యేసుక్రీస్తు సిలువపై పలికిన ఏడు మాటలు

యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు (మొదటి భాగము) 1⃣ *మొదటి మాట* *విఙ్ఞాపన (FATHER… FORGIVE):-* *యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”.* (లూకా.23:34) యేసు ప్రభువును సిలువ మరణమునకు అప్పగించి, సిలువకు భయంకరమేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువ మ్రానుపై మూడు మేకుల మీద మాంసపు ముద్దలా వ్రేలాడదీసినప్పుడు *ఆయన పలికిన అమూల్యమైన ఏడు మాటలలో* మొట్ట మొదటి మాట మనం ధ్యానిస్తున్న మాట. 👉 ఈ కేక సర్వమానవాళి పాపక్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొప్ప ప్రార్ధనా కేక. అవమానమును, దూషణను, భయంకర చిత్రవధను తనలో తాను దిగమింగుకుంటూ తాను ఏ జానాంగ రక్షణకై పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్నుతాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చెనో (ఫిలి.2:6,7) ఆ దైవచిత్త నెరవేర్చుకొరకును (యోహాను 6:40) తన పేరులోని భావసార్ధకత కొరకు (మత్తయి 1:21) అమానుష జనం కొరకు, యేసు చేసిన విఙ్ఞాపన కేకయే ఈ కేక. *ఈ కేకలో క్షమాగుణం వున్నది.* 👉 ఇట్టి ప్రేమ తత్వాన్ని ఎప్పుడు చూచి యుండలేదు. 👉తన్ను చంపుచున్న వారిని శిక్షించుటకు బదులుగ వారిని ప్రేమించి, వారి హ...