెండు అధ్యాయాలలో చెప్పిన సంగతులతో పోల్చుకుంటే మీరు శరీరసంబంధమైన వ్యక్తులుగానే కనిపిస్తున్నారు గాని మీలో ఎవరూ ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కనబడటం లేదు అని చెప్పడానికి ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా ఉంటారు, శరీర స్వభావులు ఎలా ఉంటారో చెప్పారు! ఇప్పుడు వీరిలో కలహాలు విభేదాలు కక్షలు కనిపిస్తున్నాయి కనుక ఆ లక్షణాల ద్వారా మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు అని చెబుతున్నారు!

 

ఈ అధ్యాయం మొదలు పెట్టేముందుగా ఒక విషయం మరోసారి మీకు గుర్తుకు చేయాలని అనుకుంటున్నాను! ఆదాము గారి కాలమునుండి సాతాను గాడు సంఘాన్ని పాడుచెయ్యాలి, తాను పరలోకం నుండి త్రోయబడ్డాడు కాబట్టి దేవుడు ఎంతో ఇష్టపడి మనిషిని చేసుకున్నాడు కాబట్టి ఆ మనిషి దేవుణ్ణి చేరకుండా ఉండాలని పరలోకం చేరకుండా ఉండాలని అప్పటినుండి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు! దేవుడు తన ప్రవక్తల ద్వారా మరొకరి ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు! యేసయ్య పుట్టకుండా చూడాలని చూశాడు! గర్భములోనే చంపుదాము అనుకున్నాడు- చేయలేకపోయాడు! పుట్టాక బలియాగం చెయ్యకుండా చెయ్యాలని చూశాడు, ఆపలేకపోయాడు! ఇలా కాదని దేవాలయ పెద్దలలోను పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను పడ్డాడు, సాధించలేకపోయాడు! మరణం ద్వారా ఆపాలని చూశాడు, యేసుక్రీస్తుప్రభులవారు మరణాన్ని జయించి లేచారు! ఇక యేసయ్య ఆరోహణమైపోయారు శిష్యులను చంపితే ఇంకా సంఘాన్ని హింసిస్తే సువార్తసత్యము ఆగిపోతుంది అని చూశాడు! ఎంతగా హింసిస్తే అంతగా విస్తరించింది! రాజులలోను అధికారులలోను పడ్డాడు గాని ఆపలేకపోయారు! ఇక క్రుద్రవిధ్యలు మంత్రాలు తో ఆపాలని చూశాడు చాలా దేశాలలో, గాని ఆపలేకపోయాడు! ఓడిపోయాడు! చివరికి దేవుని బిడ్డలను దేవుని బిడ్డలతోనే వారి విశ్వాసాన్ని బ్రష్టులుగా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ ఎన్నోసార్లు విజయం సాధిస్తున్నాడు!! అప్పటినుండి ఇప్పటివరకు! జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలకు శరీరాస, నేత్రాస జీవపు డంభము చూపి, శరీరకార్యాలతో విశ్వాసులను దైవసేవకులను మోసగించడం వలన  మోసగించబడిన వారి శాతం తక్కువ! అయితే మన క్రైస్తవ్యంలో శాఖాబేధాలు చూపి పడగొట్టిన వారి సంఖ్య చాలాచాలా ఎక్కువ! మనలో మనకే పడకుండా చేస్తున్నాడు వాడు! క్రైస్తవుల మధ్యలో బేధాలు సృష్టిస్తూ మీరు పెంతుకోస్తు వారు మీరు బాప్తిష్టు వారు, మీరు మరో వారు మరో వారు అంటూ క్రైస్తవుల మధ్యలో బేధాలు పెట్టి మత బ్రష్టులుగాను వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా చేస్తున్నాడు! మరికొందరిని లేపి అబద్ధబోధలు చేస్తూ సంఘాలను పాడు చేస్తున్నాడు! యెహోవాసాక్షులు అంటూ, మోర్మోన్స్ అంటూ, జాంగిల్ జా అంటూ, అంత్యకాల ప్రవక్త బ్రెన్హాం గారిని ప్రవక్తగా అంగీకరించాలి అంటూ ఇలా ఎన్నెన్నో అబద్దబోధలతో తప్పుడుబోధలతో సంఘాలను పాడుచేస్తూ సాతానుగాడు విజయం సాధిస్తూ వికట్టాట్టహాసం చేస్తున్నాడు! అది అప్పటినుండే అనగా క్రీ.శ 51 నుండే మొదలయ్యింది! ఇంకా కొనసాగుతుంది! ప్రియ దైవజనమా! ఈ విషయాన్ని గ్రహించి ఇలాంటి బేధములనుండి దూరంగా పొమ్మని మనవిచేస్తున్నాను!!!

 

  ఇక మొదటి వచనం చూసుకుంటే సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పోతున్నాను! మీరు శరీర సంబంధులే అనియు, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది అంటున్నారు! అప్పటిలో మీకు అనగా మీరు బాప్తిస్మం తీసుకున్న మొదట్లో మీకు బలము చాలకపోయినందు వలన నేను మిమ్ములను క్రీస్తులో పాలతో పెంచాను గాని మీకు అన్నాన్ని పెట్టలేదు! అనగా మీరు ఇంకా చంటిబిడ్డలే గాని మీరు ఎదిగి అన్నం తినే వయస్సు మీకు క్రీస్తులో రాలేదు అని పౌలుగారు అభిప్రాయపడుతున్నారు!

ఎందువలనా? మీరింకను శరీర సంబంధులై ఉండుటవలన!  మీరు ఇప్పుడు కూడా బలహీనులై ఉన్నారు కదా అంటున్నారు! మూడో వచనంలో మీలో మీకు ఇంకా అసూయలు కలహాలు ఉంటే మీరు శరీర సంభందులే, శరీర సంబంధంగానే నడుచుకుంటున్నారు కదా అని వాపోతున్నారు!!

 

గమనించాలి మొదటి రెండు అధ్యాయాలలో శరీర సంబంధులు ఆత్మ సంబంధులు వారి లక్షణాలు చెప్పారు! ఆత్మానుసారమైన వ్యక్తులు లేక ఆత్మసంబంధులు లేక ఆధ్యాత్మికవ్యక్తులు పరిశుద్దాత్మ వలన నడిపించబడతారు వారిలో దేవునియొక్క మరుగైయున్న జ్ఞానము పనిచేస్తుంది అని చెప్పి- ఇప్పుడైతే మీలో శరీర సంబంధమైన కార్యాలు పనిచేస్తున్నాయి కాబట్టి మీరు శరీరానుసారులు మరియు క్రీస్తులో ఇంకా చంటి బిడ్డలవలె ఉన్నారు అంటున్నారు! మొదటి అధ్యాయం మొదట్లో మీరు ఏ కృపావరములోను లోపం లేకుండా క్రీస్తుయేసు ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తున్న ఆధ్యాత్మిక పరిపక్వత గల సంఘము అని చెప్పి ఇప్పుడేమిటి శరీర సంబంధులు అంటున్నారు పౌలుగారు! అవునండీ! వీరిలో అనేకులు బైబిల్ లో చెప్పబడిన అన్ని కృపావరాలు పొందుకుని ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినవారే గానీ పౌలుగారు వెళ్ళిపోయాక అపొల్లోగారు పరిచర్యచేసి వెళ్ళిపోయాక క్రూరమైన తోడేళ్ళు వచ్చాయి! మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ సంఘాన్ని చీల్చేసాయి ఫేవరిటిజం పేరుతో! నేను పౌలువాడను, నేను పేతురు వాడను నేను అపోల్లో వాడను మరొకడు నేను వారెవరివాడను కాదు నేను క్రీస్తువాడను అంటూ! సంఘములో బేదములు అసూయలు, గొప్ప - పేద అనే తారతమ్యము, ధనికులు-  పేదలు అనే తారతమ్యములు వచ్చేశాయి! వాటిని తీసుకుని వచ్చింది సైతానుగాడు! గాని వీరికి ఆ విషయం తెలియలేదు!  కొరింథీ సంఘము పతనావస్తకు వచ్చేసింది! అందుకే కొరడా తీసుకుని ఈ లేఖ వ్రాయాల్సి వచ్చింది!

 

ఇక్కడ పౌలుగారు మూడు రకాలైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్నారు!

మొదటిది: ఆధ్యాత్మిక వ్యక్తులు లేక ఆత్మసంబంధులు: వీరు దేవుని ఆత్మ కలిగి అత్మానుసారంగా నడచుకునే వారు! గమనించాలి- దేవుని ఆత్మలేని మనుషులతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఆధ్యాత్మిక మనుష్యులే లేక ఆత్మ సంబంధులే! అయితే విశ్వాసులలో చాలామంది మరింత ఆత్మానుసారంగా నడుచుకుని ఆత్మసంబంధమైన వ్యక్తులుగా మారుతున్నారు!

 

ప్రకృతి సంబంధులు: దేవుని ఆత్మలేని వారు, క్రీస్తును అంగీకరించని వారు!

 

శరీర సంబంధులు: దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తే గాని ఆత్మానుసారంగా నడుచుకోకుండా ఆత్మలేని ప్రకృతి సంబంధమైన వ్యక్తులు వలే ప్రవర్తించేవాడు!!!

 

మరి మనం ఈ బేధాలు ఎలా కనుగొనగలము అంటే 1కొరింథీ 2:1416

14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

15. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు.

16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.

 

రోమా 8:59

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

కాబట్టి ఇప్పుడు విశ్వాసులైన వారు దురదృష్టవశాత్తూ చాలామంది తమ పాత బ్రష్ట స్వభావాన్ని అనుసరించి నడచుకుంటూ లోకానుసారులైన ప్రజలవలె ప్రవర్తిస్తూ ఉన్నారు! వీరు కొరింథీ సంఘములోనూ ఉన్నారు నేటి రోజులలో ప్రతీ సంఘములోనూ ఉన్నారు! అది ఏ డినామినేషన్ అయినా ప్రతీ సంఘములోనూ ఈ బ్యాచ్ ఉంది! ఈ బ్యాచ్ నే మీరు ఇంకా చంటి పిల్లలవలె ప్రవర్తిస్తున్నారు అందుకే మీలో ఇకడు నేను పౌలువాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను అనగా నేను పేతురు వాడను నేను క్రీస్తు వాడను అని కలహాలు పెట్టుకుని చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు అంటున్నారు పౌలుగారు!

హెబ్రీ 5:1114

11. ఇందునుగూర్చి (లేక, ఇతనిగూర్చి) మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.

12. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.

13. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.

14. వయస్సు వచ్చిన వారు (లేక, పరిపూర్ణులు) అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.

 

వారు శరీర సంబంధులు అని చెప్పడానికి వారు చేస్తున్న లేక విశ్వాసుల మధ్యలో ఉన్న కక్షలు విబేదాలే కారణం! కారణం ఈ విభేదాలు గాని కలహాలు గాని పరిశుద్దాత్మ వలన రానేరావు!! అవి మానవుల యొక్క బ్రష్ట స్వభావం వలన వస్తాయి!

గలతీ పత్రికలో దీనికోసం చెప్పారు  5:1926

19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

24. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

25. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

26. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

 

యాకోబు ౩:1418

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.

 

దేవుని బిడ్డలు లేక క్రైస్తవులు సాధారణ మనుష్యులు లేక ప్రకృతి సంబంధమైన మనుష్యుల వలే ప్రవర్తించకూడదు! వారు దేవునిచేత ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడిన వారు కనుక మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందారు కనుక ఈ తరమువారు ప్రవర్తించినట్లు వారు ప్రవర్తించ కూడదు! ఆత్మానుసారంగా నడుచుకోవాలి! ఆత్మ నడిపించినట్లు నడవాలి గాని శరీరకార్యాలు ఏమాత్రం వారిలో పనిచెయ్యకూడదు!!!

 

  దీనిని చదువుతున్న ప్రియ దేవుని బిడ్డా! ఒకవేళ నీలో ఇలాంటి స్వభావం ఉందా? నీవు పౌలుగారు చూపించిన ఆ మూడు గుంపులలో ఏ గుంపులో ఉన్నావు?? ఆత్మానుసారంగా నడచుకోడానికే దేవుడు నిన్ను పిలిచారు! ప్రకృతి సంబంధుల వలే శరీర సంబందులవలె లోకానుసారంగా నడచుకోడానికి కానేకాదు!

 

 కాబట్టి ఒకసారి నిన్నునీవు సరిచూసుకుని పరిశీలించుకుని ఆత్మానుసారమైన జీవితం జీవించమని శరీరానుసారమైన పనులు అలవాట్లు వదిలెయ్యమని క్రీస్తుయేసు పేరిట మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*30వ భాగము*

 

1కొరింథీ 3:49

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక 4వ వచనం నుండి విభేదాల కోసం మరింత వివరంగా రాస్తున్నారు!

 గతభాగాలలో దీనికోసం చూసుకున్నాము గనుక క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!

 

ఒకడు నేను పౌలువాడను మరియొకడు నేను అపోల్లోవాడను అని చెప్పుకుంటే మీరు ప్రకృతి సంబంధులు కారా? అని ప్రశ్నించి 5వ వచనంలో అంటున్నారుఅపోల్లో ఎవడు? పౌలెవడు ? ఇద్దరూ పరిచారకులే కదా! ఒక్కక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారిద్వారా మీరు దేవుణ్ణి విశ్వసించారు, నేను నాటితిని అపోల్లో నీళ్ళు పోశారు, అయితే వృద్దిచేసినవాడు దేవుడే కదా! అందువలన వృద్ధిచేసిన దేవునిలోనే ఉంది గాని నాటిన నాలోగాని నీరు పోసిన అపోల్లోలోను ఏమీ లేదు! నాటువాడు అనగా విత్తనాలు నాటిన పౌలనే నేను గాని, నీరు పోసిన అపోల్లో గాని ఇద్దరమూ జీతం కోసం పనిచేశాము అంటూ 9వ వచనంలో మేము దేవుని తోటలో జతపనివారము!

మీరు దేవుని వ్యవసాయము,

రెండవది దేవుని గృహము!!!

 

  గమనించాలి క్రీ.శ. 51 లోనే కాదు నేటికీ కూడా సంఘాలు ఇలా వర్గాల ద్వారా తమశాఖల ద్వారా సంఘాల యొక్క డినామినేషన్ ల ద్వారా సంస్థల ద్వారా చీలికలైపోయారు! తమయొక్క సంఘపు పేరు వలన గర్విస్తున్నారు ఒక్కక్కరు!!! గర్వము మాట ప్రక్కనపెడితే వీరంటే వారికి పడదు! వారంటే వీరికి పడదు! వీరు వారిని చూస్తే ఏదో పురుగును, వ్యభిచారిని చూసినట్లు ముఖం ప్రక్కకు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు! ఇద్దరూ సేవించేది ఆ యేసుక్రీస్తుప్రభులవారినే! ఇద్దరినీ రక్షించింది, కడుగబడింది యేసురక్తం లోనే! మరి వీరికి ఏవిధమైన కక్షలు ఉన్నాయా అంటే లేవు! ఆస్తి తగాదాలు గాని అన్నదమ్ముల పోరు గాని,  స్త్రీల కోసం కొట్లాడుకుంటున్నారా లేనేలేదు! గాని వీరు దేవునిలో సహోదరి/సహోదరులే గాని వీరువీరు మాట్లాడుకోరు! ఎందుకంటే వీరిలో దేవుని ప్రేమ లేదు! వీరు విశ్వాసులే గాని పరిశుద్దాత్మునిచేత నడిపించబడక తమ శరీరానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టే వీరిలో శాఖా బేధాలు వర్గ బేధాలు పేద-ధనిక తారతమ్యాలు, సంఘములో కులవర్గాలు!! జాగ్రత్త వీరంతా నరకంలోనికి పోతారు! వీరిలో పరిశుద్దాత్ముడు పనిచెయ్యడం లేదు! పరిశుద్దాత్మను మేము నమ్ముతాము, బాషలతోనే జీవిస్తాము అని చెప్పుకుంటున్న మా పెంతుకోస్తు విశ్వాసులు పాదిర్లు కూడా బాప్తిష్టు వారిని చూస్తూ మరొకరిని చూస్తూ RCM వారిని చూస్తూ అయ్యో వీరికి పరిశుద్దాత్మ లేడు, వీరు లోక సంబంధులు అంటూ చెప్పుకుంటూ వారితో ప్రేమగా మాట్లాడకుండా వారిని చీదరించుకుంటున్నారు చాలామంది! ఇలాంటివారు కూడా పరలోకం వెళ్ళరు! వాడు పెంతుకోస్తు వాడైనా గొంతుకోసు వాడైనా, బాప్తిష్టు అయినా పాపిష్టు అయినా దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే ప్రేమ చూపించక పోతే నరకానికి పోతాడు! అందుకే కదా యోహాను గారు అంటున్నారు: నీకు కనిపించే నీ సహోదరున్ని నీవు ప్రేమించలేక పోతే నీకు కనబడని దేవుణ్ణి నీవు ఎలా ప్రేమించగలవు? నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీవు అబద్ధాలు చెబుతున్నావు అంటున్నారు!

1యోహాను 4: 20

ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)

1యోహాను 4: 21

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము.

 

కాబట్టి ఈ చిన్నపిల్లలవలే వర్గ భేదాల తోను కులవర్గాలతోను శాఖా భేదాలను విసర్జించి దేవుడు అనుగ్రహించిన సహోదర ప్రేమ కలిగి ముందుకు పోదాం!

 

   ఇక్కడ పౌలుగారు తననుతాను తగ్గించుకుని పౌలు ఎవడు అపోల్లో ఎవడు అంటున్నారు!! ప్రభువే ప్రాముఖ్యం గాని ఆయన పరిచారకులమైన మాలో ఏమీలేదు! కష్టపడింది మాలో ఉండి నడిపించిన దేవుని కృప మాత్రమే! మాకు దేవుడిచ్చిన కృపావరము కొలదీ మేము కష్టపడ్డాము! నేను విత్తనాలు నాటాను అపోల్లో నీరు పోశాడు అంటున్నారు! కాబట్టి విశ్వాసులారా! మీరు గ్రహించవలసినది ఏమిటంటే దైవసేవకులంతా దేవుని తోటలో జతపనివారు! వారు చేసిన సేవా ఫలము ఒకరోజు వారు పొందుకుంటారు అనగా సేవకు కూలి వారు పొందుకుంటారు! సేవకులంతా దేవునితోటలో పనివారు! దేవుని తోట మీరే! అనగా సంఘమే!! 

 

కాబట్టి విశ్వాసులారా! మీ సేవకున్ని గౌరవించండి గాని ఉన్నదానికంటే గొప్పచేసి పూజించకండి! వారికి దేవుని స్థానాన్ని ఇవ్వకండి! ఇంకా సేవకులు -సేవకుల మధ్య అభిమాన సంఘాలుగా ఏర్పడి కొట్టుకోకండి! మా అయ్యగారు గొప్ప మీ అయ్యగారికి ఏమీ లేదు అంటూ చెప్పకండి!  మీ అయ్యగార్లు ఇద్దరు దేవుని తోటలో పనివారు! మీ దైవసేవకులు మీ యొక్క పనివారు! దేవుడు మీకోసం పరిచర్య చేయడానికి దేవునిచేత పంపబడిన పనివారు మీ దైవసేవకులు! వారిని గౌరవించండి గాని వారిని పూజించవద్దు వారికోసం మీరు తగవులాడుకోవద్దు!!!

దేవుడు మాత్రమే సత్యానికి ఆధ్యాత్మిక జీవానికి ఆశీర్వాదాలకు మూలకేంద్రం!!! పౌలుగారు గాని అపోల్లో గాని లేక నేటి సేవకులు గాని వారి గురి ఏమిటంటే విశ్వాసులను ఈలోకంలో  పాపములో పడిపోకుండా వారి ఆత్మీయ జీవితం వాడిపోకుండా వారి అంతరంగ పురుషుడు బలపడే ఆహారం వారికి ఇచ్చి పోషించి అబద్ద బోధలు సాతాను శోధనల వంటి చీడపురుగులు వస్తే వాటిని కత్తిరించి  సంఘమును కాపాడటం వారి పని!!!

 

   ఇక దైవసేవకులు కూడా పౌలుగారిలా సమస్త ఘనత దేవునికే ఆపాదించాలి గాని రెండు ప్రసంగాలు మూడు అద్భుతాలు జరిగితే తమనుతాము గొప్ప చేసుకోకూడదు! ఇంత గొప్ప ఘనమైన సేవచేసిన పౌలుగారు తననుతాను పొగుడుకోకుండా  అరే పౌలు ఎవడు వాడు, అపోల్లో ఎవరు అని తననుతాను తగ్గించుకుంటున్నారు, మేము దేవునితోటలో జతపనివారము అని వినయముగా తగ్గించుకుని దేవుడు మా యజమాని, నేను ఆయన యొక్క బానిసను అని ఎంతో వినయముతో చెప్పుకుంటున్నారు! దేవునికోసం గొప్పగా వాడబడిన దైవసేవకుడు గాని పాత నిబంధన భక్తులు గాని క్రొత్త నిబంధన భక్తులు గాని ఇలానే తమను తాము తగ్గించుకున్నారు! ఇక్కడ పౌలుగారు తగ్గించుకున్నారు! ఇక్కడే కాదు తన పత్రికలలో అనేకసార్లు పౌలుగారు తగ్గించుకున్నారు:

 

1కోరింథీయులకు 15: 9

ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

 

2కోరింథీయులకు 3: 5

మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

1తిమోతి 1:15

పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

 

ఇక పౌలుగారే కాదు మోషేగారు తగ్గించుకున్నారు నిర్గమ ౩:11

అందుకు మోషే: నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా

 

న్యాయాధిపతులు 6: 15

అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

 

యిర్మియా 1:6

అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా

 

నెహేమ్యా గారు దానియేలు గారు ఎజ్రా గారు తగ్గించుకున్నారు! అందుకే కదా దేవుడు వారిని అంతగొప్పగా వాడుకున్నారు! ఆ తగ్గింపే వారి ఘనమైన సేవకు మూల కారణం! మనుష్యుల యొక్క పొగడ్తలు,నిందలు గౌరవం తృణీకారం వీటిని దైవసేవకుడు ఎట్టిపరిస్తితులలోను పట్టించుకోకూడదు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు:

లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

అట్టివిధంగా దైవసేవకులను  విశ్వాసులైన వారిని దేవుడు నడిపించును గాక!!!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*31వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-1*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

వ్యవసాయం విషయంలో: నేను విత్తనాలు విత్తాను, అపోల్లో నీరు పోశాడు అన్నారు!

 

కట్టడం విషయంలో : దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలే పునాది వేశాను! మరియొకడు దానిని కట్టుచున్నాడు అంటున్నారు!!

 

అయితే ఈ రెంటి విషయములో కూడా అనగా దేవుని వ్యవసాయం విషయంలోను దేవుని గృహము విషయంలోనూ తనను తానూ తగ్గించుకుని దేవునికి ఘనత తెస్తున్నారు!

 

వ్యవసాయం విషయంలో: నాటిన నాలో ఏమీలేదు,  నీరు పోసిన అపోల్లోలో ఏమీలేదు గాని వృద్ధిచేసిన దేవునిలోనే ఉంది అంటున్నారు!

 

కట్టడం విషయంలో : ఈ పునాది క్రీస్తే అంటూ వేయబడిన పునాది తప్ప మరో పునాది వేయకూడదు, ఆ పునాది మీద ఎవడైనా వేర్వేరు పదార్ధాలతో అనగా వేరువేరు బోధలతో కడితే చివరకు అది అగ్నిచేత పరీక్షించబడుతుంది అనగా శ్రమలు శోధనల ద్వారా పరీక్సించబడుతుంది ఒకవేళ నీ పునాది నిలిస్తే నీవు కట్టిన దేవుని గృహము నిలిస్తే నీవు జీతం పుచ్చుకుంటావు, కాల్చివేయబడితే నీకు నష్టము కలుగుతుంది అన్నారు!

 

ఈ రెండింటి విషయం కొంచెము లోతుగా పరిశీలించడం మంచిది అని అభిప్రాయపడుతున్నాను!

వీటికోసం గతంలో చెప్పినా గత శీర్షికలలో సందర్భము కాబట్టి కొంచెం పరిశీలిద్దాం!

 

మొదటగా దేవుని తోట లేక వ్యవసాయం గూర్చి ఈరోజు ఆలోచన చేద్దాం!

9వ వచనంలో  మేము జతపనివారం, మీరు దేవుని పొలము మరియు దేవుని గృహము అంటున్నారు!

 

              *దేవుని పొలము*

దేవుని పొలము కోసం చూసుకుంటే మత్తయి సువార్తలో దేవుడు అనేక ఉపమానాలు చెప్పారు, దానిలో దేవుని పొలం కోసం ఉన్న  ఉపమానాలలో తలమానికమైనది 13:24౩౦

 

24. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

25. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.

26. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

27. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.

28. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

29. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

30. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

 

ఈ ఉపమానంలో ప్రభువు తానే ఈ ఉదాహరణను వివరించి చెప్పారు. పొలం అంటే ఈ లోకం పోకడలకు గుర్తుగా ఉంది. మరియు దేవుని సంఘమునకు గుర్తుగా ఉంది!  లోకం దేవునిది. ప్రపంచమంతటిలో  నలుమూలలా తన రాజ్య స్థాపన జరగాలని ఆయన ఉద్దేశం. విత్తనాలు చల్లేవాడి ఉదాహరణలో లాగా విత్తనం అంటే ఇక్కడ దేవుని వాక్కు కాదు గానీ దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలోకి జన్మించిన ఆయన సంతానం!!

 

John(యోహాను సువార్త) 1:12,13

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

John(యోహాను సువార్త) 3:3,5,6,7,8

3. అందుకు యేసు అతనితోఒకడు క్రొత్తగా (లేక, పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

 

ప్రస్తుతం ఈ లోకంలో, సంఘంలో మంచి చెడులు కలిసి ఉన్నాయి. “కలుపు మొక్కలు లేదా గురుగులు” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి మొలకెత్తే దశలో సరిగ్గా గోధుమ పైరులాగానే కనిపించే ఒక విధమైన పిచ్చి మొక్క అని అర్థం !

అనగా తప్పుడుబోధలు!

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:13,14,15

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.

ఇవి సైతాను సంతానానికి గుర్తు!

 

యోహాను 8: 44

మీరు మీ తండ్రియగు అపవాది ( అనగా, సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి జనకుడునై) యున్నాడు.

 

1యోహాను 3: 8

అపవాది (సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది(సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

 

  దేవుని శత్రువు ఈ లోకంలో చెడ్డవిషయాలను అబద్దబోధలను  వెదజల్లి వెళ్లిపోయే సైతాను గాడు. స్థూలంగా చెప్పాలంటే ఈ భూమిపై రెండు రకాల మనుషులు మాత్రమే ఉన్నారు దేవుని రాజ్యంలో ఉన్న ఆయన పిల్లలు, దానిలో లేనివారు.

 

అయితే ఇప్పుడు సంఘములో రెండు బోధలు ఉన్నాయి! నీవు సరియైన బోధను తీసుకుని పెరిగితే గోధుమ గింజవలె పెరిగి కోయబడి కొట్టులో వేయబడతావు! లోకపుటాసలు గల అబద్ద బోధలకు లొంగితే గురుగుల వలే పెరిగి చివర్లో కూర్చబడి అగ్నిలో వేయబడి కాలిపోతావు! కాబట్టి ఇప్పుడు దేనిని తీసుకుంటావో నీ ఇష్టం!

 

అయితే ఆ విత్తిన వారు దేవుని వాక్యమును విత్తుతున్నారా లేక మరొకటి విత్తుతున్నారా చూసుకుని వాక్యముతో పరిశీలించుకుని మంచివి తీసుకుని చెడ్డవి విసర్జించుకునే భాద్యత నీదే!!

 

కాబట్టి దేవుని తోటలో పెరుగుచున్న ఓ ఆత్మీయ మొక్కా! నేడే నిన్నునీవు పరిశీలించుకుని సరియైన వాక్యమును తీసుకుని ఎదిగి ఫలించి దేవుని తోట యజమాని చేతిలోనికి పొమ్మని మనవిచేస్తున్నాను!!

 

దైవాశీస్సులు!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*32వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-2*

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక దేవుని వ్యవసాయం లేక పొలము కోసం ఇంకా ధ్యానం చేస్తే పొలములో పంట బాగా పండాలంటే లేక చెట్లు బాగా ఫలించాలి అంటే వేరు బాగా నాటాలి! వేరు నాటబడాలి అంటే మొదట ఆ పొలాన్ని దున్ని రాళ్ళు ముళ్ళు తీసి పారవేయాలి! అప్పుడే ఆ పొలము బాగా ఫలిస్తుంది! పౌలుగారు కొలస్సీయులకు పత్రిక రాస్తూ మీరు క్రీస్తునందు వేరుపారిన వారై ఉండాలి అని చెబుతున్నారు!

 

   కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.

 

    ప్రియ దైవజనమా! ఈ వచనాలలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి!

 

1) ఆయనయందు వేరు పారినవారై;

2) ఇంటివలె కట్టబడుచూ;

3) కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచూ. .

 

  ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ మూడూ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. గాని మూడింటికి సంబంధం ఉంది. అది ఎలాగో చూద్దాం!

 

1). *ఆయనయందు వేరు పారినవారై*: వేరుపారడం అనగా విశ్వాసులను పౌలుగారు మొక్కలతో/ చెట్లతో పోలుస్తున్నారు! అయితే ఇక్కడ వారి వేర్లు ఎక్కడ వ్యాపించాలి? సారవంతమైన నేలలో, యేసుప్రభులవారిమీద వ్యాపించాలి అని యేసయ్య విత్తువాడు- విత్తనాల ఉపమానంలో మనం చూసుకోవచ్చు! అయితే పౌలుగారు ఎఫెసీ 3:17 లో ప్రేమయందు వేరుపారాలి అంటున్నారు! వేర్లు ఒకదానితో ఒకటి అంటుకొని, ఒకదానిలో ఒకటి ఎలా ఉంటాయో, అలాగే విశ్వాసులు కూడా దేవుని ప్రేమతో నింపబడి, ఒకరియందు ఒకరు ప్రేమకలిగి ఉండాలి అంటున్నారు!!

 

     ఇక యేసుప్రభులవారు వ్యవసాయం కోసం చెప్పిన మరో  ఉపమానం ప్రకారం: మత్తయి 13వ అధ్యాయంలో: ఒకవ్యక్తి/ చెట్టు ఫలించడం అనేది ఆ విత్తనాలు ఏ నేలమీద పడ్డాయి అనేదాని మీద ఆధారపడి యుంటాయి!.....

Matthew(మత్తయి సువార్త) 13:3,4,5,6,7,8,9,13,14,15,18,19,20,21,22,23

 

3. ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.

4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను

5. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

6. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

7. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను.

8. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను.

9. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

13. ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి

14. మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

15. గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.

18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.

19. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

20. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానినంగీకరించువాడు.

21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

22. ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

23. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

 

 దారిప్రక్కన పడిన విత్తనాలు అసలు ఫలించలేదు! కారణం పక్షులు వచ్చి వాటిని తినివేసాయి!! ఇక్కడ విత్తనాలు(వాక్యం) వినేవాడి నిర్లక్ష్యం వలన సాతానుడు (పక్షులు) ఆ విత్తనాలను ఎత్తుకుపోవడం జరిగింది! మరికొన్ని విత్తనాలు రాతినేలమీద పడ్డాయి. అక్కడ మన్నులేనందువలన మొలకెత్తిన కొద్దిరోజులలో వాడిపోయాయి! అనగా వీరికి దేవునివాక్యం పట్ల లోతైన ఆశక్తి లేక వారు ఫలించలేక పోయారు! అందుకే యేసయ్య అంటున్నారు: అతనిలో వేర్లు అనగా లోతైన విశ్వాసం లేనందువలన, కొద్దికాలమే విశ్వాసంలో నిలిచి ఉంటాడు అయితే కష్టాలుగాని, నేడు మనదేశాలలో ఎదురౌతున్న హింసలు లాంటివి ఎదురవ్వగానే, వెంటనే తొట్రుపడి వెనుకడుగు వేస్తాడు! ప్రియ చదువరీ! ఈ లెక్కలో నీవున్నావా?

 

   ఇక కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి! విత్తనాలు మొలకెత్తాయి గాని ముండ్లతుప్పలు వాటిని అణచివేశాయి! అనగా వీరికి దేవుడంటే ఇష్టమే! గాని ఈలోక ఐహిక విచారములు మీద ఆశ ఎక్కువ! ఈలోకభోగాలమీద ఆశలు వదులుకోరు!! ధనం మీద, బంగారం మీద, అధికారం మీద ఆశ!! ఇవి వారిని దేవునిలో సాగనీయవు! ఉదా: దేవుని ఆరాధనకు వెళ్లాలని వీరికి ఆశ ఉంటుంది, పాటలు పాడాలని, ప్రార్ధించాలని ఉంటుంది గాని అదే సమయంలో వీరికిష్టమైన టీవీ సీరియల్ గాని, క్రికెట్ మాచ్ గాని వస్తే, ఆరాధనకు వెళ్ళరు! వీరికున్న దేవునిమీద ఆశను, వీరిలో ఉన్న నేత్రాశ నొక్కేసింది! ప్రియ చదువరి! ఇలాంటివారు పరలోకం వెళ్తారా??!!

 

    చివరగా మంచినేలమీద పడ్డ విత్తనాలు; ఆ నేల మంచిది కాబట్టి వారి వేరు లోతుకు పారుతుంది, తద్వారా బలమైన, మంచి విత్తనాలు ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలించాయి!!

 

   ప్రియ విశ్వాసి! నీవు ఎక్కడ వేరు పారావు? రోడ్డుప్రక్కనా? రాతినేలమీదనా? ముండ్లపొదలలోనా? లేక మంచినేలమీదనా? రాతినేలమీద, ముండ్లపొదలలో పడిన విత్తనాలు లాగ ఉంటే, అనగా లోతైన విశ్వాసం లేకుండా, ఐహికవిచారాలమీద, ఈ లోకాచారాలమీద ఉంటే, ఈలోక శ్రమలను తట్టుకోలేకపోతే, నీకు పరలోకం లేదు అని గమనించు!!

 

   ఈ సందర్భముగా మరోసారి మీకు గుర్తుచేస్తున్నానుఒకవ్యక్తికి ఆ సం.ము వరదల వలన భూమి పంట నాశనం అయిపోతుంది. వెంటనే ఆ వ్యక్తి ఎంతో భక్తి నిష్టలతో దేవునికి ప్రార్ధన చేశాడు- వచ్చే సం.ము వర్షాలు పడాలి గాని గాలి రాకూడదు, ఉరుములు, పిడుగులు పడకూడదు అని, వెంటనే దేవుడు సరే అన్నాడంట! ఆ సం.ము వర్షాలు బాగా పడ్డాయి, గాలి లేదు, పిడుగులు, ఉరుములు లేవు. పంట బాగాపండిది! కోతకోసాక చూస్తే, ఆ గింజలన్నీ పొల్లుగింజలే! కారణం గాలికి మొక్కలు ఊగుతున్నప్పుడు, తట్టుకోడానికి మొక్కలు తమ వేర్లను లోతుకు పంపిస్తాయి! తద్వారా లోతున ఉన్న లవణాలు గ్రహించి, మంచి పంట పండుతుంది. ఇంకా ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు వాతావరణంలో గల నైట్రోజన్- హైడ్రోజన్ తో కలసి అమ్మోనియంగా మారి వర్షంతో కలసి భూమిమీదకు వచ్చి, మొక్కలకు బలం చేకూర్చుతుంది! ఇవన్నీ వద్దన్నాడు రైతు తెలియక!! అందుకే పొల్లుగింజలు పండాయి!

 

   ప్రియ చదువరీ! 1.  నీవెక్కడ నాటబడ్డావు?? మంచి ఫలాలు ఫలిస్తున్నావా? లేక పొల్లుగింజలా? 2. శ్రమలలో (గాలి వానలలో) నీ విశ్వాసం అనెడి వేరు లోతుకు పారుతుందని గ్రహించావా? ఓరి దేవుడా! ఈ కష్టాలు అన్నీ నాకే రావాలా అని విసుక్కుంటూ ప్రార్ధన చేస్తున్నావా? అలా ప్రార్ధన చేస్తే నీవు మంచి విత్తనాలు ఫలించలేవు!! ప్రభువా! శోధనలు తట్టుకునే శక్తి/ ఉపాయం నాకు ఇవ్వు అని ప్రార్ధించు!! అప్పుడు నీవు వేరు పారి, దేవునిలో ముప్పదంతలుగా, అరువదంతలుగా, నూరంతలుగా ఫలిస్తావు!

ఇంకా ప్రేమలో వేరుపారి ఫలిస్తావు!!

 

  అట్టి కృప, చదువరులందరికీ దేవుడు దయచేయును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*33వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-౩*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక దేవుని గృహము కోసం చూసుకుందాం!

 

        (గతభాగం తరువాయి)

 

సంఘాన్ని దేవుని పొలముతోను లేక వ్యవసాయముతోనే కాకుండా మీరు దేవుని గృహము అంటున్నారు 9వ వచనంలో!! అయితే మనము బుర్రలు పాడుచేసుకోకుండా 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తున్నాడు అనియు మీరెరుగరా అంటున్నారు! అనగా మనము ఏ గృహముగా కట్టబడుచున్నాము అంటే దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము! ఇంకా ఎఫెసీ 2:22 లో కూడా అంటున్నారు మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు....

ఎఫెసీయులకు 2: 22

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

అయితే పేతురు గారు ఆత్మావేశుడై అంటున్నారు మీరు దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయనకోసం పరిశుద్ధమైన యాజకులుగా ఉండేలాగున మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు!

 

(గమనించాలి: గతభాగాలలో లేఖనాలు పరిశీలించడం అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి అని చెబుతూ లేఖనాలు పరిశీలించడం ఇలానే చెయ్యాలి అని చెప్పడం జరిగింది! పౌలుగారు మనము దేవుని ఆలయముగా దేవుని గృహముగా కట్టబడుచున్నాము అని ఆత్మావేశుడై ఇక్కడ చెబితే అనగా కొరింథీ పత్రికలో చెబితే అదే పరిశుద్దాత్ముడు పేతురు గారిని ఉపయోగించుకుని పరిశుద్ధ యాజకులుగా ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని దేవునిచేత మీరు ఆత్మ సంబంధమైన మందిరము అనగా దేవాలయముగా కట్టబడుచున్నారు అని రాశారు! లేఖనం- లేఖనము తో పోల్చబడి సరిగా ఉంది! ఇదీ లేఖనాలు పరిశీలించే విధానం!!!)

 

కాబట్టి ఇక్కడ మనకు మనము దేవునికి ఆలయముగా దేవుడు నివశించే మందిరముగా కట్టబడుచున్నాము అని అర్ధం అవుతుంది! మరి ఇలా కట్టబడాలంటే కొద్దిగా కట్టడాల కోసం ధ్యానం చేద్దాం!

 

ప్రియులారా! గతభాగములో కొలస్సీ పత్రిక 2:6-7 ధ్యానం చేసుకుంటూ, క్రీస్తులో వేరుపారడం కోసం ధ్యానం చేసుకున్నాం!

ఇక ఈరోజు ఇంటివలె కట్టబడటం కోసం ధ్యానం చేద్దాం!

 కొలస్సీయులకు 2: 6,7

కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.. .

 

గతభాగంలో మనం పౌలుగారు విశ్వాసులను మొక్కలతో/ చెట్లతో పోల్చడం చూశాం!

నేడు ఈ భాగంలో పౌలుగారు విశ్వాసులను ఇంటితో/ కట్టడంతో పోలుస్తున్నారు! అయితే అది ఏ ఇల్లు? దేవుని ఇల్లు! ఎఫెసీ 2:19-22 వరకు చూసుకుంటే చాల విపులంగా కనిపిస్తుంది మనకు!

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

 క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిమీద కట్టబడియున్నారు అంటున్నారు.

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.

 

ఇక్కడ వారు ఏ పునాది మీద కట్టబడుతున్నారు? క్రీస్తుయేసు అనే పునాదిమీద! ఆ పునాది క్రీస్తే!! 1కోరింథీయులకు 3: 11

వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

 1పేతురు 2: 4,5

మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

   ఇక ఇల్లు కట్టాలి అంటే పునాది వేయాలి! ఆ పునాది దేనిమీద కట్టబడింది అనేది చూసుకోవాలి.  ఇప్పుడు మనమూ యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మరో ఉపమానం: .......

Matthew(మత్తయి సువార్త) 7:24,25,26,27

 

24. కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

 

బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కట్టిన ఇల్లుకోసం యేసయ్య చెప్పిన ఉపమానంలో చూసుకుంటే, ఒకడు తన ఇల్లు ఇసుకమీద కట్టాడు; మరొకడు బండమీద కట్టాడు. ఈ రెండు ఇల్లుల మీద గాలి, తుఫాను, వరదలు కొట్టడం జరిగింది. అయితే ఇసుకమీద కట్టిన ఇల్లు, పునాది లేనందువల్ల వరదకు, గాలివానకు తిరుగబడిపోయింది. బండమీద కట్టబడిన ఇల్లు దాని పునాది సుస్థిరంగా, దృడంగా ఉన్నందువలన ఇంకా అది బండమీద కట్టబడి నందువలన గాలి, తుఫాను, వరదలు ఏమీ చెయ్యలేకపోయాయి!! ఇక్కడ ఇల్లు నీ విశ్వాసము! గాలి, తుఫాను, వరదలు శ్రమలు, శోధనలు, కష్టాలు. నీ విశ్వాసం దేవునిపై దృడంగా ఉంటే, ఈశ్రమలు, శోధనలు ఏమీ చెయ్యలేవు నిన్ను! నీవు కేవలం Material Blessings కోసమే వస్తే, నీ విశ్వాసపు ఇల్లు కూలి పోక తప్పదు!!!  అయితే నీ విశ్వాసం నిత్యజీవం కోసం, తేజోవాసులస్వాస్థ్యము కోసం అయితే, ఈలోక శోదనలు, శ్రమలు నిన్ను ఏమీ చెయ్యలేవు!!

 

అయితే గతంలో చెప్పిన విధముగా క్రీస్తుమీద ఆనుకొన్న వారికి బండమీద కట్టబడిన వారికి- గాలి, వాన లాంటి శ్రమలు రాకతప్పవు! వాటిని తట్టుకొంటేనే పరలోకం!

 

ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంతలోతుగా తీసి కడితే, అంత బలంగా ఉంటుంది ఆ ఇల్లు! అలాగే శ్రమలయందు వేరుపారినప్పుడునీకు ఎన్ని కష్టాలు, శోధనలు వస్తాయో, నీవు అంత విశ్వాసంలో లోతుకు వేరుపారుతావు! అప్పుడు నీ విశ్వాస స్థాయి / పరిమాణం పెరిగి ఎన్ని కష్టాలు,శోధనలు వచ్చినా ధైర్యంగా ఉండగలవు!

కేవలము Material Blessings కోసం చూస్తే, కష్టనష్టాలలో సోలిపోక తప్పదు!

 

  ఇక పునాది తీసేటప్పుడు రాళ్ళు, చిల్లపెంకులు, గాజుపెంకులు, ఎముకలు లాంటివి ఉంటే తీసిపారేస్తారు! అలాగే నీలో ఉన్న బండలాంటి హృదయం,

లోకాశలు, లోకాచారాలు అన్నీ తీసి పారేస్తే, ఆ పునాది దిట్టంగా ఉంటుంది!

 

    ఇక చివరగా, 1 కొరింథీ 3:11-17 వరకు చూసుకుంటే క్రీస్తు అనీ పునాది మీద కాకుండా ఎవడైనా మరో పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివాటితో కడితే- ఆ పనితనం అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ అగ్ని- శ్రమలు అనే పరీక్షలు! ఇక బంగారం, వెండి వెలగల రాళ్ళు అనేవి వివిధ రకాలైన బోధలు!!

 

   అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు!

 

  ప్రియ చదువరీ!  నీ పునాది దేనిమీద? క్రీస్తుమీదనా?

ధనం మీదా?

శ్రమలలో తట్టుకొంటున్నావా? సోలిపోతున్నావా?

 పరీక్షించుకో!

 

దైవాశీస్సులు!

(ఇంకాఉంది)

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*34వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-4*

 

1కొరింథీ 3:914

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! గతభాగంలో దేవుని గృహముగా విశ్వాసులు ఎలా కట్టబడాలి అనేది చూసుకున్నాము! ఈరోజు దైవసేవకులు దేవుని కట్టడాలు లేక ఆలయమును ఎలా కట్టాలి అనేది చూసుకుందాం!

 

గతభాగంలో ధ్యానం చేసుకున్నాము: అపోస్తలులు ద్వారా అనుగ్రహించబడిన బోధలు, ఉపదేశాలు అనే పునాదిమీద కాకుండా ఇతర భోదలచే నిర్మించబడిన మానవ హృదయాలు గడ్డిలాంటి, మట్టిలాంటి నిలకడ లేని ఇల్లు లాంటివి! ఇవి గాలి-తుఫాను- వర్షం లాంటి అపవాది శోధనలలో కొట్టుకొనిపోతాయి!! అదే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద, క్రీస్తు అనే బండమీద, క్రీస్తు అనే పునాది మీద నిర్మితమైన మానవ హృదయాలు, ఎలాంటి శోదన కలిగిన, తట్టుకొని దేవుని ముందు ధైర్యంగా నిలబడతాయి! ఇలాంటి ఉపదేశం కలిగిన హృదయాలు, లేక ఇలాంటి హృదయం కల్గిన బలత్కారులే దేవునిరాజ్యాన్ని స్వతంత్రించుకొంటారు! అని ధ్యానం చేసుకున్నాము!

 

అయితే బోధిస్తున్న  ఓ నాయకుడా నీవు ఎలాంటి బోధలు చేస్తున్నావు? ఇక్కడ 1115 వచనాలు చూసుకుంటే నీవు కట్టేది క్రీస్తు అనే పునాది మీద ఉండాలని, ఆ పునాది మీద నీవు కడుతున్న పదార్ధాలు అనగా నీవు చేస్తున్న బోధలు అవి వెండి బంగారం ఇత్తడి లాంటి పదార్ధాలతో పోల్చబడ్డాయి! అవి నీవు చేసే ప్రసంగాలు! నీ ప్రసంగం కేవలం అపోస్తలుల బోధమీద, సిలువవేయబడిన క్రీస్తుమీద, పరిశుద్ధాత్మ శక్తి మరియు పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరిచే దృష్టాంతాలు మీదనే ఉండాలి గాని నీ బోధలు సైన్సు చేత మరియు తర్కము వేదాంతము చేత కట్టబడ్డాయా అని చూసుకో! నీ బోధలు పిట్టకధలు మరియు హాస్యకధలు లేక కామెడీ మీద ఆధారపడిందా? లేక నీ బోధ కేవలం వాక్యం మీద అపోస్తలుల బోధమీద పరిశుద్దాత్మ శక్తితో ఉందా పరిశీలించుకో! నీ బోధ సైన్సు చేత పిట్టకదల చేత కామెడీతో ఉంటే ఒకరోజు అగ్నిలాంటి శ్రమలు శోధనలు విశ్వాసులు అనే దేవుని ఆలయము మీద పడితే అప్పుడు ఒకవేళ ఆ దేవుని ఆలయము లేక విశ్వాసుల హృదయాలు చలించి పోయి బ్రష్టులై పోతే నీవు నష్టపడతావు అని పౌలుగారు చెబుతున్నారు ఆత్మావేశుడై!!! ఒకవేళ నీ పని అగ్నిచేత కాల్చబడిన తర్వాత నిలిస్తే అనగా అగ్నిలాంటి శోధనలు విశ్వాసులను బాధించినా ఆ గృహాలు లేక క్రీస్తు నిలయాలు పరిశుద్దాత్మ నిలయాలుగా నిలిస్తే విశ్వాస వీరులుగా నీ విశ్వాసులు లేక నీ సంఘము నిలిస్తే నీవు ధన్యుడవు!

దేవుడు ఒకరోజు అంటారు: భళా నమ్మకమైన మంచిదాసుడా!! అని నిన్ను కోట్లాదిమంది మధ్యలో సెహబాస్ అంటారు!! మరి నీ బోధ దేనిమీద ఉంది ప్రియ దైవసేవకుడా! ప్రసంగీకుడా!!! కాపరీ!!

 

కొలస్సీయులకు 1: 23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

 

  ప్రియులారా! ఈవచనంలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి.

1). పునాదిమీద కట్టబడిన వారు;

2) స్థిరముగా ఉండాలి(విశ్వాసంలో)

3) విన్న సువార్తవలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు!

పై విషయాలు కోసం క్లుప్తంగా ధ్యానం చేసుకందాం!

 

*పునాదిమీద కట్టబడిన వారై*:  ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే: ఒక ఇల్లు కట్టాలంటే దానికి మొదటగా పునాదివేయాలి!  పునాది ఎంత బలంగా కట్టాలో ఆ ఇంటిని బట్టి ఆధారపడుతుంది. ఎంత పెద్ద ఇల్లు అయితే అంత పెద్ద, బలమైన, లోతైన పునాది వేయాల్సిఉంటుంది. అంతేకాకుండా, ఆ పునాది దేనిమీద లేదా ఎక్కడ వేయబడింది అనేది కూడా అవుసరమే! అందుకే పెద్దబిల్దింగ్ కట్టేటప్పుడు Soil టెస్ట్ చేస్తుంటారు.

 

  ఇక్కడ పునాది అనేది సుస్థిరత, భద్రత, ధృఢత్వమునకు సూచనగా ఉంది. అలాగే క్రీస్తుయేసునందు మన విశ్వాసము కూడా ఓలిపోకుండా, సోలిపోకుండా సుస్థిరంగా, ధృడంగా ఉండాలి! ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్టసుఖాలు, కలిమిలేములు వచ్చినా మన విశ్వాసమును కోల్పోకుండా దృడంగా ఉండాలని పౌలుగారి కోరిక! ఇదే పరిశుద్దాత్ముని కోరిక!

పౌలుగారు తను చనిపోయే ముందు, తిమోతికి లేఖ రాస్తూ గొప్ప అమోఘమైన మాట (remarkable statement) అంటున్నారు: మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని! ఇక నాకు నీతికిరీటము ఉంచబడినది! 2 తిమోతి 4:7-8; చూశారా ఆయన విశ్వాసం! దేనియందు సంతోషిస్తున్నారు? తన విశ్వాసాన్ని కాపాడుకొన్నందుకే ఆయన సంతోషం, ధైర్యం! కారణం ఆయనకోసం నీతికిరీటం, మహిమకిరీటం- తేజోవాసుల స్వాస్థ్యము అన్నీ ఎదురుచూస్తున్నాయి. ఆ విశ్వాసం నీకుందా?!!!

 

ఇక ఈ వచనంలో : క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 ఈ మూలరాయి క్రీస్తు! ఇంతకుమునుపు పునాది క్రీస్తు అన్నారు. ఇప్పుడు మూలరాయి క్రీస్తే!  అయితే ఆ మూలరాయియైన క్రీస్తును ఆధారం చేసుకొని, అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. దానిమీద మీరు అనగా సంఘం కట్టబడి ఉన్నది! అనగా యేసయ్యనే ఆధారం చేసుకొని సంఘం ఉండాలి. లోకవిషయాలు గాని, సైన్సుగాని, మీ పాండిత్యం గాని, పిట్టకధలు గాని, మరేదైనా యేసయ్యను substitute చేయకూడదు! అన్నింటికీ యేసయ్యే ప్రధముడై ఉండాలి. ఇక ఆ భోధ అపోస్తలుల భోదయై ఉండాలి! గతబాగాలలో అపోస్తలుల బోధకోసం మనము ధ్యానం చేసుకున్నాం! మరలా తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది!!!

 

అపోస్తలుల భోధ.

👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)

🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:16-35).

🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుద్ధానుడైన యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:22-24).

🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:31-36).

*యేసే-మెసయ్య ; క్రీస్తు అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:22-36).

🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని, ప్రభువని ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:36).

🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

 

🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*

 (అపో.కా 2:38).

🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).

 

*ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41)

 

చివరగా మరోసారి గుర్తుకు చేస్తున్నాను! 1కొరింథీ 3:12-15 వరకుఈ పునాదిమీద ఎవడైనా వెండి, బంగారం, కొయ్య, కర్ర . . లాంటి వస్తువులతో కడితే, ఆ కట్టబడింది అగ్నితో పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలో నిలబడి తట్టుకొని నిలిస్తే, కట్టినవానికి, తట్టుకొన్నవాడికి ఫలము కలుగుతుంది. ఇక్కడ బంగారం, వెండి .. లాంటి వస్తువులు అనగా మీ బోధ అపోస్తలుల బోధయై యుండాలి గాని మీ సొంతమాటలు, సైన్సు, పిట్టకధలు, వేదాంతము కాదు. అవి ప్రజలను ఆకర్షించవచ్చు గాని, వారిని పరలోకం చేర్చలేవు! మీ బోధలు వారిని కష్టాలు తట్టుకొని, ప్రభుకొరకు నిలబడేలా చేయాలి తప్ప ,ఎప్పుడూ Material Blessings కోసమో, ప్రభువును నమ్ముకొంటే మీకు కష్టాలు రానేరావు అనే తప్పుడుభోదలు కాకూడదు!! అలాంటి బోధలు విన్నవారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే విశ్వాస బ్రష్టులైపోతారు. అప్పుడు నీ పని ఇసుకమీద ఇల్లు కట్టినట్టే! నీవు కట్టిన వెండి, బంగారం లాంటి వస్తువులు శోధన అనే అగ్నిని తట్టుకోలేక , కరిగిపోతే, కనబడటం లేదు కాబట్టిసోమరివైన చెడ్డదాసుడా! అని పిలువబడతావు!

 

 కాబట్టి ప్రియ సేవకులారా! సంఘాన్ని అపోస్తలుల బోధపై కట్టండి.

విశ్వాసులారా! మీ విశ్వాసాన్ని కాపాడుకోండి పౌలుగారిలా!

అప్పుడే మీకోసం నీతికిరీటం రడీగా ఉంటుంది.

లేదా ఇసుకమీద కట్టిన ఇంటిలా మీ విశ్వాసం పేకమేడలా కూలిపోయి, రెంటికీ చెడ్డ రేగడి అయిపోతుంది.

 కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో!

 

దైవాశీస్సులు!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*35వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-5*

 

1కొరింథీ 3:915

9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

11. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే.

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14.​ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును

15.​ ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! గతభాగాలలో చెప్పినవి మరోసారి క్లుప్తంగా మీకు గుర్తుకు చెయ్యాలని అనుకుంటున్నాను!

 

9వ వచనం ప్రకారం దైవసేవకులంతా దేవునితోటలో జతపనివారు! ఒకరు గొప్ప ఒకరు పనికిరాని వారు కారు! అందరూ సమానమే!!

 

11వ వచనంలో వేయబడినది తప్ప మరో పునాది లేదు, ఆ పునాది యేసుక్రీస్తే!!!

పౌలుగారు యేసుక్రీస్తు ప్రభులవారు పునాది అని కొరింధీ పత్రికలో చెబితే ఎఫెసీ పత్రికలో మూలరాయి అంటున్నారు దైవాత్మ సంభూతుడై!

ఎఫెసీయులకు 2: 20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

 పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభులవారు మూలరాయి అని చెబుతున్నారు!

1 Peter(మొదటి పేతురు) 2:5,6,7

5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.

7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

 

యెషయా 28: 16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

ఇళ్ళు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి. అది దానినుంచి కట్టబడే గోడలను నిటారుగా చక్కగా ఉంచుతుంది. ఈ విధంగా కట్టడం అంతటికీ స్థిరత్వం, సౌందర్యం ఇస్తుంది.

 

యేసుక్రీస్తు ప్రభులవారు కూడా మన దేవుని ఆలయమునకు మూలరాయి వలే ఉంటూ నిన్ను పరలోకం చేరేవరకు నడిపిస్తారు! అయితే నీ హృదయమనే దేవాలయమును క్రీస్తుయేసు మీదనే కట్టాలి! నీ మనస్సు ,ఆత్మ మూలరాయి మీదనే కేంద్రీకృతం చేయాలి తప్ప, మరో విషయాల మీద లోకము మీద నీ మనస్సు ఆత్మ నిలిపితే నీ హృదయమనే దేవాలయంలో మరియు  నీ దేహమనే దేవాలయంలో లోకముంటే సాతాను గాడు నివాసం చేసి నిన్ను దయ్యాల కొంపగా చేసేస్తాడు! అప్పుడు నీవు బ్రష్టుడవై నరకపాత్రుడుగా మారతావు!

 

నిర్గమ 25:8

నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

 

ప్రకటన 21:3

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

 

 ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయం యేసు క్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలోనూ నిజ దేవుడు లేడు

అపొ కా 17:24-25.

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.

 

 సరే, ఇక ఈ వచనాలలో ఉన్న మరో ఆత్మీయ మర్మములు కూడా దాగి ఉన్నాయి! పౌలుగారు విశ్వాసులను కేవలం దేవుని గృహము గాను దేవుని ఆలయముగానే కాదు ఇంకా చాలా విదాలతో పోల్చారు! అవి ఒకసారి ధ్యానం చేసుకుని ముందుకుపోదాం!

 

క్రీస్తుయేసు విశ్వాసులు దేవుని ఇల్లు, దేవుని ఆలయం కూడా.

1 కొరింతు 3:16;

 

1కోరింథీయులకు 6: 19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

 

1 పేతురు 2:4-5.

 

విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలుగారు  ఎఫెసీ పత్రికలో ఎన్ని రకాల మాటలను వాడుతున్నాడో చూడండి.

 *వారు దేవుని సంతానం*

ఎఫెసీయులకు 1: 5

తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,

 

*దేవుని స్వాస్థ్యము లేక వారసత్వం*

ఎఫెసీయులకు 1: 17

మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

 

*దేవుని కుమారుని శరీరం*

ఎఫెసీయులకు 1: 23

ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

*దేవుడు చేసినవారు*

ఎఫెసీయులకు 2: 10

మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

 

దేవుని ప్రజలు, దేవుని పరలోక పౌరులు, దేవుని ఇల్లు 2:19;

ఎఫెసీయులకు 2: 19

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.

ఎఫెసీయులకు 2: 20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

సరే ఇక ముందుకుపోతే దేవుని ఆలయం అనగా

ఆరాధన, దేవునికి అర్పణలు జరిగే స్థలం దేవాలయం. ఆయన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం కూడా అంతే రోమ్ 12:1;

అందుకే రోమీయులకు 12: 1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

 హెబ్రీ 13:15-16

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని. ....

 

పై వచనాలన్నీ చదివి అర్ధం చేసుకుంటే దేవుడు నిన్ను తనకు ఏవిధంగా ఉండాలో తన ఏర్పాటు అర్ధమవుతుంది! నిజంగా దీనిని అర్ధం చేసుకున్నవారు దేవునినుండి కుడిఎడమలకు తిరుగరు!!!

 

3:10 వచనంలో  పౌలుగారు తనలో ఏమీ లేదని చెప్పారు. ఇక్కడ క్రీస్తు సేవకుడుగా తాను చేసినదంతా దేవుని కృపవల్లే అంటున్నారు. తన సమర్థతలు, అవకాశాలు అన్నీ దేవుడే ఉచితంగా ఇచ్చినవి. 2 కొరింతు 3:5-6

 

5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.

అలాగే ప్రతీ సేవకుడు తననుతాను తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చించాలి!

 

ఇక 11వ  వచనంలో పునాదికోసం చెబుతున్నారు!

యెషయా 28:16

ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

 

అపొ కా 4:11

ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

 

ఎఫెసు 2:20

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

 

 పేతురు 2:6.

 

పౌలుగారు  క్రీస్తుయేసును గురించిన సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఉపదేశించడం ద్వారా తనలో పని చేస్తున్న దేవుని ఆత్మ ప్రభావం మూలంగా మనుషులను క్రీస్తులో నమ్మకం పెట్టుకొనేలా నడిపించడం ద్వారా కొరింథీలో పునాది వేశారు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్ళిపోయారు. కట్టేవారు ఇతరులు అక్కడ పని మొదలు పెట్టారు.

 

3:12వ వచనంలో కట్టేవారు ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండి దేవుని వాక్కులోని అమూల్య సత్యాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించేవారైతే వారు కట్టేదానిలో విలువ గల లోహాలు, మణిమాణిక్యాలూ వాడుతున్నట్టన్నమాట. అలా కాకుండా వారు లోక సంబంధులు, సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఉంటే వారు చెక్క, గడ్డి, కసవును ఉపయోగిస్తున్నారన్నమాట.

 

3:13-15 వచనాలు చూసుకుంటే:  తన సేవకులందరి పనికీ దేవుడు తీర్పు తీర్చే రోజు గురించి పౌలుగారు మాట్లాడుతున్నారు.  13వ వచనంలో అది తేటతెల్లం చేసే తీర్పు, మంటలతో లేక శ్రమలు శోధనలవలన వచ్చే తీర్పు, పరీక్షించే తీర్పు అని దాని గురించి పౌలు వివరిస్తున్నారు. ఒక మనిషి చేసిన పని ఎంత అన్నది కాదు ఆ రోజున వచ్చే ప్రశ్న. దాని నాణ్యత ఎలాంటిది అని చూడడం జరుగుతుంది. దేవుని అగ్నిపరీక్షకు ముందు కంటికి చక్కగా కనిపించడం కాదు. దాని తరువాత ఏమి మిగిలి ఉంది అన్నది ముఖ్యం. ఎంత శ్రద్ధగా, భయం, వణకుతో (2:3) దేవుని సేవకులు తమ పని చెయ్యాలో గదా!

కాబట్టి ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకుని పరిచర్య చెయ్యాలి! మీద చెప్పిన విషయాలు గ్రహించి విశ్వాసులు తాము వినే బోధల విషయంలో జాగ్రత్తపడాలి!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*36వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-6*

 

1కొరింథీ 3:1617

16. మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక- మీరును పరిశుద్ధులైయున్నారు) .

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

 

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇంతవరకు విశ్వాసులు దేవుని వ్యవసాయమని దేవుని గృహమని దేవుని ఆలయమని పౌలుగారు మనకు వివరించారు!

 ఇక 1617 వచనాలలో మీరు దేవుని ఆలయము అని, ఎవడైనా దేవుని ఆలయమును పాడుచేస్తే దేవుడు వానిని పాడుచేయును అంటున్నారు!

 

 గమనించాలి :వ్యక్తిగతంగానూ, సమూహంగానూ కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయమైయున్నారు. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం !

 

రోమా 12:1-2;

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

2. మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

హెబ్రీ 13:15-16;

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని. ...

 

1పేతురు 2: 5

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

 

ఇంకా కీర్తనల గ్రంధం ప్రకారం  దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం అది కీర్తన 11:4;

కీర్తనలు 11: 4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

 

రోమీయులకు 8: 9

దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.

 

అయితే  దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయం విశ్వాసులు మాత్రమే. దేవుణ్ణి, ఆయన విశ్వాసులను తిరస్కరించేవాడు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళవచ్చు గానీ దేవుడు అక్కడ ఉండరు!!

 

అపొ కా 17:24

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

 

ఇక్కడ  ఇప్పుడు పాడు చెయ్యడం అంటే ఇక్కడ గాయపరచడం, హాని చేయడం, చెడగొట్టడం అని అర్థం. విశ్వాసులు దేవుని ఆలయాన్ని నాశనం చెయ్యరు. వారే ఆయన ఆలయం. ఆ రోజుల్లో (ఈ కాలంలో కూడా) అనేక క్రైస్తవ సంఘాల్లో గందరగోళం కలిగిస్తూ ఉన్న కపట బోధకులను దృష్టిలో ఉంచుకుని పౌలుగారు ఈ మాట చెబుతున్నారు

 రోమా 16:17-18.

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

 

కొరింథీ సంఘములో ఇలాంటివారు కొందరు క్రీస్తు సిలువను అలా ఉంచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, సువార్తను కలిపిచెరుపు తున్నారు!

2 కొరింతు 11:4, 13-15, 18

4. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే.

13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు

15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.

18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

 

దేవుని ఆలయాన్ని పాడు చేసేది అలాంటి ఉపదేశమే. తన పవిత్రమైన పనిని పాడు చేసేందుకు చూచే మనుషులతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడన్న విషయంలో సందేహం అవసరం లేదు.

 

సరే, ఇక విశ్వాసులు యొక్క మనస్సులే కాకుండా విశ్వాసుల యొక్క దేహము కూడా దేవుని మందిరం లేక ఆలయము అని మనము 1కొరింథీ 6:1920 వచనాల ప్రకారం చూసుకోవచ్చు!!...

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

ఇంకా అప్పుడు దేవుని ఆలయమును నీ దేహమును పాడు చేసేవి నీ ఆలోచనలు అని యేసయ్య చెబుతున్నారు....

Matthew(మత్తయి సువార్త) 15:18,19,20

 

18. నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

19. దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును

20. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

 

ఇంకా నీ పాడు అలవాట్లు కూడా నీ దేహాన్ని పాడు చేస్తాయి నీ త్రాగుడు, నీ వ్యభిచారం, ఇలాంటి దురలవాట్లు నిన్ను నీ దేహాన్ని నీ దేహమనే దేవుని ఆలయమును పాడుచేస్తాయి కాబట్టి వాటికీ దూరంగా ఉండాలి!!! నీ దేహము దేవుని ఆలయము!! 1కొరింథీ 6:1920

 

కాబట్టి మన దేహముతో మనము దేవున్ని మహిమ పరచాలి గాని మరో స్త్రీని గాని, నిన్ను నీవు గాని సుఖపెట్టుకోడానికి కాదు! ఆ ధనవంతుడు తనకు విస్తారమైన పంట పండింది అని తననుతాను సుఖపెట్టుకోవాలని చూశాడు, అనుకుంటున్నాడు: నా ప్రాణమా! అనేక సంవత్సరాలకు సరిపోయే పంట నీకు పండింది కాబట్టి సుఖించుము తినుము త్రాగుము!! అయితే దేవుడు అంటున్నారు: వెఱ్రివాడా! ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, అప్పుడు నీవు సంపాదించినవి అన్ని ఎవడిపాలు అవుతాయి??? అలాగే మనము మన దేహాన్ని మన కోరికలను సంతోషపెట్టుకోవాలని చూస్తుంటే అదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నారు!!! లూకా 12: 16--21

 

కాబట్టి నీ దేహమును లేక దేహమనే ఆలయమును పాడుచేస్తావా లేక శుభ్రముగా కాపాడుకుని దానిలో దేవునికి అర్పణలు బలియాగాలు అర్పిస్తావా? అనగా ప్రార్ధనలతోను యాచనలతోను స్తుతులతోను సంగీతములతోను పరిశుద్ధాత్మ క్రియలతోను నీదేహమును నీ హృదయమును కాపాడుకుంటావా??

నీ దేహమును దేవునికి నిలయంగా చేస్తావా? లేక సాతాను గాడి అడ్డాగా చేస్తావా?

పరిశుద్దాత్మకు స్థావరంగా మారుస్తావా? లేక పేకాట మందిరంగానో వ్యభిచార గృహంగానో మారుస్తావా?

నేడే పరిశీలించుకుని ఏది కావాలో నిర్ణయించుకో!!!

 

దైవాశీస్సులు!!!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*37వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-7*

 

1కొరింథీ 3:1823

18. ఎవడును తన్నుతాను మోసపరచు కొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.

19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కు యుక్తిలో ఆయన పట్టుకొనును;

20. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.

21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.

23. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 9వ వచనం నుండి చివరివరకు చూసుకుంటే సంఘాన్ని రెండు విధాలుగా పోల్చారు ఆత్మావేశుడై పౌలుగారు! మొదటిది మీరు దేవుని వ్యవసాయము, రెండవది: దేవుని గృహము!!!

        మనము దేవుని వ్యవసాయము  దేవుని గృహము కోసం చూసుకుంటున్నాం!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇంతవరకు దేవుని గృహము దేవుని తోట లేక దేవుని వ్యవసాయము అని విశ్వాసుల కోసం చెప్పారు! ఇక ఈ అధ్యాయం చివర్లో ఈ ఆత్మీయమర్మాలు అన్నీ బోధించాక చెబుతున్నారు పౌలుగారు: మీరు దేవుని తోట మరియు ఇల్లు, మేము పనివారము! లోకము మరణం జీవం పరలోకం పౌలు పేతురు అపోల్లో  అన్నీ మీకోసమే అనగా విశ్వాసుల కోసమే! కాబట్టి విశ్వాసులు ఒకరికంటే ఒకరు ఎక్కువకారు సేవకులు ఒకరికంటే ఒకరు తక్కువ కారు! అందరూ క్రీస్తుకు చెందిన వారు క్రీస్తు దేవునికి చెందిన వారు అని చెప్పి ముగిస్తున్నారు!

 

ఒకసారి ఈ వచనాలలో ఏవి వ్రాయబడ్డాయో క్లుప్తంగా చూసుకుందాం!

 

18వ వచనం: ఎవరూ తమనుతాము మోసం చేసుకోకూడదు! ఇంకా మీలో ఎవడైనా ఈలోకంలో తానూ జ్ఞానిని అని అనుకుంటే వాడు జ్ఞాని అయ్యేలా వెఱ్రివాడు కావాలి!! ఇది అర్ధం కాలేదు కదా!!

జ్ఞాని అనగా దేవుని దృష్టిలో జ్ఞాని ఎవరు? లోక సంబంధమైన విషయాల వెనుక లోక సంబంధమైన జ్ఞానమును వెంటాడే వారు కానేకారు! ఆ లోకసంబంధమైన జ్ఞానమును త్రోసిపుచ్చి క్రీస్తుయేసు సిలువ సువార్తను నమ్మి దానియందు కొనసాగేవారు! ఆధ్యాత్మిక జ్ఞానవంతులు! వారు ఆధ్యాత్మిక సంగతులమీద మనస్సు పెడతారు!! గాని 1:18, 24 వచనాల ప్రకారం ఇలాంటివారిని లోకం వెఱ్రివారు అంటుంది!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:18,24

18. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

కాబట్టి దేవుని దృష్టిలో జ్ఞానులు కావాలంటే లోకం దృష్టిలో వెఱ్రివారు కావాలి అంటున్నారు!!

ఇక ఎవడూ తననుతాను మోసగించుకోగూడదు అంటున్నారు! ఇదే పత్రిక 6:9 లో అంటున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారని మీకు మీకు తెలియదా అంటూ మోసపోకుడి అంటూ కొంతమంది లిస్టు చెబుతున్నారు పౌలుగారు, వీరు తమనుతాము మోసం చేసుకుంటున్నారు వీరు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటున్నారు.....

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:9,10

9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను

10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

 

ఇక 15:౩౩ లో కూడా అంటున్నారు పౌలుగారు: మోసపోకండి దుష్ట సహవాసం మంచి నడవడిని చెరిపివేయును అంటున్నారు! అనగా దుష్టులతో సహవాసం చేసేవాడు తనయొక్క మంచి ప్రవర్తనను చెడగొట్టుకుని తనను తానూ మోసం చేసుకుని నరకానికి పోతున్నాడు అన్నమాట!!

 

 కాబట్టి దేవుని బిడ్డలారా! మిమ్మును మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేక మీద చెప్పిన లిస్టులో ఉన్న మనుష్యుల వలెనే మీరు కూడా ప్రవర్తించి మిమ్మును మీరు మోసం చేసుకుని నరకానికి పోతున్నారా పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!!

 

 ఇక 19వ వచనంలో ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెఱ్రితనము మరియు తెలివితక్కువ తనము!!  ఆయన జ్ఞానులను తమ సొంత కుయుక్తిలోనే పట్టుకోనును అని వ్రాయబడింది! ఎక్కడ వ్రాయబడింది? యోబు 5:13 లో...

జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టు కొనును కపటుల ఆలోచనను తలక్రిందు చేయును

 

అందుకే ఇదే పత్రిక 1:20 లో అంటున్నారు పౌలుగారు .......

జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు (మూలభాషలో- ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

 

ఇక 20వ వచనంలో జ్ఞానుల ఆలోచనలు వ్యర్ధములని ప్రభువునకు తెలుసునని వ్రాయబడియున్నది ఎక్కడ వ్రాయబడి ఉంది?

కీర్తనలు 94: 11

నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.

 

మన సొంత జ్ఞానము వ్యర్ధము మరియు తెలివితక్కువ తనము గనుక పరలోకయాత్రలో మన సొంత తెలివితేటలూ మన జ్ఞానమును నిరాకరించి సిలువసువార్తను పట్టుకుని ముందుకుపోవాలి! ఆ సిలువసువార్తనే ప్రకటించాలి!! ఇదీ పౌలుగారి ఉద్దేశ్యం!!!

 

ఇక 20-23 వరకు అసలు సంగతికి వచ్చేశారు! కాబట్టి ఇప్పుడు మనిషి ఎవడూ ఇతర మనుష్యులను బట్టిగాని లేక మీ అయ్యగారి బట్టి గాని మీ ప్రవక్త బట్టి గాని మరో ఎవరిని బట్టో అతిశయించకూడదు ఎందుకంటే పౌలుగారి అపోల్లో గాని కేఫా గాని లోకము గాని బ్రతుకు గాని మరణం గాని జీవము గాని ఇప్పుడు ఉన్నవి గాని రాబోయేవి అనగా పరలోకంలో నిత్యత్వంలో మీరు పొందుకోబోయే ఏవైనా గాని అవన్నీ మీవే!!! మీరు క్రీస్తువారు! క్రీస్తు దేవుని వాడు అంటున్నారు పౌలుగారు! ఇదంతయు జరిగిన తర్వాత తేలిన ఫలితార్ధమిదే అంటూ సోలోమోను ఎలా చెబుతున్నారో అలాగే ఇక్కడ పౌలుగారు కూడా ఇదంతా చెప్పి మీరు ఎవ్వరికోసం అతిశయపడవద్దు! మేమూ మేమూ అంతా దేవుని జత పనివారం! మేము మీకోసమే ఉన్నాము! అలాగే రాబోయే విషయాలు కూడా మీకోసమే! మీరైతే క్రీస్తు వారు క్రీస్తుకోసం! క్రీస్తుయేసు దేవునికోసం ఉన్నారు అంటూ తేల్చి చెబుతున్నారు!! కాబట్టి మీరు మీలో మీరు తగవులాడుకుని విబేధాలు పెట్టుకుని విడిపోవద్దు అంటున్నారు!!

 

గమనించాలి మనుష్యులు దేవుని చేతిలో కేవలం సాధనాలు! ఆ సాధనాలను తయారుచేసి ఉపయోగిస్తున్నది దేవుడే! కనుక వారు మీకొరకు వాడబడేటట్టు చేస్తున్న దేవునికే స్తుతులు చెల్లించాలి గాని వాడబడుతున్న మనుష్యులకు స్తుతులు చెప్పొద్దు అంటున్నారు పౌలుగారు!! ఇదే మనకు 4వ వచనం లోను 1:12, 29, 31 వచనాలలో కూడా చెప్పారు!!!

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:12,19,27,28,29,31

 

12. మీలో ఒకడునేను పౌలువాడను, ఒకడునేను అపొల్లవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

 

దేవుడు తన విశ్వాసుల మేలుకోసం తన సేవకులను నియమించారు! ఇదే మనకు ఎఫెసీ 4:1113 లో చెప్పబడింది...

 

11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,

12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 

ఇంకా హెబ్రీ పత్రికలో ఇంకా చెబుతున్నారు హెబ్రీయులకు 1: 7

తన దూతలను వాయువులుగాను (లేక, ఆత్మలుగాను) తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు

 

అదే సమయంలో విశ్వాసులను దేవుని తోటలో నాటి నీరుపోసి ఎదిగేలా చేసే ఈ పొలము మరియు భూమి దేవుడే! ఈ జీవితంలో జరిగే సంభవాలు అన్నీ దేవుడు విశ్వాసుల మేలుకే చేస్తున్నారు!

రోమీయులకు 8: 28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

 

చివరికి చావు కూడా మనిషికి మంచిదే!! చావు కూడా విశ్వాసులదే! వారి ఈ మర్త్యమైన దేహము నుండి, ఈ పాపలోకమునుండి పాపమునుండి, తాము పడే కష్టాల నుండి రోగాల నుండి ఆకలిదప్పుల నుండి విడుదల పొంది దేవునితో మరింత ఉన్నతమైన ఉత్తమమైన జీవితానికి తలుపులు తెరిచే మంచి బహుమానం ఈ చావు లేక మరణం!! కాబట్టి చావుకు భయపడకూడదు!

 

ఇంకా రాబోయే కాలంలో లేక వారికి సంభవించబోయే విషయాలు కూడా వారివే! అనగా తేజోవాసుల స్వాస్థ్యము గాని, పరలోకంలో పొందుకోబోయే బహుమానాలే గాని మహిమదేహము గాని వెయ్యేండ్ల పాలనలో పొందుకోబోయే అధికారమే గాని అన్నీ విశ్వాసులవే! ఎందుకంటే వారు దేవుని వారసులు!!

రోమా 8:17

మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

రోమీయులకు 8: 18

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

 

మత్తయి 5:5

సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

 

ఎఫెసీ 1:14

దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

ప్రకటన 21:7

జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.

 

కాబట్టి మనుష్యుల విషయంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పౌలుగారు! ఒకరికన్నా మరొకరిని మీకుమీరే గొప్పచేసుకుని పౌలుగారు గొప్పోడు అపోల్లో గారు గొప్పోడు మా అయ్యగారు గొప్పోడు మీ అయ్యగారు తక్కువ అని చెప్పుకోకూడదు! అందరూ మీకు పరిచారం చెయ్యడానికే ఉన్నారు! మీరు యేసయ్య కోసం ఉన్నారు! యేసయ్య దేవునికోసం అంటున్నారు!

కాబట్టి ఇప్పుడు విశ్వాసులు క్రీస్తుకి చెందిన వారు కనుక మనుష్యులకు చెందిన వారు కనుక ఇక మనుష్యుల కోసం అతిశయ పడకూడదు!  కాబట్టి విశ్వాసులు దేవునికోసమే ప్రభువు కోసమే అతిశయించాలి 1 కొరింథీ 1:31

 

ఇప్పుడు క్రీస్తు దేవుని వాడు అని క్రింద రిఫరెన్సుల ద్వారా తెలుస్తుంది

(1కొరింథీ 11:౩,15:28, మత్తయి ౩:17, యోహాను 14:28)

 

కాబట్టి ఎవరినీ కోసం అతిశయ పడవద్దు! తగవులాడుకోవద్దు!

దేవునియందు ప్రభువుయందు మాత్రమే అతిశయపడదాం!

 ప్రభువుప్రేమను పంచుదాం!

దైవాశీస్సులు!!!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*38వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-8*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 4వ అధ్యయము ధ్యానం చేద్దాం! ఈ 4వ అధ్యాయం కూడా 2,3 అధ్యాయాలు దేనికోసమైతే చెప్పబడ్డాయో అదే విషయాన్ని ఇంకా కొంచెము లోతుగా మరో కోణంలో చెబుతున్నారు! మరుగైయున్న జ్ఞానము పొందుకున్నామనియు, దేవుని సేవకులంతా జతపనివారలు అనియు చెప్పి విశ్వాసులు దేవునియొక్క గృహము అనియు వ్యవసాయము అని చెప్పారు కదా, అదే మరో కోణంలో మేము అంతా జతపనివారము కాబట్టి మీరు ఒకరిమీద ఒకరు అతిశయపడవద్దు, ఒకరికోసం మరొకరు తీర్పు తీర్చవద్దు అనేది ఈ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం!!!

 

మొదటి వచనంలో ఈలాగున క్రీస్తుసేవకులమనియు అని మొదలుపెట్టారు ఈ 4వ అధ్యాయం! అనగా మొదటివచనంలో తెలుస్తుంది ఇది మూడో అధ్యాయానికి కొనసాగింపు అని! మూడవ అధ్యాయం ఏమి చెబుతుంది? దేవుని సేవకులంతా జతపనివారలు అని చెప్పి, విశ్వాసులు దేవునియొక్క గృహము అనియు, దేవుని యొక్క వ్యవసాయము అనియు చూసుకున్నాము, అంతేకాకుండా క్రీస్తుయేసు పునాది మరియు మూలరాయిగా ఉండి సంఘమనే గృహాన్ని కడుతున్నారు, క్రీస్తుయేసు పునాది మరియు మూలరాయి అయితే కొరింథీ సంఘంలో ఆ పునాదిని వేసింది పౌలుగారు, అపోల్లో గారు దానిని కట్టారు అనియు,

ఇంకా కొరింథీ సంఘములో దేవుని వ్యవసాయము అనే పొలంలో పౌలుగారు విత్తనాలు జల్లితే అపొల్లోగారు నీరుపోసి పెంచారు అనేది మనకు మూడవ అధ్యాయంలో కనిపిస్తుంది, కాబట్టి పౌలుగారు అపొల్లోగారు పేతురు గారు ఎలా దేవునితోటలో జతపనివారో అలాగే నేడు సేవకులంతా దేవునితోటలో జతపనివారు గనుక ఏ సేవకుని బట్టి అతిశయపడక వారికి కృపావరములు ఇచ్చి వాడుకునే క్రీస్తుయేసు ప్రభువునందు అతిశయపడాలని నేర్చుకున్నాము కదా, ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నారు!

 కాబట్టి ఈలాగున మేము క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతీ మనుష్యుడు మమ్మును అనగా దైవసేవకులను భావించాలి అంటున్నారు!

 

మూడో అధ్యాయంలో దేవుని తోటలో మేము జతపనివారలము అని పరిచయం చేసుకుంటే ఈ అధ్యాయంలో మేము దేవుని గృహము యొక్క గృహనిర్వాహకులము అని పౌలుగారు పరిచర్యం చేసుకుంటున్నారు! తోటలో జతపనివారు, గృహంలో గృహనిర్వాహకులు!!!

పౌలుగారు ఈ అధ్యాయంలోనే కాకుండా తన పత్రికలలో అనేకసార్లు తానూ దేవుని ఇంటిలో  గృహనిర్వాహకుడు అనియు, తాను కోరుకోకపోయినా గృహనిర్వాహకత్వము తనకు దొరికింది అది ఎవరూ ఇవ్వలేదు దేవుడే ఇచ్చారు అనియు మనము చూడగలము!!!

 

1కొరింథీ 9:17

ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

 

ఎఫెసీయులకు 3: 2

మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక, గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

కొలస్సీ 1:26

మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు (గృహనిర్వాహకత్వము) ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.

 

పేతురు గారు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు 1పేతురు 4:10

దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.

 

సరే, ఇక్కడ ఒక విషయం నిర్ధారణకు వచ్చింది! దైవసేవకులు అందరూ దేవుని గృహంలో గృహనిర్వాహకులు! అయితే 2వ వచనంలో గృహనిర్వాహకులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం కోసం పౌలుగారు రాస్తున్నారు!!! మరియు గృహ నిర్వాహకులలో ప్రతీవాడును నమ్మకమైన వాడై ఉండాలి!!! ఇది ముఖ్య లక్షణం! ప్రతీవాడు నమ్మకమైన వాడుగా ఉండాలి, ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు!!!  అనగా దైవసేవకులు ప్రతీఒక్కరు దేవుని సేవలో దేవుని గృహంలో పరిచారకత్వంలో తప్పకుండా నమ్మకముగా ఉండాలి, లేక విశ్వతనీయత కనపరచాలి!!!

 

గమనించాలి దేవుని ఇంటిలో మొట్టమొదటి గృహనిర్వాహకుడు యేసుక్రీస్తుప్రభులవారు ఆయన తండ్రియైన దేవునికి నమ్మకముగా ఉన్నారు అని హేబ్రీపత్రికలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు 3:2,5,6

Hebrews(హెబ్రీయులకు) 3:2,5,6

 

2. దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థ ముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

అలాగే సేవకులు కూడా అందరూ నమ్మకముగా ఉండాలి!!

 

యేసుక్రీస్తు ప్రభులవారు ఎన్నో ఉపమానాలు గృహనిర్వాహకుల కోసం చెప్పారు, ......

మత్తయి 24; లూకా 16;

వారిలో కొందరిని భళా నమ్మకమైన మంచిదాసుడా అని పిలిచారు!!!

మత్తయి 25:21, 23, లూకా 19:17

 

Matthew(మత్తయి సువార్త) 25:21,23

21.అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

23.అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని (మూలభాషలో- ప్రవేశించుమని) అతనితో చెప్పెను.

 

ప్రతీ విషయంలోనూ నమ్మకముగా ఉండాలి అంటున్నారు దేవుడు  లూకా 16:10,

లూకా 16: 10

మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

 

గృహనిర్వాహకత్వతము- నమ్మకము కోసం చూసుకుంటే మొదట మనకు గుర్తుకు వచ్చేది- యోసేపు గారు! గతశీర్షిక ఫలించేది కొమ్మ లో మనం ధ్యానం చేశాము- పోతీఫర్ ఇంటిలో నమ్మకముగా ఉన్నందువలనే గృహనిర్వాకునిగా చేశాడు పోతీఫర్! అలాగే జైలులో నమ్మకముగా ఉన్నందువలన జైలు నిర్వాహకునిగా లేక గృహనిర్వకత్వము దొరికింది! అక్కడ నమ్మకముగా ఉన్నారు- చివరికి ఐగుప్తు దేశము యొక్క గృహనిర్వాహకత్వము దొరికింది యోసేపు గారికి!!

 

ఇక ఏ ఏ విషయాలలో నమ్మకముగా ఉండాలి అంటే యేసుక్రీస్తుప్రభులవారి ఉపమానాలలో సిరియందు  నమ్మకముగా ఉండాలి...

ధనము విషయము నమ్మకముగా ఉండాలి.

లూకా 16: 12

మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?

 

ఇంకా దాసులకు పెట్టుటలో పోషించుటలో నమ్మకముగా ఉండాలి...

Matthew(మత్తయి సువార్త) 24:45,46,47

45. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

47. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

సరియైన సమయమునకు నీ మందకు మేత పెట్టాలి! ఎప్పుడూ ఒకేరకమైన మేత కాకుండా బైబిల్ మొత్తంలో తీసుకుని మేత పెట్టాలి! అవసరమైనప్పుడు ఖండిచి గద్దించి బుద్ధిచెప్పే మేత పెట్టాలి!

తిమోతి పత్రికలు రెండు, తీతు పత్రిక ఈ మూడు పత్రికలు పౌలుగారు గృహనిర్వాహకత్వపు భాద్యతలు తిమోతి గారికి తీతుకు గారికి అప్పగిస్తూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పినవే! అనగా గృహనిర్వాకత్వము యొక్క భాద్యతలు మొత్తం ఈ మూడు పత్రికలలో ఎన్నో ఉన్నాయి!

 

కాబట్టి ప్రియ దైవజనుడా! గృహనిర్వాహకత్వము నీకు అనుగ్రహించబడింది గనుక నీవు నమ్మకముగా ఉంటున్నావా?

 

చివరిగా చివరి సాతాను- యేసుక్రీస్తుప్రభులవారి యుద్ధంలో యేసుక్రీస్తుప్రభులవారు విజయం సాధించటానికి కారణం ప్రకటన గ్రంధంలో రాస్తూ మొదటగా యేసుక్రీస్తుప్రభులవారు రాజులరాజు ప్రభువులకు ప్రభువు అని చెబుతూ, తనతో ఉన్నవారు పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును చివరగా నమ్మకమైన వారు కాబట్టి ఆ యుద్ధంలో విజయం కలిగింది!

ప్రకటన గ్రంథం 17: 14

వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

 

మరి ఓ గృహ నిర్వాహకుడా! దేవుని గృహంలో గృహనిర్వాహకత్వమునకు నీవు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు, అయితే నీవు నమ్మకముగా ఉంటున్నావా???!!!

యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు:

మత్తయి 22: 14

కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

 

కాబట్టి నీవు నమ్మకముగా ఉన్నావా లేక లోకముతో కలిసిపోతున్నావా??

ధనము నిన్ను ఆకర్షిస్తుందా?

 పేరు ప్రతిష్టలు నిన్ను దారి తప్పిస్తున్నాయా?

లేక లోకాశలు నిన్ను బ్రష్టు పట్టిస్తున్నాయా??!!

 ఒకసారి పరిశీలించుకుని ఒకవేళ గృహనిర్వాహకత్వములో ఏదైనా తేడా కనిపిస్తే ఇప్పుడే దేవుని దగ్గర తప్పు ఒప్పుకుని సమాధాన పడు! లేకపోతే సోమరియైన చెడ్డదాసుడా అని పిలిపించుకుని అగ్నిగుండములో వేయబడతావు!!

మత్తయి 25: 26

అందుకు అతని యజమానుడు వానిని చూచి: సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?

మత్తయి 25: 30

మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

 

అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంది అని మర్చిపోవద్దు!

నేడే రక్షణ దినము!

ఇదే అనుకూలసమయము!!!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*39వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-9*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! ఇక మనము 4వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నాము! గతభాగంలో గృహ నిర్వాహకత్వము దైవసేవకులకు అప్పగించబడింది కాబట్టి మొదటగా నమ్మకముగా ఉండాలని ధ్యానం చేసుకున్నాము! మోషేగారు దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్లు ప్రతీ దైవసేవకుడు దేవుని సేవా పరిచర్యలో నమ్మకముగా ఉండాలని ధ్యానం చేసుకున్నాము!

 

  కారణం: వారు బోధించే వర్తమానాలు వారి సొంతవి కాకూడదు! పౌలుగారు గాని లేక ఇతర అపోస్తలులు గాని వారు బోధించిన సువార్త వారు కల్పించి చెప్పలేదు! దేవుడు వారికి ఏమి నేర్పించారో ఏవి వెల్లడించారో అవే చెప్పారు, అవే రాశారు! కాబట్టి బోధయందు నమ్మకముగా ఉండాలి! విశ్వాసులు కూడా ఈ విషయం గ్రహించి అందరూ దైవసేవకులు దేవునికి సమానమని కొందరు ఎక్కువ కొందరు తక్కువ అని భావించకూడదు అని పౌలుగారు చెప్పారు!

1కొరింథీ 2:7

దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,7,10

5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి

7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

10. దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

 

రోమా 16:25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

గలతీ 1:1112

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

Ephesians(ఎఫెసీయులకు) 3:2,3

2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును (లేక, గృహనిర్వాహకత్వము) గూర్చి మీరు వినియున్నారు.

3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

ఇక మూడవ వచనంలో మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకోను ఎందుకంటే నాలో నాకు ఏ దోషము పాపము కనబడదు, నాలో నాకు ఏదోషము కనబడటం లేదు కనుక నేను నీతిమంతుడిగా ఎంచబడతానా అంటే కానేకాదు! విమర్శించవలసినది దేవుడే అంటున్నారు!

 

ఇక 5వ వచనంలో సమయం రాకముందు అనగా ప్రభువు వచ్చేవరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చవద్దు అంటూ ఎందుకంటే దేవుడు ఆ తీర్పు తీర్చు సమయంలో అందకారమందలి రహస్యాలు వెలుగులోనికి తెచ్చి హృదయాలను దాని ఆలోచనలను బయలుపరచేటప్పుడు ప్రతీవానికి మెప్పు దేవునివలన మాత్రమే కలుగును అంటున్నారు!

 

ఇక్కడ కొరింథీ సంఘస్తులు తనలో విశ్వసనీయత లేక సంఘము పట్ల దేవునిపట్ల నమ్మకత్వము ఉన్నదో లేదో అని అనుకుంటున్నారు అని పౌలుగారికి పట్టింపు లేదు ఎందుకంటే తాను, తనకుతానుగా ఈ పరిచర్యకు రాలేదు! దేవుడు తనకుతానుగా పౌలుగారికి దమస్కు మార్గములో కనబడి తనకు బుద్ధిచెప్పి తన సాధనముగా ఏర్పాటుచేసుకుని తన మార్గమును ఆయనకు నేర్పించారు! ఇది మనకు గలతీ పత్రికలో ఆయన స్వయముగా చెప్పారు!  కాబట్టి ఇప్పుడు తాను కొరింథీ సంఘముయొక్క గృహ నిర్వాహకుడు! తాను దైవసేవకుడు! కొరింథీయులకు కాదు!క్రీస్తుకు సేవకుడు! కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసు తనను కొరింథీ సంఘానికి పంపించి తనకు కొరింథీ ప్రజలకు ఏమి ఉపదేశించాలో నేర్పించారు అదే వారికి చెప్పారు పౌలుగారు! ఇప్పుడు దేవుడు నేర్పించిన సందేశాలు కొరింథీ వారికి ఉపదేశించారా లేదా అనేది, జవాబు పౌలుగారు క్రీస్తుయేసు ప్రభులవారికి జవాబు చెప్పాలి గాని కొరింథీ ప్రజలకు కానేకాదు! దురదృష్టవశాత్తూ నేడు అనేక సంఘాలలో దైవసేవకులు సంఘపెద్దలకు జవాబు చెప్పవలసి వస్తుంది! సంఘపెద్దలు ఎలా చెప్పమంటే అలా చెబుతున్నారు ఎలా ఆడమంటే అలా ఆడుతున్నారు దైవసేవకులు! ముఖ్యంగా సంఘములో జీతమునకు పనిచేస్తున్న దైవ సేవకులలో అనేకులు!!!  ఇది బైబిల్ నేర్పిన సత్యము కాదు, బైబిల్ బోధించే పద్దతి కూడా కాదు! దేవుడు చెప్పమన్నవి దేవుడు బైబిల్ లో వ్రాసినవి ఉన్నది ఉన్నట్లుగా విశ్వాసులకు బోధించాలి నేర్పించాలి! అవసరమైతే ఖండించి గద్దించి బుద్ధిచెప్పి మరీ నేర్పించాలి! 2తిమోతి 4:1--3; అలాచేస్తే సంఘమునుండి తనను తరిమేస్తారు అని దైవసేవకులు భయపడుతున్నారు గాని నిజంగా అలా చేస్తున్న దైవసేవకులు విశ్వాసులను నరకములోనికి పోకుండా కాపాడుతున్నారు అని ప్రతీ విశ్వాసి గ్రహించాలి!

 

4వ వచనంలో  నాలో నాకు ఏ దోషము కనబడదు అంటున్నారు! అవును మనకు మనము పరిశీలించుకుంటే మనకు మనలో ఏ తప్పు కనబడదు! అందుకే సామెతల గ్రంధంలో ఇలా ఉంది... అయితే అది చివరికి నాశనమునకు నడిపిస్తుంది. ...

సామెతలు 14: 12

ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

సామెతలు 16: 2

ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.

 

మనకు మనం నీతిమంతులం మిగతావారు పాపులు అనుకుంటారు అయితే అది తప్పు అంటున్నారు!

5వ వచనంలో ఒకరోజు ప్రతీ విషయము అనగా అంధకారములో ఉన్న సంగతులు దేవుడు బయలుపరచినప్పుడు ప్రతీవానికి మెప్పు ప్రభువు వలన కలుగుతుంది!

 

ఈ వచనంలో మూడు విషయాలు కనిపిస్తాయి మనకు!

 

మొదటిది: దేవుడు అందకారమందలి విషయాలు ఒకరోజు బయలుపరుస్తారు! లేక ప్రతీ మానవుని హృదయంలో ఉన్న రహస్యాలు ఒకరోజు బట్టబయలు కాబోతున్నాయి!

 

రెండు: దేవుడు ఒకరోజు వారివారి క్రియల చొప్పున మెప్పు లేక ఘనత ఇవ్వబోతున్నారు!

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

 

మొదటి విషయం చూసుకుంటే దేవుడు ఒకరోజు ప్రతీ విషయానికి తీర్పు తీరుస్తారు! అందుకే మనుష్యులు చేసే ప్రతీ పనికి ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి అని బైబిల్ చెబుతుంది! చివరికి మనిషి పలికే వ్యర్ధమైన ప్రతీమాటకు కూడా లెక్క అప్పగించాలి!

 

రోమీయులకు 14: 12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

 

మత్తయి 12:36

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

 

ప్రసంగి 12: 14

గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

 

అందుకే ప్రసంగీ ఇలా పలుకుతున్నాడు: యవ్వనుడా నీ యవ్వనంలో నీ ఇష్టమొచ్చినట్లు ఉండు అయితే ఒకరోజు నీవు చేసిన ప్రతీ కార్యమును దేవుడు లెక్క అడుగుతాడు!!!

 

ప్రసంగీ 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

రెండు: ఒకరోజు దేవుడు నీవు మంచి చేస్తే ఘనత ఇవ్వబోతున్నారు! ఇది బహుశా గొర్రెపిల్ల పెండ్లి విందులో మధ్యాకాశములో దేవుడు ఇచ్చే అవార్డ్ ఫంక్షన్ సెరెమనీ లో ఉంటుంది అని కొందరి బైబిల్ పండితుల ఉద్దేశం! నేను కూడా దీనిని నమ్ముచున్నాను! బైబిల్ గ్రంధంలో దేవుడు చెప్పిన భళానమ్మకమైన మంచిదాసుడా సన్నివేశం ఆ రోజులలోనే జరుగుతుంది!

మీద చూపిన రిఫరెన్సులు ప్రకారం అప్పుడు నీవు సేవచేసిన లేక ఎంత నమ్మకముగా దేవునికి పనిచేశావో ఎందరిని దేవుని దగ్గరికి నడిపించావో ఎంత ప్రయాసపడ్డావో దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు!

 

మరినీవు దేవునికోసం కష్టపడుతున్నావా ప్రియ సహోదరీ సహోదరుడా!!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*40వ భాగము- దేవుని వ్యవసాయం- దేవుని గృహము-10*

 

1కొరింథీ 4:15

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

3. మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను (మూలభాషలో- మనుష్య దినముననైనను) నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా మనం 5వ వచనంలో మూడు ప్రాముఖ్యమైన విషయాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

మొదటిది: దేవుడు అందకారమందలి విషయాలు ఒకరోజు బయలుపరుస్తారు! లేక ప్రతీ మానవుని హృదయంలో ఉన్న రహస్యాలు ఒకరోజు బట్టబయలు కాబోతున్నాయి!

 

రెండు: దేవుడు ఒకరోజు వారివారి క్రియల చొప్పున మెప్పు లేక ఘనత ఇవ్వబోతున్నారు!

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

 

         (గతబాగం తరువాయి)

 

మూడు: దేనికోసం ఎవరికీ తీర్పు తీర్చకూడదు!

ఇక పౌలుగారు చెబుతున్న మరోమాట: ప్రభువు రాకముందు ఎవరికీ తీర్పు తీర్చకండి!

 

 చాలామంది వీరు అలాగా వారు అలాగా అంటూ తీర్పులు తీరుస్తుంటారు, ఇలా చెయ్యకూడదు అంటున్నారు పౌలుగారు!!  తీర్పు తీర్చడం మన పని కాదు! అది దేవుని పని! చివరికి మనకు మనమే తీర్పు తీర్చకూడదు! దేవునిపనిని దేవుణ్ణి చేయనియ్యండి! మనపని మనము చేద్దాం! దేవుడు ప్రతీ మనిషికి ఏ పనిని అప్పగించారో ఆ పనినే చెయ్యాలి! అంతేకాదు అలా చేసేటప్పుడు ఆవ్యక్తి యొక్క ఉద్దేశాలు మానసిక పోరాటాలు పరీక్షలు బాధలు అన్నీ ఆ వ్యక్తికే తెలుసు మరియు దేవునికి తెలుసు! కాబట్టి ఇతరులకోసం మనము తీర్పు తీర్చకూడదు! ఈ విషయాన్ని యాకోబు గారు కూడా రాస్తున్నారు!

 

యాకోబు 4:1112

11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి (తీర్పరివైతివి).

12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు(తీర్పరి). ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

 

 11,12 వచనాలలో ప్రాముఖ్యమైన విషయం కోసం రాస్తున్నారు! తన సహోదరుడు చేసిన పనులకోసం చాడీలు / కామెంట్లు/ జడ్జిమెంట్లు ఇస్తారు కదా- వారికోసం చెబుతున్నారు!

 

   పదకొండులో అంటున్నారు: సహోదరులారా! ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి! తన సహోదరునికి వ్యతిరేఖంగా మాటలాడి తన సహోదరునికి తీర్పుతీర్చువాడు ధర్మశాస్త్రానికి  తీర్పు తీరుస్తున్నాడు. నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చితే ధర్మశాస్త్రాన్ని పాటించే వాడివి కాదు గాని న్యాయాన్ని విధించేవాడవు అయిపోయావు!!!

 

జాగ్రత్తగా గమనిస్తే ఎవడైనా తన సోదరునికి వ్యతిరేఖంగా మాట్లాడితే వాడు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చేవాడు అయిపోతాడు అని పరిశుద్ధాత్మ పూర్ణుడై చెబుతున్నారు యాకోబు గారు! ఇలా అయితే మనము చాలాసార్లు తప్పులు చేశాము కదా! చాలామంది ఆడవారు మధ్యాహ్నం ఒకదగ్గర కూర్చుని అది ఇలాగ, ఇది ఇలాగ, ఆ స్త్రీకి వాడితో లింకు ఉంది, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటూ మాటామంతి వేసుకుంటారు! వీటిలో నూటికి ఎనబైశాతం తమకోసం మాట్లాడుకుంది బహుశా 20% ఉంటాదేమో! కాని ఇతరుల కోసం మాట్లాడుకుంది 80% ఉంటాది! మరి అలాంటప్పుడు ఈ అమ్మలక్కలు ప్రతీరోజు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చి జడ్జీలు అయిపోతున్నారు అన్నమాట! ఇది మంచిది కాదు ఇలా చెయ్యకూడదు, కాబట్టి మీరు ఒకరికి విరోధముగా మాట్లాడుకోవద్దు అంటున్నారు! ఇక్కడ ఒకమాట జాగ్రత్తగా గమనించాలి! మరొకరి కోసం మాట్లాడుకోవద్దు అని చెప్పడం లేదు! మానవుడు సంఘజీవి! మామూలుగా ఇతరులకోసం కూడా మాట్లాడుకోవడం మానవనైజం! అయితే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు అంటే: నీ సోదరునికి లేక సోదరికి లేక పొరుగువారికి వ్యతిరేఖంగా మాట్లాడుకోవద్దు! అది తప్పు, నీవు ధర్మశాస్త్రానికంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకుని ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు అంటున్నారు! ఇంకా పన్నెండో వచనంలో అంటున్నారు: నిజానికి ధర్మశాస్త్రమును నియమించి న్యాయాన్ని విధించువాడు ఒక్కడే, ఆయనే రక్షించుటకు శిక్షుంచుటకు నశింపజేయుటకు సమర్ధుడు! అసలు పరులకు తీర్పు తీర్చడానికి నీవెవడవు అని సూటిగా అడుగుతున్నారు!!

 

ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే- ఇలా వీడిమీద వాడిమీద చాడీలు చెప్పే డ్యూటీ ఎవరిదీ? యోబు 1,2 అధ్యాయాల ప్రకారం సాతాను గాడిది! ఒరేయ్ సాతానుగా సాతానుగా- నీవు ఎక్కడనుండి వచ్చావురా అని దేవుడు అడిగితే నేను భూమిమీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వస్తున్నాను అన్నాడు వాడు! విశ్వాసులు చేసిన పనులన్నీ దేవునికి చాడీలు చెప్పే డ్యూటీ వాడిది! బాగున్న వారిని పాడుచేసే డ్యూటీ వాడిది! మరి ఇప్పుడు విశ్వాసి- అనగా దేవుని బిడ్డ- సాతాను గాడి పని చెయ్యడమేమిటి బుద్ధి శుద్ధి లేకుండా!!! విశ్వాసి పవిత్రుడు పరిశుద్ధుడు కడుగబడిన వాడు! దేవుని వాడు- మరి ఇప్పుడు ఆ విశ్వాసి దేవునికోసం పనిచెయ్యాలి గాని సాతానుగాడి కోసం పనిచెయ్యడం ఏమిటండి?!!!  ఇదీ యాకోబు గారి ప్రశ్న! మనలో ఎవరైనా మరొకరికి వ్యతిరేఖంగా మాట్లాడితే అతడు లేక ఆమె ఆ వ్యక్తికీ తీర్పు తీర్చేస్తున్నారు! అసలు నిన్నువలె లేక తననువలే ఇతరులను ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంటే (యాకోబు 2:8), ప్రేమించడం మానేసి ఇతరులకు తీర్పు తీర్చే స్టేజికి నీవు వచ్చేశావు! అంటే నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు సరికదా- ఇతరులకు తీర్పు తీరుస్తున్నావు అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు! ధర్మశాస్త్రం కంటే నిన్ను నీవు హెచ్చుంచుకుని ధర్మశాస్త్రం కంటే పైవాడుగా పైదానిగా నిన్నునీవు చేసేసుకుని- తీర్పు తీర్చేస్తున్నావు, అంటే ధర్మశాస్త్రానికి నీ దగ్గర ఏమీ ప్రాధాన్యత లేదు అన్నమాట! జడ్జీలకే పెద్ద జడ్జివి అన్నమాట నీవు!

నిజానికి తీర్పు తీర్చేవాడు దేవుడు! ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, నియమించింది, శాసించింది దేవుడు నిర్గమ 20:1 ప్రకారం! ఈ మాటలు దేవుడే పలికాడు! అనగా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమునకే నీవు తీర్పు తీర్చేస్తున్నావు అన్నమాట!

 

యెషయా 33:23 లో అంటున్నారు: యెహోవాయే మనకు న్యాయమూర్తి, యెహోవాయే శాసనకర్త, ఆయనే మనకు రాజు! ఆయనే మనలను రక్షించువాడు! మరి ఇప్పుడు దేవుని పనిని నీ చేతులలో తీసుకుంటున్నావు! ఇది నీకు మంచిదా? దేవుని కంటే నీవు గొప్పోడివా గొప్పదానివా?!!!

దేవుడు రక్షించడానికి నాశనం చెయ్యడానికి సమర్ధుడు! మరి నీవు అలా రక్షించే కెపాసిటీ నీకేమైనా ఉందా? నాశనం చేసే కెపాసిటీ నీకేమైనా ఉందా? అలాంటప్పుడు ఈ కామెంట్లు జడ్జిమెంట్లు ఎందుకు?

 

మత్తయి 10: 28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

యెషయా 43: 11

నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

యెషయా 43: 12

ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

 

యోబు 5: 18

ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థ పరచును.

 

అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు... మత్తయి 7:12

1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

2. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

 

పౌలుగారు కూడా అంటున్నారు:

రోమా 14:4, 1013

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.

11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు

12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.

 

అందుకే యాకోబు గారు 5:9 లో అంటున్నారు మీకు శిక్షావిధి రాకుండా ఉండాలంటే ఒకనిమీద ఒకడు సణుగుకోవద్దు! కారణం న్యాయమూర్తి తలుపుదగ్గరే నిలుచిని ఉన్నారు! జాగ్రత్త!!!

ద్వితీ 32:36 ఆయన తన ప్రజలకు న్యాయం తీరుస్తారు అంటున్నారు

కీర్తన 7:11

న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.

 

కీర్తనలు 50: 6

దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

 

కీర్తనలు 98: 9

భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.

 

హెబ్రీ 12:23

పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,

 

గమనించాలి ఒకరోజు నీవు నేనుక్రీస్తు న్యాయపీఠం వద్ద నిలబడాలి!

ఆరోజు నీవు నిందారహితునిగా కనబడాలి అంటే ఇతరులకు తీర్పు తీర్చడం మానేయ్!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*51వ భాగము-సంఘము-సమస్యలు-8*

 

1కొరింథీ 6:1114.

11. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.

12. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.

13. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

14. దేవుడు ప్రభువును లేపెను; మనలను కూడ తన శక్తివలన లేపును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇంతవరకు  అన్యాయస్తుల జాబితాలో ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అనగా నరకానికి పోతారు అని చూసుకున్నాము!

 

ఇక 11వ వచనంలో అంటున్నారు : పూర్వకాలంలో మీలోకొందరు అట్టివారై యున్నారు, అనగా మీరు కూడా అన్యాయస్తుల జాబితాలో ఉండి, నరకానికి పోయే లిస్టులో ఉన్నారు , గాని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు!

 

ప్రియులారా! దీనిని జాగ్రత్తగా ఆలోచించాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు మన దేవుని ఆత్మయందును అనగా పరిశుద్ధాత్మ యందు కడుగబడ్డారు అంటున్నారు! మరి ఏ నామమునను రక్షణ కలుగదు! యేసునామంలోనే రక్షణ కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు బయలుపరచిన వెంటనే చెప్పబడింది అపోస్తలుల కార్యములలో! ,..

అపో.కార్యములు 4: 12

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

 

ఇప్పుడు ఇక్కడ యేసునామములో మనము బాప్తిస్మము పొందాము కాబట్టి వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటాము అయితే అనుమానం రావచ్చు మేము తండ్రి కుమార పరిశుద్దాత్మయొక్క  నామములో బాప్తిస్మం పొందాము! మేము యేసునామం లో బాప్తిస్మం పొందలేదు అని!! తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఏది? అది యేసునామమే!!!

అపో 2:38...

పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

 

బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు! దీనికోసం గతశీర్శికలలో అనేకసార్లు రాశాను గనుక ముందుకు పోదాం!

 

 మొదటగా యేసునామంలో బాప్తిస్మం పొందుకోవాలి, వెంటనే పరిశుద్దాత్మ అనే వరం పొందుకుంటారు! పొందుకున్నాక ఆ పరిశుద్దాత్ముడు చెప్పినట్లు నడవాలి! అప్పుడు మొదటగా పాపములనుండి కడుగబడి పరిశుద్ధ పరచబడతావు, తర్వాత నీతిమంతులుగా తీర్చబడతావు!

 

తీతుకు 3: 5

మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

 

ఎఫెసీయులకు 5: 26

అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

ఎఫెసీయులకు 5: 27

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

 

యోహాను ౩:౩8

 

2కొరింథీ 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

 

ఎఫెసీయులకు 2: 4

అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.

 

1పేతురు 1: 2

ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.

 

Ezekiel(యెహెజ్కేలు) 36:25,26,27

25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.

26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

27. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించి వారిని గాను నా విధులను గైకొనువారిని గాను మిమ్మును చేసెదను.

 

రోమా ౩:24

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

 

కాబట్టి బాప్తిస్మము తీసుకున్న వెంటనే దేవుని ఆత్మవలన జరిగే కార్యము ఇది! మనము నూతన సృష్టిగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడతాము!!!

 

ప్రియులారా! ఇక 1213 వచనాలు మరో సమస్య కోసం రాశారు!...

12. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.

13. భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

 

ఇది వ్రాయడానికి కారణం: విశ్వాసులకు క్రీస్తులో ఉన్న స్వేచ్ఛకోసం  పౌలుగారు  ఇప్పుడు మాట్లాడుతున్నారు.  పౌలుగారు ఇతర సంఘాలకు రాస్తూ విశ్వాసులు ధర్మశాస్త్రం క్రింద లేరనీ (రోమా 6:14), క్రీస్తు వారికి విడుదల ఇచ్చారనీ (గలతీ 5:1), ఆహార నియమాలు, ప్రత్యేక దినాలు పాటించడం మొదలైన విషయాల్లో వారికి ఎలాంటి కట్టుబాట్లు లేవనీ (రోమా 14:1-6, 14)  రాశారు.

 

రోమా 6:14

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

 

గలతీ 5:1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

రోమా 14:16, 14

1. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.

3. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

5. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.

6. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.

 

అయితే కొంతమంది కొరింథీలో ఉన్న క్రైస్తవులు పౌలుగారు  చెప్పిన ఈ మాటల్ని వక్రం చేసి ఏ విశ్వాసి అయినా వ్యభిచారంతో సహా తనకిష్టమైనదేదైనా చేయవచ్చని వక్రీకరించి చెబుతున్నారు!. ఈ అబద్ధ బోధనలను పౌలుగారు ఖండిస్తున్నారు. విశ్వాసులకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉండాలని కాదు వారికి ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగినది వారు పాపం చేయకుండా ఉండాలనే. విశ్వాసులకున్న స్వేచ్ఛపై ఉన్న రెండు నిర్బంధాలను వ 12 లో చూడవచ్చు

అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను.

 

 10:23-24, 31లో కూడా ఏమి చెబుతున్నారో చూడండి

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:23,24

23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

మేలుకరమైన వాటినే వారు చేయాలి గాని ఏ కోరికకూ, అలవాటుకూ బానిసలు కాకూడదు

 

Romans(రోమీయులకు) 6:16,17,18,19

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

 

యోహాను 8: 34

అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

 నచ్చినదేదైనా తినేందుకు తమకు స్వేచ్ఛ ఉన్నట్టే లైంగిక పాపం చేసేందుకు కూడా స్వేచ్ఛ ఉందనుకునే వారిని ఉద్దేశించి 13వ వచనంలో  రాశారు  పౌలుగారు. కానీ ఇవి రెండూ పూర్తిగా వేరువేరు విషయాలు. మనిషి కడుపుకు ఏ రకమైన ఆహారమూ దేవుని సంకల్పానికి వ్యతిరేకం కాదు. కానీ మనిషి శరీరానికి వ్యభిచార పాపం, లైంగిక పాపం ఏదైనా దేవుని సంకల్పానికి విరుద్ధం. దేవుడు విశ్వాసుల మృత దేహాలను మహిమలో పవిత్రతలో శాశ్వత జీవం గడపడం కోసం సజీవంగా లేపుతాడు. (వ 14). విశ్వాసులు దీన్ని గుర్తించి దేవుని ఉన్నత ఆశయం కోసం తమ శరీరాలు ఉపయోగించాలి.

 

13వ వచనం‌ మరొకటి కూడా చెబుతుంది: బ్రతకడానికి తినాలి గాని తినడానికి బ్రతకకూడదు!!!!😑😅

 

కాబట్టి క్రైస్తవునికి స్వేచ్చ ఉంది గాని ఆ చేసే పని దేవునికి మహిమ తీసుకుని వస్తుందా? నీ అంతరంగ పురుషుడు బలపడతాడా?

అది వాక్యానుసారమైనదా కాదా??!!

నీ ఆధ్యాత్మిక జీవితం బలపడుతుందా లేక నీరసించి పోతుందా అనేది ముందు యోచన చేసి అప్పుడు ఏ పనైనా చెయ్యాలి! క్రీస్తులో నీకు కలిగిన స్వేచ్చను పాడుచేసుకోవద్దు! దానిని లైంగిక పరమైన కార్యాలకు వాడవద్దు!

అందుకే ప్రసంగీ 11:9 అంటున్నారు...

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

కాబట్టి జాగ్రత్తపడుదాం!

పరమునకు చేరుదాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*52వ భాగము-సంఘము-సమస్యలు-9*

1కొరింథీ 6:1520

15. మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

16. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమైయున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17. అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

 

ప్రియులారా! 1520 వచనాలలో మరో సమస్య కోసం రాస్తున్నారు! గతభాగంలో చెప్పుకోవడం జరిగింది- పౌలుగారు మిగిలిన పత్రికలలో మనం ధర్మశాస్త్రం క్రింద లేము, పరిశుద్ధాత్ముడు యేసునామంలో మనకు స్వేచ్చను ప్రసాదించారు, అని చెబితే కొరింథీ సంఘంలో కొందరు అన్నింటికీ స్వేచ్చ కలిగింది గనుక లైంగికపరమైన పాపములు కూడా చెయ్యవచ్చు, మనకు స్వేచ్చ ఉంది అని బోధిస్తూ వ్యభిచారం చేసినా తప్పులేదు అని బోధించడం జరిగింది! ఇప్పుడు పౌలుగారు విశ్వాసులు వ్యభిచారం చెయ్యవచ్చా? ఎందుకు చెయ్యకూడదు అనేదానికోసం రాస్తున్నారు ఈ 1520 వచనాలలో!!!

 

15వ వచనంలో మన దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేస్తానా? అదెంత మాత్రము తగదు అంటున్నారు!! మన దేహములు దేవుని ఆలయము అని మనకు 19వ వచనంలో క్రిందన పౌలుగారు చెబుతున్నారు! దేవుని ఆలయమై ఉన్న మన దేహములు దేవుని యొక్క అవయవాలుగా ఉన్నాయి! సార్వత్రికసంఘములో రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఒక అవయవమని ఆ సంఘములో దేవుడు ఒక్కక్కరికి ఒక్కో కృపావరము ఇస్తారని, ఇలా మనమంతా సార్వత్రికసంఘములో భాగమని, సంఘమునకు శిరస్సు క్రీస్తు అని గతభాగాలలో నేర్చుకున్నాము!

 

1కొరింథీ 12:27

అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

 

రోమా 12:45

4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

 

ఎఫెసీ 1:2223

22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

కాబట్టి  మనము యేసుక్రీస్తులో అవయవాలుగా ఉన్నాము! ఇప్పుడు క్రీస్తు తానే స్వయంగా చేయనిది అనగా క్రీస్తుయేసు చేయని వ్యభిచారము చేసేందుకు విశ్వాసికి తలంపు కూడా రాకూడదు!!

 

ఇక 16వ వచనంలో వేశ్యతో కలుసుకొనేవాడు దానితో ఏక దేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు అంటున్నారు! దీనిని మోషే చెప్పుచున్నాడు అనడం కన్నా ఆదాముగారు చెప్పారు అనడం సమంజసం! ఇది ఆదికాండం 2:24 లో ఉంది!...

ఆదికాండము 2: 24

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

 

ఒక మనిషి ఒక స్త్రీతో లైంగిక కార్యము చేసేటప్పుడు ఇద్దరు కాదు, ఏక శరీరముగా ఉంటారు అని బైబిల్ నిర్ణయం! దేవుడు చెప్పిన మాట! ఇప్పుడు ఆ మనిషి వేశ్యతో సంబోగం చేస్తే ఇద్దరూ ఏక శరీరం అవుతారు! ఇప్పుడు విశ్వాసి ఎవరూ? క్రీస్తుయొక్క శరీరం లేక క్రీస్తుయొక్క అవయవం అని మీద వచనంలో చూసుకున్నాము! ఇప్పుడు విశ్వాసి వేశ్య దగ్గరకు వెళ్లి ఆమెతో లైంగిక పాపము చేస్తే క్రీస్తుయొక్క అవయవమును తీసుకుని వెళ్లి ఆ పాపమును లైంగిక అవినితీని క్రీస్తుకు అంటగట్టినట్లు కదా అంటున్నారు పౌలుగారు!!

ఇక 17వ వచనంలో అదే ప్రభువుతో కలిస్తే అనగా ఆయన ఆత్మతో ఏకాత్మగా ఆయన చెప్పినట్లు చేస్తూ ఆయనాత్మద్వారా నడిస్తే ఆయనతో కలిసి నడిచినట్లు అలా చేస్తే ప్రభువుతో ఒక్క ఆత్మ లేక ఏకాత్మగా ఉన్నాడు అంటున్నారు!

 

ఇది యేసుక్రీస్తు ప్రభులవారే చెప్పారు.

యోహాను 17:2123 లో

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

 

ఇక 18వ వచనం చాలా ప్రాముఖ్యమైనది! ..

జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

 

జారత్వమునకు దూరంగా పారిపోండి! ఎందుకంటే మనుష్యుడు చేసే ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగుతుంది గాని జారత్వము/వ్యభిచారము చేసేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు అంటున్నారు!

మిగిలిన పాపములు ఎక్కడో జరుగుతుంటాయి గాని ఈ పాపము అయితే దేహము దేహము కలిసి ఏక శరీరముగా చేస్తున్నారు గనుక సొంత శరీరమునకు హాని తెచ్చుకుంటున్నాడు అని చెబుతున్నారు!

చూడండి యోసేపు గారు పారిపోయారు! ఆది 39:11-12లో!

 

పౌలుగారు తిమోతికి చెబుతున్నారు

1 తిమోతి 6:11;

దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము), నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము (వెంటాడుము).

 

2 తిమోతి 2:22.

నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము), పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

 

ఎక్కడికి పారిపోవాలి?

సామెత 18:10

యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

 

కాబట్టి యెహోవా నామము అనగా యేసునామము దగ్గరకు పరుగెత్తుకు వస్తే ఆయన నీకు ఆశ్రయముగాను బలమైన దుర్ఘము కోటగాను ఉంటారు!!!

 

లైంగిక అవినీతి సంబంధమైన ఆలోచనలకు కూడా విశ్వాసులు అనుమతించ కూడదు! పాపం చెయ్యకుండా దానికి ఎంత దగ్గరగా వెళ్ళగలమో చూచే ప్రయత్నం కూడా చెయ్యకూడదు. మనం పాపానికి ఎంత దూరం వీలైతే అంత దూరంలో ఉండాలి.

 

మత్తయి 5: 28

నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

 

ఎఫెసు 5:3

మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

 

ఇక 1920 వచనాలలో మీ శరీరం పరిశుద్దాత్మకు ఆలయము, అది దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, ఇంకా మీరు మీ సొత్తు కాదు, విలువపెట్టి కొనబడ్డారు, కాబట్టి మీదేహముతో దేవుణ్ణి మహిమ పరచండి గాని వ్యభిచార క్రియలుచేయవద్దు అంటున్నారు!

 

1కోరింథీయులకు 3: 16

మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

 

 దేవాలయం మనిషి కాదు, దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చెయ్యాలి.

 

యోహాను 17: 6

లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

 

పేతురు గారు అంటున్నారు! మీరు సామాన్యమైన వెలద్వారా విడిపించ బడలేదు గాని అమూల్యమైన రక్తము అనగా క్రీస్తుయేసు రక్తము ద్వారా విమోచించబడ్డారు

 

1పేతురు 1:1819

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

మత్తయి 20:28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

కాబట్టి వ్యభిచారమునకు జారత్వము నకు దూరంగా ఉందాం!

దైవాశీస్సులు!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*53వ భాగము-సంఘము-సమస్యలు-10*

 

1కొరింథీ 6:1520

15. మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

16. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమైయున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?

17. అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు.

18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!

ప్రియులారా! మనం వ్యభిచారం లేక జారత్వము అనే సమస్య కోసం చూసుకుంటున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

*జారత్వము- వ్యభిచారము*

దీనికోసం ఇంకా చూసుకుంటే:

    మీరు పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;

మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2.     1 ధెస్సలో 4: 3,4

 

ప్రియ సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు, పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం అని మీద వచనాలలో చూసుకున్నాము!. 1 కొరింథీ 6:16. ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టుపట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు దానముగా  దయచేయబడింది. 19 వచనం. అది విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) . ఇప్పుడు నీ దేహము నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ 3:16,17;  6:19-20 వచనాలు)  మీరు దేవుని ఆలయము.  దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. ఖభడ్దార్. దేవునిలో వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు,అనగా పవిత్రమైన క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు - దేవునిఅలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?

   1 కొరింథీ 6:13-16 , నీ దేహము జారత్వముకొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి రాబోతుంది.

1 కొరింథీ 6:8,9 మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.

మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం- నిత్య నరకాగ్ని గుండము, అగ్ని ఆరదు పురుగు చావదు.

 

    ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.

ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.

22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.

 

      చూశారా లేఖనం ఏమిసెలవిస్తుంది?  వ్యభిచారం, జారత్వం  దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.

 

1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ యవ్వనస్తుని మోహించి కామించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం చేయలేను అనడం లేదు ,దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే అధిపతి  కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం నుండి పారిపోగలవా?

 

2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు దేవుని ప్రవక్త,  సోదెగాడైన బిలామును పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ఆ ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో జారత్వం చేస్తారు దేవుని ఉగ్రతమండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తె తో పాపం చేయడాన్ని చూసిన ఒక యవ్వనస్తుడు ఫీనెహాసు అది చూసి ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............

దేవుడు ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు చేయగలవా?

 

3. ఇక మరో వ్యక్తి దేవునిచే  నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ  భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె ఆ సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2 సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా జరిగింది ...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై "ఆ మనుష్యడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు" అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే" దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే దేవుని వాక్కు సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవు నాకే చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.

 

  ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం /జారత్వం దగ్గర ఆగిపోతున్నావా? జారత్వంలో పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం లో పడిపోతున్నావా? ఫీనెహాసులాగ పాపాన్ని అంతం చేయగలవా? నీ బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*54వ భాగము-సంఘము-సమస్యలు-11*

 

1కొరింథీ 7:15

1. మీరు వ్రాసినవాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

2. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెను.

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ఈ ఏడవ అధ్యాయం: పెళ్లి చేసుకోవచ్చా? లేదా? పెళ్ళిచేసుకుంటే భార్యతో కాపురం చెయ్యడం బైబిల్ ప్రకారము పాపమా? నా కుమార్తెకు కుమారునికి నేను వివాహం చెయ్యవచ్చా? ఒకవేళ నా పిల్లలను కంట్రోల్ చేసే కెపాసిటీ నాకుంటే నేను వారికీ పెళ్లి చెయ్యకుండా ప్రభువుభక్తిలోనే కొనసాగజేయాలని అనుకుంటే అది మంచిపనా కాదా??? ఒకవేళ పెళ్లి అయ్యాక అవిశ్వాసి యైన భర్త భార్యతో విడిపోతాను అంటే ఏమి చెయ్యాలి? అవిశ్వాసియైన భర్త విశ్వాసితో కాపురం చెయ్యాలని అనుకుంటే ఏమి చెయ్యాలి? ఇలాంటి సమస్యలు కోసం ఈ అధ్యాయంలో పౌలుగారు సంఘానికి విపులంగా రాస్తున్నారు!

 గమనించాలి: ఈ అధ్యాయం మొదట్లోనే మీరు వ్రాసిన విషయం అని మొదలుపెట్టారు!! అనగా కొరింథీ సంఘములో కొంతమంది క్లోయె ఇంటివారికి మీదన చెప్పిన విషయాలు  ఉత్తరం రాసి పౌలుగారికి ఇవ్వమని ఇస్తే, దానిని చదివి ఈ అధ్యాయంలో సుదీర్ఘంగా జవాబు ఇస్తున్నారు పౌలుగారు!

 

అయితే ఈ అధ్యాయం మొదలుపెట్టేముందు ఈ అధ్యాయంలో వివాహం గురించి పౌలుగారు చెప్పిన  ఉపదేశం అర్థం చేసుకునేందుకు కొన్ని సత్యాలు మనకు తోడ్పడవచ్చు. దేవుడు బైబిలు నంతటినీ తన సేవకులచేత రాయించాడని పౌలుగారు నమ్ముతున్నారు (2 తిమోతి 3:16). అందులో దేవుడు వెల్లడించిన దేనినీ వ్యతిరేకించేందుకు పౌలుగారు  సాహసించలేదు అని తెలుసుకోవాలి!....

2 Timothy(రెండవ తిమోతికి) 3:16,17

16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము (ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును,

17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.

 

2 Peter(రెండవ పేతురు) 1:20,21

20. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 

   అసలు పౌలుగారు  క్రొత్త నిబంధనలో రాసిన మాటలన్నీ కూడా దేవుడు రాయించినవే. మనుషుల మేలుకోసం దేవుడు వివాహాన్ని నియమించారు !

 

 ఆది 2:20-24;

21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.

22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.

23. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అన బడును.

24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

 

మత్తయి 19:4-6

4. ఆయన సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు

5. ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

6. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.

 

ఇంకా చెప్పాలంటే పౌలుగారు  తానే వివాహ సంబంధాన్ని మనోహరమైన, అర్థవంతమైన భాషలో వర్ణించారు!

 ఎఫెసు 5:25-33

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏక శరీరమగుదురు.

32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.

33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.

 

     విశ్వాసులకు వివాహాన్ని పౌలుగారు అసలు నిషేధించలేదు. అలా నిషేధించిన వారెవరైనా ఉంటే వారు మోసపోయినవారని అతనికి తానే స్వయంగా రాశారు!

1 తిమోతి 4:1-3

1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును

2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

 

అదే సమయంలో పెళ్ళి చేసుకొనేందుకూ చేసుకోకుండా ఉండేందుకూ విశ్వాసులకున్న స్వేచ్ఛను పౌలుగారు గట్టిగా నొక్కి చెప్పారు. బ్రహ్మచారిగా ఉండిపోవడం పెళ్ళైనవాడుగా ఉండడం కన్నా పరిశుద్ధమైన స్థితి అని చెప్పలేదు. పెళ్ళి గురించి అడుగుతూ లేఖ రాసిన కొరింథీ క్రైస్తవులకు పౌలు రాస్తున్నారు.

ఇప్పటి “కష్టదశ” కారణంగా (వ 26), “కాలం కొద్దిగానే” ఉంది గనుక (వ 29) ఆయన  కొన్ని విషయాలు రాస్తున్నారు. అలాటి పరిస్థితుల్లో పెళ్ళి కాకుండా ఉన్నవారు అలానే ఉండగలిగితే (వ 8,9) ఉండడం మంచిదని అతని అభిప్రాయం. ఇక్కడ పౌలుగారు  చెప్పిన కొన్ని విషయాలు అన్ని కాలాలకూ సరిపోయేవి. మరి కొన్ని ఆ సమయంలో కొరింథీలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవి.

 

సరే, ఈ అధ్యాయానికి వచ్చేద్దాం! మొదటి వచనం: వారు రాసిన ప్రశ్నలకు పౌలుగారి మొదటి జవాబు: స్త్రీని ముట్టకుండుట అనగా స్త్రీతో సంసార సుఖం లేకుండా ఉండటం పురుషునికి మేలు!! 2వ వచనంలో దానికి కారణం చెబుతున్నారు: అయినా జారత్వములు జరుగుతున్నందున ప్రతీవానికి సొంతభార్య ఉండాలి, అలాగే ప్రతీస్త్రీకి సొంతభర్త ఉండాలి! ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి!!

 

    స్త్రీని ముట్టకుండుట అనగా సంసార సుఖం అనుభవించకుండా ఉండటం పురుషునికి మేలు అని అభిప్రాయపడుతున్నారు పౌలుగారు!! ఎందుకంటే భార్య పిల్లలు లేకపోతే ఏవిధమైన సంసార యాతనలు ఉండవు కనుక దేవునిమీద ఆధ్యాత్మిక సంగతుల మీద పూర్తి ధ్యానం ఉంచగలడు మనిషి!

 ఉదాహరణ: ఏలీయా గారు, ఎలీషా గారు, యేసుక్రీస్తుప్రభులవారు, పౌలుగారు! వీరు ఎటువంటి గొప్ప సేవచేయగలిగారో మనము బైబిల్ గ్రంధంలో చూడగలము! అయితే హనోకు గారు, అబ్రాహము గారు, సమూయేలు గారు, యెషయా గారిలాంటి భక్తులు వివాహం చేసుకుని కూడా మంచి పరిచర్య చేసినా మీదన వివరించిన వారి అంతగా చెయ్యలేకపోయారు!!! సమూయేలు గారు, ఏలీ గారు  మచ్చలేని జీవితాన్ని జీవించగలగినా ఆయన కుమారుల వలన పేరు పాడయింది!!! నిజం చెప్పాలంటే వివాహం చేసుకొనని పాతనిబంధన భక్తులు గాని క్రొత్త నిబంధన భక్తులు గాని, ఇప్పటి భక్తులు పరిశుద్ధులు గాని నిప్పులా/ అగ్నిలా జీవించారు!! అందుకే పౌలుగారు అంటున్నారు: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు!!

అయితే మనుషులు పెళ్ళి చేసుకోవడం మంచిదని కూడా వేరే చోట పౌలుగారు చెప్పారు!

 

1తిమోతికి 5: 14

కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.

 

హెబ్రీ 13:4తో అతడు తప్పక ఏకీభవించి ఉంటారు..

వివాహము అన్ని విషయములలో (లేక, అందరిలో) ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

 

ఇక రెండో వచనం చూసుకుంటే కొరింథీలో ఆ సమయంలో పెళ్ళికాని విశ్వాసులు లైంగిక అవినీతి జోలికి పోకుండా ఉండగలిగితే వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది.

ఈ విషయం ప్రతీ ఒక్కరు గమనించాలి: జారత్వములు వ్యభిచారములు జరుగుతున్నాయి కనుక ప్రతీ పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతీ స్త్రీకి సొంత భర్త ఉండాలి అంటున్నారు! ఓ పురుషుడా! స్త్రీ! యవ్వనుడా! యవ్వనురాలా!! వివాహం కాకుండా సెక్స్ చెయ్యడం వ్యభిచారం! బైబిల్ దానికి ఒప్పుకోదు!!! అలా ఎవరైనా న్యాయబద్ధముకాని సెక్స్ చేస్తే  అది వ్యభిచారము అని , వ్యభిచారులు పరలోకరాజ్యములో చేరలేరని గ్రహించు!!!

 

ఓ వివాహమైన పురుషుడా! నీ సొంతభార్యతోనే నీవు సంసారం చెయ్యాలి గాని మరొకరి భార్యతోనో, పెళ్ళికాని స్త్రీతోనో చెయ్యకూడదు!! ఓస్త్రీ! నీవు నీ సొంత భర్తతోనే సంసారం చెయ్యాలి గాని మరో పెళ్ళికాని పురుషునితో గాని, మరొకరి భర్తతో కాదు అని గ్రహించు!!!

 

తొమ్మిదో వచనంలో అంటున్నారు: మనస్సు నిలుపలేని యెడల పెండ్లి చేసుకోవచ్చు అంటూ కామతప్తులు అగుటకంటే పెండ్లిచేసుకోవడం మేలు!!! గమనించాలి: నీవు కోరికలు అణచుకోలేకపోతే పెళ్లి చేసుకో అంటున్నారు!అంతేకాని పెళ్ళికాకుండా మరో స్త్రీతోనే లేక అమ్మాయితోనో లేక వేశ్య దగ్గరకో వెళ్ళడం బైబిల్ ప్రకారం నేరం! కామతప్తులు అవ్వడం కంటే పెండ్లిచేసుకోవడం మేలు, అలాగే కోరికలతో రగిలిపోయి ఏవేవో చెయ్యడం, వ్యభిచారం చెయ్యడం, ఇంకా హస్తప్రయోగం చేసుకోవడం, బ్లూ ఫిలిమ్స్ చూడటం తప్పు అని గ్రహించాలి!!!

కాబట్టి యవ్వన స్త్రీకి సొంత భర్త ఉండాలి! యవ్వనస్తుడికి సొంత భార్య ఉండాలి అని బైబిల్ చెబ్తుంది!!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*55వ భాగము-సంఘము-సమస్యలు-12*

 

1కొరింథీ 7:15

1. మీరు వ్రాసినవాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

2. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెను.

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ఏడవ అధ్యాయంలో : పెళ్లి చేసుకోవచ్చా? లేదా? పెళ్ళిచేసుకుంటే భార్యతో కాపురం చెయ్యడం నేరమా? ఒకవేళ నా కుమార్తెకు కుమారునికి నేను వివాహం చెయ్యవచ్చా? ఒకవేళ నా పిల్లలను కంట్రోల్ చేసే కెపాసిటీ నాకుంటే నేను వారికీ పెళ్లి చెయ్యకుండా ప్రభువుభక్తిలోనే కొనసాగజేయాలని అనుకుంటే అది మంచిపనా కాదా??? ఇలాంటి ప్రశ్నలకు పౌలుగారి జవాబులు ధ్యానం చేస్తున్నాము!!

 

      (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక ౩5 వచనాలలో పౌలుగారు విశ్వాసులైన భార్యాభర్తలు వివాహ వ్యవస్తలో నిర్వహించవలసిన భాద్యతలు కోసం రాస్తున్నారు!!....

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

5. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

 

గమనించండి, భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మములు నిర్వర్తించాలి!! ఇంకా భర్త శరీరముమీద భర్తకు అధికారం లేదు గాని భార్యకే అధికారం ఉంది! అలాగే భార్య శరీరం మీద భార్యకు అధికారం లేదు గాని భర్తకే అధికారం ఉంది అంటున్నారు!  దీని అర్ధం నీవు ప్రార్ధన చెయ్యాలని అనుకుంటున్నావు, ఉపవాసముండాలని గాని నీ భర్త/ భార్య సంసార సుఖం కావాలని అనుకుంటే తప్పకుండా నీవు ఆ భాద్యత నెరవేర్చాలి!!

అందుకే 5వ వచనంలో రాస్తున్నారు ప్రార్ధన చెయ్యడానికి మాత్రము ఎడబాయండి, అదికూడా ఇద్దరు మాట్లాడుకుని పరస్పర సమ్మతి లేక Mutual Understanding తోనే!! మరల మీరు మనస్సు నిలుపుకోలేక పోయినప్పుడు మరలా కలుసుకోండి అంటున్నారు!! ఈ మాట విశ్వాసులైన భార్యభర్తల కోసం రాశారు!

 

ఇది అవిశ్వాసి యైన భర్తను కలిగిన భార్యకు, అవిశ్వాసియైన భార్య కలిగిన భర్తకు ఎలా ఆపాదించాలంటే నీవు ఉపవాసము ఉండాలన్నా, ప్రార్ధన చెయ్యాలన్నా చెయ్యు గాని భర్త/భార్య సంసార సుఖం కావాలనుకున్నప్పుడు ఆ ధర్మమును నెరవేర్చాలి! నీఉపవాసం కోసం, ప్రార్ధన కోసం నీ భర్తతో/ భార్యతో మాట్లాడి చూడు, ఒకవేళ వారికి అది కావాలంటే తప్పకుండా బైబిల్ చెప్పినట్లు ఆ ధర్మమును నిర్వర్తించాలే తప్ప తగవులాడుకుని విడాకులు వరకు తెచ్చుకోకూడదు అని నా ఉద్దేశం! అయ్యా నాకు అర్ధమైంది మాత్రమే నేను రాస్తున్నాను!

 

ఈ సందర్భంగా మా విశాఖపట్నం లో ఉన్న ఒక దుర్భోధకుడు చెప్పేమాటలు గుర్తుచెయ్యాలని అనుకుంటున్నాను! ఈ అధ్యాయంలో 29, ౩౦ వచనాలు చూపెట్టి ఆ అబద్ధబోధకుడు అంటున్నాడు: పిల్లలు పుట్టే వరకు భార్యతో సంసారం చెయ్యాలి గాని, పిల్లలు పుట్టాక భార్యతో సంసారం చేస్తే అది వ్యభిచారం అంటున్నాడు!

(29. సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమైయున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

30. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును...)

మరి  ౩5 వచనాలు భార్య భర్తకు భర్తభార్యకు తమ ధర్మములు నిర్వర్తించాలి అని బైబిల్ చెబితే యితడు ఏమంటున్నాడో చూడండి! కాబట్టి మీద చెప్పిన ౩5 వచనాల భావము గ్రహించి అలాంటి తప్పుడు బోధలను ఖండించమని మనవిచేస్తున్నాను! దేవుడే ఆదియందు  వివాహధర్మము నియమించారు! అది క్రమంగా జరగాలి అంటున్నారు! అంతేతప్ప పిల్లలు పుట్టాక సంసారం చేస్తే వ్యభిచారమని బైబిల్ లో లేదు!

 

పౌలుగారు ఇలా వ్రాయడానికి కారణం: భర్త గానీ భార్య గానీ ఈ సూత్రం పాటించకపోతే ఏ వివాహానికైనా ఇక్కట్లు తప్పవు. ఇంకా వారు ఎక్కువ కాలం దూరంగా ఉంటే ఇతరులతో పాపం చేసేలా ప్రేరేపించేందుకు సైతానుకు అవకాశం ఇస్తున్నట్టవుతుంది అని గ్రహించి పౌలుగారు ఆత్మావేశుడై ఈ మాటలు రాస్తున్నారు అని గ్రహించండి!!

 

   కాబట్టి 15 వచనాలలో మనము గ్రహించవలసినది ఏమిటంటే ప్రతీ పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతీ స్త్రీకి సొంత భర్త ఉండాలి! విశ్వాసులైన భార్యాభర్తలు వారివారి ధర్మములు పాటించాలి! భర్త శరీరం మీద భార్యకే అధికారం ఉంది అలాగే భార్య శరీరం మీద భర్తకే అధికారం ఉంది! ప్రార్ధన చేసుకోవడానికి, ఉపవాసముండి దేవునిలో ముందుకు సాగటానికి పరస్పర సమ్మతితో అవగాహనతో మధ్యలో ఈ వివాహధర్మమునకు ఎడబాసి మరలా కలుసుకోవాలి!

అలాగే అవిశ్వాసియైన భార్య/భర్త కలిగిన వారు తమ భర్తకు భార్యకు ఆటంకం లేకుండా ప్రార్ధనలోను ఉపవాసము లోను ఉండాలి! వారి ధర్మములను మరచిపోకూడదు! దీనికోసం తగవులు ఆడుకోగూడదు!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:6,7,8,9

6. ఇది నా హితోపదేశమేగాని (లేక, సెలవేగాని) ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.

7. అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

8. నావలెనుండుట వారికి మేలని పెండ్లికాని వారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

9. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.

 

ఇక ఆరో వచనంలో నా హితోపదేశం ఏమిటంటే మనుష్యులందరూ నాలాగే అనగా పెళ్ళిచేసుకోకుండా ఉంటే మంచిది, ఇది దేవుని ఆజ్ఞ కాదు నాదికూడా అజ్ఞ కాదు! కేవలం మీకు సలహా మాత్రమే అంటున్నారు! బహుశా ఇక్కడ పౌలుగారు  2వ వచనమును ఉద్దేశించి  రాస్తూ ఉండవచ్చు. పెళ్ళి చేసుకోకూడదని గానీ చేసుకోవాలని గానీ పౌలు విశ్వాసులకు ఎలాంటి ఆజ్ఞ ఇవ్వలేదు.

 

ఇక 7వ వచనంలో అంటున్నారు: అయినా ఒకనికి ఒక విధమునకు మరొకనికి మరొక విధమునను ప్రతిమనుష్యుడు దేవుని నుండి కృపావరమును పొంది ఉన్నాడు అంటున్నారు!

ఇక్కడ కృపావరం ఏమిటి? కృపావరం”అంటే దేవుడు వివాహమనే కృపావరం కొందరికీ, వివాహం లేని జీవితమనే కృపావరం కొందరికి ఇస్తారు. దేవుని వరాలన్నీ మంచివేనని నిస్సందేహంగా నమ్మవచ్చు. దేవుని కృపవల్ల కొందరికి పెళ్ళిచేసుకోవాలనే కోరిక, మరో విశ్వాసిని పెళ్ళాడే అవకాశమూ కలుగుతాయి. మరి కొందరికి దేవుని కృపవల్ల పెళ్ళి చేసుకోకుండా, లైంగిక అవినీతి లేకుండా ఉండగలిగే సామర్థ్యమూ కలుగుతుంది.

మత్తయి 19:11-12

11. అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.

12. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

 

వారు పరలోక రాజ్యం కోసం కొంతమంది పెళ్ళిచేసుకోకుండా ఉండిపోతారు! నిజంగా వీరు మంచిధన్యమైన జీవితం గలవారు!!

 

అయితే 8వ వచనంలో అంటున్నారు: నాలాగ పెండ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అని పెళ్లి కానివారితోను విధవరాండ్రతోనూ చెబుతున్నాను అంటున్నారు! గాని తొమ్మిదో వచనం:  మనసు నిలుపుకోలేక పోతున్నప్పుడు పెళ్లి చేసుకోవడమే మంచింది! ఎందుకంటే కామతప్తులు అనగా లైంగిక వాంచలతో రగిలిపోయే కంటే, హస్తప్రయోగం చేసుకోవడం కంటే, పెళ్ళిచేసుకోవడం మంచిది అంటున్నారు! లైంగిక వాంఛలతో మరిగిపోతూ, లైంగిక దుష్‌ప్రేరణలతో అస్తమానమూ పెనుగులాడుతూ ఉండడం ఆధ్యాత్మిక జీవితానికి హానికరం. తన ప్రజలు పెళ్ళి అయినవారైనా కానివారైనా ఆధ్యాత్మికంగా క్రైస్తవ జీవితంలో విజయవంతమైనవారుగా ఉండాలని దేవుని కోరిక.

 

కాబట్టి పరిశుద్దాత్ముడు పౌలుగారిద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను పెళ్లి అయినవారు పెళ్ళికాని వారు పాటిద్దాం! మన కుటుంభాలు మన ఆత్మీయ జీవితాలు సరిచేసుకుందాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*56వ భాగము-సంఘము-సమస్యలు-13*

 

1కొరింథీ 7:1014

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

11. ఎడబాసినయెడల పెండ్లిచేసి కొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14. అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో- సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహో దరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! ఇక 1014 వచనాలలో రెండు ధర్మ సందేహాలకు జవాబు చెబుతున్నారు!

 

మొదటిది: బార్యాభర్తల మధ్య అవగాహన లోపం వలన విడాకులు తీసుకోవచ్చా? తీసుకుంటే మరలా పెళ్లి చేసుకోవచ్చా?

 

రెండవది: భర్త/భార్య అవిశ్వాసిగా గలవారు తమ భర్తను/భార్యను వదిలెయ్యాలా లేక వారితోనే కాపురం చెయ్యాలా??

 

మొదటి ప్రశ్నకు జవాబు చూద్దాం!

బార్యాభర్తల మధ్య అవగాహన లోపం వలన విడాకులు తీసుకోవచ్చా? తీసుకుంటే మరలా పెళ్లి చేసుకోవచ్చా?

చూడండి 1011 వచనాలు...

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

11. ఎడబాసినయెడల పెండ్లిచేసి కొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

 

విడాకులు తీసుకోకూడదు! విడాకులను పాత నిబంధన క్రొత్త నిబంధన ఖండించింది!! ఒకవేళ  తీసుకుంటే మరలా పెండ్లి చేసుకోకూడదు! ఇదీ బైబిల్ చెబుతుంది!! పౌలుగారు  ఇంతకుముందు (వ 6) చెప్పినది ఆజ్ఞ కాదు. విశ్వాసులకు పెళ్ళి చేసుకోవడం, చేసుకోకపోవడం విషయంలో స్వేచ్ఛ ఉంది. కానీ ఒక సారి పెళ్ళి అయిన తరువాత ఒకరినొకరు విడాకులు ఇచ్చుకోవడానికి స్వేచ్ఛ లేదు. అందువల్ల పౌలుగారు క్రీస్తు ఉపదేశాలపై ఆధారపడిన ఆజ్ఞను ఇస్తున్నారు

Matthew(మత్తయి సువార్త) 5:31,32

31. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్పబడియున్నది గదా;

32. నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.

 

Matthew(మత్తయి సువార్త) 19:3,4,5,6,7,8,9,10,11

3. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా

4. ఆయన సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు

5. ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

6. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.

7. అందుకు వారు: ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా

8. ఆయన: మీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.

9. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.

10. ఆయన శిష్యులు: భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.

11. అందుకాయనఅనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.

 

లూకా 16: 18

తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసికొనువాడు వ్యభిచరించుచున్నాడు.

 

విశ్వాసుల మధ్య వివాహం అనేది భార్య, భర్త బ్రతికి ఉన్నంతకాలం విడిపోని బంధం.

భార్యాభర్తల్లో ఒకరికి వివాహ జీవితం దుర్భరంగా అనిపించి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తి మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. ఇది బైబిల్ ఆజ్ఞ!! ఈ రోజులలో అనేకమైన విశ్వాసులు విడాకులు తీసుకుంటున్నారు! కావాలని తీసుకోవడం లేదు వారితో కాపురం దుర్భరంగా అనిపించి గత్యంతరం లేక విడాకులు తీసుకుంటున్నారు! అలా తీసుకుంటే మరలా పెళ్లి చేసుకోకూడదు!! ఇదీ బైబిల్ ఆజ్ఞ!!

 

విడాకులు కోసం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పినవి చూసుకున్నాము! పాత నిబంధనలో 

Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 24:1,2,3,4

1. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.

2. ఆమె అతని యింటనుండి వెళ్లిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.

3. ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడల నేమి

4. ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు.

 

 యేసుప్రభువు ఉపదేశం స్పష్టంగా ఉంది. దేవుని దృష్టిలో విడాకులు అంగీకారం అయ్యే పరిస్థితి ఒక్కటే ఒక్కటి. వివాహమైన వారిలో భార్య గానీ భర్త గానీ వ్యభిచారం చేస్తే విడాకులు ఇయ్యవచ్చు. అప్పుడు కూడా యేసుక్రీస్తుప్రభులవారు విడాకులు తీసుకోవాలని తెగేసి చెప్పడం లేదు గాని తీసుకోవచ్చని అనుమతి ఇస్తున్నారు. 3-12 వచనాల్లోని లక్షణాలు కనీసం కొంతవరకైనా ఉన్న వారికోసమే ఈ ఉపదేశం అని గుర్తుంచుకోండి. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తి చాలా ఘోరమైన కారణం ఉంటే తప్ప తన భార్యకు విడాకులివ్వడం, లేక తన భర్తను వదిలెయ్యడం ఎలా చెయ్యగలుగుతారు? ఘోరమైన కారణం ఉన్నా సరే తొందరపడి ఏదీ చెయ్యకూడదు. ఇద్దరం దేవుని క్షమాపణ పొందిన పాపులమే అని గుర్తుంచుకోవాలి.

మత్తయి 6:14-15 కూడా చూద్దాము.

14.  మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.

15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

 

అయితే ఎంతవరకు పెళ్లి చేసుకోకూడదు??? దీనికోసం ఇక్కడ స్పష్టమైన ఆజ్ఞ లేదు! చూసుకుంటే ఒకవేళ విడాకులు తీసుకుంటే మరలా పెళ్లి అనేది చేసుకోకూడదు అని అర్ధం అవుతుంది!! అయితే కొన్ని రిఫరెన్సులు ప్రకారం విడాకులు తీసుకుంటే అవతలి వ్యక్తి అనగా విశ్వాసికి విడాకులైన తర్వాత ఆ విడాకులు ఇచ్చిన భార్యగాని భర్తగాని చనిపోతే బహుశా మరో వివాహం చేసుకోవచ్చు! ఇది దేవుని ఆజ్ఞ మరియు పౌలుగారి అభిప్రాయం ఎంతమాత్రమూ కాదండోయ్!! నా మాటను బట్టి అలా చేస్తారేమో! ఇక్కడ కేవలం నా అభిప్రాయం కొన్ని రిఫరెన్సులు ప్రకారం చెబుతున్నాను!!

 

బైబిల్ గ్రంధం చెబుతుంది- భర్త బ్రతికి ఉన్నంతవరకే భార్య భర్తకు లోబడాలి! అలాగే భర్త- భార్యకు నమ్మకముగా ఉండాలి అన్ని విషయాలలో! ఒకవేళ భర్త చనిపోతే ఆమె మరో వివాహం చేసుకోవచ్చు అని బైబిల్ చెబుతుంది!! ఇదే అధ్యాయం 39 వ వచనం!!....

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:39

39. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలైయుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.

 

మరియు రోమా 7:13 వచనాలు!!

1. సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.

2. భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును.

3. కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని (అసలుమాట- వివాహము చేసికొనినయెడల) చేరినయెడల వ్యభిచారిణియన బడును గాని, భర్త చనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.

 

కాబట్టి ఈ రెండు రిఫరెన్సులు ప్రకారం నా ఉద్దేశంలో విడాకులు తీసుకున్న తర్వాత విశ్వాసి మరలా పెళ్లి చేసుకోవాలంటే విడాకులు ఇచ్చిన భార్య గాని భర్త గాని చనిపోవాలి! ఆ ధర్మమునుండి విడుదల పొందాకనే మరల వివాహం చేసుకోవచ్చు!! మరల చెబుతున్నాను: అయ్యా/అమ్మా! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే!

 

కాబట్టి మీదన వచనాలు ప్రకారం నిర్ధారణ అయ్యేదేమిటంటే విశ్వాసులు విడాకులు‌ తీసుకోకూడదు! విడాకులు తీసుకుంటే మరలా మరో పెళ్లి చేసుకోకూడదు!!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*57వ భాగము-సంఘము-సమస్యలు-14*

 

1కొరింథీ 7:1216

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

14. అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో- సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు.

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో- మిమ్మును అని పాఠాంతరము) పిలిచియున్నాడు.

16. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ఇక 1216 వరకు మరో సమస్య కోసం చెబుతున్నారు! అయితే ఈ మాటలు ప్రభువు కాదు నేనే చెబుతున్నాను అంటున్నారు పౌలుగారు! పౌలుగారి ఆజ్ఞ లేక ఆయన ఆధ్యాత్మిక జీవితమునుండి అపోస్తలుడిగా ఆయనకున్న సేవానుభవమును బట్టి ఈ మాటలు రాస్తున్నారు: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే ఈ సహోదరుడు ఆమెను విడనాడకూడదు అనగా యేసుక్రీస్తుప్రభులవారిని నమ్ముకొననందున విడాకులు ఇవ్వకూడదు!

రెండు: విశ్వాసియైన స్త్రీకి- అవిశ్వాసియైన భర్తను కలిగిఉండి, ఆ భర్త ఈ విశ్వాసితో కాపురం చెయ్యడానికి ఇష్టపడితే ఈ విశ్వాసి- ఆ అవిశ్వాసి భర్తకు విడాకులు ఇవ్వకూడదు!

 

మీదను వివరించిన ఈ రెండు కండిషన్ లు ఈ కాలానికి ఎప్పుడు ఆపాదించాలి అంటే: సువార్త విని కేవలం భర్తగాని లేక భార్యగాని రక్షించబడింది!! తమ భార్య లేక భర్త ఇంకా రక్షించబడలేదు!! అలాంటప్పుడు ఏమి చెయ్యాలి అనే కండిషన్ కి ఈ జవాబు అని గ్రహించాలి! గమనించాలి: పౌలుగారు అన్ని సంఘాలకు ముందుగానే చెప్పారు: విశ్వాసి కేవలం విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి! అలాగే తమ పిల్లలకు విశ్వాసులను మాత్రమే పెళ్లిచేయాలి...

 

గాని ఇక్కడ పౌలుగారు చెబుతున్నది: క్రొత్తగా రక్షించబడిన విశ్వాసుల కోసం చెబ్తున్నారు! నీ భార్య రక్షించబడలేదు అని ఆమెకు విడాకులు ఇవ్వకూడదు! గాని నీ భార్య రక్షణ కోసం ప్రార్ధన చెయ్యాలి! అలాగే నీ భర్త రక్షణ పొందలేదని విడాకులు ఇవ్వకూడదు, గాని అతని రక్షణ కొరకు ప్రార్ధన చేయాలి!! ఇదీ దీని అర్ధం!

ఇక్కడ పౌలుగారు “ప్రభువు కాదు” అని ఎందుకు రాస్తున్నారు అంటే ఈ పరిస్థితుల గురించి యేసుప్రభువు తనకు ఏమీ నేర్పించలేదని పౌలుగారి ఉద్దేశం కాదు. యేసుప్రభువు  ఈ భూమిపై ఉన్నప్పుడు ఈ సంగతుల గురించి ఏమీ చెప్పలేదని దీని భావం. విశ్వాసులు విశ్వాసులనే వివాహం చేసుకోవాలని పౌలుగారు నేర్పారు.

 

1కోరింథీయులకు 7: 39

భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలైయుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 6:14,15,16

 

14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?

15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

 

ద్వితియోపదేశకాండము 7: 3

నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

 

ఇద్దరు అవిశ్వాసుల పెళ్ళి విషయం ఏమంటే, భార్య గానీ భర్త గానీ పెళ్ళి తరువాత విశ్వాసి కావచ్చు. రెండో వ్యక్తి అవిశ్వాసిగానే ఉండిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అనుసరించ వలసిన స్పష్టమైన ఆదేశాలను పౌలుగారు  ఇస్తున్నారు ఇక్కడ.

 

ఇక  14వ వచనంలో అంటున్నారు: అవిశ్వాసియైన భర్త విశ్వాసియైన భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును, అలాగే అవిశ్వాసురాలైన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేకపోతే మీ పిల్లలు అపవిత్రులై ఉందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అంటున్నారు! దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?

“పరిశుద్ధమైన”అనే పదాన్ని పౌలుగారు  వాడుతున్న పద్ధతి చూడండి!  ఇక్కడ పౌలుగారు వాడిన గ్రీకు పదాన్ని “పవిత్రమైన” అని కూడా అనువదించవచ్చు. అవిశ్వాసులు విశ్వాసులను పెళ్ళి చేసుకుంటే పాపం నుంచి శుద్ధి పొంది, నైతికంగా నిర్మలంగా అవుతారని పౌలుగారు చెప్పడం లేదు. కేవలం భార్యాభర్తలలో ఒకరు బాప్తిస్మం తీసుకుంటే మిగిలిన వారు పరిశుద్ధులు అయిపోతారు అని దీని అర్ధం కానేకాదు! అలాంటి అవిశ్వాసి విశ్వాసిని పెళ్ళి చేసుకొన్న ఇతర అవిశ్వాసుల్లో ప్రత్యేకమైన వ్యక్తి. అంటే అలాంటి వ్యక్తినీ, వారికి పుట్టిన పిల్లలనూ దేవుడొక ప్రత్యేకమైన రీతిలో చూస్తారు. దీని అర్థమేమిటో పౌలుగారు చెప్పలేదు గానీ దేవుడు వారి విషయం అనుసరించే పద్ధతిలో నిజమైన అర్థవంతమైన తేడా ఏదో  ఉంటుందని మనం గట్టిగా నమ్మవచ్చు.

 

ఇక 15వ వచనంలో ఒకవేళ అవిశ్వాసియైన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చు అంటున్నారు! అనగా ఒకవేళ భార్య దేవుణ్ణి నమ్ముకున్నందున అవిశ్వాసియైన భర్త భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించు కుంటే విడాకులు ఇవ్వవచ్చు! అలాంటప్పుడు ఎలాంటి నిర్భంధము లేదు! అయితే సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు అంటున్నారు! ఇక్కడ సమాధానముగా ఉండటానికి దేవుడు మనలను పిలిచి యున్నారు అనగా ఆ వ్యక్తి విడాకులు కోరుతున్నాడు గనుక కావాలంటే విడాకులు ఇచ్చెయ్యండి గాని ఎందుకు విడాకులు ఇస్తున్నావు అని కోర్టులకు వెళ్ళవద్దు, ఇంకా భరణం కావాలని కేసులు పెట్టవద్దు అని అర్ధం! ఇది నాకు అర్ధమయ్యింది రాస్తున్నాను!!!

ఒక విశ్వాసి సాధ్యమైతే అవిశ్వాసి అయిన భార్యతో లేక భర్తతో సమాధానముగా/శాంతిగా జీవించాలి. అవిశ్వాసి తనను విడిచిపెట్టి వెళ్ళిపోదలచుకొంటే నెమ్మదిగా ఉండాలి. ఎలాంటి బలవంతం, నిర్బంధం ఇలాంటి విషయంలో ఉండకూడదు ఇదీ ఇక్కడ అర్ధం!!

 

ఇక 16వ వచనం అర్ధం చేసుకోవడం కొంచెం తికమకగా ఉంటుంది: ఓ స్త్రీ నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా! నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును అంటున్నారు!!  దీని అర్ధం: విశ్వాసి అయిన భార్య లేక భర్త తన పవిత్రమైన జీవితం ద్వారా, లేదా క్రీస్తుకు మంచి సాక్షిగా ఉండడం ద్వారా, ప్రార్థన, ఓర్పు ద్వారా అవిశ్వాసి అయిన తన భర్తను లేక భార్యను క్రీస్తు చెంతకు, ఆయనలో పాపవిముక్తికి నడిపించవచ్చు.

కాబట్టీ నీ మంచి ప్రవర్తన ద్వారా నీ భర్తను/ భార్యను దేవునిలోనికి నీవు నడిపించాలి!! ఇప్పుడు నీవు అలా దేవునిలోనికి నడిపించగలవో లేదో నీకు తెలియదు! అతడు/ ఆమె విడిపోతాను అని విడిపోనీయ్ అని అర్ధం!!!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*58వ భాగము-సంఘము-సమస్యలు-15*

1కొరింథీ 7:1724

17. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

18. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.

19. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.

20. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనేయుండవలెను.

21. దాసుడవైయుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది (లేక అంతేకాదు, స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినను దాసుడవైయుండుటకే చూడుము) .

22. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

23. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులుకాకుడి.

24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

    ఇక 1724 వరకు మరో సమస్య కోసం చెబుతున్నారు! ప్రతీ ఒక్కరు దేవుడు తనను ఏ స్తితిలో పిలిచారో అదే స్థితిలో ఉండాలి లేక ప్రభువులో సాగిపోవాలి!! ఇదే ప్రతీ సంఘములోని నేను చెప్పేది అంటున్నారు! ఏ స్థితియందు నియమించెనో లేక ఏ స్తితియందు పిలిచెనో ఆ స్థితియందే నడుచుకోవాలి అంటున్నారు!

 

18వ వచనంలో ఇంకా వివరిస్తున్నారు: సున్నతి పొందినవాడు పిలువబడితే వాడు సున్నతి పోగొట్టుకోగూడదు! సున్నతి పొందని వాడు పిలువబడితే లేక రక్షించబడితే వాడు సున్నతి పొందాల్సిన అవసరం లేదు!

19వ వచనం: దేవుని ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యముగాని సున్నతి పొందడంలో ఏమీ లేదు, సున్నతి పొందక పోవడంలో ఏమీలేదు అంటున్నారు!

20వ వచనంలో మరోసారి పునరుద్ఘాటిస్తున్నారు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండాలి!! నీవు దాసుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే లేక రక్షించబడితే నీవు దాసుడిగానే ఉండు! ఒకవేళ నీవు స్వతంత్రుడుగా ఉండాలని ఆశిస్తే కష్టపడు! కష్టపడి స్వతంత్రుడిగా మారు పర్వాలేదు! గాని నేను దాసుడను అని చింతపడవద్దు  అంటున్నారు!

 

గమనించాలి: 17-24 ఈ వచనాల్లో పౌలుగారు  వివాహం గురించీ, ఉదాహరణలుగా వాడుతున్న ఇతర జీవిత పరిస్థితుల గురించీ రాస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరినీ ఒక రకమైన స్థితిలో ఉండేందుకు పిలిచారు. ప్రతి ఒక్కరికీ ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విశ్వాసి ముఖ్యంగా నేర్చుకోవలసినది ఏమిటంటే తనకోసం దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకుని దానికి లోబడి ఉండడమే. జీవితంలో తానున్న స్థితిగతుల గురించి సణుగులు, అసంతృప్తి ఉండకూడదు. దేవుని సంకల్పమే తనకు మంచిదని గుర్తించి దాన్ని వినయంతో అంగీకరించాలి. ఇదీ పౌలుగారి ముఖ్య ఉద్దేశం ఇక్కడ!!

 

మరో విషయం ఏమిటంటే ఇది పౌలుగారు కేవలం  కొరింథీలో ఉన్న పరిస్థితిని గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అనుకోరాదు!ప్రపంచ దేశాలలో ఉన్న అందరికోసం చెబుతున్నారు!

 

సున్నతికోసం ప్రత్యేకంగా నొక్కివక్కానించి చెప్పడానికి కారణం ఉంది: ఒక సున్నతి భ్యాచ్ యేరూషలేమునుండి బయలుదేరి మీరు బాప్తిస్మం పొందారు బాగుంది, అయితే తండ్రియైన దేవుడు చెప్పిన విధి కూడా చెయ్యాలి! పరలోకం పోవాలంటే సున్నతి పొందాలి అంటూ చిన్న ఆసియా మరియు ప్రక్కన ఉన్న ప్రాంతాలన్నీ కలవరపరిచారు! దీనికోసం మనకు గలతీ పత్రికలోను ఇంకా అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో చూసుకోవచ్చు! అప్పుడు పౌలుగారు బర్నబాగారు అంతియొకయ నుండి యేరూషలేము వెళ్లి సంఘపెద్దలతో అనగా అప్పటి మొత్తం క్రైస్తవ సమాజానికి అధ్యక్షుడు యేసుక్రీస్తు ప్రభులవారి పెద్ద తమ్ముడు చిన్న యాకోబు గారు, పేతురు గారు, యోహాను గారు అందరూ దీనికోసం బాగా ఆలోచించి చివరికి ప్రపంచ దేశాలకు ఉత్తరం రాశారు: అన్యజనులలో నుండి రక్షణ పొందినవారు సున్నతి పొందాల్సిన అవసరం లేదు! అయితే రక్తమును తినొద్దు! విగ్రహాలకు అర్పించిన దానిని తినవద్దు అని! అందుకే ఇక్కడ పౌలుగారు సున్నతి కోసం ప్రత్యేకంగా రాస్తున్నారు!

 

క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులు తమ యూదా ధర్మ సంబంధమైన గుర్తులను చెరిపేసుకునే ప్రయత్నం చేయకూడదు. అన్యజనులలో నుండి  విశ్వాసులైనవారు తాము సున్నతి పొందాలను కోకూడదు (పొందాలని కొందరు కపట బోధకులు చెప్పారు అపొ కా 15:1).

 

Acts(అపొస్తలుల కార్యములు) 15:1,2,13,14,19,20

1. కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.

2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.

13. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను: సహోదరులారా, నా మాట ఆలకించుడి.

14. అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.

19. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

 

శరీరంపై ఒక గుర్తు ఉండడం, లేకపోవడం దేవుని దృష్టిలో ముఖ్యమైనదేమీ కాదు. దేవుని సంకల్పం ప్రకారం జీవించడమే ముఖ్యం.

గలతీ 6:15;

క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందక పోవుట యందేమియు లేదు.

 

 రోమా 2:25-29.

25. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.

26. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?

27. మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?

28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.

29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధ మైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

 

ఇక దాసుడిగా పిలువబడితివా అని రాయడానికి కారణం: ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో బానిసత్వం సర్వ సాధారణం. బానిసల్లో అనేకమంది క్రీస్తునందు నమ్మి విశ్వసించారు. వారేం చెయ్యాలి? తమ స్థితిని ప్రశాంతంగా అంగీకరించాలి, వీలైతే స్వతంత్రత పొందాలి, క్రీస్తు తమను స్వతంత్రులుగా అంటే పాపం, మరణం, ధర్మశాస్త్రం నుంచి విడుదల చేశారని గుర్తించాలి.

యోహాను 8: 36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

 

 గలతీ 5:1.

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

అలాగే మనుషులకు నిజంగా బానిసలు కానివారు తాము క్రీస్తుకు “బానిసల”మని/దాసులమని గుర్తించాలి!

Romans(రోమీయులకు) 6:16,17,18,19,20,21,22

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

 

వేరే మాటల్లో చెప్పాలంటే జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసులు క్రీస్తుతో తమ సంబంధం ప్రాముఖ్యమైనదని గుర్తించి ఆయనకు సేవ చేయాలి, ఘనత కలిగించాలి.

 

ఇక 23వ వచనంలో అంటున్నారు: మీరు విలువపెట్టి కొనబడిన వారు! దీనిని రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు!! ఆ కాలంలో బానిస వ్యాపారం వాడుకలో ఉండి, అనేకులను బలవంతంగా బానిసలుగా అమ్మేసేవారు! ముఖ్యంగా ఆఫ్రికా దేశాల వారిని! ఇంకా అప్పులు ఎక్కువైన వారు స్వయంగా బానిసలుగా అమ్ముడుపోయే వారు! వారిని మరొకరు డబ్బులు పెట్టి కొనేవారు!! అలాగే మానవులమైన మనమంతా పాప దాస్యంలో సాతాను బంధకాలలో ఉన్నప్పుడు క్రీస్తుయేసు రక్తముచేత కొనబడి పాప దాస్యము నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాము!! అలా పొందడానికి విలువ చెల్లించవలసి వచ్చింది! అదే క్రీస్తుయేసు జీవితం! ఆయన మనకోసం చనిపోయారు! ఆయన రక్తము ద్వారా బలి చెల్లించి విమోచనం చేశారు!

1కొరింథీ 6:20

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

 

పేతురు గారు అంటున్నారు....

1పేతురు 1:1819

18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

19. అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

 

మత్తయి 20:28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

కాబట్టి విలువ పెట్టి కొనబడిన నీవు విలువైన పరిశుద్ధ పనులే చెయ్యాలి గాని అపరిశుద్ధమైన జీవితం జీవించకూడదు!

మీద చెప్పిన గలతీ పత్రికలో పౌలుగారు అంటున్నారు మీరు విమోచించ బడ్డారు కాబట్టి మరలా దాస్యమనే కాడిక్రింద చిక్కుకోవద్దు!

కాబట్టి మన జీవితాలను సరిదిద్దుకుని మనము పొందుకున్న రక్షణను విశ్వాసమును నిలబెట్టుకుందాం!

 

ఇక 24వ వచనంలో మరోసారి అంటున్నారు:...

సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

దీన్ని పౌలుగారు  ఇక్కడ మూడో సారి చెప్తున్నారు. దీన్ని బట్టి దీనికున్న ప్రాముఖ్యతను గుర్తించగలం (వ 17,20). విశ్వాసులుగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకు దేవుడు సమీపంగా ఉన్నాడని గుర్తించి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగానే జీవించాలి.

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*59వ భాగము-సంఘము-సమస్యలు-16*

 

1కొరింథీ 7:2531

25. కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.

26. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.

27. భార్యకు బద్ధుడవైయుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.

28. అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నారు.

29. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమైయున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

30. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును

31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    ఇక 2531వరకు మరో సమస్య కోసం చెబుతున్నారు! ప్రతీ ఒక్కరు దేవుడు తనను ఏ స్తితిలో పిలిచారో అదే స్థితిలో ఉండాలి లేక ప్రభువులో సాగిపోవాలిఅనే అంశం మీదనే మరొక ఉద్దేశం రాస్తున్నారు!

 

ఇప్పుడు మరో అడిగిన ప్రశ్నకు సమాధానం: కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞను నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడను కాబట్టి నా ఉద్దేశం చెబుతున్నాను: ప్రస్తుతం ఇప్పుడున్న ఇబ్బందులను బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలు అని నా ఉద్దేశం అంటున్నారు! అనగా పెళ్లి అయ్యిందా విడాకులు తీసుకోవద్దు! నీ భార్యతోనే ఉంటూ సంసారం చేస్తూ దేవునిలో పరిశుద్ధంగా సాగిపో! అయితే నీకు పెళ్లి కాలేదా? అయితే పెళ్లి చేసుకోవద్దు! అయినా నీవు కోరికలను అణచుకోలేక పోతున్నావా? పెళ్ళిచేసుకున్నా తప్పులేదు అంటున్నారు! అయితే అలాగే కన్యక కూడా పెళ్లి చేసుకున్నా తప్పులేదు! అయితే నా ఉద్దేశం ఏమిటంటే పెళ్లి చేసుకున్న వారికి సంసారంలో ఎన్నో ఇక్కట్లు వస్తాయి, అవి మీకు రాకూడదు అని నా ఉద్దేశం అంటున్నారు! అనగా మనలాగ సంసార సాగరంలో కొట్టుకుపోతున్నవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అంటే పెళ్ళికాని యవ్వనస్తులారా పెళ్ళిచేసుకోవద్దు! మీరు పెళ్లి చేసుకున్నా అది ప్రభువులో తప్పుకాదు అంటున్నారు!!

 

  ఇక్కడ ప్రస్తుత ఇబ్బందులు అంటే గ్రీకులో ఇదే పదం లూకా 21:23; 2 కొరింతు 6:4; 1 థెస్స 3:7లో కూడా ఈ పదం వాడబడింది. పౌలుగారి  భావమేమంటే కొన్ని సమయాల్లో, పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోకపోవడం మంచిదని.

 

ఇక 29౩౦ వచనాలలో ప్రభువుకు దగ్గరగా ఉండటానికి ఏమి చెయ్యాలో చెబుతున్నారు:....

 

29. సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమైయున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

30. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును

దీనికోసం గతభాగాలలో చెప్పడం జరిగింది మా ప్రాంతంలో ఉన్న అబద్దబోధకుడు పిల్లలు పుట్టాక భార్యతో సంసారం చేస్తే అది వ్యభిచారం అయిపోతుంది! పిల్లలు పుట్టినంతవరకే భార్యతో సంసారం చెయ్యాలి ఆ తర్వాత పెళ్లి అయిన వారు కానట్టు ఉండాలి అంటూ తప్పుడు బోధ చేస్తున్నారు! ఇక్కడ పౌలుగారి ఉద్దేశం ఏమిటంటే దేవుని రాకడ తొందరలో ఉంది కాబట్టి సంసార సుఖం కోసం కాదు ప్రభువుకోసం, ఆయన రాకడ కోసం మీరు సిద్ధపడుతూ ఉండండి అంటున్నారు! దీనికి సపోర్టింగ్ గా పెళ్లి అయిన స్త్రీ తన భర్తను సుఖపెట్ట వలసి ఉంటుంది, అయితే పెళ్ళికానివాడు ప్రభువును ఎలా సంతోష పరచాలి అని ఆలోచిస్తాడు కాబట్టి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు కనుక భార్యకోసం భర్త కోసం ఆలోచించండి గాని ప్రభువుకోసం కూడా మీ సమయం కేటాయించండి అని అర్ధము! ఇదీ నాకు అర్ధమయ్యింది ప్రియులారా!!

 

“కాలం కొద్దిగానే ఉంది”(వ 29). ఇందులో పౌలుగారి  భావమేమిటో స్పష్టంగా లేదు. ఇంతకన్నా గొప్ప కష్ట కాలము లేక శ్రమలు  సంఘం మీదికి వస్తుందని పౌలుగారు ముందుగా చూచి ఉండవచ్చు. యేసుప్రభువు త్వరలో తిరిగి రావచ్చని అతని తలంపు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది

 రోమా 13:11-12

11. మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

 

 పౌలుగారు త్వరలో బ్రహ్మాండమైన మార్పులు జరగబోతున్నాయని అతడు ఎదురు చూస్తున్నారు (వ 31).

భూమి పై అతి ప్రాముఖ్యమైన విషయం అంటే ప్రభువుపట్ల తమ ప్రేమ, సేవ అనే విషయాల పైనే విశ్వాసులు మనసు లగ్నం చేసుకొని ఉండాలని అతని ఉద్దేశం (వ 35).

కాబట్టి భార్యలు గలవారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్లు సంతోష పడేవారు సంతోష పడనట్లు ఉండాలి, ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోతుంది అంటున్నారు!! ఈ లోకం తొందరలో నశించి పోతుంది అంటున్నారు! అందుకే ప్రభువు కోసం సిద్దపడండి గాని ఈ లోకపుటాశలు నెరవేర్చుకోవడానికి కాదు అంటున్నారు! పేతురు గారు కూడా ఈ లోకం తొందరలో కాలిపోతుంది అంటున్నారు......

2 Peter(రెండవ పేతురు) 3:10,11,12

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు (త్వరపెట్టుచు), మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

 

3132 లో ఈ లోకం అనుభవించే వారు అమితంగా అనుభవించనట్లు ఉండాలి! ఇంకా మీరుచింత లేని వారుగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఇలా రాస్తున్నాను అంటున్నారు.....

 

31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

32. మీరు చింతలేని వారైయుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.

 

ఇక ౩౩35 లో అంటున్నారు: పెండ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు, నిజానికి ఆలోచించాలి కూడా! అలాగే పెండ్లి అయిన స్త్రీతన భర్తను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచిస్తుంది! అయితే వివాహం కానివాడు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తూ దేవుని కార్యాలను అడ్డులేకుండా చేస్తాడు అంటున్నారు! దానికి ఉదాహరణ పౌలుగారే! ఆయనకు పిల్లలు భార్య లేరు కాబట్టి మూడున్నర మిషనరీ యాత్రలు ఆటంకం లేకుండా చేశారు! భార్యను సంతోషపెట్టాలని లేదు, పిల్లలకు బట్టలు కొనాలి, స్కూల్ ఫీజు కట్టాలని లేదు, పిల్లలకు పెళ్ళిచేయాలని లేదు ఆయనకు! పిల్లలకు జ్వరం వచ్చింది, హాస్పటల్ లో అడ్మిట్ చేయాలని ఏమి భాధలు లేవు ఆయనకు! దేవుడు- సువార్త- ఆధ్యాత్మిక సంగతులు- పొందబోయే తేజోవాసుల స్వాస్త్యము అంతే ఆయన మదిలో!! అందుకే అనుభవంతో రాస్తున్నారు ఆయన! అయితే ఈ విషయంలో కూడా నిర్భంధము ఏమీ చెప్పడం లేదు!

 

33. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.

34. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది.

35. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

 

ఇక 3638 లో మరో విషయం రాస్తున్నారు! ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహం చెయ్యకూడదు దేవునిలోనే ఉంచేస్తాము అంటే ఏమి చెయ్యాలి?

 

36. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును.

37. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

38. కాబట్టి తన కుమార్తెకు (మూలభాషలో- కన్యకు) పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.

 

ఒకడు తన కుమార్తెకు ఈడు మించిపోయింది అనగా వయస్సు అయిపోయింది కాబట్టి ఇక నేను ఆమెకు వివాహం చెయ్యను అనుకుంటే మంచిదే! వివాహం చేస్తే మంచిది, చెయ్యకపోతే ఇంకా మంచిది అంటున్నారు! అందులో పాపము లేదు! ఆమె అనగా ఆ కన్యక పెళ్లి చేసుకున్నా పాపం లేదు అంటున్నారు! ఎవరికైనా పెళ్ళి చేసుకోవద్దని తాను చెప్పడం లేదన్న సంగతి స్పష్టం కావాలని పౌలుగారి  ఉద్దేశం. మారుతున్న ఆ కష్టకాలంలో కూడా విశ్వాసులకు వారికి మంచిదని తోచినదాన్ని చేసే స్వేచ్ఛ ఉంది.

 

ఇక 3940 వచనాలలో మరో విషయం రాస్తున్నారు: ఒక స్త్రీకి తన భర్త చనిపోతే మరలా వివాహం చేసుకోవచ్చా? ఇది కూడా వారు అడిగిన ప్రశ్నయే!! ఆనికి జవాబుగా రాస్తున్నారు....

 

39. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను.

40. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.

తన భర్త బ్రతికి ఉన్నంతవరకే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె లోబడి ఉండాలి! ఇప్పుడు అతడు చనిపోయాడు కాబట్టి ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు! అయితే ప్రభువునందు మాత్రమే చేసుకోవాలి అనగా కేవలం విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి! నేను నీకు లైఫ్ ఇస్తాను, నేను స్వతంత్ర భావాలు గలవాడను ఇలాంటి సినిమా డైలాగ్ లు ఎవడైనా అన్యుడు కొడితే మోసపోయి అన్యుని చేసుకోకూడదు! ఆమె పెళ్లి చేసుకుంటే విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి ఇదీ పౌలుగారి ద్వారా దేవుని ఆజ్ఞ!!

 

అయితే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటే మరీ ధన్యురాలు అంటున్నారు! దేవుని ఆత్మ నాకు కూడా ఉంది కాబట్టి నా భావము నేను చెబుతున్నాను అంటున్నారు పౌలుగారు!

రోమీయులకు 7: 2

భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును.

 

విశ్వాసులు విశ్వాసులనే పెళ్ళి చేసుకోవాలని పౌలుగారు  నొక్కి చెప్తున్నారు. ప్రభువుకు చెందినవాణ్ణి అంటే అర్థం ఇదే.

 

ఇవీ ఈ అధ్యాయంలో విశ్వాసులు అడిగిన ధర్మసందేహాలు పౌలుగారి జవాబులు!!

 

ఇవి కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే అని భావించవద్దు! యావత్ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశపు వారైనా ఈ ఆజ్ఞలను పాటించాలి!

మనము కూడా వీటిని పాటిద్దాం!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*60వ భాగము-సంఘము-సమస్యలు-17*

 

1కొరింథీ 8:16

1. విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

2. ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.

3. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ఇక ఈ ఎనిమిదో అధ్యాయంలో పౌలుగారు రాస్తున్న సంఘములో తలెత్తే మరో సమస్య: విగ్రహాలకు అర్పించిన వాటిని రక్షించ బడిన విశ్వాసులు తినవచ్చా??!! కొందరు దేవుడు మనకు స్వేచ్చ ఇచ్చారు కాబట్టి విగ్రహాలకు అర్పించినవి తినినా పర్వాలేదు! కారణం విగ్రహంలో ఏమీలేదు కదా అన్నారు! కొందరు తప్పు- విగ్రహాలు అంటే దయ్యాలు- వాటికి అర్పించినవి తినకూడదు అన్నారు! ఇక  దీనికోసం వారు పౌలుగారికి ఉత్తరం రాసి పంపించారు! దానికి పౌలుగారు జవాబు రాస్తున్నారు!

 

ఈ సమస్యకు సంబంధించిన కొన్ని సత్యాలు అందరికీ తెలుసు. కానీ పౌలుగారు  ఈ చర్చను అంతకంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు. తెలివికన్నా (దేవుని గూర్చిన జ్ఞానము) క్రైస్తవ ప్రేమ ముఖ్యమనీ,  ప్రేమ లోపించిన తెలివి (అది బైబిల్ జ్ఞానము గాని లోకజ్ఞానము గాని) చాలా హానికరమయ్యే అవకాశం ఉందనీ అంటున్నారు పౌలుగారు. విశ్వాసుల ప్రవర్తనకు తగిన ఉత్తమమైన సూత్రాలను ఇక్కడ రాస్తున్నారు   విశ్వాసి మిగిలిన విశ్వాసులను ప్రేమతో చూడాలి, వారి అభివృద్ధికి సహాయపడాలి, వారికి హాని చేసే దేనినైనా మానుకోవాలి!! ఇదీ ముఖ్యము అంటున్నారు!

 

ప్రియులారా! ఈ అధ్యాయం మొదలుపెడుతూ మనందరికీ జ్ఞానము ఉంది అని మనకు తెలుసు అని మొదలుపెట్టి జ్ఞానము ఉప్పొంగజేయును లేక గర్వించేలా చేస్తుంది అయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది అంటున్నారు! ఇలా ఎందుకు అంటున్నారు అంటే తెలివి లేక జ్ఞానము  ఉన్న వ్యక్తిలో అది గర్వాన్ని, అహంకారాన్ని కలిగించవచ్చు. ప్రేమతో వ్యవహరించడం ఇతరులకు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి కలిగిస్తుంది అని ఆయన ఉద్దేశ్యం!!!  అయితే ప్రేమ ఎలాంటిదో ఇదే పత్రికలో 13వ అధ్యాయంలో చాలా వివరంగా రాశారు....

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 13:4,5,6,7,8,13

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7.అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

 

అయితే ఇక రెండో వచనంలో అంటున్నారు: ఒకడు తనకు ఏదైనా తెలుసు అని అనుకుంటే తాను తెలిసికొనవలసినట్లు ఇంకా ఏమియు తెలుసుకొన్న వాడు కాడు అంటున్నారు అనగా తెలిసికోవాల్సిన విధంగా వాడు ఇంకా తెలిసి కోలేదు అని గ్రహించాలి అంటున్నారు!  గమనించాలి: ఏ విషయం గురించైనా తెలుసుకోగలిగినదంతా ఎవరికీ తెలియదు. తనకున్న కొద్దిపాటి తెలివి గురించి గర్వించడం బుద్ధిహీనత. మనకు తెలిసినదెంత తక్కువో వినయంతో ఒప్పుకోవడమే తెలివి అనిపించుకుంటుంది!!

 

ఉదాహరణ చెప్పనీయండి: భక్తులు దైవజనులు తగ్గించుకున్నట్లు తప్పించుకున్నట్లు తగ్గించుకోవాలి! దేవుడు యేహెజ్కేలు భక్తునికి ఎముకలు గల లోయలోనికి తీసికుని పోయి- నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అడిగారు యేహెజ్కేలు 37 వ అధ్యాయంలో!! మనమైతే మనమైతే హా ఇవా? ఇవి చచ్చిపోయి అనేక సంవత్సరాలు అయ్యాయి- ఎలా బ్రతుకుతాయి అంటాము! అయితే యేహెజ్కేలు గారు తగ్గించుకుని- ఏమంటే ఏమొస్తుందో అని తెలివితో ఆలోచించి ప్రభువైన యెహోవా అది నాకెలాగు తెలుస్తుంది! నీకే తెలుసు! అనగా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా అని జవాబు ఇచ్చారు! నిజం చెప్పాలంటే ఇదీ తెలివి!! తెలిసినట్లు గొప్ప ఫోజులు కొట్టకుండా మహాప్రభో నాకు తెలియదు అంత జ్ఞానం లేదు అనేశారు!! కాబట్టి అన్నీ తెలిసినట్లు మనం ఫోజులు కొట్టకూడదు గొప్పలు చెప్పుకోకూడదు!!

 

ఇక మూడో వచనంలో అంటున్నారు: ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి బాగా తెలిసిన వాడు అంటున్నారు!!

ఇలా వ్రాయడంలో పౌలుగారి భావము ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడం తెలివికన్నా గొప్పది. అది స్వయంగా అత్యంత ఉన్నతమైన జ్ఞానం అంటున్నారు

(మొదటి కొరింథీయులకు) 13:2

ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

 

 1 యోహాను 4:7-8

7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

8. దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

 తనను ప్రేమించేవారెవరో దేవునికి తెలుసు. తనకు చెందినవారుగా వారిని ఆయన గుర్తించి వారిని ఆమోదిస్తాడు

 2 తిమోతి 2:19

అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది.ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది

 

గలతీ 4:9

యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

 

ఇక ఇప్పుడు 4వ వచనంలో అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నారు: లోకమందు విగ్రహము వట్టిది అని, ఇంకా అసలు దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరే దేవుడు లేడు అని మనకు తెలుసు! అయితే దేవతలు అనబడే వారు, ఇంకా ప్రభువులు అనబడే వారు ఎంతోమంది ఉన్నారు గాని, 6వ వచనం- ఆకాశమందైనా భూమిమీదైనా దేవతలు అనబడినవి ఉన్నా గాని మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన మనకు తండ్రి లేక తండ్రియైన దేవుడు!! అనగా యెహోవా దేవుడు! ఆయన నుండి సమస్తము కలిగాయి, అనగా సృష్టికర్త! మరియు మనకు ప్రభువు ఒక్కడే! ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనకు సమస్తము కలిగెను! అనగా ఈయన కూడా సృష్టికర్త! గమనించాలి- ఇద్దరు సృష్టికర్తలు కాదు! ఇద్దరూ సృష్టికర్తలే! ఇద్దరూ ఒకటే! ఒకే దేవుడు!!! మనము ఆయన ద్వారా కలిగాము అంటున్నారు! (దీనికోసం తరువాత భాగంలో చూసుకుందాం)

 

ఇక 78 వచనాలలో...

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 8:7,8

7. అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

8. భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.

 

దీని అర్ధం విగ్రహం వట్టిదనీ, విగ్రహానికి అర్పించిన ఆహారం అన్ని ఆహారాల్లాంటిదే అనీ, ఏమీ అశుద్ధమైపోదనీ అందరికీ తెలియదు అంటున్నాడు పౌలు. ఎవరి ఇళ్ళల్లో వారు కూడా అలాంటి ఆహారాన్ని తినడం తప్పని కొందరు క్రైస్తవులు భావించారు. అలా తింటే వారి అంతరాత్మ వారిపై నేరం మోపింది. వివేచనాశక్తి లేని అంతరాత్మ అంటే ఒక విషయం నిజానికి పాపం కాకపోయినప్పటికీ అది పాపమనుకునేది. లేక ఒక విషయం పాపం అయి ఉన్నా అది పాపం కాదనుకునేది.

ఇక్కడ పౌలుగారు విగ్రహాలకు అర్పించినవి తినినా తప్పులేదు అనడం లేదు! తినకూడదు అని ఖచ్చితమైన ఆజ్ఞ అని మర్చిపోవద్దు! దయ్యాలకు అర్పించిన వాటిని దేవుని బిడ్డలు తినకూడదు! వారి విగ్రహ సంబంధమైన కార్యక్రమాలలో వేడుకలలో మనము పాలుపొందకూడదు! అందుకే అంటున్నారు దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము! మనము దేవుని ఆలయమై ఉన్నప్పుడు- విశ్వాసి విగ్రహాలుండే స్థలమునకు వెల్లడము తప్పే వాటికి పెట్టినవి తప్పే అని గ్రహించగలరు!

 

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*61వ భాగము-యేసుక్రీస్తు దైవత్వం-1*

 

1కొరింథీ 8:16

1. విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

2. ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.

3. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము! ఎనిమిదో అధ్యాయంలో గల మరో సమస్య: విగ్రహాలకు అర్పించిన వాటిని రక్షించ బడిన విశ్వాసులు తినవచ్చా? అనే సమస్యకోసం ధ్యానిస్తూ దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే అంటూ ఆరవ వచనంలో చెబుతున్నారు!

 

 దీనికోసం కొంచెం క్లుప్తంగా చూసుకుందాం!

ఒకసారి 46 వచనాలు మరోసారి చూసుకుందాం!...

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

ఆకాశంలో, భూమి మీదా అనేకమంది దేవుళ్ళు, ప్రభువులు ఉన్నారని విగ్రహపూజ చేసేవారు అనుకుంటారు, కానీ క్రీస్తు విశ్వాసులకు నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు ఆయనొక్కడే అని తెలుసు. కొరింథీ 10:20లో కొందరు పూజించే దేవుళ్ళు, ప్రభువుల గురించి పౌలుగారు ఏమి రాశారో చూడండి.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:19,20

19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?

20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.

 

ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుప్రభువు అనడంలో తండ్రి అయిన దేవుడు ప్రభువు కాదని అర్థం కాదు. యేసు స్వయంగా ఆయనను ప్రభువని పిలిచారు

మత్తయి 11: 25

ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

 

 అదే విధంగా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన పరమ తండ్రి అంటే యేసుక్రీస్తు దేవుడు కాడని అర్థం కాదు.

 

దేవుడు బైబిలు రాసిన దైవజనులచేత ఆయనను దేవుడు అని రాయించారు (యెషయా 9:6; యోహాను 1:1; అపొ కా 20:28; రోమ్ 9:5; ఫిలిప్పీ 2:6; కొలస్సయి 2:9; తీతు 2:13; హీబ్రూ 1:3, 8; 1 యోహాను 5:20).

ఆయనద్వారా అన్నీ ఉనికిలోకి వచ్చాయని పౌలు రాస్తున్నారు. ఇదే మాటలను రోమా 11:36లో దేవుని విషయంలో ఉపయోగించాడు. నిజానికి యేసు ప్రభువని చెప్తే దేవుడని చెప్పినట్టే. లూకా 2:11; ఫిలిప్పీ 2:6, 10, 11 ప్రకారం!

 

 అలాగైతే ఇద్దరు దేవుళ్ళున్నారా? ఎంతమాత్రం కాదు. దేవుడొక్కడే, ఒకే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారు. మత్తయి 3:16-17 చూడండి.

 

16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.

 

ఒకే నిజ దేవుణ్ణి పౌలుగారు అన్నిటికీ సృష్టికర్తగా వర్ణిస్తున్నారని గమనించండి (ఆది 1:1; యెషయా 40:25-28).

 

మనం వెతకవలసినది, ఆరాధించవలసినది ఆయన్నే వేరెవరినీ కాదు

 

ప్రియులారా! యేసుక్రీస్తు దైవత్వము అనే దానికోసం ఆధ్యాత్మిక సందేశాలు-5 సిరీస్ లో కొలస్సీ పత్రిక ధ్యానాలలో 2329 వరకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి దానిని చూడమని చెబుతున్నాను. లింక్ ... (https://drive.google.com/file/d/1dcpa0Asp8V4qpr1zIzfa8dpUYoV585Xy/view?usp=drivesdk)

ఒకసారి వాటినే చాలా క్లుప్తంగా చూసుకుందాం!

మొదట యేసు దేవుడు అని ఎక్కడ వ్రాయబడి ఉంది బైబిల్ లో! మీదన వివరించిన వచనాలే చూసుకుందాం!

దానికి ముందుగా అసలు యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో చూసుకుని  యేసు దేవుడు అని బైబిల్ లో ఎక్కడ వ్రాయబడి ఉందో చూసుకుందాం!

 

దేవునికి మనుష్యులతో గడపటం ఇష్టం! అందుకే మానవులను చేసుకున్నారు, అందుకే చల్లనిపూట ఆదాము హవ్వలతో షికారు చేయడానికి ఏదేను వనముకి దేవుడు వచ్చి, వారితో ముచ్చటించేవారు. ఆదికాండం 3:8. అయితే సర్పము/ సాతాను కుయుక్తి వలన మోసపోయి, పాపంలో పడిపోయి, ఆ సహవాసం కోల్పోయాడు మానవుడు. దేవునితో సహవాసం ఆగిపోయింది. అయితే జెకర్యా 2:10 లో దేవుడు మరలా మానవులతో వాగ్దానం చేస్తున్నారు “సీయోను వాసులారా! నేను మీ మధ్య నివాసం చేస్తాను” ఇదే *యెహోవావాక్కు*!!! *అదే వాక్కు శరీరదారిగా మనమధ్య నివసించెను*. యోహాను 1:14; శరీరదారి అనగా వాక్కు అనగా యేసుప్రభులవారు మనతో నివాసం చేయడానికి భూలోకానికి వచ్చారు.

అయితే ఎందుకు వచ్చారు?

1) మానవులతో సహవాసం చేసి, తిరిగి దేవునితో వారిని సమాధాన పరచి, సందిచేసి, దేవునితో సహవాసం/ లింక్ ఏర్పాటు చేద్దామని; కొలస్సీ 1:20-22;

 2) వారి పాపాలు తీసివేయాలని;

 

    మరి యెహోవాదేవుడు భూమిమీదకు వచ్చారా? అంటే ఆయనవాక్కు ఆయన వాక్యము యేసయ్య రూపంలో శరీరధారిగా భూమిమీదకు రావడం జరిగింది. ఇది ఇంకా బాగా అర్ధం కావడానికి బైబిల్ పండితులు చక్కని ఉదాహరణ చెబుతారు: ఒక మనిషి గోతిలో పడిపోయి రక్షించండి అని అరుస్తున్నాడు. మరి ఆవ్యక్తిని గోతిలోనుండి తీయాలి అంటే మరో వ్యక్తి ఆగోతిలోనికి దిగితే పడిన వ్యక్తిని తీయగలడా? తీయలేడు కదా! ఆ వ్యక్తి ఒడ్డున ఉండి, తనచేయి చాపిగాని, ఒక త్రాడు ఇచ్చి గాని ఆ వ్యక్తిని తీయాలి. *ఇక్కడ గోతిలో పడిన వ్యక్తి మానవుడు; ఒడ్డున ఉండి చేయి అందించినది యెహోవాదేవుడు. ఆ చేయి అనగా ఆయనవాక్కు = యేసుప్రభులవారు*!!! ఇదీ బైబిల్ పండితుల వివరణ!!

 

   అయితే దురదృష్టవశాత్తు ఆ గొయ్య సాతానుగాడి వశంలో ఉంది! ఇప్పుడు మానవుని రక్షించడానికి వాడు ఒప్పుకోవడం లేదు, దానికి మూల్యం చెల్లించమన్నాడు, అది ఆయన ప్రాణం, ఆయన రక్తం! యేసుప్రభులవారు ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మానవులకోసం బలిగా ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకోసమే ఆయన వచ్చారు! రక్తమిచ్చి, మనల్ని పాపగోతినుండి విడిపించారు, ఆయన చనిపోయారు. సాతానుగాడు గెలిచినట్లు పండగ చేసుకున్నాడు, గాని ఆయన మూడవరోజు విజయుడై, లేచి, చెరను చెరగా తీసుకుపోయారు. ఎఫెసీ 4:8; వాడి కబంధహస్తాలలో ఉన్న మానవాళిని విడిపించారు. ఆయన దేవుడు, దైవ మానవుడు; ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఇదీ జరిగింది! జెకర్యా 2:10 ప్రకారం దేవుడు తనవాక్కును పంపించి, మానవులను విడిపించి, మానవులతో సహవాసం చేస్తున్నారు!

 

  ఇంతవరకు యేసుప్రభులవారు శరీరదారిగా ఎందుకు వచ్చారో చూసుకున్నాం! ఇక దేవుడు అని ఎక్కడుందో చూసుకుందాం! ఆయన నోటితోనే నేను- తండ్రి ఏకమైఉన్నాము , నేనే తండ్రిని అని చెబుతున్నా చాలామందికి అర్ధం కావడం లేదు, గాని యూదులకు అర్ధమయ్యింది, అందుకే ఆయనను ఘోరాతిగోరంగా చంపించారు!

ఇక మనం Direct References చూసుకుందాం!

 

1). మొదటగా పాతనిబంధన నుండి ధ్యానం చేసుకుందాం!

యెషయా 9: 6

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు *కుమారుడు* అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త *బలవంతుడైన దేవుడు* *నిత్యుడగు తండ్రి* సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

 

  ఆయన మొదట కుమారుడు = యేసుప్రభువు, తర్వాత బలవంతుడైన దేవుడు, చూశారా ఎంత స్పష్టంగా రాయబడిందో, ఆ తర్వాత నిత్యుడగు తండ్రి= యెహోవాదేవుడు. కాబట్టి ఇక్కడ యెహోవాదేవుడే యేసుప్రభులవారుగా జన్మిస్తారు అని కొన్నివందల సం.ల క్రితమే యెషయా గారు ప్రవచించారు!

2) యోహాను సువార్త మొదటి అధ్యాయము. 1:1 ...

యోహాను 1: 1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

 

వాక్యము= దేవుడు; వాక్యము= శరీరదారి = యేసుక్రీస్తు; కాబట్టి దేవుడు= యేసుక్రీస్తు

 

3) యేసయ్య పునరుత్థానం అనంతరం- తోమాగారికి కలిగిన ప్రత్యక్షత : నా ప్రభువా! నాదేవా! ఇక్కడ తోమాగారు యేసుప్రభులవారిని దేవా అనగా నా దేవుడా అని పిలుస్తున్నారు! యోహాను 20:28-29;

 

4) అపోస్తలుల కార్యములు 20:28 లో లూకాగారు, పౌలుగారు అత్మాభిషేకంతో చెబుతున్న మాటను రికార్డు చేసి రాస్తున్నారు: దేవుడు తన స్వరక్తమిచ్చి, సంపాదించిన సంఘము . . ..  ఈ భాగం ప్రకారం తన స్వరక్తమిచ్చినది ఎవరు? ఏ దేవుడు? యేసుప్రభులవారు మాత్రమే!! కాబట్టి ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని దేవుడు అని పిలుస్తున్నారు!

 

5) రోమీయులకు 9: 5

పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. *ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.*

   ఇక్కడ పౌలుగారు యేసుప్రభులవారిని సర్వాదికారియైన దేవుడు అంటున్నారు! ఇది డైరెక్ట్ రెఫరెన్సు కాదా!

 

6) కొలస్సీ 1:15-17 ఈయన అదృశ్య దేవుని స్వరూపి అంటున్నారు. ఇంకా సృష్టికర్త అంటున్నారు. అనగా దేవుడే కదా!

 

7)  కొలస్సీయులకు 2: 9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 ఇది తిరుగులేని Statement!! దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అనగా దేవుడు ఎప్పుడైనా మానవునిగా మారితే, అది యేసుప్రభులవారే!!

 

8) ఫిలిప్పీ 2:6-8; ఆయన దేవుని స్వరూపము గలవాడైయుండి. . . . అనగా దేవుని స్వారూపం అనగా దేవుడు, మానవులకోసం పరలోకం వదలి భూలోకానికి వచ్చారు అని స్పష్టముగా రాస్తున్నారు!

 

9) 1 తిమోతీ 4:10; మనుష్యులందరికీ రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడునైన *జీవముగల దేవునియందు* . .. . ఇక్కడ మనుష్యులందరికీ రక్షకుడు ఎవరు? యేసుప్రభులవారు మాత్రమే కదా! ఆయన పేరే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు!! కాబట్టి ఇక్కడ యేసుప్రభులవారిని జీవముగల దేవుడు అని అభివర్ణించారు!

 

10) 2 పేతురు 1:1 మన దేవునియొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు . . . ఇక్కడ పౌలుగారే కాదు పేతురు గారు కూడా యేసయ్యను దేవుడు అని పిలుస్తున్నారు!

 

11) చివరగా తిరుగులేని Direct Super Statement: తీతుకు 2:13

అనగా *మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు* మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

ఇక్కడ పౌలుగారు *యేసయ్యను దేవుడు అనడం లేదు- మహాదేవుడు* అంటున్నారు!!! Great God and Saviour Jesus Christ.

   మరి ఇన్ని direct statements/ references ఉంటే ఎక్కడ రాసి ఉంది చూపించండి అని అడుగుతున్నారు కదా, అసలు వీడెప్పుడైనా బైబిల్ చదివితే కదా! దేవునివాక్యం జాగ్రత్తగా చదివి, పరిశీలిస్తే ఇవన్నీ మనకు అర్ధం అవుతాయి గాని ఏదో అలా చదువుకుంటూ పోతే ఏమీ అర్ధం కాదు! కాబట్టి ప్రియ క్రైస్తవులారా! బైబిల్ ప్రతీరోజు చదవండి! అర్ధం చేసుకోండి! ఇలాంటి తప్పుడుబోధలకు, ముఖ్యంగా యెహోవా సాక్షులు లాంటివారికి బుద్ధి చెప్పండి! 

 

  పైన ఉదాహరించినట్లు యేసుప్రభులవారు రక్షకుడు, దేవుడు, ప్రభువు,సృష్టికర్త! మరి నీవు ఆయనను నీ రక్షకుడిగా, యజమానిగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే నీవు ధన్యుడవు!!

ఒకవేళ ఇంకా అంగీకరించలేదా? ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుని, నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించు!

నీ హృదయం ఆయనకివ్వు!

ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధముగా ఉన్నారు!

 

God Bless You!

Amen!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*62వ భాగము-యేసుక్రీస్తు దైవత్వం-2*

 

1కొరింథీ 8:46

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము! ఎనిమిదో అధ్యాయంలో మరో సమస్య: విగ్రహాలకు అర్పించిన వాటిని రక్షించ బడిన విశ్వాసులు తినవచ్చా? అనే సమస్యకోసం ధ్యానిస్తూ దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే అంటూ యేసుక్రీస్తు దైవత్వం కోసం చూసుకుంటున్నాము! ఇక యేసుక్రీస్తు దైవత్వం కోసం మరో కోణంలో చూసుకుందాం!

 

  యోహాను సువార్త మొదటి అధ్యాయం జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇది క్లియర్ గా అర్ధం అవుతుంది. 1:1 & 1:14 రెండూ కలిపి చదవాలి!  ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యమే దేవుడైయుండెను. . ఇదే వాక్యము శరీరధారియై కృపా సత్యసంపూర్ణునిగా మనమధ్య నివసించుచుండెను! ఆ శరీరధారి యేసుప్రభులవారు!

 Mathematics లో ఆల్జీబ్రా అనే విభాగం చేసినవారికి ఇది బాగా అర్ధం అవుతుంది. ఇవో పెద్ద సమీకరణాలు! ఇలాంటివి బైబిల్ లో చాలా ఉన్నాయి గాని మచ్చుకు రెండు చూద్దాం!

1). ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము= దేవుడు; వాక్యము శరీరధారియై భూలోకానికి వచ్చెను. అలా వచ్చినది ఎవరు?  శరీరదారి= యేసుప్రభులవారు.  కావున వాక్యము= శరీరదారి= యేసుప్రభులవారు. కాబట్టి దేవుడు = యేసుప్రభులవారు!!!

2). 2&3 వచనాలు ప్రకారం ఆయన సృష్టికర్త! అనగా దేవుడు. 4,5,6,9 ప్రకారం వెలుగు ఉంది, ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది గాని లోకము దానిని గ్రహించలేదు! యేసుప్రభులవారు నేను లోకమునకు వెలుగును అన్నారు 8:12;

కావున సృష్టికర్త= దేవుడు; వెలుగు= ఏసుప్రభువు; వెలుగు = దేవుడు; కావున దేవుడు = యేసుప్రభులవారు!!!

 

    యోహాను 14:9 లో ఫిలిప్పు యేసయ్యను అడుగుతారుమాకు తండ్రిని చూపించు, అంతేచాలు! అందుకు యేసుప్రభులవారు అన్నారు: ఫిలిప్పు నన్ను చూస్తే, తండ్రిని అనగా దేవుణ్ణి చూసినట్టే, కారణం మేమిద్దరం కలసి యున్నాము! 14:20; అనగా నేనే తండ్రి, తండ్రి= నేను,

కావున తండ్రి= దేవుడు = యేసుప్రభులవారు!!

కావున ఆయనే తండ్రి, దేవుని స్వరూపం! మరొకసారి మీకు గుర్తుచేస్తున్నాను, ఇశ్రాయేలీయులు యేసుప్రభువులవారిని ఎందుకు చంపించారు?

1. నేను దేవుని కుమారుణ్ణి అనడం,

2. తండ్రి నేను కలసి ఉన్నాము అనడం. అంటే నేనే దేవుణ్ణి అనడం వల్లనే!!

 

ఇప్పడు పందికి పిల్ల పుడితే పంది అవుతుంది. కోతికి పిల్ల పుడితే కోతి అవుతుంది. మనిషికి పిల్ల పుడితే మనిషి అవుతాడు. అదే దేవుడికి కుమారుడు ఉంటే దేవుడౌతాడు. అంతేకదా! ఈ విషయం యూదులకు తెలుసు కాబట్టి వారు మండిపడి యేసయ్యని చంపారు. ఇంత చిన్నవిషయం వీరికి తెలియకుండా పోయింది.  ఇంత చిన్న లాజిక్ ప్రజలకి అర్ధం కాకుండా పోతుంది.

 

   ఇంకా మనకు 2 కొరింథీ 4:4 లో దేవుని స్వరూపియైన క్రీస్తుమహిమ . . . అంటున్నారు. యేసుప్రభులవారు= దేవునిస్వరూపి; ఇంకా హెబ్రీ 1:3 .హెబ్రీయులకు 1: 3

ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక . .  చూడండి ఎంతక్లియర్ గా చెబుతున్నారో.

కాబట్టి యేసుక్రీస్తు = దేవునిస్వరూపి = దేవుడు!

 

యోహానుసువార్తలో గల సమీకరణం మరోసారి చూసుకుందాం!

1). వాక్యము = దేవుడు = యెహోవాదేవుడు

వాక్యము = శరీరదారి = యేసుక్రీస్తు

వాక్యము = యెహోవాదేవుడు = యేసుక్రీస్తు ;

 

2). వాక్యము = సృష్టికర్త = యెహోవాదేవుడు

    వాక్యము = సృష్టికర్త= యేసుక్రీస్తు

   యెహోవాదేవుడు = యేసుక్రీస్తు

 

3) 1 కొరింథీ 8:6 ప్రకారం ఒకేదేవుడు = తండ్రి= సృష్టికర్త

       ఒకే ప్రభువు= యేసుక్రీస్తు = సృష్టికర్త

   తండ్రి/ యెహోవాదేవుడు = యేసుక్రీస్తు

 ఇలా ఎన్నో సమీకరణాలు నిరూపించవచ్చు యేసుక్రీస్తు= యెహోవాదేవుడు అని!

 

    ఇక యోహానుసువార్తలో యేసుప్రభులవారు తన నోటితో చాలా స్పష్టముగా చెప్పారు నేను- తండ్రి ఏకమై యున్నాము. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే! అనగా నేను తండ్రి ఒక్కటే! అనగా నేనే దేవుణ్ణి. యోహాను 14వ అధ్యాయం. ఈ సువార్తలో అనేకసార్లు యేసయ్య నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పారు. అనగా నేను దేవుణ్ణి= యెహోవాను అని.  

  పైన ఉదాహరించినట్లు యేసుప్రభులవారు రక్షకుడు, దేవుడు, ప్రభువు,సృష్టికర్త! మరి నీవు ఆయనను నీ రక్షకుడిగా, యజమానిగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే నీవు ధన్యుడవు!!

ఒకవేళ ఇంకా అంగీకరించలేదా? ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుని, నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించు!

నీ హృదయం ఆయనకివ్వు!

ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధముగా ఉన్నారు!

 

God Bless You!

Amen!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*63వ భాగము-యేసుక్రీస్తు దైవత్వం-3*

 

1కొరింథీ 8:46

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము! ఎనిమిదో అధ్యాయంలో మరో సమస్య: విగ్రహాలకు అర్పించిన వాటిని రక్షించ బడిన విశ్వాసులు తినవచ్చా? అనే సమస్యకోసం ధ్యానిస్తూ దేవుడు ఒక్కడే ప్రభువు ఒక్కడే అంటూ యేసుక్రీస్తు దైవత్వం కోసం చూసుకుంటున్నాము! ఇక యేసుక్రీస్తు దైవత్వం కోసం మరో కోణంలో చూసుకుందాం!

 

  కొలస్సీయులకు 2: 9

ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

 

     యేసుప్రభులవారి దైవత్వాన్ని నిర్ధారించే తిరుగులేని సాటిలేని వచనం ఇది. ఏలయనగా అని ఎందుకు అన్నారంటే: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అంటూ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత  . . . . . .. దేవుడు అనడానికి ఏవైనా క్వాలిటీలు, లక్షణాలు, అర్హతలు, అధికారం ఏవైనా ఉన్నాయంటే అవి యేసుప్రభులవారిలోనే ఉన్నాయి అని నొక్కివక్కానిస్తున్నారు!! ఇక అదే క్వాలిటీస్ కలిగి ఏ దేవుడైనా ఎప్పుడైనా శరీరంతో భూమిమీదకు వచ్చారు అంటే అది యేసుప్రభువే అని నిర్ధారించి చెబుతున్నారు!

   ఒకసారి ఆగి ఆలోచిద్దాం! ఇంతకీ దేవునికి ఉండాల్సిన లక్షణాలు, అధికారాలు, అర్హతలు ఏమిటి? మరి మనం పూజించే దేవుడు ఎలాంటివాడై ఉండాలి అనేది తెలుసుకోవలసి యుంది కదా! మన భారతదేశం పూర్వకాలం నుండి ఎంతో సనాతన ధర్మము, ఆచారాలు కలిగిన దేశం! అలాగే ఎన్నో మతపరమైన గ్రంధాలు మనకున్నాయి. వాటిప్రకారము, ఇంకా మిగతా దేశాలవారికి చెందిన మతాలవారి గ్రంథాల ప్రకారం దేవునికి ఉండవలసిన ముఖ్యలక్షణాలు కొన్ని ఉన్నాయి.

 Someone says God must have Three characteristics, 7 Attributes, 15 qualities like that

 

Characteristics are: God must be

1. Omnipotence- - God is All Powerful;

2. OmniscienceGod knows everything;

3. OmnipresenceGod is Everywhere.

 

1). దేవుడు సృష్టికర్తయై ఉండాలి, సృజింపబడినవాడు కాకూడదు.

2). నిరాకారుడు, నిర్గుణుడై ఉండాలి! అనగా ఒక ఆకారం కలిగి ఉండకూడదు, అరిషడ్వర్గాలు అని పిలువబడే క్రామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యము గలవాడై ఉండకూడదు!

3) నిత్యమూ ఉండేవాడై ఉండాలి!

4) గురువై ఉండాలి, మాదిరిగా ఉండాలి;

5) పాపాలు తీయగలిగిన వాడై ఉండాలి! అనగా పాప సంహారకుడై ఉండాలి!

6) లోక కల్యాణం కోసం పాటుపడినవాడై ఉండాలి! అనగా లోక కల్యాణం కోసం, ప్రజల శ్రేయస్సుకోసం తనను తానూ అర్పించుకోడానికైనా సిద్ధమై ఉండాలి! ;

7) మంచివాడై యుండాలి. మంచిని కాపాడుతూ చెడును సంహరించేవాడై ఉండాలి!

8) స్వర్గమిచ్చువాడై ఉండాలి.

 

  ఇలాంటివి చాలా ఉన్నాయి గాని ముఖ్యమైనవి ఇవి! అది ఏ మతమైనా, ఏ దేశమైనా సరే! మరి ఈ లక్షణాలు కల దేవుడు ఎవరు ఉన్నారు? దేవుళ్ళు అని పిలవబడే కొంతమంది ఉన్నారు గాని వారికి వీటిలో ఒకటో రెండో లక్షణాలు ఉన్నాయి గాని, మొత్తమన్నీ ఎవరిలో ఉన్నాయి? *ఇక రెండో లక్షణమైన నిర్ఘుణుడు అనగా అరిషడ్వర్గాలు లేనివాడు- అవి ఉంటే తను కూడా మనలాగ మనిషే తప్ప దేవుడు కాదు*. దేవునికి కామం ఉండి మనలాగే పెళ్లి చేసుకుంటే మనకి దేవునికి తేడా ఏమిటి?

 

    కాబట్టి చివరికి ఈ లక్షణాలు అనగా దేవునికి ఉండవలసిన, ఒకటో రెండో కాదు మొత్తము అన్ని లక్షణాలు కలిగిన వాడు యేసుప్రభులవారు మాత్రమే!!!

1). సృష్టికర్త యోహాను 1: 2,3;  2 కొరింథీ 8:6;

2) నిర్ఘుణుడు- పాపము లేనివాడు ఏసుప్రభు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసరినవాడు! యోహాను 8:46;

3) నిత్యమూ ఉండేవాడు: ఆయన నిత్యుడగు తండ్రి, యెషయా 9:6; ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను మత్తయి 28:20.

4) గురువైఉండాలి- క్రీస్తు ఒక్కడే మీకు గురువు మత్తయి 23:10; యేసయ్యను అందరూ భోదకుడా, గురువుగారు అని పిలిచేవారు- ఆయనకు 12 మంది ముఖ్య శిష్యులు, వారే కాక అనేకమంది శిష్యులు.

5) పాపాలు తీయగలిగిన వాడు: ఆయన బ్రతికిఉండగానే కొందరి పాపములు క్షమించారు. లూకా 5:20-24; చనిపోయి అందరి పాపములు క్షమించారు. ఇదిగో ఇది మీ కొరకు చిందింప బడుచున్న క్రొత్త నిభందన రక్తము అన్నారు, మత్తయి 26:28 యేసురక్తము ప్రతీ పాపము నుండి మనలను కడిగి పవిత్ర పరచును అని గ్రంధం సెలవిస్తుంది. 1 యోహాను 1:7;

6) లోక కల్యాణం కోసం పాటు పడినవాడు: ఆయన ఈలోకానికి వచ్చిందే పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగినవారిని విడిపించడానికి, (లూకా 4:18), తద్వారా అందరిని దేవునిరాజ్యానికి వారసులుగా చేయడానికి యోహాను 1:12;

7) మంచివాడై యుండాలి: నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచికాపరి తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టును అని చెప్పడమే కాదు చేసి చూపించారు! యోహాను 10:11

8) పరలోకం ఇవ్వగలిగిన వాడై యుండాలి. : యోహాను 14: 2,3

నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

కాబట్టి కొన్ని కాకుండా అన్ని క్వాలిటీస్ కలిగిన దేవుడు యేసుప్రభులవారు!

 

   ఇక్కడ పౌలుగారు దేవత్వము యొక్క సంపూర్ణత అంటున్నారు. ఇక ఆయన పరిపూర్ణుడు ఎలా కాగలిగారు? దైవత్వం- పరిపూర్ణత ఎప్పుడ అవుతుందో మనకు చక్కగా వివరించగలిగినది యోహాను సువార్త మొదటి అధ్యాయం. మిగిలిన అధ్యాయాలలోను కొద్దిగా ఉన్నాయిగాని ఈ అధ్యాయంలో చాలా ఉన్నాయి. నిజంగా ఇంతటి ప్రత్యక్షత/ Revelation ఏమీ చదువుకోని, ఒక చేపలు పట్టుకొనే జాలరి యైన యోహాను గారికి ఎలా దేవుడు ఇచ్చారో నిజంగా ఆశ్చర్యము! Biblical concept కి పునాది ఇది.  దీనిని మనం జాగ్రత్తగా గమనిస్తే: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. అంటున్నారు. మొదటి వచనంలో వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద అనగా వాక్యమై ఉన్న కుమారుడు తండ్రియైన దేవుని యొద్ద ఉన్నారు అందుకే రెండవ వచనంలో అనుమానాలు లేకుండా ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను అనగా కేవలం 2000 క్రితం పుట్టినవాడు కాదు, సృష్టి జరుగకముందే ఆయన దేవునియొద్ద ఉన్నారు. ఇక మూడవ వచనం ప్రకారం ఆయనలేకుండా ఏమీ కలుగులేదు. సమస్తము ఆయనద్వారా కలిగెను! అనగా ఆయనే సృష్టికర్త! ఇంకా క్రిందకు చదివితే ఆయన మిగతా లక్షణాలు కనిపిస్తాయి. ఆయన వెలుగు అని , లోకానికి వెలుగుకు మధ్య వ్యత్యాసం ఉందని, చెబుతూ 12వ వచనంలో తనను ఎందరో అంగీకరిస్తారో వారిని ఆయన దేవుని పిల్లలుగా మార్చగలిగిన అధికారం కలిగిన వాడని వ్రాయబడింది. ఇక 14వ వచనంలో ఆయన శరీరధారిగా భూమిమీదకు వచ్చారని రాశారు! కృపా, సత్య సంపూర్ణునిగా మనమధ్య నివశించెను అని రాస్తున్నారు! 18వ వచనంలో ఎవడూ తండ్రిని చూడలేదు గాని యేసుప్రభులవారే తండ్రిని మానవులకు వెల్లడిచేశారు అంటున్నారు. 29-34 వచనాలలో మనకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు! అనగా ఆయనే ఆత్మ, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ- అనగా దేవుడు ఒక్కడే కాని ఆయనకు మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు కానేకాదు! బైబిల్ గ్రంధంలో దేవుని మూడు వ్యక్తిత్వాలు ఒకేదగ్గర, ఒకేసారి ప్రత్యక్ష్యం అయ్యింది ఇక్కడే! మత్తయి 3:17, లూకా 3:22 ప్రకారం యేసుప్రభులవారు బాప్తిస్మము తీసుకొని బయటకు వస్తారు, పరిశుద్ధాత్ముడు పావురం వలే ఆయనమీద వ్రాలుతాడు, అప్పుడు పరలోకం నుండి తండ్రి స్వరము అనగా ఆయన వాక్కు సెలవిస్తుంది: ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను. ఇదీ సంపూర్ణత. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ- త్రియేకదేవుడు!!!

 

 అందుకే  1 యోహాను 5:7 లో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు: అనగా తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు.,

For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.

వీరు ముగ్గురు ఒక్కటే! అనగా ముగ్గురు ఒకరే!

 

 ఆయన మూడు వ్యక్తిత్వాలుగా ఎందుకు ఉండాల్సివచ్చింది? ఎందుకంటే అది సంపూర్ణం కాబట్టి! కేవలం మూడు సంపూర్ణ సంఖ్య అయినందువలెనే ఆయన సంపూర్ణుడు అయ్యారా కాదుకాదు! సంపూర్ణత అంటే:

 

1). ఆయన తండ్రి: తండ్రి ప్రేమ చూపించారు. ఒక తండ్రి తన పిల్లలకు ఏమి కావాలో అవన్నీ అమర్చినట్లు ముందు సృష్టిని చేసి, తర్వాత మానవుణ్ణి చేసారు. తండ్రిలా ప్రేమించి, లాలిస్తున్నారు. మాట విననప్పుడు దండించారు, దండిస్తున్నారు. ఆదికాండం 6-8 అధ్యాయాలు, పాత నిబంధన మొత్తం; ఇంకా నిన్ను విడువను ఎడబాయను అంటూ మనల్ని కాస్తున్నారు. యెహోషువ 1:6; యిర్మియా 46:26; యోహాను 14:18; హెబ్రీ 13:5;

2) మరి తండ్రిగానే ఉంటే మానవులు నాశనమైపోతారు. కాబట్టి కుమారునిగా భూమిమీదకు శరీరాకృతిలో వచ్చి, మానవులకు రక్షణసువార్తను అందించి, రక్షణ కార్యక్రమం చేసి, పేదలకు సువార్త ప్రకటించడంతో మొదలుపెట్టి, దేవునిరాజ్యమును స్థాపించారు. చివరకు మన పాపములకోసమై సిలువలో యాగమై, బలియాగమై తనరక్తముద్వారా మన పాపములకు పరిహారం చేసి, మనలను పరలోకానికి హక్కుదారులుగా చేసారు. (యోహాను 1:12)  తిరిగి తండ్రికి మనకి ఒక లింక్ ఏర్పాటు చేసారు.

3) ఇక తను తండ్రి యొద్దకు వెళ్ళాలి కాబట్టి మనలను అనాదలనుగా వదలడం ఇష్టం లేక తన ఆత్మను మనకు కాపలాగా, నడిపించే నాయకునిగా , సంచకరవు అనగా డిపాజిట్ గా పెట్టి; మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుచున్నాను, ఎక్కడ? తనుండే చోటు అనగా పరలోకంలో! యోహాను 14:2,3; ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు.

 

 ఇక్కడ రెండు వచనాలు మీకు గుర్తుచేయాలి అంటుకుంటున్నాను రోమా పత్రిక 8వ అధ్యాయం నుండి. ఈ ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి అనడానికి మంచి ఉదాహరణ. 26 వ వచనంలో అటువలె మనకు ఎలా ప్రార్ధనచేయాలో తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు, ఎలా ఉచ్చరింపశక్యము కాని మూల్గులతో!! అందుకే పరిశుద్ధాత్మ అనుభవం గల వ్యక్తి ప్రార్ధించడం మొదలుపెడితే కళ్ళంట నీరు వాటికవే కారిపోతాయి. ఈ విషయం ఇంటివారికి అర్ధంకాక, ఇప్పుడు ఎవడు చనిపోయాడని అలా ఏడుస్తున్నావు అంటుంటారు!!!  సరే; ఇక 34 వ వచనంలో శిక్షించువాడు, Judge ఎవరు? ఏసుప్రభువే, అందుకే ముందుగా వారు/మనం తప్పిపోకుండా, యేసయ్య మన పక్ష్యంగా దేవుని కుడిప్రక్కన కూర్చొని మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు! ఇక్కడ అనగా భూమిమీద ఆయన ఆత్మ మనుష్యులను సిద్దపరచి అదే విజ్ఞాపనం చేస్తున్నారు, అక్కడ యేసుప్రభులవారు కూడా ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అంటూ మనకోసం విజ్ఞాపనం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత జడ్జి స్థానం లోకూర్చుంటే ఇక తనకు క్షమించే అవకాశం ఉండదు కాబట్టి! ఇక్కడ ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలతో మానవ శ్రేయస్సుకోసం పాటుపడుచున్నారు! ఇదే సంపూర్ణత! అందుకే పౌలుగారు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివాశం చేస్తున్నది అని ఘంటాపథంగా చెబుతున్నారు.

 

   కాబట్టి ఈలోకంలో దేవుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుప్రభులవారే! పాపములేని దేవుడు ఆయన! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని సవాలు విసరిన ఏకైక, అద్వితీయ దేవుడు!! యోహాను 8:46;

 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చాటి చెప్పగలిగిన సత్తాగాలిగిన ఏకైక సత్యదేవుడు! యోహాను 14:6;

మరి ఆదేవుడు నీకు కావాలా? నిజదైవమెవరో, నీ రక్షకుడు ఎవరో గుర్తెరుగు!

 నేడే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు!

ఆయన నిన్నుతన స్వంత బిడ్డగా స్వీకరించి, తన రక్తముతో కడిగి, తనరాజ్యానికి వారసునిగా చేస్తారు!యోహాను 1:12;

 

ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు 'ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరునూ,ఎన్నడునూ మాట్లాడలేదు' అని సాక్ష్యం పొందారు. అంటే ఆయన మాటలో కూడా 'పరిశుద్ధత' గలవారు.

              మాట,తలంపు, ఆలోచన, నడత,ప్రవర్తన అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకమైన విధంగానూ,పరిశుద్ధంగానూ జీవించారు. హెబ్రీ పత్రిక 7:26లో చెప్పినట్లుగా 'పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు'.

 

మనకు ఒక మాదిరినీ, మార్గాన్నీ చూపిన ఆ ప్రభువు అడుగుజాడలలో నడుద్దాం...

ఆయన అన్ని విషయములలో పరిపూర్ణుడైయున్న ప్రకారము మనము కూడా ఆయన వలే పరిపూర్ణులమయ్యే ఆ స్థితికి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించును గాక......

ఆమేన్!!

 

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*64వ భాగము-సంఘము-సమస్యలు-18*

1కొరింథీ 8:713

7. అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.

8. భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.

9. అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.

10. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలియియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?

11. అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.

12. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను (మూలభాషలో- గాయపరచుటవలనను) , మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు.

13. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము! ఎనిమిదో అధ్యాయంలో మరో సమస్య: విగ్రహాలకు అర్పించిన వాటిని రక్షించ బడిన విశ్వాసులు తినవచ్చా? అనే సమస్యకోసం ధ్యానిస్తున్నాము!

 

ఇక 713 వచనాలలో విగ్రహాలకు అర్పించినవి ఎందుకు తినకూడదో మరింత వివరంగా రాస్తున్నారు!

 

ఏడవ వచనంలో అయినా ఈ తెలివి అందరికీ లేదు కొందరు విగ్రహాల దగ్గర తినేవి విగ్రహాలకు అర్పించినవి అని వాటి స్మృతితో తింటున్నారు వారి అంతరాత్మ , బలహీన మైన మనస్సాక్షి కలిగి ఉంటే వాడు మరలా పాపంలో పడిపోయే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతున్నారు! విగ్రహం వట్టిదనీ, విగ్రహానికి అర్పించిన ఆహారం అన్ని ఆహారాల్లాంటిదే అనీ, ఏమీ అశుద్ధమైపోదనీ అందరికీ తెలియదు అంటున్నారు పౌలుగారు. ఎవరి ఇళ్ళల్లో వారు కూడా అలాంటి ఆహారాన్ని తినడం తప్పని కొందరు క్రైస్తవులు భావించారు. అలా తింటే వారి అంతరాత్మ/మనస్సాక్షి  వారిపై నేరం మోపింది. వివేచనాశక్తి లేని అంతర్వాణి లేక మనస్సాక్షి అంటే ఒక విషయం నిజానికి పాపం కాకపోయినప్పటికీ అది పాపమనుకునేది. లేక ఒక విషయం పాపం అయి ఉన్నా అది పాపం కాదనుకునేది.

 

ఇక ఎనిమిదో వచనంలో భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పుపొందము అంటున్నారు, తినినందున మనకు ఎక్కువలేదు తినకపోతే మనకు తక్కువలేదు అంటున్నారు! గమనించాలి దీని అర్ధం విగ్రహాలకు అర్పించినవి తినినా పర్వాలేదు అని కానేకాదు! పౌలుగారి భావము తిండి దేవుని దృష్టిలో మనకు మెప్పు కలిగించదు అంటున్నారు, నీవు మంచి పదార్దాలు తింటే దేవుని దృష్టిలో సెహబాష్ అనరు! మాంసం మానేసి కాయగూరలే తింటే సెహబాస్ అనరు! మాంసం లాంటివి తింటే ఎందుకు తిన్నావు అని అడగరు ఇదీ అక్కడ ఉద్దేశం! తిండివలన దేవుని నుండి దూరమై పోవు! అయితే దీనికోసం మరలా మనం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయానికి వెళ్తే అక్కడ అపోస్తలుల రౌండ్ టేబిల్ సమావేశంలో నిర్ణయించి ప్రపంచ దేశాలలో చెదిరిపోయిన క్రైస్తవ సమాజానికి రాసి పంపినదేమిటంటే విగ్రహాలకు అర్పించినవి తినకూడదు...

Acts(అపొస్తలుల కార్యములు) 15:19,20,23,28,29

19. కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక

20. విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

23. వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము.

28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

29. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.

 

కాబట్టి ఇది సమస్త క్రైస్తవ సమాజానికి ఆజ్ఞ!!! కాబట్టి తప్పకుండా ఇది పాటించాలి!

 

ఇక 9 లో అంటున్నారు అయినను ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలుగకుండా చూసుకోవాలి అంటున్నారు! ఏ స్వాతంత్ర్యం? నీకు ఇష్టమొచ్చింది నీవు తినవచ్చు, తిండి తినడానికి క్రైస్తవునికి తినవచ్చు అయితే ఈ స్వాతంత్ర్యం వలన బలహీనమైన మనస్సాక్షి గలవారికి అభ్యంతరం కలుగకుండా చూసుకోండి అంటున్నారు! దానికి వివరణగా 10వ వచనంలో అంటున్నారు....

ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలియియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?

 

నీవు అన్యుల విగ్రహాల ఆలయంలో కూర్చుని ఆహారం తింటే మరొకడు నిన్ను చూసి నిజంగా విగ్రహాలకు బలి ఇచ్చింది తినడానికి సాహసం చేస్తాడు కదా అంటున్నారు! అనగా దీని అర్ధం ఏమిటి? విగ్రహాలకు అర్పించినవి తినకూడదు అని కదా! ఇంకా చెప్పాలంటే విగ్రహాలకు అర్పించని ఆహారం విగ్రహాలయములో తినినా పర్వాలేదు గాని విగ్రహాలకు అర్పించినవి ఎక్కడ తినినా తప్పే!!! అలాగని విగ్రహాల ఆలయంలో కూర్చుని తినమని కూడా పౌలుగారు చెప్పలేదు! దేవుని ఆలయమై ఉన్న నీవు అన్యుల ఆలయములో కనిపించకూడదు!!

 

విశ్వాసులకు ఎలాంటి ఆహారమైనా తినడానికీ, తినకపోవడానికీ స్వేచ్ఛ ఉంది. అయితే ఈ స్వేచ్ఛ కన్నా వారు పట్టించుకోవలసిన సంగతులు మరి కొన్ని ఉన్నాయి. తమను తాము తృప్తి పరచుకోవడం కంటే తోటి విశ్వాసులే వారికి ఎక్కువ ప్రీతికరం కావాలి.

1కొరింథీ 10:23-33;

23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.

29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

30. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

32. యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

రోమా 14:14-23

23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.

29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

30. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

32. యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

ఇక 11వ వచనంలో అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడిన సహోదరుడు నీ అతి జ్ఞానము బట్టి నశించిపోవును అంటున్నారు! గమనించాలి: ఆ బలహీన సోదరులకోసం చనిపోయేంతగా యేసుక్రీస్తుప్రభులవారు  వారిని ప్రేమించారు. బలవంతులైన విశ్వాసులు అలాంటి ఆహారం తినడం మానుకునేంతగా, లేదా బలహీనులకు హాని కలిగేలా ప్రవర్తించడం మానుకునేంతగా వారిని మనము ప్రేమించకూడదా?

రోమీయులకు 14: 15

నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.

 

అంటే అతడి ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ తగులుతుంది అని అర్థం.

అందుకే 12వ వచనంలో ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయువారు అవుతారు! ఎప్పుడు? విగ్రహాలకు అర్పించినవి తినినప్పుడు ఇంకా అన్యుల ఆలయంలో భోజనం చేసేటప్పుడు!! ఒక విశ్వాసి పాపం చేయడానికి కారణమైన వారెవరైనా అతడు ఆ వ్యక్తికీ, క్రీస్తుకూ విరోధంగా పాపం చేస్తున్నాడు

అపో.కార్యములు 9: 4

అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

 

 కీర్తన 51:4

నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

అందుకే చివరి వచనంలో అంటున్నారు కాబట్టి బోజన పదార్ధమువలన నా సహోదరునికి అభ్యంతరం కలిగితే అవసరమైతే నేను మాంసం తినడం మొత్తానికి మానేస్తాను అంటున్నారు! ఆహారం విషయంలో మాత్రమే గాక అన్నిటిలోనూ పౌలుగారు  అనుసరించిన నియమం ఇదే. మనం కూడా దీన్ని అనుసరించాలి (10:24, 32, 33). ఇది ప్రేమ నియమం. ప్రేమించవలసిన రీతిగా ప్రేమించేవారు ఇతరులకు మేలు కలిగేలా తమను కాదనుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

 

మరి నీవు కూడా విగ్రహాలకు అర్పించినవి తినవద్దు! ఇంకా భోజనం కంటే క్రీస్తు ప్రేమను పంచడానికి ప్రయత్నం చేయు! ఇంకా నీ భోజనం వలన లేక నీవు తినే ఆహారం నీ సహోదరులకు లేక వారి మనస్సాక్షికి లేక విశ్వాసానికి భంగం కలిగించే విధంగా ఉంటే వాటిని తినడం మానెయ్యమని పౌలుగారి బోధను అనుసరించమని క్రీస్తు పేరిట మనవిచేస్తున్నాను!

 

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*65వ భాగము-సంఘము-సమస్యలు-19*

 

1కొరింథీ 9:17

1. నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా?

2. ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వము నకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?

3. నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.

4. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?

5. తక్కిన అపొస్తలులవలెను, ప్రభువు యొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

6. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా?

7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

9 అధ్యాయంలో మరో సమస్య: సేవా-పరిచర్య చేసేవారు- వచ్చిన కానుకలను తమ బ్రతుకు తెరువుకోసం వాడుకోవచ్చా!!!

 

  గమనించాలి: 8వ అధ్యాయంలో పౌలుగారు  నేర్పించిన సూత్రం ఇతర విశ్వాసుల మేలుకోసం మనస్వార్థాన్ని త్యాగం చెయ్యడం. ఈ అధ్యాయంలో పౌలుగారు తననే ఉదాహరణగా  విశ్వాసుల ఎదుట ఉంచుతున్నారు. ఒకదాన్ని బోధిస్తూ వేరొక విధంగా ప్రవర్తించలేదు పౌలుగారు. ఇక్కడ అనేక సార్లు తన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అధికారం, హక్కులను గురించి మాట్లాడుతున్నారు   1,4,5,12,15,19 వచనాలలో. అయితే తన స్వేచ్ఛను,స్వాతంత్ర్యమును, అధికారమును, హక్కులను తనకే సంతోషం కలిగించుకునేందుకు అతడు వాడుకోలేదు గానీ ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, వారి నమ్మకాన్ని అభివృద్ధి చేయడానికి తాను ఎలా సహాయపడగలనా అనే ఆలోచించారు. దేవుడు నమ్మకస్థులైన సేవకులకు వాగ్దానం చేసిన ప్రతి ఫలాలను వారిలో ఎవరైనా పొందాలంటే తమ స్వార్థమును త్యాగం చేసి , వైరాగ్యం కలిగిన జీవితం  ఒక్కటే అనుసరించవలసిన మార్గం అని చెప్పడంతో ముగించారు ఈ అధ్యాయాన్ని.

 

   సరే, ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మొదలుపెడదాం!

 

మొదటివచనంలో నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నేను చేసిన సేవకు ఫలము మీరు కారా అంటూ మొదలుపెట్టారు! ఎందుకు ఇలా వ్రాయవలసి వచ్చింది అంటే 2,3 వచనాలలో దీనికి సమాధానం దొరుకుతుంది మనకు!

ఇతరులకు అపోస్తలుడను కాకపోయినా మీ మట్టుకు నేను అపోస్తలుడను, ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా మీరే ఉన్నారు కదా అంటూ నన్ను విమర్శించువారికి నేను చెప్పే సమాధానం ఇదే అంటున్నారు! దీనిని బట్టి ఏమని అర్ధమయ్యింది అంటే మొదటి భాగంలో చెప్పినట్లు కొంతమంది పౌలుగారంటే పడనివారు విమర్శించడం మొదలుపెట్టారు పౌలుగారిని! పౌలుగారిని దేవుడు అపోస్తలుడుగా ఉండటానికి పిలువలేదు, కేవలం సేవ చెయ్యడానికి పిలిచారు గాని అపోస్తలునిగా చెలాయిస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు! దానికి జవాబుగా ఈ అధ్యాయాన్ని రాస్తూ, ఇతరులైతే సేవను చేస్తూ సంఘముమీద వచ్చే కానుకలతో బ్రతుకుతున్నారు అయితే తాను తన సొంత డబ్బులతో కొలువుచేసే సైనికునిలా ప్రభువు పనిని చేస్తున్నాను, ఇంకా అపోస్తలత్వమునకు ముద్రగా మీరున్నారు, నేను చేసిన పరిచర్యయే నా అపోస్తలత్వమునకు గుర్తు అంటున్నారు! గతభాగాలలో మీకు వివరించడం జరిగింది కృపావరముల కోసం చెబుతూ అపోస్తలుడు ఎప్పుడు అవుతాడు అనేది! మొదట అతడు సువార్తికుడు, బోధకుడు అయి ఉండాలి, కాపరై ఉండాలి, ప్రవచన వరం కలిగి ప్రవక్తయై ఉండాలి, ఈ నాలుగు కృపావరాలు కలిగిన వాడు అపోస్తలుడు! వీటికి నిదర్శనాలు కూడా చూపించడం జరిగింది! ఇప్పుడు నా అపోస్తలత్వమునకు గుర్తు మీరే అంటున్నారు! మరి ఇక్కడ పౌలుగారు అనేక నెలలు ఉండి సేవచేసి ఇబ్బందులు పడి తన సొంత చేతులతో పనిచేసి ఆ  డబ్బులతో సువార్త పరిచర్య చేశారు, అనేకులను ప్రభువునొద్దకు నడిపించారు! ఆయన సువార్తికుడు, కొరింథీ సంఘకాపరి, ప్రవక్త, బోధకుడు! కాబట్టి ఇప్పుడు కొరింథీ సంఘము యొక్క అపోస్తలుడు ఎవరు అంటే పౌలుగారే కదా!!

 

ఇక మొదటి వచనంలో నేను స్వతంత్రుడను కానా?  నాకు స్వేచ్చ లేదా అనేది కనీసం ఇతర విశ్వాసులకున్నంత స్వేచ్ఛ, అన్ని హక్కులయినా ఒక అపోస్తలునికి ఉండాలని ఈ మాటలకు అర్థం.

 

ఇక ఏ స్వేచ్చ స్వాతంత్ర్యం కోసం మాట్లాడుతున్నారు పౌలుగారు? ఆత్మసంబంధమైన స్వేచ్ఛ, ఆహార నియమాలనుంచి విడుదల మొదలైనవాటిని గురించి మాట్లాడుతున్నారు!

 

ఇక ప్రభువును నేను చూడలేదా అని ఎందుకు అంటున్నారు అంటే మనకు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో దేవుడు పౌలుగారికి స్వయముగా కనబడి ఆయనను పట్టుకున్నట్లు చూడగలం!

 

1కోరింథీయులకు 15: 8

అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

 

అపొ కా 9:3-6

3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.

4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;

6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

 

పౌలుగారు  క్రీస్తుయొక్క అపోస్తలుడు  కాదని కొందరన్నారు. కానీ కొరింథీ విశ్వాసులు అలా అనకూడదు. వారు క్రీస్తులో నమ్మకం ఉంచినది అతని ద్వారానే కదా 4:15.

1కోరింథీయులకు 4: 5

కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

 

ఇక 45 వచనాలలో అంటున్నారు: తినడానికి త్రాగడానికి మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలే, ప్రభువు యొక్క సహోదరుల వలే ఇంకా కేఫా అనగా పేతురు గారిలా నేను కూడా విశ్వాసి యైన భార్యను వెంటబెట్టుకుని సేవ చేయలేనా అంటున్నారు! ఆ అధికారం నాకు లేదా అంటున్నారు!!

 

ఇక్కడ 414 వచనాలలో పౌలుగారు  క్రీస్తు అపోస్తలుల యొక్క  హక్కుల గురించి (ఆ మాటకొస్తే క్రీస్తు తన పనిలోకి పంపిన ఏ వ్యక్తికైనా ఉండే హక్కుల గురించి) మాట్లాడుతున్నారు. ఈ అధికారాలు లేక హక్కులేవంటే, తాము కోరిన వాటన్నిటినీ తిని త్రాగే హక్కు (వ 4), పెళ్ళి చేసుకుని తమ ప్రయాణాల్లో భార్యను వెంటబెట్టుకు వెళ్ళే హక్కు (వ 5), ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో వారినుంచి తమ జీవనోపాధి మొత్తాన్ని పొందే హక్కు (వ 6-14).

పై హక్కులు నాకు లేవా అంటున్నారు!!

 

ఇక యేసుక్రీస్తు ప్రభులవారి తమ్ముళ్ళు కూడా అనగా చిన్న యాకోబు గారు, యూదా గారు కూడా విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని సేవ చేస్తున్నారు అని దీనిని బట్టి అర్థం అవుతుంది.

 అపొ కా 1:14 లో యేసుక్రీస్తుప్రభులవారి మరణ పునరుత్థాన అనంతరం రక్షణ పొందినట్లు అర్ధమవుతుంది!..

అపో.కార్యములు 1: 14

వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

 

పేతురు గారు కూడా తన భార్యను వెంటబెట్టుకుని సేవా పరిచర్య చేశారు! కేఫా” అనేది పేతురుగారి మరో పేరు (యోహాను 1:42). అతడు వివాహితుడు (మత్తయి 8:14).

అతని ప్రయాణాల్లో అతని భార్య కూడా వెంట వెళ్ళినట్టు కనిపిస్తున్నది. బహుశా ఆమె బబులోనులో అనగా దక్షిణ ఇరాక్ లో ఆమె మరియు పేతురు గారి కుమారుడు కలసి సేవా పరిచర్య చేసినట్లు మనకు పేతురు పత్రిక ద్వారా తెలుస్తుంది....

1పేతురు 5: 13

బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.

 

అయితే పేతురు గారు యాకోబు గారు యోహాను గారు యేరూషలేములోనే ఉన్నారు AD 70 వరకు! తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది రోమా చక్రవర్తి డొమోషియస్ వలన!!!

 

ఇక 6వ వచనం ప్రకారం పౌలుగారు బర్నబా గారు సంఘాల మీద వచ్చే కానుకలు మీద ఆధారపడకుండా తమ చేతులతో పనిచేస్తూ ధనము సంపాదించి తమ ఖర్చులకు వాడుకునే వారు గాని సంఘము మీద ఆధారపడలేదు అని అర్ధమవుతుంది! దానికి మాకు హక్కులేదా అని ప్రశ్నిస్తున్నారు !! ఇలా ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే కొందరు దొంగబోధకులు వచ్చి ఆయన అపోస్తలుడు కాదని, ఆ అధికారం ఆయనకు లేదని, అందుకనే పౌలుగారు ఎప్పుడూ సంఘము యొక్క కానుకలను తీసుకోడానికి భయపడ్డారని తప్పుడు ప్రచారం చేశారు! పౌలుగారి ఉద్దేశం ఏమిటంటే సంఘం మీద భారం పెట్టకుండా తన సొంత డబ్బులతో ప్రభువు పని చేసి అధికమైన ఆధ్యాత్మిక ఫలాలు పొందాలని ఆయన ఆశ!!

 

అపో.కార్యములు 18: 3

వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.

 

అపో.కార్యములు 20: 34

నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

 

అయితే సంఘాల్లో క్రీస్తు కోసం పరిచర్య చేసేవారిని సంఘాలు పోషించడమన్నది ఎంత సహజమో  714 వచనాలలో కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*66వ భాగము-సంఘము-సమస్యలు-20*

 

1కొరింథీ 9:715

7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

8. ఈ మాటలు లోకాచారమును బట్టి (మూలభాషలో- మనుష్యరీతిగా) చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నదిగదా?

9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు (నూర్చెడి యెద్దు) మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?

10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.

11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్పకార్యమా?

12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.

13. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో (బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా?

14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువునియమించియున్నాడు.

15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

9 అధ్యాయంలో మరో సమస్య: సేవా-పరిచర్య చేసేవారు- వచ్చిన కానుకలను తమ బ్రతుకు తెరువుకోసం వాడుకోవచ్చా!!!

 

     (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! సంఘాల్లో క్రీస్తు కోసం పరిచర్య చేసేవారిని సంఘాలు పోషించడమన్నది ఎంత సహజమో  714 వచనాలలో కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు!

 

7వ వచనంలో ఎవడైనా సైన్యంలో పనిచేస్తున్నప్పుడు తన సొంత ఖర్చులతో సైన్యంలో పనిచేస్తాడా? ద్రాక్షతోట వేసిన వాడు దాని పళ్ళు తినకుండా ఉంటాడా? మందను కాచేవాడు మందలో గొర్రె/మేక/ఆవు/గేదె పాలు త్రాగకుండా ఉంటాడా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు!!!

 

ఈ లోకాచారం బట్టి మాట్లాడుతున్నానా లేక ధర్మశాస్త్రం దీనిని చెప్పడం లేదా అంటూ పాత నిబంధనలో ఉన్న కళ్లము త్రోక్కుతున్న ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు అనే వచనాన్ని చూపిస్తున్నారు!!

ద్వితీ 25:4;

నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

 

1 తిమోతి 5:17-18.

17. బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.

18. ఇందుకు నూర్చెడి (కళ్ళము త్రొక్కుచున్న) యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.

 

దాని తర్వాత అడుగుతున్నారు- దేవుడు ఈ వచనం ఎద్దుల కోసం చెబుతున్నారా లేక మనుష్యుల కోసం చెబుతున్నారా అని అడుగుచున్నారు!!

 

10వ వచనంలో మనుష్యుల కోసమే దేవుడు అలా చెబుతున్నారు అంటూ దున్నువాడు ఆశతో దున్నాలి- పంట పండి, పంట ఇంటికి రావాలి- తానూ తన పిల్లలు ఆకలి లేకుండా హాయిగా బ్రతకాలి అని! అలాగే కళ్లము త్రొక్కేవాడు విత్తనాలు బాగా రావాలి పొల్లు గింజలు రాకూడదు! అప్పుడు యజమాని తనకు చివరలో తనకు కూడా కొంత ధాన్యం ఇస్తాడు సంతోషంతో అంటూ!

 

అలాగే 11వ వచనంలో మీకోసం ఆత్మ సంబంధమైన విత్తనాలు అనగా దేవుని వాక్య పరిచర్య చేస్తున్న మేము మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకోవడం గొప్ప కార్యమా లేక కోసుకోకూడదా అంటున్నారు!

 

ఇక్కడ ఈ ఉదాహరణల భావం ఇది: “ఆధ్యాత్మిక విత్తనాలు/ఆత్మసంబంధమైన విత్తనాలు  చల్లినవారు” క్రీస్తు అపోస్తలులు, సువార్తికులు, సంఘకాపరులు, ఉపదేశకులు దేవుని వాక్కు అనే విత్తనాలు చల్లుతారు

లూకా 8: 11

ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.

 

“శరీరం సంబంధమైనవి ” అంటే వారి పోషణకు అవసరమైనవి లేక సంఘము మీద వచ్చే ఆదాయం! ఈ ఆదాయం తీసుకోడానికి సువార్త పరిచర్య చేసే సేవకులకు కాపరులకు అధికారం లేదా అని అడుగుతున్నారు!!

దానికి జవాబు 13 వవచనంలో ఉంది

ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో (బలిపీఠము మీద అర్పింపబడిన) పాలివారైయున్నారనియు మీరెరుగరా?

14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. !!!

 

దీనికి సపోర్టింగ్ రిఫరెన్సులు లేవీ 7:6, 8-10, 14, 28-36 ఉంటాయి! వారు ప్రత్యక్ష గుడారంలో మరియు దేవునిపని చేస్తున్నారు కాబట్టి వారు దానికి హక్కుదారులు అని దేవుడే అంటున్నారు అక్కడ!!

 

అయితే 12వ వచనంలో పౌలుగారు అంటున్నారు: నేను ఆ అధికారం ఉపయోగించుకోలేదు ఎందుకంటే క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలుగకూడదు అని! గాని ఇతరులు వచ్చి మాయమాటలు, తీపిమాటలు చెప్పి మీమీద రాజులవలె అధికారం చేస్తూ మీ నుండి ఫలములు కోసుకుంటున్నారు ఇతర సేవకులకు మరియు దొంగబోధకులకే అంత అధికారం ఉంటే మాకు ఇంకా ఎక్కువ అధికారం ఉంది కదా అంటున్నారు!

 

14....ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు.

 

చూడండి: 14వ వచనంలో దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞ: సువార్త ప్రకటన చేసేవారు సువార్తవలన జీవించాలి- లేదా సంఘములో పరిచర్య చేస్తున్న సేవకుడు లేక కాపరి సంఘము మీద జీవించాలి! అయితే కొంతమంది ఈ రోజులలో అతి తెలివైనవారు అడుగుతున్నారు- సంఘంలో వచ్చిన కానుకలు అన్నీ పాష్టర్ ఏమి చేస్తున్నాడు?

జవాబు: ఏమి చేస్తే నీకెందుకు? అడగటానికి నీకు అధికారం లేదు ఈ వచనం బట్టి! ఏ చేస్తున్నాడో నీకాపరి- ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి గాని నీకు లెక్క చెప్పవలసిన అవసరం కాపరికి లేదు!

 

అదే సమయంలో దైవసేవకుడా! నీవు పెట్టే ప్రతీ ఖర్చుకి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి అని మర్చిపోకు! దేవుని సేవలో వచ్చిన ఆదాయం నీ కుటుంబ పోషణకు ముఖ్యంగా దేవుని సేవా పరిచర్య వృద్ధి పొందడం కోసం ఖర్చుపెట్టాలి గాని కారులు బంగళాలు సూట్లు బూట్లు కొనుక్కోడానికి కాదు, ఖరీదైన వస్త్రాలు బంగారం మీ భార్యలకు కొనుక్కోవడానికి కాదు! వడ్డీ వ్యాపారం చెయ్యడానికి అంతకంటే కాదు!! ఎలీషా గారు అంటున్నారు గేహాజీతో బంగారం వెండి దాసులు దాసీలను సంపాదించుకోడానికి ఇది సమయమా?

2రాజులు 5: 26

అంతట ఎలీషా వానితో- ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?

 

నేటిరోజులకు దీనిని ఆపాదిస్తే దేవుని రాకడ అత్యంత సమీపముగా ఉన్నప్పుడు కోట్లమంది నాశనానికి జోగుపడుతున్నప్పుడు సువార్త వ్యాప్తికోసం పనిచెయ్యకుండా కార్లు బంగళాలు ఆస్తులు సంపాదించు కోవడానికి ఇది సమయమా ప్రియ దైవజనుడా!!

 

 యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పింది చూద్దాం: మత్తయి 10:9-10;

9. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;

10. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

 

Luke(లూకా సువార్త) 10:4,5,7,8,9

 

4. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;

5. త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

7. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.

8. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.

9. అందులో నున్న రోగులను స్వస్థపరచుడిదేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.

 

తమ మధ్య పరిచర్య చేసే క్రీస్తు సేవకులను తమ శక్తిమేరకు పోషించడం అన్ని క్రైస్తవ సంఘాలు, సమూహాల పరమ ధర్మం. అలా చేయని సంఘమేదైనా ప్రభువుకే అవిధేయత చూపుతున్నది.

 

కాబట్టి సంఘము మీద వస్తున్న కానుకలను అనుభవించడానికి సేవకునికి హక్కు ఉంది అని గ్రహించాలి!

అలాగే దైవసేవకుడు కూడా వస్తున్న కానుకలు దేవుని సేవకోసం మరియు తన కుటుంబ పోషణ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*67వ భాగము-సంఘము-సమస్యలు-21*

 

1కొరింథీ 9:1518

15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.

16. నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

9వ అధ్యాయంలో మరో సమస్య: సేవా-పరిచర్య చేసేవారు- వచ్చిన కానుకలను తమ బ్రతుకు తెరువుకోసం వాడుకోవచ్చా!!! అనే విషయం మీద పౌలుగారు చెబుతున్న అభిప్రాయాలను ధ్యానం చేస్తున్నాము!

 

 ఇక 1518 వరకు చూసుకుంటే నేను మీద చెప్పిన అధికారాలలో లేక స్వాతంత్ర్యాలలో దేనిని వాడుకోలేదు, ఇప్పుడు రాస్తున్నందుకు ఇవి నాకు చెయ్యండి అని కూడా చెప్పడం లేదు, ఎవడైనా నా అతిశయమును నిరర్ధకం చేయుటకంటే నాకు మరణమే మేలు అంటున్నారు! పౌలుగారి అతిశయం ఏమిటి? మిగిలిన వారు పనిచేస్తున్నందుకు జీతం తీసుకుని పనిచేస్తున్నారు! అనగా సంఘంలో వచ్చే కానుకలు తీసుకుని తమ కుటుంబ పోషణం చేసుకుంటున్నారు, తానైతే ఉచితముగా దేవుని సేవ చేస్తున్నారు! సంఘము యొక్క ఒక్క పైసా ఆశించకుండా! ఇదే అతని అతిశయము! తద్వారా దేవుని నుండి ఆధ్యాత్మిక ఫలాలు ఆశిస్తున్నారు పౌలుగారు!

 

ఇక 16వ వచనంలో నేను సువార్తను ప్రకటించుచున్నా గాని నాకు అతిశయకారణం లేదు ఎందుకంటే సువార్తను ప్రకటించే భారము దేవుడు నా మీద పెట్టారు కాబట్టి ఆ పనిని నేను చేస్తున్నాను తప్ప దేవునికి నేనేదో ఎంతో ఫేవర్ చెయ్యడం లేదు అని అభిప్రాయపడుతున్నారు! చూడండి- ఉచితముగా  దేవుని సువార్త చేస్తున్నా గాని దానికి అతిశయపడకుండా నేను దేవుడు నాకిచ్చిన భాద్యతనే నేను చేస్తున్నాను అంటున్నారు! నిజం చెప్పాలంటే పౌలుగారు యేసయ్య చెప్పిన మాట తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు! మీరు దేవుని పనిచేశాక మేము నిష్ఫలమైన పనివారము! మేముచేయవలసినదే మేము చేశాము అని తగ్గించుకోమన్నారు యేసుక్రీస్తుప్రభులవారు స్వయముగా!! ఇప్పుడు పౌలుగారు కూడా అదే అంటున్నారు!మనము కూడా అలాగే చేయాల్సిన అనాల్సిన అవసరం ఉంది!

లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

ఇక తర్వాత లైన్ చాలా చాలా ముఖ్యమైనది! సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది అంటూ అంటూ నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నారు! పౌలుగారు అంటున్నారు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఎందుకంటే సువార్తను ప్రకటించే భాద్యత దేవుడు పౌలుగారి మీద పెట్టారు! మరి పౌలుగారి మీదనేనా దేవుడు ఆ భారం పెట్టింది? మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి భాప్తిస్మం పొందువారు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని మార్కు 16:1516 లోను, మీరు సమస్త జనులకు సువార్తను ప్రకటించండి అని మత్తయి సువార్త 28:19 లోను యేసుక్రీస్తుప్రభులవారి చివరి ఆజ్ఞను మన అందరికి ఇవ్వలేదా???

ఇప్పుడు సువార్తను ప్రకటించకపోతే పౌలుగారికే కాదు మనకు కూడా శ్రమే కదా! మరి నీవు సువార్తను ప్రకటిస్తున్నావా? నీ పొరుగువారికి దేవుని రక్షణ సువార్తను ఎప్పుడైనా చెప్పావా? జాగ్రత్త! సువార్త ప్రకటించక పోతే నీకు శ్రమ!!!

 

ఇక 17వ వచనంలో ఈపనిని నేను ఇష్టపడి చేస్తే నాకు దేవుని నుండి జీతం దొరుకుతుంది అంటున్నారు! మనుష్యులు సంఘములో ఇచ్చే జీతం కోసం చూడకుండా పౌలుగారు దేవుని నుండే కలిగే జీతం కోసం మాట్లాడుచున్నారు! మరోమాట నేను ఇష్టపడకపోయినా గాని గృహనిర్వాహకత్వము అనగా అపోస్తలత్వము నాకు అప్పగించబడింది కాబట్టి నేను పని చేస్తున్నాను అంటున్నారు!

 

18వ వచనంలో మరోమాట అంటున్నారు: నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారాలు అనగా గతభాగంలో చెప్పినట్లు తాము కోరిన వాటన్నిటినీ తిని త్రాగే హక్కు (వ 4), పెళ్ళి చేసుకుని తమ ప్రయాణాల్లో భార్యను వెంటబెట్టుకు వెళ్ళే హక్కు (వ 5), ఎవరికైతే పరిచర్య చేస్తున్నారో వారినుంచి తమ జీవనోపాధి మొత్తాన్ని పొందే హక్కు (వ 6-14) , ఇలాంటివి ఉపయోగించకుండా నేను సేవ చేయడమే నా జీతం అంటున్నారు!!!

 

గమనించాలి : దేవుడు పౌలుగారికి  తన రహస్య సత్యాలు లేక గొప్ప మర్మాలు బోధించి చెప్పమని  అప్పగించారు (4:1-2).

1కోరింథీయులకు 4: 1

ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

 

వాటిని ప్రకటించేందుకు యేసుక్రీస్తు అతణ్ణి పంపారు

అపో.కార్యములు 20: 24

అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.

 

గలతియులకు 2: 7

అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్పగింపబడెనని వారు చూచినప్పుడు,...

 

ఎఫెసీయులకు 3: 7

దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

 

అది తనకు ఇష్టమున్నా లేకపోయినా చేయక తప్పదు. ఒకవేళ అలా చేయకపోతే అతనికెంతో “నష్టం”  16వ వచనంలో శిక్ష అని  గ్రీకుభాషలో వాడిన ఈ మాటకు ఏదో ఒక శిక్ష వస్తుందన్న అర్థం ఉంది. కాబట్టి సువార్త ప్రకటించడం తన గురించి అతిశయంగా చెప్పుకునేందుకు కారణం కాదు. కానీ అతిశయ కారణం ఒకటి ఉంది అతనికి. అదేమిటంటే, అతడు జీతం లేకుండా సువార్త ప్రకటించారు. ఈ విధంగా పౌలుగారు తన ఉద్దేశం మంచిదనీ, ఇష్టపూర్వకంగా తాను ప్రకటిస్తున్నాననీ, జీతగాడిలాగా కాదనీ రుజువు చేస్తున్నారు. తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో పని చేస్తున్న సైనికుడిలాగా (వ 7), యేసుప్రభువువంటి మంచి యజమానికి సేవ చేయడంలో ఆనందిస్తూ ఉన్నారు. 

 

18వ వచనంలో తన జీతం గురించి మాట్లాడుతున్నారు జీతం లేకుండా ఉచితంగా సేవించి తన యథార్థతను, ప్రేమను కనపరచుకోవడమే తన జీతం.

 

 మరి నీవు కూడా అలా దేవుని సేవ చెయ్యడానికి సువార్తను ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా?

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*68వ భాగము-సంఘము-సమస్యలు-22*

 

1కొరింథీ 9:1924

19. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.

20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.

21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.

22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.

23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.

24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

9వ అధ్యాయంలో మరో సమస్య: సేవా-పరిచర్య చేసేవారు- వచ్చిన కానుకలను తమ బ్రతుకు తెరువుకోసం వాడుకోవచ్చా!!! అనే విషయం మీద పౌలుగారు చెబుతున్న అభిప్రాయాలను ధ్యానం చేస్తున్నాము!

 ప్రియులారా! ఇక 19వ వచనం నుండి చివరివరకు దైవసేవకులు ఎలా నిస్వార్ధముగా జీవించాలో  తన జీవితమునే ఉదాహరణగా పెట్టి చెబుతున్నారు!

 

నేను అందరి విషయమై స్వతంత్రుడనై యున్ననూ ఎక్కువమంది క్రీస్తుకోసం సంపాదించడానికి అందరికి నన్ను నేనుగా దాసునిగా చేసుకున్నాను అంటున్నారు! యూదులను సంపాదించుకోడానికి యూదుల వలే నడుచుకున్నాను, అలాగే ధర్మశాస్త్రము లేని అన్యజనులను సంపాదించుకోడానికి ధర్మశాస్త్రము లేనివాడిగా ప్రవర్తించాను, అలాగే బలహీనులను సంపాదించుకోడానికి బలహీనునిగా జీవించాను అంటున్నారు! ఏ విధముచేతనైన అనేకులను క్రీస్తుకోసం సంపాదించుకోవాలని అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంటున్నారు!

 

ప్రియులారా జాగ్రత్తగా పరిశీలిస్తే 8,9 అధ్యాయాలు క్రైస్తవ స్వేచ్ఛనూ/ స్వాతంత్ర్యమును , ఆధ్యాత్మిక స్వతంత్రతనూ సరిగా ఉపయోగించుకోవడం గురించి చెప్తున్నాయి. అయితే ఇతరులను క్రీస్తులోకి తెచ్చేలా అది చేస్తుందనుకుంటే తన స్వేచ్ఛ స్వతంత్రతలను, అధికారాలను  పూర్తిగా వదులుకోవడానికి కూడా పౌలుగారు  సిద్ధమే. అంటే తన స్వేచ్ఛ/ స్వాతంత్ర్యము/ అధికారము  కంటే ఇతరులంటేనే అతనికి ఇష్టము లేక  ప్రీతి. తన వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలను ఇతరులకు మేలు చేయాలన్న కోరికతో పోల్చుకుంటే ఏమీ లేనట్టుగానే ఉన్నాయి. తన ఇష్టప్రకారం చెయ్యాలన్న కోరిక కంటే ఇతరులను క్రీస్తులోకి నడిపించాలన్న కోరికే బలంగా ఉంది. తాను అందరికీ దాసుడను/ బానిసనయ్యాననీ చెప్పడంలో అతని భావమేమిటో తరువాతి వచనాల్లో ఉంది. ఇక్కడ మూడు రకాల మనుషుల గురించి పౌలుగారు చెప్తున్నారు

1. యూదులు,

2. ధర్మశాస్త్రము లేని అన్యజనులు ,

౩. మనస్సాక్షి, నమ్మకం విషయాల్లో బలహీనులు.

 

1). ఏవిధముగా నైనా అందరినీ క్రీస్తుకోసం గెలవాలనే అతని తపన! అందుకే యూదులను సంపాదించుకోడానికి యూదునిగా జీవించాను అంటున్నారు! ధర్మశాస్త్రము లోబడువారిని సంపాదించుకోడానికి నేను ధర్మశాస్త్రముకి లోబడక పోయినా గాని వారిని సంపాదించుకోడానికి ధర్మశాస్త్రమునకు లోబడినట్లు జీవించాను అంటున్నారు!

యూదులకు తన ఉపదేశాలు ఎక్కువ అంగీకారం అయ్యే విధంగా పౌలుగారు  కొన్ని పనులు చేశారు క్రైస్తవ విశ్వాసానికీ, జీవిత విధానానికీ ఆ పనులు విరుద్ధమైనవి కాకపోతే ఆయన చేశారు. దీనికి ఉదాహరణలు:

అపో. కార్యములు 16: 3

అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదుల కందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను.

 

అపో.కార్యములు 18: 18

పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.

 

21:20-26. ....

20. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.

24. నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు

26. అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొని పోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను.

 

 

2. ఇక దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను అయినను ధర్మశాస్త్రము లేనివారిని అనగా అన్యజనులను సంపాదించుకోడానికి ధర్మశాస్త్రము లేనివానివలే ఉన్నాను అంటున్నారు!

రోమా  2:12.

ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

 

యూదులు కానివారి మధ్య పని చేస్తున్నప్పుడు యూద ధర్మానికి చెందిన శాసనాలనూ ఆచారాలనూ పక్కన పెట్టారు పౌలుగారు. ధర్మశాస్త్రం కోరుతున్న నైతిక విలువలను కూడా నిర్లక్ష్యం చేశారని కాదు. తాను దేవునికి లోబడాలనీ, క్రీస్తు నేర్పించిన ఆధ్యాత్మిక సూత్రాలను పాటించాలనీ అతనికి తెలుసు.

 

౩. అలాగే బలహీనులను సంపాదించుకోడానికి బలహీనుడను అయ్యాను అంటున్నారు! ఏ విషయంలో బలహీనులు అంటే తమ మనస్సాక్షి, నమ్మకం లేక విశ్వాసం విషయాల్లో బలహీనులు. ఇలా ఏవిధముచేతనైనా అనేకులకు క్రీస్తులోనికి నడిపించాలన్నదే అతని సంకల్పం!!

వారిని నొప్పించడం, బాధపెట్టడం జరగకుండా జాగ్రత్తగా ఉన్నారు. వారిలో మరింత ఆధ్యాత్మిక ధోరణి కలిగించాలని తన స్వేచ్ఛనూ తన హక్కులనూ ఆయన  వదులుకున్నారు. తనకు సంతోషం కలిగించడం కాక ఇతరుల మేలే అన్ని రకాల ప్రజల మధ్య కూడా అతని లక్ష్యం.

రోమా 15:1-3

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

 

Romans(రోమీయులకు) 8:5,7,8

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

 

రోమీయులకు 14: 1

విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

 

23వ వచనంలో ఇలా ఎందుకు చేస్తున్నారో చెబుతున్నారు పౌలుగారు! నేను సువార్తలో వారితో పాలివాడను కావాలి అందుకే దానికోసమే సమస్తమును నేను చేస్తున్నాను అంటున్నారు! పౌలుగారికి  ప్రధానమైనది తన ఇష్టాయిష్టాలు కాదు, తన అభిలాషలు, లేక తన “హక్కులు” కాదు గాని సువార్తే. సిలువను గూర్చిన వార్త అందరికీ చేరి అందరినీ సిలువనీడలోనికి తేవాలి!!

 

ఇక్కడ “పాలివాణ్ణి” అనడంలో అతని ఉద్దేశం సువార్తలోని దీవెనలను తానొక్కడే ఉంచుకోవడం కాకుండా అందరితో పంచుకోవడమని అర్థం.

 

చూశారా పౌలుగారి తాపత్రయం!! ఎలాగైనా అనేకులను క్రీస్తుకోసం గెలవాలి అందుకోసం తనకున్న అధికారాలు అనగా సంఘములో కానుకలు తీసుకోవడం గాని, తన అధికారాలను వారిమీద చెలాయించడం గాని, ఇంకా తాను నష్టపోయినా పర్వాలేదు, తాను అగౌరపరచబడినా పర్వాలేదు గాని అనేకులను క్రీస్తుకోసం నడిపించాలనే సువార్త తపన!! మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభులవారి చివరి ఆజ్ఞను, ఎండవేళ మిట్టమధ్యాహ్నం తాను పొందిన యేసుక్రీస్తుప్రభులవారి సాక్షాత్కారమునకు లోబడి ఆయన పొందిన వెలుగును, చూచిన వెలుగును అందరికి పంచాలి!!

మరి ఇలాంటి ఆశ తాత్పర్యం, సువార్త తపన నీకుందా ప్రియ దైవజనుడా/విశ్వాసి!!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*69వ భాగము-సంఘము-సమస్యలు-23*

 

1కొరింథీ 9:2427

24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.

25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,

27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

9వ అధ్యాయంలో మరో సమస్య: సేవా- పరిచర్య చేసేవారు- వచ్చిన కానుకలను తమ బ్రతుకు తెరువుకోసం వాడుకోవచ్చా!!! అనే విషయం మీద పౌలుగారు చెబుతున్న అభిప్రాయాలను ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇక 24వ వచనం నుండి చివరివరకు దైవసేవకులు ఎలా సవాలుకరమైన జీవితం జీవించాలో  తన జీవితమునే ఉదాహరణగా పెట్టి చెబుతున్నారు!

 

   పందెపు రంగములో చాలామంది పరుగెత్తుతారు గాని ఒక్కడికే బహుమానం వస్తుంది అలాగే మీరు కూడా పరుగెత్తుతున్నారు గాని మీరుబహుమానం పొందుకోనేలా పరుగెత్తండి అంటూ సవాలు విసరుతున్నారు!!

 

 ఇక 25వ వచనంలో అలా బహుమానం కోసం పరుగెత్తాలి అంటే నీవు అన్ని విషయాలలోనూ మితముగా ఉండాలి లేక అన్ని విషయాలలోనూ క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటున్నారు! వారు క్షయమైపోయే బహుమానం కోసం అన్నివిషయాలలో మితముగా జీవిస్తూ పరుగెత్తుతున్నారు గాని మనమైతే అక్షయమైన కిరీటం పొందటానికి పరుగెత్తుతున్నాము అంటున్నారు!

 

ఇక్కడ మనకు పందెపు రంగము, బహుమానం, అక్షయమైన కిరీటం లాంటి విషయాలు కనిపిస్తున్నాయి!

 

గమనించాలి: నమ్మకమైన సేవకు నిస్వార్ధమైన సేవకు దేవుడిచ్చే బహుమతులు పొందాలని ఉంటే అందుకు మార్గం ఒకటే. అది పౌలుగారు పయనించిన  మార్గం. అది సువార్త కోసం స్వార్థమును అధికారమును త్యాగం చెయ్యడం, ఇంకా  క్రమశిక్షణగల మార్గం.

మత్తయి 16: 24

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

 

మత్తయి 10: 38

తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

 

లూకా 9: 23

మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

 

అలాగైతే క్రీస్తుకోసం సేవ చేయడం అన్నది పందెంలో పరుగెత్తడం వంటిదా?  అవును అలాంటిదే.

అపొ కా 20:24;

అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.

 

2తిమోతికి 4: 7

మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

 

హెబ్రీయులకు 12: 2

మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో- సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

 

 పరుగెత్తిన వారందరికీ బహుమతి లభించదు. పౌలుగారు చెప్తున్న ఈ బహుమతి రక్షణ కాదు . ఇది ఉచితంగానే దొరికేది. విశ్వాసులందరికీ ఇది ఉంది, వారిలో కొందరికి మాత్రమే కాదు

ఎఫెసు 2:8-9

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

పౌలుగారు చెప్పేది క్రీస్తుకోసం చేసిన సేవకు దొరికే ఏదో ప్రతిఫలం ఇది. దేవుడు ఒకరోజు భళానమ్మకమైన మంచిదాసుడా అని సెహబాస్ కొట్టి నీకు కోట్లాది దూతలముందర తన పరిశుద్దుల అందరిముందు ఇచ్చే బహుమానం! కిరీటాలు!!

 

యేసు క్రీస్తు సేవలో ఉండే  సేవకుల సంపాదించుకోగల కిరీటాలు కొన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి

 

అతిశయ కిరీటం: సేవలో ప్రయాసపడే వారికి:

1థెస్సలొనికయులకు 2: 19

ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.

 

నీతి కిరీటం: విశ్వాసవీరులకు, జయజీవితం గలవారికి: 2తిమోతి 4:

7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

8. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.

 

జీవ కిరీటం: శోధన సహించిన వారికి, దేవునిచేత ప్రేమించబడిన వారికి:

యాకోబు 1: 12

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

 

వాడభారని మహిమ కిరీటం: సంఘకాపరులకు, నాయకులకు:

1పేతురు 5: 4

ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.

 

సరే, క్రీడాకారులు చాలా ప్రయాసలకోర్చి, కఠినమైన శిక్షణ, అభ్యాసాలతో ఈ లోకంలో తాత్కాలికమైన బహుమతుల కోసం పాటుపడతారు. క్రీస్తుసేవకులకు కనీసం వారికున్న జ్ఞానం, నియమ నిష్ఠలు, పట్టుదల ఉండవద్దా? మనం సంపాదించుకోగల బహుమతులు శాశ్వతంగా ఉంటాయి.

 

కాబట్టి దైవసేవకులకు కూడా క్రమశిక్షణ ఉండాలి! తమ కోరికలను చంపుకోవాలి! తమయొక్క లగ్జరీలు త్యాగం చెయ్యాలి! తమ యొక్క అహాన్ని చంపుకోవాలి! తమయొక్క కుటుంబ జీవితాన్ని త్యాగం చెయ్యాల్సివస్తుంది అనేకసార్లు! అందరిలా జీవిస్తే ప్రభువుతో గడపటానికి సమయం ఉండదు కాబట్టి నీ నిద్రను త్యాగం చెయ్యాలి, దైవసేవకుడు ఆయనభార్య కూడా తమ సంసార జీవితాన్ని అనేకసార్లు త్యాగం చెయ్యాల్సి వస్తుంది అప్పుడే ప్రార్ధనలో ఉపవాసంలో గడపగలవు! అప్పుడే దేవునితో ముఖాముఖిని పొందుకోగలవు అప్పుడే దేవుని నుండి వరాలు ఫలాలు పొందుకోగలవు! నీవు సైతాను శోధనలను జయించే శక్తి నీ మోకాళ్ళమీదనే పొందుకోగలవు!!

ఇవి కావాలంటే నీ కోరికలు ఇష్టాలు లగ్జరీలు అన్నీ త్యాగం చెయ్యాలి! క్రమశిక్షణ గల జీవితం జీవించాలి!

 

పౌలుగారు చివరి వచనంలో అంటున్నారు నేను గాలికి పోరాడినట్లు ఊరకనే పోరాటం చెయ్యలేదు గాని ఇతరులకు నేను బోధించాక నేనే బ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నాకు నేనే నలుగగొట్టుకుంటున్నాను దానిని లోపరచుకుంటున్నాను అంటున్నారు! ఇదీ క్రమశిక్షణ గల జీవితం!

 

అతడు గాలిలో దెబ్బలు వేయలేదు. శరీరాన్నే దెబ్బలు కొట్టి వశపరచుకున్నారు. తన శరీరాన్ని గాయపరచుకున్నారని  దానికి హాని చేశాడనీ దీని అర్థం కాదు. క్రమశిక్షణతో , తనను అదుపు చేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు. తన శరీర సౌఖ్యాన్ని చూచుకోకుండా కోరికలను అదుపులో ఉంచుకుని తన శరీరం  తనకు లోబడేలా బలవంతం చేశారు. అంటే తనను జయించాలని పోరాడుతున్న ప్రత్యర్థిగా తన శరీరాన్ని ఎంచారన్నమాట. దానిని బలంగా పోరాడేదిగా పరిగణించి దానిని లోపరచుకోవాలని భావించినట్టున్నారు (రోమా 7:24  చూడండి

అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?).

తన శరీరానికి తాను బానిస అయ్యేందుకు అతడు ఒప్పుకోలేదు గానీ క్రమశిక్షణ కలిగి, తనను అదుపు చేసుకోవడం ద్వారా శరీరాన్నే తనకు బానిసగా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాబోయేకాలంలో కలగబోయే దేవుని మెప్పు అనే శాశ్వత బహుమానాన్ని అతడు కోరాడు. దానికోసం ఇప్పటి శరీర సుఖాన్ని, సౌకర్యాలను విసర్జించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని బట్టి చూస్తే పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు పౌలుగారికి ఇంతకన్నా తేలిక మార్గమేదీ తెలిసినట్టు లేదు. అతనికి అందులో పోరాటం, శరీరాన్ని లోపరచుకోవాలన్న నిశ్చయమే ఉన్నాయి.

 

ఇక చివరిలో నేను బ్రష్టుడను అయిపోతానేమో అని భయపడటం అంటే తన పాపవిముక్తిని, రక్షణను కోల్పోతానేమోనని భయంగా ఉంది అనడం లేదు, తన బహుమతులు పోతాయేమోనని భయపడుతున్నాడు

 (1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:12,13,14,15

12. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల,

13. వాని వాని పనికనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.

15. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.

 

 2తిమోతికి 2: 5

మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.)

 

శరీరం అనేది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. దాని కోరికలు, వాంఛలు తీరడమే దానికి కావాలి. అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోకి తెస్తుంది. ఇది తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, అవినీతి మొదలైనవాటికి దారి తీస్తుంది. అందుకే శరీరాన్ని నలుగగొట్టుకున్నారు పౌలుగారు!

 

ఇంకా 26వ వచనంలో నేను గురి చూడకుండా కాదు గురిచూసి పరుగెత్తుతున్నాను అంటున్నారు! పౌలుగారు  తన మనసులో ఒక గురిని ఉంచుకొని పరుగెత్తాడు

ఫిలిప్పీ 3:13-14.

13. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి (లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు

14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

 

ఆయన పోరాడుతున్నట్లు నటించడం కాదు, నిజంగా పోరాడారు. గెలిచేందుకే పోరాడారు

 2 తిమోతి 4:7,8

పౌలుగారు అలా జీవించే మంచిపోరాటం పోరాడితిని పరుగును తుదముట్టించితిని విశ్వాసమును కాపాడుకుంటిని ఇక నాకొరకు నీతి కిరీటం ఉంచబడింది అని సవాలుచేస్తున్నారు!

మరి నీవు అలాంటి సవాలు కరమైన జీవితం జీవించగలవా ప్రియ సేవకుడా! విశ్వాసి!!!

 

అలా పౌరుషం గల జీవితం సవాలుకరమైన జీవితం జీవించిన వారికే ప్రకటన 2,3 అధ్యాయాలలో గల బహుమతులు! జయించిన వారు పొందుకునే బహుమతులు అన్నీ ఆ అధ్యాయాలలో ఉన్నాయి!

మరి నీకు జయించే అనుభవం ఉందా?

సవాలు కరమైన జీవితం ఉందా ప్రియసేవకుడా! విశ్వాసి!!

సాక్షానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం ఉందా?!! పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా?!!

అయితే పౌలుగారి వలే కిరీటాలు పొందుకోగలవు!!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*70వ భాగము-సంఘము-సమస్యలు-24*

 

1కొరింథీ 10:15

1. సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రిందనుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;

2. అందరును మోషేను బట్టి (మోషేలోను) మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;

3. అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;

4. అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! 9వ అధ్యాయంలో  దైవసేవకులు ఎలా నిస్వార్ధమైన జీవితం, సవాలుకరమైన జీవితం జీవించాలో  తన జీవితమునే ఉదాహరణగా పెట్టి మనకు చెప్పారో ఈ పదవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులు రక్షించబడిన మనము చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు! 9వ అధ్యాయం చివరి మాటలకూ ఈ అధ్యాయంలో ఉన్న ఉపదేశానికీ దగ్గర సంబంధం ఉంది. అక్కడ కోరికలను కాదనుకోవడం, క్రమశిక్షణ అవసరం అని చెప్తూ పౌలుగారు ఆ నియమాన్ని అనుసరిస్తున్న వాడుగా తన ఉదాహరణను చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయేల్ చరిత్రలో దీనిని అనుసరించనివారి ఉదాహరణలు ఇస్తూ (వ 6,11), చెడు కోరికలకు తావిస్తే కలిగే భయంకరమైన ఫలితాలను వర్ణిస్తున్నారు!

 

ఇక మొదటి వచనంలో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నా కిష్టము లేదు అంటూ అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు వారందరూ సముద్రములో నడచి పోయారు, అందరు మోషేను బట్టి మేఘములోను సముద్రము లోను బాప్తిస్మం పొందారు, ఇంకా అందరూ ఆత్మసంబంధమైన ఒకే ఆహారాన్ని భోజనం చేశారు, అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును త్రాగారు! ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు ఆ బండక్రీస్తే అంటున్నారు!!!

ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా మనలాగే వారు కూడా బాప్తిస్మం పొందారు ఎక్కడ పొందారు?

సముద్రంలోను మేఘంలోను!

 మేఘం” నిర్గమ 13:21-22.

21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.

22. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

ఆ మహిమ మేఘము యేసుక్రీస్తు ప్రభులవారే!!

 

సముద్రం” నిర్గమ 14:21-22, 29.

21. మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

 

వారంతా అంటే ఇజ్రాయేల్ జాతి అంతా ఈజిప్ట్‌నుంచి బయటికి వచ్చి కనానుకు ప్రయాణం ఆరంభించారని చెప్తున్నారు పౌలుగారు.

ఇక్కడ మనము ఎలా నీటిలోనూ పరిశుద్ధాత్మ లోను బాప్తిస్మం పొందామో అలాగే వారు కూడా నీటిలోనూ అనగా ఎర్ర సముద్రం లోనూ, మేఘము లోను అనగా మహిమ మేఘమైన పగలు మేఘ స్థంభం క్రిందను రాత్రి అగ్ని స్తంభము క్రిందను వారు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు! ఆ విధంగానే మనము కూడా పరిశుద్ధాత్మ లో బాప్తిస్మము పొందాము!

 

“బాప్తిసం” సముద్రం గుండా వారు వెళ్ళడం బాప్తిసం వంటిది. ఈజిప్ట్‌లోని వారి పాత జీవితంతో పూర్తిగా తెగతెంపులు జరిగాయనేందుకు ఇది గుర్తుగా ఉంది. వారు “మోషే లోకి” బాప్తిసం పొందారు అంటే మోషే నాయకత్వంలోకి వచ్చారన్నమాట. ఆ ఐక్యమైన ప్రజలు కనానుకు చేసే ప్రయాణంలో అతడు వారికి నాయకుడై ఉన్నారు. అలాగే క్రైస్తవ బాప్తిస్మానికి కూడా ఇలాంటి అర్థం ఉంది. అలాగే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనము మన పాత జీవితానికి స్వస్తి పలికి క్రీస్తుయేసులో నూతన జీవితం జీవించాలి! క్రీస్తుయేసు ప్రభుత్వంలో, సంఘానికి నాయకుడుగా ఉన్న ఆయనలో ఐక్యమైన కొత్త జీవితాన్ని అది సూచిస్తున్నది.

 

బాప్తిసం గురించి ఇంకా చూసుకుంటే బాప్తిసం అనే పదం “బాప్తిజో” అనే గ్రీకు పదంనుంచి వచ్చింది. విశేష జనాదరణ పొందిన గ్రీకు ఇంగ్లీషు నిఘంటువు ఈ పదానికి (తెలుగులోకి అనువదిస్తే) “ముంచడం...నిమజ్జనం. మునిగేలా చేయడం, నీళ్ళలో తడవడం, నిమగ్నంగా చేయడం” అని అర్థాలిస్తున్నది (ఈ నిఘంటువు ఆర్ణ్‌డ్ట్, గింగ్రిచ్ అనే పండితులు రాసినది. మిగతా నిఘంటువులు దీనితో దాదాపుగా ఏకీభవిస్తున్నాయి). యోహానుగారు ఇచ్చిన బాప్తిసం పశ్చాత్తాపానికీ పాప క్షమాపణకూ సూచనగా ఉంది. అయితే అది వాటిని ఒక మనిషిలో ఆ పశ్చాత్తాపము పాపక్షమాపణ  కలిగించలేదు. (మార్కు 1: 4

బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను.)

 బాప్తిసం గానీ మరే నీటి సంస్కారం గానీ ఏ స్థలంలోనైనా పాపాన్ని తీసివేయదు, మనుషుల హృదయాలను మార్చదు. దేవుడు మాత్రమే అలా చేయగలరు. తన ఏకైక కుమారుణ్ణి నమ్మడం మూలంగా ఒక వ్యక్తి ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆయన ఆ వ్యక్తిలో దేవుడు పాపక్షమాపణ పశ్చాత్తాపం దయ చేస్తారు

 యోహాను 1:12-13;

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 3:3-8;

 

యోహాను 5: 24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

 

అపొ కా 13:38-39

38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,

39. మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.

 

ఇప్పుడు ఇలా బాప్తిస్మం పొందిన వారు కూడా దేవునికి విరుద్ధంగా ఐదు రకాల పాపాలు చేసి నశించిపోయారు! మీరు కూడా అలా చేయవద్దు అని పౌలుగారి ఆక్రందన!!!

 

వారు బాప్తిస్మం పొందుకోవడమే కాకుండా పరమ ఆహారం లేకపోతే దేవదూతలు బుజించే ఆహారం తిన్నారు! అయినా మరణించారు! నశించిపోయారు అనేకులు!

 

౩, 4 వచనాలు దీనికోసం చెబుతున్నాయి. వారు ఆత్మసంబంధమైన ఒకే ఆహారం తిన్నారు! అది మన్నా! ఆత్మ సంబంధమైన ఒకే పానీయము త్రాగారు అది బండనుండి వచ్చిన నీరు! ఆ బండ క్రీస్తే! అనగా క్రీస్తునుండి వచ్చిన జీవజలమును వారు త్రాగారు!

 

ఈ ఆహారం మన్నా.

Exodus(నిర్గమకాండము) 16:13,15,16

13. కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.

15. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

16. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.

 

నిర్గమ 17:5-6

5. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము

6. ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

 

 మన్నాను, నీటిని దేవుని ఆత్మ అద్భుత రీతిగా వారికిచ్చాడు. నీరు పెల్లుబికిన బండ జీవ జలాన్ని ఇచ్చే క్రీస్తుకు సూచనగా సాదృశ్యంగా ఉంది!

యోహాను 4:10, 14;

10. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.

14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

 

John(యోహాను సువార్త) 7:38,39

38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

 

యోహాను 19: 34

సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

 

పాత నిబంధన  గ్రంథంలో ఎక్కడా ఇజ్రాయేల్ వారు ఎడారిలో గుండా ప్రయాణమైపోతూ ఉండగా ఆ బండరాయి వారి వెనకాలే దొర్లుకుంటూ వెళ్ళిందని రాసిలేదు (బహుశా ఆ రాయి నుంచి వెలువడిన నీరు ఒక కాలువ కట్టి వారి వెనకాలే వెళ్ళి ఉండవచ్చు కీర్తన 105:41 ప్రకారం.

కీర్తనలు 105: 41

బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.

 

 కానీ క్రీస్తు స్వయంగా వారి వెంట వెళ్తూ వారి అవసరతలన్నీ తీర్చారు. దారివెంట వెళ్తూ, వారిని పోషించిన బండ క్రీస్తేనని పౌలుగారు చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో బండ అనగా ఒకే నిజ దేవుడైన యెహోవాకు గుర్తు ద్వితీ 32:4

ద్వితియోపదేశకాండము 32: 4

ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

 

ఈ విధంగా యేసుక్రీస్తే యెహోవా దేవుడు అని పౌలుగారు మరోసారి చెప్తున్నారు.

(ఆది 16:7; నిర్గమ 3:2; 32:34; యోహాను 8:24, 58; 12:41)

 

ఇక 10:5 లో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకుండా ఉన్నారు గనుక అరణ్యంలో చనిపోయారు అంటున్నారు!! దేవుని కృపను అంతగా వారు అనుభవించినప్పటికీ దేవుని ప్రజగా అన్ని ఆధిక్యతలు వారికున్నప్పటికీ వారిలో చాలా ఎక్కువమంది కనాను దేశం చేరలేదు. దేవుడు వారిని ఆ ప్రతిఫలం పొందడానికి యోగ్యులుగా ఎంచలేదు. వారిపైకి దేవుని శిక్ష వచ్చింది. మరణించే వరకు వారు ఎడారిలో తిరుగులాడుతూ ఉన్నారు.

అలాగే మనము కూడా దేవుని దృష్టికి పాపం చేస్తే మనము కూడా నశించిపోతాము అని కొన్ని ఉదాహరణలు క్రిందన ఇస్తున్నారు పౌలుగారు!

కాబట్టి భయమునొంది మనము కూడా అలాంటి పాపములు మానుకుందాం!

 

దైవాశీస్సులు!


                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               *కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*71వ భాగము-సంఘము-సమస్యలు-25*

 

1కొరింథీ 10:612

6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.

8. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

9. మనము ప్రభువును (కొన్నిప్రాచీన ప్రతులలో- క్రీస్తును అని పాఠాంతరము) శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.

10. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులు రక్షించబడిన మనము చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు పౌలుగారు!

 

ప్రియులారా! ఈ 610 వచనాలలో మనకు 5 గుంపులు కనిపిస్తాయి! ఈ అయిదు గుంపులు ఐదు రకాలైన పాపములు చేసి  కనాను యాత్రలో నశించిపోయారు! ఐగుప్తునుండి కనాను దేశం బయలుదేరారు, ఎర్ర సముద్రం దాటారు గాని కనాను చేరలేదు! మధ్యలో దుంప నాశనం అయిపోయారు! అలాగే మనము కూడా ఆ ఐదు పాపాలు చేస్తే మనము కూడా నాశనమైపోతామని పౌలుగారు ఉదాహరణగా చెబుతున్నారు!

 

మొదటి గుంపు: చెడ్డవాటిని ఆశించిన వారు;

రెండు: విగ్రహారాధికులై అక్కడ తిని త్రాగారు!!

మూడు: వ్యభిచరించిన వారు;

నాలుగు: ప్రభువును శోధించిన వారు;

ఐదు: సణుగుల గుంపు;

వీరెవరు కనాను యాత్రలో గమ్యం చేరలేదు!

 

 అలాగే మనము కూడా పరమ కనాను యాత్రలో ఉన్నాము! ఈ యాత్రలో మనము కూడా చెడ్డవాటిని ఆశించినా, విగ్రహారాధన చేసినా, వ్యభిచరించినా, దేవుణ్ణి శోధించినా, దేవుని దాసులమీద సణిగినా ఈ యాత్రలో గమ్యం చేరకుండా మధ్యలోనే నాశనమైపోయే అవకాశం ఉంది అని మనకు దృష్టాంతాలుగా చెప్పారు!!

వారు తమ ఆశయాన్ని నెరవేర్చుకోలేక ఎడారిలో కూలిపోయిన కారణాలు ఇక్కడ రాసి వున్నాయి.  ఇవన్నీ క్రైస్తవులు దూరంగా ఉండవలసిన సామాన్య పాపాలు. మనం వాటికి దూరంగా ఉండకపోతే మన అంతం వారి అంతం కన్నా మంచిగా ఉండాలని ఎదురుచూచే హక్కు మనకు లేదు.

 

సరే, మొదటి గుంపు కోసం చూద్దాం:

 

6: వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి అంటున్నారు! అనగా ఈ సంగతులు మనకు బుద్ధిచెప్పడానికి ఉదాహరణగా సంభవించాయి అంటున్నారు! ఇదే 11 వ వచనంలో అంటున్నారు: ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అంటున్నారు!! ఈ సంగతులు అన్నీ వారికి సంభవించినా గాని ఈ యుగాంతమందు ఉన్న విశ్వాసులమైన మనకు బుద్ధి కలుగుటకై పరిశుద్దాత్ముడు మనకోసం భక్తులచేత వ్రాయించారు అని ప్రతీ ఒక్కరు గ్రహించాలి!! అందుకే 12వ వచనంలో తాను నిలుచున్నానని అనుకునే వాడు పడిపోతానేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు!

 

 అందుకే 9వ అధ్యాయం చివరి వచనంలో పౌలుగారు అంటున్నారు: ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడనైపోతానేమో అని నాకు నేనే నా దేహాన్ని నలుగగొట్టుకుని నా దేహాన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాను అంటున్నారు! అలాగే మనము కూడా ఇలాంటి భయము కలిగి మనలను మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అని దీని అర్ధం!!

 

వారుఆశించిన ప్రకారం చెడ్డవాటిని ఆశించవద్దు అంటున్నారు! ఇశ్రాయేలు ప్రజలు ఏమి చెడ్డవాటిని ఆశించారు?

కేవలం ప్రభువుమీదే మనసు పెట్టుకోకుండా చెడ్డవాటిపై మనస్సు పెట్టుకోవడమే మిగతా పాపాలన్నిటికీ మూలకారణం. చెడు కోరికలన్నిటినీ చంపెయ్యాలనీ వేరొక చోట పౌలుగారు విశ్వాసులకు చెప్పారు! వాటిని మన హృదయాల్లో ఉండనిస్తే చివరికి అవి విష సర్పాలై మనల్ని కాటు వేస్తాయని గ్రహిస్తాం.

కొలస్సీయులకు 3: 5

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి.

 

ఇక్కడ శరీరభాగాలు అనగా బ్రష్టస్వభావానికి చెందినవాటిని అని అర్ధం! శరీరంలో కళ్ళు చేతులు కాళ్ళు ఎలాగో అలాగే పౌలుగారు ఇక్కడ చెప్పిన పాపాలు పుట్టుకతోనే మన స్వభావంలో ఒక భాగమై ఉండిపోతాయి! వాటిని దూరంగా ఉంచమని చెబుతున్నారు! ఇక పైవాటికి దూరంగా ఉండాలని గతభాగాలలో చూసుకొన్నాము!

 

ఉదాహరణ: మత్తయి 5:29౩౦

29. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

30. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.

 

Ephesians(ఎఫెసీయులకు) 5:3,4,5,6

3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి (మూలభాషలో- అవిధేయత కుమారుల మీదికి) వచ్చును

 

ఇక్కడ ఈ కొలస్సీ 3:5 లోను ఎఫెసీ 5:4--6 లోను చెప్పిన ఈ పాపాలు అన్నీ మనలో నుండి పూర్తిగా తొలగిపోవాలి! ఎందుకు అలా అంటున్నారు అంటే మన దేహము దేవునికి ఆలయము అని మనము ఇదే కొరింథీ పత్రిక ౩,4 అధ్యాయాలలో నేర్చుకున్నాము! కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని దేవుని ఆలయముగా చేసి దేవునికి సమర్పించాలి మన దేహాలు అనే ఆలయములను!

రోమా 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

 

ఎఫెసీ 4:1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

 

5:1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.

 

దేవుడు విశ్వాసులకు క్రీస్తుయేసులో నూతన జీవము ఇచ్చారు కాబట్టి వారికి మహిమలో ఇంకా నిత్యత్వములో మంచి మహిమతో కూడా భవిష్యత్ ఎదురుచూస్తుంది!! వాటిని పొందుకోవాలి అంటే ఈ క్షణ భంగురమైన ఆశలన్నీ ఈ భూలోకంలో త్యజించాలి!! దేవునికి తగినట్లుగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి! తమ జీవితంలో ఏలుబడి చేస్తున్న పాపమును రూపుమాపాలి! ఇది సాధ్యమా అంటే సాధ్యమే! దేవుని ఆత్మద్వారా దేవుని ఆత్మచేత నడిపించబడితే వాక్యమును మన హృదయములో ఉంచుకుని వాక్యం చెప్పినట్లు జీవిస్తే ఇలా పవిత్రముగా పరిశుద్ధముగా నడవవచ్చు!

 

Romans(రోమీయులకు) 8:3,4,5,13,14

3. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము

4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;

13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.

14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.

 

గలతీ 5:2225

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

24. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు.

 

ఎఫెసీ ౩:1620

16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,

17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,

18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,

19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.

20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, ....

 

కాబట్టి మన మనస్సులో నుండి దేహాల నుండి ఈ చెడ్డవాటిని తీసివేసి పరిశుద్దాత్మ పూర్ణులమై వాక్యమును హృదయం నిండా నింపుకుని ఆ పరమకనాను యాత్రలో మన గమ్యమును చేరుకుందాం!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*72వ భాగము-సంఘము-సమస్యలు-26*

 

1కొరింథీ 10:612

6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.

8. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

9. మనము ప్రభువును (కొన్నిప్రాచీన ప్రతులలో- క్రీస్తును అని పాఠాంతరము) శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.

10. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులుచేసిన 5 గుంపుల కోసం చెబుతూ  రక్షించబడిన మనము చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు పౌలుగారు!

మొదటి గుంపు: చెడ్డవాటిని ఆశించిన వారు;

రెండు: విగ్రహారాదికులై అక్కడ తిని త్రాగారు!!

మూడు: వ్యభిచరించిన వారు;

నాలుగు: ప్రభువును శోధించిన వారు;

ఐదు: సణుగుల గుంపు;

వీరెవరు కనాను యాత్రలో గమ్యం చేరలేదు!

 

         (గతభాగం తరువాయి)

 

ప్రియులారా!ఇక ఈ రోజు రెండవ గుంపు కోసం చూసుకుందాం!

విగ్రహారాధికులై తిని త్రాగిన గుంపు:  కనాను యాత్రలో ఎప్పుడు ఎలా తిని త్రాగారో ఇశ్రాయేలు ప్రజలు చూసుకుందాం!

 

నిర్గమ 32:౩--6.

3. ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.

4. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.

5. అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.

 

దేవుడు మోషే గారితో కొండమీదకు రా, అక్కడ నీకు నా చేతితో రాసిన నేను చెప్పిన ఆజ్ఞలు రాసి రాతిపలకలను నీకిస్తాను అంటే మోషేగారు 40 రోజులు సీనాయి కొండమీద ఉండిపోతే ఇక్కడ ఆహారోను & కో విగ్రహం చేసుకుని విగ్రహారాధన చేస్తున్నారు! దేవుని కోపం మండింది!! అక్కడ అనేకులు పిట్టల్లా రాలిపోయారు!

 

32:25 , 28

25. ప్రజలు విచ్చల విడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి యుండెను.

28. లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేలమంది కూలిరి.

 

సరే, ఇక్కడితో ఆగిపోయిందా లేదే, మోయాబు మైదానంలో మరోసారి బయెల్పెయోరు తో కలిసికొని మరలా విగ్రహారాధన చేశారు! అక్కడ కూడా రాలిపోయారు...

సంఖ్యా 25:9

ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.

 

తరువాత ఇస్రాయేల్‌వారు మళ్ళీ మళ్ళీ విగ్రహ పూజకు దిగజారిపోయారు. బైబిల్ అంతటా దేవుడు విగ్రహపూజను ఖండించారు. వారు కనాను చేరిన తరువాత కూడా వారు విగ్రహారాధన మానలేదు. అందుకే వారిని అష్షూరు బబులోనుకి చెరలోనికి పంపారు. నిర్గమ 20:3-4;

3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

4. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

 

ఇక తినుటకును త్రాగుటకును అనగా విగ్రహాలకు సంభందించిన ఆలయములో తినడము త్రాగడం తప్పు అని అర్ధం! చూడండి మరలా 32:6 ...

మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.

 

ఇది దేవుని దృష్టిలో క్షమించరాని తప్పు! అందుకే వారు అక్కడ చనిపోయారు!

మనము కూడా విగ్రహాలకు సంబంధించిన ఆలయములకు వెళ్ళడం, అక్కడ ఏదైనా పండుగ జరిగినా లేక బంధువుల పెళ్లి జరిగినా అక్కడికి వెళ్ళడం తప్పే, అక్కడ తినడమూ నేరమే! ఎట్టిపరిస్తితులలో విశ్వాసి వీటిని చెయ్యరాదు! చేస్తే కనాను యాత్రలో వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లు పరమకనాను యాత్రలో నీవు మధ్యలోనే రాలిపోతావు! ఇక్కడ రాలిపోతావు అంటే చనిపోతావు అని కాదు ఆధ్యాత్మికంగా మరణమైపోతావు! ఇక నీకు రక్షణ పొందే యోగ్యతను కూడా కోల్పోతావు కారణం నీవు...

Hebrews(హెబ్రీయులకు) 6:4,5,6

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన (మూలభాషలో- రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

 మీద వచనం ప్రకారం ఒక్కసారి పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత దేవుని కుమారుని రక్తాన్ని మరల కల్లచూశావు గనుక నీకు పాప క్షమాపణ ఉండదు!!

 

ఇక మూడవగుంపు: మూడు: వ్యభిచరించిన వారు;

 

వ్యభిచారం కోసం అనేకసార్లు వ్రాయడం జరిగింది కాబట్టి ముందుకుపోదాం! దేవునికి వ్యభిచారులు అంటే చాలా అసహ్యం! వేశ్యను క్షమిస్తారు గాని కావాలనుకుని భర్త ఉండి కూడా/ భార్య ఉండి కూడా పరాయి స్త్రీతో/ పరాయి పురుషునితో పాపం చేస్తే దేవుడు ఊరుకోరు! దావీదు గారినే దేవుడు ఊరుకోలేదు!!!

 

10:8.. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

 

సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఎప్పుడు వ్యభిచారం చేశారు అంటే మీదన చెప్పిన రిఫరెన్సులో ...

సంఖ్యా 25:1-9.

1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.

2. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.

3. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

4. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.

5. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.

6. ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదు టను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.

7. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి,

8. సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.

9. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.

 

బిలాము యొక్క తప్పుడుబోధ అనుసరించి మోయాబీయులు తమ దేశంలో ఉన్న అందమైన స్త్రీలను, అందమైన అమ్మాయిలను ఇశ్రాయేలు గుడారాలలోకి శిభిరాలకు పంపించారు! వారు వీరితో వ్యభిచారం చేశారు! అయ్యిందా అంటే లేదు, అప్పుడు ఆ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు ప్రజలను తమ దేవత పండుగకు ఆహ్వానించారు! అదే బయెల్పెయోరు! అక్కడకు వెళ్లి వ్యభిచారం చేస్తూ ఆ దేవతకు ఇశ్రాయేలు ప్రజలు మ్రొక్కారు! దేవుడు వారిమీదికి ఉగ్రతను పంపించారు!!

దేవుడు పంపిన విపత్తు వల్ల 24 వేలమంది చనిపోయారని సంఖ్యాకాండం చెప్తున్నది. 23 వేలమంది ఒకే రోజున కూలారని పౌలు రాస్తున్నాడు. వెయ్యిమంది వేరొక దినాన చనిపోయారన్న మాట. దేవునికి వ్యభిచారమంటే అసహ్యం. అతి స్పష్టమైన మాటలతో ఆయన దీన్ని నిషేధించాడు (నిర్గమ 20:14 మొ।।).

 

కాబట్టి ప్రియ దైవజనమా! విగ్రహారాధన వలన  వ్యభిచారం వలన కనాను యాత్రలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరకుండా మధ్యలోనే చనిపోయారు! కాబట్టి మనము కూడా అనగా పరమ కనానుయాత్రలో ఉన్న విశ్వాసి సమూహములో ఉన్న ఎవరైనా సరే ఈ విగ్రహారాధన గాని వ్యభిచారం గాని చేస్తే ఇశ్రాయేలు ప్రజలవలె పిట్టల్లా రాలిపోతారు అని మర్చిపోవద్దు!!! ఇక్కడ రాలిపోతావు అంటే చనిపోతావు అని కాదు ఆధ్యాత్మికంగా మరణమైపోతావు! ఇకనీకు రక్షణ పొందే యోగ్యతను కూడా కోల్పోతావు కారణం నీవు హెబ్రీ 6:4--6 ప్రకారం ఒక్కసారి పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత దేవుని కుమారుని రక్తాన్ని మరల కల్లచూశావు గనుక నీకు పాప క్షమాపణ ఉండదు!!

 

కాబట్టి భయమునొంది పాపం చెయ్యవద్దు అనే దేవుని ఆజ్ఞను పాటించి ఈ పాపముల నుండి దూరంగా ఉందాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*73వ భాగము-సంఘము-సమస్యలు-27*

 

1కొరింథీ 10:612

6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.

8. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

9. మనము ప్రభువును (కొన్నిప్రాచీన ప్రతులలో- క్రీస్తును అని పాఠాంతరము) శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.

10. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులుచేసిన 5 గుంపుల కోసం చెబుతూ  రక్షించబడిన మనము చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు పౌలుగారు!

 

మొదటి గుంపు: చెడ్డవాటిని ఆశించిన వారు;

రెండు: విగ్రహారాదికులై అక్కడ తిని త్రాగారు!!

మూడు: వ్యభిచరించిన వారు;

నాలుగు: ప్రభువును శోధించిన వారు;

ఐదు: సణుగుల గుంపు;

వీరెవరు కనాను యాత్రలో గమ్యం చేరలేదు!

 

         (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక ఈ రోజు నాల్గవ గుంపు కోసం చూసుకుందాం!

నాలుగు: ప్రభువును శోధించిన వారు;

ఎప్పుడు ఎలా శోధించారు?

సంఖ్యా 21:4-9.

4. వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

7. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.

8. మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.

9. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

 

చూడండి: ఇక్కడ దేవుడు ఎందుకు పాములను పంపించాల్సి వచ్చింది అని ఆలోచిస్తే కేవలం వీరు ఒక్కసారి దేవుణ్ణి శోధించినందుకు కాదు, దేవుని శక్తిని పరీక్షిస్తున్నందుకు! దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడినందుకు!

గమనించండి: ఇది జరుగక ముందే ఐగుప్తు దేశంలో దేవుడు పది రకాలైన తెగుళ్ళతో ఐగుప్తీయులను నాశనం చేశారు! గాని అక్కడే ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఒక్క తెగులు కూడా సమీపించలేదు! అన్నింటికంటే చివరి తెగులు భయంకరమైనది ప్రధమ సంతానం మరణం: గాని దేవుడు పస్కా అనే బలి పశువు ద్వారా అనగా ఆత్మీయంగా క్రీస్తు అనే బలిపశువు అర్పణ ద్వారా వారిని రక్షించి విమోచించి ఐగుప్తు దాస్యము నుండి విడిపించి కనాను యాత్రలో పెడితే వీరు మాటిమాటికి దేవుని శక్తిని తక్కువచేసి మాట్లాడారు! దేవుణ్ణి శోధించారు!! మొదటగా ఎర్రసముద్రం ఎదురుగా వచ్చింది! వెనుకనుండి ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు- ఐగుప్తులో మాకు సమాధులు లేవనా ఇక్కడకు తీసుకుని వచ్చావు అన్నారు! అన్ని అధ్బుతాలు చూసిన వారు వెంటనే దేవునిమీద విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు! సరే, ఎర్రసముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలమీద నడిచి అవతలికి చేరితే మమ్మల్ని చంపడానికా ఇక్కడకి తీసుకొచ్చావు? మాకు ఆహరం ఏది అన్నారు! దేవుడు మన్నాను పంపితే ఇదేం ఆహారం, చవి చారాలు లేవు, మాకు మాంసం కావాలి అన్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మాకు నీళ్ళు లేవు అన్నారు! ఇలా మాటిమాటికి మోషేగారిమీద సణుగుకోవడం దేవుణ్ణి శోధించడం తప్ప మరొకటి వీరు చెయ్యలేదు! ఐగుప్తులో పది తెగుళ్ళు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, బండనుండి నీరు తెప్పించడం వంటి అసాధారణ అద్భుతాలే కాదు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ప్రతీరోజు ప్రతీక్షణం వారికి కాపలా ఉంటున్నారు కదా వీటన్నిటినీ చూస్తూ కూడా ఎందుకు వారు దేవునికి విధేయులుగా ఉండలేదు, ఎందుకు దేవుని శక్తిని మాటిమాటికి శోధించారు, పరీక్షించారు? అందుకే ఇలాంటి తాపకరమైన పాముల ఉగ్రత తీసుకుని వచ్చి పిట్టల్లా రాల్చేశారు దేవుడు! సొంత ప్రజలనే ఏరేస్తే నీవు నేను ఎంత? వారు దేవునికి స్వకీయజనము! తన స్వాస్త్యము అన్నారు! తన సొంత స్వాస్త్యాన్నే లెక్కచెయ్యకుండా తేడా వస్తే ఏరిపారేస్తే అంటుకట్టబడిన వారమైన మనలను కూడా ఏరిపారేసే అవకాశం ఉంది కాబట్టి భయమునొంది పాపం చెయ్యవద్దు!,....

Romans(రోమీయులకు) 11:17,18,19,20,21,22,23,24

17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటిమధ్యన అంటుకట్టబడి, ఒలీవచెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన

18. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.

19. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

20. మంచిది; వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు; *గర్వింపక భయపడుము*;

21. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు.

22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారిమీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న యెడల నీమీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము; అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడుదువు.

23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు.

24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత లీవచెట్టున అంటు కట్టబడరా?

 

కీర్తనలు 4: 4

*భయమునొంది పాపము చేయకుడి* *మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి* (సెలా.)

 

క్రైస్తవులలో సాధారణంగా కనిపించే భయంకరమైన పాపం ఇది. ఇలాంటి పాపం కనిపించిందా జాగ్రత్త! మాయదారి దేవుడా! నేనే దొరికానా? ఇంకెవరు దొరకలేదా అన్నావో అయిపోయావు జాగ్రత్త!!

ఈ దేవుణ్ణి శోధించిన గుంపు కనాను యాత్రలో కనాను చేరకుండా మధ్యలోనే అంతమైపోయారు! అలాగే పరమకనాను యాత్రలో ఉన్న నీవు దేవుణ్ణి శోధించావా జాగ్రత్త- నీవు కూడా అంతమైపోతావు!!!

 

ఇక చివరి గుంపు: సణుగుల గుంపు;

అన్నింటికంటే పరమ చెత్త గుంపు!! ఈ గుంపులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు! మాంసాపేక్షగలవారు ఉన్నారు! ఇంకా దేవునిచే ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు! అనగా ఆహారోను మిర్యాముకూడా ఉన్నారు! వీరిలో ఒకరు ప్రధాన యాజకునిగా దేవునిచే ఎన్నుకొనబడి అభిషేక తైలము తలమీద పోయబడిన వాడు, మరొకరు దేవుని ప్రవక్తిని మరియు దేవుని సన్నిధిలో గొప్ప గాయకురాలు, క్వయిర్ లీడర్!!

వీరు మోషేగారిమీద దేవుని మీద సణిగారు!! మధ్యలో రాలిపోయారు!

 

సంఖ్యా 14:1-4, 37;

1. అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.

2. మరియు ఇశ్రా యేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.

3. ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.

4. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా

22. నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.

23. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.

24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.

27. నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రా యేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.

28. నీవు వారితోయెహోవా వాక్కు ఏదనగానా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.

29. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.

34. మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.

37. అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.

 

16:41-49.

41. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి

42. సమాజము మోషే అహరోను లకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.

43. మోషే అహ రోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా

44. యెహోవా మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,

45.​​ క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.

46. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా

47. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

48. అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.

49. కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.

 

వారిని హతమార్చిన విపత్తును నాశనదూత తీసుకువచ్చాడు. బహుశా తమ స్థితిగతుల గురించి సణుక్కోవడం క్రైస్తవులు చేసే పాపాలన్నిటిలోకీ ఎక్కువగా కనిపించే పాపం. దేవుడు దీన్ని తేలికగా తీసుకోరు. చివరికి తన సేవకులను కూడా తేలికగా తీసుకోరు దేవుడు!

చూద్దాం: మిర్యాము ఆహారోనులకు ఏమయ్యిందో.....

Numbers(సంఖ్యాకాండము) 12:1,2,4,5,6,7,8,9,10

1. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీ నిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.

2. వారు మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా

4.​​ యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా

5. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.

6. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.

7. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.

8. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.

9. యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.

10. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీదనుండి ఎత్త బడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.

 

కాబట్టి దేవుని బిడ్డలకు వ్యతిరేఖంగా ఎవరు సణుగుకొన్నా దేవుడు వారిని ఊరుకోరు! సణుగుకున్న వ్యక్తి ఆ దైవసేవకునికి లేక దేవుని బిడ్డకు అన్నగాని, తమ్ముడు గాని, అక్క గాని, చివరికి భార్య గాని పిల్లలు గాని ఎవరినీ వదలడు దేవుడు! మోషే గారి అక్కని అన్నని దేవుడు వదలలేదు! దావీదు గారి సొంతభార్య మీకాలు దావీదుగారు దేవుని సన్నిధిలో నాట్యమాడినందున సణిగి మనస్సులో హీనపరచినందున జీవితాంతం పిల్లలు కనలేదు దావీదు గారికోసం! ఆమె గర్భమును మూసేశారు దేవుడు! దేవునికి పక్షపాతం లేదు! ఎవరినీ వదలరు! తనసొంత జనులు ఇశ్రాయేలు ప్రజలనే ఏరేశాడు! నిన్ను నన్ను ఏరేస్తాడు జాగ్రత్త!!

మరోసారి గుర్తుకు చేస్తున్నాను 1112 వచనాలలో ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ది కలుగుటకై వ్రాయబడ్డాయి కాబట్టి మనలను మనము ప్రతీరోజు పరీక్షించుకుని సరిచేసుకుని ముందుకుపోవాలి!

 

ఇక్కడ ఉదాహరణలుగా అంటే తన ప్రజల్లో ఆ నాడు దేవుడు వేటిని ద్వేషించాడో ఇప్పుడూ వాటినే ద్వేషిస్తున్నాడని మనకు తెలియాలని దేవుని ఉద్దేశం. రాత్రి తరువాత పగలు వచ్చినట్టుగా పాపం తరువాత శిక్ష తప్పకుండా వస్తుంది.

యుగాంతము ” అనగా క్రీస్తు మొదటి రాక గతంలోని యుగాలన్నిటినీ ముగించి కొత్త యుగాన్ని ఆరంభించింది. గత యుగంలో దేవుడు నేర్పిన పాఠాలను మనం నేర్చుకోవాలి.

 

ఇక 12వవచనం ఏమి చెబుతుంది అంటే ఒక మనిషికి తనపై నమ్మకం ఉండడం విపత్తుకు దారి తీయవచ్చు. మన ఆధిక్యతలు ఎంత గొప్పవైనా, మన పరిస్థితులు ఎంత అనుకూలమైనా, మనకెంత తెలిసినా, ఎంత అనుభవం ఉన్నా కూడా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఇంకా ఉంటుంది. ఎప్పుడూ మన బలహీనతలను గుర్తిస్తూ ప్రభువులో బలాన్ని పుంజుకొంటూ ఉండాలి. 9:27లో పౌలు చూపిన ఆదర్శాన్ని పాటించాలి.

 

కాబట్టి ఈ ఐదు రకాలైన పాపములు అనగా చెడ్డవాటిని ఆశించినా, విగ్రహారాధన చేసినా, వ్యభిచారం చేసినా, దేవుణ్ణి శోధించినా, దేవుని బిడ్డలమీద దేవుని మీద సణిగినా పరమకనాను యాత్రలో గమ్యాన్ని చేరలేవు సరికదా మధ్యలోనే అంతమైపోతావు జాగ్రత్త!

కాబట్టి భయమునొంది పాపం చెయ్యవద్దని ప్రేమతో యేసుక్రీస్తు పేరిట బ్రతిమిలాడుతున్నాను!

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*74వ భాగము-సంఘము-సమస్యలు-28*

 

1కొరింథీ 10:1314

13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరిఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.

14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులుచేసిన 5 గుంపుల కోసం చెబుతూ  రక్షించబడిన మనము చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణ చూసుకున్నాము!

 

ప్రియులారా! ఈ 1314 వచనాలలో పౌలుగారు మరో కోణంలో ఆ పాపములు అనగా ఇంతవరకు చూసుకున్న ఐదు రకాలైన పాపములు చెయ్య వద్దు అని చెబుతున్నారు! ఈ ఐదురకాలైన పాపములు ఒకవేళ సాతాను శోధన వలన కలిగితే శోధన జయించండి! ఇంకా వివరంగా చెప్పాలంటే దేవుడు మనుష్యులకు/ విశ్వాసులకు సాధారణముగా మనుష్యులకు కలిగే శోధనలు తప్ప మరో విధమైన శోధనలు కలిగించరు, అలాగే దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మీరు ఎంతవరకు సహించగలరో అంతటి శోధన కంటే పెద్ద శోధన మీ మీదకు రావడానికి ఆయన అనుమతినియ్యరు అంటూ శోధన కలిగినప్పుడు దానిని తప్పించుకునే మార్గము కూడా తప్పకుండా తనబిడ్డలకు ఆయన చూపిస్తారు అంటున్నారు! ఎందుకు ఈ శోధన కోసం వ్రాస్తున్నారు అంటే మీదన చెప్పిన ఐదు పాపాలు ఒకవేళ గనుక మిమ్మల్ని ఆహ్వానిస్తుంటే సాతాను ద్వారా నీలో అలజడి రేగి నీలో విగ్రహాల పట్ల ఆసక్తి, లేక వచ్చే శోధనలు శ్రమలు చూసి దేవుని మీద విసుగుకునే లాగ, దేవునిమీద నిష్టూరాలు వేసేలా దేవుణ్ణి శోదించేలా సాతానుగాడు నీ మదిలో అలజడి రేపితే లేక శరీర ఆశలు నీలో రేగి ధనాశ, వ్యభిచారము ఇంకా వివిధ పాపాలు నీలో చెయ్యాలని రేకెత్తిస్తే సాతాను గాడు అవకాశాలు కలిగిస్తే వాటిని జయించమంటున్నారు పౌలుగారు! వాటిని జయిస్తేనే నీకు బోలెడు కిరీటాలు గతభాగాలలో చెప్పుకున్నట్లు!!

 

ఒకసారి శోధన అనేదానికోసం ఆలోచిస్తే “పరీక్ష” గ్రీకు పదానికి దుష్‌ప్రేరేపణ అనే అర్థం కూడా ఉంది. అందరికీ వచ్చినట్టుగానే క్రీస్తు విశ్వాసులకు కూడా ఇలాంటివి వస్తాయి. కానీ ఇతరులకు లేని వాగ్దానం విశ్వాసులకు ఉంది. అది గొప్ప వాగ్దానం. విశ్వాసి ఎదిరించి నిలబడలేనంత ఆకర్షణ శక్తి, ప్రభావం గల దుష్‌ప్రేరేపణ గానీ పరీక్ష గానీ దేన్నీ వారికి కలగ నివ్వడు దేవుడు. దాని నుంచి తప్పించుకునే దారిని వారికి ప్రతిసారి తప్పకుండా కలిగిస్తాడు. ఆయన పూర్తిగా నమ్మదగినవాడు. అయితే ఆ దారిని మనం కోరాలి, దానికోసం చూడాలి. అలా కాని పక్షంలో ఆ దారి మనకు కనిపించకపోవచ్చు. మన ఎదుట ఉన్న పాపం మన కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించడంవల్ల ఆ దుష్‌ప్రేరేపణకు లేక శోధనకు లొంగిపోవాలని గనుక మనం కోరితే, అలానే పడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా మనం పాపంలో పడితే మనం ఎదిరించలేనంత గొప్ప పరీక్ష మనకు రానిచ్చాడని దేవుణ్ణి తప్పుపట్టకూడదు.

 

ఈ శోధన కోసం యాకోబు పత్రిక ధ్యానం చేసినప్పుడు విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!

యాకోబు 1:1215

12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.

14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. శోధనలను/ శ్రమలను/ పరీక్షలను చూసి పారిపోకూడదు, వాటిని సహించాలి అంటున్నారు. అలా సహిస్తే వారు దేవునిచేత ప్రేమించబడిన వారవుతారు తద్వారా దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు అంటున్నారు యాకోబు గారు!

 

ఇప్పుడు, ఇంకా రాబోయే రోజులలో కూడా  విశ్వాసుల మేలుకే శోధనలు/ శ్రమలు/ విషమ పరీక్షలు పని చేస్తాయి వ 24; అందుకే మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి అంటున్నారు యాకోబు గారు! అయితే అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం అనే జీవ కిరీటం పొందుకుంటారు అంటున్నారు. ఇప్పుడు నేను కిరీటం కోసం చెప్పడం లేదు కారణం గతంలో అనేకసార్లు ఈ కిరీటాలు కోసం మాట్లాడుకున్నాం! అయితే ఎవడైతే శ్రమలను శోధనలను ఈ విషమపరీక్షలను తట్టుకుని క్రీస్తుకోసం నిలిచి జయిస్తాడో వాడు మాత్రం జీవకిరీటం పొందుకుంటాడు అన్నమాట! అక్కడ కూడా పరీక్షలో నమ్మకంగా నిలిచినవారికి జీవ కిరీటాన్నిస్తానని ప్రభువు వాగ్దానం చేశారు. దానికి యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం అది.  “ప్రేమించేవారికి” విషమ పరీక్షల్లో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలా తోడ్పడే మానసిక శక్తి ఇదే!. ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం.

 

ఇంకా తర్వాత వచనంలో  దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు అంటున్నారు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మెరుగు పెడతాడు గానీ దుష్ట ప్రేరణ కలిగించడు.

మత్తయి 6:13 లో జవాబివ్వడానికి దేవునికి బహు ఇష్టమైన ప్రార్థన ఉంది.  ఏ చెడుతనమూ, ఏ పాపమూ కూడా దేవునికి లేశమాత్రమైనా ఇష్టం లేదు. చెడుతనాన్నంతటినీ పూర్తిగా, శాశ్వతంగా ఆయన అసహ్యించుకుంటాడు

 

బైబిల్ గ్రంధంలో గల గొప్ప వారు ప్రవక్తలు దైవజనులు అందరూ ఇలాంటి శోధనలను పరీక్షలను తట్టుకున్న వారే, అలా శోధనలకు నిలిచి సహించి అసాధారణమైన కార్యాలు చేయగలిగారు! వీరి కోసం ఇప్పుడు నేను జ్ఞాపకం చేయాలని అనుకోవడం లేదు! కేవలం వారి పేరులు చూసుకుందాం!

అబ్రాహాము గారు శోధనలు ఎదుర్కొన్నారు!

యోసేపు గారు- వ్యభిచారం అనే శోధన జయించారు! అయితే సంసోను గారు, దావీదు గారు వాటిని జయించలేకపోయారు!

దావీదు గారు గొల్యాతు అనే సాతాను శోధన ఎదుర్కొన్నారు! జయించారు!

యాకోబు గారు వెనుక మామ- ముందు అన్న- తనని అంతం చేయాలని చూస్తుంటే ప్రార్ధనతో మోకాళ్లమీద ఆ శోధన జయించారు!

దావీదు గారి జీవితాంతం ఎన్నో రకాలైన శ్రమలు శోధనలు- రాజుగా చక్రవర్తిగా మారినా చనిపోయే వరకు శోధనలే! చివరికి కన్న కొడుకు చంపుదామని బయలుదేరాడు అయినా ఓలిపోక సోలిపోక పాటలు పాడుతూ దేవునిలో ఆనందిస్తూ అన్ని శోధనలు జయించారు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఏలీయా గారు, ఎలీషా గారు, ఇంకా పాత నిబంధన భక్తులందరూ ఎన్నెన్నో శ్రమలనూ శోధనలను ఎదుర్కొన్నారు!! పాపం భక్తుడైన యిర్మియా గారు బ్రతుకంతా ఏడుస్తూనే బ్రతికారు! చేయని నేరానికి ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని అవమానాలు పొందుకున్నారో? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షను పొందుకున్నారో!! అయినా దేవుణ్ణి విడువలేదు! చివరికి తన సొంతవారు ఆయనను రాళ్ళు రువ్వి చంపేశారు! అయినా విశ్వాశాన్ని వదలలేదు ప్రాణం పోయేవరకు!!

 

    దానియేలుగారికి శోధన వచ్చింది! 84 సంవత్సరాల వయస్సులో ఆయనను సింహాలబోనులో వేసేశారు ఏ తప్పు చేయకుండా! కేవలం ప్రార్ధిస్తూ గడిపారు! తన ప్రార్ధన సింహాల నోళ్లను మూసింది. ప్రార్ధన ద్వారా శ్రమలను జయించారు! ప్రపంచానికి దేవున్ని పరిచయం చేశారు.

షడ్రక్ మేషక్ అబెద్నెగోలకు భయంకరమైన శోధన వచ్చింది. బంగారమ్మను మ్రొక్కమన్నాడు చక్రవర్తి, మేము మ్రొక్కమన్నారు, చావడానికి సిద్దమన్నారు! అగ్నిగుండములో త్రోయబడ్డారు! అక్కడున్న వారందరికీ భగవంతుని ప్రత్యక్షత కలిగించారు! నా చేతిలోనుండి తప్పించగలిగిన దేవుడెవడైనా ఉన్నాడా అన్న నోటితోనే జీవముగల దేవుని సేవకులారా అని చెప్పి, ఇవ్విధముగా రక్షించగలిగిన దేవుడెవరూ లేరని పలికించారు! గొప్ప అధికారులు కాగలిగారు!

 

ఇక క్రొత్త నిబంధన  భక్తులందరూ దెబ్బలు శ్రమలు శోధనలు అవమానాలు పొందుకున్న వారే!

 

అంతెందుకు? యేసుక్రీస్తుప్రభులవారే ఎన్ని శ్రమలు శోధనలు అనుభవించారో కదా! తన చిన్నతనంలో తండ్రిలేకుండా పుట్టినోడు అంటూ అవమానించారు! తానూ సేవచేసిన మూడున్నర సంవత్సరాలు ఎన్నెన్నో అవమానాలు చీత్కారాలు పొందారో? పరిచర్య ప్రారంభించాక ముందు సాతాను గాడితో శోధన పరీక్ష అనుభవించారు! చివరకు 39 కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, అవమానాలు, ముళ్ళకిరీటం, సిలువమరణం, మూడు మేకులు ఇవన్నీ పొందారు అనుభవించారు! మరణాన్ని జయించారు! అందుకే పరలోక అధిపతి అయ్యారు! భూమిమీదను పాతాళమందును ఆకాశమందును సర్వాధికారం పొందుకున్నారు! పౌలుగారు అంటున్నారు....

Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8,9,10,11

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

చివరికి శ్రమల ద్వారా తాను సంపూర్ణత సాధించి మనలను సంపూర్ణులుగా చేస్తున్నారు!

 

పేతురు గారు ఎన్ని శ్రమలను శోధనలను అనుభవించారు? పౌలుగారు ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు పత్రికలో రాస్తున్నారు!..

 

అయితే ఇవన్నీ అనుభవించాక తిమోతి గారికి చార్జి అప్పగిస్తూ అంటున్నారు: మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుద ముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక నాకొరకు నీతికిరీటం ఉంచబడింది అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు! యాకోబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి సరిగ్గా పౌలుగారు చెబుతున్నారు నా కొరకు నీతికిరీటం ఉంచబడింది!

2తిమోతి 4:7--8

 

మరినీవు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చే స్తితిలో ఉన్నావా?

 

శ్రమలు శోధనలు లేకుండా నీకు ఆధ్యాత్మిక దీవెనలు, వరాలు ఫలాలు లేవు! పరీక్ష లేకుండా నీవు డిగ్రీ పొందుకోలేవు, ఉద్యోగం పొందుకోలేవు! యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల బాటలో సంపూర్ణత సాధించారో నీవుకూడా ఆ బాటలోనే సంపూర్ణత సాధించగలవు! సంపూర్ణత మరియు జయజీవితం లేకుండా నీవు ఎత్తబడలేవు!

 

చూడండి!  ఒక చెక్క- ఎన్నో ఉలి దెబ్బలను సుత్తి దెబ్బలను తిని ఓర్చుకున్నాకనే మంచి వస్తువుగా లేక విగ్రహంగా తీర్చబడుతుంది! అలాగే ఒక రాయి ఎన్నెన్నో సుత్తి సేనం ఉలి దెబ్బలను తింటుంది బహుశా కొన్ని లక్షల దెబ్బలు తింటుంది. చివరికి అందమైన ఒక రూపానికి వస్తుంది! ఆ రూపానికి రావడానికి అది ఎన్నో శ్రమలను దెబ్బలను తిన్నది ఈరోజు ప్రజలందరూ దానిని చూసి ఆహా ఓహో అంటున్నారు!

అదే విధంగా ఒక కుండ అది ఆ రూపానికి రావడానికి ఎన్నెన్నో శ్రమలను ఎదుర్కొంది! పిసకబడింది, బాధపడింది,  దెబ్బలు తింది, కాల్చబడింది! ఆ తర్వాతనే అది వాడబడుతుంది! నీవుకూడా దేవునిచేత వాడబడాలి అంటే తప్పకుండా ఈ దెబ్బలు శ్రమలు శోధనలు అనుభవించాలి!

 

మరి నీవుకూడా దేవునిచేత వాడబడతావా? అయితే శ్రమలను ఓర్చుకో!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*75వ భాగము-సంఘము-సమస్యలు-29*

 

1కొరింథీ 10:1422

14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.

15. బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి

16. మనము దీవించు ఆశీర్వచనపు (గిన్నె) పాత్రలోనిది (లేక, మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది) త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?

17. మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము.

18. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?

19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?

20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.

21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.

22. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను ఉదాహరణగా చూపిస్తూ వారు చేసిన 5 రకాలైన తప్పులుచేసిన 5 గుంపుల కోసం చెబుతూ  రక్షించబడిన మనము వాటిని చేయకూడదని వారి జీవితాన్ని మనకు ఉదాహరణ చూసుకున్నాము!

ఇక మరలా 1422 వచనాలలో ఎనిమిదో అధ్యాయంలో మొదలుపెట్టిన విగ్రహాలకు సంబంధించినవి అర్పించినవి మనము తినవచ్చా? విగ్రహాలు గల ఆలయాలకు మనము వెళ్లవచ్చా అనే ప్రశ్న దగ్గరకు వచ్చేస్తున్నారు!

ఈ భాగంలో అనగా 1422 లో పౌలుగారు  ప్రభురాత్రి భోజనం, విగ్రహాల సమక్షంలో విందు గురించి మాట్లాడుతున్నారు. మొదటిదానిలో పాల్గొన్నవారు రెండోదానికి దూరంగా ఉండాలి. విగ్రహం సమక్షంలో, లేక విగ్రహాలున్న గుడిలో విందులో పాల్గొనడం విగ్రహ పూజే. అంటే దయ్యాలతో కలిసిమెలిసి ఉండడమన్న మాట. అలాంటి వారు ప్రభు రాత్రి భోజనమును ఎట్టిపరిస్తితులలోను తీసుకోగూడదు అని ఇక్కడ పౌలుగారి అభిప్రాయం!

 

14వ వచనంలో అంటున్నారు- కాబట్టి నాప్రియులారా మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నారు! దూరంగా పారిపోండి అనే మాటలు పౌలుగారు తిమోతి గారికి ఇంకా కొరింథీ సంఘానికి కొన్నిసార్లు రాశారు! శరీర కార్యాలకు దూరంగా పారిపో అన్నారు తిమోతి గారితో! ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండమన్నారు!  ఇక్కడ విగ్రహారాధనకు దూరంగా పొమ్మని చెబుతున్నారు!

 

1యోహాను 5: 21

చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.

 

 కొన్నిటినుంచి విశ్వాసులు అదేపనిగా పారిపోవాలి. ఎంత దూరం వీలైతే అంత దూరంగా ఉండాలి.

 

1కోరింథీయులకు 6: 18

జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

 

నేను బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను ఒకసారి నేను చెప్పే సంగతులు ఆలోచించండి అంటూ 1620 వచనాలలో విగ్రహాలకు- ప్రభురాత్రి భోజనమునకు మధ్య గల తేడా వివరిస్తూ విగ్రాహారాదనలో పాల్గొన్న వారు, అక్కడ భోజనం చేసిన వారు దేవుని పరిశుద్ధమైన ఆహారమును అనగా ప్రభురాత్రి భోజనం అని చెప్పబడే దేవుని శరీరాన్ని ఆయన రక్తమును ఎలా తీసుకుంటారు అని అడుగుతున్నారు.... 1620 ..

16. మనము దీవించు ఆశీర్వచనపు (గిన్నె) పాత్రలోనిది (లేక, మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది) త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?

17. మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమైయున్నాము.

18. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?

19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?

20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.

21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.

 

మనము రొట్టె ద్రాక్షారసము తీసుకోవడం దేవుని శరీరంలో పాలుపంచుకోవడమే కదా, ఆయన రక్తాన్ని త్రాగడమే కదా అలాంటప్పుడు అలా రొట్టేలో ద్రాక్షరసములో పాలుపంచు కున్నవారు దేవునితో ఒక్క శరీరమై యన్నారు కదా!  అలాగే ఇశ్రాయేలు యాజకులు బలిపీటం మీద అర్పించే ప్రతీ అర్పణకు ఎలా పాలివారై ఉన్నారో అలాగే విగ్రహాలకు అర్పించే వారు వాటితో పాలివారై ఉన్నారు కదా, అలాంటప్పుడు వారు అర్పించేవి విగ్రహాలకు అనగా దయ్యాలకు! వాటిని ఎలా మీరు తింటున్నారు అని అడుగుతున్నారు!

గమనించాలి: మత్తయి 26:26-28లో యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభురాత్రి భోజనం దగ్గర చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఈ వచనాలను  అర్థం చేసుకోవాలి. యోహాను 6:53-58, 63 కూడా చూడండి.

ఇక “సహవాసం” చెయ్యడమంటే క్రీస్తు రక్తంలో, శరీరంలో ఆధ్యాత్మికంగా వంతు పుచ్చుకోవడం. రొట్టెను, ద్రాక్షరసాన్ని పుచ్చుకుంటూ ఆత్మలో క్రీస్తుతో సహవాసం చేస్తాం. ప్రభురాత్రి భోజనంలో రొట్టె, ద్రాక్షరసం అనేవి ప్రభువుతో విశ్వాసులకున్న సంబంధానికి చిహ్నాలు . వారికోసం ఆయన మరణించాడని వారికి అవి గుర్తు చేస్తుంటాయి. నమ్మకం ద్వారానే వారు ఆ మరణంలో పాలిభాగస్థులు. మనకోసం మరణించిన క్రీస్తుతో సహవాసం చేసే ఆచారమే ప్రభురాత్రి భోజనం. ఆయన మనల్ని విమోచించారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే సమావేశం.

 

వారు ప్రభురాత్రి భోజనంలో సాధారణంగా ఒకే రొట్టెను ఉపయోగించేవారు. విశ్వాసులు ఒకే రొట్టెలోది తింటున్నారు గనుక ఒకే శరీరంగా తాము ఉన్నామని సూచిస్తున్నారు (12:12-13).

 

 ఇక ఇశ్రాయేలు యాజకులు అర్పణల కోసం మనకు  లేవీ 7:15; 8:31; ద్వితీ 12:18 లో కనిపిస్తుంది. బలి మాంసం తినడం “బలిపీఠంతో భాగస్థులు” చేయడమే. క్రీస్తు రక్తం, శరీరంలో సహవాసం చేయడం (వ 16) అనే మాటల గురించి ఈ వచనం మరి కొంత విశదీకరిస్తున్నది. బలిపీఠంలో సహవాసం చేయడం అంటే బలిపీఠాన్ని తినడం కాదు గదా. బలిపీఠంతో దానిపై ఉన్న అర్పణలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడమని దీని అర్థం. అందులో భాగం పుచ్చుకున్న వారందరితోను, బలిపీఠం దేన్ని సూచిస్తున్నదో దానంతటితోనూ ఒక సహవాసాన్ని అది సూచిస్తున్నది.

 

-18వ వచనం లోని రెండు ఉదాహరణలను ఇవ్వడంలో పౌలుగారు  చెప్పదలచుకున్న సత్యం ఇదే. క్రీస్తులో పాలుపుచ్చుకోవడం అంటే అలా చేసే ఇతరులతో సహవాసం చేయడం, క్రీస్తు చేసిన అర్పణలోని అర్థాన్నంతటినీ స్వీకరించడం. ఇదే విధంగా విగ్రహాల సమక్షంలో, లేక విగ్రహాలున్న గుడిలో విందుకు కూర్చోవడం అంటే ఆ అబద్ధ పూజా వ్యవస్థ అంతటిలో పాలుపుచ్చుకోవడమే, పిశాచాలతో వంతు పుచ్చుకోవడమే.

 

విగ్రహాలు వట్టివే. కానీ ఆ విగ్రహాల వెనుక దయ్యాలున్నాయి (8:5లో ఉన్న దేవుళ్ళు, ప్రభువులు ఇవే). వాటిని పూజించేవారు తాము దేవునికి అర్పణలు ఇస్తున్నామను కోవచ్చు (అనుకోకపోవచ్చు), గానీ వారు ఉనికిలో ఉన్న ఏకైక నిజ దేవునికి అర్పణలు ఇవ్వడం లేదు. ప్రపంచంలో అనేకమంది చేసే పూజలకు సంబంధించే ప్రాముఖ్యమైన సత్యం ఇది. ద్వితీ 32:17  చూడండి. విగ్రహాలకు అర్పించిన ఆహారం తినడం వాటి వెనుక ఉన్న దయ్యాలతో సహవాసం చేయడమే. వాటికి చేసిన పూజలతో కొంతవరకైనా ఏకీభవించడమే.

 

10:21లో అంటున్నారు మీరు ప్రభువు బల్లలోను లేక ప్రభువు పాత్రలోనూ దయ్యాల పాత్రలోనూ రెండు కలిసి తీసుకోకూడదు అంటున్నారు!  “ప్రభువుకు చెందిన బల్ల” అంటే ప్రభురాత్రి భోజనం. అక్కడ ఆయన విందు చేసే యజమాని. విశ్వాసులు ఆ విందు ఆరగించే అతిథులు. ఇలా చెప్పడం ద్వారా ఈ రెంటినీ కలపడం విశ్వాసులకు ఎంత అసాధ్యమో పౌలుగారు  తెలుపుతున్నారు. విగ్రహాల విందులో పాల్గొనడం వల్ల ఏమీ కాదులే అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో చూపిస్తున్నారు.

 

చివరిగా 22వ వచనంలో అంటున్నారు: అలా చేస్తే ప్రభువుకు రోషం అనగా కోపం పుట్టిస్తాము అంటున్నారు! దేవునితో వైరము పెట్టుకుని మనం బ్రతకగలమా ఆలోచించండి!!!

నిర్గమ 20:5; ద్వితీ 32:21; కీర్తన 78:58.

 

 దేవుడు నిషేధించిన దాన్ని మనం చేయగలిగేటంత బలవంతులమని అనుకోవచ్చా? ఆయన కోపం రేగినప్పుడు నిలబడగలమా?

 

కాబట్టి ఇటువంటి విగ్రహారాధన నుండి వాటికి అర్పించిన వాటినుండి దూరంగా ఉందాం!

ఆ ఆలయాలకు వెళ్ళవద్దు!

వారి పండుగలకు వెళ్ళవద్దు!

మనకు ఎంతటి దగ్గర బంధువులైనా అన్యుల ఆలయములలో అనగా అన్నవరం తిరుపతి లాంటి గుడులలో వివాహాలు జరిగితే ఎట్టిపరిస్తితులలో వెళ్ళవద్దు!

అలా వెళ్తే దేవునికి కోపం పుట్టిస్తావు, దేవుని ఉగ్రతను చేతులారా కొని తెచ్చుకొంటావని మర్చిపోవద్దు!

 

దైవాశీస్సులు!!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*76వ భాగము-సంఘము-సమస్యలు-30*

 

1కొరింథీ 10:2333

23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.

29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

30. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

32. యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 ప్రియులారా! ఇక మరలా 1422 వచనాలలో ఎనిమిదో అధ్యాయంలో మొదలుపెట్టిన విగ్రహాలకు సంబంధించినవి అర్పించినవి మనము తినవచ్చా? విగ్రహాలు గల ఆలయాలకు మనము వెల్లవచ్చా అనే ప్రశ్నకు  జవాబులు చెబుతున్నారు పౌలుగారు!

 

23వ వచనంలో అన్నిటిలో నాకు స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఉన్నాయి గాని అన్నీ ప్రయోజనకరమైనవి కావు! దేవుడు ఏ విషయంలో నీకు నిర్బంధము కలిగించరు అని 6:12 లో రాసినదే మరల చెబుతున్నారు! ఇది ఇప్పుడు మరలా ఎందుకు చెబుతున్నారు అంటే క్రిందన వ్రాసిన విషయాలకు ఉపోద్ఘాతముగా చెబుతున్నారు! మనకు దేవుడు స్వేచ్చ స్వాతంత్ర్యము ఇచ్చినా గాని వాటిని మన స్వప్రయోజనము కోసం కాకుండా మన పొరుగువారు మనతో ఉన్నవారు అందరూ లేక ప్రతీ ఒక్కరు క్షేమాభివృద్ది పొందేలా ఉండాలి అవసరమైతే మన స్వేచ్చను అధికారమును స్వాతంత్ర్యమును త్యాగం చెయ్యాలి- ఆ త్యాగం ఇతరులకు క్షేమం కలిగిస్తాది అంటే అని ఆరవ అధ్యాయంలో రాసిన మాటలను మరలా చెబుతున్నారు!

తిరిగి ఈ ప్రాముఖ్యమైన నియమాన్ని చెప్తున్నారు  పౌలుగారు 

1కోరింథీయులకు 6: 13

భోజనపదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి; దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే.

 

రోమీయులకు 14: 19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో- వెంటాడుదము) .

 

Romans(రోమీయులకు) 15:1,2,3

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

 

యోహాను 13: 34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

ఇక 25వ వచనంలో మనస్సాక్షి నిమిత్తము ఏ విధమైన విచారణ చేయకుండా కటికవాని అంగడిలో అనగా మాంసం దుకాణంలో అమ్మిన మాంసం తినవచ్చు అంటున్నారు! ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే అని కీర్తనల గ్రంధం 24:1 లో వ్రాయబడిన విషయాన్ని ఇక్కడ ఎత్తి రాస్తున్నారు!....

కీర్తనలు 24: 1

భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.

 

అయితే ఇక్కడ మాంసం దుకాణంలో అమ్మిన మాంసము విచారణ చేయకుండా తినెయ్యమని చెబుతున్నారు! గాని కొంచెం లోతుగా ఆలోచిస్తే పూర్వకాలంలో ఆరోజులలో విగ్రహాలకు బలి ఇచ్చిన మాంసము, మాంసం దుకాణాలలో అమ్మేసేవారు! ఎందుకు అమ్మేవారు అంటే వారి పండుగలలో ఇంకా చాలా సందర్భాలలో వారికి విగ్రహాలకు బలి ఇవ్వడం ఆచారం! కాబట్టి రోజూ అనేక బలులు అర్పించేవారు! వాటిని తినడానికి వారికి అయ్యేది కాదు అందుకే వారు మాంసం దుకాణంలో అమ్మేసేవారు! ప్రజలు బలి మాంసం అని ప్రత్యేకంగా వాటిని కొని తినేవారు! అయితే క్రైస్తవులమైన మనకు లేక క్రైస్తవులైన కొరింథీ వారికి పౌలుగారు ఏమని చెబుతున్నారు అంటే మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మాంసం దుకాణాలలో అమ్మిన మాంసం తినేయ్యండి ఎందుకంటే సమస్త భూమి మరియు దానిలో ఉన్నవన్నీ దేవునివే కదా! అందువలన తినినా పర్వాలేదు అంటున్నారు! గాని 2729 వచనాలలో చెబుతున్నారు: ఒకవేళ ఎవడైనా మీరు కొని తింటున్న ఆ మాంసం విగ్రహాలకు బలి ఇచ్చిన మాంసం అని ఎవడైనా మీకు చెబితే మనస్సాక్షి నిమిత్తం ఆ మాంసం తినడం మానెయ్యండి అంటున్నారు! ఎవరి మనస్సాక్షి అంటే మీమనస్సాక్షి నిమిత్తం కాకుండా ఆ మాంసం బలి ఇచ్చిన మాంసం అని మీతో చెప్పిన విశ్వాసి యొక్క మనస్సాక్షి నిమిత్తం ఆ మాంసం తినడం మానెయ్యండి అంటున్నారు!

గమనించాలి: ఇక్కడ పౌలుగారు చెబుతున్న మాంసం మనము దుకాణం నుండి తెచ్చుకుని ఇంట్లో వండుకునే  భోజనం గురించిన మాట ఇది, గుడిలో జరిగే పండుగల విందు మరియు పెండ్లి విందు గురించి కాదు. విగ్రహాల గుడిలో విందుల్లో విశ్వాసులు పాల్గొనకూడదని పౌలుగారు ముందే చెప్పారు!

 

ఇక తర్వాత వచనాలలో ప్రభువుని నమ్మని అవిశ్వాసి ఎవరైనా మిమ్మును విందుకు పిలిస్తే వెళ్ళండి, అప్పుడు అతడు ఏమి పెట్టినా తినేయ్యండి, గాని ఎవరో విశ్వాసి ఇది బలి ఇచ్చిన మాంసం అని చెబితే మరలా అలా చెప్పిన విశ్వాసి యొక్క మనస్సాక్షి నిమిత్తం ఆ మాంసం తినడం మానెయ్యమంటున్నారు! ఇక్కడ పౌలుగారు మీ బందువుల ఇంట్లోను స్నేహితుల ఇళ్ళలోనూ విందులకు వెళ్ళవద్దు అని చెప్పడం లేదు! వెళ్ళవచ్చు గాని అవి త్రాగుబోతుల విందులు అయితే వెళ్ళకూడదు! ఇది బైబిల్ చెబుతుంది...

1పేతురు 4: 3

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును,

 

మామూలు విందులకు వెళ్ళవచ్చు, అయితే ఎవరైనా అది విగ్రహాలకు బలి ఇచ్చినవి లేక మూల పెట్టినవి అని చెబితే తినవద్దు అంటున్నారు!

 

ఇక్కడ దయచేసి నా అభిప్రాయం కూడా చెప్పనీయండి!! పౌలుగారు మాంసం దుకాణంలో అమ్మిన మాంసమును సందేహం లేకుండా తినెయ్యమని చెబుతున్నారు, క్రింద వచనాలలో ప్రార్ధనచేసి ఏది తినేసినా పర్వాలేదు అని చెబుతున్నారు! అయితే నా ఉద్దేశం ఏమిటంటే ఏ మాంసం అయినా తినెయ్యవచ్చు గాని పందిమాంసం (Pork-The meat of a Pig) మాత్రం క్రైస్తవులు తినకూడదు అని నా అభిప్రాయం! ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా!! ఎందుకంటే దేవునికి పంది అంటే అసహ్యం! అందుకే పందిమాంసం తింటూ నా మీద తిరుగుబాటు చేశారు అంటున్నారు యెషయా 65:4.

వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి

 

అదంటే దేవునికి చాలా అసహ్యం!

రెండవది: సుమారుగా క్రీ.పూ 168 లో అంతియోకస్ అఫిఫానిస్ అనేవాడు యేరూషలేము దేవాలయమును పాడుచెయ్యడానికి ఒకసారి నాశనకరమైన హేయవస్తువుగా దేవాయములో బలిపీటం మీద పందిని అర్పించాడు ఆ రక్తాన్ని దానిమీద చిందించాడు! ఆ రకంగా అప్పుడు దేవాలయం అపవిత్ర పరచబడింది! అదేవిధంగా మరలా మహాశ్రమల కాలంలో నాశనకరమైన హేయవస్తువుగా పందినే  ఇశ్రాయేలు దేశంలో యేరూషలేములో మందిరం కట్టబడిన తర్వాత క్రీస్తు విరోధి ద్వారా బలి అర్పించబడుతుంది అని అనేక బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈ రెండు కారణాల ద్వారా పంది అనేది దేవునికి అసహ్యమైన జంతువూ, దాని మాంసం క్రైస్తవులు తినకూడదు! అది ఊరపంది గాని, ఫారం పంది గాని, అడవి పంది గాని! పంది పందే కాబట్టి క్రైస్తవులు పందిమాంసం అనగా Pork తినకూడదు! ఇది నా అభిప్రాయము!!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*77వ భాగము-సంఘము-సమస్యలు-31*

 

1కొరింథీ 10:2333

23. అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.

26. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.

27. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి.

28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.

29. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?

30. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?

31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.

32. యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

     ప్రియ దైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

 ప్రియులారా! ఇక మరలా 1422 వచనాలలో ఎనిమిదో అధ్యాయంలో మొదలుపెట్టిన విగ్రహాలకు సంబంధించినవి అర్పించినవి మనము తినవచ్చా? విగ్రహాలు గల ఆలయాలకు మనము వెల్లవచ్చా అనే ప్రశ్నకు  జవాబులు చెబుతూ అంగడి వాణి దుకాణంలో అమ్మే మాంసం సందేహం లేకుండా తినేయ్యమని చెబుతున్నారు!

 

      (గతభాగం తరువాయి)

 

తర్వాత వచనాలలో మీరు దేని చేసినా అనగా భోజనం చేసినా పానము చేసినా ఏ పని చేసినా అది సమస్తమును దేవుని మహిమకోసమే చెయ్యాలి అంటున్నారు!

 

దీనిని ధ్యానం చేసేముందు ఒకమాట గుర్తు చెయ్యనీయండి-

28వ వచనంలో అంగడి వారి దుకాణంలో అమ్మినవి తినేయమన్నారు కదా అని విగ్రహాలకు అర్పించినవి ఒకవేళ తినేసినా పర్వాలేదు అనుకుంటున్నావేమో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ భోజనం తినే విశ్వాసి విగ్రహపూజ అంతగా పట్టించుకోవలసిన సమస్య కాదులే అన్న భావాన్ని ఇతరులకు కలిగించవచ్చు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. అక్కడ మరో విశ్వాసి ఉన్నాడనుకోండి. విగ్రహాలకు అర్పించినది ఎక్కడ తిన్నా తప్పేనని (8:7) ఆ విశ్వాసి స్థిరంగా అనుకొన్నప్పుడు  ఆ విశ్వాసి యొక్క మనస్సాక్షికి  మొదటి విశ్వాసి ప్రవర్తన కలవరం కలిగిస్తుంది. అందుకే వాటిని తినడం మానెయ్యాలి!

అంతేకాకుండా విగ్రహానికి అర్పించిన మాంసాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తినకూడదని నమ్మే విశ్వాసి, తనను ఆహ్వానించిన ఇళ్ళల్లో అయితే తినేందుకు తనకు స్వేచ్ఛ ఉందని నమ్మే విశ్వాసిని దోషిగా ఎంచే అవకాశం ఉంది. ఇలా జరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛను అలా ఉపయోగించుకోకపోవడం మంచిదని పౌలుగారు  చెప్తున్నారు.

 

ఇక మరలా ఏమిచేసినా దేవుని మహిమకోసమే చెయ్యండి అనేది విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన ఒక గొప్ప నియమము!!!. ఇంతకన్నా ఉత్తమమైన ఉద్దేశం లేదు. విశ్వాసులంతా దీని ప్రకారం జీవిస్తే సంఘంలో చీలికలు, గుంపులు ఉండవు. విశ్వాసుల్లో అవినీతి ఉండదు, ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు. ఇతరుల్ని అనాలోచితంగా బాధపెట్టే పనులు ఉండవు. మన చర్యలన్నిటినీ ఈ సూత్రం వెలుగులో పరీక్షిస్తూ ఉంటే, ఫర్వాలేదులే అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం.

అంతేకాదు- దీనిని మనకు మనముగా ఆచరణలో పెడితే పాపం చెయ్యము! ఎందుకంటే ప్రసంగీ 11:9 లో అంటున్నారు యవ్వనుడా నీకు నచ్చింది మెచ్చింది నీవు చేసేయ్! గాని దీనికోసం దేవుడు నిన్ను లెక్కలోనికి తీసుకుని వస్తారు అంటున్నారు! కాబట్టి మనము ఏదైనా చెయ్యవచ్చు, ఏదైనా తినవచ్చు అయితే అది దేవునికి మహిమను తీసుకుని వస్తుందా లేదా అనేది ఆలోచించి అప్పుడు చెయ్యాలి అన్నమాట!!...

ప్రసంగి 11: 9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

 

అందుకే ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ పౌలుగారు అంటున్నారు:4:8 లో పరలోకం వెళ్ళడానికి ఏవి కావాలో చెబుతున్నారు...

ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటిమీద దృష్టి నిలిపి వాటినే చెయ్యమంటున్నారు.

 

*సమాన్యాపరఖ్యా* అంటే 

*సత్యమైనవా, 

*మాన్యమైనవా, 

*న్యాయమైనవా, 

*పవిత్రమైనవా, 

*రమ్యమైనవా, 

*ఖ్యాతిగలవా 

అని ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలి! దీనికోసం నీ చూపు దేనివైపు అనే శీర్షికలో విస్తారంగా ధ్యానించడం జరిగింది. లింక్ .. చూడండి!

 

ఇక చివరి వచనాలలో అంటున్నారు మీరు ఏమి చేసినా చెయ్యండి గాని ఆ చేసినవి ఎవరికీ అభ్యంతరం కలుగజేయకుండా చూసుకుని చేయండి అంటున్నారు! ఇంకా ఇతర సంఘాలకు గాని దేవుని బిడ్డలకు గాని తోటి విశ్వాసులకు గాని అభ్యంతరం కలుగకుండా చూడండి అంటున్నారు! ఉదాహరణ 5:1 లో చెప్పిన విషయం ఒకడు తన పిన్నితో పాపం చేస్తున్నాడు, అది సంఘమంతటికీ అభ్యంతరకరమైనది దేవునికి చెడ్డపేరు తీసుకుని వచ్చేది. కాబట్టి అలాంటి పనులు చేయవద్దు అంటున్నారు! ఇలాగు మన స్వప్రయోజనం కోసం కాదు గాని అనేకులు రక్షించబడేలాగా అన్నివిషయాలను చెయ్యాలి అంటున్నారు!

 

రోమా 8:9, 13;  రోమా 14:13, 20, 21. వ 31 ప్రకారం జీవిస్తే దీన్ని కూడా నెరవేర్చిన వారమౌతాము.

 

తాను స్వయంగా అనుసరించడానికి సిద్ధపడని జీవిత విధానాన్ని పౌలుగారు  వారిముందు ఉంచడం లేదు.

 

2తిమోతికి 2: 10

అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.

 

 స్వార్థపరులు, తమ విషయాలే ఆలోచించుకునేవారు అలాంటి మార్గాన్ని కోరతగినదిగా ఎంతమాత్రం ఎంచరు. అయితే మనశ్శాంతి, దేవునిలో ఆనందం, శాశ్వత బహుమానం తీసుకువచ్చే జీవితం, అన్ని జీవిత విధానాల్లోకీ ఉన్నత స్థాయి జీవితం ఇచ్చే మార్గము పౌలుగారు చెబుతున్నారు!

 

కాబట్టి మనము కూడా ఇతరులకు ప్రయోజనం కలిగించేవి అనేకులను క్రీస్తువైపు నడిపించేవి పనులను చేస్తూ దేవునికి గాని సంఘానికి గాని అభ్యంతరము కాని పనులను చేస్తూ దేవునిలో సాగిపోదాం!

 

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*78వ భాగము-సంఘము-సమస్యలు-32*

 

1కొరింథీ 11:16

1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

2. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను (లేక, పారంపర్యములను) గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.

3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

4. ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.

5. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.

6. స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో రెండు సమస్యలకోసం చెబుతున్నారు!

మొదటిది: స్త్రీ ప్రార్దించినప్పుడు ముసుగు వేసుకోవడం!!

రెండు : ప్రభురాత్రి భోజనం లేక ప్రభువు బల్ల లేక ప్రభు సంస్కారం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు!!

 

ప్రియులారా! 11:౩16 వచనాలు స్త్రీలు ప్రార్ధనలో ముసుగువేసుకోవడం కోసం పౌలుగారు విస్తారంగా చర్చిస్తూ రాస్తున్నారు!

 

ఇక మొదటి రెండు వచనాలలో అంటున్నారు: నేను క్రీస్తును పోలి నడుచుకొన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు! నిజానికి ఇలా అనడానికి చాలా ధైర్యము కావాలి! పౌలుగారు క్రీస్తును పోలి నడుచుకున్నారు! క్రీస్తువలే నిందలేని మచ్చలేని జీవితం జీవించారు! క్రీస్తువలే శ్రమల బాటలో నడిచారు! క్రీస్తువలే హతస్సాక్షి అయ్యారు! క్రీస్తువలే తన జీవితం పానార్పముగా అర్పించారు! అందుకే ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్నుపోలి నడుచుకోండి అంటున్నారు! ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి!

నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలుగారిని పోలి నడుచుకోవడం అని అర్ధం కాదు, పౌలుగారు క్రీస్తును పోలి ఎలా నడచుకున్నారో అలాగే మనము కూడా పౌలుగారి వలే క్రీస్తును పోలి నడుచుకోవాలి అని అర్ధం!!!

పౌలుగారు తన పత్రికలలో ఈ మాట చాలాసార్లు రాశారు!

 

1కోరింథీయులకు 4: 16

క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

 

ఫిలిప్పీ 3:17;

సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.

 

తన ఆదర్శాన్ని పాటించడం ఎందువల్ల మంచిదో పౌలుగారు ఇక్కడ తెలియజేస్తున్నారు. క్రీస్తు జీవించిన విధంగా జీవించేలా దేవుడు తనకు సమర్థత ఇచ్చారు. నిజానికి అతనిలో జీవిస్తున్నది క్రీస్తే (గలతీ 2:20). పౌలు ఆదర్శాన్ని అనుసరించే శక్తిసామర్థ్యాలు ఎవరికైనా కలగాలంటే అదొక్కటే మార్గం.

 

ఇక రెండవ వచనంలో అలాగే మీరుకూడా అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసికొంటూ నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని నేను మిమ్ములను మెచ్చుకుంటున్నాను అంటున్నారు! ప్రియులారా వీరు అనగా కొరింథీ సంఘము పౌలుగారు నేర్పించిన కట్టడలను తప్పకుండా పాటిస్తున్నారు! అందువలన ఇక్కడ ఈ వచనంలో మెచ్చుకుంటున్నారు. అదే మరో విషయంలో ఇదే అధ్యాయంలో 17వ వచనంలో  నేను మిమ్మును మెచ్చుకోవడం లేదు అంటున్నారు- అది వారిమధ్య ఉన్న బేధాలు- గుంపుల కోసం! దీనిని మనం తర్వాత భాగాలలో ధ్యానం చేసుకుందాం!

 

ఇక్కడ కట్టడలు-“ఉపదేశాలు” అంటే క్రీస్తుయేసు యొక్క అపోస్తలులందరూ నేర్పించిన క్రైస్తవ జీవిత సంబంధమైన ఉపదేశాలు. ఇప్పుడు పౌలుగారు బహిరంగ ఆరాధనా సభల గురించి మాట్లాడసాగుతున్నారు. అలాంటి సమయాల్లో విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో చెప్తున్నారు. 14వ అధ్యాయం చివరి వరకు ఈ విషయాన్ని చెబుతున్నారు. బహిరంగ ఆరాధనలు జరుగుచున్నప్పుడు స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, ప్రభురాత్రి భోజనం ఎలా చెయ్యాలో, దేవుడు మనుష్యులకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన కృపావరాలు ఎలా ఉపయోగించాలో అనగా అన్యభాషలు మాట్లాడే వారు ఎలా మాట్లాడాలో, ప్రవచించేవారు ఎలా ప్రవచించాలో, ఎలా ప్రేమ కలిగి ఉండాలో  లాంటి మహత్తర విషయాలు- మరియు సంఘ క్రమము నేర్పిస్తున్నారు!

వీటిని ఏ సంఘస్తుడైనా అనగా వాడు ఏ సంఘానికి వెళ్తున్నా, ప్రపంచంలో ఉన్న ప్రతీ విశ్వాసి ప్రతీ క్రైస్తవ స్త్రీ మరియు క్రైస్తవ పురుషుడు వారు విశ్వాసులైనా పాష్టర్లు లేక సంఘ నాయకులైనా తప్పకుండా పాటించాల్సిందే ఎవరికీ దీనిలో ప్రత్నామ్నాయం లేదు!!

 

16 వచనాలలో మొదటి సంఘక్రమము చెబుతున్నారు: స్త్రీ తప్పకుండా ప్రార్ధించేటప్పుడు ముసుకు వేసుకోవాలి! ఇది కేవలం కొరింథీ సంఘానికే కాదు సార్వత్రిక సంఘములో భాగంగా ఉంటున్న ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతీ స్త్రీకి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ! సంఘ క్రమము! దీనిని ఎవరైనా సరే, బాప్తిస్మం తీసుకున్న ప్రతీ స్త్రీ పాటించాలి అనగా ప్రార్ధన చేసేటప్పుడు ముసుగు వేసుకోవాలి తన తలమీద!! 

 

ఇక ౩వ వచనంలో అంటున్నారు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడు అనగా భర్త అనియు, క్రీస్తుకి శిరస్సు దేవుడు అని తెలిసికోవాలి అంటున్నారు!

ఇక్కడ “శిరస్సు”అంటే అధికారంలో ఉన్నవాడు. పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి (ఎఫెసు 5:24; 1 తిమోతి 2:11-12; 1 పేతురు 3:1, 5, 6 ప్రకారం).

ఎఫెసీయులకు 5: 24

సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

 

1పేతురు 3: 1

అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

 

 ఏ విధంగానైనా భార్య తన భర్తపై పెత్తనం చేయాలనుకోవడం దేవుని క్రమాన్ని కాలదన్నడానికి ప్రయత్నించడమే. ఇందువల్ల కలిగే ఫలితాలు మంచివిగా ఉండవు. భర్త తన అధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ పౌలుగారు  చెప్పడం లేదు గాని ఎఫెసు 5:25, 28, 33లో చెప్పారు. ...

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.

 

క్రీస్తుపైన అధికారం దేవునిది అని పౌలుగారు  అనడంలో క్రీస్తు దేవుని స్వభావంలో భాగస్థుడు కాదని అతని ఉద్దేశం కాదు (భర్త అధికారం కింద ఉన్న స్త్రీ అతని మానవ స్వభావంలో భాగస్థురాలే గదా. అలాగే పరమ తండ్రి అధికారం కింద ఉన్న క్రీస్తు దేవుని స్వభావంలో భాగస్థుడు). క్రీస్తు నేర్పించినదాన్నే పౌలుగారు చెప్తున్నారు. యోహాను 14:28; 5:19-23.

యోహాను 14: 28

నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.

 

John(యోహాను సువార్త) 5:19,20,21,22,23

19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

20. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.

21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

 

ఇక 4, 5 వచనాలలో పురుషుడు బహిరంగ ప్రార్థనా స్తలాలలో ప్రార్ధన చేసినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోకూడదు, అలా చేస్తే తన తలను అనగా యేసుక్రీస్తుప్రభులవారిని అవమాన పరుస్తున్నాడు! అలాగే స్త్రీకూడా ప్రార్ధన చేసినప్పుడు ప్రవచించినప్పుడు ముసుగు వేసుకోకపోతే తన తలను అనగా తన‌భర్తను మరియు ఆత్మీయ అర్థం యేసుక్రీస్తుప్రభులవారిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమాన పరుస్తున్నది అని ఖరాఖండిగా చెబుతున్నారు!

 

ఇక్కడ ఒక విషయం చెప్పనీయండి: ప్రార్ధన అనగా కేవలం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే ముసుకు వేసుకోవాలి అని భావించకూడదు! నీవు దేవుని మందిరంలో లేక బహిరంగ ప్రార్ధనా స్థలంలో  అడుగుపెట్టిన క్షణం నుండి బయటకు వెళ్ళేవరకు ముసుగు వేసుకునే ఉండాలి! ఉదాహరణకు: నీవు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఎవరైనా నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమిచెబుతావు? ప్రార్ధనకు వెళ్తున్నాను! ఇక్కడ ప్రార్ధన అనగా పాటలు, ప్రార్ధన, ఆరాధన అనే వర్షిప్ మరియు వాక్యము వినడం /చెప్పడం, కానుకలు వెయ్యడం ఇవన్నీ ప్రార్ధన గానే పరిగణించాలి!! అలాకాకుండా కేవలం ప్రార్ధన చేసినప్పుడు ముసుగు వేసుకుని వాక్యం చెప్పేటప్పుడు పాటలు పాడేటప్పుడు ముసుగు తీసేయ్యమని కానేకాదు!!!

నేటి రోజులలో అనేకులు స్త్రీలు పాటలు పాడేటప్పుడు ముసుకులు వేసుకోవడం లేదు! వాక్యం వినేటప్పుడు వేసుకోవడం లేదు! ఘోరమైన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కొంతమంది పనికిమాలిన ఫారిన్ స్త్రీ  ప్రసంగీకులను‌ చూసి, మన దేశపు స్త్రీ ప్రసంగీకులు కూడా అనుకరిస్తూ ముసుకులు వేయడం మానేస్తున్నారు! ఫాంట్ షర్ట్ వేసుకుని, లిప్స్టిక్ లు, మేకప్ లు వేసుకుని నగలు పూర్తిగా ధరించుకుని ముసుగులేని ప్రసంగాలు చేస్తున్నారు! ఇది తప్పు! అనేకమంది స్త్రీలకు వీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు! ఫలాని గొప్ప దైవసేవకురాలు ముసుగులేకుండా మంచి ఖరీదైన బట్టలు వేసుకుని ప్రసంగం చేసినప్పుడు మనము ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు, ఖరీదైన బట్టలు చీరలు వేసుకున్నా పర్వాలేదు, పురుషుల వలే ఫాంట్ షర్ట్ వేసుకున్నా పర్వాలేదు, ముఖానికి రంగు మూతికి రంగు వేసుకున్న పర్వాలేదు, యెజెబెలు లాగ వేషధారణగా  జీవించినా పర్వాలేదు అనే తప్పుడు సంకేతాలు వీరివలన దేశమంతా వ్యాపించింది! మరికొందరు ముసుగు వేసుకున్నారో లేదో తెలియదు- హాఫ్ ముసుగులు జారిపోయే ముసుగులు! ఇలాంటి వారిమీదికి  దేవుని ఉగ్రత మిక్కిలి న్యాయంగా రాబోతుంది! వీరి నాశనం కునికి నిద్రపోదని బైబిల్ చెబుతుంది!

 

కాబట్టి ప్రియ సేవకుడా! విశ్వాసి ! నీవు దేవుని మందిరములో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నమాట మర్చిపోవద్దు! సంఘక్రమమును తప్పిపోవద్దు!!!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*79వ భాగము-సంఘము-సమస్యలు-33*

 

1కొరింథీ 11:311

3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

4. ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.

5. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.

6. స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.

7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయైయున్నది.

8. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.

9. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు.

10. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.

11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో రెండు సమస్యలకోసం చెబుతున్నారు!

మొదటిది: స్త్రీ ప్రార్దించినప్పుడు ముసుగు వేసుకోవడం!! రెండు : ప్రభురాత్రి భోజనం లేక ప్రభువు బల్ల లేక ప్రభు సంస్కారం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు!! మనము స్త్రీ ముసుగు వేసుకోవలసిన అవసరం కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! 4-10 వచనాలలో పౌలుగారు  బహిరంగ ఆరాధనా సమావేశాల గురించి చెప్తున్నారు. అలాంటి సమయాల్లో అన్నీ తగిన విధంగా, మర్యాదగా క్రమపద్థతిలో జరగాలి. పురుషులకు తగినదేమిటో స్త్రీలకు తగినదేమిటో పౌలుగారు ఇక్కడ  స్పష్టం చేస్తున్నారు. ఈ తేడాలను ఆ కాలం సంప్రదాయాలను బట్టి అతడు చెప్పలేదు. దేవుడు తానే వెల్లడి చేసిన స్త్రీ పురుషుల సాధారణ సంబంధాలపై ఆధారపడి అన్నికాలాలకు సరిపడిన విధంగా  చెబుతున్నారు (వ 3,7-9).

 

11:4లో  రెండో సారి ఉన్న “తల లేక శిరస్సు” అనే మాట క్రీస్తునుద్దేశించి రాసినది(వ 3). అంటే ఈ వచనంలో పౌలుగారు  ఒకే పదాన్ని వేరువేరు అర్థాలతో రెండు సార్లు వాడారన్నమాట. తలపైకి అవమానం తెచ్చిపెట్టుకోవడం అంటే తనను అవమానించుకోవడమని అర్థం కూడా అనుకోవచ్చు. అనగా పురుషుడు ప్రార్దించినప్పుడు ముసుగు వేసుకుంటే (కనీసం టోపీ కూడా పెట్టుకోకూడదు) యేసుక్రీస్తు ప్రభులవారిని అవమానించినట్లు మరియు తనను తానే అవమాన పరచుకున్నట్లు అవుతుంది!

 

ఇక 11:5-6 వచనాలలో  స్త్రీలు, పురుషులు కూడా ఉన్న బహిరంగ సభల్లో స్త్రీలు ప్రార్థించడం, దేవునిమూలంగా పలకడం లేక ప్రవచించడం, ఉపదేశించడం యుక్తమేనా? పౌలుగారు  ఈ ప్రశ్నకు ఇక్కడ జవాబు చెప్పడం లేదు. 14:34లో “మీ సభలలో స్త్రీలు మౌనం వహించాలి” అని చెప్పారు. అక్కడ పౌలుగారు  మాట్లాడినది ప్రవచించడం విషయం గాని ప్రార్థించడం విషయం కాదు. ఆరాధనకోసం బహిరంగంగా జరిగే సభల్లో స్త్రీలు వినిపించే ప్రార్థన చెయ్యకూడదని పౌలుగారు  స్పష్టంగా ఎక్కడా రాయలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో కొందరు స్త్రీలకు కూడా దేవుని మూలంగా పలికే లేక ప్రవచించిన సామర్థ్యం ఉన్నట్టు కనిపిస్తున్నది అపొ కా 2:18;

అపో.కార్యములు 2: 18

ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

 

అపో.కార్యములు 21: 9

కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.

 

ఆ సామర్థ్యం వారు స్త్రీ పురుషులు సమకూడి ఉన్న ఆరాధన సభల్లో ఉపయోగించకూడదనీ వేరే సందర్భాల్లో ఉపయోగించాలనీ పౌలుగారు  చెప్పినట్టు కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయ పడతారు! (14:34-35; 1 తిమోతి 2:11-12).

అయితే కొంతమంది 5వ వచనంలో (పురుషులు ఉండగా) స్త్రీలు ప్రార్థన చేస్తే (ఇతర సమయాల్లో) దేవునిమూలంగా పలికితే అనగా ప్రవచిస్తే  తలను కప్పుకోవాలని పౌలుగారి  ఉద్దేశం అంటారు, గాని దీని అర్ధం ఎల్లప్పుడూ అనగా ప్రార్ధన చేసినప్పుడు ప్రవచించి నప్పుడు స్త్రీ ముసుగు వేసుకోవాలనేది ఇక్కడ అర్ధము అని నా అభిప్రాయము!!.

 

ఒకవేళ ఆమె ముసుగు వేసుకోవడం అవమానంగా భావిస్తే తల గొరిగించుకొని బోడిగుండు చేసుకోమంటున్నారు ఇక్కడ పౌలుగారు పరిశుద్ధాత్మ పూర్ణుడై!! స్త్రీ తల గొరిగించుకోవడం ఆమెకు అవమాన సూచన, అలానే తల కప్పుకోకుండా ప్రార్థించడం, అలాగే ముసుగు లేకుండా ప్రవచించడం లేక దేవుని మూలంగా పలకడం కూడా అవమానమేనని పౌలుగారు  చెప్తున్నారు. బయటికి వినిపించేలా ప్రార్థించకుండా, ప్రవచించకుండా ఉండే సమయాల్లో కూడా స్త్రీ తల కప్పుకోవాలని పౌలుగారు  రాయడం లేదు.

 

అయితే కొంతమంది అతి తెలివైన వారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వారు అనగా స్త్రీలు- తల కప్పుకోవడం అనగా ముసుగు వేసుకోవడం , పొడవైన, లేక పొట్టిగా ఉండే వెంట్రుకలు కూడా (వ 14,15) కేవలం చిహ్నాలే అనీ, వాటికి ఏమీ ప్రాముఖ్యత లేదనీ అంటున్నారు. అవి చిహ్నాలు అన్నమాట నిజమే. అలా అయితే దేవుడు నియమించిన చిహ్నాలకు వాటికున్న ప్రాధాన్యత వాటికుంది. అలాంటి చిహ్నాలను మూలన పడేసేందుకు సిద్ధపడేవారు అవి ఏ సత్యాలకు చిహ్నాలుగా ఉన్నాయో వాటిని కూడా విసిరేసేందుకు సిద్ధంగానే ఉన్నారు కదా!. మరి కొందరు “ఇది స్వల్పమైన సంగతే గదా?” అంటారు. చిన్న విషయాలుగా కనిపించినవాటిలో కూడా విశ్వాసులు తమ ఇష్టప్రకారం చెయ్యకూడదు (10:29, 33; 11:1). అలాగైతే క్రైస్తవులకు స్వేచ్ఛ లేదా? ఉంది గాని సరైన విధంగా చేసేందుకే వారు తమ స్వతంత్రతను ఉపయోగించాలి. అందుకే 6వ అధ్యాయం లోను, 10 వ అధ్యాయం లోను నీకున్న స్వేచ్చ స్వాతంత్ర్యం అధికారం అన్నీ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించడానికి మరియు ఇతరులకు అభ్యంతరం లేకుండా జీవించడానికి వాడాలి అని రాశారు! దేవుడిచ్చిన ఆజ్ఞలను పరిశుద్దాత్మ బోధనలను తేలికగా తీసి పారెయ్యకూడదు!

స్త్రీలు ప్రార్ధన చేసినప్పుడుముసుగు వేసుకోవాలి అంటే వేసుకోవాలి! అదంతే!!

పురుషులు ముసుగు వేసుకోకూడదు అంటే వేసుకోకూడదు! అదంతే!

ప్రార్ధనా స్థలాలలో అనగా మందిరంలో ఉన్నప్పుడు ఆరాధన జరిగేటప్పుడు నీ పాదరక్షలు అనగా చెప్పులు మరియు బూట్లు తీసేయ్యాలి అంటే తీసెయ్యాలి!! అదంతే! ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నలు వేయకూడదు! దేవుడు చెప్పారు కాబట్టి నోరుమూసుకుని చెయ్యాలి!(దయచేసి నాభాషను క్షమించండి! నిజంగా అలాగేచెయ్యాలి)

 

దయచేసి దేవుడు చెప్పినవి చెప్పినట్లుగా పాటిద్దాం! సేవకులారా! సేవకులైన స్త్రీలారా!దయచేసి ఈ సంఘక్రమమును పాటించమని మనవిచేస్తున్నాను! ఒకమాట చెప్పనా? తీర్పు అనంతరం అన్యజనులకు అనగా రక్షించబడని అన్యజనులకు ఒకవంతు శిక్ష అయితే, రక్షించబడిన తర్వాత అపరాధాలు చేస్తే రెండింతలు తీర్పుకు పాత్రులు అని హెబ్రీ పత్రిక చెబుతుంది. అయితే దైవసేవకులు తప్పుచేస్తే అనగా బోధించే వాడు తప్పుచేస్తే మరింత కఠినమైన శిక్ష కలుగుతుంది అని యాకోబు గారు చెప్పిన మాట (౩:1) అని మర్చిపోవద్దు!

 

కాబట్టి భయమునొంది దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా పాటిద్దాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*80వ భాగము-సంఘము-సమస్యలు-34*

 

1కొరింథీ 11:716

7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయైయున్నది.

8. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.

9. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు.

10. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.

11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు.

12. స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి.

13. మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?

14. పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?

15. స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.

16. ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో రెండు సమస్యలకోసం చెబుతున్నారు!

మొదటిది: స్త్రీ ప్రార్దించినప్పుడు ముసుగు వేసుకోవడం!!

రెండు : ప్రభురాత్రి భోజనం లేక ప్రభువు బల్ల లేక ప్రభు సంస్కారం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు!! మనము స్త్రీ ముసుగు వేసుకోవలసిన అవసరం కోసం ధ్యానం చేస్తున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

   ప్రియులారా! ఇక 713 వచనాల వరకు పౌలుగారు స్త్రీ ముసుగు వేసుకుని ప్రార్ధించాల్సిన అవసరం మరో కోణంలో చాలా దృడంగా చెబుతున్నారు!

 

7వ వచనంలో పురుషుడు దేవుని పోలికయు మహిమయై ఉన్నాడు గనుక పురుషుడు తలమీద ముసుగు వేసుకోకూడదు! గాని స్త్రీ అయితే పురుషునికి మహిమయై ఉంది కాబట్టి స్త్రీ వేసుకోవాలి! ఇది మొదటి కారణం!

 

ఇక 8వ వచనంలో: స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు కాబట్టి స్త్రీయే ముసుగు వేసుకోవాలి గాని పురుషుడు వేసుకోకూడదు అంటున్నారు!

 

మూడవది: స్త్రీ పురుషుని కొరకే చేయబడింది గాని పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు కాబట్టి స్త్రీ ముసుగు వేసుకోవాలి!

 

నాల్గవది: దేవదూతల అధికార సూచన అనేది స్త్రీయొక్క తలమీద ఉండాలి!!

ఈ నాలుగు కారణాల వలన స్త్రీ ప్రార్ధించేటప్పుడు మరియు ప్రవచించేటప్పుడు తలమీద ముసుగువేసుకోవాలి అని చెబుతున్నారు పౌలుగారు!

 

  ప్రియులారా! ఇక్కడ 7-10 వచనాలలో  ఏది గౌరవప్రదమో, ఏది అవమానకరమో అన్న చర్చను పౌలుగారు  ఆ కాలంలో నాటి స్థానిక సంప్రదాయాలపై ఆధారపడి రాయలేదు, గాని స్త్రీ పురుషులను సృష్టించడంలో దేవుని ఉద్దేశం ఏమిటో దానిమీదే ఆధారపడి రాశారు. మొదటి పురుషుణ్ణి, స్త్రీని సృష్టించడం గురించి అతడు మాట్లాడుతున్నారు (ఆది 1,2 అధ్యాయాలు).

 

7 వ వచనంలో బహిరంగ ఆరాధన సభల్లో పురుషుడు తల కప్పుకోరాదనడానికి కారణం ఇది. కప్పుకోకుండా వదిలేసిన తల భూమిపై ఉన్న ఇతర సృష్టి అంతటిపైనా స్త్రీపైన కూడా దేవుడు అతనికి ఇచ్చిన అధికారానికి సూచన. ఈ విధంగా అన్నిటిమీదా సర్వాధిపత్యంతో పరిపాలించే దేవుని మహిమను పురుషుడు ప్రతిబింబిస్తున్నాడు. కాబట్టి దేవుడు పురుషులకు తమపై ఇచ్చిన అధికారానికి లోబడుతున్నట్టుగా సూచించేందుకు స్త్రీలు తమ తలలు కప్పుకోవాలి అని పౌలుగారు  చెప్తున్నారు. పురుషుడి అధికారానికి లోబడడం ద్వారా ఒక స్త్రీ అతని మహిమను ప్రతిబింబిస్తున్నది.

 

ఇంకా 8-9వచనాలు  ఆది 2:20-23 లో జరిగిన సంభవాలు ఉటంకిస్తూ రాస్తున్నారు! . దేవుడు సృష్టిలో పురుషుణ్ణి మొదటివాడుగా చేయడం ద్వారా స్త్రీ లోబడి ఉండాలని సూచింఛి రాస్తున్నారు!. (స్త్రీ పురుషుడికోసం; పురుషుడు స్త్రీ కోసం కాదు).

 

ఇక 11:10లో దేవదూతల అధికార సూచన అంటే ఏమిటి?  ప్రార్థించేటప్పుడు, దేవుని మూలంగా పలికేటప్పుడు లేక ప్రవచించేటప్పుడు  స్త్రీలు తమ తలలు ఎందుకు కప్పుకోవాలో ఇది మరో కారణం. ఈ కారణానికి కూడా కొరింథీ పట్టణంలోని అలవాట్లతో ఏ సంబంధమూ లేదు.  విశ్వాసుల సభలను దేవదూతలు చూస్తుంటారు. ఏది యుక్తమో, ఏది అయుక్తమో వారికి తెలుసు. విశ్వాసులకు పరిచర్య చేసేందుకు దేవుడు పంపించిన ఈ దూతలకు అసహ్యం పుట్టించే విధంగా క్రైస్తవ స్త్రీలు ప్రవర్తించకూడదు. (హెబ్రీ 1:14)

 

అదే సమయంలో 11వ వచనంలో అంటున్నారు ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, అలాగే పురుషునికి వేరుగా స్త్రీ లేదు! ఇద్దరు ఒకరిమీద ఒకరు ఆధారపడి ఉండాలి! స్త్రీ పురుషునికంటే ఎంతో హీనమైనది కానేకాదు!!

 

11:12లో మరలా అంటున్నారు: స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగిందో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలంగా కలిగాడు గాని ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఇంకా సమస్త సృష్టి కూడా దేవుని మూలంగా కలిగాయి కాబట్టి ఇద్దరూ దేవునికి లోబడి ఉండాలి, అనగా స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి రక్షించాలి పోషించాలి, ఇప్పుడు ఇద్దరూ కలిసి తమను చేసిన దేవునికి లోబడియుండాలి! 

అంతేతప్ప‌ దేవుడు పురుషునికి స్త్రీపై ఆధిపత్యం ఇచ్చాడు కదా అని భార్యను కాళ్లక్రింద త్రొక్కమని కాదు దీనర్థం!!!

 

ఇక్కడ పౌలుగారు  పురుషుల్ని గొప్ప చేసి,  స్త్రీలను అన్నిటిలోనూ వారికంటే తక్కువగా చేస్తున్నారని ఈ పత్రిక  చదివేవారు అనుకోరాదని పౌలుగారి  ఉద్దేశం. అధికారం విషయంలో పురుషుడు శిరస్సు, అధికారి. కానీ మిగతా అన్నిటిలోనూ స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడాలి. పురుషుడు, అతని భార్య ఒక జట్టుగా ఉండాలని దేవుడు నియమించారు. ఈ సత్యము/ మర్మము పురుషుడు గ్రహించాలి! స్త్రీ తెలిసికోవాలి!!!

 

ఇక 13వ వచనంలో అంటున్నారు మీలో మీరే ఆలోచించుకొండి స్త్రీముసుకు లేనిదై ప్రార్ధించుట తగునా అంటున్నారు! తననుంచి ఎలాంటి ఉపదేశమూ అవసరం లేకుండానే విశ్వాసులు గ్రహించగలిగేంత స్పష్టంగా ఈ సత్యం ఉందని పౌలుగారి  అభిప్రాయం.

 

ఇక 1415 వచనాలలో అంటున్నారు: పురుషుడు తలవెండ్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావసిద్ధంగా అందరూ భావిస్తారు, అలాగే స్త్రీకి తలవెండ్రుకలు పైటచెంగువలె దేవుడు ఇచ్చారు గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకోవాలి! అది ఆమెకు ఘనము అంటున్నారు!

పొడవైన వెంట్రుకలు పురుషుడికి అవమానమనీ, అదే స్త్రీకి ఘనత అనీ పౌలుగారు  చెప్తున్నారు. తాను చెప్పనవసరం లేకుండా వారికే అది తెలిసి ఉండాలంటున్నారు. స్త్రీలు తమ “ఘనతను” కత్తిరించేసుకుంటూ, పురుషులు తమ “అవమానాన్ని” గర్వంగా భావిస్తూ ఉన్న ఈ రోజుల్లో పౌలుగారు  ఉంటే ఏమనేవారో మనకు తెలియదు!!. “పొడవైన” అంటే ఎంత పొడవో పౌలుగారు  చెప్పలేదు గానీ పురుషుల కన్న స్త్రీలకు పొడవైన వెంట్రుకలు ఉండాలనే అతని ఉద్దేశం స్పష్టంగా ఉంది.

 

ఇక 16వ వచనంలో ఎవడైనా కలహప్రియుడుగా ఉంటే మాలోనైనను అనగా అపోస్తలులలో నైనా గాని ఉపదేశకులలో గాని దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారం అనగా తలమీద ముసుగు లేకుండా ప్రార్ధించే ఆచారం లేదని తెలుసుకోవాలి అంటున్నారు! ఇక్కడ తాను చెప్పినదాన్ని కొందరు వ్యతిరేకించ బూనుకుంటారని పౌలుగారికి  తెలుసు. దీని విషయంలో ఆయన  వాదాలకు దిగదలచుకోలేదు. అతడు సత్యాన్ని, తన కాలంలో సంఘాలన్నీ పాటించిన సత్యాన్ని బయట పెట్టినంతవరకు చాలు. ఇంకా ఒకరకంగా చెప్పాలంటే దీనిభావం ఏమిటంటే ఎవడైనా దీనిని కాదని ఏకీభవించకపోతే ఇది అనగా ముసుగులేకుండా ప్రార్ధన చెయ్యడం అనేది సంఘములో లేదు, అపోస్తలుల క్రమంలో లేదు, ఉపదేశకులలోను లేదు, కాబట్టి ఎవరైనా దీనికి వ్యతిరేఖంగా చేస్తే అది సంఘక్రమానికి వ్యతిరేఖం కాబట్టి అడ్డుచెప్పకుండా లోబడి దీనిని వినాలి! అదంతే!!

 

కాబట్టి స్త్రీలారా! పరిశుద్దాత్మ దేవుడు పౌలుగారి ద్వారా ఇంతటి సుదీర్ఘమైన చర్చ ద్వారా స్త్రీ ముసుగులేకుండా ప్రార్ధన చెయ్యకూడదు, ప్రవచించకూడదు అని వ్రాయించారు అంటే దీనికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది అని అర్ధమవుతుంది! కాబట్టి దేవుడు చెప్పినట్లు పరిశుద్ధాత్ముడు బోధించినట్లు దయచేసి ప్రార్ధనకు వచ్చినప్పుడు తలలమీద ముసుగు వేసుకోండి! ముసుగు వేసుకోక పోతే దయచేసి బోడిగుండు చేసుకోమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!!

 

ఆమెన్!

దైవాశీస్సులు!!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*81వ భాగము-సంఘము-సమస్యలు-35*

 

1కొరింథీ 11:1726

17. మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువ మేలుకు కాదు.

18. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.

19. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు.

20. మీరందరు కూడివచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.

21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును.

22. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను.

23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

24. దానిని విరిచియిది మీకొరకైన (అనేక ప్రాచీనప్రతులలో- మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

26. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

 

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

ప్రియులారా! ఇక 11వ అధ్యాయంలో రెండు సమస్యలకోసం చెబుతున్నారు!

మొదటిది: స్త్రీ ప్రార్దించినప్పుడు ముసుగు వేసుకోవడం!!

రెండు : ప్రభురాత్రి భోజనం లేక ప్రభువు బల్ల లేక ప్రభు సంస్కారం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు!!

 

ప్రియులారా ఇంతవరకు మనము స్త్రీ ముసుగు వేసుకోవలసిన అవసరం కోసం ధ్యానం చేశాము! ఇక ఈ రోజునుండి ప్రభురాత్రి సంస్కారం ఎలా తీసుకోవాలి?ఎలా తీసుకోకూడదు అనేది ధ్యానం చేద్దాం!

 

ఇక్కడ 17 వ వచనంలో  మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను! ఎందుకంటే మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అంటున్నారు! ఇది మనకు భాగా అర్ధం కావాలంటే 18వ వచనం కూడా చూసుకుంటే ఎందుకు మెచ్చుకోరో తెలుస్తుంది, మొదటిది మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలున్నాయని విన్నాను! కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను అంటున్నారు! ఇక 20వ వచనం చూసుకుంటే రెండవ కారణం కనబడుతుంది మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రిభోజనం చేయడం సాధ్యం కాదు అంటున్నారు! ఎందుకంటే మీరు ఆ భోజనం చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తనమట్టుకు తానూ భోజనం చేయుచున్నాడు , అందువలన ఒకడు ఆకలిగా ఉంటున్నాడు, ఒకడు తినేసి మత్తుడుగా ఉంటున్నాడు అంటున్నారు!

 

ఈ రెండు కారణాల వలన పౌలుగారు మిమ్మును నేను మెచ్చుకొనను అంటున్నారు!

ఇది మనకు బాగా అర్ధం కావాలంటే దీని నేపధ్యం తప్పకుండా తెలుసుకోవాలి! ఇది మొదటిభాగంలో వివరించడం జరిగింది! మన భారతదేశం వలే కొరింథీలో కూడా ఆరోజులలో రక్షణ పొందిన వారిలో అనేకులు పేదవారు మరియు కూలిపనులు చేసుకొనేవారు! అయితే బాగా ధనవంతులైన వారు కూడా రక్షణ పొందారు కొంతమంది! ఈ ధనవంతులైన గుంపు ఆ పేదలైన విశ్వాసులను డామినేట్ చేస్తుండేవారు! మరియు తక్కువ చూపు చూసేవారు! ఆ కాలంలో ప్రతీరోజు ఎక్కువగా సాయంత్రం వేల ఆరాధనా జరిగేది మరియు అపొ 2:46 ప్రకారం ఇంటింటా రొట్టె విరిచేవారు! అనగా ప్రభురాత్రి భోజనం చేసేవారు! ఆ తర్వాత భోజనాల కార్యక్రామం ప్రతీరోజు ప్రతీ ఆరాధనా అనంతరం ఉండేది! అయితే ఈ ధనవంతులైన గుంపు ఆరాధనా సమయం కంటే ముందుగా వచ్చేసి ఆరాధన ప్రారంభిస్తారా లేదా, ఆ పేద/కూలిబ్యాచ్ ఎప్పుడు వస్తారో మాకు తెలియదు! వారు తీరికగా పనులు చేసుకుని వస్తారు! మాకు ఇంట్లో పని ఉంది, తొందరగా మొదలుపెట్టండి అనేవారు! సంఘపెద్దల మీద ఒత్తిడి తెచ్చేవారు! ఈ ధనవంతులైన బ్యాచ్ గొప్ప కానుకలు ఇచ్చేవారు మరియు పెద్ద కుటుంబం ఇంకా రాజకీయ పలుకుబడి గల కుటుంబాలు, అందుకే సంఘపెద్దలు వారితో గొడవాడలేక ఆరాధన ప్రారంభించేసేవారు, ఈ పేద మరియు కూలి విశ్వాసులు వచ్చేసరికి ఆరాధన అయిపోయేది, ప్రభురాత్రి సంస్కారం అయిపోయేది, ఇంకా భోజనాలు కూడా అయిపోయేవి! ధనవంతులైన బ్యాచ్ ఫుల్లుగా తినేసి వెళ్ళిపోయేవారు, వీరు అనగా పేద విశ్వాసులు ఆకలితో వెళ్ళిపోయేవారు, ముఖ్యంగా ఆరాధనా మరియు సంస్కారం తీసుకోకుండా! అందువలన గొప్ప కక్షలు బేధాలు ఏర్పడ్డాయి సంఘములో!ఈ విషయం క్లోయె ఇంటివారు పౌలుగారికి చెప్పారు! దానినే ఇక్కడ ఎత్తి రాస్తున్నారు! అందుకే నేను మిమ్మును మెచ్చను అంటున్నారు!

 

అందుకే 22వ వచనంలో ఇదేమి మీకు అన్నపానములు పుచ్చుకోడానికి మీకు ఇండ్లు లేవా అని ప్రశ్నిస్తున్నారు! దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గు పరుస్తారా అని గట్టిగా అడుగుచున్నారు!! మీతో ఏమి చెబుతాను? మిమ్మల్ని దీనిని గూర్చిమెచ్చుకుంటానా, ఎంతమాత్రము మెచ్చుకొనను అంటున్నారు!

1:10-12; 3:3-4.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:10,11,12

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె యింటివారి వలన నాకు తెలియవచ్చెను.

12. మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడునేను అపొల్లవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:3,4

3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?

4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునే ను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?

 

ఇక్కడ వారు తమ కక్షలు, విభేదాలను తమలోనే ఉంచుకోకుండా సంఘానికి వాటిని వెంటబెట్టుకుని వచ్చినట్టుంది.

 

11:19లో  “మెచ్చుకొనడం ” అనే పదం  గ్రీకు మాట ఏదో ఒక పరీక్ష తరువాత కలిగే ఆమోదాన్ని సూచిస్తున్నది. క్రైస్తవుల మధ్య చీలికలను, వర్గాలను, అబద్ధ బోధనలను, విభేదాలను దేవుడొక మంచి ఉద్దేశంతోనే అనుమతిస్తాడని అనిపిస్తున్నది. అలాంటివి పరీక్షలు. దేవుని మెప్పుకు ఎవరు యోగ్యులో వెల్లడి చేయడమే ఈ పరీక్ష ఉద్దేశం. ఎవరు ఆధ్యాత్మిక వ్యక్తులో, దేవుని మార్గాలకు ఎవరు నమ్మకంగా ఉన్నారో, పౌలుగారు  ఈ ఉత్తరంలో చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టేందుకు ఎవరు ఇష్టపడుతున్నారో అవి చూపిస్తున్నాయి. పరీక్ష లేనిదే పరీక్షను గెలవడం ఉండదు. పరీక్ష వస్తేనే ఎవరు గెలుస్తారో వెల్లడి అయ్యే అవకాశం ఉంటుంది.

 

ఇక విభేదాలు” ఈ గ్రీకు పదం గలతీ 5:20లో కూడా కనిపిస్తున్నది. ఇది శరీర కార్యాల్లో ఒకటి.

 

దీనిని బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే  ఎవరైనా కక్షలు విభేదాలు ఉన్నవారు సంస్కారం లో పాలుపొందకూడదు! ఇది ప్రభువు, పరిశుద్ధాత్ముడు మరియు పౌలుగారు మెచ్చుకోని‌ విషయం!!! ఒకవేళ వారు సంస్కారం తీసుకోవాలి అంటే మొదటగా ఒకరికొకరు సమాధానపడి ఆ తర్వాత సంస్కారం తీసుకోవాలి  మత్తయి 5:23--24 ప్రకారం

 

Matthew(మత్తయి సువార్త) 5:23,24

23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల

24. అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.

 

11:20-22 వచనాలలో  తాము ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నా మన్నారు. కానీ వారు ఆ సందర్భాన్ని ఎంత దుర్వినియోగం చేశారంటే దాన్ని ఆ పేరుతో పిలవడం కూడా తగని పని అని పౌలుగారు  అంటున్నారు. ఆ రోజుల్లో కొన్ని సంఘాల్లో ప్రభురాత్రి భోజనం తర్వాత అందరూ కలిసి భోజనం చేసే ఆచారం ఉండేది. ఆ ఆచారం ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను కనపరచుకోవడం కోసం కాబట్టి దాన్ని “ప్రేమ విందు” అనేవారు యూదా 12; 2 పేతురు 2:13 ప్రకారం!. అయితే కొరింథీలో దాన్ని ఈ పేరుతో పిలవడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ క్రైస్తవుల్లో ఒకరి గురించి ఒకరు ప్రేమతో ఆలోచించలేదు, తమ గురించి లేక తమ వర్గ వైషమ్యాల గురించి వారు ఆలోచించు కుంటున్నారు. సంఘంలో వారి ప్రవర్తన సంఘాన్నే చిన్న చూపు చూచేదిగా ఉంది (వ 22). ప్రభురాత్రి భోజనమనేది క్రీస్తుతోను, ఒకరితో ఒకరు ఐక్యం అయిన సంగతిని సూచిస్తున్నదని వారు మర్చిపోయారు (10:16-17).

 

అప్పుడేనా? ఈ రోజులలో కూడా అనేకమంది మన సంఘాలలో కక్షలు బేధాలు పెట్టుకుని సంస్కారం తీసుకోవడం లేదా? శాంతి సమాధానం లేకుండా, కనీసం షేక్ హాండ్ కూడా ఇచ్చుకోకుండా, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్/ సిస్టర్ అని కూడా చెప్పుకోకుండా ఎడముఖం పెడముఖం పెట్టుకుని సంస్కారం తీసుకోవడం లేదా? వీరిలో దేవుని ప్రేమ కనిపిస్తుందా? మరి ఇప్పుడు పౌలుగారు గాని, పరిశుద్దాత్ముడు గాని యేసుక్రీస్తు ప్రభులవారు గాని వీరిని మెచ్చుకుంటారా? సెహబాస్ అని అవార్డ్ ఇస్తారా వీరికి? వీరు సాతాను బ్యాచ్ కాదా??!! ప్రియ చదువరీ! ఒకవేళ నీవు కూడా ఇలా ఉంటే నేడే సరిదిద్దుకుని అందరితో సమాధానముగా ప్రేమగా మెలగమని మనవిచేస్తున్నాను!!

 

ఇక 2326 వరకు ప్రభురాత్రి భోజనం ఎలా చెయ్యాలో దాని విశిష్టత కోసం రాస్తున్నారు!  నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను అంటున్నారు అనగా బహుశా పౌలుగారు ఈ సంస్కారం కోసం అరేబియా దేశంలో మూడు సంవత్సాలు ప్రార్ధనలో గడిపినప్పుడు దేవుణ్ణి అడిగి ఉంటారు! అప్పుడు దీని విశిష్టత దేవుడే వివరించి చెప్పి ఉండవచ్చు! అందుకే మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను! ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దానిని అనగా రొట్టెను విరచి ఇది మీ కొరకైన నా శరీరము! నన్ను జ్ఞాపకం చేసుకోనుటకై దీనిని చేయుడి అనగా ఇలాగే తినండి అని చెప్పెను! ఇంకా భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తమువలనైన క్రొత్త నిబంధన!మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసికొనుటకై దీనిని చెయ్యండి, అనగా ద్రాక్షారసం ఇలా త్రాగండి అనిచెబుతూ మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిడి త్రాగేటప్పుడు ప్రభువు వచ్చేవరకు అనగా రెండవ రాకడ వచ్చేవరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి! ఇదీ ముఖ్య ఉద్దేశం! అంటే కాని ఒకడు ముందుగా ఒకడు ఆలస్యంగా వస్తూ దాని విశిష్టత పాడుచేస్తూ గొడవలాడుకోడానికి కానేకాదు!

 

    ఇక్కడ పౌలు ప్రభురాత్రి భోజనమంటే ఏమిటో, దాన్నెలా ఆచరించాలో వారికి వివరించడం ఆరంభిస్తున్నారు. గతంలో ఒకసారి ఈ సత్యాన్ని వారికి అందించారు  గాని వారు దానికి దూరంగా తొలిగిపోయారు. ఇది నాలుగు సువార్తలలో వ్రాయబడిన విషయాలే ఇక్కడ పరిశుద్దాత్ముడు మరోసారి ఏకీభవిస్తు రాయిస్తున్నారు పౌలుగారిచేత!! .

మత్తయి 26:26-28;

26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.

27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి.

28. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

మార్కు 14:22-24; లూకా 22:19-22 ఇది ఉంది!!

 

11:24లో  “మీ కోసం” అంటే క్రీస్తు సిలువ మరణానికి తన దేహాన్ని బలిగా అర్పించినది విశ్వాసుల కోసమని అర్ధం చేసుకోవాలి.

నా శరీరం” అనగా ప్రభురాత్రి భోజనంలో రొట్టె (వ 28) క్రీస్తు శరీరానికి గుర్తు.

నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి” అనగా ప్రభురాత్రి భోజనం సమయంలో మనం దేవునివైపుకూ మన గతంలోకీ చూచుకోవాలి మన ఆలోచనలు పైనున్న క్రీస్తుమీద ఉండాలి. చాలా కాలం క్రితం ఈ భూమిపై మరణించడం ద్వారా ఆయన మనకోసం ఏమి చేశారో తలపోసుకోవాలి.

 

ఇక ఇది చేయండి” అంటే ప్రభురాత్రి భోజనం పాటించమని!!  యేసుప్రభువే ఇచ్చిన ఒక గంబీరమైన ఆజ్ఞ ఇది.  విధేయత చూపించాలి అనుకున్న విశ్వాసి ఎవరైనా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనవలసిందే.

 

11:25లో ఈ పాత్రలో ద్రాక్షరసం ఉంది. మత్తయి 26:28 ప్రకారం క్రీస్తు రక్తానికి అది గుర్తు. కొత్త నిబంధన స్థాపించేందుకు ఆ రక్తం కార్చబడింది. ఇక్కడి మాటలు చూడండి “ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన”. ఆ పాత్ర అక్షరాలా కొత్త నిబంధన  కాదు గాని  పాత్ర అంటే పాత్రే అయితే క్రీస్తు రక్తం మూలమైన కొత్త నిబంధన అని అర్ధం!

 అలానే  24వ వచనంలో రొట్టెను క్రీస్తు శరీరంగా చెప్పిన విషయం కూడా ఇలానే అర్థం చేసుకోవాలి. రొట్టె అక్షరాలా క్రీస్తు శరీరం కాదు గాని దానికి సూచన మాత్రమే. రొట్టె తినాలని, పాత్రలోది తాగాలని కూడా పౌలుగారు పునరుద్ఘాటిస్తున్నారు. ప్రభురాత్రి భోజనాన్ని సరిగా ఆచరించడమంటే రెండూ చేయాలి

 

11:26లో  “త్రాగేటప్పుడెల్లా”  అనగా ప్రభురాత్రి భోజనాన్ని ఎంత తరచుగా చేయాలో పౌలు ఎక్కడా చెప్పలేదు. గాని మనకు అపోస్తలుల కార్యములో 2:46లో చూసుకుంటే అక్కడ ప్రతీరోజు ఈ రొట్టె విరుచుట అనగా ప్రభురాత్రి సంస్కారం ఆచరించేవారు అని అర్ధం అవుతుంది....

అపో.కార్యములు 2: 46

మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై

 

కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! ఈ ప్రభురాత్రి భోజనం అనేది దేవుడు క్రొత్త నిబంధనకు సూచనగా యేసుక్రీస్తుప్రభులవారి శరీరానికి, ఆయన కార్చిన రక్తమునకు సూచనగా ఇచ్చారు కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి దీనిని హృదయపూర్వకముగా పరిశుద్ధముగా ఐక్యమనస్సు ప్రేమ ఏకభావము కలిగి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది! కాబట్టి మనలో ఉన్న విబేధాలు వదిలేద్దాం! కక్షలు వదిలేసి ప్రేమతో ఐక్యంగా ఈ ప్రభురాత్రి భోజనములో పాల్గొందాం!!

 

ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*82వ భాగము-సంఘము-సమస్యలు-36*

 

1కొరింథీ 11:2734

27. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

31. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.

32. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడివచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి.

34. మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేస్తున్నాము!

 

ప్రియులారా! ప్రభురాత్రి సంస్కారం ఎలా తీసుకోవాలి? అనేది గతభాగంలో చూసుకున్నాము! ఈరోజు ఎలా తీసుకోకూడదు అనేది ధ్యానం చేద్దాం!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక 27వ వచనంలో ఎవడైతే అయోగ్యముగా అనగా యోగ్యత లేకుండా సిద్ద పడకుండా ప్రభువుయొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోని ద్రాక్షరసము త్రాగునో వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును అంటున్నారు! అలా పరీక్షించుకుని ఆ రొట్టెను తినాలి ఆ పాత్రలోనిది త్రాగాలి, అలా కాకుండా ఇది ప్రభువు శరీరము అనియు ఇది ప్రభువు రక్తము అని ఆలోచించకుండా ఏదో ఆచారములే అని తినిత్రాగితే దేవుని దృష్టిలో అపరాధులు అవ్వడమే కాదు 29వ వచనంలో శిక్షావిధి తెచ్చుకుంటారు! ఇక్కడ శిక్షావిధి అనగా చివరి తీర్పు అనికాదు, ఎవరైనా తప్పుచేస్తే దేవుడు లెంపకాయలు వేస్తారు కదా జబ్బు పెట్టి, రోగం పెట్టి, కాళుచేయి పడిపోయేలా చేసి, అలాంటిది అన్నమాట!!

 

ఇక ౩౦వ వచనంలో అందుకే కదా మీలో అనేకులు బలహీనులు మరియు రోగులునై ఉన్నారు, కొంతమంది నిద్రించుచున్నారు అనగా చనిపోతున్నారు అంటున్నారు! దేవుని శరీరం దేవుని రక్తము అని ఆలోచించ కుండా దీనిని ఆచరిస్తే పోతారు అంటున్నారు పౌలుగారు ఆత్మావేశుడై!!

 

గమనించాలి: తగిన విధంగా పాల్గొనాలంటే హృదయం, మనస్సు సిద్ధపడి ఉండాలి. అందువల్ల విశ్వాసులు ఇందులో పాల్గొనకముందు తమ బయటి జీవితాలను, అంతరంగ పరిస్థితిని పరిశీలించుకోవాలి. పాపమంతా, అమర్యాదకరమైన ధోరణి అంతా, ఆలోచన లేని ప్రవర్తనంతా విడిచిపెట్టాలి. ప్రభురాత్రి భోజనంలోని అర్థాన్ని, దానిలో పాల్గొనవలసిన కారణాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించామని రూఢి చేసుకోవాలి.

 

11:29లో  “ప్రభు శరీరము అని ఆలోచించకుండా ”అనగా  ఇందులో రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి ప్రభురాత్రి భోజనం యొక్క అర్థాన్ని గుర్తించకపోవడం, అది మామూలు భోజనాలవంటిది కాదని గ్రహించకపోవడం (కొరింథీవారు ఇక్కడే తప్పటడుగు వేశారు). రెండు, విశ్వాసులందరూ క్రీస్తు శరీరంలో ఉన్నారని గుర్తించకపోవడం (10:17; 12:12-13. కొరింథీవారు ఇందులో కూడా తప్పటడుగు వేశారు).

 

శిక్షావిధి” అంటే దేవుడు విధించే శాశ్వత శిక్ష అని అర్థం కాదు. దేవునికి మన తీరు ఇష్టం లేక బుద్ధి చెప్పేందుకు పంపించే శిక్ష ఇది. వ 30లో ఇది స్పష్టంగా ఉంది.

 

11:30 తమ మీదికి వారు తెచ్చి పెట్టుకుంటున్న శిక్ష ఇది. వారి సభలు వారికి చేస్తున్న హాని ఇది (వ 17). తన ప్రజలు మర్యాదగా క్రమంగా ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు (14:40). అలా కాని పక్షంలో వారికి దీవెనకరంగా ఉండాలని దేవుడు నిమమించినదాని వల్ల వారిమీదికి శిక్ష వచ్చిపడుతుంది.

 

   కేవలం కొరింథీ వారేనా? నేటి దినాలలో ప్రతీ సంఘములోనూ ఇది జరగటం లేదా? ఎంతమంది ఇది నిజంగా ప్రభువు శరీరమని ప్రభువు రక్తమని ఎంచి పరిశుద్ధతతో భయంతో ఎంతో గౌరవంతో తీసుకుంటున్నారు? ఎంతమంది ఏదో ఆచారంగా తీసుకుంటున్నారు!!! మిగతా ఆదివారాలు రానివాడు మొదటి ఆదివారం సంస్కారం ఉంటుందని వచ్చేస్తున్నాడు, బ్రతుకు బాగోలేకపోయినా తీసేసుకుంటున్నారు! వాడి త్రాగుడు మానడం లేదు, వ్యభిచారం మానలేదు, అక్రమ సంభంధాలు వదలలేదు, సినిమాలు మానలేదు, అమ్మలక్కలు సీరియల్లు వదలలేదు, యవ్వనులు బూతు సినిమాలు బూతు బొమ్మలు చూడటం మానలేదు! మారుమనస్సు పశ్చాత్తాపం లేదు, దేవుడు నాకోసం చనిపోయాడని దుఃఖము లేదు! వచ్చేస్తున్నారు, బుర్ర వంచేస్తున్నారు, తీసేసుకుంటున్నారు, మరలా సోమవారం నుండి మరలా త్రాగుడు, వ్యభిచారం, లంచాలు అబద్దాలు అన్నీ మామూలే! ఏమనుకుంటున్నావు? దేవుడు నీలాంటి వాడే అనుకుంటున్నావా? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అనేది మర్చిపోయావా?

(హెబ్రీయులకు 10: 31

జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.)

 నేల నాకించేస్తారు జాగ్రత్త! దేకురుతూ పోవలసి ఉంటుంది! దేవుడంటే భయము భక్తి లేకుండా అన్యుల ఆలయంలో చెంపలు వాయించుకుని దణ్ణం పెట్టుకుని శటగోపం పెట్టించుకోవడం అనుకుంటున్నావా? నీ వ్యభిచారం మానకుండా సంస్కారం తీసుకుంటే వీలుకాని స్థలంలో గడ్డలు పుట్టిస్తాడు దేవుడు ఐగుప్తు దేశంలో, ఫిలిష్తీయులకు పెట్టినట్లు జాగ్రత్త!! త్రాగుడు మానకుండా బూతులు మానకుండా తీసుకుంటే నోటిలోనే రోగం పెడతాడు జాగ్రత్త! ఇది కేవలం రొట్టె మరియు ద్రాక్షారసం కానేకాదు! దేవుని రక్తం మరియు దేవుని శరీరం అని మర్చిపోవద్దు! భయము కలిగి పాపం చెయ్యడం మానేయ్!

 

మరోసారి గుర్తుచేస్తున్నాను: రక్షించబడని అన్యునికి ఒకవంతు శిక్ష గాని రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాక పాపం చేస్తే రెండితల శిక్ష! అదే మాటిమాటికి పాపం చేస్తే అనగా అది పాపమని దేవునికి వ్యతిరేఖమని తెలిసి చేస్తే మరి తిరుగులేకుండా హటాత్తుగా నాశనమైపోతావు అని సామెతల గ్రంధం 29:1 లో చెప్పబడింది! అదే బోధించే నీవు ప్రభురాత్రి సంస్కారం నడిపిస్తూ సంస్కారం ఇచ్చే నీవు తెలిసుండి కూడా అపరాధం చేస్తే ఇకనీకు పశ్చాత్తాపం పాపక్షమాపణ లేకుండా మరింతఘోరమైన కటిన తీర్పు అని మర్చిపోవద్దు!!!

 

ఇంకా చాలా సంఘాలలో కానుకలు అయిపోయిన వెంటనే సిద్దపాటు ఆరాధన, కన్నీటి ప్రార్ధనలేకుండా వెంటనే సంస్కారం ఇచ్చేస్తున్నారు! సంస్కారం కోసం సిద్దపాటు ప్రసంగం లేకుండా, ప్రభువా నీ రక్తాన్ని నీ శరీరాన్ని నేను తీసుకోబోతున్నాను, నన్ను దానికి యోగ్యునిగా చెయ్యండి అంటూ కన్నీటి ప్రార్ధన కనీసం ఒక అరగంట లేక పావుగంట అయినా ప్రార్ధించకుండా మ్రొక్కుబడిగా ఆచారంలా సంస్కారం ఇచ్చేస్తున్నారు! ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సంఘాలు అని చెప్పుకుంటున్న చాలా సంఘాలాలో చూశాను, పట్టణాలలో మరీ తొందర వారికి! ఇది కూడదు! సంస్కారం ఇచ్చేముందు సిద్దపాటు ఆరాధన లేకుండా కన్నీటి ప్రార్ధన లేకుండా సంస్కారం తీసుకోగూడదు అని దయచేసి గ్రహించమని బ్రతిమిలాడుతున్నాను!

 

కాబట్టి  మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో, మన ప్రవర్తనలో పొరపాటేమిటో తెలుసుకుని అందులోనుంచి వైదొలగాలి. అప్పుడు దేవుడు శిక్షించడానికి బదులు మనల్ని దీవిస్తాడు.

 

3234....

32. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.

33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడివచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి.

34. మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.

 

గమనించాలి హెబ్రీ 12:5-13. లో చెప్పబడిన విధంగా జీవించాలి

 

5. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

6. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.

7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?

8. కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.

9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?

10. వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.

11. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.

12. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.

13. మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి.

14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

 

భ్రష్టమైన, పాపభూయిష్ట లోకంతో బాటు మనం కూడా శిక్షలో పడిపోకుండేందుకు దేవుడు చేసే దేన్నయినా మనం ఆహ్వానించాలి.

యోహాను 15:18-19;

18. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.

19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.

 

రోమీయులకు 12: 2

మీరు ఈ లోక (లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

 

యాకోబు 4: 4

వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

1యోహాను 2: 16

లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

 

కాబట్టి పౌలుగారు  చెప్పినదాన్ని అర్థం చేసుకుని ప్రభురాత్రి భోజనంలోని ఉద్దేశాన్ని, సంఘం యొక్క ఐక్యతను గుర్తిద్దాము!  పరిశుద్ధమైన జీవితాలతో సిద్దపాటు కలిగి ఈ ప్రభురాత్రి భోజనం ఆచరిద్దాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*83వ భాగము-సంఘము-కృపావరాలు-1*

 

1కొరింథీ 12:111

1. మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.

2. మీరు అన్యజనులైయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

3. ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేసుకున్నాము!

ఇక 1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? సంఘములో ఈ కృపావరాలు దేవుడు ఎందుకు ఇస్తారు అనే దానికోసం వ్రాయబడింది! ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి కాబట్టి జాగ్రత్తగా గమనించమని మనవిచేస్తున్నాను!

 

రాబోయే మూడు అధ్యాయాలు “ఆధ్యాత్మిక సామర్థ్యాలు లేక ఆత్మసంబంధమైన వరాలు ”, ఉచిత కృపావరాలు అనే విషయం గురించి తెలియజేస్తున్నాయి. ఇవి విశ్వాసులు సహజంగా చెయ్యలేనివాటిని చేయడానికి సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఈ సామర్థ్యాలు ఉండడం దానంతట అదే విశ్వాసులను ఆధ్యాత్మిక వ్యక్తులుగా చెయ్యదని అర్థం చేసుకోవాలి. అనగా ఈ కృపావరాలు కలిగి ఉండటం అనగా వారు ఈ వరాలు ఉంటే వారు ఆధ్యాత్మిక వ్యక్తులుగా పరిపూర్ణంగా మారిపోయారు అని అర్ధం కానేకాదు అని తెలుసుకోవాలి!  కొరింథీ సంఘంలో విశ్వాసులకు ఇవి ఉన్నాయి గాని వారు శరీర సంబంధులు, లోకానికి చెందిన మనుషుల్లాగా ప్రవర్తించారు (3:1-4) ప్రకారం. శరీర స్వభావాన్ని అనుసరించేవారు లోక సంబంధంగా జీవిస్తూ ఏదో ఒక ఆధ్యాత్మిక సామర్థ్యం తనకు ఉందని గొప్పలు చెప్పుకోవడం ఎంతో వ్యర్థమైన విషయం!

 

1214 అధ్యాయాల్లో ఈ ఉచిత కృపావరాల గురించి పౌలుగారు  ఈ క్రింది విషయాలు నేర్పిస్తున్నారు. వాటిని ఈ క్రింద విధంగా విభజించవచ్చు!!

 

1) వాటిని ఇచ్చేది దేవుని పరిశుద్ధాత్ముడే (12:4, 7, 11).

 

2) యేసుక్రీస్తు ప్రభుత్వం కిందనే అవి ఇవ్వబడతాయి; ఆ విధంగానే వాటిని ఉపయోగించాలి (12:3, 5).

 

3) ప్రతి విశ్వాసికీ ఏదో ఒక సామర్థ్యం లేక వరము ఉంటుంది. (12:7, 11).

 

4) ఏదైనా లేక ఒకే  సామర్థ్యం/వరము  విశ్వాసులందరిలోనూ ఉండదు (12:29-30).

 

5) సామర్థ్యాలన్నీ/ ఆధ్యాత్మిక వరాలు  అందరి మేలుకోసమే గానీ వ్యక్తిగతమైన లాభం కోసం కాదు (12:7; 14:3-12, 19; 10:3311:1).

 

6) విశ్వాసుల్లో ఏకీభావాన్ని పెంపొందించడానికే గానీ వారిని చీల్చడానికి కాదు దేవుడీ వరములను/సామర్థ్యాలను ఇచ్చేది (12:25).

 

7) విశ్వాసుల్లో పని చేసే దేవుని ప్రేమ ఈ ఆధ్యాత్మిక వరములన్నిటికంటే గొప్పది/ సామర్థ్యాల్లో ఏ ఒక్క దానికన్నా, అన్నిటికన్నా గొప్పది (13:1-13).

 

8) విశ్వాసులు ఆధ్యాత్మికవరాలను/ సామర్థ్యాలను ఆశించాలి (12:31; 14:1).

 

9) ప్రవచించడం/ దేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప సామర్థ్యం (14:1).

 

10) ఎవరికైనా వారికున్న వరములను బట్టి లేక  ఒక సామర్థ్యాన్ని బట్టి తాను ఇతరులకన్నా గొప్పవాణ్ణని అతడు అనుకోకూడదు (4:7; 13:4; 12:21, 25).

 

11) ఈ వరములను/ సామర్థ్యాలను ఉపయోగించడంలో విశ్వాసులు మర్యాదను, క్రమాన్ని పాటించాలి (14:40).

 

ప్రతి విశ్వాసీ ఈ సత్యాలను హృదయంలో నాటుకోనిస్తే ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి సంఘాలను పట్టి పీడిస్తున్న తగవులకు, చీలికలకు తావుండేది కాదు.

 

సరే, ఈ అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం!

మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు! ఇలా నాకు ఇష్టం లేదు అని రాయడం ఈ పత్రికలో చాలాసార్లు చూస్తున్నాము! ఇక్కడ దేనికోసం చెబుతున్నారు అంటే మీరంతా ఆత్మసంబంధమైన వరాల కోసం తెలుసుకోవాలి అని పౌలుగారు చెబుతున్నారు!

మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మాట్లాడని మూగ విగ్రహాలను ఆరాధించడానికి ఎలాపడితే అలా ప్రవర్తించారు అయితే దేవుని ఆత్మవలన మాట్లాడువాడు ఎవడూ యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ ఒక మనిషిలో పనిచెయ్యక పోతే వాడు యేసు ప్రభువు అని చెప్పలేడు అంటున్నారు!

 

వారు క్రైస్తవులు కాకమునుపు గుడ్డిగా, ఆలోచనలేని విధంగా విగ్రహాల వెంటపడి పోయారు. తాము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో వారికే తెలియదు. వారు ఎదిరించని కొన్ని శక్తులు, ప్రభావాలు వారిపై పని చేస్తున్నాయి.

 

ఇక్కడ దేవుని ఆత్మవలన మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడు అని అనలేడు అనే మాట ఎందుకు అంటున్నారు అంటే  యూదులు కొందరు ఇలా అన్నారు. యేసు దేవదూషకుడనీ ఆయనకు సిలువే తగిన శిక్ష అనీ అన్నారు.  ఇంకా యేసుక్రీస్తు మ్రానుమీద వేలాడదీయబడ్డారు కాబట్టి ద్వితీయోప 21:22--23 ప్రకారం శాపగ్రస్తుడు అన్నారు! అలాంటివారిలో దేవుని ఆత్మ ఉండదని అంటున్నారు  పౌలుగారు. యేసే ప్రభువు అనడం ఆయన యెహోవాదేవుని అవతారం అనడమే. లూకా 2:11; ఫిలిప్పీ 2:10-11 చూడండి. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పని చేయకపోతే నిజ విశ్వాసంతో ఎవరూ ఇలా అనలేరు. అలా కాకుండా ఇతరులు అర్థం లేకుండా ఆ మాటలు పలకవచ్చు.

లూకా 2: 11

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

Philippians(ఫిలిప్పీయులకు) 2:9,10,11

 

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

ఇక 4వ వచనం నుండి కృపావరాలకోసం చెబుతున్నారు! ఇక్కడ ఒక్కడే పరిశుద్దాత్ముడు అందరిలోనూ వివిధమైన రకాలుగా పనిచేసి ఒక్కక్కరికి వారివారి విశ్వాస సామర్ధము ప్రకారం, వారివారి ఆధ్యాత్మిక సామర్ధ్యాల ప్రకారం వరములు ఫలములుఇస్తున్నారు అంటున్నారు

 

కృపావరములు నానా విధముగా ఉన్నవి గాని వారిలో పనిచేసే ఆత్మ ఒక్కడే! అలాగే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి గాని పనిచేయించే  ప్రభువు ఒక్కడే! నానావిధమైన కార్యములు ఉన్నాయి గాని అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే! అయినా అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అంటున్నారు!

దేవుని పనిలో విశ్వాసులకు ఉన్నదీ, చేయగలిగేది అంతటికీ మూలాధారాన్ని పౌలుగారు  ఇక్కడ నొక్కి చెప్తున్నారు

Ephesians(ఎఫెసీయులకు) 4:4,5,6,7

4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి (మూలభాషలో- అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.

7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.

 

 త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు

 

ఒక్కక్కరు వేరువేరు రకాలైన కృపావరములు కలిగి ఉన్నాగాని వారిలో పనిచేసేది పరిశుద్దాత్ముడే! కార్యం జరిగించేది దేవుడే! అయితే దేవుడు ఒక్కక్కరినికి ఒక్కో పనికి వాడుకుంటున్నారు అన్నమాట! ఆయన మన CEO. ఎవరిని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు! వారివారి సామర్ధ్యాలు కూడా దేవునికి తెలుసు! అది తెలిసే దేవుడు ఎవరికి తగినట్లు వారికి కృపావరాలు ఇస్తారు! దీనిని ఇంకా ముందుకు పోయేముందు చిన్నప్పుడు చదివిన కధను జ్ఞాపకం చెయ్యండి! ఒక తెలివైన సైంటిస్ట్ ఒకడు ప్రయాణం చేస్తూ ఎండలో మార్గమధ్యంలో ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆ మర్రి చెట్టు ఆనుకుని ఒక పాక ఉంది, పాకమీద ఒక ఆనపకాయపాదు అల్లుకుని ఉంది! ఆనపకాయ పాదుకి పెద్దపెద్ద ఆనపకాయలు వ్రేలాడుతున్నాయి! మర్రిచెట్టు నిండా మర్రిపళ్లు ఉన్నాయి! అప్పుడు ఈ తెలివైన సైంటిస్ట్ అనుకున్నాడట- దేవుడు ఎంత తెలివితక్కువ వాడు!! ఇంత పెద్ద మర్రిచెట్టుకి చిన్న మర్రిపళ్లా? ఇంతచిన్న ఆనపపాదుకి ఇంతపెద్ద ఆనపకాయలా? దేవునికి బుద్దిలేదు! నేనే గాని దేవుడనైతే మర్రి చెట్టుకి ఆనపకాయంత కాయలు, ఆనపపాదుకి మర్రిపల్లంత కాయలు పెట్టేవాడిని అని అనుకుంటున్నాడు- ఈలోగా పెద్దగాలి వచ్చింది- మర్రిపళ్లు టపటపామని కొన్నిపళ్లు రాలిపోయాయి వాటిలో రెండు పళ్లు ఒకటి తలమీద ఒకటి వీని పొట్ట మీద పడ్డాయి! అప్పుడు ఈ సైంటిస్ట్ కి జ్ఞానోదయం అయ్యిందట! అయ్యబాబోయ్! దేవుడా నీవు ఎంత తెలివైన వాడివి- నిజంగా ఆ మర్రిచెట్టుకి ఆనపకాయంత మర్రిపళ్ళు గాని ఉంటే అవి నామీద పడి ఉంటే ఈ పాటికి నా నెత్తి ముక్కలయ్యేది నా పొట్ట చెక్కలయ్యేది, నీవు ఎంత మహాజ్ఞానివి మహాప్రభో అని చెంపలేసుకున్నాడట! మనము కూడా ఏవేవో అనుకుంటాము- గాని దేవునికి మనశక్తి సామర్ధ్యాలు మనబలహీనతలు అన్నీ తెలుసు! ఎవరికీ ఏమివ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి ఏ స్థితిలో దేవుడు మనలను పిలిచారో ఏ వరాలు ఇచ్చారో వాటిని సరిగా వాడుతూ ఆయన సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా చెయ్యాలి!

 

దైవాశీస్సులు!

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*84వ భాగము-సంఘము-కృపావరాలు-2*

 

1కొరింథీ 12:811

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! 8వ వచనంలో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరియొకరికి ఆత్మననుసరించి జ్ఞాన వాక్యమును, మరియొకనికి అదే ఆత్మవలన విశ్వాసము కలుగుతుంది, మరియొకరికి అదే ఆత్మవలన స్వస్తపరిచే కృపావరము, మరొకరికి అద్భుతాలు చేయు శక్తి, మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మల వివేచనా వరం, మరొకరికి నానావిధ భాషలు మాట్లాడటం, మరొకరికి ఆ భాషలకు అర్ధం చెప్పేవరం లేక శక్తి ఆత్మవలన అనుగ్రహించబడుతుంది అంటున్నారు! అయితే వీటన్నిటినీ ఆ పరిశుద్దాత్ముడు ఒక్కడే తన ఇష్టము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు మరియు అలా సంఘములో కార్యమును పరిపూర్ణం చేస్తున్నాడు అంటున్నారు!

 

అద్భుతాలు చేయడం, దైవసంబంధంగా వేరే భాషల్లో లేక అన్యభాషలు  మాట్లాడ్డం వంటివి మాత్రమే కాక ఏ ఆధ్యాత్మిక సామర్థ్యమైనా సరే ఒక వ్యక్తిలో ఉంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో పని చేస్తున్నాడనేందుకు అది రుజువు మాత్రమే!

 

12:7లో  విశ్వాసులందరి శ్రేయస్సే పౌలు గారు ఎప్పుడూ  చెప్తున్న విషయం

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:24,33

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

14:5, 26;

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

26. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.

 

రోమీయులకు 14: 19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో- వెంటాడుదము)

 

“ఆత్మ ప్రత్యక్షత” అంటే విశ్వాసుల శరీరంలో ఉండే పరిశుద్దాత్మ  (6:19). ఆధ్యాత్మిక సమర్థతల ద్వారా తన సన్నిధిని వెల్లడి చేస్తాడని అర్థం.

 

మరోసారి ఈ ఆధ్యాత్మిక కృపావరాలు ఇక్కడ వేటిని చెప్పారో చూద్దాం: బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, దృఢమైన విశ్వాసము, స్వస్తపరచు వరము, అద్భుతాలు చేయు శక్తి (ఇది స్వస్తత వరం కాదు), ప్రవచన వరము, ఆత్మల వివేచనా వరము, నానావిధములైన భాషలు మాట్లాడటం లేక అన్యభాషలు దేవదూతల భాషలు మాట్లాడటం, ఆ భాషలకు అర్ధం చెప్పే వరము ఇవన్నీ ఒకే పరిశుద్దాత్ముని వలన కలుగుతున్నాయి!

 

అయితే 12:8-10 వచనాలలో  ఆధ్యాత్మిక వరాలన్నీ  ఈ జాబితాలో లేవు  28వ‌ వచనంలోను, రోమ్ 12:6-8లో పౌలుగారు  మరి కొన్నింటిని చెప్పారు....

 

1కోరింథీయులకు 12: 28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

 

Romans(రోమీయులకు) 12:6,7,8

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

వీటిని కూడా లిస్టులో పెడితే ఇప్పుడు ఇదే జాబితాలో మీదన చెప్పిన 9 కార్యాలు మరియు   పరిచర్య చేయడం, ఉపదేశించడం, ప్రోత్సహించడం, దేవునికి తన పనిలో లేక పరిచర్యకోసం ధారాళంగా ఇవ్వడం , నాయకత్వం చేయడం అనగా సంఘములో సంఘపెద్దలుగా వ్యవహరించడం, దయ చూపించడం అనగా ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం! మొత్తం 15రకాలైన కృపావరాలు ఇక్కడ చెబుతున్నారు!. మరలా దేవునికి పరిచర్య చేయడం మరికొన్ని బాగాలుగా ఉన్నాయి అవి 27 నుండి ౩౦ వచనాలలో ఉన్నాయి! ఇలా పరిచర్య కొరకు దేవుడు ఏర్పరచుకున్నవారు  అపోస్తలులు సంఘకాపరులు, సువార్తికులు , భోధకులు లేక ఉపదేశకులు ప్రవక్తలు అనే ఐదు బాగాలుగా చేశారు! గతభాగాలలో TEN FOLD ministry , Five Fold ministry కోసం చెప్పడం జరిగింది.

కాబట్టి ఇవన్నీ ఒకే పరిశుద్దాత్ముడు పనిచేసి సంఘములో దేవుని కార్యము పరిపూర్ణంగా జరగటానికి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వాడు కుంటున్నారు!

 

   ఇక 8వ వచనంలో బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము అనగా  గ్రీకులో జ్ఞానవాక్కు అనే అర్థాన్నిచ్చే పదం “లొగొస్”. ఇక్కడ ఇతరులతో మాట్లాడి మన సందేశం తెలియజెప్పగల ప్రత్యేక సామర్థ్యం అని ఈ మాటకు అర్థం. జ్ఞానం, తెలివి అనే మాటలను పౌలుగారు  వేరే చోట్ల ఉపయోగించిన తీరును బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.

జ్ఞానమంటే మానవ జ్ఞానం కాదు క్రీస్తు, ఆయన సిలువే ఈ జ్ఞానం, ఇంకా చెప్పాలంటే సిలువను గూర్చిన సువార్తే ఈ జ్ఞానము (1:17-24).

సిలువ సువార్తను, దానికి సంబంధించిన లోతైన సత్యాలను దేవుడు వెల్లడి చేసినదే ఈ జ్ఞానం (2:6). దేవుని ఆత్మ కొందరికి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఇతరులకు విప్పి చెప్పగల ప్రత్యేక సామర్థ్యాన్ని ఇస్తారు (క్రీస్తు అపోస్తలులకు ఇది సంపూర్ణంగా ఉంది).

 

“బుద్ది” కూడా ఇలాంటిదే కానీ సరిగ్గా ఇదే కాదు. ప్రజలకు, పరిస్థితులను అర్థం చేసుకుని, సమయోచితమైన మాటలతో ఇతరులు క్రీస్తును గురించీ ఆయన సత్యం గురించీ మరెక్కువగా గ్రహించగలిగేలా చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండవచ్చు.

12:9లో  ఏ విశ్వాసిలోనైనా ఉండే విశ్వాసము దేవుడు ఉచితంగా ఇచ్చినదే, ఇదికూడా పరిశుద్ధాత్మ కార్యము (ఎఫెసు 2:8-9;

 

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

ఫిలిప్పీయులకు 1: 30

క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

 

కానీ పరిశుద్దాత్మ కొందరు విశ్వాసులకు ప్రత్యేకమైన లేక ఎక్కువ విశ్వాసాన్నికలిగిస్తాడు.

అందువల్ల అది లేని వారికి సాధ్యంకాని పద్ధతుల్లో దేవుణ్ణి సేవించడానికి అలాంటి వారికి సామర్థ్యం కలుగుతుంది.

 

ఇక స్వస్తపరిచే కృపావరం లేక “రోగులను బాగు చేసే కృపావరాలు” అంటే దేవుని ప్రభావం ద్వారా వ్యాధులు పూర్తిగా నయం చేసే సామర్థ్యాలు. ఇక్కడ బహువచనాన్ని గమనించండి.

 

12:10 లో “అద్భుతాలు చేసే సామర్థ్యం” అంటే రోగుల్ని బాగుచేయడం గాకుండా వేరే రకమైన అద్భుతాలు చేసే సామర్థ్యమై ఉండాలి. ఎందుకంటే అది “మరొకరికి” ఇవ్వబడింది. ఈ అద్భుతాలంటే ఏమిటో పౌలుగారు  వివరించలేదు.  బహుశా నా అభిప్రాయం ఏమిటంటే యెహోషువా గారు సూర్యచంద్రులను ఆపిన అసాధారణ అద్భుతం, దానియేలు గారు  సింహాల నోరుమూయడం, షడ్రక్ మేషక్ అబెద్నేగోలు అగ్ని బలము చల్లార్చడం, సంసోను గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపడం, దావీదు గారు కేవలం వడిసెలతో గొల్యాతును చంపడం లాంటి అసాధారణ అద్భుతాలు- ఈ అద్భుతాలు చేసే శక్తి కావచ్చును! అయితే అవి విశ్వాసులందరి శ్రేయస్సు కోసమే గాని  ఈ శక్తిని  పొందిన వ్యక్తి కీర్తి పెరిగేందుకు కాదనీ ఖచ్చితంగా నమ్మవచ్చు (వ 7).

 

ప్రవచించడం లేక దేవుని మూలంగా పలకడమంటే దేవునినుండి ఒక సందేశాన్ని పొంది పరిశుద్దాత్మ సహాయంతో దాన్ని మనుషులకు అందించడం. ఆ సందేశం భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు, కాకపోవచ్చు.

 

“ఆత్మలను వివేచించే  లేక గుర్తించే సామర్థ్యం” అంటే మాట్లాడుతున్న ఒక వ్యక్తి దేవుని సహాయంతో అలా చేస్తున్నాడా లేదా అని గుర్తించగలగడం. దేవుని ప్రేరణ పొందినట్లు కనిపించే ప్రతి మనిషీ నిజంగా అలాంటివాడని అనుకోనవసరం లేదు. అతడు లేక ఆమె దురాత్మ ప్రేరణలో పలుకుతూ ఉండవచ్చు. లేక రేగిన తన ఆత్మ వల్లే పలుకుతూ ఉండవచ్చు.

 

1కోరింథీయులకు 14: 29

ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.

 

1యోహాను 4: 1

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:19,20,21

19. ఆత్మను ఆర్పకుడి.

20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.

21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

 

యిర్మియా 14: 14

యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

 

అలాగే 2దినవృత్తాముల గ్రంథం లో ఆహాబు చనిపోయేలా ప్రవక్తల నోట అబద్దమాడే ఆత్మ పనిచేసినట్లు చూడగలము!

మరో ఉదాహరణ: యెహేజ్కేలు మొదటి అధ్యాయంలో జీవులు అన్నారు అదే 10:20 రాబోయేసరికి  అవి కెరూబులని గుర్తు పట్టితిని అంటున్నారు, ఎలా గుర్తు పట్టారు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వివేచనా వరాలు పనిచేస్తాయి.

 

కాబట్టి ఇవన్నీ ఒక్కడే పరిశుద్దాత్ముని వలన సంఘ క్షేమం కోసం జరుగుచున్నాయి!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*85వ భాగము-సంఘము-కృపావరాలు-3*

 

1కొరింథీ 12:811

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! తరువాత నానావిధ భాషలు, మరొకరికి బాషలకు అర్ధం చెప్పే శక్తి!

నానావిధ భాషలు కోసం ఆలోచిస్తే: దీనికోసం వివరంగా మాట్లాడుకునే ముందు రెండు విషయాలు గుర్తు చేద్దామని అనుకుంటున్నాను! భాషలు అనేవి రెండు రకాలు, గాని మూడు విధాలుగా చెప్పారు! అన్యభాషలు, నానావిధ భాషలు మరియు దేవదూతల భాషలు! ఈ మూడు ఒక్కటి కాదు అని గ్రహించాలి!

అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆది అపోస్తలులు మొదట పొందినది అన్యభాషలు: అనగా ఒకరు మాట్లాడే భాష మరొకరికి వారి భాషలో అర్ధమౌతుంది!

అపో.కార్యములు 2: 4

అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

 

ఇది మిగిలిన వారికి అర్ధమయ్యింది.

నానావిధ భాషలు అన్నా దేవదూతల భాషలు అన్నా ఒకటే అని నా అభిప్రాయం! దీనికోసం భాగా అర్ధం చేసుకోవాలి అంటే 13:1 లో పౌలుగారు అంటున్నారు మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినా ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడే తాళమునై యుందును అంటున్నారు! ఇక్కడ మనుష్యుల బాషలు వేరు దేవదూతల భాషలు వేరు, మనుష్యుల భాషలు అనగా మనుష్యులకు అర్ధమయ్యే భాషలు- ఇవే అన్యభాషలు!

 

దేవదూతల భాషలు మనిషికి అర్ధం కావు! ఇవే నానావిధమైన భాషలు! ఇవి మనిషికి అర్ధం కాదు గనుకనే కొన్ని సంఘాల వారు కీసర బాషర మాట్లాడుతున్నారు అంటారు, ఎందుకంటే వీరికి ఆధ్యాత్మిక జ్ఞానము దైవిక ఆత్మ ప్రభావం లేదు గనుక! ఇది సాతాను గాడికి కూడా అర్ధం కాదు! అందుకే పౌలుగారు ఆత్మతోను ప్రార్ధన చేతును మనస్సు తోనూ చేతును అంటున్నారు! 1కోరింథీయులకు 14: 15

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

 

ఈ దేవదూతల భాషలు అనగా నానావిధమైన భాషలు మాట్లాడుతూ పౌలుగారు దేవునితో సంభాషిస్తూ ఆత్మలో ఆనందించే వారు అన్నమాట! ఇలా చేస్తే మనము కూడా ఆత్మలో దేవునితో ఆనందించవచ్చు!

 

ఇక భాషలు” అనేదానికి స్టడీ బైబిల్ లో ఇలా వ్రాయబడి ఉంది: భాషలు అని  అనువదించిన గ్రీకు పదం “గ్లోస్సోయి”. గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇది 50 సార్లు కనిపిస్తున్నది (ఇక్కడ 1 కొరింథీ 1214 అధ్యాయాల్లో 21 సార్లు కనిపిస్తున్నది). 18 సార్లు ఇది “నాలుక” అని అర్థాన్ని ఇస్తున్నది. మిగతా చోట్ల ఏదో ఒక భాష అనే అర్థాన్ని ఇస్తున్నది. అపొ కా 2వ అధ్యాయంలో క్రీస్తు అపోస్తలులు  భాషల్లో మాట్లాడిన సందర్భంలో వారు తమకు తెలియని ఇతర మానవ భాషల్లో మాట్లాడారు (వింటున్నవారికి ఎవరి భాష వారికి అర్థమైంది అపొ కా 2:4, 6, 8, 11). పౌలుగారు  ఈ వచనంలో నానా భాషలు అనే మాటను వేరే అర్థంతో ఉపయోగిస్తున్నారా? అవునని కొందరు, కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. బైబిలు ఆధారంగా ఎవరూ దీన్ని ఇలా గానీ అలా గానీ పూర్తిగా రుజువు చేయలేదు

 

సరే, 14వ అధ్యాయంలో పౌలుగారు  రాసినదాన్లో కొన్ని అస్పష్టమైన వాక్యభాగాలు ఉన్నాయి. అయితే మిగతా అన్ని చోట్లా “భాషలు” అనే మాటను ఒక అర్థంతో ఉపయోగించి ఇక్కడ మాత్రమే పౌలుగారు  వేరే అర్థంలో వాడారు నానా భాషలు మాట్లాడే సామర్థ్యం అనడంలో పౌలుగారి  భావమేదైనా సరే ఇది విశ్వాసులందరికీ ఉండదని పౌలుగారు  ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. రోగుల్ని బాగు చెయ్యడం, అద్భుతాలు చేయడం, తదితర సామర్థ్యాలు ఎలాగైతే విశ్వాసులందరికీ ఉండవో, అలానే ఇది కూడా ఉండదు. “మరొకరికి” అనే మాట దీన్ని సూచిస్తున్నది. 14:28లో కూడా దీనికోసం రాయబడింది.

1కోరింథీయులకు 14: 28

అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

 

విశ్వాసి దేవుని ఆత్మతో నిండాడని అనుకునేందుకు ఈ సామర్థ్యం రుజువు కాదు. ఏ ఇతర ఆధ్యాత్మిక సామర్థ్యం కన్నా ఈ సామర్థ్యం ఉండడం ఒక క్రైస్తవునిలో ఆత్మ ప్రత్యక్షత ఎక్కువగా ఉందని అనుకునేందుకు సూచన ఏ మాత్రమూ కాదు.

 

ఇక “భాషలకు  అర్థం చెప్పే వరము/ సామర్థ్యం” అంటే నానావిధ భాషల్లో చెప్పబడిన దాన్ని ఆత్మద్వారా అర్థం చేసుకుని వినేవారికి అర్థమయ్యే మాటల్లో చెప్పగలగడానికి దేవుడిచ్చిన సామర్థ్యం.

 

దేవుని ఆత్మకు ప్రతి వ్యక్తి పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏ సామర్థ్యం లేక కృపావరం  ఇవ్వాలో ఆయనకు తెలుసు. తన జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన సంకల్పం ప్రకారం ఆయన ఈ సామర్థ్యాలను ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు, మనం కోరిన వరాన్ని /సామర్థ్యాన్ని ఇవ్వాలని మనం ఆయనను బలవంతం చేయలేము. అలా ప్రయత్నించినా గాని అది సాధ్యం కాదు. ఆయన మనం కోరినది ఇచ్చాడని మనల్ని మనం నమ్మించుకోవచ్చు గానీ నిజంగా ఆ సామర్థ్యం మనకు కలిగిందని ఇది రుజువు కాదు. అన్నిట్లోకీ శ్రేష్ఠమైన సామర్థ్యాలను మనస్ఫూర్తిగా ఆశించాలి. అయితే ఆయన మనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నదాన్ని మారుమాట్లాడకుండా తృప్తితో స్వీకరించాలి. ఇచ్చిన వరముతో సంతృప్తి పడాలి!!

 

ఈ సందర్భంలో రెండవ విషయాన్ని చెబుతాను: కొంతమంది భాషలు నానావిధ భాషలు మాట్లాడక పోతే పరిశుద్ధాత్మ పొందినట్లు కాదు అంటారు! ఇది తప్పు అని మనకు 710 వచనాల వరకు అర్ధం అవుతుంది! అయితే భాషలు మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం అనేది పరిశుద్ధాత్మ పూర్ణతకు ఒక గుర్తు మాత్రమే!! గాని భాషలే పరిశుద్ధాత్మ కాదు!! దీనికోసం అనేకసార్లు మా ఆధ్యాత్మిక సందేశాలు శీర్షికలో వివరించడం జరిగింది! కొందరికి భాషలు రావు గాని మంచి దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారు! కొందరికి మోకరించిన వెంటనే కన్నీటితో ఒప్పించే ప్రార్ధన, గోజాడే ప్రార్ధన వచ్చేస్తుంది, నిజానికి వారు ఏడ్చి ప్రార్ధన చెయ్యాలని అనుకోరు గాని పరిశుద్దాత్ముడే వీరి తరుపున వీరికి తెలియకుండా వీరిద్వారా ఏడ్చి గోజాడి ప్రార్ధిస్తూ ఉంటాడు! ఇది ఖచ్చితంగా పరిశుద్దాత్మ కార్యమే! మరికొందరు ఆత్మలో నవ్వుతూ ఉంటారు, మరికొందరు వారికి తెలియకుండా ఆవేశంతో తిరుగుతూ అరుస్తూ ఉంటారు! ఇవన్నీ సూచనలే గాని అవి మాత్రమే పరిశుద్దాత్ముడు అని అనుకోవద్దు! దేవుడు ఒక్కక్కరికి ఒక్కో విధంగా ఆయన ఆత్మ ప్రత్యక్షతను దయచేస్తారు! అయితే ఒకటి దేవదూతల భాషలు పొందుకొనని వారు వాటికోసం ప్రార్ధన చేసి అడిగి పొందుకుంటే మంచిది! ఎందుకంటే అవి దేవదూతల భాషలు, ఇంకా భాషతో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుచున్నాడు (14:2) కాబట్టి, ఇంకా అవి సాతాను గాడికి కూడా అర్ధం కాదు కాబట్టి వాడిని మన దగ్గరనుండి తొందరగా గెంటేసి సాధనం ఈ నానావిధ భాషలు!!

 

కాబట్టి ఆత్మను ఆర్పవద్దు! ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు! (1థెస్స 5:19,20)

 

ఆత్మలో ఆనందిద్దాం!

 

ఈ వరాలు అన్నీ పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*86వ భాగము-సంఘము-కృపావరాలు-4*

 

1కొరింథీ 12:1221

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

 

     ప్రియ దైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక 1213 వచనాలలో కూడా అదే కృపావరాల కోసం కొనసాగిస్తున్నారు! ఎలాగు శరీరం అంతా కలిసిఉన్నా శరీరంలో  అనేక అవయవాలు ఉన్నాయో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అంటూ, ఎలాగనగా యూదులమైనా గ్రీసు దేశస్తులమైనా దాసులమైనా స్వతంత్రులమైనా మనమందరమూ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము! అలాగే ఒక్క ఆత్మనే పానము చేశాము అంటున్నారు!

అనగా క్రీస్తులో మనమంతా కలసి ఉన్నాము! అంతా సార్వత్రిక సంఘములో ఒకే క్రీస్తు శరీరములో ఉన్న అనేక అవయవాలుగా కలసి ఉన్నాము అంటున్నారు!

 

ఇక్కడ పౌలుగారి ఉద్దేశంలో వారు ఎవరైనా, ఎక్కడ ఉన్నా, ఏ ఆధ్యాత్మిక సామర్థ్యం, వరాలు ఫలాలు  ఉన్నా లేకపోయినా విశ్వాసులందరితో కలిసి ఏర్పడిన నిజ క్రైస్తవ సంఘం ఒక్కటే- దాని గురించి ఇక్కడ పౌలుగారు  రాస్తున్నారు.  13వ వచనంలో “మనం” అంటే క్రీస్తువిశ్వాసులు, దేవుని ఆత్మమూలంగా జన్మించినవారు అని అర్థం (యోహాను 1:12-13;

John(యోహాను సువార్త) 1:12,13

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

యోహాను 3:3-8

యోహాను 17:21-23;

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండ వలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.

22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

 

ఎఫెసు 1:22-23;

22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

ఎఫెసీయులకు 4: 4

శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

 

 5:28-30

28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

 

ఇక తరువాత ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము అంటున్నారు : ఇక్కడ పౌలుగారు  నీటి బాప్తిసం గురించి మాట్లాడ్డం లేదు. పరిశుద్దాత్మలో బాప్తిస్మం లేక అగ్నిలో బాప్తిస్మం!!   ఈ శ్రేష్ఠమైన బాప్తిస్మానికి నీటి బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. మత్తయి 3:11; అపొ కా 1:5 చూడండి.

మత్తయి 3: 11

మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో (లేక- నీళ్ళతో) మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను (లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

 

అపో.కార్యములు 1: 5

యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్ధాత్మతో) బాప్తిస్మము పొందెదరనెను.

 

ఇక్కడ “లో” అని అనువదించిన గ్రీకు పదాన్ని (“ఎన్”) “తో” లేక “వల్ల” లేక “ద్వారా” అని కూడా తర్జుమా చేయవచ్చు. ఈ ఆత్మ బాప్తిసం లేకుండా మనుషులు తమను తాము క్రైస్తవులమని పిలుచుకోవచ్చు, స్థానిక సంఘాల్లో సభ్యులుగా ఉండవచ్చు గానీ క్రీస్తు శరీరం అనే సంఘంలో వారు లేరు. మనుషులు చేసిన సంస్థ క్రీస్తు సంఘము గురించి పౌలుగారు మాట్లాడడం లేదు. సార్వత్రిక సంఘమునే క్రీస్తు సంఘము అంటారు!  దేవుని ఆత్మ జీవిస్తూ పని చేస్తూ ఉండే ఒక సజీవమైన శరీరం గురించి మాట్లాడుతున్నారు. అందులోకి ప్రవేశించగల ఏకైక మార్గం దేవుని ఆత్మ మూలంగానే.

 

 విశ్వాసంచేత యేసుప్రభువును స్వీకరించిన ప్రతి ఒక్కరూ “నేను ఆత్మలో (తో, వల్ల, ద్వారా) బాప్తిసం పొందానని” చెప్పవచ్చు, చెప్పాలి.

ఆత్మలో పానం చేయడానికి”. దేవుని ఆత్మ విశ్వాసులను క్రీస్తు శరీరంలోకి తేవడమే కాదు, ఆయన వారిలోకి వచ్చి నివసిస్తాడు (6:19). శాశ్వత జీవానికి ఊరుతూ ఉండే జీవ జలంగా ఆయన వారిలో ఉంటాడు.

1కోరింథీయులకు 6: 19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

 

యోహాను 7:37-39;

37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.

 

4:10, 13, 14

10. అందుకు యేసు: నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.

13. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

 

ఇక 1426 వచనాలు కొరింథీ సంఘంలో ఉన్నవారికి రెండు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేందుకు మానవ దేహం గురించిన ఈ ఉదాహరణను పౌలుగారు  ఉపయోగిస్తున్నారు. ఈ రెండు పాఠాలనూ మనం కూడా నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

 

మొదటిది, మానవ శరీరంలో భిన్నమైన వివిధ భాగాలు ఉన్నట్టుగానే క్రీస్తు శరీరమైన సంఘంలో కూడా ఉన్నాయి (వ 14-20). అవయవాలన్నీ ఒకటి కాదు. అలా ఉండాలని దేవుడెప్పుడూ నియమించలేదు. పౌలుగారు కృపావరాలు లేక ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేసుకోండి (వ 1). అందరికీ ఒకటే రకమైన వరములు లేక సామర్థ్యం లేక సామర్థ్యాలు లేవని పౌలుగారు చెప్పారు (వ 7-11). శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ సత్యాన్ని ఆయన నొక్కి చెప్తున్నారు. *క్రీస్తు శరీరంలో కొందరు ప్రవచించకపోతే వారు ఆ శరీరంలో భాగాలు కారా? అద్భుతాలు చేయలేకపోతే, నానా భాషల్లో మాట్లాడలేకపోతే వారు శరీరంలో భాగాలు కారా? కారని ఎవరూ అనుకోకూడదని పౌలుగారు నొక్కివక్కానించి చెప్తున్నారు.*

 

 రెండోది, మానవ శరీరంలో ఎన్ని భాగాలున్నప్పటికీ శరీరం ఒక్కటే అయినట్టుగానే క్రీస్తు శరీరం కూడా ఒక్కటే. ప్రతి భాగమూ ఇతర భాగాలపై ఆధారపడి ఉంది (వ 21-26).

 

శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉంది, ఇప్పుడు నేను చెయ్యిని కాను గనుక నేను శరీరం లోనిదానను కాను అని ఒకవేళ పాదము లేక కాలు  అంటే అది శరీరం లోనిది కాకుండా పోదు, ఇంకా నేను కన్నుని కాదు గనుక శరీరం లోనిదానను కాను అని చెవి చెప్పినంత మాత్రాన చెవి శరీరం లోనిది కాకుండా పోదు అంటున్నారు, ఇక్కడ పౌలుగారి ఉద్దేశం శరీరంలో అవయవాలు అన్నీ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, అంతా ఒకటే శరీరమై ఉన్నాయి, వాటివాటి పనులు అవి అడ్డుచెప్పకుండా నిర్వర్తిస్తున్నాయి, అలాగే క్రీస్తు సంఘంలో అంగములై ఉన్న మనము కూడా అందరూ కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగిపోవాలి అనేది పౌలుగారి ఉద్దేశం! వారు దైవసేవకులైనా అపోస్తలులు అయినా విశ్వాసులైనా ప్రవక్తలైనా ఉపదేశకులైనా కాపరులైనా ఎవరైనా సరే, క్రీస్తు యేసు సార్వత్రిక గొర్రెపిల్ల సంఘములో అందరూ కలిసి ఉన్నారు కనుక అందరూ సామరస్యంగా ఉండాలి!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*87వ భాగము-సంఘము-కృపావరాలు-5*

 

1కొరింథీ 12:1221

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ఇంకా అంటున్నారు 1719 వచనాలలో: శరీరమంతయు కన్ను అయితే వినడం ఎక్కడ? అంతా వినడం అయితే వాసన చూడటం ఎక్కడ? అలాగే దేవుడు ప్రతీ అవయవమును ఒక్కో పనికై తన చిత్తప్రకారం శరీరంలో ఉంచారు అంటున్నారు! ఇప్పుడు అన్నీ ఒకే అవయవం అయితే శరీరం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అవయవములు అనేకములైనా గాని శరీరం అంతా ఒక్కటే! అలాగే సార్వత్రిక సంఘములో అనేకమైన కృపావరాలు గలిగిన వారున్నా గాని అందరిలో ఒకే ఆత్మ పనిచేస్తూ ఒకే క్రీస్తు సంఘమై ఉన్నాము అంటున్నారు!

 

మానవ శరీరానికీ, క్రీస్తు శరీరమైన సంఘానికీ కూడా వర్తించే సత్యమిది. ప్రతి విశ్వాసీ దేవుడు అతణ్ణి లేక ఆమెను ఉంచిన చోట తృప్తితో ఉండాలి. అతణ్ణి లేక ఆమెను ఏ భాగంగా ఉండాలని ఆయన కోరాడో ఆ విధంగా ఉండేందుకు ఇష్టపడాలి. అతడు “కన్ను” అయితే కన్నులాగా పని చెయ్యాలి. “కాలు” అయితే కన్నుగా మారిపోవాలని అనుకోకుండా కాలులాగా పని చెయ్యాలి. అలాగే దేవుడు మన ఆధ్యాత్మిక సామర్ధ్యాన్ని బట్టి నిన్ను విశ్వాసిగా ఉంచితే విశ్వాసిగానే దేవుని పనిని చెయ్యాలి! నాకు పాడటం అంటే ఇష్టం, నాకు ప్రసంగాలు చెయ్యడం ఇష్టం, నాకు అద్భుతాలు చెయ్యడం ఇష్టం అని దేవా అవన్నీ నాకు ఇచ్చేయ్ అని దేవుణ్ణి డిమాండ్ చెయ్యకూడదు! దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ ఆయన సేవలో ముందుకు పోవాలి!

 

అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వరములు ఎన్నో ఉన్నాయిగాని, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!

మనమంతా ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!

 

 గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరు పనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము. అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు. దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*

 

యోహానుగారు కూడా అదే అంటున్నారు, _అన్నివిషయాలలోనూ వర్దిల్లుచూ సౌక్యముగా ఉండాలి_. 3 యోహాను :2, గనుక ప్రతీ విశ్వాసి తప్పకుండా  ప్రార్ధనలో, విశ్వాసములో, వరాలు పొందుకోవడములో  ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆత్మలో ఎదుగుచూ ఉండాలి.

 

    అయితే కొందరంటారు,

మాకు పాడాలని ఉంది గాని పాడలేకపోతున్నాను,

సువార్త ప్రకటించాలని ఉంది గాని ప్రకటించలేక పోతున్నాను,

ప్రార్ధించాలని ఉంది గాని ప్రార్ధించలేక పోతున్నాను.

మరికొంతమందికి పెద్ద సింగర్ గా, పెద్ద సువార్తికుడిగా, బోధకుడిగా అవ్వాలని ఫాంటసి/ ఒక రకమైన కోరిక. మంచిదే! అయితే కేవలం ఫాంటసీ లతో బ్రతకడం కాక నీ చేతికి వచ్చిన పని/పరిచర్య చేస్తున్నావా?

 

నీవు ముందు చిన్న పని ప్రారంభిస్తే, దేవుడు క్రమక్రమంగా ఎక్కువగా వాడుకొంటారు. మరిదానికోసం అనగా పాటగాడిగా, ప్రసంగీకునిగా మారడానికి ప్రయత్నం చేసావా?

దేవుని దగ్గర నీ పిలుపు ఏర్పాటు ఏదో ప్రార్ధనలో కనిపెట్టి నిశ్చయం చేసుకొన్నావా? లేకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్ధనలో కనిపెట్టి అడుగు:- ప్రభువా! నా జీవితం పట్ల నీచిత్తము ఏమిటి? నేను నీ సన్నిధిలో ఏరకంగా సేవా/పరిచర్య చేయడం నీ చిత్తం అని కనిపెట్టు.

 

     మరికొంతమంది తెగించి, ప్రభువా! నన్ను ప్రసంగీకునిగా మార్చెయ్! నన్ను సింగర్ గా చేసేయ్! సంఘానికి పెద్దగా, ప్రెసిడెంట్ గా చేసేయ్! భిషప్ గా చేసేయ్ అని విపరీతమైన ప్రార్ధనలు చేస్తుంటారు. దేవుడు ఇలాంటి ప్రార్ధనలకి జవాబివ్వరు. నీవు అలా మారాలనుకోవడం తప్పులేదు గాని అలా ప్రార్ధించడం తప్పు!

 

  అసలు నీగురించి నీవు ఏమనుకొంటున్నావ్?

దేవుడేమైనా నీ ఇంట్లో పనోడా, పాలికాపా? దేవునికి ఆర్డర్లు వేయడానికి.

దేవునికే సలహాలిచ్చే స్తితిలో ఉన్నావా?

 ఆయన మన సృష్టికర్త,

మన CEO,

మన జీవిత కధనానికి నిర్మాత, డైరెక్టర్, కధ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే!

నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవునికి ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో, ఎక్కడ వాడుకోవాలో, ఏ రంగంలో వాడుకోవాలో బాగాతెలుసు.

మన విశ్వాస పరిమాణం ప్రకారం మనల్ని వాడుకొంటారు.

మహా చదువరి, విజ్ఞానవేత్త, తత్వవేత్త అయిన పౌలు మహాశయుడే తనను తానూ తగ్గించుకొని:

 

Philippians(ఫిలిప్పీయులకు) 3:7,8,10,11

7. _అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని_.

8. _నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను_.

10. _ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును_,

11. _ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను_ అని అంటున్నారు, చూసారా, తనకు కలిగిన, అతిశయకారణమైన ప్రతీది మున్సిపాలిటీ చెత్తతో సమానం అంటున్నారు.

నీవు పౌలుగారి కంటే తెలివైనవాడివి, తలాంతులు గలవాడివా?

మనకి పౌలుగారికున్నంత తలాంతులు, చదువు, విశ్వాసం లేదు.

మన చదువు, పదవి, ఆస్తి, మన నీతి, దేవుని దృష్టిలో మురుకి గుడ్డలా కనిపిస్తుంది.

అయితే ఈలోకంలో ఘనులను, తెలివైన వారికి బుద్ధి చెప్పడానికి, ఎన్నికలేనివారమైన నిన్ను నన్ను ఏర్పరచుకొని వాడుకొంటున్నారు.

కాబట్టి తగ్గించుకో!

అది మన నీతి కాదు!

మరలా చెబుతున్నాను, నీవు గొప్ప ప్రసంగీకునిగా, పాటగానిగా మారాలని ఆశించడం తప్పులేదు, గాని అలా దేవునికి ఆర్డర్లు వేసి ప్రార్ధన చేయడం తప్పు!

 

*మరి ఎలా ప్రార్ధన చేయాలి*???!!!

నిన్ను నీవు తగ్గించుకో!

ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!

హృదయపూర్వకమైన నిజమైన పశ్చాత్తాపంతో,

ఒక నిజమైన స్థిరమైన ఒడంబడిక (commitment) తోనూ ఈ చిన్న ప్రార్ధన చేయు:

“ *ప్రియమైన తండ్రి*

*నాకిచ్చిన రక్షణకై వందనాలు*

*నాకు నీసేవ చేయాలని, నీ పరిచర్యలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. నా డిగ్రీలు, టాలెంట్లు అన్నీ వదిలేస్తున్నాను, నీ పరిచర్యలో ఏదైనా చిన్నపని చేయడానికి నాకు అనుమతినీయండి*!!! *ఏపని ఇచ్చినా సరే చేయడానికి సిద్ధమే*

*చివరకి నీసేవా పరిచర్యలో నీమందిరము యొక్క మరుగుదొడ్లు కడగటానికి కూడా నేను సిద్ధమే*

 *దయచేసి కేవలం నన్ను నీపనిలో వాడుకోండి ప్రభూ!* “  . ఆమెన్!

 

ఈచిన్న ప్రార్ధన చేసి చూడు!

నిన్ను నీవు సమర్పించుకో! అద్భుతాలు జరుగుతాయి.

చేయడానికి నీచేతికి వచ్చిన/ఇచ్చిన ఎంతచిన్న పని అయినా సరే నమ్మకముగా చేయు, అది విలువగలదైనా- విలువలేనిదైనా,

గుర్తింపుగలదైనా గుర్తింపులేనిదైనా సరే ఇష్టపడి, కష్టపడి చేయు!

దేవుడు నిన్ను వాడుకోవడం మొదలుపెడతారు! 

చిన్నగా ప్రారంభించిన నీ పరిచర్య నమ్మకముగా చేస్తే, దేవుడు క్రమక్రమంగా పెద్ద పనులు అప్పగిస్తారు. ఆలయాన్ని తుడవడంతో ప్రారంభించిన నిన్ను ఒకరోజు ఆ సంఘానికే కాపరిగా కూడా చెయ్యగలరు. చాపలు ఎత్తిన నిన్ను ఒకరోజు అదే సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీగా చేస్తారు. ఆనాడు ఎంతోమంది ఆలయాన్ని తుడిచినవారు, పరిచర్య చేసిన వారు , ఈరోజు సంఘంలో కాపరులుగా, ప్రెసిడెంట్లుగా , పెద్దలుగా వాడబడుతున్నారు!

ఈరోజు నీవు చేసే పని ఎవరు చూడకపోయినా, గుర్తించకపోయినా ఒకరోజు దేవుడు నీకు గొప్ప ఆధిక్యత, గుర్తింపు ఇస్తారు!

 

   ఒకవేళ ప్రియ సహోదరీ/సహోదరుడా! నీవు పని ప్రారంబించావు గాని ఎవరు నిన్ను గుర్తించడం లేదు అనుకొంటున్నావా? దేవుని CCTV ఎల్లప్పుడూ పనిచేస్తుందని, దేవుడు నిన్ను చూస్తున్నారని ప్రతీ ఒక్కరి జీతం ఆయన తీసుకొని వస్తున్నారని మరచిపోకు.

అయినా నీవు చేసేది మనుష్యులకోసం కాదు కదా! దేవునికోసమని గుర్తుంచుకో!

 

   ఒకవేళ నీవు ఏ పరిచర్య చేయడం లేదా, ఈ రోజే మొదలుపెట్టు!

 దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నారు!

 

ఇట్టి కృప ఇది  చదువుచున్న ప్రతి ఒక్కరికీ కలుగును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*88వ భాగము-సంఘము-కృపావరాలు-6*

 

1కొరింథీ 12:2126

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

22. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.

23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 21వ వచనం నుండి చూసుకుంటే: గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదు అని చెప్పలేదు, తల పాదములతో మీరు నాకక్కరలేదు అని చెప్పలేదు అంతేకాదు శరీరంలో ఏవి బలహీనమైన అవయవాలో అవే నిజంగా మనకు ముఖ్యమైన అవయవాలు అంటున్నారు!

 

వివిధమైన కృపావరాలు/ ఆధ్యాత్మిక సామర్థ్యాలున్న విశ్వాసుల గురించి పౌలుగారు  మాట్లాడుతున్నారు. సంఘంలో సహవాసం నుంచి ఒక విశ్వాసిని దూరం చేసే ప్రయత్నం ఎవరూ చెయ్యకూడదు. ఎవరూ ఇతరులకంటే తనను హెచ్చించుకోకూడదు. ఇతరులు క్రీస్తు శరీరానికి అవసరం లేదన్న దురహంకారం, గర్వం ఎవరిలోనూ ఉండకూడదు. అలాగే దైవసేవకులు వారు విశ్వాసులు- నేను కాపరిని, నేను బిషప్ ని, రెవరెండుని ఇరవైరెండుని అంటూ గొప్పలు చెప్పుకోకూడదు, విశ్వాసులను, చిన్న సంఘమున్న కాపరులను, ప్రసంగాలు అంతగా గొప్పగా చేయలేని సేవకులను చిన్నచూపు చూడకూడదు! నీవు ప్రసంగం బాగా చెయ్యగలిగితే ఆ చిన్న సంఘమున్న సేవకుడు నీకంటే గొప్పగా ప్రార్ధన చెయ్యగలడు, నీకంటే గొప్పగా పాటలు పాడగలడు, నీకంటే గొప్ప విశ్వాస వీరుడు కావచ్చు! కాబట్టి నీకున్న తలాంతుని బట్టి గర్వపడకూడదు, ఇతరులంటే తృణీకారం ఉండకూడదు!

 

ఒక చిన్న కధ చెప్పనీయండి: ఒకసారి కడుపు/పొట్ట మీద శరీరంలో ఉన్న అవయవాలన్నీ స్ట్రైక్ చేశాయంట, నేను చేతితో ఎత్తి నోటిలో పెడితే నోరు ఆహారం నమిలి లోపలికి పంపుతుంది, నేను ఏది మంచిదో కాదో సెలక్ట్ చేస్తున్నాను అని కన్ను అంది అట! నేను కష్టపడటానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడకి వెళ్లి ధనం సంపాదిస్తున్నాను కనుక తినడానికి ఆహారం వస్తుంది అని కాళ్ళు అన్నాయట, నేను రక్తాన్ని సరఫరా చేస్తున్నాను కనుక అన్ని అవయవాలు సమంగా పనిచేస్తున్నాయి, గాని మనమంతా కష్టపడుతూ ఉంటే ఆ పొట్ట తినేసి బొజ్జ పెంచేసుకుంటుంది, ఏ పనీపాట లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంది అని కుళ్ళుకుని ఒకరోజంతా స్ట్రైక్ చేశాయట! ఇదంతా విన్న కడుపు చెప్పి చూసింది- మనమంతా ఎవరి పని వారు చేసుకుంటున్నాము కాబట్టి మనం బాగున్నాము అని, గాని వినలేదు! అందుకే పొట్ట కూడా స్ట్రైక్ చెయ్యడం మొదలుపెట్టింది, అనగా జీర్ణ వ్యవస్థ స్తంభింపజేసింది పొట్ట! ఆరు గంటలు అయిపోయింది. గుండెకు రక్త సరఫరా అందడం లేదు, కాళ్ళకు శక్తి అందడం లేదు, చేయి లేవలేకపోతుంది, కళ్ళు తేలిపోతున్నాయి, అప్పుడు అవయాలన్నిటికి బుద్ధి వచ్చి శ్రీ శ్రీ శ్రీ పొట్టగారు దయచేసి మా అజ్ఞానాన్ని మన్నించండి, మరలా మీరు మీ జీర్ణవ్యవస్థను ప్రారంభించండి అన్నాయట,  కడుపు వాటితో మీరు మీ పనిచేసి వెంటనే ఆగిపోతున్నారు, నేనైతే వచ్చిన ఆహారాన్ని జాగ్రత్తగా కరిగించి రక్తముగా మార్చి బలముగా మార్చి అందరికీ అందిస్తున్నాను, 24గంటలు పనిచేస్తున్నాను, ఇలా అందరం కష్టపడుతున్నాము కాబట్టే మనం ఆరోగ్యంగా ఉన్నాము అన్నది! అలాగే క్రీస్తు శరీరంలో అనగా క్రీస్తుసంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వారివారి పనిచేసి సంఘాభివృద్ధికి పనిచెయ్యాలి! ఇంకా ఒకరిని చూసి మరొకరు అసూయ పడకూడదు! ధిక్కరించకూడదు!!!

 

ఇంకా 23వ వచనంలో శరీరంలో ఏ అవయవాలు ఘనతలేనివిగా అనుకుంటున్నామో ఆ అవయవాలు మరి ఎక్కువగా మనం ఘనపరుస్తున్నాము సుందరంగా లేని అవయవాలకు ఎక్కువ షోకులు చేస్తున్నాము! సుందరంగా ఉన్నవాటికి సౌదర్యం అక్కరలేదు కదా అంటున్నారు!

 

అయితే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా వివాదం లేకుండా ఒకదానికొకటి ఏకంగా పరామర్శించు కుంటున్నాయో అలాగే తక్కువ దానికి దేవుడు ఎక్కువ ఘనత కలుగజేసి శరీరాన్ని ఆయన మాస్టర్ ప్లాన్ తో చేశారు అంటున్నారు! అంతేకాకుండా ఒక అవయవం భాదపడితే మిగతా అవయవాలు కూడా ఆ అవయవంతో బాధపడుతున్నాయి అలాగే ఏ అవయవానికి అయినా ఘనత కలిగితే అన్నీ కలసి సంతోషిస్తున్నాయి! అలాగే సంఘము కూడా ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఘనపరుస్తూ కలిసిమెలిసి సాగిపోవాలి అంటున్నారు!

 

నిజముగా విశ్వాసులంతా తమ హృదయాలపై చెక్కుకోవలసిన మాటలు ఇవి ఇందులో పతనం కావడం వల్ల కలిగే ఫలితాలు విచారకరంగా ఉంటాయి. ఈనాడు నిజంగా అంతటా ఇవి కనిపిస్తున్నాయి.

 

1కొరింథీ 1:10, 13;

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

 

యోహాను 13: 34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

అపో.కార్యములు 4: 32

విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

 

రోమీయులకు 12: 10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

14:19; 15:1-3;

రోమీయులకు 14: 19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో- వెంటాడుదము) .

 

Romans(రోమీయులకు) 15:1,2,3

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

 

Ephesians(ఎఫెసీయులకు) 4:1,2

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ....

 

ఈ విధంగా సార్వత్రిక సంఘములో అనగా క్రీస్తు శరీరము అనే సంఘములో అంగములై ఉన్న మనమంతా ప్రేమతో వ్యవహరించడం ఎంతో ముఖ్యం! కులభేదాలు, ఆస్తి అంతస్తుల భేదాలు, డినామినేషన్ భేదాలు వర్గాభేదాలు అన్నీ వదిలేసి అందరమూ క్రీస్తు రక్తములో కడుగబడిన వారమని, అందరూ ఒకే పరిశుద్దాత్మని పొందుకుని ఒకే పరిశుద్ధాత్మ భాప్తిస్మం పొందామని భావించి అన్నదమ్ముల వలే అక్కచెల్లెల్ల వలే సోదరభావంతో సాగిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది!

మరి అలా సాగిపోదమా గమ్యానికి?!!!

దైవాశీస్సులు!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*89వ భాగము-సంఘము-కృపావరాలు-7*

 

1కొరింథీ 12:2731

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 2731 వరకు దేవుని సువార్త పరిచర్యలో దేవుడు వారి సామర్ధ్యాన్ని బట్టి దయచేసే కృపావరాలు- దాని ప్రకారం దేవుడు సంఘములో తన సేవ జరిగించుకోడానికి ఎవరెవరిని ఎలా ఏ స్థాయిలో పెట్టి తన పనిని చేసుకుంటున్నారో ఇక్కడ రాశారు! టెన్ ఫోల్డ్ మినిస్ట్రీ మరియు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ, ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీ పార్ట్ టైం మినిస్ట్రీ కోసం దీనిలోనే ఉంది! వీటికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక మొత్తం చూసుకోవద్దు గాని ఎవరు ఎలాంటి పనులు చెయ్యాలో క్లుప్తంగా చూసుకుందాం!

 

మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుల గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని భోధకులు గాను, కొందరిని అద్భుతాలు చేసేవారి గాను, కొందరిని స్వస్తపరిచే కృపావరం గలవారిగాను, కొందరిని ఉపకారాలు చేసేవారు అనగా ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవారి గాను కొందరిని ప్రభుత్వాలు చేసేవారు అనగా సంఘములో సంఘపెద్దలుగాను కొందరిని నానాభాషలు మాట్లాడేవారు గాను నియమించారు అంటున్నారు!

 

ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడే వీరిని నియమించారు! “దేవుడు...నియమించినవారు” వ 11,18. కాబట్టి దేవుడు చేసిన నియామకాల విషయంలో పోట్లాటలకు దిగవలసిన పని సంఘంలో ఎవరికీ లేదు. మరొకరి స్థానాన్ని తీసుకోవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. దేవుడు తనకు ఫలానా ఆధ్యాత్మిక సామర్థ్యం ఇవ్వాలని వాదించకూడదు. ఈ వచనంలో పౌలుగారు “ముఖ్య స్థానంలో”, “తరువాత”, “తరువాత” అనే మాటల్ని ఉపయోగించడంలో వారికున్న ప్రాధాన్యతను బట్టి ఒకరి తరువాత ఒకరిని చెప్తున్నారని సూచిస్తున్నది. క్రీస్తు అపోస్తలులు  తమ ఉపదేశాల్లో ఏ తప్పూ చేయనివారు, దేవుడు శుభవార్తను అప్పగించినవారు, సంఘానికి పునాది వేసినవారు. ప్రవక్తలు దేవప్రేరణ కలిగి సందేశాలను తెలియజెప్పేవారు (వ 10)

1. అపోస్తులులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,

మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.

రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!

 

Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.

తర్వాత *కాపరులు*: ఈ Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.

తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.

తర్వాత *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.

*అపోస్తలులు*: పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.

 ఇది అత్యంత గొప్పవిషయం!

 

Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20

20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.            

 

ఇక తర్వాత

 *అద్భుతాలు చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.

 

    తర్వాత విభాగం *నానాభాషలు మాట్లాడువారు- అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.

 

    తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది.యాకోబు 1:27; యెషయా 58

 

   తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక)ఉండాలి.

 

   చివరగా *ప్రభుత్వాలు చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్దా! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపాడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.

 

ఇక 29౩౦ వచనాలలో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి....

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

 

 ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు “కారు” అని గమనించి అర్థం చేసుకోండి. దేవుడు తన ఇష్టం వచ్చిన రీతిలో తన ప్రజలకు ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇస్తారు, ఇవ్వకపోతారు. ఇస్తే తన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు.

 

ఇక చివరి వచనంలో కృపావరములలో శ్రేష్టమైన వాట్ని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియు గాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను అంటూ అన్నింటిలో మిన్నయైనది ప్రేమయే అని 13వ అధ్యాయం లో చెబుతున్నారు!

 

1కోరింథీయులకు 14: 1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 

ఒక విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎందుకు కోరాలి? తన తృప్తి కోసం కాదు, లేక ఇతరులు తనను స్వీకరించాలని, తనకు పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు. గాని ఏడవ వచనం ప్రకారం అందరి ప్రయోజనం అనగా సంఘ క్షేమాభివృద్ధి కోసమే వాటిని కోరాలి, దేవుని చిత్తము  నెరవేరాలనే అలా కోరాలి. ప్రతి విశ్వాసీ ఇతరుల క్షేమం గురించే ఆలోచిస్తుండాలి గాని తన క్షేమం గురించి కాదు (10:24).

 అన్నిటి కంటే మేలురకమైన కృపావరాలు ఏమిటి? ఏవైతే ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు  సహాయపడతాయో ఆ వరాలు: (14:3, 5, 12).

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

 

కాబట్టి ఈ విషయాన్ని గ్రహిద్దాం!

ఆయన సేవలో పరిచర్యలో ప్రేమకలిగి ఏవిధమైన కక్ష్యలు లేకుండా భేదాలు లేకుండా ముందుకు సాగిపోదాం!

 

దైవాశీస్సులు!!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*90వ భాగము-సంఘము-కృపావరాలు-8*

 

1కొరింథీ 14:15

1. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

2. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావారాల కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక 13వ అధ్యాయం ఈ కృపావరాలలో సర్వోత్తమమైనది దేవునిప్రేమ అని చెబుతున్నారు! అయితే 14వ అధ్యాయం కూడా కృపావరాల కోసమే చెబుతుంది కాబట్టి మొదట 14వ అధ్యాయం ధ్యానించి అప్పుడు 13వ అధ్యాయం ధ్యానం చేద్దాం!

 

ఇక ఈ 14వ అధ్యాయమంతా రెండు విషయాలకోసం రాస్తున్నారు! మొదటిది భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి?

రెండు: అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!

 

ఈరోజు భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి? అనేదానికోసం ధ్యానం చేసుకుందాం!

 

13వ అధ్యాయమంతా ప్రేమకోసం చెప్పి- ఇక 14వ అధ్యాయాన్ని ప్రేమకలిగి ఉండడానికి ప్రయాస పడండి, ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో కావాలని కోరి ప్రార్ధన చెయ్యండి, అన్నిటికంటే విశేషముగా ప్రవచనవరమును కోరుకోండి అంటున్నారు! దానికి వివరణ కూడా ఇస్తున్నారు ఎందుకంటే భాషలతో  మాట్లాడువాడు మనుష్యులతో మాట్లాడటం లేదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు అంటున్నారు! ఇంకా ఆత్మవలన మర్మములు పలుకుచున్నాడు అంటున్నారు!

 

గమనించాలి- దీనిలో భాషలు లేక నానావిధభాషలు అనేవి ఏమిటి అనేది చెబుతున్నారు!! ఇవి మాట్లాడేవాడు మనిషితో మాట్లాడటం లేదు గాని దేవునితోనే మాట్లాడుచున్నాడు, అనగా దేవునితో మాట్లాడటానికి ఇది ఒక సాధనం కాబట్టి  భాషలను మాట్లాడే లాగా దేవుణ్ణి అడగండి అని పౌలుగారి ఉద్దేశం! అందుకే ఆత్మసంబంధమైన వరములను ఆసక్తిగా కోరుకోండి! ఆ తర్వాత ముఖ్యంగా ప్రవచన వరము కావాలి అని కోరుకోండి అంటున్నారు!

 

 ఎందుకు అలా కోరుకోమంటున్నారు అంటే

1కోరింథీయులకు 12: 31

కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

 

కృపావరములలో శ్రేష్టమైన వాటిని కోరుకోమన్నారు కదా, దానిలో మరొకటి శ్రేష్టమైనది ప్రవచన వరము కాబట్టి దానిని కోరుకోమన్నారు!

ప్రవచన వరమును పౌలుగారు  విశ్వాసులకు పొందుకునే ఆధ్యాత్మిక వరములు /సామర్థ్యాలన్నిటిలోకీ దీన్ని గొప్పదిగా  ఎంచుతున్నారు. ఈ అధ్యాయంలో చాలా భాగం ప్రవచనవరము  మరియు  నానా భాషల్లో మాట్లాడడం కన్నా గొప్పదని తెలియజేస్తున్నది (భాషల్లో మాట్లాడడం, దానికి అర్థం చెప్పడం అనేది, మాట్లాడేవాడు దేవునినుంచి ఒక సందేశం అందిస్తే, దానికి ప్రవచనాలు సమానం అవుతుందనుకోవచ్చు వ 5).

 

ఇక 14:2లో  కొరింథీసంఘంలో ఇతర భాషల్లో మాట్లాడడం అనేది నూటికి నూరుపాళ్ళు అపొ కా 2:4-11లో కనిపించిన కృపావరము అనగా అన్యభాషలు వంటిది కాదేమో అనుకునేందుకు ఇది ఆధారమై ఉన్నట్టు అంటారు కొందరు. మరి కొందరు అది ఇది ఒకటే గాని కొరింథీవారు దాన్ని దుర్వినియోగం చేశారంటారు. అయితే  పెంతెకొస్తు దినాన క్రీస్తు అపోస్తలులు  తమకు తెలియని భాషలు మాట్లాడారు. అనువాదంతో పని లేకుండా అక్కడ ఉన్నవారికి ఎవరి భాష వారికి అర్థం అయింది. కొరింథీసంఘంలో అయితే అనువాదం లేకుండా భాషల్లో మాట్లాడేవారి మాటల్ని ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు (వ 5,13).  కాబట్టి అపోస్తలుల కార్యములు 2లో ఉన్న అన్యభాషలు ఇక్కడ పౌలుగారు చెబుతున్న భాష ఒకటి కాదు అని అర్ధం అవుతుంది!

 

ఇక ఈ భాషలు మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుచున్నాడు అంటున్నారు పౌలుగారు దేవుడు తప్ప ఆ భాష వేరెవరికీ అర్థం కాలేదని పౌలుగారి భావం , ఇంకా మాట్లాడుతున్న వ్యక్తికి కూడా దాని అర్థం  పూర్తిగా తెలియదు గాని అతనికి అర్ధమయ్యేది ఏమిటంటే అది దేవునికి మాత్రమే ఈ భాష అర్ధమవుతుంది (వ 4,28). అందుకే దీనిని ఆసక్తితో ఆపేక్షించండి అంటూ పౌలుగారు నొక్కివక్కానించి మరీ చెబుతున్నారు!

 

దేవుని ఆత్మవలన మర్మములు లేక రహస్య సత్యాలు పలుకుచున్నాడు అంటున్నారు: కొరింథీ 4:1లో ఇలాంటివి చెప్పడానికే దేవుడు మమ్మల్ని పంపించారు అని చెప్పారు! ఇంకా  మత్తయి 13:11; రోమా 16:25 లో వీటికోసం ఉంది!

మత్తయి 13: 11

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

రోమీయులకు 16: 25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

అయితే ఏమని అర్ధమవుతుంది అంటే భాషలు మాట్లాడే వాడు ఏమి మాట్లాడుచున్నాడో మనకు అర్ధం కాదుగాని దేవునికే అర్ధమవుతుంది అయితే అవి దేవుని యొక్క మర్మములు లేక రహస్యసత్యాలు మాట్లాడుచున్నాడు! అవి దేవుని గుణగణాలు కావచ్చు! దేవుని స్తుతి కావచ్చు ఇంకా జరుగబోయే విషయాలు లేక సంభవాలు కావచ్చు!! గాని అవి మర్మాలు అని మాత్రము చెబుతున్నారు ఆత్మావేశుడై!!!

ఇది భాషలు మాట్లాడేవాడు చేసే పనులు! లేక భాషలు యొక్క ప్రత్యేకత లేక విశిష్టత!!

 

అయితే ప్రవచించు వాడు లేక ప్రవచన వరము యొక్క ఉపయోగాలు విశిష్టతలు ఏమిటి?

 

సంఘమునకు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు మనుష్యులకు అందరికీ అర్ధమయ్యేలా తమ సొంత భాషలో పలుకుతున్నాడు పరిశుద్దాత్మ పూర్ణుడై!!!

 

గమనించాలి: మొదటిగా సంఘమునకు విశ్వాసికి వానియొక్క ఆత్మకు క్షేమాభివృద్ది కలుగుతుంది ప్రవచనం వలన,

 

తర్వాత హెచ్చరిక కలుగుతుంది అనగా ఎవరైనా క్రమం తప్పుతుంటే లేక పాపములో పడితే వెంటనే దేవుని నుండి హెచ్చరిక కలుగుతుంది, ఇంకా రాబోయే శ్రమలను జరుగబోయే సంభవాలు ముందుగానే దేవుడు హెచ్చరిస్తారు! ఉదాహరణ పెద్దప్రవక్తల గ్రంధాలు గాని, చిన్న ప్రవక్తల గ్రంధాలు గాని పౌలుగారు రాసిన అనేక పత్రికలలో జరుగబోయే విషయాలు గాని దేవుని యొక్క ప్రవచనాలు, రాబోయే రోజులలో జరుగబోయే సంభవాలు ముందుగానే హెచ్చరిస్తున్నారు అన్నమాట!

 

ఇక మూడవది ఆదరణ కలిగిస్తాయి! ఎవరైనా భాధలలో శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు నా కుమారుడా భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను లాంటి ప్రవచనాలతో దేవుడు తన పిల్లలతో మాట్లాడి వారిని ఆదరించి బలపరుస్తారు ఈ ప్రవచనాల ద్వారా!!

 

అందుకే భాషలలో మాట్లాడడం కన్నా ప్రవచన వరమునే ఎక్కువగా కోరుకోండి అంటున్నారు ఎందుకంటే  అది ఇతరుల మేలుకోసం.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:24,33

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

ఇక 4వ వచనంలో భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ది కలుగజేసుకుంటున్నాడు గాని ప్రవచించు వాడు సంఘానికి క్షేమాభివృద్ది కలుగజేస్తున్నాడు అంటున్నారు!

 

“తనకే అభివృద్ధి” అంటే ఆధ్యాత్మికంగా బలపడడం. 8:1; 10:23;

1థెస్సలొనికయులకు 5: 11

కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

 

కాబట్టి భాషలు మాట్లాడటానికి ఆ వరము పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం! విశిష్టంగా ప్రవచన వరమును కూడా పొందుకోవాలని ప్రయత్నం చేద్దాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*91వ భాగము-సంఘము-కృపావరాలు-8*

1కొరింథీ 14:616

6. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడక పోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?

7. పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?

8. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?

9. ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు.

10. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను (స్వరములున్నను) వాటిలో ఒకటైనను స్పష్టముకానిదైయుండదు.

11. మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

13. భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను.

14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.

15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

16. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్‌ అని వాడేలాగు పలుకును?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

14వ అధ్యాయములో  రెండు విషయాలకోసం చూసుకుంటున్నాము! మొదటిది భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి?

రెండు: అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!

 

         (గతభాగం తరువాయి)

 

ఇక 6వ వచనంలో సహోదరులారా ఆలోచించండి భాషలతో మాట్లాడుచూ నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలు పరచకపోతే, లేక  జ్ఞానోపదేశం  గాని ప్రవచనం  గాని సందేశం గాని మీతో మాట్లాడలేక పోతే నేను వచ్చి భాషల మాట్లాడి ప్రయోజనం ఏముంది?  పిల్లనగ్రోవి గాని వీణగాని నిర్జీవ వస్తువులు నాదం చేసేటప్పుడు ఆ స్వరములలో భేదం కలుగజేయక పోతే ఊదినది ఏదో ఎలా తెలుస్తుంది, ఇంకా బూర స్పష్టముగా ధ్వని ఇవ్వకపోతే యుద్దానికి ఎవడు సిద్దమవుతాడు? అలాగే మీరు కూడా స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని మీరు ఏమి పలికారో ఎవరికి తెలుస్తుంది! మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటాది కదా అంటున్నారు!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:8,9,10

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

 

పైన చెప్పిన ఏదైనా మిగిలిన వారికి అర్ధమవ్వాలి లేకపోతే దానివలన ఉపయోగం లేదు కదా!

పౌలుగారు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే ఒకవ్యక్తికి దేవుడు ఒక సందేశం చెప్పమని చెబితే ఆ సందేశం ఆ వ్యక్తి ఎవరికీ అర్ధం కాని భాషలో చెబితే ప్రజలకు ఎలా అర్ధమవుతుంది?   కొన్ని ప్రవచనాలు సంఘములో  ఒక వ్యక్తికి హఠాత్తుగా దేవునినుంచి  వెల్లడి కావచ్చు (వ 29-31). దానిని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలి కదా!

అలా కాకపొతే సంఘమునకు గాని విశ్వాసులకు గాని ప్రయోజనం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు!

గమనించాలి పౌలుగారు అస్తమాను  “ప్రయోజనం” లేక క్షేమాభివృద్ధి ఈ మాటలనే ఉపయోగిస్తున్నారు ఈ అధ్యాయాలలో! పౌలుగారు అస్తమానం ఇతరులకు తాను చేయగలిగిన మేలు గురించే ఆలోచించారనీ, విశ్వాసులందరికీ ఇదే ఉద్దేశం ఉండాలని కోరారనీ మరోసారి చూస్తున్నాం (వ 12,19,26)

 

ఇక 14:7-11లో భాషలకు అర్థం చెప్పేవారు లేకుండా తెలియని భాషలో మాట్లాడడం వినేవారికి ఎలాంటి మేలూ కలిగించదని పౌలుగారి భావం. అన్యభాషలు లేక నానావిధభాషలు మాట్లాడినా గాని దానికి అర్ధం చెప్పేవాడు లేకపోతే దానివలన సంఘానికి ఏవిధమైన క్షేమాభివృద్ధి కలుగదు గదా!! దానినే పిల్లన గ్రోవిని వీణను ఇంకా యుద్ధం సమయంలో ఊదే బూర శబ్దాలను ఉదాహరణగా చెబుతున్నారు!

వీణ మ్రోగినప్పుడు ఆ స్వరంలో తేడాలుండాలి, అలాగే పిల్లనగ్రోవి కూడా! బూరలు వాటిని ఊదే విధానం బట్టి అవి అపాయాన్ని సూచించే శబ్ధమా లేక సంతోషకరమైన శబ్ధమా లేక యుద్దానికి బయలుదేరే శభ్ధమా అనేది అర్ధమవుతుంది! అలాగే సంఘంలో మాట్లాడే భాషలు కూడా ఇతరులకు అర్ధం కావు గాని ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడతాయి కాబట్టి భాషలు మాట్లాడేవాడు ఎక్కువగా తన గృహంలోనే మాట్లాడుకోవాలి అని చెబుతున్నారు! లేకపోతే అన్యులు వింటే వారికీ ఈ భాషలు పిచ్చి భాషలుగా అనిపిస్తాయి!!

 

అలాగే లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి అయితే మాట్లాడే ప్రతీ భాష ఎవరికో ఒకరికి అర్ధం అవుతాయి, అలా మరొకరికి అర్ధం కాకపోతే మాట్లాడేవాడు పరదేశిగా ఉంటాడు, అలాగే మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక మీకు ఏమి చెబుతున్నాను అంటే సంఘానికి క్షేమాభివృద్ది కలుగజేసే నిమిత్తం ఈ కృపావరాలు పొందుకుని వాటిని వాడండి అంటున్నారు!

ఇక్కడ కూడా మరలా క్షేమాభివృద్ది సంఘానికి మేలు కలగాలనే అంటున్నారు

14:12 వ 3,4,6,19,26,31; 10:24.

అందుకే భాషలతో మాట్లాడేవాడు వాటికి అర్ధం చెప్పే శక్తి లేక వరము కావాలని ప్రార్ధన చేయమంటున్నారు!

 

14:13లో  భాషలకు అర్థం చెబితేనే అది ఇతరులకు అభివృద్ధి కలిగిస్తుంది.

ఎందుకంటే భాషతో నేను ప్రార్ధన చేస్తే, నా ఆత్మ ప్రార్ధన చేస్తుంది గాని నా మనస్సునకు ఫలవంతంగా అనిపించదు, ఎందుకంటే అది నా మనస్సుకి అర్ధం కాలేదు! అందుకే నేను ఆత్మతోను ప్రార్ధన చేస్తాను మనస్సుతోను ప్రార్ధన చేస్తాను ఆత్మతోను పాడతాను మనస్సుతోను పాడతాను అంటున్నారు! లేకపోతే కేవలం నా ఆత్మ ఫలిస్తుంది గాని నా మనస్సు సంతోషంగా ఉండదు ఇంకా ఎవరైనా వినేవాడు ప్రార్ధన చివరలో గాని ప్రార్ధనకు ఏకీభవించినప్పుడు గాని ఆమెన్ అని ఎలా అంటాడు అంటున్నారు!

 

14-15 వచనాలలో పౌలుగారు  మనసుకూ వివేచనా శక్తికీ ఇస్తున్న ప్రాముఖ్యతను గమనించండి. “మనసు ఫలించదు” అనే కష్టమైన మాటలో పౌలుగారి భావమేమిటి? అంటే ఒక వేళ ఎవరైనా తనకు అర్థం కాని భాషలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన తన అంతరంగంలో ఉంది గానీ ఆ ప్రార్థనలో అతని మనసుకు భాగం లేదు. తాను చెప్తున్న మాటలు తనకు అర్థం కావు గనుక అలా అర్థమైతే కలిగే అభివృద్ధి కూడా అతనికి కలగదని భావం. లేక తాను చెప్తున్నది తనకు అర్థం అయినా, అది ఇతరుల విషయంలో ఏ విధంగానూ ఫలించదు. ఎందుకంటే వారికేమీ అర్థం కావడం లేదని భావం కావచ్చు. ఏది ఏమైనా  15వ వచనమును బట్టి తన ఆరాధన మాటలు ఇతరులకు  అర్థం కావాలని పౌలుగారు  చెబుతున్నారు. అందులో తన ఆత్మ, మనస్సు రెండూ పాల్గొనాలని అతని కోరిక.

 

కాబట్టి మనము కూడా ఆత్మతోను ప్రార్ధన చేద్దాం మనస్సుతోను ప్రార్ధన చేద్దాం! ముఖ్యంగా భాషలు మాట్లాడే వారు దానికి అర్ధం చెప్పే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*83వ భాగము-సంఘము-కృపావరాలు-1*

 

1కొరింథీ 12:111

1. మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.

2. మీరు అన్యజనులైయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

3. ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

4. కృపా వరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  ప్రియులారా మనం సంఘములో గల వివిధ రకాలైన సమస్యలు కోసం ధ్యానం చేసుకున్నాము!

ఇక 1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? సంఘములో ఈ కృపావరాలు దేవుడు ఎందుకు ఇస్తారు అనే దానికోసం వ్రాయబడింది! ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి కాబట్టి జాగ్రత్తగా గమనించమని మనవిచేస్తున్నాను!

 

రాబోయే మూడు అధ్యాయాలు “ఆధ్యాత్మిక సామర్థ్యాలు లేక ఆత్మసంబంధమైన వరాలు ”, ఉచిత కృపావరాలు అనే విషయం గురించి తెలియజేస్తున్నాయి. ఇవి విశ్వాసులు సహజంగా చెయ్యలేనివాటిని చేయడానికి సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఈ సామర్థ్యాలు ఉండడం దానంతట అదే విశ్వాసులను ఆధ్యాత్మిక వ్యక్తులుగా చెయ్యదని అర్థం చేసుకోవాలి. అనగా ఈ కృపావరాలు కలిగి ఉండటం అనగా వారు ఈ వరాలు ఉంటే వారు ఆధ్యాత్మిక వ్యక్తులుగా పరిపూర్ణంగా మారిపోయారు అని అర్ధం కానేకాదు అని తెలుసుకోవాలి!  కొరింథీ సంఘంలో విశ్వాసులకు ఇవి ఉన్నాయి గాని వారు శరీర సంబంధులు, లోకానికి చెందిన మనుషుల్లాగా ప్రవర్తించారు (3:1-4) ప్రకారం. శరీర స్వభావాన్ని అనుసరించేవారు లోక సంబంధంగా జీవిస్తూ ఏదో ఒక ఆధ్యాత్మిక సామర్థ్యం తనకు ఉందని గొప్పలు చెప్పుకోవడం ఎంతో వ్యర్థమైన విషయం!

 

1214 అధ్యాయాల్లో ఈ ఉచిత కృపావరాల గురించి పౌలుగారు  ఈ క్రింది విషయాలు నేర్పిస్తున్నారు. వాటిని ఈ క్రింద విధంగా విభజించవచ్చు!!

 

1) వాటిని ఇచ్చేది దేవుని పరిశుద్ధాత్ముడే (12:4, 7, 11).

 

2) యేసుక్రీస్తు ప్రభుత్వం కిందనే అవి ఇవ్వబడతాయి; ఆ విధంగానే వాటిని ఉపయోగించాలి (12:3, 5).

 

3) ప్రతి విశ్వాసికీ ఏదో ఒక సామర్థ్యం లేక వరము ఉంటుంది. (12:7, 11).

 

4) ఏదైనా లేక ఒకే  సామర్థ్యం/వరము  విశ్వాసులందరిలోనూ ఉండదు (12:29-30).

 

5) సామర్థ్యాలన్నీ/ ఆధ్యాత్మిక వరాలు  అందరి మేలుకోసమే గానీ వ్యక్తిగతమైన లాభం కోసం కాదు (12:7; 14:3-12, 19; 10:3311:1).

 

6) విశ్వాసుల్లో ఏకీభావాన్ని పెంపొందించడానికే గానీ వారిని చీల్చడానికి కాదు దేవుడీ వరములను/సామర్థ్యాలను ఇచ్చేది (12:25).

 

7) విశ్వాసుల్లో పని చేసే దేవుని ప్రేమ ఈ ఆధ్యాత్మిక వరములన్నిటికంటే గొప్పది/ సామర్థ్యాల్లో ఏ ఒక్క దానికన్నా, అన్నిటికన్నా గొప్పది (13:1-13).

 

8) విశ్వాసులు ఆధ్యాత్మికవరాలను/ సామర్థ్యాలను ఆశించాలి (12:31; 14:1).

 

9) ప్రవచించడం/ దేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప సామర్థ్యం (14:1).

 

10) ఎవరికైనా వారికున్న వరములను బట్టి లేక  ఒక సామర్థ్యాన్ని బట్టి తాను ఇతరులకన్నా గొప్పవాణ్ణని అతడు అనుకోకూడదు (4:7; 13:4; 12:21, 25).

 

11) ఈ వరములను/ సామర్థ్యాలను ఉపయోగించడంలో విశ్వాసులు మర్యాదను, క్రమాన్ని పాటించాలి (14:40).

 

ప్రతి విశ్వాసీ ఈ సత్యాలను హృదయంలో నాటుకోనిస్తే ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి సంఘాలను పట్టి పీడిస్తున్న తగవులకు, చీలికలకు తావుండేది కాదు.

 

సరే, ఈ అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం!

మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు! ఇలా నాకు ఇష్టం లేదు అని రాయడం ఈ పత్రికలో చాలాసార్లు చూస్తున్నాము! ఇక్కడ దేనికోసం చెబుతున్నారు అంటే మీరంతా ఆత్మసంబంధమైన వరాల కోసం తెలుసుకోవాలి అని పౌలుగారు చెబుతున్నారు!

మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మాట్లాడని మూగ విగ్రహాలను ఆరాధించడానికి ఎలాపడితే అలా ప్రవర్తించారు అయితే దేవుని ఆత్మవలన మాట్లాడువాడు ఎవడూ యేసు శాపగ్రస్తుడు అని చెప్పడనియు, పరిశుద్ధాత్మ ఒక మనిషిలో పనిచెయ్యక పోతే వాడు యేసు ప్రభువు అని చెప్పలేడు అంటున్నారు!

 

వారు క్రైస్తవులు కాకమునుపు గుడ్డిగా, ఆలోచనలేని విధంగా విగ్రహాల వెంటపడి పోయారు. తాము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో వారికే తెలియదు. వారు ఎదిరించని కొన్ని శక్తులు, ప్రభావాలు వారిపై పని చేస్తున్నాయి.

 

ఇక్కడ దేవుని ఆత్మవలన మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడు అని అనలేడు అనే మాట ఎందుకు అంటున్నారు అంటే  యూదులు కొందరు ఇలా అన్నారు. యేసు దేవదూషకుడనీ ఆయనకు సిలువే తగిన శిక్ష అనీ అన్నారు.  ఇంకా యేసుక్రీస్తు మ్రానుమీద వేలాడదీయబడ్డారు కాబట్టి ద్వితీయోప 21:22--23 ప్రకారం శాపగ్రస్తుడు అన్నారు! అలాంటివారిలో దేవుని ఆత్మ ఉండదని అంటున్నారు  పౌలుగారు. యేసే ప్రభువు అనడం ఆయన యెహోవాదేవుని అవతారం అనడమే. లూకా 2:11; ఫిలిప్పీ 2:10-11 చూడండి. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పని చేయకపోతే నిజ విశ్వాసంతో ఎవరూ ఇలా అనలేరు. అలా కాకుండా ఇతరులు అర్థం లేకుండా ఆ మాటలు పలకవచ్చు.

లూకా 2: 11

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

Philippians(ఫిలిప్పీయులకు) 2:9,10,11

 

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

ఇక 4వ వచనం నుండి కృపావరాలకోసం చెబుతున్నారు! ఇక్కడ ఒక్కడే పరిశుద్దాత్ముడు అందరిలోనూ వివిధమైన రకాలుగా పనిచేసి ఒక్కక్కరికి వారివారి విశ్వాస సామర్ధము ప్రకారం, వారివారి ఆధ్యాత్మిక సామర్ధ్యాల ప్రకారం వరములు ఫలములుఇస్తున్నారు అంటున్నారు

 

కృపావరములు నానా విధముగా ఉన్నవి గాని వారిలో పనిచేసే ఆత్మ ఒక్కడే! అలాగే పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి గాని పనిచేయించే  ప్రభువు ఒక్కడే! నానావిధమైన కార్యములు ఉన్నాయి గాని అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే! అయినా అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది అంటున్నారు!

దేవుని పనిలో విశ్వాసులకు ఉన్నదీ, చేయగలిగేది అంతటికీ మూలాధారాన్ని పౌలుగారు  ఇక్కడ నొక్కి చెప్తున్నారు

Ephesians(ఎఫెసీయులకు) 4:4,5,6,7

4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి (మూలభాషలో- అందరిద్వారాను) అందరిలో ఉన్నాడు.

7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప యియ్యబడెను.

 

 త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు

 

ఒక్కక్కరు వేరువేరు రకాలైన కృపావరములు కలిగి ఉన్నాగాని వారిలో పనిచేసేది పరిశుద్దాత్ముడే! కార్యం జరిగించేది దేవుడే! అయితే దేవుడు ఒక్కక్కరినికి ఒక్కో పనికి వాడుకుంటున్నారు అన్నమాట! ఆయన మన CEO. ఎవరిని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు! వారివారి సామర్ధ్యాలు కూడా దేవునికి తెలుసు! అది తెలిసే దేవుడు ఎవరికి తగినట్లు వారికి కృపావరాలు ఇస్తారు! దీనిని ఇంకా ముందుకు పోయేముందు చిన్నప్పుడు చదివిన కధను జ్ఞాపకం చెయ్యండి! ఒక తెలివైన సైంటిస్ట్ ఒకడు ప్రయాణం చేస్తూ ఎండలో మార్గమధ్యంలో ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆ మర్రి చెట్టు ఆనుకుని ఒక పాక ఉంది, పాకమీద ఒక ఆనపకాయపాదు అల్లుకుని ఉంది! ఆనపకాయ పాదుకి పెద్దపెద్ద ఆనపకాయలు వ్రేలాడుతున్నాయి! మర్రిచెట్టు నిండా మర్రిపళ్లు ఉన్నాయి! అప్పుడు ఈ తెలివైన సైంటిస్ట్ అనుకున్నాడట- దేవుడు ఎంత తెలివితక్కువ వాడు!! ఇంత పెద్ద మర్రిచెట్టుకి చిన్న మర్రిపళ్లా? ఇంతచిన్న ఆనపపాదుకి ఇంతపెద్ద ఆనపకాయలా? దేవునికి బుద్దిలేదు! నేనే గాని దేవుడనైతే మర్రి చెట్టుకి ఆనపకాయంత కాయలు, ఆనపపాదుకి మర్రిపల్లంత కాయలు పెట్టేవాడిని అని అనుకుంటున్నాడు- ఈలోగా పెద్దగాలి వచ్చింది- మర్రిపళ్లు టపటపామని కొన్నిపళ్లు రాలిపోయాయి వాటిలో రెండు పళ్లు ఒకటి తలమీద ఒకటి వీని పొట్ట మీద పడ్డాయి! అప్పుడు ఈ సైంటిస్ట్ కి జ్ఞానోదయం అయ్యిందట! అయ్యబాబోయ్! దేవుడా నీవు ఎంత తెలివైన వాడివి- నిజంగా ఆ మర్రిచెట్టుకి ఆనపకాయంత మర్రిపళ్ళు గాని ఉంటే అవి నామీద పడి ఉంటే ఈ పాటికి నా నెత్తి ముక్కలయ్యేది నా పొట్ట చెక్కలయ్యేది, నీవు ఎంత మహాజ్ఞానివి మహాప్రభో అని చెంపలేసుకున్నాడట! మనము కూడా ఏవేవో అనుకుంటాము- గాని దేవునికి మనశక్తి సామర్ధ్యాలు మనబలహీనతలు అన్నీ తెలుసు! ఎవరికీ ఏమివ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి ఏ స్థితిలో దేవుడు మనలను పిలిచారో ఏ వరాలు ఇచ్చారో వాటిని సరిగా వాడుతూ ఆయన సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేలా చెయ్యాలి!

 

దైవాశీస్సులు!

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*84వ భాగము-సంఘము-కృపావరాలు-2*

 

1కొరింథీ 12:811

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! 8వ వచనంలో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరియొకరికి ఆత్మననుసరించి జ్ఞాన వాక్యమును, మరియొకనికి అదే ఆత్మవలన విశ్వాసము కలుగుతుంది, మరియొకరికి అదే ఆత్మవలన స్వస్తపరిచే కృపావరము, మరొకరికి అద్భుతాలు చేయు శక్తి, మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మల వివేచనా వరం, మరొకరికి నానావిధ భాషలు మాట్లాడటం, మరొకరికి ఆ భాషలకు అర్ధం చెప్పేవరం లేక శక్తి ఆత్మవలన అనుగ్రహించబడుతుంది అంటున్నారు! అయితే వీటన్నిటినీ ఆ పరిశుద్దాత్ముడు ఒక్కడే తన ఇష్టము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇస్తున్నాడు మరియు అలా సంఘములో కార్యమును పరిపూర్ణం చేస్తున్నాడు అంటున్నారు!

 

అద్భుతాలు చేయడం, దైవసంబంధంగా వేరే భాషల్లో లేక అన్యభాషలు  మాట్లాడ్డం వంటివి మాత్రమే కాక ఏ ఆధ్యాత్మిక సామర్థ్యమైనా సరే ఒక వ్యక్తిలో ఉంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో పని చేస్తున్నాడనేందుకు అది రుజువు మాత్రమే!

 

12:7లో  విశ్వాసులందరి శ్రేయస్సే పౌలు గారు ఎప్పుడూ  చెప్తున్న విషయం

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:24,33

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

14:5, 26;

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

26. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.

 

రోమీయులకు 14: 19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో- వెంటాడుదము)

 

“ఆత్మ ప్రత్యక్షత” అంటే విశ్వాసుల శరీరంలో ఉండే పరిశుద్దాత్మ  (6:19). ఆధ్యాత్మిక సమర్థతల ద్వారా తన సన్నిధిని వెల్లడి చేస్తాడని అర్థం.

 

మరోసారి ఈ ఆధ్యాత్మిక కృపావరాలు ఇక్కడ వేటిని చెప్పారో చూద్దాం: బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, దృఢమైన విశ్వాసము, స్వస్తపరచు వరము, అద్భుతాలు చేయు శక్తి (ఇది స్వస్తత వరం కాదు), ప్రవచన వరము, ఆత్మల వివేచనా వరము, నానావిధములైన భాషలు మాట్లాడటం లేక అన్యభాషలు దేవదూతల భాషలు మాట్లాడటం, ఆ భాషలకు అర్ధం చెప్పే వరము ఇవన్నీ ఒకే పరిశుద్దాత్ముని వలన కలుగుతున్నాయి!

 

అయితే 12:8-10 వచనాలలో  ఆధ్యాత్మిక వరాలన్నీ  ఈ జాబితాలో లేవు  28వ‌ వచనంలోను, రోమ్ 12:6-8లో పౌలుగారు  మరి కొన్నింటిని చెప్పారు....

 

1కోరింథీయులకు 12: 28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

 

Romans(రోమీయులకు) 12:6,7,8

6. మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక,

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

 

వీటిని కూడా లిస్టులో పెడితే ఇప్పుడు ఇదే జాబితాలో మీదన చెప్పిన 9 కార్యాలు మరియు   పరిచర్య చేయడం, ఉపదేశించడం, ప్రోత్సహించడం, దేవునికి తన పనిలో లేక పరిచర్యకోసం ధారాళంగా ఇవ్వడం , నాయకత్వం చేయడం అనగా సంఘములో సంఘపెద్దలుగా వ్యవహరించడం, దయ చూపించడం అనగా ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యడం! మొత్తం 15రకాలైన కృపావరాలు ఇక్కడ చెబుతున్నారు!. మరలా దేవునికి పరిచర్య చేయడం మరికొన్ని బాగాలుగా ఉన్నాయి అవి 27 నుండి ౩౦ వచనాలలో ఉన్నాయి! ఇలా పరిచర్య కొరకు దేవుడు ఏర్పరచుకున్నవారు  అపోస్తలులు సంఘకాపరులు, సువార్తికులు , భోధకులు లేక ఉపదేశకులు ప్రవక్తలు అనే ఐదు బాగాలుగా చేశారు! గతభాగాలలో TEN FOLD ministry , Five Fold ministry కోసం చెప్పడం జరిగింది.

కాబట్టి ఇవన్నీ ఒకే పరిశుద్దాత్ముడు పనిచేసి సంఘములో దేవుని కార్యము పరిపూర్ణంగా జరగటానికి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వాడు కుంటున్నారు!

 

   ఇక 8వ వచనంలో బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము అనగా  గ్రీకులో జ్ఞానవాక్కు అనే అర్థాన్నిచ్చే పదం “లొగొస్”. ఇక్కడ ఇతరులతో మాట్లాడి మన సందేశం తెలియజెప్పగల ప్రత్యేక సామర్థ్యం అని ఈ మాటకు అర్థం. జ్ఞానం, తెలివి అనే మాటలను పౌలుగారు  వేరే చోట్ల ఉపయోగించిన తీరును బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.

జ్ఞానమంటే మానవ జ్ఞానం కాదు క్రీస్తు, ఆయన సిలువే ఈ జ్ఞానం, ఇంకా చెప్పాలంటే సిలువను గూర్చిన సువార్తే ఈ జ్ఞానము (1:17-24).

సిలువ సువార్తను, దానికి సంబంధించిన లోతైన సత్యాలను దేవుడు వెల్లడి చేసినదే ఈ జ్ఞానం (2:6). దేవుని ఆత్మ కొందరికి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఇతరులకు విప్పి చెప్పగల ప్రత్యేక సామర్థ్యాన్ని ఇస్తారు (క్రీస్తు అపోస్తలులకు ఇది సంపూర్ణంగా ఉంది).

 

“బుద్ది” కూడా ఇలాంటిదే కానీ సరిగ్గా ఇదే కాదు. ప్రజలకు, పరిస్థితులను అర్థం చేసుకుని, సమయోచితమైన మాటలతో ఇతరులు క్రీస్తును గురించీ ఆయన సత్యం గురించీ మరెక్కువగా గ్రహించగలిగేలా చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండవచ్చు.

12:9లో  ఏ విశ్వాసిలోనైనా ఉండే విశ్వాసము దేవుడు ఉచితంగా ఇచ్చినదే, ఇదికూడా పరిశుద్ధాత్మ కార్యము (ఎఫెసు 2:8-9;

 

8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

 

ఫిలిప్పీయులకు 1: 30

క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.

 

కానీ పరిశుద్దాత్మ కొందరు విశ్వాసులకు ప్రత్యేకమైన లేక ఎక్కువ విశ్వాసాన్నికలిగిస్తాడు.

అందువల్ల అది లేని వారికి సాధ్యంకాని పద్ధతుల్లో దేవుణ్ణి సేవించడానికి అలాంటి వారికి సామర్థ్యం కలుగుతుంది.

 

ఇక స్వస్తపరిచే కృపావరం లేక “రోగులను బాగు చేసే కృపావరాలు” అంటే దేవుని ప్రభావం ద్వారా వ్యాధులు పూర్తిగా నయం చేసే సామర్థ్యాలు. ఇక్కడ బహువచనాన్ని గమనించండి.

 

12:10 లో “అద్భుతాలు చేసే సామర్థ్యం” అంటే రోగుల్ని బాగుచేయడం గాకుండా వేరే రకమైన అద్భుతాలు చేసే సామర్థ్యమై ఉండాలి. ఎందుకంటే అది “మరొకరికి” ఇవ్వబడింది. ఈ అద్భుతాలంటే ఏమిటో పౌలుగారు  వివరించలేదు.  బహుశా నా అభిప్రాయం ఏమిటంటే యెహోషువా గారు సూర్యచంద్రులను ఆపిన అసాధారణ అద్భుతం, దానియేలు గారు  సింహాల నోరుమూయడం, షడ్రక్ మేషక్ అబెద్నేగోలు అగ్ని బలము చల్లార్చడం, సంసోను గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపడం, దావీదు గారు కేవలం వడిసెలతో గొల్యాతును చంపడం లాంటి అసాధారణ అద్భుతాలు- ఈ అద్భుతాలు చేసే శక్తి కావచ్చును! అయితే అవి విశ్వాసులందరి శ్రేయస్సు కోసమే గాని  ఈ శక్తిని  పొందిన వ్యక్తి కీర్తి పెరిగేందుకు కాదనీ ఖచ్చితంగా నమ్మవచ్చు (వ 7).

 

ప్రవచించడం లేక దేవుని మూలంగా పలకడమంటే దేవునినుండి ఒక సందేశాన్ని పొంది పరిశుద్దాత్మ సహాయంతో దాన్ని మనుషులకు అందించడం. ఆ సందేశం భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు, కాకపోవచ్చు.

 

“ఆత్మలను వివేచించే  లేక గుర్తించే సామర్థ్యం” అంటే మాట్లాడుతున్న ఒక వ్యక్తి దేవుని సహాయంతో అలా చేస్తున్నాడా లేదా అని గుర్తించగలగడం. దేవుని ప్రేరణ పొందినట్లు కనిపించే ప్రతి మనిషీ నిజంగా అలాంటివాడని అనుకోనవసరం లేదు. అతడు లేక ఆమె దురాత్మ ప్రేరణలో పలుకుతూ ఉండవచ్చు. లేక రేగిన తన ఆత్మ వల్లే పలుకుతూ ఉండవచ్చు.

 

1కోరింథీయులకు 14: 29

ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.

 

1యోహాను 4: 1

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

 

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:19,20,21

19. ఆత్మను ఆర్పకుడి.

20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.

21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

 

యిర్మియా 14: 14

యెహోవా నాతో ఇట్లనెను ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయ మునపుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.

 

అలాగే 2దినవృత్తాముల గ్రంథం లో ఆహాబు చనిపోయేలా ప్రవక్తల నోట అబద్దమాడే ఆత్మ పనిచేసినట్లు చూడగలము!

మరో ఉదాహరణ: యెహేజ్కేలు మొదటి అధ్యాయంలో జీవులు అన్నారు అదే 10:20 రాబోయేసరికి  అవి కెరూబులని గుర్తు పట్టితిని అంటున్నారు, ఎలా గుర్తు పట్టారు అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వివేచనా వరాలు పనిచేస్తాయి.

 

కాబట్టి ఇవన్నీ ఒక్కడే పరిశుద్దాత్ముని వలన సంఘ క్షేమం కోసం జరుగుచున్నాయి!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*85వ భాగము-సంఘము-కృపావరాలు-3*

 

1కొరింథీ 12:811

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

     (గతభాగం తరువాయి)

 

  ప్రియులారా! తరువాత నానావిధ భాషలు, మరొకరికి బాషలకు అర్ధం చెప్పే శక్తి!

నానావిధ భాషలు కోసం ఆలోచిస్తే: దీనికోసం వివరంగా మాట్లాడుకునే ముందు రెండు విషయాలు గుర్తు చేద్దామని అనుకుంటున్నాను! భాషలు అనేవి రెండు రకాలు, గాని మూడు విధాలుగా చెప్పారు! అన్యభాషలు, నానావిధ భాషలు మరియు దేవదూతల భాషలు! ఈ మూడు ఒక్కటి కాదు అని గ్రహించాలి!

అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆది అపోస్తలులు మొదట పొందినది అన్యభాషలు: అనగా ఒకరు మాట్లాడే భాష మరొకరికి వారి భాషలో అర్ధమౌతుంది!

అపో.కార్యములు 2: 4

అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

 

ఇది మిగిలిన వారికి అర్ధమయ్యింది.

నానావిధ భాషలు అన్నా దేవదూతల భాషలు అన్నా ఒకటే అని నా అభిప్రాయం! దీనికోసం భాగా అర్ధం చేసుకోవాలి అంటే 13:1 లో పౌలుగారు అంటున్నారు మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినా ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడే తాళమునై యుందును అంటున్నారు! ఇక్కడ మనుష్యుల బాషలు వేరు దేవదూతల భాషలు వేరు, మనుష్యుల భాషలు అనగా మనుష్యులకు అర్ధమయ్యే భాషలు- ఇవే అన్యభాషలు!

 

దేవదూతల భాషలు మనిషికి అర్ధం కావు! ఇవే నానావిధమైన భాషలు! ఇవి మనిషికి అర్ధం కాదు గనుకనే కొన్ని సంఘాల వారు కీసర బాషర మాట్లాడుతున్నారు అంటారు, ఎందుకంటే వీరికి ఆధ్యాత్మిక జ్ఞానము దైవిక ఆత్మ ప్రభావం లేదు గనుక! ఇది సాతాను గాడికి కూడా అర్ధం కాదు! అందుకే పౌలుగారు ఆత్మతోను ప్రార్ధన చేతును మనస్సు తోనూ చేతును అంటున్నారు! 1కోరింథీయులకు 14: 15

కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

 

ఈ దేవదూతల భాషలు అనగా నానావిధమైన భాషలు మాట్లాడుతూ పౌలుగారు దేవునితో సంభాషిస్తూ ఆత్మలో ఆనందించే వారు అన్నమాట! ఇలా చేస్తే మనము కూడా ఆత్మలో దేవునితో ఆనందించవచ్చు!

 

ఇక భాషలు” అనేదానికి స్టడీ బైబిల్ లో ఇలా వ్రాయబడి ఉంది: భాషలు అని  అనువదించిన గ్రీకు పదం “గ్లోస్సోయి”. గ్రీకు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇది 50 సార్లు కనిపిస్తున్నది (ఇక్కడ 1 కొరింథీ 1214 అధ్యాయాల్లో 21 సార్లు కనిపిస్తున్నది). 18 సార్లు ఇది “నాలుక” అని అర్థాన్ని ఇస్తున్నది. మిగతా చోట్ల ఏదో ఒక భాష అనే అర్థాన్ని ఇస్తున్నది. అపొ కా 2వ అధ్యాయంలో క్రీస్తు అపోస్తలులు  భాషల్లో మాట్లాడిన సందర్భంలో వారు తమకు తెలియని ఇతర మానవ భాషల్లో మాట్లాడారు (వింటున్నవారికి ఎవరి భాష వారికి అర్థమైంది అపొ కా 2:4, 6, 8, 11). పౌలుగారు  ఈ వచనంలో నానా భాషలు అనే మాటను వేరే అర్థంతో ఉపయోగిస్తున్నారా? అవునని కొందరు, కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. బైబిలు ఆధారంగా ఎవరూ దీన్ని ఇలా గానీ అలా గానీ పూర్తిగా రుజువు చేయలేదు

 

సరే, 14వ అధ్యాయంలో పౌలుగారు  రాసినదాన్లో కొన్ని అస్పష్టమైన వాక్యభాగాలు ఉన్నాయి. అయితే మిగతా అన్ని చోట్లా “భాషలు” అనే మాటను ఒక అర్థంతో ఉపయోగించి ఇక్కడ మాత్రమే పౌలుగారు  వేరే అర్థంలో వాడారు నానా భాషలు మాట్లాడే సామర్థ్యం అనడంలో పౌలుగారి  భావమేదైనా సరే ఇది విశ్వాసులందరికీ ఉండదని పౌలుగారు  ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. రోగుల్ని బాగు చెయ్యడం, అద్భుతాలు చేయడం, తదితర సామర్థ్యాలు ఎలాగైతే విశ్వాసులందరికీ ఉండవో, అలానే ఇది కూడా ఉండదు. “మరొకరికి” అనే మాట దీన్ని సూచిస్తున్నది. 14:28లో కూడా దీనికోసం రాయబడింది.

1కోరింథీయులకు 14: 28

అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

 

విశ్వాసి దేవుని ఆత్మతో నిండాడని అనుకునేందుకు ఈ సామర్థ్యం రుజువు కాదు. ఏ ఇతర ఆధ్యాత్మిక సామర్థ్యం కన్నా ఈ సామర్థ్యం ఉండడం ఒక క్రైస్తవునిలో ఆత్మ ప్రత్యక్షత ఎక్కువగా ఉందని అనుకునేందుకు సూచన ఏ మాత్రమూ కాదు.

 

ఇక “భాషలకు  అర్థం చెప్పే వరము/ సామర్థ్యం” అంటే నానావిధ భాషల్లో చెప్పబడిన దాన్ని ఆత్మద్వారా అర్థం చేసుకుని వినేవారికి అర్థమయ్యే మాటల్లో చెప్పగలగడానికి దేవుడిచ్చిన సామర్థ్యం.

 

దేవుని ఆత్మకు ప్రతి వ్యక్తి పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏ సామర్థ్యం లేక కృపావరం  ఇవ్వాలో ఆయనకు తెలుసు. తన జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన సంకల్పం ప్రకారం ఆయన ఈ సామర్థ్యాలను ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు, మనం కోరిన వరాన్ని /సామర్థ్యాన్ని ఇవ్వాలని మనం ఆయనను బలవంతం చేయలేము. అలా ప్రయత్నించినా గాని అది సాధ్యం కాదు. ఆయన మనం కోరినది ఇచ్చాడని మనల్ని మనం నమ్మించుకోవచ్చు గానీ నిజంగా ఆ సామర్థ్యం మనకు కలిగిందని ఇది రుజువు కాదు. అన్నిట్లోకీ శ్రేష్ఠమైన సామర్థ్యాలను మనస్ఫూర్తిగా ఆశించాలి. అయితే ఆయన మనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నదాన్ని మారుమాట్లాడకుండా తృప్తితో స్వీకరించాలి. ఇచ్చిన వరముతో సంతృప్తి పడాలి!!

 

ఈ సందర్భంలో రెండవ విషయాన్ని చెబుతాను: కొంతమంది భాషలు నానావిధ భాషలు మాట్లాడక పోతే పరిశుద్ధాత్మ పొందినట్లు కాదు అంటారు! ఇది తప్పు అని మనకు 710 వచనాల వరకు అర్ధం అవుతుంది! అయితే భాషలు మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం అనేది పరిశుద్ధాత్మ పూర్ణతకు ఒక గుర్తు మాత్రమే!! గాని భాషలే పరిశుద్ధాత్మ కాదు!! దీనికోసం అనేకసార్లు మా ఆధ్యాత్మిక సందేశాలు శీర్షికలో వివరించడం జరిగింది! కొందరికి భాషలు రావు గాని మంచి దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారు! కొందరికి మోకరించిన వెంటనే కన్నీటితో ఒప్పించే ప్రార్ధన, గోజాడే ప్రార్ధన వచ్చేస్తుంది, నిజానికి వారు ఏడ్చి ప్రార్ధన చెయ్యాలని అనుకోరు గాని పరిశుద్దాత్ముడే వీరి తరుపున వీరికి తెలియకుండా వీరిద్వారా ఏడ్చి గోజాడి ప్రార్ధిస్తూ ఉంటాడు! ఇది ఖచ్చితంగా పరిశుద్దాత్మ కార్యమే! మరికొందరు ఆత్మలో నవ్వుతూ ఉంటారు, మరికొందరు వారికి తెలియకుండా ఆవేశంతో తిరుగుతూ అరుస్తూ ఉంటారు! ఇవన్నీ సూచనలే గాని అవి మాత్రమే పరిశుద్దాత్ముడు అని అనుకోవద్దు! దేవుడు ఒక్కక్కరికి ఒక్కో విధంగా ఆయన ఆత్మ ప్రత్యక్షతను దయచేస్తారు! అయితే ఒకటి దేవదూతల భాషలు పొందుకొనని వారు వాటికోసం ప్రార్ధన చేసి అడిగి పొందుకుంటే మంచిది! ఎందుకంటే అవి దేవదూతల భాషలు, ఇంకా భాషతో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుచున్నాడు (14:2) కాబట్టి, ఇంకా అవి సాతాను గాడికి కూడా అర్ధం కాదు కాబట్టి వాడిని మన దగ్గరనుండి తొందరగా గెంటేసి సాధనం ఈ నానావిధ భాషలు!!

 

కాబట్టి ఆత్మను ఆర్పవద్దు! ప్రవచించుటను నిర్లక్షం చేయవద్దు! (1థెస్స 5:19,20)

 

ఆత్మలో ఆనందిద్దాం!

 

ఈ వరాలు అన్నీ పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*86వ భాగము-సంఘము-కృపావరాలు-4*

 

1కొరింథీ 12:1221

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

 

     ప్రియ దైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక 1213 వచనాలలో కూడా అదే కృపావరాల కోసం కొనసాగిస్తున్నారు! ఎలాగు శరీరం అంతా కలిసిఉన్నా శరీరంలో  అనేక అవయవాలు ఉన్నాయో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అంటూ, ఎలాగనగా యూదులమైనా గ్రీసు దేశస్తులమైనా దాసులమైనా స్వతంత్రులమైనా మనమందరమూ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము! అలాగే ఒక్క ఆత్మనే పానము చేశాము అంటున్నారు!

అనగా క్రీస్తులో మనమంతా కలసి ఉన్నాము! అంతా సార్వత్రిక సంఘములో ఒకే క్రీస్తు శరీరములో ఉన్న అనేక అవయవాలుగా కలసి ఉన్నాము అంటున్నారు!

 

ఇక్కడ పౌలుగారి ఉద్దేశంలో వారు ఎవరైనా, ఎక్కడ ఉన్నా, ఏ ఆధ్యాత్మిక సామర్థ్యం, వరాలు ఫలాలు  ఉన్నా లేకపోయినా విశ్వాసులందరితో కలిసి ఏర్పడిన నిజ క్రైస్తవ సంఘం ఒక్కటే- దాని గురించి ఇక్కడ పౌలుగారు  రాస్తున్నారు.  13వ వచనంలో “మనం” అంటే క్రీస్తువిశ్వాసులు, దేవుని ఆత్మమూలంగా జన్మించినవారు అని అర్థం (యోహాను 1:12-13;

John(యోహాను సువార్త) 1:12,13

12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

 

యోహాను 3:3-8

యోహాను 17:21-23;

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండ వలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.

22. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

 

ఎఫెసు 1:22-23;

22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.

23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.

 

ఎఫెసీయులకు 4: 4

శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

 

 5:28-30

28. అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

 

ఇక తరువాత ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందాము అంటున్నారు : ఇక్కడ పౌలుగారు  నీటి బాప్తిసం గురించి మాట్లాడ్డం లేదు. పరిశుద్దాత్మలో బాప్తిస్మం లేక అగ్నిలో బాప్తిస్మం!!   ఈ శ్రేష్ఠమైన బాప్తిస్మానికి నీటి బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. మత్తయి 3:11; అపొ కా 1:5 చూడండి.

మత్తయి 3: 11

మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో (లేక- నీళ్ళతో) మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను (లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.

 

అపో.కార్యములు 1: 5

యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్ధాత్మతో) బాప్తిస్మము పొందెదరనెను.

 

ఇక్కడ “లో” అని అనువదించిన గ్రీకు పదాన్ని (“ఎన్”) “తో” లేక “వల్ల” లేక “ద్వారా” అని కూడా తర్జుమా చేయవచ్చు. ఈ ఆత్మ బాప్తిసం లేకుండా మనుషులు తమను తాము క్రైస్తవులమని పిలుచుకోవచ్చు, స్థానిక సంఘాల్లో సభ్యులుగా ఉండవచ్చు గానీ క్రీస్తు శరీరం అనే సంఘంలో వారు లేరు. మనుషులు చేసిన సంస్థ క్రీస్తు సంఘము గురించి పౌలుగారు మాట్లాడడం లేదు. సార్వత్రిక సంఘమునే క్రీస్తు సంఘము అంటారు!  దేవుని ఆత్మ జీవిస్తూ పని చేస్తూ ఉండే ఒక సజీవమైన శరీరం గురించి మాట్లాడుతున్నారు. అందులోకి ప్రవేశించగల ఏకైక మార్గం దేవుని ఆత్మ మూలంగానే.

 

 విశ్వాసంచేత యేసుప్రభువును స్వీకరించిన ప్రతి ఒక్కరూ “నేను ఆత్మలో (తో, వల్ల, ద్వారా) బాప్తిసం పొందానని” చెప్పవచ్చు, చెప్పాలి.

ఆత్మలో పానం చేయడానికి”. దేవుని ఆత్మ విశ్వాసులను క్రీస్తు శరీరంలోకి తేవడమే కాదు, ఆయన వారిలోకి వచ్చి నివసిస్తాడు (6:19). శాశ్వత జీవానికి ఊరుతూ ఉండే జీవ జలంగా ఆయన వారిలో ఉంటాడు.

1కోరింథీయులకు 6: 19

మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,

 

యోహాను 7:37-39;

37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.

39. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.

 

4:10, 13, 14

10. అందుకు యేసు: నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను.

13. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును;

14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.

 

ఇక 1426 వచనాలు కొరింథీ సంఘంలో ఉన్నవారికి రెండు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేందుకు మానవ దేహం గురించిన ఈ ఉదాహరణను పౌలుగారు  ఉపయోగిస్తున్నారు. ఈ రెండు పాఠాలనూ మనం కూడా నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

 

మొదటిది, మానవ శరీరంలో భిన్నమైన వివిధ భాగాలు ఉన్నట్టుగానే క్రీస్తు శరీరమైన సంఘంలో కూడా ఉన్నాయి (వ 14-20). అవయవాలన్నీ ఒకటి కాదు. అలా ఉండాలని దేవుడెప్పుడూ నియమించలేదు. పౌలుగారు కృపావరాలు లేక ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేసుకోండి (వ 1). అందరికీ ఒకటే రకమైన వరములు లేక సామర్థ్యం లేక సామర్థ్యాలు లేవని పౌలుగారు చెప్పారు (వ 7-11). శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ సత్యాన్ని ఆయన నొక్కి చెప్తున్నారు. *క్రీస్తు శరీరంలో కొందరు ప్రవచించకపోతే వారు ఆ శరీరంలో భాగాలు కారా? అద్భుతాలు చేయలేకపోతే, నానా భాషల్లో మాట్లాడలేకపోతే వారు శరీరంలో భాగాలు కారా? కారని ఎవరూ అనుకోకూడదని పౌలుగారు నొక్కివక్కానించి చెప్తున్నారు.*

 

 రెండోది, మానవ శరీరంలో ఎన్ని భాగాలున్నప్పటికీ శరీరం ఒక్కటే అయినట్టుగానే క్రీస్తు శరీరం కూడా ఒక్కటే. ప్రతి భాగమూ ఇతర భాగాలపై ఆధారపడి ఉంది (వ 21-26).

 

శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవాలుగా ఉంది, ఇప్పుడు నేను చెయ్యిని కాను గనుక నేను శరీరం లోనిదానను కాను అని ఒకవేళ పాదము లేక కాలు  అంటే అది శరీరం లోనిది కాకుండా పోదు, ఇంకా నేను కన్నుని కాదు గనుక శరీరం లోనిదానను కాను అని చెవి చెప్పినంత మాత్రాన చెవి శరీరం లోనిది కాకుండా పోదు అంటున్నారు, ఇక్కడ పౌలుగారి ఉద్దేశం శరీరంలో అవయవాలు అన్నీ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, అంతా ఒకటే శరీరమై ఉన్నాయి, వాటివాటి పనులు అవి అడ్డుచెప్పకుండా నిర్వర్తిస్తున్నాయి, అలాగే క్రీస్తు సంఘంలో అంగములై ఉన్న మనము కూడా అందరూ కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగిపోవాలి అనేది పౌలుగారి ఉద్దేశం! వారు దైవసేవకులైనా అపోస్తలులు అయినా విశ్వాసులైనా ప్రవక్తలైనా ఉపదేశకులైనా కాపరులైనా ఎవరైనా సరే, క్రీస్తు యేసు సార్వత్రిక గొర్రెపిల్ల సంఘములో అందరూ కలిసి ఉన్నారు కనుక అందరూ సామరస్యంగా ఉండాలి!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*87వ భాగము-సంఘము-కృపావరాలు-5*

 

1కొరింథీ 12:1221

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి (లేక, శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

16. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీరమొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

      ఇంకా అంటున్నారు 1719 వచనాలలో: శరీరమంతయు కన్ను అయితే వినడం ఎక్కడ? అంతా వినడం అయితే వాసన చూడటం ఎక్కడ? అలాగే దేవుడు ప్రతీ అవయవమును ఒక్కో పనికై తన చిత్తప్రకారం శరీరంలో ఉంచారు అంటున్నారు! ఇప్పుడు అన్నీ ఒకే అవయవం అయితే శరీరం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అవయవములు అనేకములైనా గాని శరీరం అంతా ఒక్కటే! అలాగే సార్వత్రిక సంఘములో అనేకమైన కృపావరాలు గలిగిన వారున్నా గాని అందరిలో ఒకే ఆత్మ పనిచేస్తూ ఒకే క్రీస్తు సంఘమై ఉన్నాము అంటున్నారు!

 

మానవ శరీరానికీ, క్రీస్తు శరీరమైన సంఘానికీ కూడా వర్తించే సత్యమిది. ప్రతి విశ్వాసీ దేవుడు అతణ్ణి లేక ఆమెను ఉంచిన చోట తృప్తితో ఉండాలి. అతణ్ణి లేక ఆమెను ఏ భాగంగా ఉండాలని ఆయన కోరాడో ఆ విధంగా ఉండేందుకు ఇష్టపడాలి. అతడు “కన్ను” అయితే కన్నులాగా పని చెయ్యాలి. “కాలు” అయితే కన్నుగా మారిపోవాలని అనుకోకుండా కాలులాగా పని చెయ్యాలి. అలాగే దేవుడు మన ఆధ్యాత్మిక సామర్ధ్యాన్ని బట్టి నిన్ను విశ్వాసిగా ఉంచితే విశ్వాసిగానే దేవుని పనిని చెయ్యాలి! నాకు పాడటం అంటే ఇష్టం, నాకు ప్రసంగాలు చెయ్యడం ఇష్టం, నాకు అద్భుతాలు చెయ్యడం ఇష్టం అని దేవా అవన్నీ నాకు ఇచ్చేయ్ అని దేవుణ్ణి డిమాండ్ చెయ్యకూడదు! దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ ఆయన సేవలో ముందుకు పోవాలి!

 

అందరూ ప్రవక్తలు, అపోస్తలులు, అద్భుతాలు చేసేవారు, భోదకులు, సువార్తికులు అయితే సంఘంలో పరిచర్య చేసేవారు ఎవరు? సంఘాన్ని నడిపించే వారు, హెచ్చరించేవారు, ప్రార్దించేవారు ఎవరు? అందుకే పౌలు గారు అంటున్నారు కృపా వరములు ఎన్నో ఉన్నాయిగాని, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు ఎన్నో ఉన్నాయి గాని జరిగించువాడు ఒక్కడే, సంఘానికి శిరస్సు క్రీస్తు!

మనమంతా ఆ సంఘానికి అవయవాలు. సంఘాభివృద్ధికోసం, పెండ్లికుమార్తె సంఘం అందంగా అలంకరించబడటం కోసం దేవుడు కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా, కాపరులుగా వాడుకొంటూ, మిగిలిన వారిని మరో పనికి వారి విశ్వాస పరిమాణం ప్రకారం వాడుకొంటున్నారు!

 

 గొప్ప ఇంటిలో వెండిపాత్రలు, బంగారం పాత్రలు- ప్రస్తుతం అయితే స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు అన్నీ ఉంటాయి. అయితే వాటిని వాడేవిధానం, వాడబడే విధానం వేరు. వేరువేరు పనులకోసం వేరువేరు పాత్రలు వాడతాము. అలాగే దేవుడు సంఘంలో వేరువేరు పరిచర్యలు కోసం ఒక్కో వ్యక్తిని ఒక్కో విధానంలో వాడుకొంటారు. దేవుడు మన CEO. ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.

*అయితే ఇక్కడ మనం దేవుని పనికై వాడబడుతున్నామా లేదా?*

 

యోహానుగారు కూడా అదే అంటున్నారు, _అన్నివిషయాలలోనూ వర్దిల్లుచూ సౌక్యముగా ఉండాలి_. 3 యోహాను :2, గనుక ప్రతీ విశ్వాసి తప్పకుండా  ప్రార్ధనలో, విశ్వాసములో, వరాలు పొందుకోవడములో  ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆత్మలో ఎదుగుచూ ఉండాలి.

 

    అయితే కొందరంటారు,

మాకు పాడాలని ఉంది గాని పాడలేకపోతున్నాను,

సువార్త ప్రకటించాలని ఉంది గాని ప్రకటించలేక పోతున్నాను,

ప్రార్ధించాలని ఉంది గాని ప్రార్ధించలేక పోతున్నాను.

మరికొంతమందికి పెద్ద సింగర్ గా, పెద్ద సువార్తికుడిగా, బోధకుడిగా అవ్వాలని ఫాంటసి/ ఒక రకమైన కోరిక. మంచిదే! అయితే కేవలం ఫాంటసీ లతో బ్రతకడం కాక నీ చేతికి వచ్చిన పని/పరిచర్య చేస్తున్నావా?

 

నీవు ముందు చిన్న పని ప్రారంభిస్తే, దేవుడు క్రమక్రమంగా ఎక్కువగా వాడుకొంటారు. మరిదానికోసం అనగా పాటగాడిగా, ప్రసంగీకునిగా మారడానికి ప్రయత్నం చేసావా?

దేవుని దగ్గర నీ పిలుపు ఏర్పాటు ఏదో ప్రార్ధనలో కనిపెట్టి నిశ్చయం చేసుకొన్నావా? లేకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్ధనలో కనిపెట్టి అడుగు:- ప్రభువా! నా జీవితం పట్ల నీచిత్తము ఏమిటి? నేను నీ సన్నిధిలో ఏరకంగా సేవా/పరిచర్య చేయడం నీ చిత్తం అని కనిపెట్టు.

 

     మరికొంతమంది తెగించి, ప్రభువా! నన్ను ప్రసంగీకునిగా మార్చెయ్! నన్ను సింగర్ గా చేసేయ్! సంఘానికి పెద్దగా, ప్రెసిడెంట్ గా చేసేయ్! భిషప్ గా చేసేయ్ అని విపరీతమైన ప్రార్ధనలు చేస్తుంటారు. దేవుడు ఇలాంటి ప్రార్ధనలకి జవాబివ్వరు. నీవు అలా మారాలనుకోవడం తప్పులేదు గాని అలా ప్రార్ధించడం తప్పు!

 

  అసలు నీగురించి నీవు ఏమనుకొంటున్నావ్?

దేవుడేమైనా నీ ఇంట్లో పనోడా, పాలికాపా? దేవునికి ఆర్డర్లు వేయడానికి.

దేవునికే సలహాలిచ్చే స్తితిలో ఉన్నావా?

 ఆయన మన సృష్టికర్త,

మన CEO,

మన జీవిత కధనానికి నిర్మాత, డైరెక్టర్, కధ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే!

నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవునికి ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో, ఎక్కడ వాడుకోవాలో, ఏ రంగంలో వాడుకోవాలో బాగాతెలుసు.

మన విశ్వాస పరిమాణం ప్రకారం మనల్ని వాడుకొంటారు.

మహా చదువరి, విజ్ఞానవేత్త, తత్వవేత్త అయిన పౌలు మహాశయుడే తనను తానూ తగ్గించుకొని:

 

Philippians(ఫిలిప్పీయులకు) 3:7,8,10,11

7. _అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని_.

8. _నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను_.

10. _ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును_,

11. _ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను_ అని అంటున్నారు, చూసారా, తనకు కలిగిన, అతిశయకారణమైన ప్రతీది మున్సిపాలిటీ చెత్తతో సమానం అంటున్నారు.

నీవు పౌలుగారి కంటే తెలివైనవాడివి, తలాంతులు గలవాడివా?

మనకి పౌలుగారికున్నంత తలాంతులు, చదువు, విశ్వాసం లేదు.

మన చదువు, పదవి, ఆస్తి, మన నీతి, దేవుని దృష్టిలో మురుకి గుడ్డలా కనిపిస్తుంది.

అయితే ఈలోకంలో ఘనులను, తెలివైన వారికి బుద్ధి చెప్పడానికి, ఎన్నికలేనివారమైన నిన్ను నన్ను ఏర్పరచుకొని వాడుకొంటున్నారు.

కాబట్టి తగ్గించుకో!

అది మన నీతి కాదు!

మరలా చెబుతున్నాను, నీవు గొప్ప ప్రసంగీకునిగా, పాటగానిగా మారాలని ఆశించడం తప్పులేదు, గాని అలా దేవునికి ఆర్డర్లు వేసి ప్రార్ధన చేయడం తప్పు!

 

*మరి ఎలా ప్రార్ధన చేయాలి*???!!!

నిన్ను నీవు తగ్గించుకో!

ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!

హృదయపూర్వకమైన నిజమైన పశ్చాత్తాపంతో,

ఒక నిజమైన స్థిరమైన ఒడంబడిక (commitment) తోనూ ఈ చిన్న ప్రార్ధన చేయు:

“ *ప్రియమైన తండ్రి*

*నాకిచ్చిన రక్షణకై వందనాలు*

*నాకు నీసేవ చేయాలని, నీ పరిచర్యలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. నా డిగ్రీలు, టాలెంట్లు అన్నీ వదిలేస్తున్నాను, నీ పరిచర్యలో ఏదైనా చిన్నపని చేయడానికి నాకు అనుమతినీయండి*!!! *ఏపని ఇచ్చినా సరే చేయడానికి సిద్ధమే*

*చివరకి నీసేవా పరిచర్యలో నీమందిరము యొక్క మరుగుదొడ్లు కడగటానికి కూడా నేను సిద్ధమే*

 *దయచేసి కేవలం నన్ను నీపనిలో వాడుకోండి ప్రభూ!* “  . ఆమెన్!

 

ఈచిన్న ప్రార్ధన చేసి చూడు!

నిన్ను నీవు సమర్పించుకో! అద్భుతాలు జరుగుతాయి.

చేయడానికి నీచేతికి వచ్చిన/ఇచ్చిన ఎంతచిన్న పని అయినా సరే నమ్మకముగా చేయు, అది విలువగలదైనా- విలువలేనిదైనా,

గుర్తింపుగలదైనా గుర్తింపులేనిదైనా సరే ఇష్టపడి, కష్టపడి చేయు!

దేవుడు నిన్ను వాడుకోవడం మొదలుపెడతారు! 

చిన్నగా ప్రారంభించిన నీ పరిచర్య నమ్మకముగా చేస్తే, దేవుడు క్రమక్రమంగా పెద్ద పనులు అప్పగిస్తారు. ఆలయాన్ని తుడవడంతో ప్రారంభించిన నిన్ను ఒకరోజు ఆ సంఘానికే కాపరిగా కూడా చెయ్యగలరు. చాపలు ఎత్తిన నిన్ను ఒకరోజు అదే సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీగా చేస్తారు. ఆనాడు ఎంతోమంది ఆలయాన్ని తుడిచినవారు, పరిచర్య చేసిన వారు , ఈరోజు సంఘంలో కాపరులుగా, ప్రెసిడెంట్లుగా , పెద్దలుగా వాడబడుతున్నారు!

ఈరోజు నీవు చేసే పని ఎవరు చూడకపోయినా, గుర్తించకపోయినా ఒకరోజు దేవుడు నీకు గొప్ప ఆధిక్యత, గుర్తింపు ఇస్తారు!

 

   ఒకవేళ ప్రియ సహోదరీ/సహోదరుడా! నీవు పని ప్రారంబించావు గాని ఎవరు నిన్ను గుర్తించడం లేదు అనుకొంటున్నావా? దేవుని CCTV ఎల్లప్పుడూ పనిచేస్తుందని, దేవుడు నిన్ను చూస్తున్నారని ప్రతీ ఒక్కరి జీతం ఆయన తీసుకొని వస్తున్నారని మరచిపోకు.

అయినా నీవు చేసేది మనుష్యులకోసం కాదు కదా! దేవునికోసమని గుర్తుంచుకో!

 

   ఒకవేళ నీవు ఏ పరిచర్య చేయడం లేదా, ఈ రోజే మొదలుపెట్టు!

 దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నారు!

 

ఇట్టి కృప ఇది  చదువుచున్న ప్రతి ఒక్కరికీ కలుగును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*88వ భాగము-సంఘము-కృపావరాలు-6*

 

1కొరింథీ 12:2126

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

22. అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.

23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితో కూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితో కూడ సంతోషించును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 21వ వచనం నుండి చూసుకుంటే: గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదు అని చెప్పలేదు, తల పాదములతో మీరు నాకక్కరలేదు అని చెప్పలేదు అంతేకాదు శరీరంలో ఏవి బలహీనమైన అవయవాలో అవే నిజంగా మనకు ముఖ్యమైన అవయవాలు అంటున్నారు!

 

వివిధమైన కృపావరాలు/ ఆధ్యాత్మిక సామర్థ్యాలున్న విశ్వాసుల గురించి పౌలుగారు  మాట్లాడుతున్నారు. సంఘంలో సహవాసం నుంచి ఒక విశ్వాసిని దూరం చేసే ప్రయత్నం ఎవరూ చెయ్యకూడదు. ఎవరూ ఇతరులకంటే తనను హెచ్చించుకోకూడదు. ఇతరులు క్రీస్తు శరీరానికి అవసరం లేదన్న దురహంకారం, గర్వం ఎవరిలోనూ ఉండకూడదు. అలాగే దైవసేవకులు వారు విశ్వాసులు- నేను కాపరిని, నేను బిషప్ ని, రెవరెండుని ఇరవైరెండుని అంటూ గొప్పలు చెప్పుకోకూడదు, విశ్వాసులను, చిన్న సంఘమున్న కాపరులను, ప్రసంగాలు అంతగా గొప్పగా చేయలేని సేవకులను చిన్నచూపు చూడకూడదు! నీవు ప్రసంగం బాగా చెయ్యగలిగితే ఆ చిన్న సంఘమున్న సేవకుడు నీకంటే గొప్పగా ప్రార్ధన చెయ్యగలడు, నీకంటే గొప్పగా పాటలు పాడగలడు, నీకంటే గొప్ప విశ్వాస వీరుడు కావచ్చు! కాబట్టి నీకున్న తలాంతుని బట్టి గర్వపడకూడదు, ఇతరులంటే తృణీకారం ఉండకూడదు!

 

ఒక చిన్న కధ చెప్పనీయండి: ఒకసారి కడుపు/పొట్ట మీద శరీరంలో ఉన్న అవయవాలన్నీ స్ట్రైక్ చేశాయంట, నేను చేతితో ఎత్తి నోటిలో పెడితే నోరు ఆహారం నమిలి లోపలికి పంపుతుంది, నేను ఏది మంచిదో కాదో సెలక్ట్ చేస్తున్నాను అని కన్ను అంది అట! నేను కష్టపడటానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడకి వెళ్లి ధనం సంపాదిస్తున్నాను కనుక తినడానికి ఆహారం వస్తుంది అని కాళ్ళు అన్నాయట, నేను రక్తాన్ని సరఫరా చేస్తున్నాను కనుక అన్ని అవయవాలు సమంగా పనిచేస్తున్నాయి, గాని మనమంతా కష్టపడుతూ ఉంటే ఆ పొట్ట తినేసి బొజ్జ పెంచేసుకుంటుంది, ఏ పనీపాట లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంది అని కుళ్ళుకుని ఒకరోజంతా స్ట్రైక్ చేశాయట! ఇదంతా విన్న కడుపు చెప్పి చూసింది- మనమంతా ఎవరి పని వారు చేసుకుంటున్నాము కాబట్టి మనం బాగున్నాము అని, గాని వినలేదు! అందుకే పొట్ట కూడా స్ట్రైక్ చెయ్యడం మొదలుపెట్టింది, అనగా జీర్ణ వ్యవస్థ స్తంభింపజేసింది పొట్ట! ఆరు గంటలు అయిపోయింది. గుండెకు రక్త సరఫరా అందడం లేదు, కాళ్ళకు శక్తి అందడం లేదు, చేయి లేవలేకపోతుంది, కళ్ళు తేలిపోతున్నాయి, అప్పుడు అవయాలన్నిటికి బుద్ధి వచ్చి శ్రీ శ్రీ శ్రీ పొట్టగారు దయచేసి మా అజ్ఞానాన్ని మన్నించండి, మరలా మీరు మీ జీర్ణవ్యవస్థను ప్రారంభించండి అన్నాయట,  కడుపు వాటితో మీరు మీ పనిచేసి వెంటనే ఆగిపోతున్నారు, నేనైతే వచ్చిన ఆహారాన్ని జాగ్రత్తగా కరిగించి రక్తముగా మార్చి బలముగా మార్చి అందరికీ అందిస్తున్నాను, 24గంటలు పనిచేస్తున్నాను, ఇలా అందరం కష్టపడుతున్నాము కాబట్టే మనం ఆరోగ్యంగా ఉన్నాము అన్నది! అలాగే క్రీస్తు శరీరంలో అనగా క్రీస్తుసంఘంలో ఉన్న ప్రతీ ఒక్కరూ వారివారి పనిచేసి సంఘాభివృద్ధికి పనిచెయ్యాలి! ఇంకా ఒకరిని చూసి మరొకరు అసూయ పడకూడదు! ధిక్కరించకూడదు!!!

 

ఇంకా 23వ వచనంలో శరీరంలో ఏ అవయవాలు ఘనతలేనివిగా అనుకుంటున్నామో ఆ అవయవాలు మరి ఎక్కువగా మనం ఘనపరుస్తున్నాము సుందరంగా లేని అవయవాలకు ఎక్కువ షోకులు చేస్తున్నాము! సుందరంగా ఉన్నవాటికి సౌదర్యం అక్కరలేదు కదా అంటున్నారు!

 

అయితే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా వివాదం లేకుండా ఒకదానికొకటి ఏకంగా పరామర్శించు కుంటున్నాయో అలాగే తక్కువ దానికి దేవుడు ఎక్కువ ఘనత కలుగజేసి శరీరాన్ని ఆయన మాస్టర్ ప్లాన్ తో చేశారు అంటున్నారు! అంతేకాకుండా ఒక అవయవం భాదపడితే మిగతా అవయవాలు కూడా ఆ అవయవంతో బాధపడుతున్నాయి అలాగే ఏ అవయవానికి అయినా ఘనత కలిగితే అన్నీ కలసి సంతోషిస్తున్నాయి! అలాగే సంఘము కూడా ఒకరికొకరు ఓదార్చుకుంటూ ఘనపరుస్తూ కలిసిమెలిసి సాగిపోవాలి అంటున్నారు!

 

నిజముగా విశ్వాసులంతా తమ హృదయాలపై చెక్కుకోవలసిన మాటలు ఇవి ఇందులో పతనం కావడం వల్ల కలిగే ఫలితాలు విచారకరంగా ఉంటాయి. ఈనాడు నిజంగా అంతటా ఇవి కనిపిస్తున్నాయి.

 

1కొరింథీ 1:10, 13;

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

13. క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

 

యోహాను 13: 34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.

 

అపో.కార్యములు 4: 32

విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

 

రోమీయులకు 12: 10

సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

 

14:19; 15:1-3;

రోమీయులకు 14: 19

కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము (మూలభాషలో- వెంటాడుదము) .

 

Romans(రోమీయులకు) 15:1,2,3

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్నుతాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

 

Ephesians(ఎఫెసీయులకు) 4:1,2

1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ....

 

ఈ విధంగా సార్వత్రిక సంఘములో అనగా క్రీస్తు శరీరము అనే సంఘములో అంగములై ఉన్న మనమంతా ప్రేమతో వ్యవహరించడం ఎంతో ముఖ్యం! కులభేదాలు, ఆస్తి అంతస్తుల భేదాలు, డినామినేషన్ భేదాలు వర్గాభేదాలు అన్నీ వదిలేసి అందరమూ క్రీస్తు రక్తములో కడుగబడిన వారమని, అందరూ ఒకే పరిశుద్దాత్మని పొందుకుని ఒకే పరిశుద్ధాత్మ భాప్తిస్మం పొందామని భావించి అన్నదమ్ముల వలే అక్కచెల్లెల్ల వలే సోదరభావంతో సాగిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది!

మరి అలా సాగిపోదమా గమ్యానికి?!!!

దైవాశీస్సులు!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*89వ భాగము-సంఘము-కృపావరాలు-7*

 

1కొరింథీ 12:2731

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు

28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధనా జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇక 2731 వరకు దేవుని సువార్త పరిచర్యలో దేవుడు వారి సామర్ధ్యాన్ని బట్టి దయచేసే కృపావరాలు- దాని ప్రకారం దేవుడు సంఘములో తన సేవ జరిగించుకోడానికి ఎవరెవరిని ఎలా ఏ స్థాయిలో పెట్టి తన పనిని చేసుకుంటున్నారో ఇక్కడ రాశారు! టెన్ ఫోల్డ్ మినిస్ట్రీ మరియు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ, ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీ పార్ట్ టైం మినిస్ట్రీ కోసం దీనిలోనే ఉంది! వీటికోసం విస్తారంగా ధ్యానం చేసుకున్నాము గనుక మొత్తం చూసుకోవద్దు గాని ఎవరు ఎలాంటి పనులు చెయ్యాలో క్లుప్తంగా చూసుకుందాం!

 

మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుల గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని భోధకులు గాను, కొందరిని అద్భుతాలు చేసేవారి గాను, కొందరిని స్వస్తపరిచే కృపావరం గలవారిగాను, కొందరిని ఉపకారాలు చేసేవారు అనగా ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవారి గాను కొందరిని ప్రభుత్వాలు చేసేవారు అనగా సంఘములో సంఘపెద్దలుగాను కొందరిని నానాభాషలు మాట్లాడేవారు గాను నియమించారు అంటున్నారు!

 

ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడే వీరిని నియమించారు! “దేవుడు...నియమించినవారు” వ 11,18. కాబట్టి దేవుడు చేసిన నియామకాల విషయంలో పోట్లాటలకు దిగవలసిన పని సంఘంలో ఎవరికీ లేదు. మరొకరి స్థానాన్ని తీసుకోవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. దేవుడు తనకు ఫలానా ఆధ్యాత్మిక సామర్థ్యం ఇవ్వాలని వాదించకూడదు. ఈ వచనంలో పౌలుగారు “ముఖ్య స్థానంలో”, “తరువాత”, “తరువాత” అనే మాటల్ని ఉపయోగించడంలో వారికున్న ప్రాధాన్యతను బట్టి ఒకరి తరువాత ఒకరిని చెప్తున్నారని సూచిస్తున్నది. క్రీస్తు అపోస్తలులు  తమ ఉపదేశాల్లో ఏ తప్పూ చేయనివారు, దేవుడు శుభవార్తను అప్పగించినవారు, సంఘానికి పునాది వేసినవారు. ప్రవక్తలు దేవప్రేరణ కలిగి సందేశాలను తెలియజెప్పేవారు (వ 10)

1. అపోస్తులులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5. సువార్తికులు/ఉపదేశకులు,

మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.

రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!

 

Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*: సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు. సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.

తర్వాత *కాపరులు*: ఈ Fivefold ministry లో చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.

తర్వాత *బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.

తర్వాత *ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.

*అపోస్తలులు*: పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ, సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించేవారే అపోస్తులులు.

 ఇది అత్యంత గొప్పవిషయం!

 

Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20

20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.            

 

ఇక తర్వాత

 *అద్భుతాలు చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.

 

    తర్వాత విభాగం *నానాభాషలు మాట్లాడువారు- అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు- మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.

 

    తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది.యాకోబు 1:27; యెషయా 58

 

   తర్వాత విభాగం *పరిచర్య చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక)ఉండాలి.

 

   చివరగా *ప్రభుత్వాలు చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు. నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్దా! నీవు అలా ఉంటే నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపాడమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నారు.

 

ఇక 29౩౦ వచనాలలో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి....

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

 

 ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు “కారు” అని గమనించి అర్థం చేసుకోండి. దేవుడు తన ఇష్టం వచ్చిన రీతిలో తన ప్రజలకు ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇస్తారు, ఇవ్వకపోతారు. ఇస్తే తన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు.

 

ఇక చివరి వచనంలో కృపావరములలో శ్రేష్టమైన వాట్ని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియు గాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను అంటూ అన్నింటిలో మిన్నయైనది ప్రేమయే అని 13వ అధ్యాయం లో చెబుతున్నారు!

 

1కోరింథీయులకు 14: 1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 

ఒక విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎందుకు కోరాలి? తన తృప్తి కోసం కాదు, లేక ఇతరులు తనను స్వీకరించాలని, తనకు పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు. గాని ఏడవ వచనం ప్రకారం అందరి ప్రయోజనం అనగా సంఘ క్షేమాభివృద్ధి కోసమే వాటిని కోరాలి, దేవుని చిత్తము  నెరవేరాలనే అలా కోరాలి. ప్రతి విశ్వాసీ ఇతరుల క్షేమం గురించే ఆలోచిస్తుండాలి గాని తన క్షేమం గురించి కాదు (10:24).

 అన్నిటి కంటే మేలురకమైన కృపావరాలు ఏమిటి? ఏవైతే ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు  సహాయపడతాయో ఆ వరాలు: (14:3, 5, 12).

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

 

కాబట్టి ఈ విషయాన్ని గ్రహిద్దాం!

ఆయన సేవలో పరిచర్యలో ప్రేమకలిగి ఏవిధమైన కక్ష్యలు లేకుండా భేదాలు లేకుండా ముందుకు సాగిపోదాం!

 

దైవాశీస్సులు!!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*90వ భాగము-సంఘము-కృపావరాలు-8*

 

1కొరింథీ 14:15

1. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

2. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు.

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.

4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!  1214 అధ్యాయాలు సంఘమునకు దేవుడిచ్చే కృపావరాలు ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలి? బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎలా వాడాలి? అనేవాటిని ధ్యానం చేస్తూ కృపావరాల కోసం చూసుకుంటున్నాము! సంఘములో ఉన్న వారంతా దేవుని సార్వత్రిక సంఘములో అవయవాలుగా ఒకే క్రీస్తు శరీరంలో కలిసి ఉన్నామని ధ్యానం చేసుకుంటున్నాము!

 

              (గతభాగం తరువాయి)

 

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావారాల కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక 13వ అధ్యాయం ఈ కృపావరాలలో సర్వోత్తమమైనది దేవునిప్రేమ అని చెబుతున్నారు! అయితే 14వ అధ్యాయం కూడా కృపావరాల కోసమే చెబుతుంది కాబట్టి మొదట 14వ అధ్యాయం ధ్యానించి అప్పుడు 13వ అధ్యాయం ధ్యానం చేద్దాం!

 

ఇక ఈ 14వ అధ్యాయమంతా రెండు విషయాలకోసం రాస్తున్నారు! మొదటిది భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి?

రెండు: అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!

 

ఈరోజు భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి? అనేదానికోసం ధ్యానం చేసుకుందాం!

 

13వ అధ్యాయమంతా ప్రేమకోసం చెప్పి- ఇక 14వ అధ్యాయాన్ని ప్రేమకలిగి ఉండడానికి ప్రయాస పడండి, ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో కావాలని కోరి ప్రార్ధన చెయ్యండి, అన్నిటికంటే విశేషముగా ప్రవచనవరమును కోరుకోండి అంటున్నారు! దానికి వివరణ కూడా ఇస్తున్నారు ఎందుకంటే భాషలతో  మాట్లాడువాడు మనుష్యులతో మాట్లాడటం లేదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు అంటున్నారు! ఇంకా ఆత్మవలన మర్మములు పలుకుచున్నాడు అంటున్నారు!

 

గమనించాలి- దీనిలో భాషలు లేక నానావిధభాషలు అనేవి ఏమిటి అనేది చెబుతున్నారు!! ఇవి మాట్లాడేవాడు మనిషితో మాట్లాడటం లేదు గాని దేవునితోనే మాట్లాడుచున్నాడు, అనగా దేవునితో మాట్లాడటానికి ఇది ఒక సాధనం కాబట్టి  భాషలను మాట్లాడే లాగా దేవుణ్ణి అడగండి అని పౌలుగారి ఉద్దేశం! అందుకే ఆత్మసంబంధమైన వరములను ఆసక్తిగా కోరుకోండి! ఆ తర్వాత ముఖ్యంగా ప్రవచన వరము కావాలి అని కోరుకోండి అంటున్నారు!

 

 ఎందుకు అలా కోరుకోమంటున్నారు అంటే

1కోరింథీయులకు 12: 31

కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

 

కృపావరములలో శ్రేష్టమైన వాటిని కోరుకోమన్నారు కదా, దానిలో మరొకటి శ్రేష్టమైనది ప్రవచన వరము కాబట్టి దానిని కోరుకోమన్నారు!

ప్రవచన వరమును పౌలుగారు  విశ్వాసులకు పొందుకునే ఆధ్యాత్మిక వరములు /సామర్థ్యాలన్నిటిలోకీ దీన్ని గొప్పదిగా  ఎంచుతున్నారు. ఈ అధ్యాయంలో చాలా భాగం ప్రవచనవరము  మరియు  నానా భాషల్లో మాట్లాడడం కన్నా గొప్పదని తెలియజేస్తున్నది (భాషల్లో మాట్లాడడం, దానికి అర్థం చెప్పడం అనేది, మాట్లాడేవాడు దేవునినుంచి ఒక సందేశం అందిస్తే, దానికి ప్రవచనాలు సమానం అవుతుందనుకోవచ్చు వ 5).

 

ఇక 14:2లో  కొరింథీసంఘంలో ఇతర భాషల్లో మాట్లాడడం అనేది నూటికి నూరుపాళ్ళు అపొ కా 2:4-11లో కనిపించిన కృపావరము అనగా అన్యభాషలు వంటిది కాదేమో అనుకునేందుకు ఇది ఆధారమై ఉన్నట్టు అంటారు కొందరు. మరి కొందరు అది ఇది ఒకటే గాని కొరింథీవారు దాన్ని దుర్వినియోగం చేశారంటారు. అయితే  పెంతెకొస్తు దినాన క్రీస్తు అపోస్తలులు  తమకు తెలియని భాషలు మాట్లాడారు. అనువాదంతో పని లేకుండా అక్కడ ఉన్నవారికి ఎవరి భాష వారికి అర్థం అయింది. కొరింథీసంఘంలో అయితే అనువాదం లేకుండా భాషల్లో మాట్లాడేవారి మాటల్ని ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు (వ 5,13).  కాబట్టి అపోస్తలుల కార్యములు 2లో ఉన్న అన్యభాషలు ఇక్కడ పౌలుగారు చెబుతున్న భాష ఒకటి కాదు అని అర్ధం అవుతుంది!

 

ఇక ఈ భాషలు మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుచున్నాడు అంటున్నారు పౌలుగారు దేవుడు తప్ప ఆ భాష వేరెవరికీ అర్థం కాలేదని పౌలుగారి భావం , ఇంకా మాట్లాడుతున్న వ్యక్తికి కూడా దాని అర్థం  పూర్తిగా తెలియదు గాని అతనికి అర్ధమయ్యేది ఏమిటంటే అది దేవునికి మాత్రమే ఈ భాష అర్ధమవుతుంది (వ 4,28). అందుకే దీనిని ఆసక్తితో ఆపేక్షించండి అంటూ పౌలుగారు నొక్కివక్కానించి మరీ చెబుతున్నారు!

 

దేవుని ఆత్మవలన మర్మములు లేక రహస్య సత్యాలు పలుకుచున్నాడు అంటున్నారు: కొరింథీ 4:1లో ఇలాంటివి చెప్పడానికే దేవుడు మమ్మల్ని పంపించారు అని చెప్పారు! ఇంకా  మత్తయి 13:11; రోమా 16:25 లో వీటికోసం ఉంది!

మత్తయి 13: 11

పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

రోమీయులకు 16: 25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

అయితే ఏమని అర్ధమవుతుంది అంటే భాషలు మాట్లాడే వాడు ఏమి మాట్లాడుచున్నాడో మనకు అర్ధం కాదుగాని దేవునికే అర్ధమవుతుంది అయితే అవి దేవుని యొక్క మర్మములు లేక రహస్యసత్యాలు మాట్లాడుచున్నాడు! అవి దేవుని గుణగణాలు కావచ్చు! దేవుని స్తుతి కావచ్చు ఇంకా జరుగబోయే విషయాలు లేక సంభవాలు కావచ్చు!! గాని అవి మర్మాలు అని మాత్రము చెబుతున్నారు ఆత్మావేశుడై!!!

ఇది భాషలు మాట్లాడేవాడు చేసే పనులు! లేక భాషలు యొక్క ప్రత్యేకత లేక విశిష్టత!!

 

అయితే ప్రవచించు వాడు లేక ప్రవచన వరము యొక్క ఉపయోగాలు విశిష్టతలు ఏమిటి?

 

సంఘమునకు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ కలుగునట్లు మనుష్యులకు అందరికీ అర్ధమయ్యేలా తమ సొంత భాషలో పలుకుతున్నాడు పరిశుద్దాత్మ పూర్ణుడై!!!

 

గమనించాలి: మొదటిగా సంఘమునకు విశ్వాసికి వానియొక్క ఆత్మకు క్షేమాభివృద్ది కలుగుతుంది ప్రవచనం వలన,

 

తర్వాత హెచ్చరిక కలుగుతుంది అనగా ఎవరైనా క్రమం తప్పుతుంటే లేక పాపములో పడితే వెంటనే దేవుని నుండి హెచ్చరిక కలుగుతుంది, ఇంకా రాబోయే శ్రమలను జరుగబోయే సంభవాలు ముందుగానే దేవుడు హెచ్చరిస్తారు! ఉదాహరణ పెద్దప్రవక్తల గ్రంధాలు గాని, చిన్న ప్రవక్తల గ్రంధాలు గాని పౌలుగారు రాసిన అనేక పత్రికలలో జరుగబోయే విషయాలు గాని దేవుని యొక్క ప్రవచనాలు, రాబోయే రోజులలో జరుగబోయే సంభవాలు ముందుగానే హెచ్చరిస్తున్నారు అన్నమాట!

 

ఇక మూడవది ఆదరణ కలిగిస్తాయి! ఎవరైనా భాధలలో శ్రమలలో కష్టాలలో ఉన్నప్పుడు నా కుమారుడా భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను లాంటి ప్రవచనాలతో దేవుడు తన పిల్లలతో మాట్లాడి వారిని ఆదరించి బలపరుస్తారు ఈ ప్రవచనాల ద్వారా!!

 

అందుకే భాషలలో మాట్లాడడం కన్నా ప్రవచన వరమునే ఎక్కువగా కోరుకోండి అంటున్నారు ఎందుకంటే  అది ఇతరుల మేలుకోసం.

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:24,33

24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నాను.

 

ఇక 4వ వచనంలో భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ది కలుగజేసుకుంటున్నాడు గాని ప్రవచించు వాడు సంఘానికి క్షేమాభివృద్ది కలుగజేస్తున్నాడు అంటున్నారు!

 

“తనకే అభివృద్ధి” అంటే ఆధ్యాత్మికంగా బలపడడం. 8:1; 10:23;

1థెస్సలొనికయులకు 5: 11

కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

 

కాబట్టి భాషలు మాట్లాడటానికి ఆ వరము పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం! విశిష్టంగా ప్రవచన వరమును కూడా పొందుకోవాలని ప్రయత్నం చేద్దాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*91వ భాగము-సంఘము-కృపావరాలు-8*

1కొరింథీ 14:616

6. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెననియైనను మీతో మాటలాడక పోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?

7. పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?

8. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?

9. ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు.

10. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను (స్వరములున్నను) వాటిలో ఒకటైనను స్పష్టముకానిదైయుండదు.

11. మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

13. భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను.

14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.

15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

16. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్‌ అని వాడేలాగు పలుకును?

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

14వ అధ్యాయములో  రెండు విషయాలకోసం చూసుకుంటున్నాము! మొదటిది భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి?

రెండు: అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!

 

         (గతభాగం తరువాయి)

 

ఇక 6వ వచనంలో సహోదరులారా ఆలోచించండి భాషలతో మాట్లాడుచూ నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలు పరచకపోతే, లేక  జ్ఞానోపదేశం  గాని ప్రవచనం  గాని సందేశం గాని మీతో మాట్లాడలేక పోతే నేను వచ్చి భాషల మాట్లాడి ప్రయోజనం ఏముంది?  పిల్లనగ్రోవి గాని వీణగాని నిర్జీవ వస్తువులు నాదం చేసేటప్పుడు ఆ స్వరములలో భేదం కలుగజేయక పోతే ఊదినది ఏదో ఎలా తెలుస్తుంది, ఇంకా బూర స్పష్టముగా ధ్వని ఇవ్వకపోతే యుద్దానికి ఎవడు సిద్దమవుతాడు? అలాగే మీరు కూడా స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని మీరు ఏమి పలికారో ఎవరికి తెలుస్తుంది! మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటాది కదా అంటున్నారు!

 

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 12:8,9,10

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును,

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను

10. మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

 

పైన చెప్పిన ఏదైనా మిగిలిన వారికి అర్ధమవ్వాలి లేకపోతే దానివలన ఉపయోగం లేదు కదా!

పౌలుగారు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటే ఒకవ్యక్తికి దేవుడు ఒక సందేశం చెప్పమని చెబితే ఆ సందేశం ఆ వ్యక్తి ఎవరికీ అర్ధం కాని భాషలో చెబితే ప్రజలకు ఎలా అర్ధమవుతుంది?   కొన్ని ప్రవచనాలు సంఘములో  ఒక వ్యక్తికి హఠాత్తుగా దేవునినుంచి  వెల్లడి కావచ్చు (వ 29-31). దానిని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలి కదా!

అలా కాకపొతే సంఘమునకు గాని విశ్వాసులకు గాని ప్రయోజనం ఉండదు అని అభిప్రాయపడుతున్నారు!

గమనించాలి పౌలుగారు అస్తమాను  “ప్రయోజనం” లేక క్షేమాభివృద్ధి ఈ మాటలనే ఉపయోగిస్తున్నారు ఈ అధ్యాయాలలో! పౌలుగారు అస్తమానం ఇతరులకు తాను చేయగలిగిన మేలు గురించే ఆలోచించారనీ, విశ్వాసులందరికీ ఇదే ఉద్దేశం ఉండాలని కోరారనీ మరోసారి చూస్తున్నాం (వ 12,19,26)

 

ఇక 14:7-11లో భాషలకు అర్థం చెప్పేవారు లేకుండా తెలియని భాషలో మాట్లాడడం వినేవారికి ఎలాంటి మేలూ కలిగించదని పౌలుగారి భావం. అన్యభాషలు లేక నానావిధభాషలు మాట్లాడినా గాని దానికి అర్ధం చెప్పేవాడు లేకపోతే దానివలన సంఘానికి ఏవిధమైన క్షేమాభివృద్ధి కలుగదు గదా!! దానినే పిల్లన గ్రోవిని వీణను ఇంకా యుద్ధం సమయంలో ఊదే బూర శబ్దాలను ఉదాహరణగా చెబుతున్నారు!

వీణ మ్రోగినప్పుడు ఆ స్వరంలో తేడాలుండాలి, అలాగే పిల్లనగ్రోవి కూడా! బూరలు వాటిని ఊదే విధానం బట్టి అవి అపాయాన్ని సూచించే శబ్ధమా లేక సంతోషకరమైన శబ్ధమా లేక యుద్దానికి బయలుదేరే శభ్ధమా అనేది అర్ధమవుతుంది! అలాగే సంఘంలో మాట్లాడే భాషలు కూడా ఇతరులకు అర్ధం కావు గాని ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడతాయి కాబట్టి భాషలు మాట్లాడేవాడు ఎక్కువగా తన గృహంలోనే మాట్లాడుకోవాలి అని చెబుతున్నారు! లేకపోతే అన్యులు వింటే వారికీ ఈ భాషలు పిచ్చి భాషలుగా అనిపిస్తాయి!!

 

అలాగే లోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి అయితే మాట్లాడే ప్రతీ భాష ఎవరికో ఒకరికి అర్ధం అవుతాయి, అలా మరొకరికి అర్ధం కాకపోతే మాట్లాడేవాడు పరదేశిగా ఉంటాడు, అలాగే మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక మీకు ఏమి చెబుతున్నాను అంటే సంఘానికి క్షేమాభివృద్ది కలుగజేసే నిమిత్తం ఈ కృపావరాలు పొందుకుని వాటిని వాడండి అంటున్నారు!

ఇక్కడ కూడా మరలా క్షేమాభివృద్ది సంఘానికి మేలు కలగాలనే అంటున్నారు

14:12 వ 3,4,6,19,26,31; 10:24.

అందుకే భాషలతో మాట్లాడేవాడు వాటికి అర్ధం చెప్పే శక్తి లేక వరము కావాలని ప్రార్ధన చేయమంటున్నారు!

 

14:13లో  భాషలకు అర్థం చెబితేనే అది ఇతరులకు అభివృద్ధి కలిగిస్తుంది.

ఎందుకంటే భాషతో నేను ప్రార్ధన చేస్తే, నా ఆత్మ ప్రార్ధన చేస్తుంది గాని నా మనస్సునకు ఫలవంతంగా అనిపించదు, ఎందుకంటే అది నా మనస్సుకి అర్ధం కాలేదు! అందుకే నేను ఆత్మతోను ప్రార్ధన చేస్తాను మనస్సుతోను ప్రార్ధన చేస్తాను ఆత్మతోను పాడతాను మనస్సుతోను పాడతాను అంటున్నారు! లేకపోతే కేవలం నా ఆత్మ ఫలిస్తుంది గాని నా మనస్సు సంతోషంగా ఉండదు ఇంకా ఎవరైనా వినేవాడు ప్రార్ధన చివరలో గాని ప్రార్ధనకు ఏకీభవించినప్పుడు గాని ఆమెన్ అని ఎలా అంటాడు అంటున్నారు!

 

14-15 వచనాలలో పౌలుగారు  మనసుకూ వివేచనా శక్తికీ ఇస్తున్న ప్రాముఖ్యతను గమనించండి. “మనసు ఫలించదు” అనే కష్టమైన మాటలో పౌలుగారి భావమేమిటి? అంటే ఒక వేళ ఎవరైనా తనకు అర్థం కాని భాషలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన తన అంతరంగంలో ఉంది గానీ ఆ ప్రార్థనలో అతని మనసుకు భాగం లేదు. తాను చెప్తున్న మాటలు తనకు అర్థం కావు గనుక అలా అర్థమైతే కలిగే అభివృద్ధి కూడా అతనికి కలగదని భావం. లేక తాను చెప్తున్నది తనకు అర్థం అయినా, అది ఇతరుల విషయంలో ఏ విధంగానూ ఫలించదు. ఎందుకంటే వారికేమీ అర్థం కావడం లేదని భావం కావచ్చు. ఏది ఏమైనా  15వ వచనమును బట్టి తన ఆరాధన మాటలు ఇతరులకు  అర్థం కావాలని పౌలుగారు  చెబుతున్నారు. అందులో తన ఆత్మ, మనస్సు రెండూ పాల్గొనాలని అతని కోరిక.

 

కాబట్టి మనము కూడా ఆత్మతోను ప్రార్ధన చేద్దాం మనస్సుతోను ప్రార్ధన చేద్దాం! ముఖ్యంగా భాషలు మాట్లాడే వారు దానికి అర్ధం చెప్పే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*92వ భాగము-సంఘము-కృపావరాలు-9*

 

1కొరింథీ 14:1825

18. నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.

19. అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.

20. సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలైయుండుడి.

21. అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది.

22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది.

23. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా?

24. అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.

25. అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును.ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

14వ అధ్యాయములో  రెండు విషయాలకోసం చూసుకుంటున్నాము! మొదటిది భాషల వరం ఎందుకు కావాలి? దాని ప్రత్యేకత ఏమిటి?  దానివలన ఉపయోగం ఏమిటి?

రెండు: అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!

 

         (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇంతవరకు భాషల వరము- ప్రవచన వరముల యొక్క విశిష్టతలను చూసుకున్నాము!

ఇక రెండవ విషయం చూసుకుందాం! అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!!  దీనికోసం 17వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు చెప్పారు! అన్నీ క్రమప్రకారం జరగాలి, భాషలు మాట్లాడేవాడైనా ప్రవచించు వాడు గాని అందరు అల్లరికాకుండా క్రమపద్దతిలో ఈ కృపావరములను ఉపయోగించుకోవాలి అని చెబుతున్నారు! సంఘక్రమమును నేర్పిస్తున్నారు!

18వ వచనంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవునికి స్తోత్రం అంటున్నారు! అయినా గాని నేను సంఘములో ఉన్నప్పుడు భాషలతో మాట్లాడుతూ పదివేలు మాటలు మాట్లాడటం కంటే ఇతరులకు భోధకలిగేలా అందరికీ అర్ధమయ్యేలా నా మనస్సుతో ఐదు మాటలు పలకడమే మేలు అంటున్నారు! ఎందుకంటే అర్ధం కాని భాషలవలన విశ్వాసులకు గాని అన్యులకు గాని ఏవిధమైన క్షేమాభివృద్ది కలుగదు గనుక!!! పౌలుగారు  ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తూ వారికెలా అభివృద్ధి కలిగించాలా, ఎలా నేర్పించాలి, ప్రోత్సహించాలా, వారిని ఎలా బలపరచి ఆదరించాలా అని చూస్తున్నారు.

 

ఇక 20వ వచనంలో అంటునారు; సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాకుండా దుష్టత్వము విషయమై పెద్దవారలై ఉండండి అంటున్నారు! పౌలుగారు 13:11 లో అంటున్నారు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలా ప్రవర్తించాను గాను పెద్దవాడినయ్యాక  ఆలా ఆలోచించడం ప్రవర్తించడం మానేశాను అంటున్నారు! అనగా సంఘములో మరియు క్రీస్తులో బలపడే కొలదీ ఈ కృపావరాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుని వాటిని క్రమపద్దతిలో ఉపయోగించుకోవాలి అన్నమాట!!

 

ఇక దుష్టత్వము విషయంలో పెద్దవారిలా ఉండమంటున్నారు, అయితే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు- మీరు పాపలోకములో ఉన్నారు కాబట్టి పాములవలే వివేకముగాను పావురముల వలే నిష్కపటముగా పరిశుద్ధంగాను మెలుకువ గాను ఉండమంటున్నారు....

మత్తయి 10: 16

ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.

 

ఇక 21వ వచనంలో ధర్మశాస్త్రంలో ప్రవచనాల కోసం అన్యభాషలకోసం వ్రాయబడిన ఒక లేఖనాన్ని ఉటంకిస్తూ చెబుతున్నారు: అన్యభాషలు మాట్లాడు జనుల ద్వారా పరజనుల అనగా అన్యుల పెదవుల ద్వారా ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను  వారు నామాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే యెషయా 28:1112  ...

11. నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

12. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కు బడి పట్టబడునట్లు .....

 

ఇజ్రాయేల్ ప్రజలు అపనమ్మకంలో పడిపోయారు. తమకు అర్థమయ్యే భాషలో మాట్లాడిన ప్రవక్తల మాటలు వారు వినలేదు. అందువల్ల వారి పైకి తీర్పుగా శిక్షగా వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే వారిని వారి దగ్గరికి పంపించాడు దేవుడు. పౌలుగారు  ఇందులో నుంచి క్రైస్తవులకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. భాషల్లో మాట్లాడ్డమన్నది ఒక “సూచన” దేవుని ఆత్మ అక్కడ ఉన్నాడని అది సూచిస్తున్నది (12:7). ఈ సూచన విశ్వాసులను గానీ భాషల్లో మాట్లాడే వ్యక్తిని గానీ అతనిలో దేవుని ఆత్మ ఉన్నాడని నమ్మించేందుకు కాదు (ఇందుకు భాషల్లో మాట్లాడడం కన్న శ్రేష్ఠమైన, మరింత అవసరమైన సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయి). భాషలు అవిశ్వాసులకు సూచన (అపొ కా 2:4). ప్రవచనాలు అయితే విశ్వాసుల అభివృద్ధి కోసం (వ 3,4).

ఇక్కడ  21వ వచనంలో  “అన్యభాషలు” అంటే ఇతర దేశాల్లో మాట్లాడే మానవ భాషలని, మనుషులకు అర్ధమయ్యే భాషలు అని   అర్ధం చేసుకోవాలి.

 

ఇక 22వ వచనంలో విశ్వాసుల మెదడుని ఆలోచింప జేసే ఒక మహత్తరమైన మాట పలుకుచున్నారు పౌలుగారు- అనేకమైన విశ్వాసులు భాషలు మాట్లాడటం అంటే దేవునితో మాట్లాడటం అనగా ఆ భాషలు మాట్లాడేవ్యక్తి ఆత్మపూర్ణుడు మరియు అత్యంత విశ్వాసి అని, గాని ఈవచనంలో చెప్పడం లేదు గాని, పౌలుగారు ఆత్మావేశుడై రాస్తున్నారు: భాషలు అనేవి విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచనగా ఉంది, ప్రవచించడం అనేది విశ్వాసులకు సూచనగా ఉంది అంటున్నారు! ఇది ఎలా?

బహిరంగ ఆరాధన జరిగేటప్పుడు ఎవరైనా అన్యులు వచ్చినప్పుడు భాషలు మాట్లాడుతూ ఉంటే ఓహో వారిదేవుడు వారి మధ్య ఉన్నాడు కదా అని అనుకుంటారు, తానూ ఆ మాటలను అర్ధం చేసుకోలేకపోతున్నాను గనుక ఈ వరము పొందుకున్న వానికే అర్ధమవుతుంది, మాట్లాడేవారు విశ్వాసులు, ఆ మాటలు అర్ధం చేసుకోలేని నేను అవిశ్వాసిని అని అనుకుంటాడు! అదే ప్రవచనం అనేది విశ్వాసులకు సూచన అనగా వీరు విశ్వాసము ఆత్మపూర్ణత కలిగి దేవుని నుండి వెల్లడైన మాటలు తెలియజేస్తున్నారు! వారు ఇంకా ఆధ్యాత్మికముగా బలపడటానికి ఈ ప్రవచనాలు పనిచేస్తాయి!!

23లో అంటున్నారు సంఘమంతా కూడి వచ్చి అందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే అన్యుడెవడైనా లోపలికి వచ్చి అందరూ భాషలతో మాట్లాడుతూ కేకలు వేస్తుంటే వీరు పిచ్చోళ్ళు అనుకుంటారు, అదే అందరూ ప్రవచిస్తూ ఉంటే అవిశ్వాసి గాని రక్షించబడని వాడు గాని లోపలి వచ్చి, వారు ప్రకటిస్తున్న ప్రవచనాలు విని పాపినని గ్రహించి అందరివలన విమర్శించబడి రక్షించబడతాడు అంటున్నారు! ప్రవచనాలు విని ఎలా రక్షణ పొందుతాడు ఎలా పాపినని గ్రహిస్తాడు అంటే యోహాను 16:811 లో ఆదరణ కర్త యొక్క గుణగణాలు కనిపిస్తాయి. ఈ ఆదరణ కర్త అనబడే పరిశుద్దాత్ముడు ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ అవిశ్వాసులను అన్యులను రక్షణ పొందనివారిని ఒప్పిస్తాడు!!

John(యోహాను సువార్త) 16:7,8,9,10,11

7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త (లేక, ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.

8. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

9. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు,

10. నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు,

11. ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును.

 

“ఉపదేశం పొందనివాడు అనగా  శుభవార్తనూ క్రీస్తు ఉపదేశాలనూ ఇంకా అర్థం చేసుకోనివాడన్న మాట. ప్రవచనాలు  అలాంటివాడికి అర్థం అవుతాయి. అవి అతణ్ణి తాను పాపినని ఒప్పించి క్రీస్తులో నమ్మకం పెట్టెలా చేయవచ్చు.

 

25వ వచనంలో ఇలా పలికినప్పుడు అతని హృదయరహస్యాలు బయలుపడతాయి, ఇందువలన దేవుడు నిజముగా విశ్వాసుల మధ్యలో ఉన్నాడని నమ్మి సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు అంటున్నారు!

 

 కాబట్టి ఈరకంగా భాషలు అనేవి అవిశ్వాసులకు సూచన అయితే ప్రవచనాలు అనేవి విశ్వాసులకు సూచనగా ఉన్నాయి! కాబట్టి ప్రవచన వరమును ఎక్కువగా ఆపేక్షించమని చెబుతున్నారు పౌలుగారు!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*93వ భాగము-సంఘము-కృపావరాలు-10*

 

1కొరింథీ 14:2633

26. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.

27. భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను.

28. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

29. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.

30. అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.

31. అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.

32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.

33. ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

 

14వ అధ్యాయములో  : అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!! భాషల మాట్లాడేవాడు, ప్రవచించేవాడు ఎలా క్రమపద్దతిలో ఉపయోగించాలి అనేది ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

ఇక 26వ వచనం నుండి ఇప్పుడు మీలో ఏమి జరుగుతుంది? మీరు కూడి వచ్చునప్పుడు అనగా బహిరంగ ఆరాధనసమయంలో ఒకడు పాట పాడాలని అనుకుంటున్నాడు మరొకడు భోధించాలి అని అనుకుంటున్నాడు మరియొకడు దేవుడు వానికి బయలుపరిచింది చెప్పాలి అనుకుంటున్నాడు, మరియొకడు దేవుడు తనకిచ్చిన భాషల వరముతో గట్టిగా ప్రార్ధించాలి అనుకుంటున్నాడు మరొకడు దానికి అర్ధం చెప్పాలి అని అనుకుంటున్నాడు! మంచిది! అయితే సమస్తమును క్షేమాభివృద్ధి కలిగేలా జరుగనీయండి అంటున్నారు!  నిజంగా ఇది మరి పరివర్తనము!! అయితే ఇది క్రమపద్దతిలో జరుగకపోతే అంతా గందరగోళముగాను అల్లరిగాను ఉంటుంది!

 

అందుకే 2731 వరకు అంటున్నారు: ఒక్కక్కరు వంతుల ప్రకారం మాట్లాడండి ప్రవచించండి హెచ్చరించండి అంటున్నారు!

భాషతో మాట్లాడేవారు ఇద్దరు లేక ముగ్గురుకంటే ఎక్కువగా మాట్లాడవద్దు అంటున్నారు, అదికూడా ముగ్గురు ఒకేసారి కానే కాదు, వంతుల ప్రకారం మాట్లాడమని అంటున్నారు, ఇలా వంతుల ప్రకారం మాట్లాడేటప్పుడు ఒకడు ఈ భాషలకు అర్ధం చెప్పాలి, ఒకవేళ అర్ధం చెప్పేవాడు లేకపోతే భాషలతో మాట్లాడేవాడు మౌనంగా ఉండాలి, లేకపోతే తనతోనూ దేవునితోను నెమ్మదిగా మాట్లాడుకోవాలి అంటున్నారు! సంఘములో అందరూ కలిసి ఒకేసారి భాషలతో మాట్లాడితే గందరగోళంగానే ఉంటుంది. అందుకే వంతుల ప్రకారం క్రమ పద్దతిలో మాట్లాడమంటున్నారు. అయితే ఇలాంటి గందరగోళం లేకుండా కొన్ని సంఘాలలో భాషలలో మాట్లాడటానికి కొంత సమయం ప్రత్యేకంగా కేటాయిస్తూ వీరిని ప్రోత్సాహపరుస్తున్నారు ఇది మంచి పరిణామమే! ఇలా సమయం ఇచ్చినప్పుడు అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు! గాని బహిరంగ కూటాలలో సభలలో ఇది మంచిది కాదు అని పౌలుగారి అభిప్రాయం! మందిరాలలో ఇలా చేయడం పర్వాలేదు అని నా అభిప్రాయం!!

విశ్వాసుల సభల్లో ఆధ్యాత్మిక కృపావరాలను  సరిగా ఉపయోగించడం గురించి పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. అన్నిట్లో క్రమం ఉండాలని అతడు నొక్కి చెప్తున్నారు (వ 26,31,33,40).

 “వంతులప్రకారం” ఎందుకు మాట్లాడమన్నారు అంటే కొరింథీ  సంఘంలో చాలామంది ఒకే సమయంలో మాట్లాడుతూ గందరగోళం సృష్టించినట్టు కనిపిస్తున్నది.

 

14:28లో భాషలకు అర్ధం చెప్పేవాడు లేకపోతే  “తనతోనే ”ఎందుకు మాట్లాడుకోమన్నారు  అంటే భాషల్లో మాట్లాడే సామర్థ్యం ఉన్నవారు తాము మాట్లాడే భాషను అర్థం చేసుకోగలిగారనీ, బయటికి వినిపించేలా మాట్లాడ వలసిన అవసరం లేకుండా కూడా ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలిగారనీ దీని భావం.

 

అయితే ప్రవచించేవారు ఏమి చెయ్యాలి? ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడాలి, మిగిలిన వారు వివేచించాలి! భాషలు మాట్లాడేవారు ఇద్దరులేక ముగ్గురు మాట్లాడాలి, అలాగే ప్రవచించువారు కూడా ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రవచించాలి అంటున్నారు!

అయితే ఇద్దరు ముగ్గురు ప్రవచించాలి, తక్కినవారు వివేచించాలి అంటున్నారు ఎందుకు? “వివేచించాలి”

1 Thessalonians(మొదటి థెస్సలొనీకయులకు,) 5:19,20,21,22

19. ఆత్మను ఆర్పకుడి.

20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.

21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

22. ప్రతి విధమైన కీడునకును (కీడుగా కనబడు ప్రతిదానికి) దూరముగా ఉండుడి.

 

ప్రవచించు వారు ప్రవచనాలు చెబుతుండగా  చెప్తున్న దాన్ని మిగిలినవారు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే కపట బోధకులు, అబద్ధమైన ఉపదేశాలూ సంఘంలో ప్రవేశించే అవకాశం ఉంది. వేరొకరు మాట్లాడుతున్న దాన్ని దేని సహాయంతో వివేచించాలి? పాత నిబంధన లేఖనాల్లోనూ, క్రీస్తు అపోస్తలుల  ద్వారానూ వెల్లడి అయిన దేవుని సత్యం  అనగా క్రొత్త నిబంధన సహాయంతోను  వారు చెప్పేది లేఖనాల ప్రకారం ఉన్నాయా లేక వారి సొంతమాటలు చెబుతున్నారా? లేక సాతాను సందేశం రహస్యంగా భోదిస్తున్నారా అనేది వివేచించాలి . ఈ సత్యంతో ఏకీభవించనిది ఏదైనా తప్పు, ప్రమాదకరం. అందుకే వివేచించమని చెబుతున్నారు!

 

అయితే ఈలోగా కూర్చున్న వానిలో ఎవనికైనా ఆ సమయంలో ఏదైనా బయలుపరచబడితే ఇప్పుడు అందరూ కూర్చుని అప్పుడే బయలుపడిన సందేశం చెప్పాలి! ఇలా ఒకని తరువాత మరొకడు ప్రవచించాలి అంటున్నారు!

 

ఇక 3233  వచనంలో ప్రాముఖ్యమైన ఒకమాట అంటున్నారు: ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, అలాగే పరిశుద్దుల సంఘములో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అంటున్నారు!

చూడండి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అనగా భాషలు మాట్లాడటం ప్రవచించడం అంతా మన ఆత్మను స్వాధీనంలో ఉంచుకుని క్రమబద్ధంగా చెప్పవచ్చు! ఏదో పూనకం వచ్చినట్లు వెంటనే అరిచేసి చెప్పవలసిన అవసరం లేదు! గట్టిగా అరిచి చెప్పాల్సిన అవసరం కూడా లేదు! సాధారణమైన మాటలలో కూడా ప్రవచనాన్ని చెప్పవచ్చు అని దీనిని బట్టి అర్ధం అవుతుంది. ఇంకా ఒకరు ప్రవచించిన తర్వాత మరొకడు చెప్పాలి. ఒకడు ఆధ్యాత్మిక సామర్థ్యాలను లేక కృపావరాలను  ఉపయోగించడ మంటే తానే అదుపు తప్పిపోవడం కాదు. ఆ సామర్థ్యాలు ఒక వ్యక్తిలో పని చేయడం వల్ల ఆ వ్యక్తి మనసు లేక సంకల్పం ఎక్కడికో కొట్టుకుపోలేదు, అల్లకల్లోలం కాలేదు. ప్రవచించడం,  భాషల్లో మాట్లాడ్డం అనే సామర్థ్యాలు ఉన్నవారు (మరే ఇతర సామర్థ్యమైనా) కావాలంటే మౌనంగా ఉండగలిగారు (వ 28,30). అలా కాకపోతే అల్లరి జరిగి ఉండేది. అల్లరి, గందరగోళం దేవుని స్వభావానికే విరుద్ధం.

 

కాబట్టి దేవుడు మనకిచ్చిన కృపావరాలను వాడుదాం! గాని వాటిని క్రమపద్దతిలో వంతుల ప్రకారం ఉపయోగించాలి బహిరంగ ఆరాధనా సమయాలలో! మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు! దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు! కాబట్టి అంతా క్రమబద్ధంగా మర్యాదగా జరుగనిద్దాం!

అదే సమయంలో

ఆత్మను ఆర్పకుడి,

ప్రవచించుటను నిర్లక్షం చేయకుడి అని ఆజ్ఞను పాటిద్దాం!

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*94వ భాగము-సంఘము-కృపావరాలు-11*

 

1కొరింథీ 14:3440.

34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.

35. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

36. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?

37. ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.

38. ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము (అనేక ప్రాచీన ప్రతులలో- వాడు తెలియబడిన వాడు కాడు అని పాఠాంతరము) .

39. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,

40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము!

14వ అధ్యాయములో  : అనేక కృపావరాలు గల మనుష్యులు బహిరంగ సభలకు వస్తే ఆ కృపావరాలను క్రమపద్దతిలో ఎలా ఉపయోగించాలి!! భాషల మాట్లాడేవాడు, ప్రవచించేవాడు ఎలా క్రమపద్దతిలో ఉపయోగించాలి అనేది ధ్యానం చేస్తున్నాము!

 

         (గతభాగం తరువాయి)

 

ఇక తర్వాత అంశము: స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండాలి, వారికి మాట్లాడటానికి సెలవు లేదు!!

 

ప్రియులారా! ఇది ఎంతో వివాదాస్పద అంశం కాబట్టి దీనికోసం నేను ఎక్కువగా వ్రాయాలని అనుకోలేదు గాని ఇక్కడ ఏమి వ్రాయబడి ఉందో అదిమాత్రం క్లుప్తంగా చూసుకుందాం!

 

అయితే దీనిని బాగా అర్ధం చేసుకోవడానికి ఇలా వ్రాయడానికి గల నేపధ్యం ఏమిటి అనేది చూసుకుంటే మనకు అర్ధమవుతుంది! బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం: ఆ రోజులలో కొరింథీ సంఘములో రక్షించబడిన వారిలో ఎక్కువమంది స్త్రీలు! అంతేకాకుండా వీరికి లేఖనాల పట్ల ఆసక్తి- దేవునిమీద ఆసక్తి ఎక్కువగా చూపించారు! తద్వారా అనేక కృపావరాలు పొందుకున్నారు ఈ కొరింథీ స్త్రీలు! అందుకని  బహిరంగ ఆరాధనా సభలలో పురుషులు మాట్లాడకుండా అన్నింటిలో స్త్రీలే లేచి స్త్రీలే మాట్లాడేవారు! పురుషులకు అవకాశం ఇచ్చేవారు కాదట! పురుషులు ఎవరైనా ఏదైనా బోధించేటప్పుడు కూడా అలాకాదు, ఇలా వ్రాయబడింది అంటూ సంఘములో బహిరంగంగా చెప్పి క్రమమును తప్పించేవారు అని కొందరి అభిప్రాయం! ఇంకా భాషలు మాట్లాడటం లో గాని, ప్రవచనాలు చెప్పడంలోగాని స్త్రీలే ఎక్కువగా ముందుండే వారు! పురుషులకు అడ్రస్ లేకుండా పోయేది! ఈ విధంగా అన్నివిషయాలలోనూ సంఘములో స్త్రీలు పురుషులను డామినేట్ చేసేవారు లేక పురుషులమీద ఆధిపత్యం ప్రదర్శించేవారు! ఇది వివాదాస్పదమయ్యింది! అందుకే పౌలుగారు ఇలా వ్రాశారు అని అనేకమంది బైబిల్ పండితుల అభిప్రాయం!

 

కారణం:ఈక్రింది భాగంలో ఏమని చెప్పబడింది అంటే స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు, ప్రవచించ కూడదు అనే అర్ధముతో అవి చెప్పబడ్డాయి! అయితే స్త్రీలు ప్రవచించలేదా, ఆ కాలంలో స్త్రీ ప్రవక్తలు లేరా అంటే ఉన్నారు! ఫిలిప్పీ గారి కుమార్తెలు ప్రవచించే వారు అని చెప్పబడింది!

అపో.కార్యములు 21: 9

కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.

 

 అంతేకాకుండా యేసుక్రీస్తుప్రభులవారి ఈ భూలోకంలో తల్లిగారు మరియమ్మ గారు, ఆమె బంధువురాలు ఎలీషబెతు గారు- కూడా ప్రవచించినట్లు లూకా సువార్త మొదటి అధ్యాయంలో చూడవచ్చు, ఇక రెండవ అధ్యాయంలో మందిరంలో ఆషేరు గోత్రికురాలిన పనూయేలు కుమార్తె అన్న అనే వృద్ధురాలైన ప్రవక్తిని 84 సంవత్సరాల నుండి మందిరంలో పరిచర్య చేసినట్లు చూడవచ్చు! ఇక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు దినాన ఆది అపోస్తలులతో పాటుగా అక్కడున్న స్త్రీలంతా పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు చూడగలం! ఇక మగ్ధలేనే మరియ ఎంతో ఘనమైన పరిచర్య చేసి హతస్సాక్షి అయినట్లు చరిత్రలో చూడగలం! ఇక మార్త ఆమె సహోదరుడైన లాజరుతో పాటుగా గొప్ప సేవ చేసి హతస్సాక్షులైనట్లు చరిత్ర చెబుతుంది! అంతెందుకు- ఫిలిప్పీ పట్టణంలో పౌలుగారితో సువార్తలో సహకరించి సువార్తను ముందుకు తీసుకుని పోయింది స్త్రీలు కాదా! మొదటి సంఘపెద్దలు ఫిలిప్పీ సంఘములో స్త్రీలు కాదా? మరి వారు ప్రవచించలేదా? భోధించలేదా?!! ఫిలిప్పీ సంఘ స్థాపనకు వారే కదా కారణం, సంఘము ముక్కలై పోడానికి స్తీలే కదా కారణం!!

 

 ఇక  పౌలుగారు రోమీయులకు వ్రాసిన పత్రికను రోమాకు తీసుకుని వెళ్ళడానికి పురుషులంతా భయపడి వెళ్ళకపోతే, ఫీభే అనే స్త్రీ నేను వెళ్తాను నన్ను పంపమని చెబితే ఆమెను అభిషేకించి పంపించింది పౌలుగారు కాదా!! ఆమె సుమారు 1150 కి.మీ రోడ్డుమీద ఓడమీద గుర్రాలమీద ప్రయాణం చేసి- బందిపోటు దొంగలనుండి క్రూరమృగాల నుండి, అంతర్యుద్ధాలను దాటి, రోమా వెళ్లి ఆ పత్రికను వారికిచ్చి వారిని ప్రభువులో బలపరచి ఆ సంఘానికి కొన్నిరోజులు డీకన్ గా, భిషప్ గా ఆమె పనిచేసింది కదా, మరి ఆమె ప్రవచించలేదా, భోదించలేదా?!!!

 

దీనిని బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే పౌలుగారికి స్త్రీలు అంటే ఏమాత్రము ద్వేషం లేదు! స్త్రీలు ప్రవచించడం వలన కూడా ఆయనకు అభ్యంతరం లేదు, భోదించడం వలన కూడా ఆయనకు అభ్యంతరం లేదు గాని పురుషుల మీద పెత్తనం చెయ్యడం, పురుషులలో భోదించ సమర్ధులు ఎక్కువగా ఉన్నప్పుడు వారిని డామినేట్ చెయ్యడం ఆయనకు ఇష్టం లేదు అని నాకు అర్ధమైన విషయం నేను చెబుతున్నాను! ఇది తప్పు అయితే ప్రభువు నన్ను క్షమించును గాక!!!

అయితే ఒక్క విషయం: బైబిల్ గ్రంధమును వ్రాయించింది పరిశుద్దాత్ముడు కాబట్టి మరి దీనిని ఏ ఉద్దేశంతో రాశారో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి దీనికోసం అంతగా కామెంట్ చెయ్యకపోవడమే మంచిది!!

 

ఇక 3436 వచనాలు చూసుకుంటే స్త్రీలు మౌనముగా ఉండాలి, వారు లోబడాలి అంటున్నారు, ఇంకా మాట్లాడటానికి వారికి సెలవు లేదు అంటున్నారు, ధర్మశాస్త్రం కూడా ఇలాగే చెబుతుంది అంటున్నారు! ఇంకా వారు ఏమైనా నేర్చుకోవాలి అంటే తమింట్లో వారి భర్తలను అడిగి తెలుసుకోవాలి అంటున్నారు! అంతేకాకుండా పురుషుల మీద భర్తల మీద పెత్తనం చెయ్యకూడదు అంటున్నారు!

ఈ అధ్యాయంలోని అంశం సంఘ సభల్లో కొన్ని ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలి అనేది. ఇవి మాట్లాడే సామర్థ్యాలు. సంఘ సభల్లో స్త్రీలు ఈ సామర్థ్యాలు ఉపయోగించకూడదని పౌలుగారు అంటున్నారు ఇక్కడ . ఇవి వారికి ఉండవచ్చు గాని ఇతర సమయాల్లో వాటిని ఉపయోగించాలి.

11:5-6; 1 తిమోతి 2:11-14 .

సంఘ సభల్లో స్త్రీలు ప్రార్థన కూడా చేయకూడదని పౌలుగారు  నిషేధించారని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పుడు  అభిప్రాయం. ఇక్కడి సందర్భం ప్రవచించడం, భాషల్లో మాట్లాడ్డం, అర్థం చెప్పడం గురించి చెప్పారు (వ 26-31). ఈ వచనాల్లో మాట్లాడ్డం అని తర్జుమా చేసిన గ్రీకు పదం 5,6,9,19 మొదలైన వచనాల్లో వాడిన పదమే!

ఇక భర్తలకు అణిగి మణిగి ఉండాలి అంటున్నారు, దీనినే ఇంకా చాలా చోట్ల చెప్పారు” 11:3, 8, 9;

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 11:3,8,9

3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.

8. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.

9. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింపబడలేదు.

 

ఎఫెసు 5:24;

సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

 

 1 తిమోతి 2:11-12;

11. స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

12. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

 

పరిశుద్దాత్ముడు పేతురు గారిద్వారా కూడా ఇదేమాట వ్రాయించారు! 1 పేతురు 3:1, 5, 6.

1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

5. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

6. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు (మేలుచేయుచు), ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.

 

14:35 లో “భర్తలను  అడగాలి అంటున్నారు” అంటే వారి భర్తలు క్రీస్తులోని విశ్వాసులైతే అడగవచ్చు అని అర్థం. అలా కాకపోతే (ఏమి చెయ్యాలో చెప్పడం అవసరమనీ పౌలు తలంచకపోయినా) వారు సంఘంలోని కాపరులను, ఉపదేశకులను అడగవచ్చు. లేదా, తమకన్న ఎక్కువ జ్ఞానం ఉన్న ఇతర స్త్రీలను అడగవచ్చు.

 

ఇక 3738 వచనాలలో ఎవడైనా తాను ప్రవక్తనని ఆత్మ సంభందిని అని విర్రవీగితే నేను వ్రాసేవి ప్రభువు యొక్క ఆజ్ఞలు అని గ్రహించి దాని ప్రకారం చెయ్యండి అంటున్నారు, మీకు తెలియక పోతే తెలియనట్లు ఉండండి అంటున్నారు!

అక్కడ కొందరు క్రైస్తవులు తాము ఆధ్యాత్మికంగా చాలా సమర్థులమని అనుకుంటున్నట్టున్నారు. అదే నిజమైతే పౌలుగారి ద్వారా యేసుప్రభువే స్వయంగా ఇచ్చిన ఆజ్ఞను వారు గుర్తించగలిగి ఉండేవారు.

ప్రభువు యొక్క  ఆజ్ఞను అలాంటి వ్యక్తి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే అతని మాట ఎవరైనా వినడానికి అతడు యోగ్యుడు కాడని దీని భావం.

 

ఇక 3940 వచనాలలో ఇంతవరకు 1214 అధ్యాయాలలో తానూ రాసిన విషయాల యొక్క భావమును మరోసారి పునరుద్ఘాటిస్తున్నారు: నా సహోదరులారా ప్రవచించడాన్ని ఆసక్తితో అపేక్షించండి, భాషలతో మాట్లాడటాన్ని ఆటంకపరచవద్దు గాని సమస్తాన్ని మర్యాదగా క్రమంగా జరుగనీయండి అంటున్నారు!

 

1214 అధ్యాయాల్లో విశ్వాసులకు ఆది సంఘ కాలంలో ఉన్న కొన్ని కృపావరాలు  గురించి పౌలుగారు రాశారు . ఈ కృపావరాలు  ఇప్పుడు అంతరించి పోయాయా? వాటిలో కొన్ని (ఉదాహరణగా ఉపకారాలు చేయడం, ఉపదేశాలు చేయడం) అంతరించి పోలేదనడంలో ఏ సందేహమూ అవసరం లేదు. మరి మిగతా వాటిలో ఏవైనా అంతరించాయా? అలా అంతరించి పోతాయని బైబిల్లో ఎక్కడైనా రాసి లేదని గ్రహించాలి! కొంతమంది దుర్భోధకులు భాషలు, అద్భుతాలు, ప్రవచనాలు అంతరించిపోయాయి అంటూ దుర్భోధచేస్తున్నారు 13:8 చూపిస్తూ! ఆకాలంలో బైబిల్ పూర్తిగా వ్రాయబడిలేదు కాబట్టి ప్రవక్తల అవసరం ఉంది, ఇప్పుడు పూర్తిగా బైబిల్ వ్రాయబడి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రవక్తలు లేరు, అపోస్తలులు లేరు అంటూ అబద్ధాలు చెబుతున్నారు! యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, అవును ఒక్కరీతిగా ఉన్నారు అని వ్రాయబడింది అబద్దమా??

హెబ్రీయులకు 13: 8

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటేరీతిగా ఉండును.

యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధాత్మునికి అప్పుడున్న అధికారం ప్రభావం శక్తి ఇప్పుడు లేదా? శక్తి తగ్గిపోయిందా??!! పనికిమాలిన బోధలుచేస్తున్నారు పనికిమాలిన దుర్భోధకులు!!! . బైబిలు స్వయంగా చెప్పని దాన్ని మనం చెప్పడం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దేవునికి ఆయన ఇష్టం వచ్చినది చేయడానికి స్వతంత్రత ఉందని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో ఎవరికైనా ఈ సామర్థ్యాల్లో దేన్నైనా ఇవ్వడం ఆయనకు ఇష్టమైతే, లేక ఎవరికైనా ఇవ్వకుండా ఉండదలచుకుంటే ఆయన అలా చేస్తారు అని గ్రహించాలి (12:11).

 

కాబట్టి ఆయన విశ్వాసులకు ఉచితంగా దయచేసే ఆత్మసంబంధమైన కృపావరాలను ఆసక్తితో కోరుకుని పొందుకుని సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడదాం!

 గమ్యానికి చేరుదాం!

ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*95వ భాగము-సంఘము-దైవిక ప్రేమ*

 

1కొరింథీ 13:13.

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా ఇంతవరకు 12వ అధ్యాయం నుండి దేవుడిచ్చే కృపావరాల కోసం ధ్యానం చేసుకుంటున్నాము! 12, 14 అధ్యాయాలు పూర్తిగా కృపావరాలు కోసం చెబితే, 13వ అధ్యాయం పూర్తిగా ప్రేమ కోసం చెబుతుంది! 12వ అధ్యాయం చివరి వచనంలో మీకు సర్వోత్తమమైన మార్గం చెబుతాను అంటూ ఈ కృపావరములన్నిటిలో మిన్నయైనది ప్రేమ అంటూ ముగించారు! అందుకే 14వ అధ్యాయం మొదటివచనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి ఆత్మసంబంధమైన వరాలు ఆసక్తితో ఆపేక్షించండి అన్నారు!

 

ప్రియులారా! ప్రేమకోసం దాదాపు అన్ని ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో ప్రతీ దానిలోని చూసుకోవడం జరిగింది! అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తుచెయ్యాలని ఆశిస్తున్నాను! మన తెలుగులో ఈ 13వ అధ్యాయం మొత్తం ప్రేమ అని తర్జుమా చేశారు! అయితే నిజానికి గ్రీకు బైబిల్ లో గాని, ఇంకా ప్రాచీన ప్రతులలో ఈ అధ్యాయంలో ప్రేమకు వాడిన పదము గ్రీకు పదము! ఇది లోగోస్! ఇది మామూలు ప్రేమ కాదు! దైవికప్రేమ! గాని మన తెలుగులో తర్జుమా చేసిన బ్రాహ్మణులు అంత లోతుగా ఆలోచించక, దేవుని ప్రేమ తెలియక 'ప్రేమ' అని తర్జుమా చేయడం జరిగింది! కాబట్టి ఎక్కడైతే ప్రేమ అని ఈ అధ్యాయంలో ఉందో అక్కడ దైవికప్రేమ అని పెట్టుకుంటే ఈ అధ్యాయం బాగా అర్ధమవుతుంది! మరో విషయం పౌలుగారు కేవలం దైవిక ప్రేమకోసమే కాదు సహోదర ప్రేమకోసం కూడా ఇతర పత్రికలలో రాసినా ఈ అధ్యాయం మొత్తం దైవికప్రేమ కోసమే రాసినట్లు గమనించగలరు!!

 

ఇంకా 13:1లో ప్రేమ -  “ఆగాపే” అనే గ్రీకు పదానికి తర్జుమా!! దీనికోసం స్టడీ బైబిల్ లో చూసుకుంటే ఇలా ఉంది:

 క్రొత్త నిబంధన గ్రంథం ఉనికిలోకి రాక ముందు ఈ మాట పెద్దగా వాడుకలో లేదు. వాడుకలో ఉన్న “ప్రేమ” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదాలన్నిటి కంటే, గ్రీకు మాట్లాడేవారు (లేక లోకంలో ఎవరైనా సరే) అంతకుముందు అర్థం చేసుకున్న ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదం “ఆగాపే” తెలియజేస్తున్నది. ఆగాపే అనే పదం  గ్రీకు క్రొత్త నిబంధనలో 116 సార్లు కనిపిస్తున్నది. ఈ పదానికి సంబంధించిన క్రియా వాచకం 137 సార్లు కనిపిస్తుంది. దేవుని ప్రేమనూ, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు పరస్పరం, దేవునిపట్ల కూడా చూపవలసిన ప్రేమనూ సూచించేందుకు ఈ మాటను వాడారు. ఇది స్వార్థం లేని ప్రేమ, ఎప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ. కామం, స్వార్థపరమైన కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపించే ఈ పదం అర్థాన్ని కొంతవరకు గ్రహించేందుకు ఈ రిఫరెన్సులు తోడ్పడతాయి మత్తయి 5:44; 22:37; యోహాను 3:16; 13:1, 34; 14:15; 17:24, 26; రోమ 5:5-8; ఎఫెసు 5:25; 1 పేతురు 1:22; 1 యోహాను 3:16-18; 4:8-9.

 

ఇంకా “ఆగాపే” దేవుని దివ్య ప్రేమ. ఈ గొప్ప అధ్యాయంలో పౌలుగారు ప్రేమ అవసరతను గురించి ( 1-3 లోను), ప్రేమ తత్వాన్ని గురించి (4-7లోను), ప్రేమ శాశ్వతత్వం గురించి  (8-13లోను) మాట్లాడుతున్నారు. భూమిపైనా, పరలోకంలోనూ ఉన్న ఎలాంటి భాష కంటే కూడా ప్రేమ గొప్పది అని చెప్పడంతో ఆరంభిస్తున్నారు. ప్రేమ లేనిదే నానా భాషల్లో మాట్లాడ్డం, ఏ విధంగా మాట్లాడ్డమైనా కేవలం శబ్దమే గాని ప్రయోజనం లేదంటున్నారు.

 

యేసయ్య భోదలలో ఎక్కువగా ప్రేమతత్వము నిండి ఉంటాయి! నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనే ధర్మశాస్త్ర ఆజ్ఞను (లేవీ 19:6, మత్తయి 19:19; 22:39) మరల యేసుక్రీస్తు ప్రభులవారు కొట్టివేయక అలా ఆ ఆజ్ఞను పాటిస్తే ఆజ్ఞలలో 6 ఆజ్ఞలను పాటించినట్లే అని చెప్పి  కాబట్టి పొరుగువారిని ప్రేమించమని, ఇంకా నీ శత్రువుని కూడా ప్రేమించి క్షమించమని చెప్పిన ప్రేమమూర్తి మన యేసయ్య! చివరికి ఆ కల్వరి గిరిలో ఆ సిలువలో ఎన్నెన్నో హింసలు పెట్టిన వారిపై జాలిపడి, క్షమించి, దేవుణ్ణి కూడా వేడి,  తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అడిగి, క్షమాభిక్ష పెట్టిన ప్రేమామయుడు, కరుణామయుడు ఆయన! అదే ప్రేమతత్వాన్ని అలవరచుకొని పౌలుగారు మనకు రాస్తున్నారు ఇక్కడ ప్రేమను వెంటాడు! అనగా ఈలోక ప్రేమను వెంటాడు అనడం లేదు! ఈ లోక ప్రేమలో lust అనగా కామాభిలాష, కామకోరికలు ఉంటాయి! గాని నిజమైన ప్రేమలో క్షమాపణ, ఆదరణ, సమాధానం, అనురాగం అన్నీ ఉంటాయి! అలాంటి ప్రేమను ప్రతీ దైవజనుడు/విశ్వాసి పొందుకుని హత్తుకోవాలి అంటున్నారు పౌలుగారు!

కొలస్సీయులకు 3: 14

వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.

 

  ప్రియులారా! ఈ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ పోతే ఏమీ అర్ధం కాదు మనకు. దానిని జాగ్రత్తగా ప్రార్ధనపూర్వకముగా చదివితే అర్ధం అవుతాయి మనకు పౌలుగారిని వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు మనకోసం వ్రాయించారో అర్ధం అవుతుంది. ఈ వచనంలో అంటున్నారు పౌలుగారుపరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ ఆయన వీటన్నికన్నా ప్రేమను ధరించుకొనుడి అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటున్నారు. దీని అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటేప్రేమకుపరిపూర్ణతకు సంబందం ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే పరిచర్య చేయాలి అది fivefold ministry గాని, tenfold ministry అయినా సరే! కాబట్టి ఈ పరిచర్య చేసే దైవజనులు సంపూర్ణులు పరిపూర్ణులు కావాలి అంటేప్రేమను ధరించుకోవాలి!!! ఒక వ్యక్తికి ఎన్ని ఫలాలు, శక్తులు, టాలెంట్లు ఉన్నా ప్రేమలేకపోతే పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు ఈ అధ్యాయంలో  అంటున్నారు 1 కొరింథీ 13:1-3

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు(అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.  . .. *కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు వేస్ట్ ఫెల్లో!*

 

   ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు! అందుకే ఆయన మనలను రక్షించడానికి మానవరూపం దాల్చి, పరమును విడచి, భువికి వచ్చారు. ఫిలిప్పీ 2:5,6,7,8

5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో కదా!

 

 ఇక క్రీస్తు ప్రేమతత్వం భాగా అర్ధం చేసుకున్నవారు, ఇంకా ప్రేమకోసం బైబిల్ ఎక్కువగా రాసినవారు మొదటగా పౌలుగారు, రెండవదిగా యోహానుగారు! ప్రేమకోసం రాయడానికి కారణం దైవజనులు ఇంకా విశ్వాసుల మధ్య ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదు!  ప్రేమలేకపోతే మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన ఆశలు, తగాదాలు, కొట్లాటలు, చీలికలు ఉంటాయి. అందుకే సామెతలు 10:12 లో ప్రేమ అనేక దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది , ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది అంటున్నారు. 

 

దేవుడు మనపట్ల చూపేది ఆగాపే ప్రేమ! అది అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన యిర్మియా 31:3 లో అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!

అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి అనేది దేవుని ఆశ! అయితే ఈ ప్రేమ చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలా? అక్రమము విస్తరించినందువలన అనేకుల ప్రేమ చల్లారును! మత్తయి 24:12; 

 

  యోహాను 17:26 జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు యేసుప్రభులవారియందు ఏ విధమైన ప్రేమను ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు ఉండేలా తండ్రిని వేడుకున్నారు. పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:

రోమా 5:5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

. . . దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా! కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు! 

 

మరి ఈ ప్రేమ మనలో ఎలా ఉండాలి?

*** నిష్కపటమైనదిగా ఉండాలి. రోమా 12:9;

*** చెడును అసహ్యించుకొనాలి. రోమా 12:9;

*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;

*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;

*** క్షేమాభివృద్ధి కలుగజేసేది.  1 కొరింథీ 8:1;

 

ఇంకా రోమా 13:8,9,10

8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

* ప్రేమ దీర్ఘకాలము సహించును,

* దయ చూపించును.

* ప్రేమ మత్సరపడదు;

* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;

* అది ఉప్పొంగదు;

* అమర్యాదగా నడువదు;

* స్వప్రయో జనమును విచారించుకొనదు;

* త్వరగా కోపపడదు;

* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

* దుర్నీతివిషయమై సంతోషపడక

* సత్యమునందు సంతోషించును.

* అన్ని టికి తాళుకొనును,

* అన్నిటిని నమ్మును;

* అన్నిటిని నిరీక్షించును;

* అన్నిటిని ఓర్చును.

* ప్రేమ శాశ్వతకాలముండును. 

 

 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

       1కొరింది 13:4-8,13

అందుకే 1 కొరింథీ 14:1 లో

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 . .

గలతీ 5:6 ప్రకారం విశ్వాస కార్యసాధకం కావాలి అంటే ప్రేమ తప్పకుండా కావాలి!

గలతీ 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

ఫిలిప్పీ 1:9

మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,

అందుకే హెబ్రీ 10:25 లో

ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని (మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము అంటున్నారు.

 

పేతురుగారు ప్రేమ కోసం ఏమ్మన్నారు ఈ వచనాలలో ఉన్నాయి  1పేతురు 1: 21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

. . ., ఇంకా రిఫరెన్సులు 3:8, 4:8;

 

యోహాను గారు చెప్పినది చూద్దాం. 1 యోహాను 2:5

ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;

మరిన్ని రిఫరెన్సులు 3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను 1:6

తోటి దైవజనుడిని తోటి సేవకుడిని ప్రేమించలేక పోతున్నాము. ఇక మనలో ప్రేమ ఎలా ఉంటుంది? అలా ప్రేమించలేక పోతే నీవు నరహంతకుడవు అని యోహానుగారు చెబుతున్నారు. కనబడే సహోదరుడు, కనబడే తోటి సేవకున్ని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని అడుగుతున్నారు యోహాను గారు!

 

కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా, చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

అట్టి ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!

 

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*96వ భాగము-సంఘము-దైవిక ప్రేమ-2*

 

1కొరింథీ 13:14.

1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.

2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగల వాడ నైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు (అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!              

ప్రియులారా 13వ అధ్యాయం నుండి దైవిక ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

మొదటి వచనంలో  మనుషుల బాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినా ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అంటున్నారు! దేవదూతల భాషలతో మాట్లాడేవాడు దేవుని కృపావరములను కలిగిన వాడు అని ఇంతవరకు ధ్యానం చేసుకున్నాము అయితే దేవుని కృపావరాలు అన్నీ పొందుకున్నా గాని వానిలో ప్రేమలేకపోతే వాడు వ్యర్ధుడు లేక వేస్ట్ ఫెల్లో అంటున్నారు!

 

ఇంకా రెండవ వచనంలో ప్రవచించు కృపావరం, దేవుని మర్మాలు మరియు దేవుని జ్ఞానమంతా తెలిసికొనినా ఇంకా కొండలను పెకిలించేటంత విశ్వాసము కలిగిన పరిపూర్ణ విశ్వాస వీరుడవైనా  గాని నీలో/నాలో  ప్రేమ లేకపోతే వ్యర్దుడను/వేస్ట్ ఫెల్లోవి!!! నీవు ఎంతటి ప్రార్ధనాపరుడవైనా ఎంతటి సాక్ష్యం చెబుతున్నా, ఎంత పాటగాడివైనా మాటకారివైనా గొప్పవరములు ఫలములు గలవాడివైనా నీలో ఆ దైవిక ప్రేమలేక పోతే వ్యర్ధమే అంటున్నారు! *కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు వేస్ట్ ఫెల్లో!*

 

నానావిధ భాషలలో మాట్లాడ్డం కన్నా గొప్ప సామర్థ్యాల గురించి పౌలుగారు చెప్తున్నారు. విశ్వాసులు వీటిని ఆశించాలనీ అతడు కోరాడు (12:31). కానీ ప్రేమ లేకపోతే అవన్నీ ఉన్నా ఒక మనిషికి ఏమీ యోగ్యత ఉండదు. మనం దేవుని ప్రజలమనడానికి, మనకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఉందనడానికి ప్రేమే గొప్ప రుజువు అంటున్నారు!

 

ఇక ౩వ వచనంలో పేదల పోషణ కోసం నా ఆస్తిమొత్తం ఇచ్చేసినా కాల్చబడటానికి నా శరీరం అప్పగించేసినా ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనం లేదు అంటున్నారు! గమనించాలి: పేదల పోషణకు నా ఆస్తిమొత్తం ఇచ్చేసినా అంటూ ఎందుకు రాస్తున్నారు అంటే- మనకు అపోస్తలుల కార్యములో బర్నబా గారు ఆయన యొక్క ఆస్తి మొత్తం అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి- దాని తర్వాత ఆయన , ఆయన భార్య హాగరు ఇద్దరూ దేవుని సేవలోనే గడిపినట్లు చూస్తున్నాము! ఆయనను చూసిన వారు అనేకులు తమ ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి అపోస్తలుల దగ్గర సువార్త ప్రకటన క్రమము నేర్చుకుని వివిధ దేశాలలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయేవారు! ఇక్కడ అలా నేను చేసినా నాలో ప్రేమలేకపోతే నేను వ్యర్దుడను, నా త్యాగం వలన నాకు వచ్చిన ఉపయోగం లేదు అంటున్నారు!

 

ఇక కాల్చబడటానికి నా దేహం అప్పగించినా అని అనడానికి కారణం: ఆ రోజులలో నిజ క్రైస్తవులను క్రైస్తవ విరోధులు భయంకరమైన చిత్ర హింసలు పెట్టేవారు, వాటిలో బ్రతికుండగా అగ్నికి ఆహుతి చెయ్యడం ఒకటి! యోహాను గారి శిష్యులను అలాగే చంపారు, యోహాను గారిని అదేవిధంగా ట్రై చేశారు గాని ఆయన చనిపోలేదు, అందుకే పత్మస్ దీవిలోని వదిలేశారు! కాబట్టి ఇలాంటి శ్రమలను ఓర్చుకుని క్రీస్తు సువార్త పట్ల క్రీస్తు పట్ల విశ్వాసము గల విశ్వాసివి అయినా గాని ఈ ప్రేమలేకపోతే వ్యర్ధం అంటున్నారు!

 

ప్రేమ లేకుండా ఆస్తిపాస్తులన్నీ ఇచ్చివేయడం, తనను తాను సమర్పించుకోవడం సాధ్యమేనా? సాధ్యమే. పుణ్యం, లేక దేవుని మెప్పు సంపాదించుకోవాలన్న ప్రయత్నంలో, లేక నరకంలో పడతానన్న భయం వల్ల, లేక తన మతం, ఆదర్శం కోసం అలా చేయవచ్చు. చాలమంది ఈ విషయంలో మోసపోయారు. వారు ఈ మంచి పనులు, యోగ్యమైన పనులు, పుణ్య కార్యాల వల్ల దేవుని అనుగ్రహాన్ని, లేక ముక్తిని సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ అదంతా వ్యర్థం. ఈ దైవిక ప్రేమ, దేవుని పట్లా మనుషుల పట్లా స్వార్థం లేని ఈ ప్రేమ లేకుండా చేసే మంచి పనులన్నీ దేవుని దృష్టిలో మంచి పనులే కాదు. అసలు అవి చెడ్డ పనులే కావచ్చు. యెషయా 64:6 చూడండి.

 

ఇక దైవిక ప్రేమ యొక్క గుణగణాలు కనిపిస్తాయి మనకు తర్వాత వచనాలలో! ప్రేమలో ఏమున్నాయి? ఏమి ఉండవు లేక ఏమి లేవు అనేది రాస్తున్నారు!

 

*ఉండేవి లేక మంచి లక్షణాలు*:

 

* ప్రేమ దీర్ఘకాలము సహించును,

* దయ చూపించును.

* సత్యమునందు సంతోషించును.

* అన్ని టికి తాళుకొనును,

* అన్నిటిని నమ్మును;

* అన్నిటిని నిరీక్షించును;

* అన్నిటిని ఓర్చును.

* ప్రేమ శాశ్వతకాలముండును. 

 

*లేనివి*:

 

* ప్రేమ మత్సరపడదు;

* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;

* అది ఉప్పొంగదు;

* అమర్యాదగా నడువదు;

* స్వప్రయోజనమును విచారించుకొనదు;

* త్వరగా కోపపడదు;

* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

* దుర్నీతి విషయమై సంతోషపడదు

 

పౌలుగారు  ఇక్కడ మాటల్లో చెప్తున్న ఈ ప్రేమ గుణం యేసుప్రభులవారి జీవితంలో లోప రహితంగా ఆచరణలో ఉన్నట్లు మనం చూడగలం. దేవుడు ప్రేమ స్వరూపి (1 యోహాను 4:8). క్రీస్తు దేవుని అవతారం, అంటే ప్రేమావతారమన్నమాట. ప్రేమ నిండిన తన జీవితంలో ఆయన విశ్వాసులందరికీ గొప్ప ఆదర్శం.

 

సరే, ఒక్కొక్క లక్షణాన్ని క్లుప్తంగా చూసుకుందాం!

 

*ప్రేమ దీర్ఘకాలం సహించును*! దీనినే కొన్ని ప్రాచీన పతులలో  ప్రేమలో దీర్ఘశాంతం ఉంది అని తర్జుమా చేశారు! ప్రేమలో దీర్ఘశాంతం ఉంది! ఈ దీర్ఘశాంతం కోసం అనేకసార్లు చూసుకున్నాము! అనగా ఎలాంటి కష్టాలు వచ్చినా ఓర్చుకుని విచారిస్తుంది!

“దీర్ఘ శాంతం” ఇతరులు మనపట్ల చేసిన తప్పులను, గాయాలను, ద్రోహాలను, కఠినమైన మాటలనూ చర్యలనూ చూచి ఎలాంటి ద్వేష భావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనసును, సామర్థ్యాన్ని ఇది సూచిస్తున్నది. ఇది క్రీస్తు జీవితమంతటా కనిపించింది ఆయన తీర్పు, మరణం సమయంలో మరింత స్పష్టంగా కనిపించింది.

యెషయా 53: 7

అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

 

మత్తయి 27: 14

అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

 

లూకా 23: 34

యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.

 

 1 పేతురు 2:21-23.

21. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.

23. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.

 

ఆయనను అనుసరించినవారికి కూడా ఉండవలసిన గుణం ఇది.

మత్తయి 18: 22

అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

 

గలతీ 5:22;

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

 ఎఫెసు 4:2;

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

 

కొలస్సీయులకు 1: 11

ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,

 

కొలస్సీయులకు 3: 12

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

 

మరినీకు అలాంటి దీర్ఘశాంతం ఉందా ప్రియ విశ్వాసి/ సేవకుడా!!

లేకపోతే నేడే అలవరచుకో!

దైవాశీస్సులు!

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*97వ భాగము-సంఘము-దైవిక ప్రేమ-౩*

 

1కొరింథీ 13:47.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్పును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా 13వ అధ్యాయం నుండి దైవిక ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక ప్రేమకున్న తర్వాత లక్షణం : *దయ చూపిస్తుంది*! అనగా Mercy- కరుణ, జాలి అనే నానార్ధాలు!

 

దయ” ఇతరులెవరైనా అందుకు యోగ్యులు కాకపోయినా కూడా క్రియాశీలంగా వారికి సహాయం చేసే గుణాన్ని ఇది సూచిస్తున్నది. ఈ గుణం మనల్ని ప్రయోజనకరమైన సేవతో నిండిన జీవితానికి ప్రోత్సహిస్తుంది. క్రీస్తు జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించిన మంచి గుణం ఇది. మత్తయి 4:23-24;

23. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

24. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

 

మత్తయి 20: 28

ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

 

అపొ కా 10:38.

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (అనగా- సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.

 

తనను అనుసరించే వారిలో కూడా ఈ గుణం ఉండాలని క్రీస్తు కోరుతున్నారు

మత్తయి 25:31-40;

31. తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.

34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

36. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును

37. అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి?

38. ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి?

39. ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

 

లూకా 6:35;

మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేని వారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

 

ఎఫెసు 4:32;

ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

 

కొలస్సీ 3:12.

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

 

మరినీలో ఇలాంటి దయ లేక జాలి కరుణ ఉన్నాయా ప్రియ విశ్వాసి/దైవజనుడా!!!

 

ఇక దైవికప్రేమ లో మరో లక్షణం: *మత్సర పడదు*, అనగా అసూయపడదు! ఇంకా చంపేటంతగా కోపపడదు అని అర్ధాలు!

అసూయ” ఈ భయంకరమైన పాపం గురించి సామెత 14:30;

సామెతలు 27: 4

క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

 

మత్తయి 27: 18

విడుదల చేయవలెనని మీరుకోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను

 

అపొ కా 7:9;

ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి

 

 అపొ13:45; 17:5 చూడవచ్చు.

 

 అసూయ అంటే ఇతరుల విజయాలు, పేరుప్రతిష్ఠలు, ఆస్తిపాస్తులను చూచి బాధ, నిరసన చెందడం. ఇది ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకం. అందువల్ల క్రైస్తవులకు కూడా వ్యతిరేకమే

 

రోమీయులకు 13: 13

అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము

 

యాకోబు 3:14-16.

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని (చేదైన) మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

 

ఒకవేళ నీలో ఇలాంటి గుణాలు ఉంటే నీలో దేవుని యొక్క ప్రేమలేదని గ్రహించి వీటిని తొలగించుకో!!

 

ఇక దైవికప్రేమలో మరో లక్షణం: *డంభముగా ప్రవర్తించదు!* అనగా ఢంభాలు చెప్పుకోదు! గొప్పలు చెప్పుకోదు! తగ్గింపు జీవితం కలిగి ఉంటుంది! ఇంకా ప్రేమ ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు. దానికి దురహంకారం లేదు. వినయంగా తగ్గి ఉంటుంది. దీనిని క్రీస్తు జీవితంలో పరిపూర్ణంగా చూడవచ్చు. ఆయన విశ్వాసులు ఇందులో కూడా ఆయనను అనుసరించాలి!

మత్తయి 11: 29

నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

 

ప్రేమ తనను త్యాగం చేసుకుంటుంది గానీ తన హక్కుల కోసం పోరాడదు

 (మత్తయి 10:38-39;

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

 

Matthew(మత్తయి సువార్త) 5:16,39,40,41,42,44

16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

39. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

40. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

 

లూకా 9: 23

మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

 

అలాగే జీవపుడంభము అసలే ఉండదు! గొప్ప కార్లు బంగళాలు కావాలని అనుకోదు! నేత్రాస పనిచెయ్యదు, ఖరీదైన బట్టలు వేసుకోవాలి, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేది ఉండదు! తగ్గించుకుని సింపుల్ గా ఉంటుంది! తగుమాత్రపు వస్త్రాలు కోరుకుంటుంది! మాదిరిగా ఉంటుంది! యేసుక్రీస్తుప్రభులవారికి ఎంతో ధనము విరాళాల రూపంలో వచ్చేది, గాని ఆయన కనీసం దానిని చేతితో కూడా ముట్టేవారు కాదు, అంతా ఇష్కరియోతు యూదా చేతిలో ఉండేది! ఎప్పుడూ విలాసవంతంగా జీవించలేదు లగ్జరీలు కోరుకోలేదు యేసయ్య! ఆయన శిష్యులుకూడా ఎప్పుడూ లగ్జరీ జీవితం జీవించలేదు! డంభముగా ప్రవర్తించలేదు! అలాగే విశ్వాసికి, దైవసేవకునికి ఇలాంటి డంభము, విలాసవంతమైన జీవితం ఉండకూడదు! ఉంటే ఆ వ్యక్తిలో దేవుని యొక్క దైవికప్రేమ లేదు!!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*98వ భాగము-సంఘము-దైవిక ప్రేమ-4*

 

1కొరింథీ 13:47.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్పును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా 13వ అధ్యాయం నుండి దైవిక ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక ప్రేమకున్న తర్వాత లక్షణం : *ఉప్పొంగదు*!! అనగా ఏమి కలిగినా ఎంత గొప్ప శిఖరాలను అధిరోహించినా తగ్గించుకుంటుంది. ఘనత కలిగినా తగ్గించుకుంటుంది, బాధ కలిగినా ఓర్చుకుంటుంది! సంఘములో గొప్ప గొప్ప అధ్బుతాలు జరుగుతున్నా లక్షమంది విశ్వాసులున్నా ఇంకా దేవుని సేవచేయాలి ఇంకా దేవునికోసం కష్టపడాలి అంటుంది! పౌలుగారు మహా గొప్ప సేవచేశారు అయినా ఇంకా సేవ చెయ్యాలి అని తిరిగారు! గొప్పలు చెప్పుకోలేదు! ఎంతో చదువు చదివారు గాని దేవునిప్రేమను దేవుని కృపను ఇంకా పునరుత్థాన బలం పొందుకోడానికి తన చదువుని పదవిని అన్నింటినీ పెంటతో సమానంగా చేసుకుని క్రీస్తుయేసు యొక్క శ్రమానుభవములో కొంత అయినా నేను పొందుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు! నేను ఇంకా సంపూర్ణత సాధించేశాను అని నేను చెప్పుకోవడం లేదు గాని ఇతరులకు బోధించిన మీదట నేను తప్పిపోతానేమో లేక బ్రష్టుడను అయిపోతానేమో అని భయపడి తనను తాను నలుగగొట్టుకుని శరీరాన్ని తనకు బానిసగా చేసుకున్నారు...

Philippians(ఫిలిప్పీయులకు) 3:7,8,9,10,11,12,13,14

7. అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.

9. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,

10. ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,

11. ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.

12 .ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను.

13. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి (లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు

14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

 

 1కోరింథీయులకు 9: 27

గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

 

చివరిగా యేసయ్య అంటున్నారు: మీరు దేవుడు చెప్పిన సేవచేసిన తర్వాత మేము చేయగలిగిందే మేము చేశాము నిష్ఫలమైన దాసులము అని చెప్పమన్నారు!

లూకా 17: 10

అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

 

ఇదీ దైవికప్రేమ! ఉప్పొంగని ప్రేమ!!!

మరినీకు అలాంటి తగ్గింపు ఉందా ప్రియ స్నేహితుడా!!!

 

ఇక ప్రేమకున్న తర్వాత లక్షణం : *అమర్యాదగా నడువదు లేక అయోగ్యంగా ప్రవర్తించదు*! ఎవరితోనూ అమర్యాదగా ఉండదు అమర్యాదగా మాట్లాడదు!  లేక  “సిగ్గుకరంగా” అని కూడా అనువదించవచ్చు. ఎవరికీ అవమానం, అమర్యాద కలిగే విధంగా ప్రేమ ఎన్నడూ ప్రవర్తించదు. తనకు సిగ్గు కలిగే విధంగా కూడా ఎప్పుడూ ప్రవర్తించదు.

 ఎవరినీ అవమానించదు, అందరికీ గౌరవం ఇస్తుంది అన్నమాట!! కానిమాటలు పలుకదు! ఈదైవిక ప్రేమ గలవారు హుందాగాప్రవర్తిస్తారు!  Behaves like a Gentle Man!!

 

ఇక ప్రేమకున్న తర్వాత లక్షణం : *స్వప్రయోజనం కోసం విచారించదు*!! తనకే లాభం కావాలని తానే లాభపడాలని ఎప్పుడూ చూడదు!! అందరూ బాగుండాలి అని అనుకుంటుంది! మన భారతదేశంలో సామెత ఉంది కదా- సర్వేజనా సుఖినాభివంతు!!! అందరూ బాగుండాలి- ఆ అందరిలో నేనుండాలి అనే విధంగా ఈ దైవికప్రేమ గలవారు ఉంటారు! అవతలి వాడు కుళ్లిపోవాలి, చచ్చిపోవాలి, నాశనమైపోవాలి, యాక్సిడెంట్ అయిపోవాలి ఇలాంటి దురుద్దేశాలు ఎటువంటి పరిస్తితులలో కూడా ఇలాంటి ప్రేమన్న వ్యక్తులలో కనిపించవు!!!

 అందుకే ఈ దైవికప్రేమ ఉన్నవారు సువార్త ప్రకటించి నశించిపోతున్న పొరుగువారికి అన్యజనులకు మారుమూల ప్రాంతాల వారికి సువార్త ప్రకటించి వారికోసం ప్రార్దిస్తారు!!

 

లోకం దృష్టిలో విలువైన వాటిని, అంటే డబ్బు, ఆస్తులు, ప్రఖ్యాతి, పదవి, పొగడ్త, లేక అధికారం మొదలైనవాటిని ఎప్పుడూ ప్రేమ కోరుకోదు. దానికి పేరాశ లేదు. అది ఇతరుల మేలును మాత్రమే కోరుతుంది. క్రీస్తులో దీన్ని చూస్తాం. ఆయన్ను అనుసరించేవారిలో కూడా ఇది కనిపించాలి

1కోరింథీయులకు 10: 24

ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.

 

Romans(రోమీయులకు) 15:1,2

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

 

మరో లక్షణం: *త్వరగా కోపపడదు*!!! కొంతమందికి పుసుక్కున కోపం వచ్చేస్తుంది, తాచుపాములా బుసకొట్టేస్తూ ఉంటారు! వీరిలో అసలు దైవికప్రేమ లేదు గాని సాతాను గాడు పూనేస్తాడు అన్నమాట!! షార్ట్ టెంపర్!!! ఇదీ చాలా ప్రమాదకరం!!!

 

ఇంకా చెప్పాలంటే తొందరపడి తనకు అవమానం జరిగినట్టు ఇతరులపై కోపగించుకోదు. దానికి ముక్కోపం లేదు. అంటే పాపానికి వ్యతిరేకంగా భీకరమైన తీవ్రమైన కోపం ఉండడం ప్రేమకు విరుద్ధమని అర్థం కాదు (ప్రేమస్వరూపి అయిన దేవుడు మనుషుల చెడుతనంపై ఎప్పుడూ కోపం చూపుతూనే ఉంటాడు రోమ్ 1:18; యోహాను 3:36; కీర్తన 7:11). కానీ అది వేరే విషయం. గ్రీకులో అందుకు వేరే పదం వాడబడింది.

 

ప్రేమకున్న మరో లక్షణం: *అపకారమును మనస్సులో ఉంచుకోదు*; అనగా ఎవరైనా తనకు అపకారం చేసినా క్షమించివేస్తుంది! ఉదాహరణ: మన యేసుక్రీస్తుప్రభులవారు! తనను అన్ని భాధలు పెట్టినా కొరడాలతో కొట్టినా ఉమ్మివేసినా సిలువకు కొట్టినా మేకులు కాళ్ళలో చేతులలో కొట్టి హింసించినా తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రజలు తనకు చేసిన అపకారమును మర్చిపోయి వారికి క్షమాభిక్ష పెట్టి ఉపకారం చేసిన మహానుభావుడు మనయేసయ్య!

 

ప్రేమ తప్పులను కప్పుతుంది, క్షమిస్తుంది. పగ సాధించేందుకు కుట్ర పన్నదు

 మత్తయి 5:38-48;

38. కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

39. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

40. ఎవడైనా నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రముకూడ ఇచ్చివేయుము.

41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితో కూడ రెండు మైళ్లు వెళ్లుము.

42. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

43. నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

45. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

46. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారుగదా.

47. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారుగదా.

48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

 

లూకా 23: 34

యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.

 

అపొ కా 7:59-60;

59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.

60. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

 

1పేతురు 4: 8

ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

 

ఇంకా ఇతరులు చెడు ఉద్దేశాలతో ప్రవర్తిస్తున్నారనుకోదు అని ఇక్కడున్న గ్రీకు పదానికి అర్థం కావచ్చు. సాధ్యమైతే వారికి పాపం అంటగట్టకుండా ఉండాలని అది ఎప్పుడూ చూస్తుంటుంది. ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే క్రైస్తవులు ఇతరుల్ని తమకంటే యోగ్యులుగా ఎంచుతూ ఉంటారు (ఫిలిప్పీ 2:3).

ఫిలిప్పీయులకు 2: 3

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

 

ఎవరికీ తీర్పు తీర్చడం, నేరం మోపడం వారికి ఇష్టం ఉండదు (రోమ్ 14:4, 10, 13).

 

మరి ఇటువంటి మహోన్నతమైన ప్రేమను నీవు కలిగి ఉన్నావా ప్రియ చదువరీ!! లేకపోతే నేడే దీనికి ప్రార్ధించి పొందుకో!!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*99వ భాగము-సంఘము-దైవిక ప్రేమ-5*

 

1కొరింథీ 13:47.

4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5. అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7. అన్ని టికి తాళుకొనును (లేక, అన్నిటిని కప్పును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా 13వ అధ్యాయం నుండి దైవిక ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక ప్రేమకున్న మరో లక్షణం: *దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును!!* ఎవరికైనా కీడు చేద్దామని అసలు అనుకోదు! కేవలం సత్యమైనది మేలైనది ఏదో దానిలోనే సంతోషిస్తుంది!

 

ఈ ప్రేమ వెన్నెముక లేనిది కాదు. అటు ఇటు కొట్టుకుపోయేది కాదు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహాలోకాల్లో తేలియాడేది కాదు. భావోద్రేకాలకు లోనయ్యేది కాదు. దుష్టత్వంతో అది రాజీపడదు. దుర్మార్గత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదు. దుర్మార్గం విషయమంతటిలో ప్రేమకు విచారం ఉంటుంది. సత్యం గెలిచినప్పుడు అన్నిటికీ మించిన ఆనందం దానికి కలుగుతుంది. ప్రేమ, సత్యం ప్రాణ స్నేహితులు. ఈ వచనంలో దుర్మార్గానికి వ్యతిరేకంగా సత్యం ఉంది. దుర్మార్గానికి చీకటి, అబద్ధాలు, మోసం దేవుని సత్యాన్ని అణచివేయడంతో సంబంధం ఉంది

 

 యోహాను 3:19-20

19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

20. దుష్కార్యము చేయు (లేక, అభ్యసించు) ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు (మూలభాషలో- తన క్రియలు గద్దింపబడకుండునట్లు) వెలుగునొద్దకు రాడు.

 

రోమీయులకు 1: 18

దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.

 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 2:10,11,12

10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును

11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై,

12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

 

పౌలుగారు ఇక్కడ చెప్తున్న సత్యానికి వెలుగుతో, వాస్తవికతతో, దేవునితో సంబంధం ఉంది. ఈ సత్యానికి క్రీస్తే స్వరూపం (యోహాను 14: 6

యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.).

ఈ సత్యంలో మనకు సంతోషం లేకపోతే ఇక్కడ పౌలుగారు వర్ణిస్తున్న ప్రేమ మనకు ఉన్నదని మనం ఊహించుకోవడం వ్యర్థం.

 

ఇక ప్రేమకున్న మరో లక్షణం: *అన్నింటినీ తాళుకొనును*. భరిస్తుంది” లేక సహిస్తుంది

ఈ గ్రీకు పదానికి మరో అర్థం “సంరక్షిస్తుంది”.

మీద చెప్పిన ఉదాహరణనే మరల తీసుకోవాలి! ఎన్ని హింసలు పెట్టినా తాలుకోంది ఆ సిలువప్రేమ! దైవిక ప్రేమ! అన్నిటినీ సహించి క్షమించింది ఆ సిలువలో!! లేకపోతే ఒక్క శాపం పెడితే మానవాళికి రక్షణ ఉండేది కాదు, యుగయుగాలు మరణాన్ని పాతాళాన్ని అనుభవించవలసి వచ్చేది!! ఇదే దైవికప్రేమ!

 ఇంకా రక్షించబడిన తర్వాత కూడా మనము మాటిమాటికి తప్పిపోతున్నా సహిస్తుంది ఆ దివ్యప్రేమ!! అందుకే యిర్మియా 31:3 లో అంటుంది ఆ దివ్యప్రేమ యిర్మియా గారితో: శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుతున్నాను! అదేమాట నేడు నీతో నాతో అంటుంది ఆ దివ్యప్రేమ! మరి ఈ దివ్యప్రేమ మాట విని పాపమును విడిచి చెడుతనము అసహ్యించుకుని క్రీస్తుప్రేమలోకి వస్తావా?!!!

 

మరో లక్షణం: *అన్నింటినీ నమ్మును*!!  మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్నీ, కట్టు కథనూ నమ్ముతుందని మాత్రం కాదు. కపట ఉపదేశకుల దుర్భోధలను ప్రేమ నమ్మదు. దీని అర్థం ఇలా కానే కాదు. ప్రేమ సత్యం విషయంలోనే సంతోషిస్తుంది (వ 6), కాబట్టి సత్యాన్ని గుర్తించగలదు. అది తెలివిమాలినది కాదు. అమాయకమైనది కాదు, గుడ్డిది కాదు. అయితే దానిది ఇతరులను నమ్మే స్వభావం. అనుమానాలు పెట్టుకుని విరక్తిగా ఎప్పుడూ కీడును ఎంచే స్వభావం కాదు. ఇతరులు చెప్పినది నిజమో కాదో సందేహించే అవకాశం ఉంటే అది నిజమేనని నమ్మేందుకు ప్రేమ సిద్ధమే. చెప్పే వ్యక్తి అబద్ధికుడని అనవసరంగా అనుకోవడం దానికి ఇష్టం లేదు.

 

ఇక మరో లక్షణం: *అన్నింటినీ నిరీక్షించును*! ఇక్కడ అన్నింటినీ నిరీక్షించును అనగా దేవుడు చెప్పినది ఒకవేళ ఇంకా పొందకపోతే, లేక స్వస్తత ఇంకా కలుగకపోతే, ఆశిస్తున్నది ఇంకా పొందుకోలేక పోతే, తొందరగా అలగదు! దేవునికోసం నిరీక్షిస్తుంది అనే అర్ధం వస్తుంది! ఇది అన్నిటినీ ఆశాభావంతో లేక నిరీక్షణ కలిగి చూస్తుంది అని కూడా అనువదించవచ్చు. ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు. వైఫల్యం దాన్ని అణగదొక్కదు. నిరీక్షణకు ఆస్కారమే లేనప్పుడు కూడా ఆశాభావం వదలదు!

రోమీయులకు 4: 18

నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

 

దేవుని కృప ఏ వ్యక్తికైనా చేరగలదనీ ఎలాంటి పరిస్థితినైనా మార్చెయ్యగలదనీ అది నమ్ముతుంది.

 

ఇక మరో లక్షణం: *అన్నింటినీ ఓర్చుకొనును*! ఇది కూడా అన్నింటినీ తాలుకొనును లాంటిదే!!

ఓర్చుకుంటుంది” ఈ గ్రీకు పదాన్ని సైనిక పదజాలం నుంచి తీసుకున్నారు. శత్రు దాడులన్నిటినీ ఓర్చుకుని నిలవడమనీ దీని అర్థం (ఎఫెసు 6:10-17). “ఆగాపే”, దేవునిపట్ల, మనిషిపట్ల ఉన్న ఈ స్వార్థం లేని దివ్య ప్రేమ అన్ని కష్టాలనూ బాధలనూ హింసలనూ సైతాను, మనుషులు చేసే దాడులనూ ఎదుర్కొని ముందుకు సాగిపోతుంది. అది విశ్వాసులకు అత్యధిక విజయాన్ని ఇస్తుంది.

 

మరి ఇన్ని గొప్ప లక్షణాలున్న దేవునిప్రేమను నీవు కలిగి ఉన్నావా ప్రియ సహోదరీ సహోదరుడా! నీవు ఓర్చుకుంటే నీలో స్వార్ధం లేని గుణము ఉంటే, అతిగా కోప పడకుండా ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే, గొప్పలు చెప్పుకునే బుద్ది లేకపోతే, అందరితోను మర్యాదగా మాట్లాడితే, దుర్నీతిని అసహ్యంచుకుంటే, దయకలిగి ఉంటే, నీలో దేవుని ప్రేమ పనిచేస్తుంది అని అర్ధం!

మరి ఈ ఆగాపే ప్రేమను నీవు కలిగి ఉన్నావా?

 

దైవాశీస్సులు!

 

 

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*100వ భాగము-సంఘము-దైవిక ప్రేమ-6*

 

1కొరింథీ 13:8--13

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

9. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని

10. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

11. నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

12. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!             

ప్రియులారా 13వ అధ్యాయం నుండి దైవిక ప్రేమను ధ్యానం చేసుకుంటున్నాము!

 

    (గతభాగం తరువాయి)

 

ఇక ప్రేమకున్న మరో చివరి లక్షణం: *ప్రేమ శాశ్వతకాలముండును*!! ఇది ఒకరోజు ఉండి మరో రోజు అంతరించిపోయేది కాదు! చివరికి ప్రవచనాలైనా పోవచ్చు, భాషలు నిల్చిపోయినా ఈ ప్రేమ మాత్రము ఎప్పటికీ ఉంటుంది అంటున్నారు! అందుకే ఈ ప్రేమ ఆదాముగారితో మొదలైనా ఇంతవరకు మానవాళిపై ఆ ప్రేమ కొనసాగుతూ ఉంది! మానవులు మాటిమాటికి దేవుని విడిచి విగ్రహాల వెనుక నిజానికి దేవుళ్ళు కానివాటి వెనుక, దేవునికి కోపం పుట్టించే సాతాను శరీర కార్యాల వెంట పడుతున్నా జాలిచూపి దినమంతా చేతులు చాపి పిలుస్తున్నారు దేవుడు! అప్పటినుండి ఇప్పటివరకు ఈ ప్రేమ అంతం కాలేదు!

 

నిజానికి ఇదీ ఈ వచనానికి అర్ధం! గాని ఈ వచనం ఇంకా 910 వచనాలు చదివి కొంతమంది భాషలు ప్రవచనాలు నిలచిపోయాయి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు! ఇది తప్పు!

8. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

9. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని

10. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

 

“ఆగాపే” ప్రేమ శాశ్వతంగా ఉంటుందని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ గలవారే నిత్యత్వంలో ఆయనతో ఉంటారు. పౌలుగారు రాస్తున్న కాలంలో మంచివిగా, ప్రయోజనకరమైనవిగా ఉన్న కొన్ని విషయాలు కూడా గతించిపోతాయి.

ఇక భాషలు, ప్రవచనాలు , తెలివి/ జ్ఞానం ఇవి పౌలుగారు 12:8-10లో చెప్పిన కృపావరాలు లేక ఆధ్యాత్మిక సామర్థ్యాలు. కానీ బహుశా మరింత విస్తారమైన అర్థం ఈ మాటల్లో ఉండవచ్చు. క్రొత్త నిబంధన  గ్రంథ రచన పూర్తి అయినప్పుడు (“పరిపూర్ణమైనది”) ఈ సామర్థ్యాలన్నీ గతించిపోతాయని పౌలుగారి భావమని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. అప్పటివరకు ఈ సామర్థ్యాలు (“కొంత భాగంగా ఉండేది”) అవసరం. ఎందుకంటే దేవుని సంపూర్ణ సత్యం ఇంకా సంఘానికి వెల్లడి కాలేదు. ఆ తరువాత ఈ సామర్థ్యాల అవసరం ఉండదు. అవి లేకుండా పోయాయి. సంఘం బాల్యదశలో ఉన్నప్పుడు (వ 11) మాత్రమే ఈ సామర్థ్యాలు అవసరమనీ దానికి వయసు వచ్చాక వాటి అవసరం లేదనీ ఆ పండితులు అనుకున్నారు. ఈ అభిప్రాయం  సరియైనదిగా కాదు.

 “పరిపూర్ణమైనది” వచ్చే సమయం క్రొత్త నిబంధన గ్రంథం పూర్తి అయినప్పుడు కాదనీ, విశ్వాసులు పరలోకంలో క్రీస్తుతో ముఖాముఖిగా కలిసికొన్నప్పుడు , లేదా ఈ యుగాంతంలోననీ వ 12 సూచిస్తుంది. క్రీస్తుకు విశ్వాసులు పూర్తిగా తెలిసినట్టే వారికి ఆయన పూర్తిగా తెలిసే సమయం అది.  క్రొత్త నిబంధన గ్రంథం రచన పూర్తి అయినప్పుడు ఇలా జరగలేదు అని గ్రహించాలి.

 

జ్ఞానము నిరర్ధకమగును ” అంటే పరిపూర్ణం కాని తెలివి లేక తెలివైన మాట చెప్పే సామర్థ్యం (12:8). లేదా, తర్కం ద్వారా ప్రయోగాల ద్వారా మనుషులు సంపాదించుకునే సాధారణమైన తెలివి అని కూడా అర్థం కావచ్చు. లోపం లేని తెలివి, జ్ఞానం వచ్చినప్పుడు అదంతా అనవసరమవుతుంది  అని అర్ధం.

 

13:11లో నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవానివలె మాట్లాడాను, పిల్లవానిలా తలంచాను పిల్లవానిలా యోచించాను, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను అంటున్నారు, అనగా  బహుశా భూమిపై విశ్వాసుల జీవితమంతా బాల్యదశ వంటిదని అతని భావం కావచ్చు. క్రీస్తు వచ్చినప్పుడే వారికి సరైన వయసు వస్తుంది. అయితే ఇప్పుడు కూడా మనం ప్రేమ, మరియు కృపా వరాల విషయంలో చిన్నపిల్లల్లాగా ప్రవర్తించ కూడదన్న కనీసం ఒక సూచన ఇక్కడ కనిపిస్తున్నది.

 

ఇక 12వ వచనంలో ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్లు సూచనగా ఉంది గాని అప్పుడు ముఖాముకిగా చూతుము అనగా క్రీస్తును చూస్తాము, ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక సంగతులను కొంతమట్టుకే తెలిసికొన్నాము గాని అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా చూస్తాను అంటున్నారు!

“అద్దంలో చూస్తున్నట్టు” అనగా ఆ రోజుల్లో అద్దాలు ఇప్పటి అద్దాలంత మంచివి కావు. వాటిలో కనిపించే ప్రతిబింబం మసకగా ఉండేది. ఇప్పుడూ మన తెలివి విషయం కూడా ఇదే. అయితే మనం క్రీస్తును కలసికొన్నప్పుడు , మధ్యాకాశంలో ఆయనతో ఉన్నప్పుడు ఇంకా నిత్యత్వంలో ఆయనతో ఉన్నప్పుడు మనము ఈ కృపావరాలతో ఇక పనిలేకుండా ఆయన వెలుగులో ఆయన నుండి ఆయన గుణాలు గ్రహించి ఆయనలాగే మనము జీవిస్తాము అని అర్ధము!!

 

ఇక చివరి వచనం చాలాచాలా ప్రాముఖ్యమైనది: కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు చివరి వరకు నిలుస్తాయి! అయితే ఈ మూడింటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమయే!! ప్రేమ అన్నింటిలో విశిష్టమైనది!

 

నిజానికి ఈ మూడూ క్రైస్తవ సంఘ జీవితానికీ, వ్యక్తిగతంగా విశ్వాసికీ ప్రాముఖ్యమైనవి. ఏ ఆధ్యాత్మిక సామర్థ్యంకన్నా, కృపావరంకన్నా  కూడా ముఖ్యమైనవి. విశ్వాసం, నిరీక్షణ కన్నా ప్రేమ గొప్పదని పౌలుగారు  చెప్పడం ఆశ్చర్యంగా ఉందా?

 

విశ్వాసం మన పాపవిముక్తి రక్షణలేక అత్యవసరం గదా (యోహాను 3:36). దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడని ఎదురు చూడడమే నిరీక్షణ. అది క్రైస్తవ జీవితంలో ప్రధానమైన విషయం (రోమ్ 8:24-25) ప్రకారం. అయితే ఈ రెంటి కన్నా ప్రేమ ఎలా గొప్పది?

దీనికోసం స్టడీ బైబిల్ లో‌ ఇలా ఉంది:

 

ఎలా అంటే విశ్వాసం లేదా నమ్మకం తీసుకుంటుంది. ప్రేమ ఇస్తుంది. పుచ్చుకోవడం కన్న ఇవ్వడం ఎక్కువ ధన్యకరం (అపొ కా 20:35). ఇస్తున్న దాన్ని అందుకునే హస్తం నమ్మకం లేక విశ్వాసం. అది అందుకుంటున్న గొప్ప విషయం ప్రేమ. నిరీక్షణ  కూడా విశ్వాసం వంటిదే. తనకు మేలు జరగాలని అది ఎదురు చూస్తుంది. ప్రేమ ఇతరుల మంచిని కోరుతుంది. ఒక గమ్యాన్ని చేర్చే సాధనాలు విశ్వాసం, నిరీక్షణ. ప్రేమే ఆ గమ్యం. అందరి శ్రేయస్సు కోసం ఎక్కువ చేసేది అన్నిటికన్నా గొప్పది, ప్రేమే ఇలా చేస్తుంది (8:1).

 

10:24లో విశ్వాసులు ఏమి చెయ్యాలని పౌలుగారు చెప్పారో వారిచేత అలా చేయించగలిగేది ప్రేమ ఒక్కటే. ఈ అధ్యాయం చదివాక ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. ఈ “ఆగాపే”, దేవుని పట్లా మనుషులపట్లా ఈ స్వార్థం లేని ప్రేమ మనకెలా కలుగుతుంది?

గలతీ 5:22;

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

 

1యోహాను 4: 7

ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

 

 రోమా 5:5లో జవాబు ఉంది.

రోమీయులకు 5: 5

ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

ఈ ప్రేమ దేవుని నుంచి వస్తుంది గానీ విశ్వాసులు దానికి లొంగి విధేయులై దాన్ని ఆచరణలో పెట్టాలి అని గ్రహించాలి!(14:1).

1కోరింథీయులకు 14: 1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి.

 

కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ కేవలం మాటలలోనా, చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం చేద్దాం!

 

మరోసారి చెబుతున్నాను: *ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు వేస్ట్ ఫెల్లో!*

 

అట్టి ప్రేమ, దైవిక ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!

ఆమెన్!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*101వ భాగము*

 

  1కొరింథీ 15:18.

1. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.

2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు మనం 14 అధ్యాయాల నుండి సంఘములో ఉన్న సమస్యలు మరియు సంఘ క్రమానికి సంబంధించిన అనేక విషయాలు నేర్చుకున్నాము!

 

ఇక మనం 15వ అధ్యాయం చూసుకుందాం! ఈ అధ్యాయం నిజానికి ఒక చిన్న ప్రశ్నకు పెద్ద సమాధానం, గాని పౌలుగారి పత్రికలలో అతిపెద్ద అధ్యాయం! ఈ ప్రశ్న కొందరు విశ్వాసులు అడిగారు! కొంతమంది సద్దూకయ్యుల బ్యాచ్ నుండి రక్షించబడిన వారు ఏమని అడిగారు అంటే అసలు మృతులు పునరుత్థానులు అవుతారా? అలా అయితే లేస్తే ఎలా లేస్తారు? ఏ దేహాలతో ఉంటారు? అయితే ఈ అడిగిన వారు- ప్రశ్నకు జవాబు తెలుసుకొందామనే ఉద్దేశ్యంతో అడిగితే పౌలుగారు మామాలుగా జవాబు చెప్పేవారు, గాని వీరు ఎంతో హేళనగా వేళాకోళంగా అడిగి ఉంటారు, అందుకే ఒరేయ్ వెర్రివాడా, లేక Fool అంటూ జవాబు చెప్పారు, ఆయన ఏ పత్రికలో కూడా ఇలా వ్రాయలేదు, కేవలం ఈ పత్రికలో ఈ అధ్యాయంలో మాత్రమే అలా హేళనగా అడుగుచున్న వారిని ఉద్దేశించి ఘాటైన సమాధానం చెప్పారు! అయితే ఈ ప్రశ్నకు జవాబుగా మొదట ఆదికాండం నుండి మొదలుపెట్టి, పాపం విస్తరించడం క్రీస్తుయేసు సిలువసువార్త, మరణ పునరుత్థానాలు యొక్క నిజానిజాలు వ్రాసి, మృతుల పునరుత్థానం ఎలా జరుగుతుందో వివరంగా విస్తారంగా చెబుతూ ప్రకటన గ్రంధంతో ముగించి జవాబు చెప్పారు!

 

మొదటి వచనం: సహోదరులారా అంటూ మొదలుపెట్టారు! నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, అ సువార్తను మీరు అంగీకరించారు, ఇప్పటికీ దానిలోనే ఉన్నారు! మీ విశ్వాసం వ్యర్ధమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపంగా సువార్త ప్రకటించానో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొంటే అదే సువార్త వలన మీరు రక్షణపొందుతారు! ఇలా చెప్పి నాకియ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించాను, అదేమిటంటే లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందారు, అలాగే లేఖనముల ప్రకారం సమాధిచేయబడ్డారు, అలాగే లేఖనముల ప్రకారమే ఆయన మూడవ దినమున లేచారు, లేచాక కేఫా అనగా పేతురుకి 12మంది శిష్యులకు, తర్వాత 500 మందికంటే ఎక్కువమందికి కనబడ్డారు, చివరికి నాకు కూడా కనబడ్డారు అంటూ చెబుతున్నారు!

 

సరే, మొదటగా నేను మీకు ప్రకటించిన సువార్త అంటూ మొదలుపెట్టారు కనుక ఏం ప్రకటించారో కొన్ని మాత్రమే చూసుకుందాం!

 

1కోరింథీయులకు 1: 18

సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

1కోరింథీయులకు 1: 24

ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.

 

1తిమోతికి 3: 16

నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

 

రోమీయులకు 1: 16

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

 

రోమీయులకు 3: 23

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

 

రోమీయులకు 5: 6

ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.

 

రోమా 6:4, 10:4

రోమీయులకు 16: 25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

 

2 కొరింతు  5:10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

 

గలతీ 1:4,

మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి (దుష్టయుగమునుండి) విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను.

 

2తిమోతికి 1: 10

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

ఇప్పుడు ఆ సువార్తను మీరు అంగీకరించారు! దానియందు మీరందరూ నిలిచియున్నారు. ఆ సువార్తను పట్టుకుంటే దాని వలనే మీరు రక్షణ పొందుతారు అంటున్నారు! సువార్తపై, క్రీస్తుపై నమ్మకంలో నిలకడగా ఉండడమే ఆ నమ్మకం నిజమైనదనడానికి గుర్తు.

 

కొలస్సీయులకు 1: 23

పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

 

Hebrews(హెబ్రీయులకు) 3:5,6

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

 

Hebrews(హెబ్రీయులకు) 10:38,39

38. నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

39. అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు (లేక, సంపాదించుకొనుటకు) విశ్వాసము కలిగినవారమై యున్నాము.

 

. చనిపోయినవారిని దేవుడు తిరిగి సజీవంగా లేపుతాడనే సత్యాన్ని కొరింథీలో కొందరు నిరాకరిస్తున్నారు (వ 12). కానీ క్రీస్తు సజీవంగా లేవడం సువార్తకు ఆయువుపట్టు వంటిది. దీన్ని నిరాకరించేవారి నమ్మకం లోపం గలది (వ 14,17). “వట్టిగా” నమ్మడం అంటే తాము నమ్మినది ఏమిటో తెలియకుండా నమ్మడం, లేక ఆ నమ్మకానికి సరైన ఆధారమేమిటో అర్థం చేసుకోకుండా నమ్మడం కావచ్చు. లేదా, చివరివరకూ సాగిపోలేని నమ్మకం వ్యర్థమైనది, పనికిమాలినది, రక్షించలేని నమ్మకం అని అర్థం.

 

ఇక అదే సువార్త వలన పాపక్షమాపణ మరియు రక్షణ కూడా దొరుకుతుంది. దేవుడు క్రీస్తు సువార్తను మనకు ఇచ్చినది ఇందుకే !

మనము  దానికి లోబడితే విముక్తి, రక్షణ. లేకుంటే శాశ్వత శిక్ష .

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:6,7,8

6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,

7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు

8. మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

 

 సువార్తకున్న అమితమైన ప్రాముఖ్యత తెలిసిన పౌలుగారు కొరింథీవారు ఇంకా అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని శుభవార్తను నమ్మాలని కోరుతున్నారు.

వారే కాదు మనము కూడా ఇదే సువార్తను నమ్మి విశ్వసిస్తున్నాము!

దీనిలోనే కొనసాగితేనే మనకు రక్షణ విమోచన కలుగుతుంది!

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*102వ భాగము*

1కొరింథీ 15:29.

2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,

4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకు జవాబు ధ్యానం చేసుకుంటున్నాము! సువార్త వలన మనకు ఏమి లభించిందో చూసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

    ప్రియులారా! సువార్తలో నాలుగు అంశాలున్నాయి క్రీస్తు మరణం, సమాధి చేయబడడం, సజీవంగా తిరిగి లేవడం, ఆ తరువాత తన శిష్యులకు కనిపించడం. క్రీస్తు మరణం మన పాపాల కోసమే

 

మత్తయి 26: 28

ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో- క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.

 

యోహాను 1: 29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.

 

Romans(రోమీయులకు) 3:24,25,26

24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.

25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

 

రోమీయులకు 4: 25

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

 

2కోరింథీయులకు 5: 21

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

 

గలతీ 1:4; హెబ్రీ 1:3; 9:28; 10:12; 1 పేతురు 2:24; 3:18; ప్రకటన 1:5.

ప్రకటన గ్రంథం 1: 5

నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

 

క్రీస్తు సిలువ మీద నిజంగా చనిపోలేదని చెప్పేవారెవరైనా దేవుడు మానవాళి పాపాలకోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక అర్పణను నిరాకరిస్తున్నారన్నమాట. మనుషులు తమ పాపాలనుంచి విముక్తులయ్యేందుకు దేవుడు వారికి నియమించిన ఏకైక మార్గాన్నే త్రోసిపుచ్చుతున్నారన్నమాట.

 

ఇక క్రీస్తు సమాధి చేయబడడం కూడా అతి ప్రాముఖ్యమైనదే. ఆయన చనిపోయాడనేందుకు అత్యంత అవసరమైన చివరి రుజువు అది

 మత్తయి 27:57-66;

57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

58. పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.

59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

61. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.

62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి

63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

64. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయిఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదైయుండునని చెప్పిరి.

65. అందుకు పిలాతు కావలి వారున్నారు గదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

66. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.

 

మార్కు 15:42-46;

యోహాను 19:38-42

38. అటుతరువాత, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.

39. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

40. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.

41. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.

42. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.

 

అదే సమయంలో క్రీస్తు సజీవంగా లేవడం అంటే ఆయన మృతదేహంలోకి ఆయన ఆత్మ తిరిగి ప్రవేశించి దాన్ని తిరిగి బ్రతికించి సమాధి నుంచి ఆ దేహం బయటికి వెళ్ళేలా చేయడం. ఇది కూడా గొప్ప ప్రాముఖ్యమైన సంగతే !

రోమ్ 4:25; మత్తయి 28:6

రోమీయులకు 4: 25

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

 

మత్తయి 28: 6

ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి

 

క్రీస్తు మరణం, మళ్ళీ బ్రతకడం రెండూ కూడా “లేఖనాల ప్రకారమే” (అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారమే) మత్తయి 5:17; లూకా 24:25-27, 45, 46 చూడండి.

Luke(లూకా సువార్త) 24:25,26,27,45,46,47,48

 

25. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

26. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27. మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

45. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి

46. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు

47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

48. ఈ సంగతులకు మీరే సాక్షులు

 

క్రీస్తు తన శిష్యులకు కనిపించడం అనేది కూడా అన్నిటికంటే ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఆయన సజీవంగా లేచాడనడానికి అది రుజువు. క్రీస్తు తిరిగి లేచాక కనిపించిన అన్ని సందర్భాలను పౌలుగారు ఇక్కడ రాయలేదు.

 

క్రీస్తు సజీవంగా లేచాక జరిగిన సంభవాల వరుస క్రమం స్పష్టంగా లేదు. ఏ ఒక్క సువార్తలోనూ అవన్నీ రాసిలేవు. ప్రతి రచయితా దేవుడు అతణ్ణి ప్రేరేపించిన రీతిగా వర్ణించాడు. యేసుప్రభువు పదకొండు వేరువేరు సందర్భాల్లో శిష్యులకు కనిపించినట్టుంది. వీటి క్రమం బహుశా ఇది:

మగ్దలేనే మరియకు (మార్కు 16:9; యోహాను 20:14);

ఆమె లేకుండా సమాధినుంచి తిరిగి వస్తున్న స్త్రీలకు (28:9-10);

తరువాత పేతురుకు (లూకా 24:34);

 ఎమ్మాయస్ గ్రామానికి పోయేదారిలో ఇద్దరు శిష్యులకు (లూకా 24:13);

తరువాత తోమా లేని సమయంలో జెరుసలంలో కొందరు శిష్యులకు (యోహాను 20:19);

తోమా ఉన్నప్పుడు (యోహాను 20:26-29);

 తరువాత గలలియ సరస్సు ఒడ్డున ఏడుగురు శిష్యులకు (యోహాను 21:1);

గలలియ ప్రదేశంలోని కొండపై కొంతమంది శిష్యులకు (మత్తయి 28:16);

తరువాత ఒకే సమయంలో 500 కంటే ఎక్కువమందికి (1 కొరింతు 15:6);

యాకోబుకు (1 కొరింతు 15:7);

 చివరికి ఒలీవల కొండ మీద తన పదకొండుమంది అపొస్తలులకు (లూకా 24:50-51; అపొ కా 1:9-12).

ఆయన తన అపొస్తలులకు 40 దినాలపాటు కనిపిస్తూ వచ్చారు గనుక బైబిలులో రాయని ప్రత్యక్షాలు మరి కొన్ని జరిగి ఉండాలి (అపొ కా 1:3). ఈ ప్రత్యక్షాలన్నీ ఒకే ఒక గొప్ప సత్యాన్ని పూర్తిగా రుజువు చేసి శాశ్వతంగా స్థిరపరచాయి చనిపోయిన యేసు తిరిగి సజీవంగా లేచాడు.

 

గమనించాలి- ఇది తనకు దేవుడే స్వయంగా తెలిపారు అంటున్నారు గలతీ పత్రికలో

గలతీ 1:11-12.

11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను.

12. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

 

కాబట్టి ఆయన జననము లేఖనముల ప్రకారమే జరిగింది, ఆయన సువార్త పరిచర్య లేఖనముల ప్రకారమే జరిగింది, ఆయన మరణము లేఖనముల ప్రకారమే జరిగింది, ఆయన సమాధి కూడా లేఖనముల ప్రకారమే జరిగింది, ఆయన పునరుత్థానం కూడా లేఖనముల ప్రకారమే జరిగింది! అన్నీ లేఖనములను నెరవేర్చడానికి యేసుక్రీస్తుప్రభులవారు వచ్చారు, నెరవేర్చారు!!

 

ఆయన పునరుత్తానుడై లేచి ఎవరికీ చెప్పకుండా పారిపోలేదు! మీదన వివరించిన విధంగా 40 రోజులు అనేకమంది కి కనబడ్డారు.

 

ఇక మరో ముఖ్యమైన విషయం 500 మందికి కనిపించారు అంటూ ఆయన నొక్కివక్కానించి చెప్పడం లో అర్ధం ఏమిటి?

కారణం ధర్మశాస్త్రం ప్రకారం ఒక సత్యం ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల సహాయంతో స్థిరపడగలదు (ద్వితీ 17:6; మత్తయి 18:16).

ఇప్పుడు యేసుక్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచిన తరువాత ఆయనను చూచినవారు 500 మంది కంటే ఎక్కువమంది. లోకంలో ఇప్పటి వరకు జీవించినవారిలో కెల్లా ఉత్తములైనవారు కొందరు వీరిలో ఉన్నారు. అనగా ఈ పత్రిక వ్రాయబోయేసరికి క్రీ.శ. 51 కి ఆయన పునరుత్తానికి సాక్షులుగా ఉన్నవారు చాలామంది బ్రతికి ఉన్నారు అంటున్నారు!  ప్రాచీన చరిత్ర గ్రంథాల్లో రాసివున్న ఏ సంఘటన కంటే కూడా యేసుక్రీస్తు మరణం, సమాధి చేయబడడం, మళ్ళీ బ్రతకడం అనే వాస్తవాలకు చాలా ఎక్కువ సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయి.

 

ఇక కొందరు నిద్రించిరి అనగా కొంతమంది చనిపోయారు! వారిలో చాలామంది క్రీస్తు సిలువసువార్తకు హతస్సాక్షులుగా మారిపోయారు!! వారికోసమే కొందరు నిద్రించారు అంటున్నారు!

 

ఇక 7వ వచనంలో ఆయన యాకోబుకు, తర్వాత 12మంది శిష్యులకు కనబడ్డారు అంటున్నారు! ఇక్కడ యాకోబు అని వ్రాసిన వ్యక్తి ఎవరు అంటే- ఆయన తమ్ముడైన చిన్న యాకోబు అని గ్రహించాలి, ఈయనే యాకోబు పత్రిక రాశారు! పౌలుగారు పెద్ద యాకోబు గారిని చూడలేదు! పౌలుగారు రక్షించబడిన తర్వాత ఆయనను చూడటానికి అవకాశం దొరకలేదు! కారణం యూదులను సంతోషపెట్టడానికి హేరోదు పెద్దయాకోబు గారిని చంపేశాడు! చిన్నయాకోబు గారు అఖిల క్రైస్తవ సమాజానికి ఆ దినాలలో సంఘ అధ్యక్షునిగా ఉన్నారు, అప్పుడే పౌలుగారు బర్నబా గారు అపో.కా 15వ అధ్యాయం ప్రకారం యాకోబు గారిని పేతురు గారిని యోహాను గారిని యేసయ్య మరో చిన్నతమ్ముడు యూదాగారిని కలుసుకున్నారు! కాబట్టి ఈ యాకోబు గారు యేసుక్రీస్తుప్రభులవారి పెద్ద తమ్ముడు అని గ్రహించాలి!

 

ఇక శిష్యులందరికీ కనబడి నట్లు మనము సువార్తలలో చూడవచ్చు!

 

ఇక 8వ వచనంలో అకాలమందు పుట్టినట్లున్న నాకు కూడా కనబడ్డారు అంటున్నారు! ఇది మనకు అపొ కా 9:3-7. కనిపిస్తుంది..

 

3. అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.

4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.

5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న యేసును;

6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

7. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.

 

ఆయన అకాలమందు పుట్టినట్లున్న అని అనడానికి కారణం ఆయన మాటలలోనే చెప్పేస్తున్నారు 9వ వచనంలో నేను సంఘాన్ని మిక్కిలిగా హింసించినందున అపోస్తలులలో తక్కువ వాడను, అలా పిలిపించుకోడానికి నేను యోగ్యుడను కాను అంటున్నారు! తాను మొదటినుంచి క్రీస్తు అపోస్తలులలో , శిష్యుల్లో ఉన్నవాణ్ణి కాననీ, క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచిన సమయానికి ఇంకా పాపంలోనే ఉన్నాననీ, అసాధారణమైన రీతిలో క్రీస్తు అపొస్తలునిగా అయ్యాననీ పౌలుగారు చెబుతున్నారు.

అయినా ఆయన నాకుకనబడ్డారు, నన్ను పట్టుకున్నారు! ఆయన సజీవుడు అని లోకమంతటా సాక్ష్యం చెబుతున్నారు! ఏ సంఘాన్నయితే పాడుచేయడానికి కంకణం కట్టుకుని సంఘాన్ని హింసించానో అదే సంఘానికి అదే సత్యానికి దేవుడు ఇప్పుడు నన్ను సాక్షిగా నిలబెట్టారు అని సిగ్గులేకుండా కొన్ని లక్షలమందికి వేల కిలోమీటర్లు ప్రయాణించి చెప్పారు! అదే సిలువసువార్త!

మరి ఆ సిలువ సువార్తకు నిన్ను నన్ను కూడా సాక్షిగా పిలుచుకున్నారు కదా, మరి నీవు సిలువసువార్తను ప్రకటిస్తున్నావా???

 

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*103వ భాగము*

 

1కొరింథీ 15:911.

9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

11. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము!

 యేసుక్రీస్తుప్రభులవారు మరణించి తిరిగిలేచి అనేకులకు కనబడినట్లు చూసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

  ఏలయనగా నేను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనబడటానికి యోగ్యుడను కాను, అపోస్తలులు అందరిలో నేను తక్కువ వాడను, అయినాగాని నేనేమైయున్నానో అది దేవుని కృపవలన అయి ఉన్నాను అని ధైర్యముగా చెబుతున్నారు పౌలుగారు!  ఆయన కృప నా యెడల వ్యర్ధమై పోలేదు, వారికంటే నేను చాలా ఎక్కువగా కష్టపడ్డాను! కష్టపడింది నేను కాదు ఆయన కృపయే నాతో కష్టపడేలా చేసింది అని  చెప్పుతునారు!

 

నిజానికి పౌలుగారు అపొ కా 8:3; 9:1-2; ఎఫెసు 3:9; 1 తిమోతి 1:12-15. ఫిలిప్పీ 2:3 లో తాను ఇతరులకు ఏమి చెప్పారో దాన్ని చేసి చూపించారు! అలా  చూపించడం పౌలుగారికి ఆనందమే! ....

అపొ కా 8:3;

సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

 

9:1-2;

1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకుని యొద్దకు వెళ్లి

2 .యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.

ఎఫెసీయులకు 3: 11

సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.

 

1 తిమోతి 1:12-15.

12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

14. మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

15. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

 

ఫిలిప్పీ 2:3

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

 

 తాను దేవుని సేవకుడుగా, క్రీస్తు అపోస్తలునిగా ఉండడం కేవలం దేవుడు చూపిన కృప లేదా కరుణ అనీ వర్ణించశక్యం కాని కృప అనీ పౌలుగారికి బాగా తెలుసు (ఎఫెసు 3:7-8; 2 తిమోతి 1:9; తీతు 3:3-4). అందరికంటే తాను ఎక్కువ కష్టించి పని చేశాననడంలో పౌలు తనలో పని చేసిన దేవుని కృపకే ఘనత కలిగించాడు గాని తనకు కాదు.

.....

Ephesians(ఎఫెసీయులకు) 3:7,8

7. దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

 

Titus(తీతుకు) 3:3,4,5

3. ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునై యుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

4. మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు

5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

 

1కోరింథీయులకు 15: 10

అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.

 

15:11లో అంటున్నారు, వారైనా అనగా తక్కిన అపోస్తలులు, నేను ప్రకటించిన సువార్త ఒక్కటే, అదే సిలువసువార్త!! పాపవిముక్తి మార్గం ఒక్కటే. వారందరూ ఈ ఒక్క మార్గాన్నే ఎరిగి బోధించారు.

 

అయితే మిగిలిన అపోస్తలులు కంటే పౌలుగారే ఎక్కువ కష్టపడాను అని ఎందుకంటున్నారు అంటే ఆయన జీవితంలో నాలుగు సువార్త దండయాత్రలు చేశారని మనకు తెలుసు. నాల్గవ యాత్ర పూర్తికాకుండానే ఆయన హతస్సాక్షి అయ్యారు! అంతేకాదు ఆయన సువార్త కోసం ఎన్ని పాట్లుపడ్డారో మనకు ఇదే కొరింథీ పత్రికలో రాశారు పౌలుగారు...

 

2 Corinthians(రెండవ కొరింథీయులకు) 11:23,24,25,26,27,28

23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

28. ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.

 

క్రీస్తు సిలువసువార్త కోసం, నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో ఎన్ని బాధలయినా హింసలయినా ఉపద్రవాలయినా కరువైనా ఆకలైనా వెనుదిరుగకుండా సాగిపోయిన సువార్త వీరుడు ధీరుడు పౌలుగారు! అందుకే ఎక్కువగా కష్టపడ్డాను, అయితే ఇంతకష్టపడినా కష్టపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృప అని తగ్గించుకున్నారు! ఇలాంటి తగ్గింపు సువార్త భారం నీకుందా ప్రియ చదువరీ!!

 

దైవాశీస్సులు!!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*104వ భాగము*

 

1కొరింథీ 15:1219.

12. క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు.

14. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

15. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

16. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.

17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.

18. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు మరణించి తిరిగిలేచి అనేకులకు కనబడినట్లు చూసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక 12 నుండి అంటున్నారు: ఇలా మేము అనగా నేను గాని తక్కిన అపోస్తలులు గాని క్రీస్తుయేసు మృతిని గెల్చి లేపబడియున్నారని మేము ప్రకటిస్తూ ఉండగా మీలో కొందరు అనగా కొరింథీ సంఘములో ఉన్న కొందరు తప్పుడు భోధకుల వలన మోసగించబడి మృతుల పునరుత్థానం లేదని ఎలా చెబుతున్నారు అని అడుగుచున్నారు!!

ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి యుండలేదు అనగా యేసుక్రీస్తుప్రభులవారు మృతిని గెల్చి లేవలేదు! అంతేకాకుండా క్రీస్తు లేపబడకపోతే మేము చేస్తున్న ఈ సువార్త ప్రకటన వ్యర్ధమే! ఇంకా దీనిని నమ్మిన మీ విశ్వాసము కూడా వ్యర్ధమే!! అంటున్నారు!

 అంతేకాదు దేవుడు క్రీస్తును లేపారని మేము మీకు సాక్ష్యం చెప్పాము, ఒకవేళ మృతులు పునరుత్థానం చెందకపోతే దేవుడు క్రీస్తుయేసుని మృతులలోనుండి లేపలేదు, గనుక మేము అబద్ధపు సాక్షులం అయిపోయాము అంటున్నారు! మృతులు లేపబడక పోతే క్ర్రీస్తుయేసు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడకపోతే మీరింకా మీ పాపం లోనే ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్ధం అంటున్నారు!

 

కొరింథీ సంఘంలో  క్రైస్తవులు కొందరు (సద్దూకయ్యుల్లాగా అపొ కా 23:8) మృతులు తిరిగి బ్రతికి లేవడం అనేది లేదని వాదిస్తున్నారు. ఒకవేళ అలాంటిది గనుక నిజంగా లేకపోతే కొన్ని విచారకరమైన ఫలితాలు ఉంటాయని పౌలుగారు  అంటున్నాడు. అవేవంటే,

క్రీస్తు కూడా అలా లేచి ఉండేవాడు కాదు (వ 13,16),

క్రీస్తు అపోస్తలుల ఉపదేశాలు “వ్యర్థం”, అబద్ధం అయి ఉండేవి (వ 14,15),

క్రైస్తవుల నమ్మకం కూడా “వ్యర్థమే” (వ 14,17),

వారింకా తమ పాపాల్లోనే ఉండి ఉంటారు, శాశ్వతంగా నశించిన స్థితిలోనే ఉండి ఉంటారు (వ 17,18),

అందరూ కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండి ఉంటారు (వ 19).

 

ఈ విధంగా పౌలుగారు మనుషుల పాపవిముక్తికి క్రీస్తు సజీవంగా లేవడమన్నది ఎంత అవసరమో చూపిస్తున్నారు. నిజానికి సిలువసువార్తకు క్రీస్తు పునరుత్థానం మరియు మృతుల పునరుత్థానమే ప్రాణం. దాన్ని నిరాకరించడంఅంటే  సువార్తను వక్రం చేయడమే. అది సువార్తలోనుండి దాని సత్యాన్ని, ప్రభావాన్ని దోచుకోవడంతో సమానమే.

 

 ఒకవేళ క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేవలేదంటే మన పాపాల బరువుకు ఆయన శిక్షలో పడి మునిగి పోయాడన్నమాట, ఆయన బలి కావడం దేవునికి అంగీకారం కాలేదన్నమాట, ఎవరికీ క్షమాపణ కలగలేదు, ఎవరూ నిర్దోషులుగా తీర్చబడలేదన్న మాట (రోమా 4:24-25). ఎవరూ నిర్దోషులుగా తీర్చబడలేదంటే పాపానికి శిక్షగా అందరూ శాశ్వతంగా నశించిపోయారన్న మాట.

Romans(రోమీయులకు) 4:24,25

24. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.

25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

 

అంతేకాకుండా అంటున్నారు 18వ వచనంలో: ఇంతవరకు క్రీస్తునందు నిద్రించిన వారు అనగా మామూలుగా సాధారణ మరణం చెందిన వారు, హతస్సాక్షులైన వారు కూడా నశించిపోయినట్లే! అలాంటప్పుడు మనమందరం మనుష్యలందరికంటే దౌర్భాగులై ఉన్నాము! ఎందుకంటే వారి విగ్రహాల మార్గం నిజం కాదని సత్యము కాదని, నిజమైన మార్గం సిలువమార్గమని నమ్మి, విశ్వసించి, మన పాత అలవాట్లు మానివేసి, విగ్రహాలను వదిలేసి, బాప్తిస్మం పొంది వారిలా కాకుండా మన శరీర ఆశలను వదిలి చప్పిడి పత్యం చేస్తున్నాము! మరి ఇంత చేసి ఇప్పుడు మనకు మృతుల పునరుత్థానం లేదు అంటే మనం లోకంలో ఉన్న అందరికంటే దౌర్భాగులైపోతాము కదా అంటున్నారు!

 

నిజానికి క్రైస్తవులయొక్క నిరీక్షణ  అన్నది ఈ జీవితాన్ని అధిగమించి ఎంతో దూరానికి విస్తరించి ఉంది.

Romans(రోమీయులకు) 5:2,3,4,5

2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.

3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి

4. శ్రమలయందును అతిశయపడుదము.

5.ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

 

Romans(రోమీయులకు) 8:23,24,25

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కని పెట్టుదుము.

 

మరణంనుంచి సజీవంగా లేవడమన్నదే లేకపోతే అలాంటి నిరీక్షణ  వ్యర్థమే. అలాంటప్పుడు క్రైస్తవులంతా భ్రమలో ఉన్నట్టు లెక్క. అంతా వారిని చూచి జాలిపడాలి. వారి కష్టాలు, విషమ పరీక్షలు, హింసలు అన్నీ (యోహాను 15:18-20; అపొ కా 14:22; 2 తిమోతి 3:12) అనవసరంగా అనుభవించారన్నమాట.

అపో.కార్యములు 14: 22

శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

2తిమోతికి 3: 12

క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.

 

ఇలా చెప్పాక, 20వ వచనం నుండి తన సాక్ష్యమును చెబుతున్నారు- ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రధమ ఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడుఅని నొక్కివక్కానించి చెబుతున్నారు!

 

అయితే క్రీస్తు విశ్వాసులను చూచి ఎవరూ జాలిపడవలసిన పనిలేదు. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు మరణించి సజీవంగా లేచాడన్నది వాస్తవం. దాని గురించి ఎలాంటి సందేహమూ లేదు.

 

 అలా చెప్పడానికి యేసుక్రీస్తుప్రభులవారు మిట్టమధ్యాహ్నం వేల దమస్కు దగ్గరలో తనకు కనబడి, తనను గుడ్డివానిగా చేసి, పాపపు పొరలు తొలగించి, తనను పవిత్రునిగా చేసి తనకు చూపు మరలా ప్రసాదించి నీవు అనేక దేశాలలో నాకోసం సాక్షిగా ఉంటావు, నీవు ఇంతవరకు ఎందరిని ఎన్ని హింసలు పెట్టావో అంతకంటే ఎక్కువ శ్రమలు నాకోసం పడతావు అని చెప్పారు కాబట్టి ఆయన మృతుల లోనుండి యేసుక్రీస్తు ప్రభులవారు లేచినట్లు దృఢంగా చెబుతున్నారు! అనేకమంది రాజుల ముందు ఆ మధ్యాహ్నమందు కలిగిన సాక్షత్కారమునకు నేను వ్యతిరేకిని కాలేకపోయాను అనిచెప్పారు....

అపో.కార్యములు 26: 13

రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

అపో.కార్యములు 26: 19

కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

 

ఇంకా 21వ వచనం నుండి చివరి వరకు ఆదాము గారిని ఉదాహరణగా చెబుతూ ఆయన పునరుత్తానుడు అయ్యారు అని చెబుతున్నారు! ఆదాము గారు-ఇక్కడ మొదటి ఆదాము! కడపటి ఆదాము అనగా క్రీస్తుయేసు ప్రభువు అని అర్ధం!

 

కాబట్టి నిజంగా మృతుల పునరుత్థానం అనేది ఉంది! అది నిజము! మన క్రైస్తవ విశ్వాసానికి ఇదే నాంది!

 

ఒకరోజు ఆయన రాజులరాజుగా రాబోతున్నారు!ఆరోజు చనిపోయిన వారు లేపబడతారు! బ్రతికి ఉన్న మనము వారి తర్వాత మహిమ శరీరాలు కలిగి లేపబడి క్రీస్తుతో పాటుగా ఎత్తబడతాము !

 

ఆమెన్!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*105వ భాగము*

 

1కొరింథీ 15:2126.

21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.

22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము!

 యేసుక్రీస్తుప్రభులవారు మరణించి తిరిగిలేచి అనేకులకు కనబడినట్లు చూసుకున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక 21వ వచనం నుండి అంటున్నారు: ఒక మనుష్యుని నుండే మరణం వచ్చింది అందరికీ, అలాగే ఒక మనుష్యుని నుండే మృతుల పునరుత్థానం కలిగింది అంటున్నారు! మరణం సంప్రాప్తింప జేసిన  మనిషి ఆదాము గారు! మృతుల పునరుత్థానం తెచ్చిపెట్టినది యేసుక్రీస్తుప్రభులవారు! ఇక ఆదామునుండి అందరూ ఎలాగు మృతిపొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు అయితే ప్రతీ ఒక్కరు తనతన వరుసలలోనే బ్రతికించబడతారు. ప్రధమ ఫలమైతే క్రీస్తు అంటున్నారు! ఇక ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయనవారు బ్రతికించబడతారు అంటున్నారు!

 

అయితే క్రీస్తు విశ్వాసులను చూచి ఎవరూ జాలిపడవలసిన పనిలేదు. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు మరణించి సజీవంగా లేచాడన్నది వాస్తవం. దాని గురించి ఎలాంటి సందేహమూ లేదు.

 

చనిపోయినవారు సజీవంగా తిరిగి లేవడం అనేది యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు యోహాను 5:28-29లో ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు. 29 వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.

 

క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అవిశ్వాసులు తిరిగి లేస్తారని పౌలుగారు ఇక్కడ రాయలేదు. ఆ మాటకొస్తే విశ్వాసులూ అవిశ్వాసులూ అయిన మనుషులందరికీ అలాంటి సమయం ఒక్క సారే వస్తుందని కూడా అసలు ఎక్కడా పౌలుగారు రాయలేదు. ప్రకటన 20:5 ఒకసారి చూద్దాం

ప్రకటన గ్రంథం 20: 5

ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

 

అయితే ప్రధమ ఫలము గా క్రీస్తు మరణాన్ని జయించి మూడవరోజున లేచారు! ఆ తర్వాత క్రీస్తుయేసు రెండవరాకడలో పరిశుద్ధులు తిరిగి లేస్తారు! ఇదే చెబుతున్నారు పౌలుగారు!

 

ఇక ఈ వచనం చూసి కొంతమంది రెండు రకాలైన వివరాలు- అపోహలు చెబుతారు!

 

మొదటిది: వరుసలలో లేస్తారు! వారు చెప్పే వరసలో పాత నిబంధన విశ్వాసులు- పరిశుద్ధులు రెండవరాకడ అయ్యాక వెయ్యేండ్ల పాలన ముందుగా లేస్తారు. ఏడేండ్ల పెండ్లి విందులో వారుండరు!

 

రెండవది: క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు లేస్తారు అనగా కేవలం నూతన నిబంధన పరిశుద్ధులు మాత్రమే లేస్తారు, పాత నిబంధన పరిశుద్ధులు లేపబడరు అనేది రెండవ అపోహ!!

 దీనికోసం ప్రత్యక్ష్యతల గ్రంధం వ్యాఖ్యానం ధ్యానం చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకున్నాము! మరి సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి వరుసల కోసం మరియు ఆయన వారు లేపబడటం ఏమిటో క్లుప్తంగా చూసుకుందాం!

 

మొదటి పునరుత్థానం లో అయిదు వరుసలు ఉన్నాయి అంటారు! వరుసలు నేను కూడా నమ్ముతాను!

మొదట వరుసలో అనగా ప్రధమ ఫలం క్రీస్తే!

 

రెండవదిగా దేవుని బూర మ్రోగిన వెంటనే క్రీస్తునందు ఉండి మృతులైన వారు లేస్తారు!

 

 ఈవిషయంలో వారు అంటారు- కేవలం యేసుక్రీస్తు రక్తములో కడుగబడి బాప్తిస్మం పొందుకున్న వారు మాత్రమే లేస్తారు. పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన హతస్సాక్షులు మరియు సామాన్య హతస్సాక్షులు బహిరంగ రాకడలో వెయ్యేండ్ల పాలనకుముందు లేస్తారు అంటారు! ఇది నాకు అభ్యంతరముగా ఉంది. నేను అంటాను వీరుకూడా క్రీస్తులోకి వచ్చేశారు అంటాను. ఎలాగో క్రిందన వివరిస్తాను!  కాబట్టి మృతుల పునరుత్థానం జరిగినప్పుడు వీరు కూడా అనగా పాత నిబంధన పరిశుద్ధులు కూడా లేస్తారు అని నా ఉద్దేశ్యం!

 

ఒక్క విషయము చెప్పనీయండి: ఇది చెప్పడం ద్వారా వారిని తప్పుపట్టడం అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇది రాసిన ఆ దైవజనులు ఎంతో ఆత్మపూర్ణులు, గొప్ప అభిషక్తులు. వివాహాన్ని కూడా వదిలేసి దేవునికోసం జీవిస్తున్నవారు! వారిని తప్పు పట్టేటంత ఆత్మాభిషేకం స్థాయి నాకులేదు! వారితో నేను ఎందుకు పనిచేయను! గాని ఈ విషయం వ్రాయడంలో నా ఉద్దేశం ఏమిటంటే నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇలా అర్ధమయ్యింది. నా భావములు మాత్రమే నేను రాస్తున్నాను గాని వారిని తప్పుపట్టడం-నేను చెప్పింది నిజము అనడం అనేది నా ఉద్దేశం కానేకాదు!

 

సరే,  అదే రెండో వరుసలోనే జయించిన సంఘము ఎత్తబడుతుంది. మంచిది నేను కూడా నమ్ముతాను!

 

మూడవది: మహాశ్రమల కాలంలోని హతస్సాక్షులు! మంచిది.

 

నాల్గవ  వరుస: ఇద్దరు హతస్సాక్షులు. నేను కూడా నమ్ముతాను!

 

ఐదవది: పాతనిబంధన పరిశుద్ధులు మరియు పాత నిబంధన హతస్సాక్షులు మరియు క్రొత్త నిబంధన సామాన్య హతస్సాక్షులు బహిరంగ రాకడలో లేపబడతారు అంటారు!

 

ఇది నాకు అభ్యంతరం! మృతులు అంతా దేవుని బూర మ్రోగిన వెంటనే లేపబడతారు అని నా ఉద్దేశ్యం! హతస్సాక్షులు గాని మృతులు గాని అందరూ ప్రస్తుతం మృతులు కాబట్టి ఒకసారే లేపబడతారు. అంతేకాని ఓ పాత నిబంధన భక్తులారా! మీ వరుస చివరలో ఉంది, మీరు తర్వాత రండి అనరు అంటాను! కారణం దేవునికి పాత నిబంధన పరిశుద్దులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు సమానమే! యేసుక్రీస్తుప్రభులవారు మీరు నా నామంలో బాప్తిస్మం పొందలేదు కాబట్టి మీరు చివరలో పునరుత్తానమవ్వండి అని అనరు అని  నా ఉద్దేశం!

 

(అయితే ఒక్కమాట చెప్పనీయండి: పాత నిబంధన పరిశుద్దులు కూడా లేపబడతారు రెండవరాకడలో! మొత్తానికి పరదైసు కాళీ అయిపోతుంది! వారు ముందా వెనుకా అనేది అప్రస్తుతం! గాని ఇలా వరుసలు చెప్పి పాతనిబంధన పరిశుద్ధులైన మహా గొప్ప విశ్వాసులకంటే తమనే ముందుగా పెట్టుకుని వారికంటే మేమే ఉన్నతమైన స్థానానికి వెళ్తాము, వారికంటే మేమే ముందుగా లేపబడతాము అనడంలో నాకు కొంచెం బాధ కలుగుతుంది అంతే!!)

 

ఇలా అనడానికి వారు చూపించే కారణాలు: పాత నిబంధన భక్తులు యేసునామంలో బాప్తిస్మం పొందలేదు! వారు యెహోవాను పూజించారు! వారు గొర్రెపిల్ల రక్తంలో కడుగబడలేదు కాబట్టి వారు క్ర్రీస్తునందు లేరు అంటారు! నేను అంటాను వారు కూడా క్రీస్తులోనికి వచ్చేశారు అంటాను. ఎలాగో చివర్లో వివరిస్తాను!

 

ఇక వారు గొర్రెపిల్ల జీవగ్రంధమందు వారి పేర్లు లేవు. జీవ గ్రంథంలో ఉన్నాయి అంటారు. రెండు జీవ గ్రంథాలు లేవు అని నా ఉద్దేశం!

 

ఇక పాత నిబంధన భక్తులకు జయజీవితం లేదు- పరమ సీయోను అనుభవం లేదు మరియు పరిశుద్ధాత్మ అనుభవం లేదు అంటారు!

జయజీవితం ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, వారు కూడా ఆత్మపూర్ణులే అంటాను నేను. ఎలాగో చివర్లో చెబుతాను!

 

క్రొత్త నిబంధన సంఘము ఆత్మయొక్క ప్రధమఫలము! దీనిలో వారికి భాగం లేదు అంటారు!

ఇక దానియేలు 12:13 ప్రకారం అంత్యములో వారికీ పునరుత్థానం అంటారు! అనగా బహిరంగ రాకడలోనే వారు లేస్తారు అంటారు!

 

ఇక పాతనిబంధన హతస్సాక్షులు ఎందుకు వెయ్యేండ్ల పాలనకు ముందు లేపబడతారు అంటే వారుచేప్పేది- ప్రకటన  ఆరవ ఆధ్యాయంలో 9--11 వరకు: నాధా ఎందాక మా రక్తముకోసం వారికి తీర్పు తీర్చవు అంటే మీ సహదాసుల యొక్కయు, సహోదరుల యొక్కయు సంఖ్య పూర్తి అయ్యేవరకు అంటున్నారు. ఎందాక- అనగా వారు చనిపోయి చాలా వందల సంవత్సరాలు మాత్రమే కాదు రెండువేల సంవత్సరాలుకంటే ఎక్కువగా అయ్యింది కాబట్టి ఎందాక అనేమాట వాడారు అంటారు!

 

ఇదీ వారి ఉద్దేశం! అయితే ఇలాంటి వాటికోసం ఎక్కువ సమయం ఉపయోగించ వద్దుగాని నా ఉద్దేశంలో అయితే మృతులు అందరూ అనగా పాత నిబంధన పరిశుద్ధులు మరియు హతస్సాక్షులు, క్రొత్త నిబంధన మృతులు మరియు హతస్సాక్షులు దేవుని బూర ఊదిన వెంటనే లేపబడతారు అని నా ఉద్దేశం! వెంటనే పరదైసు కాళీ అయిపోతుంది. అసలు మహాశ్రమల హతస్సాక్షులు ఆత్మలు బలిపీఠం క్రిందకు డైరెక్టుగా ఎందుకు వెళ్ళిపోయాయి అంటే పరదైసు కాళీ అయిపోయింది కాబట్టే అని నా ఉద్దేశం! పరదైసూ అనే గెస్ట్ హౌస్ / విడిది గది/ రెస్ట్ రూమ్ ఎందుకు అంటే దేవుని రాకడ మరియు తీర్పు వరకు పరిశుద్ధులు ఉండే గెస్ట్ /రెస్ట్ హౌస్! కాబట్టి దేవుడు ఇప్పుడు వారినందరినీ మధ్యాకాశములోనికి తీసుకుని వచ్చేశారు కాబట్టి అక్కడ ఎవరూ లేరు, ఎటెండర్లతో సహా మధ్యకాలంలోకి వచ్చేశారు కాబట్టే ఈ మహాశ్రమల హతస్సాక్షులు తిన్నగా పరలోకంలో ఉన్న బలిపీఠం క్రిందకు వెళ్ళిపోయారు! కాబట్టి పరదైసు అనేది కాళీ అయిపోతుంది అని నా ఉద్దేశం!

 

ఇప్పుడు-పాత నిబంధన పరిశుద్ధులు కూడా క్రీస్తు రక్తము క్రిందకు వచ్చేసారు అని నేను అంటున్నాను కదా! ఎలాగో చెబుతాను! ఇది మీకు అర్ధం కావాలంటే అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో కొన్ని డెఫినిషన్లు తెలియాలి. నేను ఇంటర్నేషనల్ మారిటైమ్ లా చదువుకున్నాను కాబట్టి కేవలం నాలుగు డెఫినిషన్లు చెబుతాను! ఇందులో నేను నా జ్ఞానమును చెప్పడానికి ఇలా చేస్తున్నాను అనుకోవద్దు! నేను మరో కోణంలో మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే!

 

మొదటిది: ట్రీటీ:  అనగా రెండు లేదా మూడు దేశాల మధ్య ఒకే ప్రయోజనం ఆశించి ఇద్దరికీ మేలు కలిగేలా చేసుకునే అంతర్జాతీయ ఒప్పందం! దీనిని ట్రీటీ అంటారు! అయితే ఈ ఒప్పందం కేవలం మాటలతో సరిపోదు! దీనికి చట్టబద్దత కల్పించాలి. అనగా పార్లమెంటులో చట్టంచేసి ఆమోదించాలి! అప్పుడే ట్రీటీ అధికారంలోకి వస్తుంది.

 

రెండవది: కన్వెన్షన్: ట్రీటీ చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. మేము కూడా దీనిలో బాగస్తులమవుతాము అని ప్రపంచంలో అనేక దేశాలు వీరితో కలిసి అగ్రిమెంట్ చేసుకుంటే దానిని కన్వెన్షన్ అంటారు! మిగిలిన దేశాలలోను దీనికి చట్టబద్ధత కల్పించాలి మరియు కనీసం 60% దేశాలు ఆమోదించి చట్టబద్దత చేయాలి. అప్పుడే కన్వెన్షణ్ అధికారం లోకి వస్తుంది.

 

మూడు: అమెండమెంట్: కన్వెన్షన్ లో ఏదైనా పేరా గాని రెండు మూడు లైన్లు గాని రెండు మూడు పదాలు గాని లేక అర్ధము గాని మారిస్తే దానిని అమెండ్మెంట్ అంటారు!

 

నాలగవది: ప్రోటోకాల్ : కన్వెన్షన్ చాలా పాతది అయిపోయినా- దాని విధివిధానాలు చాలా పాతవి అయిపోయినా, లేక దానివలన కావాలనుకున్న ఉద్దేశం- ప్రయోజనం నెరవేరక పోయినా కన్వెన్షన్ యొక్క ఉద్దేశము మరియు ప్రయోజనం మారకుండా మొత్తం కన్వెన్షన్ ని మార్చితిరిగి వ్రాయడం అనేది ప్రోటోకాల్ అంటారు! దీనిలో ఉద్దేశం మరియు ప్రయోజనం మారదు గాని మొత్తం కన్వెన్షన్ దాని టెక్నికాలిటీస్ విధివిధానాలు మొత్తం మారిపోతాయి!

 

అయిపోయింది నా లా సబ్జెక్ట్!

 

దేవుడు- మానవునితో సహవాసం చెయ్యాలని దేవుడు కోరుకున్నారు! గాని మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు! దేవుడు ప్రవక్తలను పంపించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకున్నారు! ఇది ట్రీటీ!

 

దానిని బలపరచడానికి ధర్మశాస్త్రము ఇచ్చి- ఆహారోను యాజకత్వములో బలులు అర్పణలు ద్వారా నీతిమంతులుగాను పరిశుద్దులుగాను మారి పరలోకం చేరాలి. ఇదీ కన్వెన్షన్!

 

అయితే ఈ ధర్మశాస్త్రము- మరియు ఆహారోను యాజకధర్మము అనే కన్వెన్షన్ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అని మనము హెబ్రీపత్రిక ప్రకారం చూడవచ్చు! ఇక దేవుడు ఆలోచించి దానివలన ప్రయోజనం లేదు అని- కన్వెన్షన్ మొత్తం మార్చేసి- యేసుక్రీస్తుప్రభులవారి ద్వారా మెల్కీసెదెకు యాజకక్రమము తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు- నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు చేరలేడుఇదీ ప్రోటోకాల్! పాతనిబంధన పరిశుద్దుడైనా క్రొత్త నిబంధన పరిశుద్దుడైనా ఎవరైనా సరే ఈ క్రీస్తుయేసు యేసు రక్తములో కడుగబడి పరిశుద్దుడిగా మార్చబడి పరలోకం చేరాలి అనే ప్రోటోకాల్ ద్వారానే పరలోకం వెళ్తారు!

 

ఇంతవరకు బాగుంది! క్రొత్త నిబంధన వ్యక్తులకు, ప్రస్తుతము ఉన్న వారికి పర్వాలేదు! మరియు పాత నిబంధన భక్తుల సంగతి ఏమిటి? వారు చనిపోయారు. పరదైసులో ఉన్నారు. మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?? మరి దేవుడు చేసిన రూల్ ని దేవుడే వ్యతిరేఖించి చేయలేరు కదా! మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?

 

రండి ఎఫెసీ 4:8 లో చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులు అనుగ్రహించెను అంటున్నారు.

రెండవది: 1పేతురు 3:20 లో అవిధేయులైన ఆత్మలయొద్దకు వెళ్లి, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను అంటున్నారు. తర్వాత ఆయన ఆ తర్వాత పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని కుడిపార్శవమున కూర్చుండెను అంటున్నారు.

 

ఈ రెండు వచనాలు కలిపి చదువుకుంటే- చెరను చెరగా పట్టుకుపోవడం అనగా మన అందరికీ తెలుసు చెర అనగా పరదైసు! ఎక్కడికి పట్టుకుని పోయారు అంటే సాతాను ఆధ్వర్యంలో భూమిక్రిందన గల పరదైసుని యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయిన వెంటనే ఆ రెండు రోజులలో సాతానుని మరణమును జయించి పరదైసుని మూడవ ఆకాశం లోనికి తీసుకుని పోయారు. పరదైసు యొక్క అడ్రస్ మారిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఈ వచనాలు ప్రకారం చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మస్వరూపి గానే వారికి ప్రకటించెను అనగా ఆత్మస్వరూపిగా పరదైసుకి వెళ్లి  పాత నిబంధన భక్తులకు సువార్త ప్రకటించి ప్రోటోకాల్ క్రిందకు తీసుకుని వచ్చారు అని నాకు అర్ధమవుతుంది. కాబట్టి వెంటనే వారు నమ్మారు! అంగీకరించారు! వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు పరదైసుని మూడో ఆకాశములోనికి తీసుకుని వచ్చారు! కాబట్టి ఇప్పుడు పాత నిబంధన భక్తులు కూడా క్రీస్తు రక్తములోనికి వచ్చారు కదా! వారుకూడా యేసుక్రీస్తు ద్వారానే పరలోకం అనే ప్రోటోకాల్ క్రిందకు వచ్చారు! మరి అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారి లెక్కలోకి వస్తారు కదా! మరి బాప్తిస్మం పొందలేదు అంటారేమో- అదే 1పేతురు ౩:20 మరియు 1కొరింథీ 10:2. ప్రకారం వారు కూడా బాప్తిస్మం పొందారు. మన దృష్టిలో మన లెక్కలో కాకుండా అది దేవుని దృష్టిలో వారుకూడా బాప్తిస్మం క్రిందకు వచ్చేశారు అని నా ఉద్దేశం!

 

సరే, వారు అనగా పాత నిబంధన భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు గనుక జయించే అనుభవం లేరు అంటారు:

నేను వారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు అంటాను!

ఒకసారి యూదా పత్రిక 1:14  లో ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనోకు ఇలాగు ప్రవచించెను అంటున్నారు...

గమనించాలి: ప్రవచించెను అనగా ఆత్మపూర్ణులు అయితేనే ప్రవచనాలు చెబుతారు గాని మామూలుగా చెప్పలేరు కదా! పేతురు పత్రికలో వ్రాయబడింది .. లేఖనం మనుష్యుల ఊహల బట్టి కాక మనుష్యులు ఆత్మపూర్ణులై చెప్పారు అంటున్నారు....

2పేతురు 1: 20

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

2పేతురు 1: 21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

 

మరి దీని ప్రకారం వారు ఆత్మను పొందుకుని ఆత్మపూర్ణత కలిగిన వారే కదా!

అబ్రాహాము గారి గురుంచి దేవుడే ఆయన ప్రవక్త అని చెప్పారు! ఆదికాండము 20:7 లో! అయ్యా ఆత్మను పొందకుండా దేవునితో మాట్లాడే అనుభవం మరియు ప్రవచించు అనుభవం ఉంటుందా???

మోషే గారు ఆత్మను పొందుకోలేదా? యెహోషువా గారు ఆత్మను పొందుకోలేదా?

సంసోను గారు అంతమందిని ఒక్కచేతితో చంపగలిగారు అంటే అది మానవ బలము కానేకాదు, ఆత్మబలమే కదా

ఇక సమూయేలు గారు, దావీదు గారు వీరంతా ఆత్మపూర్ణులు కాదా?

ఏలియా గారు ఎలీషా గారు, యెషయా గారు, యిర్మియా గారు యేహెజ్కేలు గారు ఇలాంటి ప్రవక్తలంతా ఆత్మపూర్ణత లేకుండా ఇన్ని ఘనమైన కార్యాలు ఎలా చేశారు? అన్ని గ్రంధాలు ఎలా వ్రాసారు సార్! కాబట్టి పాత నిబంధన పరిశుద్ధులు అందరూ ఆత్మను పొందుకున్న వారే అని నా ఉద్దేశము! అయితే పాత నిబంధన కాలంలో మనలాగా పరిశుద్దాత్ముడు ఇప్పటి వలే భూలోకంలో మనతో ఉన్నట్లుగా భూమిమీద నివాసం చేయలేదు! వచ్చి వెళ్ళిపోతూ వారితో మాట్లాడి వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే మనతో నివాసం చేస్తున్నారు అంతే!

ఇంకా వారికి అనగా పాత నిబందన భక్తులకు నానాభాషలు, అన్యభాషలు లాంటివి లేకపోయి ఉంటాయి గాని వారికి ఆత్మ కలిగినప్పుడు మరో రూపంలో పొందుకునే వారేమో!

 

కాబట్టి పాత నిబంధన భక్తులు- క్రొత్త నిబంధన భక్తులు దేవుని దృష్టికి సమానమే! వారుకూడా దేవుని బూర ఊదినప్పుడు లేపబడతారు అనేది నా ఉద్దేశం! అయ్యా ఇది ఎవరిని విమర్శించాలని కాదు! కేవలం నా ఉద్దేశం మాత్రం రాస్తున్నాను!

 దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*106వ భాగము*

 

1కొరింథీ 15:2328.

23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.

24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.

26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే.

28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము! యేసుక్రీస్తుప్రభులవారు మరణించి తిరిగిలేచి అనేకులకు కనబడినట్లు చూసుకున్నాము! ఆదాము గారిని ఉదాహరణగా తీసుకుని మృతుల పునరుత్థానం ఎలా కలుగుతుందో ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

మనం గతభాగంలో క్రీస్తు వచ్చినప్పుడు తన వరుసలో బ్రతికించబడతాడు అంటూ వరుసలు కోసం ఆయన వారు కోసం ధ్యానం చేసుకున్నాము!

 

ఇక 24వ వచనంలో ఆ తర్వాత ఆయన సమస్తమును ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును అంటున్నారు!

మరలా ఈ వచనం తీసుకుని కొంతమంది మరోవిధంగా వాదిస్తున్నారు! ఏమని అంటే బహిరంగ రాకడ జరిగిన వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు మొత్తం రాజ్యం తండ్రియైన దేవునికి అప్పగించేస్తారు, వెయ్యేండ్ల పాలన అనేది తండ్రియైన దేవుని పాలనలోనే ఉంటుంది! ఇది తప్పుడు అభిప్రాయం!

 

ఇక్కడ  “ఆ తరువాత”  ఇలా అనువదించిన గ్రీకు పదానికి “వెంటనే” అనే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. “తరువాత కొంత కాలానికి” (ఎంత కాలమో సూచించకుండా) అనే అర్థం వస్తుంది!

 

బహిరంగ రాకడలో మొదటగా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యేసుక్రీస్తుప్రభులవారు యుద్ధం చెయ్యాలి- అదే హార్మెగిద్దోను యుద్ధం! ప్రకటన 19 ప్రకారం!...

అది జరిగాక వెయ్యేండ్ల పాలన ఉంది

అది జరిగాక మరలా మరో యుద్ధం ఉంది అది గోగుమాగోగు యుద్ధం ప్రకటన. 20వ అధ్యాయం ప్రకారం

అది జరిగాక ధవళ సింహాసనం తీర్పు ఉంది! అది జరిగాకనే విశ్వాసులు పరిశుద్ధులు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిపైకి వెళ్తారు! ఈ భూమి ఆకాశం కాలిపోతుంది పేతురు పత్రిక ప్రకారం!! అప్పుడు అంతము వస్తుంది.

 

Revelation(ప్రకటన గ్రంథము) 20:2,3,4,5,7,8,9,10,11,12,13,14

2. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

3. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిముత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.

5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

7. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి (కొన్ని ప్రాచీన ప్రతులలో దేవుని యొద్దనుండి, అని కూర్చబడియున్నది) అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

 

ఇక్కడ అంతం” అనగా  25వ వచనం బట్టి చూస్తే క్రీస్తు పరిపాలన అంతం అని దీని అర్థం.  గాని లోకానికి అంతము అని కాదు అని గ్రహించాలి!  ఇప్పుడు క్రీస్తు పరలోకంలో ఉండి చేస్తున్న ప్రస్తుత పరిపాలనకు అంతం అని కొందరు పండితులు దీనికి అర్థం చెప్పారు. ఈ పరిపాలన అంటే అర్థం క్రీస్తు ఈ భూమిపై వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేయడం!

(ప్రకటన 20:1-6 చూడండి).

క్రీస్తు సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, సమస్త శక్తిని ఇంకా రద్దు చేయలేదన్నది స్పష్టమే. నిజానికి తన రెండో రాకడ వరకు ఆయన అలా చెయ్యరు. ప్రకటన 19:11-16 చూడండి.

Revelation(ప్రకటన గ్రంథము) 19:11,12,13,14,15,16,17,18,19

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

13. రక్తములో ముంచబడిన (కొన్ని ప్రాచీన ప్రతులలో- చిలకరించిన అని పాఠాంతరము) వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని.

18. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.

19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.

 

ఇప్పుడు ఈ యుగాంతం వరకు మనుషుల రాజ్యాలు, ప్రభుత్వాలు, అధికారాలు కొనసాగుతాయి. వెయ్యేళ్ళు పరిపాలనప్పుడు క్రీస్తు వారిని నాశనం చేస్తాడు. “ఆ తరువాత” తాను పరిపాలించిన రాజ్యాన్ని తండ్రి అయిన దేవుని హస్తగతం చేస్తాడు.

 

కాబట్టి బైబిల్ ని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలి తప్ప ఏదో కొన్ని వచనాలు చూసి నిర్ధారణకు రాకూడదు! లేఖనం లేఖనంతో సరిచూసుకుని అప్పుడు నిర్ధారణకు రావాలని మరోసారి గుర్తుకు చేస్తున్నాను!

 

ఇక 25వ వచనంలో తన శత్రువులను తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయవలెను అంటున్నారు, మరి ఇది ఏ పరిపాలనా??

“విరోధులందరినీ” అంటే మనుషుల్లో విరోధులందరూ, సైతాను, దురాత్మలు, దయ్యాలు, మరణం కూడా అని అర్థం. తన ప్రజలను బాధించేవారందరూ, దేవుని పరిపాలనను ఎదిరించే వారందరూ, ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించేవారందరూ అని అర్థం.

 

ఇక 26వ వచనంలో కడపటి నశింపజేయబడు శత్రువు మరణం! ఇక్కడ మరణాన్ని కూడా శత్రువు గానే పోల్చారు పౌలుగారు!        

 

“మరణం” కోసం చూసుకుంటే

2తిమోతికి 1: 10

క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

 

ప్రకటన 20:14;

మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

 

లూకా 20: 36

వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో- పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

 

ఇక 27వ వచనంలో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచెను. సమస్తమును లోపరచిన వాడు తప్ప మిగిలిన సమస్తమును క్రీస్తు పాదముల క్రింద పెట్టారు అంటున్నారు! అనగా తండ్రియైన దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభులవారి అధికారం క్రింద పెట్టారు, ఒక్క తండ్రియైన దేవుడు మాత్రం యేసుక్రీస్తుప్రభులవారి అధికారం క్రింద లేరు! యేసుక్రీస్తుప్రభులవారు కూడా తండ్రియైన దేవుని అధికారం క్రింద ఉన్నారు! అలాగని యేసుక్రీస్తుప్రభులవారు దేవుడు కాదు అని కాదు, ముగ్గురు దేవుళ్ళు అని కాదు! త్రిత్వములో ఐక్యమై యున్నారు యేసుక్రీస్తుప్రభులవారు! పరిపూర్ణతకు సాధికారత పూర్తికావాలి కనుక యేసుక్రీస్తుప్రభులవారు తండ్రియైన దేవునికి లోబడి ఉన్నారు!

 

Hebrews(హెబ్రీయులకు) 2:8,9

8. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని

9. దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు (మూలభాషలో- రుచిచూచునట్లు), దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము

 

ఈ సాధికారత ఎందుకో 28వ వచనంలో చెబుతున్నారు....

మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

 

ఈ 28  వచనం బాగా అర్థం కావాలంటే స్టడీ బైబిల్ లో ఇలా ఉంది:

 సమస్తమూ కుమారునికి వశమైన తరువాత దేవుడు సమస్తంలోనూ సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తన క్రింద సమస్తమూ ఉంచిన ఆయనకు వశమవుతాడు.

 

“వశమైన తరువాత”  అనగా దేవుడు కుమారునికి ఈ సృష్టి మొత్తం వశం చేస్తారు అన్నమాట:

యోహాను 14: 28

నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.

 

యోహాను 5:19-23

19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

20. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.

21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

 

 యేసుక్రీస్తు తనను తండ్రి అయిన దేవునికి వేరుగా ఎలా చెప్తున్నారో చూడండి. స్వభావం, లక్షణాలలో తండ్రి కుమారునికన్నా అధికుడే కాదు. ఎందుకంటే ఇద్దరూ ఈ విషయంలో సమాన భాగస్తులు. అయితే హోదాలోనూ, అధికారంలోనూ తండ్రి అధికుడు యోహాను 5:19-27; 12:49 చూడండి. చూపడం, ఇవ్వడం, పంపడం, ఆజ్ఞాపించడం తండ్రి బాధ్యత. చూడడం, పుచ్చుకోవడం, తండ్రికి విధేయుడై రావడం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం కుమారుని బాధ్యత.

 

ఇక సర్వములో సర్వమగు నిమిత్తం అని ఎందుకన్నారు అంటే సమస్తము ఆయన ద్వారా సృష్టించబడింది కాబట్టి ఆయన సర్వములో సర్వమై ఉండాలి!

రోమీయులకు 11: 36

ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

 

కాబట్టి ఒకరోజు క్రీస్తుయేసు ప్రభులవారు అధికారం చేపట్టబోతున్నారు! ఆయన మొదట మరణం నుండి విజయుడై లేచారు కాబట్టి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు కాబట్టి ఒకరోజు తిరిగి రాబోతున్నారు! అధికారం చేపట్టబోతున్నారు!

మరి ఆయన రాకడలో ఆయనతో ఉండటానికి నీవు సిద్దంగా ఉన్నావా?

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*107వ భాగము*

 

1కొరింథీ 15:2934.

29. ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?

30. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేల?

31. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు నేను దిన దినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.

32. మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.

33. మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

34. నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము! ఆదాము గారిని ఉదాహరణగా తీసుకుని మృతుల పునరుత్థానం ఎలా కలుగుతుందో ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

మృతులు పునరుత్థానులు అవుతారు అని చెబుతూ ఒకవేళ మృతులు పునరుత్థానులు అవ్వకపోతే యేసుక్రీస్తుప్రభులవారు కూడా చనిపోయి తిరిగి లేవలేదు అని చెబుతున్నారు!

 

ఇక 29వ వచనంలో అలాగయితే మీలో కొందరు చనిపోయిన వారికొరకు ఎందుకు బాప్తిస్మం పొందుచున్నారు? మృతులు లేపబడకపోతే వారు ఎందుకు బాప్తిస్మం పొందుకుంటున్నారు అంటున్నారు! గమనించాలి: అప్పట్లో దీని అర్థమేమిటో, దీన్ని ఎందుకు చేశారో ఇప్పుడు ఎవరికీ తెలియదు. బైబిల్లో మరెక్కడా దీన్ని గురించి ఒక్క మాట లేదు. పౌలుగారు కూడా  చనిపోయిన వారికోసం బాప్తిసం ఇవ్వలేదు.. ఈ ఆచారాన్ని తాను మెచ్చుకుంటున్నానని కూడా చెప్పలేదు. అయితే ఇది అప్పట్లో ఉండేది. మన భారతదేశంలో కూడా అపోస్తలిక్ ఫెల్లోషిప్ అనే సంస్త ఉండేది (NONAC) ఇలాంటిది ఏదో ఉండేది, మన ఆంద్రప్రదేశ్ లో కూడా, వీరు నా చిన్నప్పుడు మృతులకోసం బాప్తిస్మం ఇచ్చేవారు. అనగా ఎవరైనా క్రొత్తగా రక్షించబడితే వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఒకరోజు వారు తమ తండ్రి లేక తల్లి మరెవరైనా అన్యులుగా ఉండి చనిపోతే మరి వారు నరకం లోకి పోతారు కదా, మరి వారు ఎలా పరలోకం వెళ్తారు అంటే వీరు అనగా వారి పిల్లలు లేక భార్య వారి తరుపున మరొకసారి బాప్తిస్మం తీసేసుకొనేవారు- అదే మృతులకొరకైన బాప్తిస్మం! లేఖనాలు దీనికోసం ఏమీ చెప్పలేదు!యేసుక్రీస్తుప్రభులవారు గాని ఆయన శిష్యులు గాని దీనికోసం ఏమీ చెప్పలేదు! ఇంతకంటే నేనుకూడా ఏమీ చెప్పలేను గాని దీనికి బైబిల్ సపోర్ట్ లేదు అని చెప్పగలను! కొరింథీ లో కొందరు చేసేవారు అలాగా!!

 

సరే, ఇక  3032 లో ఒకవేళ మృతులు పునరుత్థానులు కాకపొతే మేము అనగా మొత్తం అపోస్తలులు అందరు గడియగడియకు ప్రాణభయంతో ఎందుకు ఉంటున్నాము, నేనైతే దినదినము చనిపోవుచున్నాను క్రీస్తుయేసు కోసం! ఇంకా ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో ఉన్నాను కదా ఈ ఎఫెసీలో ప్రతీరోజు నేను మృగములతో ఎందుకు పోరాడుచున్నాను? ఇప్పుడు మృతులు పునరుత్థానం లేదు కాబట్టి తినేసి త్రాగేసి ఎంజాయ్ చేద్దాం అంటున్నారు!

 

గమనించాలి: మరణం తరువాత మరో జీవితం లేక మంచి భవిష్యత్తు ఉంటుందన్న నిరీక్షణ ఏమీ లేకపోతే ఈ జీవితాన్ని ఎంత బాగా అనుభవిస్తే అంత మంచిది అనుకోవడంలో ఏదో అర్థం ఉండవచ్చు.  గాని మరణం తర్వాత జీవితం ఉంది అని, అది యుగయుగాలు ఉండేది అని తనకు తెలుసు! ఈ లోకంలో మనిషిగా మంటిదేహంలో/తో ఉండేది కేవలం 70 లేక 80 సంవత్సరాలు గాని అక్కడ అనగా పరలోకం గాని నరకం గాని సంవత్సరాలు కాదు యుగయుగాలు జీవించాలి! కాబట్టి  ఒకరోజు మరణం నుంచి సజీవంగా లేస్తామని పౌలుగారికి  నిశ్చయంగా తెలుసు, అందుకే ఈ సత్యం అందరికీ తెలియాలని సువార్త కోసం ప్రతిదినం అపాయాన్ని మరణాన్ని ఎదుర్కొనేందుకు అతడు సిద్ధమయ్యాడు.

1కోరింథీయులకు 16: 9

కార్యాను కూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది (మూలభాషలో- గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది) ; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

 

2 కొరింతు 11:23-27లో ఇదే సిలువసువార్త కోసం ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారో వాటి జాబితా ఉంది.

 

23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.

27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

28. ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది.

 

“ప్రతి రోజూ చావు నాకెదురౌతూ ఉంది” అంటే తనను హత మార్చగల హింసను అతడు ప్రతి రోజూ భరిస్తున్నారన్న మాట.  అలా లేకపోతే అందరిలాగానే తినేసి త్రాగేసి దొర్లేయవచ్చు! కానీ అలా కాదుకదా! మరణం తర్వాత ఉండే జీవితం అనేది ఉంది! దాని మీదనే క్రైస్తవ విశ్వాసం ఆధారపడి ఉంది! మరణం తర్వాత మరలా తిరిగి లేస్తామని, ప్రభువుని ఎదుర్కొని మహిమదేహాలతో ప్రభువుతో నిత్యమూ ఉంటామనే నిరీక్షణ ఉంది దానినే శుభప్రదమైన నిరీక్షణ అంటాము మనము! అదిలేకపోతే క్రైస్తవ విశ్వాస జీవితం వ్యర్ధం!!

 

ఇక 15:32లో  “క్రూర మృగాలతో” అంటున్నారు: పౌలుగారు    సాదృశ్య రూపకంగా ఇలా చెబుతున్నారు. నిజంగా పౌలుగారు క్రూర మృగాలతో పోరాడిన విషయం బైబిల్లో లేదు గాని ఎఫెసులో ఇతర ప్రమాదాలు కొన్నిటిని ఎదుర్కొన్నారు అపోస్తలుల కార్యములు 19 లో మనకు దేమేత్రి అనేకంసాలి వాడు చేసింది కనబడుతుంది..  ఇంకా 2 కొరింతు 1:8 చూడండి.

2కోరింథీయులకు 1: 8

సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన క్రుంగిపోతిమి.

 

 బహుశా క్రూర మృగాల్లాంటి దుర్మార్గులు తనను హింసిస్తున్న సంగతి గురించి చెప్తున్నారు.

 కీర్తన 22:12-13;

12. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి బాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.

13. చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

 

లూకా 13: 31

ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా

లూకా 13: 32

ఆయన వారిని చూచి మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణసిద్ధి పొందెదను.

 

అపొ కా 20:29

నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.

 

ఇక ౩౩వ వచనంలో మోసపోకుడి దుష్టసాంగత్యం మంచి నడవడిని చెరిపివేయును అంటున్నారు! హటాత్తుగా దీనికోసం ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే వీరు మృతుల పునరుత్థానం లేదు అని కొందరంటున్నారు కదా, అది వారి యొక్క సొంత ఉద్దేశం కాదు, కొంతమంది దుష్టులు సువార్తకు వ్యతిరేకులు అలా బోధిస్తున్నారు, వారితో వీరు సహవాసం చేసి వారే వీరై కొన్ని విషయాలలో మన క్రైస్తవ నిరీక్షణను కూడా హేళన చేసేటంతగా మారారు! అందుకే దుష్టసాంగత్యం మంచి ప్రవర్తన కలిగిన వారిని కూడా పాడుచేస్తుంది అంటున్నారు! స్నేహితులుగా ఉండతగని వారితో విశ్వాసులు స్నేహం చేయడంలో గొప్ప అపాయం ఉంది. ఈ వచనంలో “చెడు సహవాసం” అంటే చనిపోయినవారు సజీవంగా తిరిగి లేస్తారన్న సత్యాన్ని కాదనేవారు.

అందుకే సామెతల గ్రంధంలో ఇలాంటి వారికి దూరంగా ఉండమంటున్నారు....

 

సామెతలు 4: 14

భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.

 

సామెతలు 13: 20

జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.

సామెతలు 24: 1

దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము

సామెతలు 28: 7

ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.

 

కీర్తనలు 1: 1

దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

 

అందుకే 34వ వచనంలో అంటున్నారు నీతిప్రవర్తన గలవారై ఇప్పుడైనా మేల్కొని పాపం చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలగడానికి ఇలా చెబుతున్నాను. అలాంటివారితో స్నేహం చేయవద్దు అంటున్నారు!  తప్పుడు ఉపదేశం తప్పుడు జీవిత విధానానికీ పాపానికీ దారి తీస్తుంది. చనిపోయినవారు సజీవంగా లేవడమనే సత్యాన్ని నిరాకరించడం కొరింథీ క్రైస్తవులలో ఈ ఫలితాన్ని కలిగించింది.

 

కాబట్టి మనము కూడా ఇలాంటి అబద్ద బోధకులకు అబద్ద భోధలకు దూరంగా ఉందాం! వారికి శుభము అని చెప్పువాడు వారితో పాలివారై ఉంటారని బైబిల్ చెబుతుంది!

2 John(రెండవ యోహాను) 1:10,11

10. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.

11. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.

 

 కాబట్టి నీతిప్రవర్తన కలిగి జ్ఞానముగా నడుచుకుందాం!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*108వ భాగము*

 

1కొరింథీ 15:3544

35. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.

36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.

37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.

38. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.

39. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.

40. మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు.

41. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టియొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదము కలదు గదా

42. మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

44. ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకుజవాబు ధ్యానం చేసుకుంటున్నాము! ఆదాము గారిని ఉదాహరణగా తీసుకుని మృతుల పునరుత్థానం ఎలా కలుగుతుందో ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ప్రియులారా! ఇక 3550 వచనాలలో మృతులు ఎలాంటి దేహాలతో లేస్తారు అనే ప్రశ్నకు జవాబు చెబుతున్నారు! కొందరు క్రైస్తవులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పౌలుగారు ఇక్కడ జవాబిస్తున్నారు. వారు అపనమ్మకంలో, బహుశా సజీవంగా లేవడమనే సత్యాన్ని హేళన చేస్తూ కూడా ఈ ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే పౌలుగారు  అలా అడిగినవాణ్ణి “తెలివితక్కువ వాడా”  లేక ఫూల్ అంటున్నారు గదా (వ 36). మానవ దేహం విత్తనం వంటిది (విశ్వాసుల దేహాల గురించి మాత్రమే పౌలుగారు  ఇక్కడ మాట్లాడుతున్నది). అది చనిపోయిన తరువాత ఇప్పుడు కనిపిస్తున్నదానికి పూర్తి భిన్నమైనదిగా మార్పు చెందుతుంది. వివిధ రకాలైన దేహాలు, వివిధ రకాలైన మహిమలు ఉన్నాయి. దేవుడు ఈ భౌతికమైనవాటిని తీసుకుని తన ఇష్టం వచ్చిన రీతిలో మార్చగలడు. విశ్వాసుల దేహాల విషయంలో కూడా అలా చేయగలడు, చేస్తాడు కూడా. ఇదీ ఈ వచనాల యొక్క భావం!!!

చూద్దాం!

 

 అయితే మృతులేలాగు లేస్తారు? లేస్తే వారెట్టి దేహముతో వస్తారు అని ఒకడు అడుగుచున్నాడు! ఓ అవివేకి అనగా ఒరేయ్ ఫూల్! నీవు విత్తేది చస్తేనే కదా అది బ్రతికించబడుతుంది. అనగా నీవు విత్తిన విత్తనం మొదట చనిపోయి ఆ తర్వాత మొలకెత్తుతుంది కదా, అలాగే మనిషి చనిపోయిన తర్వాత మరోసారి లేస్తాడు! ఇదీ దీని భావం!

 

ఇక నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ గాని మరి ఏ గింజ అయినా నీవు కేవలం వట్టి గింజనే విత్తుతున్నావు గాని దాని తర్వాత పుట్టబోయే శరీరమును విత్తడం లేదు, అయితే దేవుడే తన చిత్తప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇస్తున్నారు!

అలాగే మంటి దేహమై చనిపోయిన ఆత్మకు లేక శరీరానికి తరువాత ఆయన మహిమ దేహముగా  లేపుతున్నారు.

అంతేకాకుండా ఒక విత్తనానికి ఒక రకమైన శరీరం, మరో విత్తనానికి మరో రకమైన శరీరం లేక ఆకులుబెరడులు వస్తున్నాయి, అన్నీ ఒకేలాగా లేవు! ఇంకా చెప్పాలంటే మనుష్య మాంసం వేరు, మృగాల యొక్క మాంసం వేరుగా ఉంటుంది, ఇంకా పక్షి యొక్క మాంసం వేరు, చేప యొక్క మాంసం వేరుగా ఉంటుంది. అలాగే స్పేస్ అనగా అంతరిక్షంలో ఉన్న వాటి యొక్క రూపాలు వేరువేరుగా ఉన్నాయి. అలాగే భూమి మీద ఉన్న వాటి రూపాలు వేరుగా ఉంటాయి! ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న వాటియొక్క మహిమ వేరుగా ఉంటుంది, భూమిమీద ఉన్న వాటియొక్క మహిమ లేక వైభవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మరలా అంతరిక్షంలో ఉన్నవాటిని చూసుకుంటే  సూర్యుని మహిమ లేక వైభవం వేరు, చంద్రుని మహిమ వేరుగా ఉంటుంది. ఇంకా నక్షత్రం నక్షత్రానికి మహిమలు లేక వైభవం వేరువేరుగా ఉంటాయి! అలాగే మనిషి కూడా మృతుల నుండి పునరుత్థానుడై మహిమ శరీరం పొందుకుంటాడు అంటున్నారు! మనిషి కూడా ఒక విత్తనం ఎలా మొక్కలా పరివర్తనం చెందుతుందో అలాగే మనిషి మొదట ఈ లోకంలో కొన్ని రోజులు జీవించి ఒకరోజు చనిపోతాడు, ఒకరోజు దేవుని పిలుపు మేరకు బూర ఊదిన వెంటనే మహిమ దేహాలతో లేస్తారు అంటున్నారు!

 

మనిషి శరీరం క్షయమైనది అనగా నాశనం అయిపోయేది, అయితే క్షయమైనదిగా విత్తబడి- అనగా బ్రతికి- చనిపోయి- ఆ తర్వాత అక్షయమైనదిగా లేపబడుతుంది! ఘనహీన మైనదిగా విత్తబడి- అనగా బ్రతికి- చనిపోయి- ఆ తర్వాత మహిమ గలదిగా లేపబడుతుంది! బలహీనమైనదిగా విత్తబడి- అనగా బ్రతికి- చనిపోయి- ఆ తర్వాత బలమైనదిగా లేపబడును అంటున్నారు! ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి- అనగా బ్రతికి- చనిపోయి- ఆ తర్వాత ఆత్మసంబంధమైన శరీరంగా లేపబడతారు!!

 

 కొందరికి అనుమానం రావచ్చు మహిమ గల దేహాలు ఉంటాయా? అంటే ఉంటాయి అని చెబుతున్నారు- ఎలాగంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మసంబంధమైన శరీరం కూడా ఉంది, దేవుడున్నాడు అలాగే సైతాను గాడు కూడా ఉన్నాడు, స్వర్గం ఉంది అలాగే నరకం ఉంది! మంచి భూమిమీద ఎలా ఉందో చెడు కూడా ఉంది! అలాగే మహిమదేహాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు!

 

ఇప్పుడు విశ్వాసులు మరణం నుంచి లేచిన తరువాత విశ్వాసులకు మహిమ ప్రభావంతో కూడిన శరీరాలుంటాయి. అవి మరెన్నటికీ చావవు. అవి ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా సరిపోయినవై ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రీస్తు సజీవంగా లేచినప్పుడు ఆయనకున్న దేహంలాగా అవి ఉంటాయి (వ 49; ఫిలిప్పీ 3:21;

సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.

 

రోమీయులకు 8: 29

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

 

1యోహాను 3: 2

ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

 

యోహాను 20:19, 26

19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

26. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.

 

వారు మహిమ దేహాలుగా ఉంటారు కాబట్టే వారు మేఘాలమీద ప్రభువును ఎదుర్కొనడానికి వెళ్ళిపోతారు!..

1థెస్సలొనికయులకు 4: 17

ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

వారు మహిమ దేహాలు కాబట్టే ప్రకటన 7 మరియు 21వ అధ్యాయాల ప్రకారం వారికి ఆకలిగాని రోగము గాని దాహము గాని ఉండదు! కన్నీరు దుఃఖము ఉండవు! వారిలో ప్రతీ ఒక్కరి బాష్పభిందువును ప్రభువు తుడుచివేస్తారు!! ఇదీ శుభప్రదమైన నిరీక్షణ . ఈ నిరీక్షణ లేని క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ జీవితం వ్యర్ధమే!

 

Revelation(ప్రకటన గ్రంథము) 7:16,17

16. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,

17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

 

Revelation(ప్రకటన గ్రంథము) 21:4,23

4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.

23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.

 

ఇక 45వ వచనంలో ఇందు నిమిత్తమే ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణిఆయెను అని వ్రాయబడి ఉంది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయెను అంటున్నారు! ఈ తేడా దయచేసి గ్రహించాలి!

ఆదామనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయితే ఈ కడపటి ఆదాము అనే యేసుక్రీస్తుప్రభులవారు జీవింపజేయు ఆత్మ ఆయెను! ప్రాణి- ఆత్మ అయ్యింది నిత్యత్వములో! మరణం అనంతరం!

ఆది 2:7.

ఆదికాండము 2: 7

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

 

చివరి ఆదాము అంటే కొత్త రకం మనుషులకు నాయకుడు, ప్రతినిధి, పుట్టించేవాడు అయిన క్రీస్తు. ఆదాముకు జీవం ఉంది. క్రీస్తు జీవాన్ని ఇస్తారు

యోహాను 5:21-30;

21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

24. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.

27. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.

28. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

29. మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

30. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.

 

11:25-26;

25. అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

26. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

 

యోహాను 14: 6

యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

 

“జీవింపజేయు ఆత్మ” అంటే క్రీస్తుకు నిజమైన శరీరం లేదని కాదు

Hebrews(హెబ్రీయులకు) 2:14,15

 

14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని (అనగా- సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,

15. జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

 ఆయన మనిషిగా కాకముందు ఆత్మరూపి.

 

ఇక 46వ వచనం నుండి ప్రకృతి సంబంధమైనదే మొదట పుట్టి ఆత్మ సంబంధమైనది తర్వాత కలిగింది అంటునారు! 4649...

 

46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది.

47. మొదటి మనుష్యుడు భూసంబంధియై మట్టినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

48. మట్టినుండి పుట్టినవాడెట్టివాడో మట్టినుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధియెట్టివాడో పరలోక సంబంధులును అట్టి వారే.

49. మరియు మనము మట్టినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము.

 

ఆత్మ సంబంధమైనది మొదట కలిగింది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది,ఆ తర్వాతనే ఆత్మ సంబంధమైనది కలిగింది! మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటి నుండి పుట్టాడు, మొదటి మనుష్యుడు అనగా ఆదాము గారు మంటి నుండి పుట్టారు, అదే పరలోక సంబంధియైన వాడు అనగా యేసుక్రీస్తుప్రభులవారు పరలోకం నుండి వచ్చినవాడు! మంటినుండి పుట్టినవాడు ఎలాటివాడో మంటినుండి పుట్టినవారు కూడా అట్టివారే! అలాగే పరలోక సంబంధి అనగా యేసుక్రీస్తు ప్రభులవారు ఎలాగో పరలోక సంబంధులు అనగా విశ్వాసులు కూడా అట్టివారే అంటున్నారు!

 

ఇంకా మరియు మనము మంటినుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబందియైన వాని పోలిక కూడా ధరిస్తాము అంటున్నారు!

 

ఆదికాండము 2: 7

దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

ఆదికాండము 3: 19

నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

 

లూకా 2: 11

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము)

 

యోహాను 1: 14

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని ( లేక, జనితైక కుమారుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి

 

యోహాను 3: 13

మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు (అనేక ప్రాచీన ప్రతులలో పరలోకములలో నుండు అను మాట విడిచిపెట్టబడియునది) మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

 

యోహాను 6: 51

పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

 

ఫిలిప్పీ 2:6-7.

6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని,

10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

 

మనుషులు ఆదాము నుంచి పొందినది చనిపోయి మట్టిలో కలిసిపోయే శరీరాలు, పరలోక సంబంధులు క్రీస్తునుంచి అంతకన్నా శ్రేష్ఠమైనదాన్ని పొందుతారు. క్రీస్తు విశ్వాసులు “పరలోక సంబంధులు” వారి జీవం అక్కడ ఉంది

Ephesians(ఎఫెసీయులకు) 2:6,7

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము,

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.

 

Colossians(కొలొస్సయులకు) 3:1,2,3,4

1. మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.

2. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

3. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.

4. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

 

 వారి నిరీక్షణ అక్కడ ఉంది, వారి నాయకుడు అక్కడ ఉన్నాడు, వారి భవిష్యత్తు, వారి నివాసం, వారి పౌరసత్వం (ఫిలిప్పీ 3:20) అన్నీ అక్కడే ఉన్నాయి. వారికి ఆ ప్రదేశంతో సన్నిహిత సంబంధం ఉంది.

ఫిలిప్పీయులకు 3: 20

మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.

 

47-49 వచనాల్లో క్రీస్తును పరలోకంనుండి వచ్చినవాడని మూడు సార్లు అనడం గమనించండి. అంటే భూమికి రాకముందు ఆయన  పరలోకంలో ఉన్నాడు  పరలోక సంబంధి అని అర్థం!.

 

కాబట్టి ఈ రకంగా మనం ఒకరోజు ఈ మంటి దేహమును వదిలి మహిమ దేహము కలిగి క్రీస్తుయేసు ప్రభులవారిని ఎదుర్కోడానికి మేఘముల మీద ఎత్తబడి మధ్యాకాశములో చేరబోతున్నాము! మనకున్న సమస్త కష్ట నష్టాలు రోగాలు వ్యాధులు అన్నింటినీ మరచి యుగయుగాలు దేవునితో ఆనందించ బోతున్నాము!

మరి నీకు ఇలాంటి నిరీక్షణ ఉందా ప్రియ చదువరీ!

ఎత్తబడే జీవితం, దానికి తగినట్లు జీవితం ఉందా?

వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన పరిశుద్ధ జీవితం, సాక్షార్ధమైన జీవితం కలిగి ఉన్నావా?

నీఘటమును ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకుంటున్నావా?

అలాగయితే ఎత్తబడతావు! లేకపోతే విడువబడతావు! అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయని మర్చిపోవద్దు!

 

నేడే సరిచూసుకుని సరిచేసుకోని యోగ్యమైన జీవితం కలిగి ఉండమని ప్రభువు పేరిట మనవిచేస్తున్నాను!

దైవాశీస్సులు!

 

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*109వ భాగము*

 

1కొరింథీ 15:5058.

50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

55. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం 15వ అధ్యాయం నుండి మృతుల పునరుత్థానం కోసం అడిగిన ప్రశ్నకు జవాబు ధ్యానం చేసుకుంటున్నాము! ఆదాము గారిని ఉదాహరణగా తీసుకుని మృతుల పునరుత్థానం ఎలా కలుగుతుందో ధ్యానం చేసుకుంటున్నాము!

 

        (గతభాగం తరువాయి)

 

ఇక 50వ వచనం నుండి మన అందరి నిరీక్షణ కోసం రాస్తున్నారు! సహోదరులారా నేను చెప్పేది ఏమిటంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అనగా రక్తమాంసములు ఉన్న ఈ మట్టి దేహము లేక భౌతిక దేహము లేక ప్రకృతిసంబంధమైన ఈ శరీరము దేవుని రాజ్యములో ప్రేవేశించదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను స్వతంత్రించుకోదు గాని ఇదిగో మీకొక మర్మమును చెబుతున్నాను అంటూ దేవుడు తనకు తెలియజేసిన మర్మమును చెబుతున్నారు! గమనించాలి- కొరింథీ రెండో పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఇలాంటి ప్రత్యక్షతలు మర్మాలు పౌలుగారికి ఎన్నో దేవుడు తెలియజేశారు! బహుశా ౩ సంవత్సరాలు అరేబియా దేశంలో ప్రార్ధనలో కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరచి ఉంటారు! అదే ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు!

 

మనమందరమూ నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటులో కడబూర మ్రోగగానే మనమందరమూ మార్పు పొందుతాము, బూర మ్రోగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము అనగా బ్రతికి ఉన్న మనము కూడా మార్పు పొందుతాము! క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యత ధరించుకోవాలి! ఈ క్షయమైనది అక్షయమైనదానిని ధరించుకొనినప్పుడు ఇంకా మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము లేక లేఖనం నెరవేరుతుంది!

 

అప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమెక్కడ? అనగలము! అంటున్నారు!

ఇక్కడ చాలా విషయాలు పౌలుగారు చెబుతున్నారు!

 

మొదటిది: ఇప్పుడు విశ్వాసులు దేవుని రాజ్యంలో ఉన్నారు (కొలస్సయి 1:13). అయితే పౌలుగారు దానిలో భాగం వారసత్వంగా పొందడం గురించి రాస్తున్నారు.

రోమా 8:17-24

17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,

22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

 

ఎఫెసు 1:14;

దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

 

1 పేతురు 1:4

మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

 

ఈ మరణ శరీరాలతో ఆ వారసత్వంలో  భాగం పంచుకోలేము.

 

ఇక రెండవది: అందరమూ నిద్రించము అనగా దేవుని రాకడ సమయానికి విశ్వాసులు అందరూ మరణించరు, క్రీస్తు వచ్చేనాటికి కొందరు జీవించే ఉంటారు. అప్పుడు వారు రెప్పపాటులో మార్పు చెందుతారు.

1 థెస్స 4:13-18;

13. సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15. మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16. ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద (మేఘములయందు) కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.

 

యోహాను 14: 3

నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

 

ఇక మూడవది: కడబూర మ్రోగిన వెంటనే మృతులు మొదట లేపబడతారు తర్వాత విశ్వాసులు మార్పు పొందుతారు! అయితే ఈ విషయంలో చాలా అభిప్రాయాలున్నాయి! Pre-Tribulation , Mid- Tribulation , Post- tribulation  అంటూ! అనగా సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అని కొందరు, శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది అని కొందరు, శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అని కొందరు అంటారు! నేను శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అని నమ్ముతాను! అయితే ఇవన్నీ వారివారి యొక్క అభిప్రాయాలు మాత్రమే! ఎప్పుడు ఖచ్చితంగా ఎత్తబడుతుందో బైబిల్ లో స్పష్టముగా లేదు! ఎవరైనా ఇలాగే జరుగుతుంది అని బల్లగుద్ది చెప్పినవాడు అబద్ధికుడు అని గ్రహించాలి! అందుకే మీ అందరికీ నేను మాటిమాటికి చెప్పేది ఏమిటంటే యేసుక్రీస్తుప్రభులవారు ఎప్పుడైనా రానీయండి లేకపోతే ఇప్పుడే రానీయండి! మనం మాత్రం ఎత్తబడటానికి సిద్ధంగా ఉందాము! మనం సిద్ధంగా ఉన్నప్పుడు శ్రమలకు ముందు గాని, శ్రమలలో గాని, శ్రమల అనంతరం గాని ఎప్పుడు వచ్చినా మనము సిద్ధముగా ఉన్నాము కాబట్టి ఎత్తబడతాము కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఇప్పుడే ఆయన రాకడకు సిద్ధముగా ఉండమని మనవిచేస్తున్నాను!!

 

ఇక బూర కోసం తరువాత భాగంలో చూసుకుందాం!

బూర మ్రోగిన తర్వాత మృతులు అక్షయలుగా లేపబడతారు అంటున్నారు! మీదన వివరించిన థెస్సలోనికయలు పత్రికలో 4 వ అధ్యాయం లో కూడా పౌలుగారు దీనికోసం చెప్పారు...

 

క్షయమైన శరీరం అక్షయతను ధరించుకొంటుంది మృతులు లేచిన తర్వాత మనం కూడా లేస్తాము! అప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని రాసిన లేఖనం నెరవేరుతుంది అంటున్నారు!

ఈ లేఖనం యెషయా 25:8. లో ఉంది..

యెషయా 25: 8

మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.

 

అ తర్వాత ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమెక్కడ అనే వాక్యం హోషేయ 13:14. ఉంది.

హోషేయా 13: 14

అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.

 

ఈ ప్రవచనం అంత్య కాలంలో సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధులైన  మృతులు లేపబడినప్పుడు నెరవేరుతుంది,

 

ఇక తర్వాత మరణపు ముళ్ళు పాపము! పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అంటున్నారు! దీనికోసం రోమా పత్రికలో పౌలుగారు విస్తారంగా రాశారు!

మరణానికి స్వతహాగా విషపుకొండి లేక ముళ్ళు  లేదు. దాని ముళ్ళు  పాపమే  6:23).

రోమీయులకు 5: 13

ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.

రోమీయులకు 5: 20

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో,

 

రోమీయులకు 6: 23

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

 

పాపంలో చనిపోవడమంటే శాశ్వతంగా నశించిన స్థితిలో ఉండడమే. విశ్వాసుల పాపాన్ని తొలగించడం ద్వారా క్రీస్తు ఈ ముళ్ళు ని తీసేశారు. అందువల్ల వారికి మరణం అంటే క్రీస్తుతో జీవంలోకి దారితీసే ఒక తలుపు మాత్రమే

 

“ధర్మశాస్త్రం” అనగా మోషేగారి ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అది మనందరినీ నేరస్తులుగా నిలబెడుతుంది (రోమా 3:19-20), అతిక్రమించడానికి దోహదం చేస్తుంది (రోమా 4:15), మన భ్రష్ట స్వభావాలు దానిపై తిరగబడి మరింత పాపం చేసేలా చేస్తుంది (రోమా 7:5-11). ఈ విధంగా అది “పాపానికి బలం”.

Romans(రోమీయులకు) 7:5,6,7,8,9,10,11

5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములైయుండెను.

6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.

7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.

8. అయితే పాపము ఆజ్ఞనుహేతువు చేసికొని (లేక, ఆజ్ఞద్వారా) సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.

11. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని (లేక, ఆజ్ఞద్వారా) నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.

 

ఇక 57వ వచనంలో అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుసున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నారు ఎందుకంటే మరణపు ముళ్లును ఆయన విరిచారు కనుక! సిలువలో మరణమును జయించారు కాబట్టి! మూడవరోజున మరణము జయించి సాతానుని జయించి , మరణపు అధికారంలో ఉన్న పాత నిబంధన భక్తుల ఆత్మలను చెరనుండి చెరను చెరగా తీసుకుని మూడవ ఆకాశమైన పరదైసుకి  తీసుకుని పోయారు కనుక! అందుకే దేవునికి స్తోత్రము అంటున్నారు! హల్లెలూయ!!!

 

“విజయం” పాపంమీదా, మరణంమీదా, మనకు శాశ్వతమైన హాని కలిగించే వాటన్నిటిమీదా (రోమా 8:37; 2 కొరింథీ 2:14; 1 యోహాను 5:4).

రోమీయులకు 8: 37

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.

2కోరింథీయులకు 2: 14

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

 

విశ్వాసులపై మరణానికి, పాపానికి విజయం ఉండదు. ఎందుకంటే వాటిపై క్రీస్తు గెలిచారు. ఆ గెలుపును వారికి పంచి ఇచ్చారు. దీనంతటికీ రుజువు క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేవడమే!

 

ఇక చివరి వచనంలో అందువలన నా ప్రియ సహోదరులారా! మీ ప్రయాసం అనగా ఇంతవరకు ఈ సిలువసువార్త కోసం, మీకున్న నిరీక్షణ కోసం మీరు పడుతున్న ప్రయాసం ప్రభువునందు వ్యర్ధం కాదు అని గ్రహించి మీరు విశ్వాసంలో స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి అని ముగిస్తున్నారు!

 

“అందుచేత”అనగా  దేవుడు వెల్లడి చేసిన గొప్ప సత్యాలనూ మర్మాలను  సిద్ధాంతాలనూ నేర్పించారు పౌలుగారు. ఈ సత్యాలను మనుషులు తమ జీవితాల్లో పాటించి, వాటి మూలంగా మునుపటి కంటే మంచివారు కావాలనే పౌలుగారు ఎప్పుడూ కోరుతున్నారు. రోమా 12:1; 2 కొరింథీ 7:1; గలతీ 5:1; ఎఫెసు 4:1; కొలస్సయి 3:5 పోల్చి చూడండి.

 

అందుకే విశ్వాసంలో స్థిరంగా ఉండమని చెబుతున్నారు! 16:13; 2 కొరింథీ 1:24; గలతీ 5:1; ఎఫెసు 6:11, 13, 14; కీర్తన 15:5; 16:8.

 

1కోరింథీయులకు 16: 13

మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

గలతియులకు 5: 1

ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.

 

ఎందుకంటే మీ ప్రయాస వ్యర్థం కాదు” 

మన ప్రయాస వ్యర్థం కావడమంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయినా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికీ తన ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కానీ వ్యర్థం కాని పనులేమిటో గమనించండి

 

కాబట్టి దేవుని పనిలో దేవుని సేవలో నమ్మకముగా సాగిపోదాం!

మన విశ్వాసాన్ని దృఢమైంది గా చేసుకుని ఎటువంటి శ్రమలు శోధనలు వచ్చినా బండమీద కట్టిన ఇంటిలా విశ్వాసాన్ని కాపాడుకుందాం!

వాక్యానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన పరిశుద్ధ జీవితం, సాక్షార్ధమైన జీవితం కలిగి మన ఘటమును ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకుందాము!

 

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*110వ భాగము*

 

1కొరింథీ 15:5058.

50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

55. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?

56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! గతభాగంలో బూర కోసం చూసుకున్నాము గనుక ఈ బూరల కోసం కొంచెం వివరంగా చెబుదాము అని అనుకుంటున్నాను! గమనించాలి- ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! దీనితో ఏకీభవించాలి అని లేదు వాక్యనుసారంగా ఉంటే తీసుకోండి లేకపోతె వదిలేయ్యండి! దీనికోసం థెస్సలోనికయ పత్రికల ధ్యానలలోను ప్రత్యక్షతల గ్రంధ ధ్యానములలోను చెప్పడం జరిగింది. సందర్భం గనుక మరోసారి గుర్తుకు చేస్తున్నాను

 

        (గతభాగం తరువాయి)

 

ప్రకటన గ్రంథం 11: 15

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములుఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

 

1థెస్సలొనికయులకు 4: 16

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

 

1కోరింథీయులకు 15: 51

ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.

 

మత్తయి 24: 31

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

 

అయితే చాలామందికి దేవుని బూర- ఏడవ బూర- కడబూర ఒకటే అని అనుకుంటారు! అయితే మూడు ఒకటి కాదు! వేరువేరు అని చెప్పాలని అనుకుంటున్నాను.

*దేవునిబూర, కడబూర, ప్రకటన గ్రంధంలో గల ఏడవ బూర ఒకటి కాదు! దేవునిబూర కడబూర కాదు! దేవునిబూర ఏడవబూర కాదు! అలాగే ఏడవబూర కడబూర కాదు! ఈ మూడు బూరలు వేరు వేరు! ఆ బూరలు ఊదిన కాలాలు వేరు! ఊదిన ఉద్దేశాలు కూడా వేరు వేరు!* ముందుగా మనము ఈ బూరలు సంగతి అర్ధము చేసుకుంటే దేవుని రాకడను బాగా అర్ధము చేసుకోవచ్చు!

 

*దేవునిబూర*:

*ఇది ఎప్పుడు మ్రోగుతుంది* అంటే యేసుక్రీస్తుప్రభులవారి రహస్యరాకడ సమయంలో! 1థెస్స 4:16; మరియు మహాశ్రమల కాలమునకు ముందుగా!

 

*ఎందుకు మ్రోగుతుంది*?

మొదటగా ప్రభువునందు లేక క్రీస్తునందుండి మృతులైన వారిని లేపడానికి మరియు సజీవులమైన పరిశుద్దులను పిలవడానికి!

 

*ఎప్పుడు*?  

రహస్యరాకడ సమయంలో!

 

*ఎక్కడనుండి మ్రోగుతుంది లేక ఊదడం జరుగుతుంది?*

 మధ్యాకాశం నుండి!

 

*ఎవరు ఊదుతారు?*

 ప్రధాన దూతయైన మిఖాయేలు కావచ్చు!

 

*దేవునిబూర మ్రోగిన వెంటనే లేక ఊదిన వెంటనే ఏమి జరుగుతుంది?*

*పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు!

* క్రీస్తునందుండి మృతులైన పరిశుద్ధులు మొదట లేస్తారు!

*ఎక్కడనుండి లేస్తారు*? పరదైసునుండి!

 *లేవడం ఏమిటి*? ఎందుకంటే వారు ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్నారు కాబట్టి!

 

* ఆ తర్వాత సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు! అనగా సంఘం ఎత్తబడుతుంది!!!

ఈ అన్ని ప్రక్రియలు కనురెప్ప పాటులో జరిగిపోతాయి!

 

*ఇంకా ఏమి జరుగుతాయి*?

*క్రీస్తు విరోధి బయలు పరచబడతాడు!

* ప్రకటన 6వ అధ్యాయం ప్రకారం ఏడు ముద్రలు విప్పబడటం ప్రారంభమవుతాయి!

* పరిశుద్ధాత్ముడు, సంఘము ఎత్తబడ్డారు కాబట్టి వాక్యము భూమిమీద నుండి తీసివేయబడుతుంది!

* ప్రకటన 6ప్రకారం మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది!

*ప్రకటన 11 ప్రకారం ఇద్దరు సాక్షులు భూమిమీదకు వస్తారు!

* ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభమవుతుంది!

* చివరగా అనేకమైన బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు గ్రంధములో చెప్పబడిన 70 వారాలలో చివరిదైన  70వ వారం ప్రారంభమవుతుంది!

 

*బూర ముఖ్య ఉద్దేశం*: *సంఘము ఎత్తబడుట!!!*

 *పునరుత్థానం*: మృతులు, సజీవులు (పరిశుద్ధులు మాత్రమే)

 

 

*ఏడవబూర*:

*ఎప్పుడు మ్రోగుతుంది*?  

ప్రకటన గ్రంధం 11:15 ప్రకారం రెండు శ్రమలు గతించిన పిమ్మట! అనగా మహాశ్రమలకాలం అయ్యాక, దేవుని ఉగ్రతాకాలంలో!

 

అయితే కొందరు మహాశ్రమల కాలంలో సగం అయ్యాక అనగా మధ్యలో, మూడున్నర సంవత్సరాలు గడిచాక ఊదబడుతుంది అంటారు. గతంలో నేను థెస్సలోనికయలు పత్రికలు ధ్యానంలో ఇలాగే వ్రాయడం జరిగింది గాని దీనికోసం బాగా అధ్యయనం చేసాక, ప్రభువు పాదాల దగ్గర కనిపెట్టాక, నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఇది మహా శ్రమల తర్వాతనే ఉగ్రతా కాలం చివరిలో ఏడవ బూర ఊదటం జరుగుతుంది అయితే కడబూర- ఏడవ బూర ఒకటి కాదు! ఈ బూర ఉద్దేశం వేరు! కడబూర ఉద్దేశం వేరు!

 

*ఏడవ బూర ఎందుకు మ్రోగుతుంది*?

ఈ ఏడవ బూర ఉద్దేశం ఏమిటంటే చివరి శ్రమ వస్తుంది. రెండు శ్రమలు గడిచాయి! ఇక మూడవ శ్రమ గడిచిన వెంటనే ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యము కాబోతుంది. యేసుక్రీస్తుప్రభులవారు తన ప్రత్యక్షరాజ్యము ఇక్కడ స్తాపించబోతున్నారు అని చెప్పడానికే! అయితే కడబూర పరిశుద్ధులను పోగు చెయ్యడానికి ఊదుతారు! దానిని ఊదేవారు మరో దూతలు!

 

*ఎవరు ఊదుతారు*?

ఏడవ దూత! (ప్రకటన 11:15)

 

*ఏడవ దూత బూర ఊదిన తర్వాత ఏమి జరుతుంది?*

*చివరి ఉగ్రత మరియు చివరి పాత్ర కుమ్మరించబడతాయి. పెద్ద భూకంపం కలిగి మహా బబులోను మీద ఉగ్రత కలుగుతుంది. రోమ్ నగరం మూడు ముక్కలవుతుంది. ఇంకా అనేక పట్టణాలు ప్రపంచంలో కూలిపోతాయి! 5 మణుగులు అనగా 4045 కేజీల వడగండ్లు మనుష్యుల మీద పడతాయి! ద్వీపాలు పారిపోతాయి. కొండలు పారిపోతాయి!

 

*ముఖ్య ఉద్దేశం:  దేవుని ఉగ్రత భూమిపై క్రుమ్మరించబడుట!!!*

 *పునరుత్థానం: జరుగదు!*

 

*కడబూర:*

*ఎందుకు మ్రోగుతుంది:* మత్తయి 24:౩౦31 ప్రకారం , యెషయా 27:12,13; 11:1112 ప్రకారం భూమి నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచు కొనిన వారిని పోగుచేయుటకు!

 

ఏర్పరచుకొనిన వారు అనగామొదటగా ఇశ్రాయేలు ప్రజలను, ఇంకా మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు ఒకవేళ మిగిలి ఉంటే) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల ఆత్మలు  ప్రకటన 16:4 ప్రకారం తిరిగి లేపబడతారు వెయ్యేండ్ల పాలనకు ప్రారంభంలో! వారు కూడా ఇక్కడ పోగు చెయ్యబడతారు పునరుత్తానులై అని నా అభిప్రాయం! మరొక అభిప్రాయం చెబుతారు కొందరు వేదపండితులు- ఇశ్రాయేలు ప్రజలలో ముద్రించబడిన వారు మహాశ్రమల కాలంలో ఉంటారు గాని ఉగ్రతా కాలంలో దాచబడతారు, వారు ఎక్కడో దాచబడతారు, వారు ఈ బూర మ్రోగిన వెంటనే యెరూషలేముకు దేవదూతలతో ప్రోగు చేయబడతారు అంటారు! నాకైతే మహాశ్రమల కాలంలో దాచబడతారు, చివరికి ఈ బూర మ్రోగేసరికి ఇక్కడకు ప్రోగు చెయ్యబడతారు అని నా ఉద్దేశం!

 

*ఎప్పుడు మ్రోగుతుంది*: యేసుక్రీస్తుప్రభులవారి బహిరంగ రాకడ సమయంలో! ఆ సమయానికి యేసుక్రీస్తుప్రభులవారు భూమిపైన ఒలీవల కొండపైన కాలుపెట్టారు తనప్రజల పక్ష్యంగా హార్మెగిద్దోను యుద్ధంలో శత్రువులను సంహరించడానికి!  కాబట్టి పరిశుద్ధులు ఎదుర్కోడానికి వెళ్ళరు, కేవలం పోగుచెయ్యడమే లక్ష్యం!

 

*ఎప్పుడు జరుగబోతుంది*?

మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత, హార్మెగిద్దోను యుద్ధము కోసం సర్వదేశాల ప్రజలు ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టినప్పుడు!

 

*ఎవరు ఊదుతారు?*

 ఒకదూత కావచ్చు లేక నలుగురు దేవదూతలు భూమి నాలుగు దిక్కులనుండి ఒకేసారి ఊదవచ్చు!

 

*ముఖ్య ఉద్దేశం: యేసుక్రీస్తుప్రభులవారి రెండవరాకడ సందర్భంగా తన భక్తులను నలుదిక్కులనుండి పోగుచెయ్యడానికి!*

 

*పునరుత్థానం: మృతుల పునరుత్థానం జరుగుతుంది (మహాశ్రమల కాలంలో హతస్సాక్షులు కాకుండా ఇంకా మిగిలిన పరిశుద్ధులు (అన్యజనుల నుండి రక్షించబడిన విడువబడిన పరిశుద్దులు ఒకవేళ ఉంటే) , మహాశ్రమల కాలంలో మరణించిన పరిశుద్దుల పునరుత్థానం, ఇంకా ఇశ్రాయేలు ప్రజల శాశ్వత విడుదల!)

 

(పైన చెప్పినది నా అభిప్రాయం మాత్రమే! అలాగైనా జరగవచ్చు, లేదా కొంతమంది భావించినట్లు కడబూర మ్రోగిన తర్వాత పాతనిబంధన భక్తులు అనగా ఆదాము నుండి యేసయ్య సిలువమరణం వరకు గల భక్తులు అక్షయులై లేపబడవచ్చు! ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము కారణం అది తండ్రి చిత్తము! కొన్ని విషయాలు మరుగుగా ఉండాలని దేవుడు నిర్ణయించారు కాబట్టి ఇంతకంటే లోతుగా వెళ్ళవద్దు! అయితే మనం మాత్రం సిద్ధంగా ఉందాము!)

 

*కడబూర మోగిన తర్వాత ఏమి జరుగబోతుంది?*

*మృతులు అక్షయులుగా లేపబడతారు, (1కొరింథీ 15:52,53)

*హార్మెగిద్దోను యుద్ధంలో శత్రుసైన్యాలు సంహరించబడి వారి రక్తం సుమారు 321 కి.మీ వరకు ప్రవహిస్తుంది!

*క్రూరమృగము అబద్ద ప్రవక్త ప్రాణములతో అగ్ని గుండములో వేయబడతారు (ప్రకటన 19:2021)

*ఆది సర్పము మరియు అపవాది అనే సాతాను అగాధములో బంధించడం జరుగుతుంది! (ప్రకటన 20:13)

*క్రీస్తు న్యాయపీటపు తీర్పు –  బహుమానాల తీర్పు లేక ప్రతి పరిశుద్దునికి వాని క్రియల చొప్పున దేవుడిచ్చే ప్రతిఫలం లేక ఫలములు! 20:4

*వెయ్యేండ్ల పాలన ప్రారంభమవుతుంది , మొదటి పునరుత్థానం జరుగుతుంది (ప్రకటన 20:57)

 

కాబట్టి ప్రియ సహోదరీ సహోదరులారా! కడబూర దేవుని బూర ఏడవ బూర అన్నీ ఒకటే అనుకోవద్దు అని మనవిచేస్తున్నాను!

 

ఆయన రాకడ మరియు ఆయన ఉగ్రత అతి సమీపంలో ఉంది!

ప్రియ దైవజనమా! సిద్ధంగా ఉన్నారా?

మెలకువగా ఉన్నారా?

దివిటీలలో నూనెతో నింపబడి ఉన్నారా?

సిద్ధంగా ఉన్నవారిని ఆయన తీసుకుని పోవడానికి వస్తున్నారు! నీవు సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు!

విడువబడితే ఆ శ్రమలు ఉగ్రతలు నీవు పడలేవు!

కాబట్టి నేడే సిద్దపడు!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*111వ భాగము*

 

1కొరింథీ 16:19.

1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేనుగలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.

4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.

5. అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను.

6. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.

7. ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను

8. గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.

9. కార్యాను కూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది (మూలభాషలో- గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది) ; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా! ఇంతవరకు గత 15అధ్యాయాలలో సంఘములో ఉన్న సమస్యలు మరియు సంఘ క్రమానికి చెందిన అనేక విషయాలు ధ్యానం చేసుకున్నాము!

 

ఇక 16వ అధ్యాయంలోను సంఘక్రమానికి చెందిన కొన్ని విషయాలు చెప్పి వందన ఆశీర్వాదములతో ఈ మొదటి పత్రికను ముగిస్తున్నారు పౌలుగారు!

 

ఇక 16వ అధ్యాయంలో మొదట చెప్పిన మరో సంఘక్రమం ఏమిటంటే పరిశుద్ధులు కొరకు చందా- దీనిని మన భారతదేశ భాషలో చెప్పాలంటే పేదలకోసమైన చందా అనవచ్చు!

మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరుకూడా చేయండి అన్నారు! మరి మనం గలతీ పత్రికలో ఇలాంటి పేదలకోసమైన చందా ఎక్కడ కనబడదు! కేవలం వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశకునికి మంచివాటిలో భాగం ఇవ్వాలి అని మాత్రమే ఉంది...గలతియులకు 6: 6

వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను (లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషములలో భోధించువానితో పాలివాడైయుండవలెను) .

 

బహుశా ఇలాంటి చందా పౌలుగారు గలతీ ప్రాంతంలో ఉన్నప్పుడు నియమించి ఉంటారు! ఇంతకీ పరిశుద్ధుల కోసం చందా ఏమిటి? దీనికోసం మనం ఈ క్రింది రిఫరెన్సులు చూడాలి

యేరూషలంలోని విశ్వాసులు రోమన్ల శ్రమలవలన నిరుపేదలైపోయారు! తమ ఆస్తులను కోల్పోయారు! మరికొందరు తమ ఆస్తులను అమ్మి పరిశుద్దుల అవసరాలు తీర్చారు, సంఘాన్ని ఆదుకున్నారు! వీరే పరిశుద్దులైన  పేదలు,  ఇప్పుడు వారి అవసరతలో ఇతర సంఘాలు ఆర్థికంగా వారిని ఆదుకొనేలా పౌలుగారు మరియు కొంతమంది  ఏర్పాటు చేశారు.

 

Romans(రోమీయులకు) 15:25,26,27,28

25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి.

27. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారైయున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరి

28. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి (మూలభాషలో- ముద్రవేసి), నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.

 

2 కొరింతు 89 అధ్యాయాలు;

 

దీనికోసమే పౌలుగారు చెబుతున్నారు! అవసరతలో ఉన్న యేరూషలేములోని పరిశుద్దుల కోసమైన చందా!! గలతీ సంఘాలు ఎలా చేశాయో అలాగే మీరు కూడా కొంచెం చందా తీసి దాచి ఉంచండి అంటున్నారు!

నేను వచ్చినప్పుడు చందా పోగుచెయ్యకుండా ప్రతీ ఆదివారం నాడు మీలో ప్రతీవాడును తాను వర్ధిల్లే కొలదీ తనయొక్క కొంత సొమ్ము నిలువచేయాలి అంటున్నారు!

 

ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపిస్తాయి! మొదటిది ప్రతీ ఆదివారం నాడు మీలో ప్రతీవాడు తానూ వర్ధిల్లే కొలదీ . అంటున్నారు!

ఆదివారంనాడే ఎందుకు చెయ్యాలి?

ఆదివారం యేసుక్రీస్తుప్రభులవారు మరణించి లేచారు కాబట్టి  సజీవంగా లేచిన కొద్ది కాలానికే విశ్వాసులు యూదుల విశ్రాంతి దినమైన శనివారం నాడు గాక, ఆదివారం నాడు ఆరాధనకు సమకూడేవారని అర్ధమవుతుంది! అప్పటినుండే ఆదివారం ఆరాధన అనేది మొదలైంది.

అపొ కా 20:7;

ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.

 

 దీని ప్రకారం ప్రతీ ఆదివారం సంఘముగా కూడుకునే వారు మరియు సంస్కారం ఆచరించే వారు!

ప్రకటన 1:10. లో ప్రభువు దినమందు అనగా ఆదివారం నాడు అని గ్రహించాలి!..

 

ఇక తర్వాత విషయం: ప్రతీ ఆదివారం నాడు ఇలాంటి పేదల కొరకు చందా ఎత్తడమైనా చెయ్యాలి, లేక చందా తీసి వారిదగ్గర అయినా నిల్వచెయ్యాలి! అందుకే చాలా ఫ్రంట్ లైన్ చర్చిలలో మొదటి ఆదివారం నాడు సంస్కారం తీసుకున్నాక రెండవ సారి  పేదలకోసం కానుకలు ఎత్తుతారు దానిని పేదలకోసం వాడతారు! ఇది మంచి పద్దతి! మిగిలిన సంఘాలు కూడా దీనిని పాటిస్తే మంచిది! ఇక తనయొద్ద కొంతసొమ్ము నిల్వ చెయ్యడం అనేదానిని చూసి కొన్ని సంఘాలు వారికి లెంట్ డేస్ లో ఎలా కానుకల డబ్బాలు ఇస్తారో అలాగే పేదలకోసం కొన్ని డిబ్బీలు ఇచ్చేవారు! ఇలా ప్రతీ ఆదివారం నాడు దానిలో కొంత సొమ్ము పేదలకోసం చందాగా వేస్తారు!

 

ఇది పౌలుగారు సంఘాలకు ఇచ్చిన ఆదేశం! ఇది కేవలం పేదలకోసమే! ఆదివారం నాడు మందిరంలో దేవునికి ఇచ్చే కానుకలు కాదు అని గ్రహించాలి! ఇది పేదలకోసమైన చందా! దయచేసి అన్ని సంఘాలలో ఇలాంటిది ఏర్పాటుచేస్తే మంచిది! ఇది పౌలుగారు నేర్పించిన సంఘ క్రమము!! ప్రతీవాడు తాను వర్ధిల్లిన కొలదీ ఈ చందా ను పెంచాలి!

 

ఇక మూడవ వచనంలో నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులు అని ఎంచి పత్రికలు ఇస్తారో వారి ద్వారా ఈ ధనాన్ని యేరూషలేము పంపుదాము! ఒకవేళ నేను కూడా వారితో వెళ్ళాలని మీరు ఆశిస్తే నేను కూడా వెళ్తాను వారు నాతో కూడా రావచ్చు అంటున్నారు!

ఈ డబ్బు గురించి పౌలుగారు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో చూడండి. అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండకూడదనీ, దుర్వినియోగం అయిందని ఎవరికీ అనుమానం రాకూడదనీ అతని కోరిక నాకు ఇవ్వండి నేను వెళ్లి ఇస్తాను అనడం లేదు! మీరు డబ్బులు ఇస్తే అది మీ వారి చేతితోనే సంఘము తరుపున అనగా కొరింథీ సంఘము తరుపున యేరూషలేములో ఉన్న పెద్దలకు యేరూషలేములో ఉన్న పరిశుద్ధులైన నిరుపేదలకు వారి అవసరాలకు ధనము ఇప్పిస్తాను అంటున్నారు!

2 కొరింతు 8:20-21.

20. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానిని గూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.

21. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.

 

నిజంగా పౌలుగారు చాలా జాగ్రత్త పడుతున్నారు ధనము విషయమై! దీనిని ప్రతీ దైవజనుడు నేర్చుకోవాలి!

 

ఇక నేను మాసిదోనియా ప్రాంతం యొక్క సంచారం కోసం అనగా సువార్త పనిమీద వెళ్లబోతున్నాను అప్పుడు మీదగ్గరకి వస్తాను, అప్పుడు మీ దగ్గర ఉంటాను, అవసరమైతే శీతాకాలం మొత్తం మీ దగ్గర ఉంటాను! అప్పుడు పంపుదాం! అయితే అంతవరకూ ఆగకుండా ప్రతీ ఆదివారం చందా పోగు చెయ్యమని చెబుతున్నారు!

 

మాసిదోనియా అనగా ప్రియులారా ఇది ఫిలిప్పీ ప్రాంతమని మర్చిపోవద్దు! అపొ కా 19:21; 20:1-2.లో ఈ‌ మాసిడోనియా గురించి ఉంటుంది.

 

ఇక్క 7వ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభువు చిత్తమైతే మీ దగ్గర కొంతకాలం ఉండాలని అనుకుంటున్నాను అంటున్నారు! చూడండి ఇలా చేస్తాను అలాచేస్తాను అని చెప్పడం లేదు! ప్రభువు చిత్తమైతే ఉండాలని అనుకుంటున్నాను అంటున్నారు! అందుకే యాకోబు గారు అంటున్నారు ....

James(యాకోబు) 4:13,14,15,16

 

13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,

14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.

15. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.

16. ఇప్పుడైతే మీరు మీడంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.

 

మనం కూడా పేదలకోసం పరిశుద్దుల కోసం చందా ఇచ్చి పేదలను ఆదుకుందాం! పేదలకు సహాయపడేవాడు యెహోవాకు అప్పించే వాడు అని గ్రహించాలి...

సామెతలు 19: 17

బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

 

అంతేకాకుండా మత్తయి 25 ప్రకారం పేదలకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే!!!

 

ఇంకా దేవుని చిత్తమైతే ఇది చేస్తాను అది చేస్తాను అని మనం చెప్పాలి!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*112వ భాగము*

 

1కొరింథీ 16:914..

9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది (మూలభాషలో- గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది) ; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

10. తిమోతి వచ్చిన యెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు

11. గనుక ఎవడైన అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడవచ్చునని యెదురు చూచుచున్నాను.

12. సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతో కూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.

13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;

14. మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా!  16వ అధ్యాయంలోను సంఘక్రమానికి చెందిన కొన్ని విషయాలు మరియు  వందన ఆశీర్వాదములకోసం చూసుకుంటున్నాము!

 

9వ వచనంలో కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది అంటున్నారు, అయినా ఎదిరించు వారు ఇంకా అనేకులున్నారు కాబట్టి పెంతెకోస్తు పండుగ వరకు ఇక్కడ ఎఫెసులో ఉండాలని అనుకుంటున్నాను అంటున్నారు! గమనించాలి మొదటి భాగం నుండి చెబుతున్న విధముగా ఈ పత్రిక ఎఫెసీ పట్టణం నుండి పౌలుగారు రాస్తున్నారు! అందుకే ఇక్కడ నాకు కార్యానుకూలమైన మంచి సమయం దొరికింది అంటున్నారు- దేనికి సమయం లేక దేనికి ద్వారము అంటే అదిసువార్త ప్రకటనకు అని గ్రహించాలి!

ప్రభువుసేవ కోసం మనకు ఒక అవకాశం ఇస్తే అందులో మనం అడుగుపెట్టాలని ఆయన ఉద్దేశం. కానీ సువార్తకు శత్రువులు మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. గాని ఇక్కడ సువార్తను ఎదిరించే వారు అనేకమంది ఉన్నారు అందుకే పెంతెకోస్తు వరకు ఇక్కడే ఉంటాను అంటున్నారు

 

అపొ కా 14:27;

వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.

 

2 కొరింతు 2:12;

క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా (మూలభాషలో- ద్వారము తెరువబడియుండగా) సహోదరుడైన తీతు నాకు కనబడనందున

 

కొలస్సీయులకు 4: 4

ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని (ప్రవేశద్వారము తెరువవలెనని) మాకొరకు ప్రార్థించుడి.

 

ఇక తర్వాత వచనాలలో ఇద్దరు యవ్వనస్తులను ఎత్తి రాస్తున్నారు. ఒకరు తిమోతి గారు, రెండు అపోల్లో గారు!

 

10. తిమోతి వచ్చిన యెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు

11. గనుక ఎవడైన అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతో కూడవచ్చునని యెదురు చూచుచున్నాను.

 

తిమోతి ఆయన నిజమైన ప్రియమైన కుమారుడు అంటూ తిమోతి కోసం చెప్పారు పౌలుగారు!

అపో.కార్యములు 16: 1

పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.

 

1తిమోతికి 1: 2

విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

 

2తిమోతికి 2: 1

నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.

 

తిమోతి యువకుడు. బహుశా బిడియస్థుడు. కొరింథీవారు ఉండవలసినంత సహాయకరంగా అంతవరకు లేరేమో. అందుకే  తిమోతి మీ వద్దకు వస్తే తిమోతికి లోబడండి ఇంకా సహాయం చెయ్యండి అంటున్నారు!

 

ఇక మరో యవ్వనస్తుడు అపోల్లో!!!  ఈయన కోసం 1:12; 3:4-9; అపొ కా 18:24-28 లో వ్రాయబడింది...

 

24. అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.

25. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.

26. ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.

27. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.

28. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.

 

అయితే ఇప్పుడు కొంతకాలం మీదగ్గర ఉండమని నేను అడిగాను అంటున్నారు దీనికోసం మనం అపోస్తలుల కార్యములలో చూసుకుంటే ఎఫెసులో కూడా అపోల్లో గారు పరిచర్య చేసినట్లు చూడగలం. అక్కడ పౌలుగారు అపోల్లో ను కలుసుకున్నారు అన్నమాట! అప్పుడు కొంతకాలం కొరింథీ పట్టణం తిరిగి వెళ్లి పరిచర్య చెయ్యమని! అందుకు ఇప్పుడు వెల్లనండి తర్వాత వెళ్తాను అని చెప్పారు అపోల్లో!!

 

ఇక 1314 వచనాలలో మెలుకువగా ఉండండి విశ్వాస మందు నిలకడగా ఉండండి పౌరుషం గలవారై ఉండండి బలవంతులై ఉండండి, మీరుచేయు కార్యములన్నియు ప్రేమతో చెయ్యండి అంటున్నారు! ఇలా రాయడం ప్రతీ పత్రికలోను ప్రతీ సంఘానికి రాయడం పౌలుగారికి అలవాటు!

 

“మెళకువగా” కోసం చూసుకుంటే

కొలస్సీయులకు 4: 2

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

 

1థెస్సలొనికయులకు 5: 6

కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.

 

మత్తయి 26: 41

మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి...

 

ఎఫెసీ 6:10,18,20

10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

20. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 4: 7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

 

1పేతురు 5: 8

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

 

ప్రకటన 16:16

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.

కాబట్టి మెలకువగా ఉందాం!

 

నిలకడ” కోసం చూసుకుంటే:

1కోరింథీయులకు 15: 58

కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

 

దానియేలు 12: 13

నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంత మందు నీ వంతులో నిలిచెదవు.

 

బలవంతులైయుండుడి. కోసం చూసుకుంటే:

 ఎఫెసు 6:10;

తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి.

 

యెషయా 40: 31

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

 

 “ప్రేమతో ఉండుడి: కోసం చూసుకుంటే ”

రోమీయులకు 13: 10

ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

ఎఫెసీయులకు 4: 1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

1థెస్సలొనికయులకు 1: 2

విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,

 

1థెస్సలొనికయులకు 5: 13

వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి.

 

కాబట్టి మెలుకువగా ఉందాం!

విశ్వాసమందు నిలకడగా ఉందాం!

దైర్యముగా ఉందాం!

చేసే పనులన్నీ ప్రేమతో చేద్దాం!

దైవాశీస్సులు!

*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*

*113వ భాగము*

 

1కొరింథీ 16:1524.

16. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

17. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.

18. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి.

19. ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.

20. సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.

21. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను.

22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు (లేక, ఆదిమ భాషలో ' అనగా ప్రభువు వచ్చుచున్నాడు,లేక ప్రభువు వచ్చియున్నాడు,లేక ప్రభువా రమ్ము)

23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.

24. క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్‌.

 

     ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా!  16వ అధ్యాయంలోను సంఘక్రమానికి చెందిన కొన్ని విషయాలు మరియు  వందన ఆశీర్వాదములకోసం చూసుకుంటున్నాము!

 

ప్రియులారా! ఇక 1518 వరకు చూసుకుంటే సువార్తలో సహకరించేవారికి సువార్త కోసం కష్టపడే వారికి సహకరిస్తూ వారికి లోబడుతూ ఉండమంటున్నారు! ఇది మరో సంఘక్రమం!

 

ఇక్కడ 15వ వచనంలో స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రధమఫలమై ఉన్నారు వారు పరిశుద్దులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించు కున్నారు కాబట్టి అట్టివారికి ఇంకా దేవునిపనిలో సహాయం చేయుచు దేవుని సేవలో ప్రయాసపడే వారికందరికీ విధేయులై ఉండాలని మిమ్మును ఆజ్ఞాపిస్తున్నాను అనడం లేదు మిమ్మును బ్రతిమాలుతున్నాను అంటున్నారు! పౌలుగారు ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నా గాని ప్రేమను చూపించాలి అని రాశారు కాబట్టి తానే మాదిరిగా, దయచేసి వారికి లోబడి ఉండమని బ్రతిమాలుకొంటున్నాను అంటున్నారు!

 

స్తెఫెను ఇంటివారు వీరు ఆకయలో మొట్టమొదట రక్షించబడిన వారు. అకయ అనగా కొరింథీ నగరం ఉన్న ప్రాంతం. వీరు రక్షించబడటమే కాకుండా పరిశుద్దులకు ఎంతో పరిచర్య చేశారు దానికోసం వారు తమ్మునుతాము అప్పగించేసు కున్నారట ఇది పౌలుగారు సాక్ష్యం చెబుతున్నారు! వారు ఎడతెగకుండా హృదయపూర్వకంగా ఉపయోగించిన ఆధ్యాత్మిక సామర్థ్యం ఇది (రోమ్ 12:7). ఇలాంటి విశ్వాసులు బహిరంగమైన, బాగా గుర్తింపు పొందిన సామర్థ్యాలేమీ లేని ఇతర విశ్వాసులకు ఆదర్శం.

 

ఇలాంటి వారికి సువార్తలో సహకరించే వారికి కష్టపడే వారికి విధేయులై ఉండమని చెబుతున్నారు! ఇది కేవలం కొరింథీ వారికే కాదు ప్రతీ సంఘము పాటించవలసిన సంఘ క్రమము! సేవకులకు దైవజనులకు సంఘపెద్దలకు లోబడి ఉండాలి! నేను కానుకలు ఇస్తున్నాను కదా అని తిరగబడకూడదు!

 

ఇంకా స్తెఫెను ఫోర్మునాతు అకాయికు అనువారు వచ్చినందుకు సంతోషించుచున్నాను అనగా ఇక్కడ ఎఫెసీ పట్టణానికి పౌలుగారిని దర్శించడానికి చూడటానికి వీరు వచ్చారు అన్నమాట! దానికి పౌలుగారు ఎంతో సంతోషిస్తున్నారు! ఇంకా అంటున్నారు మీరులేని కొరత వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేశారు కాబట్టి అట్టివారిని సన్మానించమంటున్నారు! ఇక్కడ “కొరత” అనగా ఆర్థికంగా వారు తనకేమీ సహాయం చేయలేదని అతడు వారికి గుర్తు చేయడం లేదు (9:12-18 చూడండి). వారినుంచి ఏ వార్తా లేకపోవడం, వారితో సహవాసం లేకపోవడంవల్ల కొంత విచారంగా ఉందని పౌలుగారి  ఉద్దేశం.

 

ఇక్కడ మీరులేని కొరత వారు తీర్చారు అంటే ఇక్కడ ఎవరి  సహవాసమైతే ఇతరుల ప్రాణాలకు సేద తీరుస్తుందో అలాంటివారుగా ఉండడం మంచిది అని భావం!

 

ఇక ఆసియలో ఉన్న సంఘముల వారు మీకు వందనాలు చెబుతున్నారు అంటున్నారు, ఆసియా అనగా చిన్న ఆసియా అని గ్రహించాలి! ఎఫెసీ, ఇంకా చుట్టుప్రక్కల ఉన్న వారు అంతా చిన్నాసియాకు చెందినవారు!

 

ఇంకా ప్రిస్కిల్ల ఆకుల వారి ఇంటిలో ఉన్న సంఘము కూడా మీకు అనేక వందనాలు చెబుతున్నారు అంటున్నారు! ఈ అకుల ప్రిస్కిల్ల కోసం మనకు అపోస్తలుల గ్రంధంలో కనిపిస్తుంది, వీరు కొరింథీలో ఇంకా ఎఫెసీలో గుడారాలు కుట్టే వృత్తి చేస్తూ బ్రతుకుతూ క్రీస్తుయేసు సిలువ సువార్త చాటుతున్నారు. పౌలుగారు వీరిదగ్గర అనేక రోజులు ఉన్నారు, అపోల్లో ని చేర్చి ఇంకా ఎక్కువగా దేవునిలో నడిపించి మంచి విశ్వాస వీరునిగా దైవసేవకునిగా మార్చడానికి వీరే సహకరించారు! ఇప్పుడు వీరి గృహంలో ఒక సంఘమును కూడా నడిపిస్తున్నారు!

 

Acts(అపొస్తలుల కార్యములు) 18:1,2,3,24,25,26,27

1. అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.

2. యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు.

3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.

24. అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.

25. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.

26. ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.

27. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.

 

Romans(రోమీయులకు) 16:3,4

3. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

4. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.

 

20వ వచనంలో సహోదరులందరూ మీకు వందనములు చెబుతున్నారు ఇక్కడ సహోదరులు అనగా ఎఫెసీ పట్టణంలో రక్షించబడిన విశ్వాసులంతా కొరింథీపట్టణంలో ఉన్న సంఘస్తులకు వందనములు చెబుతున్నారు!

 

పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనాలు చేసుకోండి అంటున్నారు! ఈ మాట గ్రహించాలి! పవిత్రమైన ముద్దు పెట్టుకోమంటున్నారు!  యేసుక్రీస్తుప్రభులవారిని ఇష్కరియోతు యూదా అనే శిష్యుడే ముద్దు పెట్టుకుని శత్రువులకు అప్పగించి వెన్నుపోటు పొడిచాడు! ఇలాంటి పనికిమాలిన ముద్దులు పెట్టుకోమని చెప్పడం లేదు, ఇంకా సంఘంలో పనికిమాలిన సినిమాలలో చూపించే యూరోపియన్ దేశాల యొక్క సినిమా ముద్దులు కాకుండా పవిత్రమైన ముద్దు పెట్టుకుంటూ ఒకరినొకరు వందనాలు చేసుకోండి అంటున్నారు!

 

రోమీయులకు 16: 16

పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

 

ఇక 21వ వచనంలో పౌలు అను నేను నా చేతితో వందన వచనం రాస్తున్నాను అంటున్నారు! పౌలుగారి యొక్క చేతి రాత బాగోదు, ఇంకా పౌలుగారు ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుని చెబుతూ ఉంటే మిగతావారు పత్రికలు రాసేవారు! ఈ పత్రిక ఇంతవరకు పౌలుగారు ధ్యానం చేస్తూ యోచించి చెబుతూ ఉంటే సోస్తెనేసు అనే అసిస్టెంట్ పరిచారకుడు రాశారు! ఇప్పుడు చివరలో పౌలుగారు తానే వందన వచనం రాస్తున్నారు! పౌలుగారు రాసే విధానమే ఇది!!

 

ఇక 22 లో ఎవడైనా ప్రభువును ప్రేమించక పోతే వాడు శపించ బడును గాక అంటున్నారు! అయ్యా ఇంతవరకు ప్రేమతత్వము నేర్పించిన పౌలుగారు శపిస్తున్నారు ఎందుకు? ఎందుకంటే: కొంతమంది బాగా ఉన్న విశ్వాసులను తప్పుడుబోదలు చెప్పి వారిని పాడుచేశారు, మరికొందరు తప్పుడు అలవాట్లకు లోబడ్డారు అందుకే ఇలా అంటున్నారు!

 ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు పట్ల ప్రేమే ఆధ్యాత్మిక జీవితానికి రుజువు (1 యోహాను 3:14; 4:7-8, 10). ఆయనపట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు. మనం క్రీస్తును ప్రేమించకపోతే, ప్రేమించలేకపోతే మనమింకా భ్రష్ట స్థితిలో, మన పాపాల్లోనే ఉన్నామన్నమాట. అంటే దేవుని శాపానికీ తగిన వారమన్నమాట. యేసుప్రభువు పట్ల మన అంతరంగ స్థితికన్నా ప్రాముఖ్యమైనది మరేదీ లేదు.

 

ప్రభువు వస్తున్నాడు అంటున్నారు: ప్రకటన 22:20.....

ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.

 

ప్రకటన గ్రంథం 22: 7

ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

 

ప్రకటన గ్రంథం 22: 20

ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

ప్రకటన గ్రంథం 22: 12

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

ఇక 23, 24 వచనాలలో ఆశీర్వాదం ఇస్తున్నారు: ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక! క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉందును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

ఈ ఆశీర్వచనం మన జీవితాలలో నెరవేరును గాక!

 

ఈ విధంగా పౌలుగారు అనేక విషయాలు సంఘములో ఉండే సమస్యలు సంఘ క్రమము నేర్పించారు! ఇది ప్రతీ విశ్వాసి పాటించాలి! రెండవ పత్రిక కూడా సంఘ క్రమానికి చెందినదే! ఈ విషయాలు పాటిద్దాం! నేర్చుకుందాం! గమ్యానికి చేరుకుందాం!

ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

శరీర కార్యములు

పక్షిరాజు

పాపము